ఐ-సెట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థుల తాకిడి | icet counciling students collision | Sakshi

ఐ-సెట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థుల తాకిడి

Sep 18 2014 12:17 AM | Updated on Sep 2 2017 1:32 PM

ఐ-సెట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థుల తాకిడి

ఐ-సెట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థుల తాకిడి

గుంటూరు ఎడ్యుకేషన్ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఐ-సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.

గుంటూరు ఎడ్యుకేషన్
 ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఐ-సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. గుంటూరులోని రెండు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో చేపట్టిన సర్టిఫికెట్ల పరిశీలనకు 763 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఐ-సెట్ కౌన్సెలింగ్ కోసం ఇన్నాళ్లూ ఆత్రుతగా ఎదురుచూసిన విద్యార్థులు జిల్లా నలుమూలల నుంచి పెద్ధ సంఖ్యలో తరలివచ్చారు. నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలన సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రం రాత్రి 10 గంటల వరకూ కొనసాగటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. ఈ కేంద్రానికి 400 మంది హాజరయ్యారు.  
 విద్యార్థులకు తిప్పలు
 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు చేయకపోవటంతో విద్యార్థులు ఇక్కట్ల పాలయ్యూరు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉదయం 9 గంటలకే వచ్చినవారు తమ వంతు కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. తాగేందుకు నీరు, కూర్చునేందుకు తగినన్ని కుర్చీలు లేక చెట్ల కిందే గడిపారు.
 నేడు 25,001 నుంచి 50 వేల ర్యాంకు 
 వరకు పరిశీలన
 ఐ-సెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా గురువారం జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో 25,001 నుంచి 37,500 వరకూ, నల్లపాడు హెల్ప్‌లైన్ కేంద్రంలో 37,501 నుంచి 50 వేల ర్యాంకు వరకూ విద్యార్థులు హాజరుకావాలి.
 
 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement