MBA
-
Delhi: రేఖా గుప్తా క్యాబినెట్ మంత్రులలో ఎవరి విద్యార్హతలేమిటి?
న్యూఢిల్లీ: బీజేపీ మహిళా నేత, ఎమ్మెల్యే రేఖా గుప్తా(Rekha Gupta) ఈరోజు(ఫిబ్రవరి 20) ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో నేడు ఆరుగురు మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని పేర్కొన్నారు. కొత్త సీఎం రేఖ గుప్తా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవారి విద్యార్హతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ఎమ్మెల్యే ప్రవేశ్ వర్మ ప్రవేశ్ ఎంబీఏ పూర్తి చేశారు. ఈయన ఢిల్లీకి చెందినవారు. ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రవేశ్ వర్మ(Pravesh Verma) తన ప్రాథమిక విద్యను ఢిల్లీలోని ఆర్కే పురంలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కళాశాల నుంచి బి.కామ్ చేశారు. అనంతరం ఢిల్లీలోని ఫర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి ఎంబీఏ పట్టా పొందారు.ఎమ్మెల్యే ఆశిష్ సూద్ ఆశిష్ సూద్ బి.కామ్ పూర్తి చేశారు. జనక్పురి ఎమ్మెల్యే ఆశిష్ సూద్ కూడా క్యాబినెట్లో స్థానం దక్కించుకున్నారు. ఆశిష్ సూద్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆత్మ రామ సనాతన ధర్మ కళాశాల నుండి బి.కామ్ పూర్తి చేశారు. ఈ సమయంలో ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా సిర్సా 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆయనను అత్యంత ధనిక ఎమ్మెల్యే అని చెబుతుంటారు. మజీందర్ సింగ్(Majinder Singh) హర్యానాలోని సిర్సా నివాసి. ఆయనకు సిర్సాలో రూ.248 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.ఎమ్మెల్యే రవీందర్ సింగ్ రవీందర్ సింగ్ బిఎ పాసయ్యారు. పట్పర్గంజ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అధ్యాపకుడు అవధ్ ఓజాను ఓడించారు. రవీందర్ సింగ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. పట్టా పొందారు. రవీందర్కు మంత్రివర్గంలో చోటు లభించింది.కపిల్ మిశ్రా కపిల్ మిశ్రా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. సోషల్ వర్క్లో ఎంఏ చేశారు. ఈయన గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత బీజేపీలో చేరారు.పంకజ్ కుమార్ సింగ్ పంకజ్ కుమార్ వృత్తిరీత్యా దంతవైద్యుడు. బీహార్లోని బుద్ధగయలోని మగధ్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) పూర్తిచేశారు. వికాస్పురి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన కొత్త ప్రభుత్వంలో మంత్రి కాబోతున్నారు.ఇది కూడా చదవండి: Delhi: కొత్త సీఎం రేఖా గుప్తాకు రూ. 501.. ఎందుకంటే? -
అమ్మతనం ఆటకు అడ్డుకాలేదు
సంకల్పమే సగం విజయమన్నారు పెద్దలు.. కృషితో ఉన్నత శిఖరాలను చేరుకొన్న కొంత మంది మహిళలను ఆదర్శంగా తీసుకున్న ఆమె లేటు వయస్సులో టెన్నిస్ క్రీడపై మక్కువ పెంచుకొంది. ఇద్దరు పిల్లల తల్లి అన్న విషయాన్ని పక్కన పెట్టి భర్త ప్రోత్సాహంతో కఠోర శ్రమతో అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణించింది. దాంతో సంతృప్తి చెందకుండా నేను సైతం అంటూ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అడివెంలకు చెందిన బోయలపల్లి రేఖ. అర్వపల్లి: హైదరాబాద్లో రేఖ ఎంబీఏ చదువుతుండగా కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో పాల్గొంది. అదే సమయంలో ఆల్బమ్ చిత్రీకరణ పనిలో ఉన్న సినీ దర్శకుడు అగస్త్య హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. ఆయన రేఖను ఎంపిక చేశాడు. కానీ, రేఖను ఆల్బమ్లో నటింపజేసేందుకు కాకుండా తన జీవిత భాగస్వామిగా ఉండేందుకు ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వారు పెళ్లి చేసుకుని ల్యాంకోహిల్స్లో కాపురం పెట్టారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఫిట్నెస్ను మెరుగుపరుచుకోవడానికి ఇరుగుపొరుగు మహిళలతో కలిసి జిమ్ చేయడంతో పాటు టెన్నిస్ ఆడేవారు. అప్పుడే ఆమె ప్రొఫెషనల్ ప్లేయర్ కావాలని నిర్ణయించుకున్నారు.ముంబైలో కోచింగ్..తన భర్త అగస్త్య.. హిందీ సినిమాల్లో పనిచేసేందుకు ముంబైకి వెళ్లాల్సి వచ్చింది. భర్తతోపాటు రేఖ కూడా తన ఇద్దరు పిల్లలను వెళ్లారు. అప్పుడు రేఖ ముంబైలోని ‘ప్రాక్ టెన్నిస్’ అనే అకాడమీలో చేరి కఠోర సాధన చేశారు. ఉదయం 5 గంటలకే గ్రౌండ్లో ఉండేవారు. 6.30 గంటల వరకు ప్రాక్టీస్ చేసి 7.30 గంటలకు ఇంటికి వెళ్లి పిల్లలను రెడీచేసి స్కూల్కు పంపించేవారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు అకాడవీుకి వెళ్లి ముందుగా జిమ్ చేసి ఒక గంటపాటు టెన్నిస్ ప్రాక్టీస్ చేసేవారు.సింగిల్స్గానే..రేఖ మొదట ఏఐటి(ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్)లో రేఖకు మొదట సింగిల్స్ ఆడే అవకాశం వచ్చింది.. తన వ్యక్తిగత కారణాల వల్ల డబుల్స్ ఆడలేదు. ఐటీఎఫ్ (ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్)లో ఆడారు. ఆ తర్వాత థాయిలాండ్తో పాటు వివిధ దేశాల్లో ఆడారు. స్పెయిన్కు పయనంజాతీయ స్థాయి పోటీలలో పాల్గొనాలంటే.. ముంబైలో ప్రాక్టీస్ సరిపోదని, విదేశాలకు వెళ్లాలని రేఖకు తన భర్త అగస్త్యతో పాటు పలువువరు సలహా ఇచ్చారు. దాంతో ఆమె యూరప్లోని స్పెయిన్కు వెళ్లి అక్కడ ‘మున్డో’ స్పోర్ట్స్ అకాడమీలో చేరారు. భర్త, పిల్లలు ముంబైలోనే ఉంచి ఆమె ఒక్కరే స్పెయిన్ వెళ్లి రెండు నెలలపాటు స్పెయిన్లో కోచింగ్ తీసుకున్నారు. ఆమెకు ఎవరూ స్పాన్సర్షిప్ లేకపోవడంతో సొంత ఖర్చులతోనే స్పెయిన్ వెళ్లారు.ఆటకు ‘లాక్డౌన్’రేఖ వివిధ దేశాల్లో ఆడుతూ బిజీ అవుతున్న సమయంలో వచ్చిన లాక్డౌన్తో ఆటకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. లాక్డౌన్ సమయంలో ఆమె హైదరాబాద్లోని ల్యాంకోహిల్స్లో ఉన్నారు. తాను ఉంటున్న అపార్ట్మెంట్ల పక్కన వివిధ రాష్ట్రాలకు చెందిన వేల మంది తిండికి ఇబ్బంది పడడం రేఖ చూసి చలించిపోయారు. ఆ కూలీలకు ఆమె స్వయంగా అన్నం వండిపెట్టారు. అప్పుడే తనకు సేవ చేయాలనే ఆలోచన వచ్చి ‘రేఖా చారిటబుల్ ఫౌండేషన్’ ఏర్పాటు చేశారు. తన ఫౌండేషన్ నుంచి కరోనా సమయంలో రోజుకు 2వేల మందికి భోజనం వండిపెట్టారు. వివిధ రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు పంపారు. ఆ సమయంలో రేఖకు సేవా రంగంలో మంచి గుర్తింపు వచ్చింది. ఆయా రాష్ట్రాల సీఎంల నుంచి అభినందనలు అందుకున్నారు. అంతేకాకుండా ‘రేఖ స్పోర్ట్స్ ఫౌండేషన్’ను కూడా స్థాపించి క్రీడాకారులను ఆమె ప్రోత్సహిస్తున్నారు.సొంత నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలురేఖ తన సొంత నియోజకవర్గమైన తుంగతుర్తి నియోజకవర్గంలో సేవా కార్యక్రమంలో ముమ్మరం చేశారు. జాజిరెడ్డిగూడెం మండలంలో ఈ విద్యా సంవత్సరం 30 ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నోటు పుస్తకాల పంపిణీ చేశారు. క్రీడా దుస్తులు ఇచ్చారు. ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. క్రీడా సామగ్రి అందజేశారు. తాను చదువుకున్న అడివెంల గ్రామ ప్రాథమిక పాఠశాలకు రూ.3లక్షలతో మరమ్మతులు చేయించి క్రీడా సామగ్రి, ఆరో ప్లాంట్ పెట్టించారు. తాను చేసే సేవ రాజకీయాల కోసం కాదని, కేవలం సేవా దృక్పథంతోనేనని రేఖ చెబుతున్నారు. -
మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్,లక్షల ప్యాకేజిని వదిలి..
ఛావీ రాజావత్ రాజస్థాన్లోని సోడా గ్రామంలో పుట్టి పెరిగింది. పట్నంలో ఉన్నత చదువులు చదివి, కళ్లు చెదిరే ప్యాకేజీతో కార్పొరేట్ ఉద్యోగంలో చేరింది. కానీ, చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి గ్రామానికి వెళ్లింది. సర్పంచ్గా ఎన్నికల్లో నిలబడి గెలిచింది. పదేళ్లపాటు సర్పంచ్గా పనిచేసింది. మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్గా వార్తల్లో నిలిచి, యుఎన్లో ప్రసంగం చేసింది. గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు గ్రామాభివృద్ధికి కృషి చేస్తూనే, హోటల్ వ్యాపారం చేస్తోంది. ఆసక్తి గలవారికి గుర్రపు స్వారీలో శిక్షణ ఇస్తోంది. ‘‘2010లో తొలిసారి సర్పంచ్ అయినప్పుడు గ్రామ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. గ్రామం తీవ్ర కరువుతో అల్లాడిపొంయింది. సాగునీరు లేదు. 13–14 సంవత్సరాలుగా రుతుపవనాలు లేవు. భూగర్భ జలాలను వాడుకోలేకపొంయేవారు. 3–4 గంటలకు మించి విద్యుత్ సరఫరా లేదు. రోడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది. ఈ సవాళ్లతో సోడా పంచాయితీ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టాను. మొదటి టర్మ్లో కొన్ని పనులు పూర్తయ్యాయి. మా ఊరు తనవైపు లాగింది.. మా తాత బ్రిగేడియర్ రఘుబీర్సింగ్ 1990 వరకు సర్పంచ్గా చేశారు. నాకు మా ఊరు అంటే ఎప్పుడూ ఇష్టమే. బెంగుళూరులోని రిషి వ్యాలీ స్కూల్, జైపూర్లోని మాయో కాలేజీ గర్ల్స్ స్కూల్లో చదువుకున్నాను. వేసవి సెలవులు వచ్చినప్పుడల్లా మా ఊరిలోనే ఉండేదాన్ని. ఢిల్లీలోని మహిళా శ్రీరామ్ కాలేజీ నుండి డిగ్రీ తీసుకున్నాక, పూణెలోని బాలాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోడ్రన్ మేనేజ్మెంట్ నుండి ఎంబీయే పూర్తి చేశాను. ఏడేళ్లపాటు కార్పొరేట్ సెక్టార్లో వర్క్ చేశాను. లక్షల రూపాయల జీతం. కానీ, మా ఊరు వైపు నన్ను తన వైపు లాగింది. మహిళకు రిజర్వ్ అని.. 2010లో మా గ్రామ పంచాయితీ మహిళలకు రిజర్వ్ చేయబడింది. అప్పుడు మా ఊరి పెద్దలు నన్ను ఎన్నికల్లో నిలబడమని అడిగారు. ఆ సమయంలో సర్పంచ్ని అవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. గ్రామస్తులు మా అమ్మనాన్నలను అడిగారు. ‘ఏం చేయాలనుకున్నా తన ఇష్టం, మా బలవంతం ఉండదు’ అని చెప్పారు. నాకు అప్పటి వరకు గ్రామ సభలు ఎలా జరుగుతాయి, పంచాయితీలకు నిధులు ఎలా వస్తాయో తెలియదు. ఆ విషయాలను గ్రామస్తులే చెప్పారు. ఆ విధంగా పంచాయితీ ఎన్నికల్లో నిలబడి, గెలిచాను. మా ఇంట్లో మా తాత తర్వాత నేను సర్పంచ్ని అయ్యాను. వర్షపు నీటి సంరక్షణ ముందుగా ఊరి భవితవ్యాన్ని ఒంటరిగా మార్చలేమని, ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని అందరికీ స్పష్టంగా చెప్పాను. నేను వ్యూహంతో పనిచేయడం ప్రారంభించాను. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, గ్రామాలను అనుసంధానించడం, కరువును ఎదుర్కోవడం నేను ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లు. గ్రామంలోని నీటివనరులన్నీ పూడికతో నిండిపొంయాయి. సుమారు 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న నీటి వనరుల్లో పూడిక మట్టిని తొలగించేందుకు లక్షల రూపాయలు సేకరించి, ఖర్చు చేశాం. మహిళలు ముందు గ్రామపంచాయితీ నా కుటుంబం లాంటిది. నేను మీటింగులు పెట్టడం మొదలుపెట్టగానే ఏయేప్రాజెక్టుల్లో ఎలా పనిచేస్తున్నానో చెప్పేదాన్ని. ఈప్రాజెక్టుల గురించి వారు ఏమనుకుంటున్నారో అందరి అభిప్రాయాలు తెలుసుకునేదాన్ని. అలాగే, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో కూడా వివరించేదాన్ని. పనులు సజావుగా అయ్యేలా అధికారులను కలిసి ఆరా తీయమని గ్రామస్తులకు చెప్పేదాన్ని. మహిళల బృందం డిజైనర్ ల్యాంప్లు, కొవ్వొత్తులు, మసాలా దినుసులు వంటి ఉత్పత్తులు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇవి మంచి ధరకు అమ్ముడు పొంవడం మొదలయ్యింది. దీంతో మహిళల జీవితం మెరుగుపడింది. రెండేళ్లలో 950 ఇళ్లకు గాను 800 మరుగుదొడ్లు నిర్మించాం. 24 గంటలూ కరెంట్ అందుబాటులోకి వచ్చింది. రోడ్లప్రాధాన్యత నా ఎజెండాలో రోడ్లప్రాధాన్యత స్పష్టంగా ఉంచాను. ముందు ప్రైవేట్ బస్సుల సహాయం తీసుకున్నాను. బాలికల కోసం పాఠశాల, మహిళల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశాను. మూతపడిన బి.ఎడ్ కాలేజీని స్వాధీనం చేసుకొని దానిని బాలికల చదువుకోసం కేటాయించాను. ఓ ప్రైవేట్ కంపెనీ 200 టేబుళ్లు, బెంచీలను అందజేసి మా వెన్ను తట్టింది. అందరికీ బ్యాంకు ఖాతా.. సర్పంచ్ అయిన ఐదేళ్లలోనే రోడ్లు, డ్రైన్లు, అందరికీ బ్యాంకు ఖాతా తెరిపించాను. ఎప్పుడూ ఫీల్డ్ వర్క్లోనే ఉండేదాన్ని. బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల, చదువుప్రాముఖ్యతను వివరించేదాన్ని.. నా స్వభావం అందరినీ కలుపుకొని ఉంటుంది. ఐక్యరాజ్యసమితి 11వ ఇన్ఫో పావర్టీ వరల్డ్ కాన్ఫరెన్స్ను నిర్వహించినప్పుడు మొదటిసారి భారతదేశం నుండి ఒక మహిళా సర్పంచ్గా దేశం తరపునప్రాతినిధ్యం వహించాను. ఇది నాకు గర్వంగా అనిపించింది. అక్కడ వారందరి మదిలో సర్పంచ్ అంటే తలపై ముసుగు వేసుకుని ఉన్న గ్రామస్థురాలు అనుకున్నారు. కానీ, నన్ను కార్పొరేట్ లుక్లో చూసి అందరూ ఆశ్చర్యపొంయారు. సోడా విలేజ్ అభివృద్ధికి డబ్బు కంటే వ్యక్తులు, అందరి సమష్టి కృషి అవసరం అని ఫోరమ్లో చెప్పాను. రెండుసార్లు సర్పంచ్గా నా విధులను నిర్వర్తించాను. తర్వాతి వారికి అవకాశాలు ఇవ్వాలని నేను మళ్లీ పొంటీ చేయలేదు. ఇప్పుడు హోటల్ని నిర్వహిస్తున్నాను. గుర్రపు స్వారీ వచ్చు కాబట్టి, ఆసక్తి గలవారికి శిక్షణ ఇస్తున్నాను’ అని వివరిస్తుంది ఈ యంగ్ లీడర్. -
గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఎంబీఏ విద్యార్థి
హైదరాబాద్: హార్ట్ ఎటాక్ తో ఎంబీఏ విద్యార్థి మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ గ్రామానికి చెందిన రమేష్ కుమారుడు కొత్తపల్లి కుషాల్ ఎంబీఏ చదువుతూ మైసమ్మగూడలోని సాత్విక్ బాయిస్ హాస్టల్లో ఉంటున్నారు. ఆదివారం తన స్నేహితుడు సత్యగిరీశ్ ఉంటున్న సాయిమణి బాయిస్ హాస్టల్కు వెళ్లి రాత్రి అక్కడే నిద్రపోయాడు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో వాష్రూమ్కు వెళ్లిన కుషాల్ హార్ట్ ఎటాక్తో కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పేట్బషీరాబాద్ పోలీసులు హాస్టల్కు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాబోయే భార్య గురించి ట్వీట్ చేసిన జే కోటక్ - వైరల్ అవుతున్న పోస్ట్
ప్రముఖ బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కుమారుడు 'జే కోటక్' గురించి దాదాపు అందరికి తెలిసిందే. అయితే ఇతడు ఇటీవల తన కాబోయే భార్యకు అభినందనలు తెలుపుతూ ట్విటర్ పోస్ట్ చేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. జే కోటక్ మాజీ మిస్ ఇండియా 'అదితి ఆర్య'ని వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అంత కంటే ముందు కాబోయే భార్య యేల్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సందర్భములో అభినందనలు తెలిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ నా ఫియాన్సీ MBA గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. నేను చాలా గర్వపడుతున్నాను అంటూ మే 24న పోస్ట్ చేసాడు. ఇందులో అదితి గ్రాడ్యుయేషన్ దుస్తులలో ఉండటం కూడా చూడవచ్చు. జే కోటక్ కూడా కొలంబియా యూనివర్సిటీ నుంచి బీఏ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం డిజిటల్ బ్యాంక్ కోటక్811కి కో-హెడ్ పదవిలో ఉన్నారు. 2022 ఆగస్ట్ నెలలో జే కోటక్ అండ్ అదితి ఆర్య నిశ్చితార్థం జరిగినట్లు పుకార్లు వచ్చాయి. నిశ్చితార్థం తర్వాత పారిస్లోని ఐఫిల్ టవర్ ముందు పోజులిస్తున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ వారు దీనిని ధ్రువీకరించలేదు. కానీ ఇప్పుడు వీరి జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనట్లు చెప్పకనే చెప్పేసారు. (ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, కారవ్యాన్, హెలికాఫ్టర్స్ - ఎవరీ యువ బిలీనియర్?) Aditi, my fiancée, completed her MBA from Yale University today. Immensely proud of you @AryaAditi pic.twitter.com/xAdcRUFB0C — Jay Kotak (@jay_kotakone) May 24, 2023 ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన షహీద్ సుఖ్దేవ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ పూర్తి చేసిన అదితి ఆర్య 2015లో మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తరువాత యేల్ యూనివర్శిటీలో చదువుకోవడానికి అమెరికా పయనమైంది. అంతకంటే ముందు ఈమె తెలుగు, హిందీ సినిమాల్లో కూడా కనిపించింది. ఇప్పుడు అమెరికా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. ఇక జే కోటక్ & అదితి ఆర్యల వివాహం ఎప్పుడనేది తెలియాల్సిన విషయం. -
ఎంబీఏ విద్యార్థిని శ్రావణి అదృశ్యం...
హైదరాబాద్: బాలాజీనగర్ మోహన్రావు కాలనీలో దేవారాయ కుమార్ కుమార్తె దుర్గాలక్ష్మీ అలియాస్ శ్రావణి (22) ఈసీఐఎల్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతుంది. ఈ నెల 3న ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
Viral Video: పిలవని పెళ్ళికి వెళ్లినందుకు.. పనిష్మెంట్ ఇచ్చారు ..!
-
ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ తుది దశ సీట్ల కేటాయింపు గురువారం పూర్తయింది. మొత్తం 83 శాతం సీట్లు కేటాయించినట్టు సాంకేతిక విద్యావిభాగం ప్రకటించింది. ఐసెట్లో మొత్తం 61, 613మంది అర్హత సాధించారు. 19,666 మంది 3,60,435 ఆప్షన్లు ఇచ్చారు. ఎంబీఏలో 24,278 సీట్లు, ఎంసీఏలో 2865 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబీఏలో 21,983 సీట్లు కేటాయించగా, ఇంకా 2295 సీట్లు మిగిలిపోయాయి. ఎంసీఏలో 2865 (వంద శాతం) సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 31లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సాంకేతిక విద్యావిభాగం సూచించింది. -
టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
సాక్షి , హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీఎస్ ఐసెట్–2022 ఫలితలు నేడు (ఆగస్టు 27) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కాకతీయ యూనివర్సిటీలో మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఈ ఫలితాలతో పాటు ఫైనల్ కీ ని కూడా విడుదల చేశారు. ఈ టీఎస్ ఐసెట్ 2022 ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ( www.sakshieducation.com )లో చూడొచ్చు. ఐసెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన దంతాల పూజిత్ వర్థన్ మొదటి ర్యాంకు కైవసం చేసకోగా.. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అంబవరం ఉమేష్ చంద్రారెడ్డి రెండవ ర్యాంకు సాధించారు. అలాగే గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కాట్రగడ్డ జితిన్ సాయికి మూడో ర్యాంకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన వెలిశాల కార్తీక్ నాలుగో ర్యాంక్ సాధించారు. కాగా ఐసెట్ ప్రవేశ పరీక్షను జులై 27, 28 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా పలు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీఎస్ ఐసెట్-2022కు 75,952 మంది దరఖాస్తు చేసుకోగా.. 68,781 విద్యార్థులు పరీక్ష రశారు. వారిలో 61,613 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థుల్లో 30,409 మంది పురుషులు (89 శాతం), 31,201 మంది మహిళలు (89.34 శాతం) 3 ట్రాన్స్జెండర్లు (75 శాతం) ఉన్నారు. ఫలితాలు https://icet.tsche.ac.in అందుబాటులో ఉన్నాయి. టీఎస్ ఐసెట్-2022 ఫలితాలు కోసం క్లిక్ చేయండి -
కెనడాలో విశాఖ జిల్లా విద్యార్థి మృతి
సాక్షి, పాయకరావుపేట: కెనడాలో ఎంబీఏ చదువుతున్న విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన నిట్టెల మధుకుమార్ (30) ఆదివారం ఆకస్మికంగా మృతి చెందాడు. పట్టణానికి చెందిన నిట్టెల నూకరాజు మూడో కుమారుడైన మధుకుమార్ నెల రోజుల క్రితమే టోరెంటో నగరంలోని యార్క్ యూనివర్సిటీలో చదివేందుకు కెనడా వెళ్లాడు. ఈవెనింగ్ వాక్ చేస్తూ (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) హఠాత్తుగా కుప్పకూలిపోయాడని, స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణం పోయిందని మృతుని స్నేహితులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపారు. -
ఎంబీఏ చదువు, మంచి ఉద్యోగం వదిలి.. పాడితో ఉపాధి!
జగిత్యాల అగ్రికల్చర్: ఉన్నత చదువులు చదివిన యువకులు వ్యవసాయంతోపాటు పాడి వంటి అనుబంధ రంగాల వైపు వెళ్లేందుకు నామోషీగా ఫీలవుతుంటారు. దీంతో, చాలీచా లని జీతంతో పట్టణాల్లో మగ్గిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎంబీఏ చదివి, ప్రైవేట్ ఉద్యోగాన్ని వదులుకొని, ఉన్న ఊరిలో జెర్సీ ఆవుల ఫాం నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాడు జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్కు చెందిన తీపిరెడ్డి సురేశ్రెడ్డి(99893 54414). ఉరుకుల పరుగుల జీవితం నచ్చక.. సురేశ్రెడ్డి ఎంబీఏ పూర్తయ్యాక రెండేళ్లు హైదరాబాద్లో ఉద్యోగం చేశాడు. కానీ ఉరుకుల పరుగుల జీవితం అతనికి నచ్చలేదు. దీంతో వ్యవసాయం చేద్దామని ఇంటికి వచ్చాడు. కానీ చదువుకున్నది వ్యవసాయం చేయడానికి కాదు.. ఏదో ఒక ఉద్యోగం చూసుకో అని తల్లితండ్రులు ముఖం మీదే చెప్పేశారు. అయినప్పటికీ తనకున్న పట్టుదల, ధైర్యంతో మొండిగా ఆవుల ఫాం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి రుణం తీసుకొని, తమకున్న వ్యవసాయ భూమిలోనే 5 జెర్సీ ఆవులతో ఫాం ప్రారంభించాడు. ప్రస్తుతం 25 ఆవులున్నాయి.. ఫాంలో ప్రస్తుతం 25 జెర్సీ ఆవులు, 10 దూడలున్నాయి. పాలు పితికేందుకు సురేశ్రెడ్డి ఇద్దరు బిహార్ కూలీలను నియమించుకున్నాడు. ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫాంలోనే ఉంటూ ఆవులను స్వయంగా పర్యవేక్షిస్తుంటాడు. వాటికి మేత కోసం, ఎకరంలో పచ్చిగడ్డి వేశాడు. ఉదయం, సాయంత్రం ఆవులకు దాణా పెట్టి, పాలు పితుకుతారు. ఆవులు, దూడల పేడ, మూత్రంతో ఈగలు, దోమలు రాకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాడు. లీటర్కు రూ.50లకు విక్రయం ప్రతీరోజు ఉదయం, సాయంత్రం 100 లీటర్ల పాల దిగుబడి సాధిస్తున్నట్లు సురేశ్రెడ్డి తెలిపాడు. వీటిలో 30 లీటర్లను స్థానిక వినియోగదారులకు లీటర్కు రూ.50 చొప్పున పోస్తున్నాడు. మిగిలిన పాలను పాల డిపోకు తీసుకెళ్తున్నాడు. అక్కడ పాలల్లో వెన్న శాతాన్ని బట్టి లీటర్కు రూ.30 నుంచి రూ.33 వరకే ఇవ్వడం వల్ల ఆదాయానికి గండి పడుతోంది. అలా కాకుండా వినియోగదారులు పెరిగితే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉందంటున్నాడు. దాణా రేట్లు ఏడాదిలో రెట్టింపు కావడం వల్ల ఫాం నిర్వహణ ఖర్చులు పెరిగాయి. దీనికితోడు, ప్రభుత్వం ఇస్తామన్న లీటర్కు రూ.4 ఇన్సెంటివ్ రూ.2 లక్షలు రెండేళ్లుగా అందక కొంత ఇబ్బందిగా ఉందని చెబుతున్నాడు. ఎండుగడ్డి సేకరణ పాడి పశువులకు మేత ప్రధానం. ఓవైపు పచ్చిమేత ఇస్తూనే, మరో వైపు ఎండుగడ్డిని ఓ పూట వేస్తుంటారు. ఇందుకోసం సురేశ్రెడ్డి వరి పొలాల సమయంలో వరి గడ్డిని కట్టలు కట్టించి, షెడ్డులో నిల్వ చేస్తున్నాడు. రూ.వేలకు వేలు పెట్టి, కొత్తగా పాడి పశువులను కొనుగోలు చేయకుండా, ఆవులకు పుట్టిన పిల్లలకే సమీకృత దాణా ఇస్తూ త్వరగా ఎదిగేలా చేస్తున్నాడు. జగిత్యాలలో షాప్ పెట్టాలనుకుంటున్న జెర్సీ ఆవుల ఫాం ప్రారంభించాక మొదట్లో ఎన్నో కష్టనష్టాలు చూశా. కానీ ఏనాడూ అధైర్యపడలేదు. ఫాంని మరింత లాభాల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్న. జగిత్యాలలో వినియోగదారుల కోసం షాప్ పెట్టాలనుకుంటున్న. దాణా రేట్లు తగ్గితే ఆదాయం బాగుంటుంది. – తీపిరెడ్డి సురేశ్రెడ్డి, పాడి రైతు, లక్ష్మీపూర్ -
విద్యార్థిని కిడ్నాప్... రూ.20 లక్షలు డిమాండ్ చేసి రూ.5 లక్షలు ఇచ్చినప్పటికీ
న్యూఢిల్లీ: కొన్ని నేరాలు చూస్తే ఎవర్ని నమ్మాలి అనే సందేహం కలుగుతుంది. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు తమ బంధువులు లేదా పరిచయమున్న వ్యక్తుల చేతిలోనే మోసపోవడం లేదా వేధింపులకు గురవడం వంటివి జరుగుతుండటం బాధకరం. అచ్చం అలాంటి ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...ఢిల్లీలో ఎంబీఏ విద్యార్థి ఫినైల్ సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..."ఆ ఎంబీఏ విద్యార్థితో ఒక నిందితుడు పథకంలో భాగంగా సన్నిహితంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆ నిందితుడు అతన్ని అక్టోబర్ 23, 2020న కిడ్నాప్ చేసి గదికి తీసుకెళ్లారు. అంతేకాదు తుపాకీ వీడియోతో నగ్న వీడియోల తోపాటు తుపాకీ, గంజాయి, పిస్టల్ని పట్టుకుని ఉన్న వీడియోలను కూడా తీశారు. ఈ మేరకు ఆ నిందుతుడు తప్పుడు కేసులో ఇరికిస్తానంటూ ఆ విద్యార్థిని బెదిరించి రూ. 20 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ఆ విద్యార్థి కుటుంబం రూ.5 లక్షలు చెల్లించింది. అయినప్పటికీ ఆ నిందితుడి ఆ విద్యార్థి నగ్న వీడియోలను అతని కాలనీలోని వాళ్లకు, బంధువులకు పంపిచాడు. మళ్లీ ఫిబ్రవరి 1న ఫోన్ చేసి డబ్బు ఇవ్వాలంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. ఇక ఆ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ధర్మపాల్ అనే కానిస్టేబుల్ కూడా ఆ విద్యార్థిని బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ విద్యార్థి మనస్తాపం చెంది ఆ విద్యార్థి ఫినైల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు." అని పోలీసులు చెప్పారు. ఈ మేరకు పోలీసులు ఈ ఘటనకు ప్రధాన కారకుడైన నిందుతుడిని అరెస్టు చేయడమే కాక ఇతర నిందుతుల ఆచూకి కోసం విచారించడం ప్రారంభించారు. అంతేగాక ఆ విద్యార్థి కుటుంబాన్ని కలిసి నిందుతులు పట్టుకుని అరెస్ట్ చేయడమే కాక సదరు కానిస్టేబుల్ పై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (చదవండి: హెల్మెట్ ధరించమని అన్నందుకే దారుణంగా కొట్టి, జీప్ ఎక్కించి....) -
ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సులు.. వివరాలివిగో..
బిజినెస్ స్కూల్స్.. మరో మాటలో చెప్పాలంటే.. మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్! పీజీ స్థాయిలో ఎంబీఏ, పీజీడీఎం ప్రోగ్రామ్ల ద్వారా.. మేనేజ్మెంట్ నైపుణ్యాలు అందించే విద్యాసంస్థలు! ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు.. టెక్ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇందుకోసం ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో ప్రత్యేకంగా టెక్నికల్ కోర్సులు బోధిస్తున్నాయి. దేశంలో.. ప్రతిష్టాత్మక బీస్కూల్స్ ఐఐఎంలు మొదలు మరెన్నో ప్రముఖ బీస్కూల్స్.. పీజీ ప్రోగ్రామ్స్ కరిక్యలంలో.. టెక్నికల్ సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇస్తుండటం నయా ట్రెండ్గా మారింది. ఈ నేపథ్యంలో.. బీస్కూల్స్లో టెక్ కోర్సుల బోధనకు కారణాలు.. వాటితో ప్రయోజనాలపై ప్రత్యేక కథనం... సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్.. సంక్షిప్తంగా స్టెమ్ కోర్సులుగా గుర్తింపు. వీటిని సైన్స్, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు, మూడేళ్లుగా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు సైతం ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. డేటా సైన్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్లలో స్టెమ్ కోర్సులను ప్రవేశపెడుతున్న ఇన్స్టిట్యూట్లు ప్రధానంగా.. డేటాసైన్స్, డేటా అనలిటిక్స్కు ప్రాధాన్యమిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. కార్పొరేట్ ప్రపంచంలో డేటా అనలిటిక్స్కు ప్రాధాన్యం పెరగడమే! అనలిటిక్స్ ఆధారంగా బిజినెస్ వ్యూహాలు రూపొందించే మేనేజ్మెంట్ నిపుణుల అవసరం నెలకొంది. అనలిటిక్స్ నైపుణ్యాలకు టెక్ స్కిల్స్ పునాదిగా నిలుస్తున్నాయి. దీంతో మేనేజ్మెంట్ విద్యార్థులకే డేటాసైన్స్, డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్మెంట్పై అవగాహన కల్పిస్తే.. కార్పొరేట్ వర్గాల నుంచి చక్కటి ఆఫర్లు లభిస్తాయని భావిస్తున్నారు. ఏఐ–ఎంఎల్ కూడా ►మేనేజ్మెంట్ కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) కూడా బోధిస్తున్నారు. ఇప్పుడు అన్నింటా ముఖ్యంగా వస్తు సేవల్లో.. ఏఐ, ఎంఎల్కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఒక ఉత్పత్తి లేదా సర్వీస్ను ఏఐ ఆధారంగా రూపొందించాలనుకుంటే.. సదరు నిర్వహణ అధికారులకు దీనిపై అవగాహన ఉండాలి. అంతేకాకుండా కంపెనీల రోజువారీ విధుల్లోనూ ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా అకౌంట్స్, ఫైనాన్స్,ప్రొడక్షన్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో.. ఏఐ ఆధారంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ►ఏఐ ఆధారంగా..పని భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా.. అందుకు అయ్యే వ్యయం కూడా తగ్గించుకోవచ్చు. అదే విధంగా.. సంస్థకు కీలకమైన హెచ్ఆర్ విభాగంలో సైతం నూతన నియామకాలు, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏఐ–ఎంఎల్ ద్వారా దరఖాస్తుల పరిశీలన, అర్హులను గుర్తించడం సులభం అవుతోంది. దీంతో.. మేనేజ్మెంట్ విభాగాల్లో పని చేసే వారికి సైతం టెక్నికల్ నైపుణ్యాలపై పట్టు సాధించాల్సిన ఆశ్యకత నెలకొంది. అందుకే ఇప్పుడు మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు.. ఏఐ, ఎంఎల్ వంటి టెక్ స్కిల్స్ను బోధిస్తున్నాయి. బిజినెస్ అనలిటిక్స్ మేనేజ్మెంట్ విభాగంలో టెక్నికల్ కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు.. బిజినెస్ అనలిటిక్స్కు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి. సంస్థకు సంబంధించి రా మెటీరియల్ సేకరణ నుంచి ప్రొడక్షన్, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ వరకూ.. అన్ని అంశాలు కంప్యూటరీకరణ జరుగుతోంది. ఒక్కో దశలో ఆయా అంశాల నిర్వహణకు సంబంధించిన విషయాలు(ఖర్చులు, నిర్వహణ వ్యయం, అనుసరించిన విధానం తదితర)ను కంప్యూటర్ ద్వారా విశ్లేషించి మేనేజ్మెంట్ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై స్పష్టతకు రావలసి ఉంటుంది. దీంతో క్షేత్ర స్థాయిలో సాంకేతిక నైపుణ్యాలు ఆవశ్యకంగా మారుతున్నాయి. దీంతో మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ బిజినెస్ అనలిటిక్స్ను తమ కరిక్యులంలో భాగంగా చేర్చుతున్నాయి. ప్రత్యేక ప్రోగ్రామ్లు సైతం ►మేనేజ్మెంట్ కోర్సుల్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు స్టెమ్ కోర్సులను బోధిస్తుండగా.. మరికొన్ని ఇన్స్టిట్యూట్లు పూర్తి స్థాయిలో ప్రత్యేక టెక్ ప్రోగ్రామ్లను రూపొందిస్తున్నాయి. ►ఐఐఎం–అహ్మదాబాద్.. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా 16 నెలల అడ్వాన్స్డ్ బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రామ్ను రూపొందించింది. ►ఐఐఎం–బెంగళూరు.. బిజినెస్ అనలిటిక్స్లో రెండేళ్ల ఎంబీఏ ప్రోగ్రామ్ను అందిస్తోంది. ►ఐఐఎం–కోల్కత.. ఏడాది వ్యవధిలో బిజినెస్ అనలిటిక్స్లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తోంది. అదే విధంగా డేటా సైన్సెస్లో అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్లో సైతం ప్రవేశం కల్పిస్తోంది. ►ఐఐఎం–కాశీపూర్ కూడా అనలిటిక్స్లో ఎంబీఏ ప్రోగ్రామ్కు రూపకల్పన చేసింది. ఇతర బీ–స్కూల్స్ కూడా ► ఐఐఎంలే కాకుండా.. దేశంలోని ఇతర ప్రముఖ బీ–స్కూల్స్ కూడా మేనేజ్మెంట్ పీజీ లేదా పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సుల బాట పడుతున్నాయి. ► ఐఎస్బీ–హైదరాబాద్ బిజినెస్ అనలిటిక్స్లో హైబ్రీడ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ను అందిస్తోంది. ప్రత్యేక రీసెర్చ్ కేంద్రాలు ►ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సులను అందిస్తున్న మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు.. సంబంధిత విభాగాల్లో ప్రత్యేకంగా రీసెర్చ్ కేంద్రాలను కూడా నెలకొల్పుతున్నాయి. ►ఐఐఎం అహ్మదాబాద్ కొద్ది రోజుల క్రితం సెంటర్ ఫర్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పరిశోధనలు నిర్వహించి.. వ్యాపారాలకు, పాలనకు, విధాన నిర్ణయాలకు సహకరించడం లక్ష్యంగా చేసుకుంది. ►ఐఐఎం–రాయ్పూర్ కూడా సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పేరుతో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, టెక్నాలజీ అడాప్షన్, ఆన్లైన్ సెక్యూరిటీ, డిజిటైజేషన్ స్ట్రాటజీ విభాగాల్లో పరిశోధనల కోసం ప్రత్యేక రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించింది. కార్పొరేట్ వర్గాలు టెక్ నైపుణ్యాలున్న మేనేజ్మెంట్ నిపుణులకు కార్పొరేట్ వర్గాలు సైతం పెద్దపీట వేస్తున్నాయి. వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తే.. టెక్, మేనేజ్మెంట్ రెండు నైపుణ్యాలున్న వారి కోసం సంస్థలు అన్వేషణ సాగిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇన్స్టిట్యూట్లు స్టెమ్ కోర్సుల బాట పడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 70 శాతం వారే టెక్ నైపుణ్యాలున్న మేనేజ్మెంట్ నిపుణులకు కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. టెక్ కంపెనీల నియామకాల్లో సైతం 70 శాతం మేరకు మేనేజ్మెంట్ విద్యార్థులే ఉంటున్నారు. ►జీమ్యాక్ సర్వే ప్రకారం–గత ఏడాది టెక్ ఆధారిత సేవలందిస్తున్న సంస్థల్లో 89 శాతం ఎంబీఏ ఉత్తీర్ణులను నియమించుకున్నాయి. ►మేనేజ్మెంట్ సంస్థల విషయానికొస్తే.. టెక్, మేనేజ్మెంట్ నైపుణ్యాలున్న విద్యార్థులను నియమించుకున్న సంస్థల సంఖ్య 60 శాతంగా నిలిచింది. టెక్.. మేనేజ్మెంట్ ► ఒకవైపు మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు టెక్ కోర్సులను అందిస్తుండగా.. మరోవైపు.. టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు సైతం మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ల్లో ప్రవేశాలు కల్పిస్తుండటం విశేషం. ►ఐఐటీ హైదరాబాద్.. ఎగ్జిక్యూటివ్ ఎంటెక్ ఇన్ డేటాసైన్స్ కోర్సును అందిస్తోంది. ►ఐఐటీ–ఢిల్లీ,ఐఐటీ–కాన్పూర్,ఐఐటీ–ఖరగ్పూర్ వంటి ప్రముఖ ఐఐటీలు, ఇతర ఎన్ఐటీలు ఎంటెక్ (సీఎస్ఈ)లో బిగ్ డేటా అనలిటిక్స్ స్పెషలైజేషన్తో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ► వీటితోపాటు పలు ఇతర ఐఐటీలు, మరెన్నో ప్రముఖ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు ఎంటెక్ స్థాయిలో డేటా అనలిటిక్స్ను అందిస్తున్నాయి. ప్రయోజనం ఇప్పుడు కంపెనీలన్నీ ఏఐ బాట పడుతున్నాయి. దీంతో సంస్థల స్థాయిలో సాంకేతిక విభాగాల నుంచి కార్యాలయంలో పని చేసే మేనేజీరియల్ సిబ్బంది వరకూ.. ప్రతి ఒక్కరికి వీటిపై అవగాహన ఉంటేనే సంస్థ లక్ష్యాలు నెరవేరుతాయి. వీటికి అనుగుణంగా అకడమిక్ స్థాయిలోనే టెక్ నైపుణ్యాలు అందిస్తే కెరీర్ పరంగా రాణించగలుగుతారు. అదేసమయంలో కంపెనీలకు అవసరమైన ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా లభిస్తాయి. టెక్ కోర్సులు–ముఖ్యాంశాలు ►ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో టెక్ కోర్సులను అందిస్తున్న ఐఐఎంలు, ఇతర ప్రముఖ బీ–స్కూల్స్. ► బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లకు ప్రాధాన్యం. ► కోర్సు కరిక్యులంతో పాటు ప్రత్యేక ప్రోగ్రామ్లకు రూపకల్పన. ►ఏఐ–ఎంఎల్, డేటా అనలిటిక్స్లో రీసెర్చ్ సెంటర్లను సైతం ఏర్పాటు చేస్తున్న మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు. ►ఈ నైపుణ్యాలతో సంస్థల్లో విధుల నిర్వహణలో మరింత సమర్థంగా రాణించే అవకాశం. ►టెక్ నైపుణ్యాలున్న మేనేజ్మెంట్ విద్యార్థులను నియమించుకోవడానికి ప్రాధాన్యమిస్తున్న టెక్ కంపెనీలు. ►టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లోనూ డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్మెంట్ వంటి కోర్సులు. ► ఇండస్ట్రీలో.. ఐఓటీ ఆధారిత కార్యకలాపాలు నిర్వహణ పెరగడమే ప్రధాన కారణం. డేటా అనలిటిక్స్కు ప్రాధాన్యం అన్ని రంగాల్లోనూ డేటా విశ్లేషణ.. ఆయా సంస్థల భవిష్యత్తు వ్యూహాలకు, మార్కెట్ ప్రణాళికలకు కీలకంగా మారింది. వీటి ఆధారంగానే ఉత్పత్తుల రూపకల్పన, నిర్వహణ తదితర కార్యకలాపాలు చేపట్టాల్సి వస్తోంది. ఇంత కీలకమైన డేటాను విశ్లేషించాలంటే.. మేనేజ్మెంట్తోపాటు డేటా మైనింగ్, డేటాసైన్స్ నైపుణ్యాలు కూడా అవసరమే. అందుకే మేనేజ్మెంట్ విద్యలోనే వీటిని అందించే విధంగా కోర్సుల రూపకల్పన జరుగుతోంది. –ప్రొ‘‘ యు.దినేశ్ కుమార్, డేటాసెంటర్ అండ్ అనలిటిక్స్ ల్యాబ్ చైర్మన్, ఐఐఎం–బెంగళూరు -
ఎంబీఏ చదివాడు.. పాత నేరస్తుడితో కలిసి చైన్ స్నాచింగ్
హిందూపురం: సులువుగా డబ్బు సంపాదించాలనుకుని చైన్స్నాచర్గా మారిన ఎంబీఏ పట్టభద్రుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాలను సోమవారం హిందూపురం రూరల్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమ్య వెల్లడించారు. కర్ణాటకలోని తుమకూరుకు చెందిన అభిలాష్ ఎంబీఏ పూర్తి చేసి సులువుగా డబ్బు సంపాదించాలనుకుని గుప్త నిధుల కేసులో పాత నేరస్తుడిగా ఉన్న తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వెంకటాపురానికి చెందిన జనత్కుమార్తో చేతులు కలిపాడు. గుప్తనిధులు వెలికి తీసేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు కొనుగోలు చేసేందుకు చైన్స్నాచింగ్లకు తెరతీశారు. ఈ క్రమంలోనే హిందూపురంలోని పాండురంగనగర్, టీచర్స్కాలనీ, శ్రీనివాసనగర్, పెనుకొండలోని ఆల్విన్ కాలనీ, అనంతపురంలోని రాంనగర్లో చైన్స్నాచింగ్లకు పాల్పడ్డారు. తాము అపహరించిన బంగారు చైన్లను సోమవారం హిందూపురంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా హిందూపురం రూరల్ సీఐ హహీద్ఖాన్, ఎస్ఐ శ్రీనివాసులు గుర్తించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. వారి నుంచి రూ.1.90 లక్షలు విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు, రూ.15 లక్షలు విలువ చేసే 30.50 తులాల బరువున్న 8 బంగారు మాంగళ్యం చైన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. -
బంపర్ఆఫర్: కరోనా బ్యాచ్లకు టీసీఎస్లో ఉద్యోగాలు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్రెష్ ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు వరంలాంటి వార్తను ప్రకటించింది. కరోనా కష్టకాలంలో ఉద్యోగార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది. కోవిడ్ కష్టాలు గత రెండేళ్లుగా ప్రపంచమంతా కరోనా నామజపంతో ఉలిక్కి పడుతోంది. కోవిడ్ 19 కారణంగా విద్యా సంస్థలు ఎక్కడివక్కడే మూత పడ్డాయి. రెగ్యులర్ క్లాసులు మూతపడి ఆన్లైన్ క్లాసులే వేదికయ్యాయి. జూమ్, గూగుల్ మీట్ తదితర యాప్ల ద్వారానే విద్యార్థులు పాఠాలు వినాల్సి వచ్చింది. ప్రాక్టికల్ తరగతులకు అవకాశమే లేకుండా పోయింది. కరోనా బ్యాచ్లు కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా చాలా కోర్సులకు సంబంధించి సిలబస్లు పూర్తి కాలేదు. సిలబస్ పూర్తి అనిపించుకున్న సబ్జెక్టులు, చాప్టర్లు కూడా అరకొరగానే జరిగాయనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో ఉంది. మరికొన్ని కోర్సులకు, క్లాసులకు ఎటువంటి పరీక్షలు లేకుండానే నెక్ట్స్ తరగతిగా ప్రమోట్ అయ్యారు. దీంతో 2019-20, 2020-21, 2021-22 బ్యాచ్లకు కరోనా బ్యాచ్లుగా పేరు పడ్డాయి. భవిష్యత్తులో సాధారణ బ్యాచ్లతో పోల్చితే కరోనా బ్యాచ్ల పరిస్థితి ఏంటనే బెంగ చాల మందిలో నెలకొంది. టీసీఎస్ సంచలన నిర్ణయం కరోనా బ్యాచ్ విద్యార్థుల సామర్థ్యంపై నెలకొన్న అనుమానాలను, సందేహాలను పటాపంచలు చేస్తూ టీసీఎస్ సంస్థ సంచనల నిర్ణయం తీసుకుంది. ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్ కింద ఎంబీఏ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అవకాశం ప్రత్యేకించి 2019-20, 2020-21, 2021-22 బ్యాచ్లలో పాసవుట్ అయిన ఎంబీఏ గ్రాడ్యుయేట్స్కే కేటాయించింది. నవంబరు 9 వరకు ఉద్యోగార్థులు టీసీఎస్ పోర్టల్ ద్వారా ఎంబీఐ హైరింగ్లో భాగం కావచ్చు. నవంబరు 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. 18 నుంచి 28 ఏళ్ల వరకు వయస్సు పరిమితిని విధించారు. ఉద్యోగార్థులు రెండేళ్ల ఎంబీఏ కోర్సును పూర్తి చేయడంతో పాటు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీలలో 60 శాతం మార్కులతో పాస్ కావాల్సి ఉంటుంది. బీటెక్ బ్యాక్గ్రౌండ్తో ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు, 35,000ల మందికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వడపోసేందుకు టీసీఎస్ 90 నిమిషాల పరీక్షను నిర్వహించనుంది. వెర్బల్ అప్టిట్యూట్, క్వాంటిటేటివ్ అప్టిట్యూట్, బిజినెస్ అప్టిట్యూట్ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ కింద దాదాపు 35,000ల మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ని టీసీఎస్ హైర్ చేసుకోనుంది. చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! -
ఎంబీఏ చదవలేకపోయాడు.. టీ కొట్టుతో కోట్లు సంపాదించాడు..
అహ్మదాబాద్: జీవితంలో సక్సెస్ ఎవరికీ అంత ఈజీగా రాదు. కానీ వినూత్న ఆలోచన, పట్టుదల ఉంటే అదే సక్సెస్ వెతుక్కుంటూ మన ఇంటి తలుపు తడుతుందని నిరూపించాడు మధ్యప్రదేశ్కు చెందిన ప్రపుల్ బిల్లోర్. మొదట్లో ఈ పేరు కూడా పలకడం రాని వాళ్లకు, అలాంటి పేరుని ఇప్పుడు పది మంది నోళ్లలో నానేలా చేశాడు. ఓ చిన్న టీ కోట్టుతో మొదలై దేశవ్యాప్తంగా 22 స్టాల్స్ను ప్రారంభించే స్థాయికి వెళ్లాడు. అలాంటి ప్రపుల్ విజయగాథ వివరాలను ఓ సారి చూసేద్దాం. మధ్యప్రదేశ్లోని లాబ్రవదా గ్రామానికి చెందిన రైతు కుమారుడు ప్రఫుల్ బిల్లోర్. అయితే వ్యాపారవేత్త కావాలని మొదటి నుంచి కలలు కనేవాడు. అందుకు ప్రతిష్ఠాత్మక ఐఐఎం విద్యాసంస్థల్లో ఎంబీఏ చేద్దామనుకున్నాడు కానీ క్యాట్ పరీక్షలో మూడు సార్లు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకోయాడు. కానీ అదే తన జీవితాన్ని మార్చేయబోతోందని ఆ రోజు అతనికి తెలీదు. మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు కారణంగా చదువు పక్కన పెట్టి మెక్డొనాల్డ్స్లో చేరాడు. అలా కొన్ని నెలల తరువాత, అతను ఉద్యోగం చేస్తునే సొంతంగా చిన్న కొట్టు ప్రారంభించాడు. అయితే వ్యాపారానికి డబ్బులు సరిపోయేవి కావు, దీంతో చదువు కోసం రూ.10,000 కావాలని తండ్రి దగ్గర తీసుకుని వాటిని టీ సామాగ్రిని కొనుగోలుకి ఉపయోగించాడు. అలా సెట్ అయిన వ్యాపారంతో ప్రపుల్ డ్రీమ్ కాలేజ్ అయిన, ఐఐఎం అహ్మదాబాద్ వెలుపల తన టీ అమ్మడం మొదలుపెట్టాడు. మొదటగా మిస్టర్ బిల్లోర్ అహ్మదాబాద్ అనే పేరు పెట్టినప్పటికీ, అతని కస్టమర్లకి ఆ పేరు పిలవడం కష్టంగా ఉండడంతో దానిని ‘ఎంబీఏ చాయ్’ వాలాగా మార్చాడు. ఆ వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో వ్యయ ప్రయాసలు, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాడు. తన షాపుకి వచ్చే ఎంబీఏ విద్యార్థులు, స్టాఫ్తో ఇంగ్లిష్లో మాట్లాడుతూ కస్టమర్ బేస్ను క్రమంగా పెంచుకుంటూ పోయాడు. గతేడాది అతని వ్యాపారం టర్నోవర్ 3 కోట్లు చేరినట్లు తెలిపాడు ప్రపుల్. ఇలా కొద్దికాలంలోనే దేశవ్యాప్తంగా 22 టీస్టాల్స్ను ప్రారంభించి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. చదవండి: A Man Sends Mail TO Paytm CEO: "నా స్టార్ట్ప్ బిజినెస్కి పెట్టుబడి పెట్టండి ప్లీజ్" -
ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం.. దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ 81వ స్నాతకోత్సవంలో భాగంగా ఈ నెల 27వ తేదీన జరిగే కార్యక్రమంలో డిగ్రీ పట్టాలను అందుకోవాలనుకునే పీహెచ్డీ అభ్యర్థులు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ శుక్రవారం తెలిపారు. బంగారు పతకాలు అందుకునే అభ్యర్థుల జాబితాను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడాలన్నారు. 18 వరకు డిగ్రీ సప్లిమెంటరీ, ఇన్స్టంట్ పరీక్షల ఫీజు చెల్లింపు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ కోర్సుల 1, 3, 5 బ్యాక్లాగ్లతో పాటు కోవిడ్ కారణంగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న డిగ్రీ ఇన్స్టంట్ 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 18 వరకు చెల్లించవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ శుక్రవారం తెలిపారు. రూ.200 అపరాధ రుసుముతో 23 వరకు, రూ.500 రుసుముతో 26, 27 వరకు, రూ.1000 రుసుముతో 28, 29 వరకు, రూ.2000 రుసుముతో నవంబరు 1, 2 వరకు, రూ.5000 అపరాధ రుసుముతో నవంబరు 3 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చునన్నారు. వివరాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ వెబ్సైట్ చూడాలన్నారు. 26 నుంచి ఎంబీఏ పరీక్షలు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 6 వరకు ఎంబీఏ రెగ్యులర్ 2వ సెమిస్టర్, బ్యాక్లాగ్ 1వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ తెలిపారు. పరీక్షల టైంటేబుల్ను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఓయూ దూరవిద్యలో సెమిస్టర్ విధానం ఉస్మానియా విశ్వవిద్యాలయ దూరవిద్య కేంద్రంలో వివిధ కోర్సులలో సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుతం ఎంబీఏ కోర్సుకు మాత్రమే ఉన్న సెమిస్టర్ పరీక్ష విధానాన్ని ఇతర పీజీ కోర్సులకు కూడా అమలు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2021–22) ఎంసీఏ కోర్సును మూడు నుంచి రెండు సంవత్సరాలకు కుదించి సెమిస్టర్ పరీక్షను అమలుపర్చనున్నారు. రానున్న విద్యా సంవత్సరం (2022–23) నుంచి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పీజీడీసీఏ కోర్సులకు సెమిస్టర్ పరీక్ష విధానాన్ని అమలు చేస్తామని అధికారులు వివరించారు. అందుకు అనుగుణంగా పీజీ పుస్తకాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పీజీ తర్వాత డిగ్రీ కోర్సులకు కూడ సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టేయోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ విద్యా సంవత్సరానికి (2021–22) వివిధ కోర్సులలో జోరుగా అడ్మిషన్లు సాగుతున్నాయన్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువు పొడిగింపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం,బీఎస్సీ), పీజీ (బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ) పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి ఆలస్య రుసుము రూ. 200 తో చివరి తేదీ అక్టోబర్ 13 వరకు పొడిగించినట్లు వర్సిటీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను https://www.braouonline.in/లో పొందుపర్చినట్లు వెల్లడించారు. వివరాలకు 7382929570/580 లేదా విశ్వవిద్యాలయ 040–23680290/291/294/295 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
ఐసెట్లో 90.09% ఉత్తీర్ణత
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఐసెట్–21 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్, టీఎస్ఐసెట్ చైర్మన్ ఆచార్య కె.రాజిరెడ్డితో కలిసి విడుదల చేశారు. మొత్తం 66,034మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 56,962 మంది పరీక్ష రాశారు. వారిలో 51,316 మంది (90.09) ఉత్తీర్ణత సాధించారని లింబాద్రి తెలిపారు. పురుషుల విభాగంలో 28,848 మందికిగాను 26,057 మంది ఉత్తీర్ణత (90.33శాతం) సాధించారు. మహిళా విభాగంలో 28,111 మందికిగాను 25,256 మంది (89.84 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్జెండర్లు ముగ్గురు రాయగా, ముగ్గురూ ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ, ఏపీ కలిపి నిర్వహించిన ఈ పరీక్షలో హైదరాబాద్కు చెందిన ఆర్.లోకేష్ 155.36716 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ టి.పాపిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్ బి.వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్ కావాలనేది లక్ష్యం.. నేను ఐఏఎస్ కావాలనే లక్ష్యంగా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా. టీఎస్ఐసెట్ను సివిల్స్ ప్రిపరేషన్లో భాగంగా రాశాను. 155 మార్కులతో మొదటిర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఇప్పటికే బీటెక్ ఈసీఈ పూర్తిచేశాను. – ఆర్.లోకేష్, మొదటి ర్యాంకర్. బ్యాంకు మేనేజర్ కావాలనేది లక్ష్యం.. నేను బీటెక్ ఈఈఈ 2020లోనే పూర్తి చేశా. అప్పటినుంచి బ్యాంకు మేనే జర్ కావాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. ఎంబీఏ కూడా చదువుకోవాలనే టీఎస్ఐసెట్ రాశాను. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. రెండో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఓయూలో ఎంబీఏలో చేరుతా. – పామడి సాయి తనూజా, రెండో ర్యాంకర్. ఫైనాన్స్ మేనేజ్మెంట్లో చేరుతా.. నేను గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నా. ఐసెట్లో మూడవ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. సీబీఐటీలో ఫైనాన్స్ మేనేజ్మెంట్ కోర్సులో చేరతాను. – నవీనాక్షంత, మూడో ర్యాంకర్. -
చదువుతారా.. ఇంటర్నేషనల్ బిజినెస్!
మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులకు క్యాట్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న ప్రవేశ పరీక్ష.. ఐఐఎఫ్టీ ఎంబీఏ. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ)లో.. ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఇటీవల 2022–24 విద్యాసంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ).. ఐఐఎఫ్టీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐఐఎఫ్టీ ప్రత్యేకత, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం... అంతర్జాతీయ వాణిజ్యంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసేందుకు 1963లో స్థాపించిన సంస్థ.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్టీ). ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలో పనిచేసే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఐఐఎఫ్టీ ప్రస్తుతం ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్(ఫుల్టైమ్), ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్(వీకెండ్), ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్, ఎంఏ ఎకనామిక్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్, సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ను అందిస్తోంది. (బీమా రంగంలో జాబ్ కావాలా.. ఇలా ట్రై చేయండి!) 2002లో ఐఐఎఫ్టీకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా సైతం లభించింది. అంతేకాకుండా న్యాక్.. దీన్ని గ్రేడ్ ఏ ఇన్స్టిట్యూషన్గా గుర్తించింది. ఐఐఎఫ్టీకి ఢిల్లీ, కోల్కతాల్లో క్యాంపస్లు ఉన్నాయి. కాకినాడ క్యాంపస్లో యూజీసీ /కేంద్ర ప్రభుత్వ అనుమతికి అను గుణంగా ప్రవేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్)లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ► గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచీ కనీసం మూడేళ్ల వ్యవధిగల డిగ్రీ/ తత్సమాన విద్యను 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరీలకు చెందినవారు కనీసం 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ► గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది చదవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. ► ఈ ఎంట్రెన్స్ టెస్ట్కు దరఖాస్తుకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. ఎంపిక ప్రక్రియ ఐఐఎఫ్టీ ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–సీబీటీ), గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. (ఈ గురువుల్ని మించిన శిష్యుల కథ తెలుసా?) ఆన్లైన్ పరీక్ష ► ఐఐఎఫ్టీ ఎంబీఏ ఎంట్రెన్స్ టెస్ట్ను ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)) విధానంలో నిర్వస్తారు. ► మొత్తం నాలుగు విభాగాల నుంచి 110 ప్రశ్నలు–300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. ► ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు(ఎంసీక్యూ) ఉంటాయి. ప్రశ్న పత్రం ఇంగ్లిష్లో ఉంటుంది. ► నాలుగు విభాగాలు: క్వాంటిటేటివ్ ఎబిలిటీ–25 ప్రశ్నలు, వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్–35 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్–30ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్–20 ప్రశ్నలు. ► నెగిటివ్ మార్కులు: మొదటి మూడు సెక్షన్లలో ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. 4వ సెక్షన్కు సంబంధించి ప్రతి సరైన సమాధానానికి 1.5 మార్కుల చొప్పున కేటాయిస్తారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ► ఈ విభాగం నుంచి మొత్తం 35 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో పెరా ఫార్ములేషన్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్–ఆంటోనిమ్స్, ప్రిపోజిషన్స్, అనాలజీ, గ్రామర్,స్పెల్లింగ్, మ్యాచింగ్ వర్డ్ మీనింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ ► ఈ విభాగం నుంచి నుంచి 14–16 ప్రశ్నలుంటాయి. ఇందులో నాలుగు ప్యాసెజ్లలో అడిగిన ప్రశ్నలకు ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. దీనిలో కరెంట్ అఫైర్స్, బిజినెస్ ఎకానమీ, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సంఘటనలు, పరిణామాలు, అంతర్జాతీయ పరిణామాలు–దేశంపై వాటి ప్రభావం తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. క్వాంటిటేటివ్ ఎబిలిటీ ► ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో అర్థమెటిక్, సింపుల్ ఇంట్రెస్ట్, మ్యాన్ డే అండ్ వర్క్, రేషియో–ప్రపోర్షన్, పర్సంటేజెస్, ఫిలింగ్ ఆఫ్ ఓవర్హెడ్ ట్యాంక్ వంటి అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇవే కాకుండా.. జామెట్రీ, అల్జీబ్రా, లాగ్, ట్రయాంగిల్, రెక్టాంగ్లర్స్, ప్రాబబిలిటీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. డేటా ఇంటర్ప్రిటిషన్ అండ్ లాజికల్ రీజనింగ్ ► ఈ విభాగం నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో అనాలసిస్ అండ్ కాంపరేటివ్ స్టడీ ఆఫ్ డేటాటేబుల్స్, చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ విత్ టేబుల్స్, పై చార్ట్ అండ్ టేబుల్, బార్ డయాగ్రమ్ అండ్ కాంపరేటివ్ టేబుల్ వంటి అంశాలను అడుగుతారు. అలాగే లాజికల్ రీజనింగ్కు సంబంధించి టీమ్ బేస్డ్ కొశ్చన్స్, స్టేట్మెంట్–కంక్లూజన్, కోడింగ్–డీకోడింగ్, ఆర్గు్గమెంట్స్, కంక్లూజన్స్, బ్లడ్ రిలేషన్స్, క్లాక్, కేలండర్, డైరెక్షన్ సెన్స్, సీటింగ్ అరెంజ్మెంట్స్ వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు. జనరల్ నాలెడ్జ్ ► ఈ విభాగం నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 1.5 మార్కులు కేటాయిస్తారు. ఇందులో మ్యాచింగ్ ది లోగోస్, మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మ్యాచింగ్ స్టాక్ మార్కెట్ ఆఫ్ కంట్రీస్, కరెన్సీ ఆఫ్ ది కంట్రీస్, కరెంట్ అఫైర్స్, వివిధ రంగాలకు బ్రాండ్ అంబాసీడర్లుగా వ్యవహరిస్తున్నవారు, బుక్స్ అండ్ ఆథర్స్, బిజినెస్ అండ్ ఎకానమీ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. దరఖాస్తు ఫీజు ► జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.2500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. విదేశీ అభ్యర్థులు రూ.15000/200 యూఎస్ డాలర్స్ దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.10.2021 ► పరీక్ష తేదీ: 05.12.2021 ► పరీక్ష సమయం: ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు; ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. ► వెబ్సైట్: https://iift.nta.nic.in -
చార్టర్డ్ అకౌంటెన్సీ, ఎంబీఏ.. ఏది బెటర్
జాబ్ మార్కెట్ వేగంగా మారిపోతోంది. కంపెనీల అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్య కోర్సులను ఎంచుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)ల్లో.. ఏది బెటర్ అనే విషయంలో విద్యార్థులు త్వరగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ కోర్సులకున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని.. కొందరు చార్టర్డ్ అకౌంటెన్సీలో చేరుతుండగా.. మరికొందరు ఎంబీఏను ఎంచుకుంటున్నారు. సీఏ, ఎంబీఏల ప్రత్యేకతపై అవగాహన పెంచుకోవడం ద్వారా విద్యార్థులు తమకు నప్పే కోర్సులో చేరొచ్చు!! ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు ఉన్నత విద్య కోర్సులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రొఫెషనల్ కోర్సులకు జాబ్ మార్కెట్లో అధిక ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే. సీఏ, ఎంబీఏ వంటి కోర్సులు పూర్తిచేసుకుంటే.. అవకాశాలకు కొదవలేదు. మేనేజ్మెంట్, అనాలసిస్, బిజినెస్ స్ట్రాటజీ పరిజ్ఞానంతో ఎంబీఏలు కార్పొరేట్ రంగంలో ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు. మరోవైపు సీఏ కోర్సుతో అకౌంటింగ్, ఫైనాన్స్ రంగాల్లో దూసుకుపోవచ్చు. సీఏ చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ కోర్సు. సీఏ కోర్సు ప్రధాన లక్ష్యం.. ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ విభాగాలకు అవసరమైన నిపుణులను అందించడం. మన దేశంలో ఈ కోర్సును ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహిస్తోంది. సీఏ పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి ప్రొషెషనల్ సీఏగా గుర్తింపు లభిస్తుంది. ఈ కోర్సులో చేరేందుకు కనీస అర్హత 10+2/ఇంటర్మీడియట్. ఇంటర్ తర్వాత.. ‘కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్’(సీపీటీ)కు హాజరు కావాలి. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ‘ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్సు’ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.. సంక్షిప్తంగా ఎంబీఏ. ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఐఐఎంలు వంటి ప్రముఖ బిజినెస్ స్కూల్స్లో ఎంబీఏ చేసినవారికి అవకాశాలు విస్తృతం. సైన్స్/హ్యూమానిటీస్/కామర్స్/ఇంజనీరింగ్.. ఇలా ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఎంబీఏలో చేరొచ్చు. డిగ్రీ తర్వాత క్యాట్/మ్యాట్/ఎక్స్ఏటీ వంటి జాతీయ స్థాయి ఎంట్రన్స్ టెస్ట్లు; ఐసెట్ వంటి రాష్ట్ర స్థాయి పరీక్షల్లో ర్యాంక్ సాధించాల్సి ఉంటుంది. ఎంబీఏ కోర్సు ప్రధాన లక్ష్యం.. కంపెనీలు, వ్యాపారాల నిర్వహణకు అవసరమైన మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మొదలైన విభిన్న నైపుణ్యాలు అందించడం. కోర్సుల వ్యవధి సీఏ కోర్సులో..ఇంటర్మీడియట్ అర్హతతో చేరి.. నాలుగేళ్లలో పూర్తిచేసుకోవచ్చు. ఇందులో సీపీటీ, ఐపీసీసీ, సీఏ ఫైనల్ ఉంటాయి. ఎంబీఏ కోర్సు వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లుగా ఉంటుంది. సీఏతో కెరీర్ సీఏ ఉత్తీర్ణులైన వారికి ఆడిటర్, ఫైనాన్స్ మేనేజర్ వంటి ఉద్యోగాలు ఉంటాయి. సీఏ కోర్సు పూర్తి చేసినవారు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీల్లో అవకాశాలు అందుకోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేసే అవకాశం సైతం ఉంటుంది. ఆడిటింగ్ ఫర్మ్స్, ట్యాక్సేషన్, మేనేజింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, కార్పొరేట్ లా కంపెనీల్లో కొలువుతోపాటు సీఏగా సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు. ఎంబీఏతో ఉద్యోగాలు ఎంబీఏ చేసిన అభ్యర్థులకు వివిధ కార్పొరేట్ కంపెనీల్లో మేనేజర్స్, టీమ్ లీడర్స్, హెచ్ఆర్ హెడ్ వంటి కొలువులు లభిస్తాయి. పేరున్న బీస్కూల్స్లో ఎంబీఏ ఉత్తీర్ణులైన వారికి దేశ విదేశాల్లో కార్పొరేట్ రంగంలో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మార్కెటింగ్ మేనేజర్/కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్, హెచ్ఆర్ మేనేజర్, ఐటీ/ఆపరేషన్స్ మేనేజర్, అనలిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్తోపాటు మరెన్నో విభాగాల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. నైపుణ్యాలు ► చార్టర్డ్ అకౌంటెంట్గా రాణించాలంటే.. అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్పై పట్టు అవసరం. దీంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండాలి. ► ఎంబీఏలకు నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, టైమ్ మేనేజ్మెంట్, బిజినెస్ స్కిల్స్ తప్పనిసరి. దేనికదే ప్రత్యేకం ► వాస్తవానికి సీఎ, ఎంబీఏ దేనికదే ప్రత్యేకమైనవి. కాని ఎక్కువ మంది ఈ రెండు కోర్సులను పోలుస్తుంటారు. ఏ కోర్సుతో మంచి అవకాశాలు లాభిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. సీఏ.. అకౌంటెన్సీకి సంబంధించిన కోర్సు. కాగా, ఎంబీఏ వ్యాపార నిర్వహణ విభాగానికి చెందిన ప్రోగ్రామ్. ఎంబీఏలో.. హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి పలు స్పెషలైజేషన్స్ ఎంచుకోవచ్చు. డ్యూయల్ స్పెషలైజేషన్స్ చేసే అవకాశం కూడా ఉంది. ► ఎంబీఏతో పోలిస్తే సీఏ కోర్సు పూర్తిచేసుకునేందుకు అయ్యే ఖర్చు తక్కువ. కాని సీఏ కోర్సు కొంత కఠినమైందనే అభిప్రాయం ఉంది. ఒకసారి ఎంబీఏలో చేరితే.. రెండేళ్లు పూర్తయ్యేసరికి పట్టా చేతికొస్తుంది. కాని సీఏ కోర్సులో చేరే విద్యార్థుల్లో మూడు నుంచి ఐదు శాతం మంది మాత్రమే నిర్దిష్ట సమయంలోపు కోర్సు ఉత్తీర్ణులవుతున్నారు. ► ఎంబీఏను.. ఐఐఎంలు, ఐఎస్బీ తదితర టాప్ బీ స్కూల్స్లో పూర్తిచేయాలంటే.. చాలా వ్యయం అవుతుంది. రూ.లక్షల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోర్సులో చేరినవారిలో దాదాపు 80 శాతం మంది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. టాప్ బీ స్కూల్స్లో ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే ఆకర్షణీయ వేతనాలతో కొలువులు ఖాయం అవుతున్నాయి. -
ఈ ఎంబీఏ కోడిపుంజు రూ.3 లక్షలు
సాక్షి, అమరావతి: ఎంబీఏ చేశాడు... కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం.. నెలకు రూ.లక్ష జీతం.. వారానికి ఐదు రోజులే ఉద్యోగం.. ఇంతకు మించి ఎవరైనా ఈ రోజుల్లో కోరుకునేది ఏముంటుంది?. కానీ, అతను అలా అనుకోలేదు. వీకెండ్లో నాటుకోళ్ల వ్యాపారం షురూ చేశాడు. తర్వాత ఏకంగా ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం పైనే దృష్టి పెట్టాడు. అది ఇప్పుడు రూ.2 కోట్ల టర్నోవర్ స్థాయికి ఎదగడమే కాదు.. పలువురికి ఉపాధి కల్పిస్తోంది. నాటుకోళ్ల పెంపకంలో గుర్తింపు పొందిన ఈ యువకుడి పేరు ప్రదీప్. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నున్న గ్రామవాసి. ఎంబీఏ చేసిన ప్రదీప్.. ఓ కార్పొరేట్ కంపెనీలో ఏపీ ఏరియా సేల్స్ మేనేజర్గా ఉద్యోగం చేసేవాడు. వీకెండ్లో కోళ్ల పెంపకంలో గడిపేవాడు. ఆసక్తి పెరగడంతో ఉద్యోగాన్ని వదిలి గుంటకోడూరులో కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. మార్కెటింగ్ ఇబ్బందులతో మొదట ఆదాయం తక్కువగా ఉండేది. దీంతో సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాడు. వ్యాపారం పెరగడంతో నున్నలో ప్రదీప్ ఫామ్స్ అండ్ హేచరీస్తో పాటు చికెన్ వరల్డ్ కంపెనీని ప్రారంభించాడు. నాటుకోళ్లు, కడక్నాథ్ కోళ్లు, సిల్కీ, బీవీ 380, ఆర్ఐఆర్ జాతులతో పాటు టర్కీ, గిన్నికోళ్లు బాతుల పెంపకాన్ని షురూ చేశాడు. ప్రస్తుతం ఈ ఫామ్లో వేయికి పైగా కడక్నాథ్ కోళ్లు, 2వేలకు పైగా ఇతర జాతులున్నాయి. కోళ్ల పెంపకం చేస్తున్న ప్రదీప్ కొత్తగా పందెం కోళ్ల ఫ్యాక్టరీ... తాజాగా ప్రదీప్ పందెం కోళ్ల ఫ్యాక్టరీని ప్రారంభించాడు. ఫిలిప్పీన్స్ పెరువియన్ జాతి కోళ్లను దిగుమతి చేసుకోవడమే కాదు.. దేశీయ పందెం కోళ్లతో క్రాసింగ్ చేయించి పెరు కోళ్లను అభివృద్ధి చేస్తున్నాడు. వీటికి బలం, వాయువేగం ఎక్కువ. వీటి గుడ్డును రూ.3 వేలకు విక్రయిస్తుండగా, రసంగి, గేరువా, సీతువా, వైట్నాట్, బ్లాక్నైట్ వంటి పెరువియన్ జాతి కోడిపుంజుల ధర అయితే రూ.3 లక్షల పైమాటే. ఈ ఫ్యాక్టరీలో సుమారు 3 వేలకు పైగా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల విలువ చేసే పందెం కోళ్లున్నాయి. కోళ్ల పెంపకానికి ముందుకొచ్చే యువతకు 30 శాతం సబ్సిడీతో కోళ్లను ఇవ్వనున్నట్లు చెప్పాడు. విదేశాలకు రవాణా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తెలంగాణ, ఏపీ తదితర రాష్ట్రాలకు డెలివరీ చేస్తున్నారు. ఇటీవలే పాకిస్తాన్, నేపాల్ దేశాలకూ 500 కడక్నాథ్ కోడి పిల్లలను ఎగుమతి చేశారు. కోళ్లతో పాటు అంతరించిపోతున్న దేశీయ కుక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. జర్మన్ షిపర్డ్, లేబర్, ముథోల్, డాబర్మెన్ వంటి జాతులతో పాటు అంతరించిపోతున్న జాతులకు చెందిన రాజపాలయం, జోనంగి జాతి కుక్కలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యక్షంగా 50 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న ప్రదీప్ ఫామ్స్ పరోక్షంగా మరో వంద మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారి కోసం ప్రతీ మంగళవారం అవగాహన కల్పిస్తున్నారు. ప్రదీప్కు తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ రైతు అవార్డు కూడా ఇచ్చింది. -
ప్రపంచానికి పాఠాలు చెబుతోంది
చీచదువుకుంటూ ట్యూషన్ చెప్పేవాళ్లు కొత్త కాదు. ఆన్లైన్ ట్యూషన్లు చెప్పడం కూడా కొత్త కాదు. కాని తిరుచ్చికి చెందిన బి.టెక్ విద్యార్థిని భారతీయులకు కాకుండా ప్రపంచ విద్యార్థులకు పాఠాలు చెబుతోంది. లండన్, న్యూజిలాండ్, సింగపూర్, అమెరికా జాతీయులు ఆమె పాఠాలకు డాలర్లు పే చేస్తున్నారు. లాక్డౌన్లో తన చదువు తాను చదువుకుంటూనే మంచి సంపాదనలో ఉన్న కె.విశ్వతిక మీరూ ఇలా చేయొచ్చని చెబుతోంది. తిరుచ్చిరాపల్లిలోని తన ఇంటిలోని గదిలో సాయంత్రం ఆరు తర్వాత విశ్వతిక ల్యాప్టాప్ తెరుస్తుంది. ఆ వెంటనే ఆమె ఆన్లైన్ ట్యూషన్లు మొదలవుతాయి. విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ ఆమె వారికి పాఠాలు చెబుతుంది. డౌట్లు క్లియర్ చేస్తుంది. వారు భారతీయులు కాదు. వారి ఇంగ్లిష్ ఉచ్చారణ వేరు. అయినప్పటికీ తనకొచ్చిన ఇంగ్లిష్తోనే వారిని ఆకట్టుకుంటూ ‘మాకూ పాఠాలు చెప్పు’ అనేంత డిమాండ్ తెచ్చుకుంది విశ్వతిక. మేనకోడలితో మొదలు విశ్వతిక బెంగళూరులోని సి.ఎం.ఆర్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువుతోంది. కరోనా లాక్డౌన్ వల్ల గత సంవత్సరం నుంచి తన స్వస్థలం అయిన తిరుచ్చి (తమిళనాడు)లోనే ఉంటూ చదువుకుంటోంది. అయితే ఆమె మేనకోడలు కాలిఫోర్నియాలో స్కూలు విద్యార్థిని. ‘నాకు ఆన్లైన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ పాఠాలు చెప్పవా’ అని అడిగితే సరేనని సరదాగా మొదలెట్టింది. కాని ఆ మేనకోడలు ఎంత ఇంప్రెస్ అయ్యిందంటే తన మేనత్తను విపరీతం గా మెచ్చుకోసాగింది ఆమె టీచింగ్ పద్ధతికి. ‘నాకు చిన్నప్పటి నుంచి టీచింగ్ ఇష్టం. నేను బాగానే పాఠాలు చెబుతున్నానని నా మేనకోడలి వల్ల అర్థమైంది’ అని విశ్వతిక అంది. ఆ ఆత్మవిశ్వాసంతో ఆమె ఒక ఆన్లైన్ పోర్టల్లో ట్యూషన్ టీచర్గా తన పేరు నమోదు చేసుకుంది. ఆక్కడి నుంచి ఆమె జీవిత పాఠమే మారిపోయింది. బ్రిటిష్ విద్యార్థి ప్రచారం ఆన్లైన్ పోర్టల్ ద్వారా విశ్వతికకు నాలుగో తరగతి చదువుతున్న ఆలియా అనే పదేళ్ల బ్రిటిష్ విద్యార్థిని మొదటిసారిగా ట్యూషన్కు వచ్చింది. పైథాన్ అనే కోడింగ్ ప్రోగ్రామ్ గురించి పాఠాలు నేర్చుకుంది. ఆలియాకు విశ్వతిక పద్ధతి నచ్చి లండన్లో ఉన్న తన ఫ్రెండ్స్ చాలామందికి విశ్వతిక గురించి చెప్పింది. ‘అందరూ కోడింగ్ ప్రోగ్రామ్స్తో పాటు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మేథమేటిక్స్లో ట్యూషన్లకు చేరడం మొదలెట్టారు’ అంది విశ్వతిక. నెమ్మదిగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి విశ్వతిక పేరు ప్రచారం కాసాగింది. ప్రస్తుతం ఆమెకు విదేశాలలో 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మరికొందరు లైన్లో ఉన్నారు. ఆమె పాఠాలకు డాలర్లకు పే చేస్తున్నారు. ‘నేను సందేహాలు తీరుస్తూ పాఠాలు చెబుతాను. అది అందరికీ నచ్చుతోంది’ అంటోంది విశ్వతిక. ఇంగ్లిష్ నేర్చుకుని విశ్వతిక కంప్యూటర్ చదువులో మంచి తెలివున్న విద్యార్థిని. ప్రోగ్రామ్స్ రాస్తుంది. అలాగే ఇంగ్లిష్ కూడా ముఖ్యమని తెలుసు. అందుకే చెన్నై బ్రిటిష్ కౌన్సిల్ నుంచి షార్ట్టర్మ్ కోర్సు చేసింది. ‘అయితే వివిధ దేశాలలోని విద్యార్థుల ఉచ్చరణ నా ఉచ్చరణ వేరు. అయితే అది నా పాఠాలకు అడ్డు కాలేదు’ అంటుంది విశ్వతిక. ఆమె గట్టిగా 20 దాటలేదు. ఇప్పటికే రెండు ఫార్మసూటికల్ సంస్థల కోసం సాఫ్ట్వేర్ తయారు చేసి ఇచ్చింది. అంతేనా? ఆరు మంది ఎం.బి.ఏ గ్రాడ్యుయేట్స్ను తన ప్రాడక్ట్స్ అమ్మేందుకు ఉద్యోగులుగా కూడా పెట్టుకుంది. ‘ఆన్లైన్ క్లాసులకు చాలా భవిష్యత్తు ఉంది. రాబోయే రోజుల్లో గుర్తింపు పొందిన ఆన్లైన్ స్కూళ్లు వస్తాయి. విద్యార్థులు వాటిలో చదువుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న స్కూళ్లు ఇక మీదట పిల్లలు కేవలం కంప్యూటర్లలోనే చూస్తారు’ అని జోస్యం చెబుతోంది విశ్వతిక. తెలివి ఒకరి సొత్తు కాదు. ఉన్న తెలివిని ఉపయోగించే మార్గాలు కొత్తగా అన్వేషించడమే మన పని అని దారి చూపుతోంది విశ్వతిక. – సాక్షి ఫ్యామిలీ -
‘టికెట్ ఇచ్చినందుకు థ్యాంక్స్.. కానీ పోటీ చేయను’
తిరువనంతపురం: వచ్చే నెల కేరళలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలన్ని తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసున్నాయి. బీజేపీ ఆదివారం తన క్యాండెట్స్ లిస్ట్ని విడుదల చేసింది. అయితే ఆశ్చర్యంగా ఈ లిస్ట్లో ఓ సామన్యుడి పేరు ప్రకటించింది. వయనాడ్ జిల్లాలోని మనంతవాడి నియోజకవర్గం నుంచి ఎంబీఏ గ్రాడ్యుయేట్ మణికుట్టన్ బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై సోషల్ మీడియాలో నిన్న అంతా ఒకటే చర్చ. ఎవరీ మణికుట్టన్.. బీజేపీ తన అభ్యర్థిగా అతడిని ఎందుకు ప్రకటించింది అనే దాని గురించి రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. వీటిపై తాజాగా మణికుట్టన్ స్పందించారు. బీజేపీ అభ్యర్థుల జాబితాలో తన పేరు చూసి ఆశ్చర్యపోయానని.. రాజకీయాలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. తన పేరు ఎందుకు ప్రకటించారో ఇంకా తనకు అర్థం కావడం లేదని.. కానీ తాను మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా మణికుట్టన్ మాట్లాడుతూ.. ‘‘కేంద్ర బీజేపీ నాయకత్వం తమ అభ్యర్థిగా నా పేరు ప్రకటించింది. నేనొక సాధారణ పౌరుడిని. అలాంటిది టీవీలో బీజేపీ అభ్యర్థుల జాబితాలో నా పేరు రావడం చూసి ఆశ్చర్య పోయాను.. చాలా భయపడ్డాను కూడా. ఆ తర్వాత పనియా సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినందకు చాలా సంతోషపడ్డాను. అయితే రాజకీయాల్లోకి రావాలని నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. ఉద్యోగం, కుటుంబం ఇదే నా ప్రపంచం. అందుకే బీజేపీ ఇచ్చిన అవకాశాన్ని నేను వినమ్రంగా తిరస్కరిస్తున్నాను. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. బీజేపీ నాయకులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశాను అన్నారు. గత ఎన్నికల్లో కేరళలో బీజేపీ కేవలం ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది. ఈ సారి ఈ సంఖ్యను పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో మ్యాన్ ఈ. శ్రీధరన్ పేరును ప్రకటించింది బీజేపీ. ఆయన క్లీన్ ఇమేజ్ తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. ఏప్రిల్ 6న కేరళలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. మే 2న లెక్కిస్తారు. చదవండి: అత్తింటి వేధింపులు: బీజేపీ ఎంపీ కోడలి ఆత్మహత్యాయత్నం కేరళ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల -
ఉద్యోగ నైపుణ్యాలపై కోవిడ్ దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: విద్యా, ఉద్యోగ అవకాశాలపై కరోనా దెబ్బ తీవ్రంగా పడింది. ముఖ్యంగా ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు, సామర్థ్యాలపై ప్రభావం చూపనుంది. దీంతో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 2.18 శాతం మేరకు ఉద్యోగ సామర్థ్యాలు తగ్గినట్లు వీబాక్స్ సర్వే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, టాగ్డ్ సంస్థ రూపొందించిన ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్–2021’లో వెల్లడించింది. కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా పరిశ్రమల అవసరాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల్లో అందుకు అవసరమైన సామర్థ్యా లు, వాటిపై కరోనా ప్రభావం వంటి అంశాలపై వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులు, 15 పరిశ్రమలను, 150కి పైగా కార్పొరేట్ సంస్థలను సంప్రదించింది. పలు అంశాలపై అధ్యయనం చేసి ఐఎస్ఆర్–2021ను రూపొందించింది. కరోనా ప్రభావం, ఇతరత్రా కారణాలతో 2020 కంటే 2021లో ఉద్యోగ అర్హత ఉన్నవారు దేశ వ్యాప్తంగా 0.31 శాతం తగ్గనున్నట్లు పేర్కొంది. 2019లో 47.38 శాతం ఉద్యోగ అర్హులున్నట్లు అంచనా వేయగా, 2020లో ఉద్యోగార్హత ఉన్నవారు 46.21 శాతం ఉండగా, 2021లో 45.9 శాతం ఉంటారని పేర్కొంది. ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు దెబ్బ.. కరోనా ప్రభావం ఎంబీఏ గ్రాడ్యుయేట్లపైనా తీవ్రంగా పడింది. ఉద్యోగ సామర్థ్యాలు ఎంబీఏ విద్యార్థుల్లో 2020లో 54 శాతం ఉంటే 2021లో 46.59 శాతానికి తగ్గిపోతాయని అంచనా వేసింది. ఆ తర్వాత బీకాం గ్రాడ్యుయేట్లపైనా అధిక ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 2.18 శాతం ఉద్యోగ నైపుణ్యాలు తగ్గిపోనున్నట్లు వెల్లడించింది. 2020లో 49 శాతం మంది బీఈ/బీటెక్ విద్యార్థుల్లో ఉద్యోగ సామర్థ్యాలు ఉండగా, 2021లో 46.82 శాతం మంది విద్యార్థుల్లోనే ఉద్యోగ సామర్థ్యాలు ఉంటాయని అంచనా వేసింది. ముందు వరుసలో హైదరాబాద్.. అత్యధిక ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన విద్యార్థులున్న పట్టణాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంది. ఆ తర్వాత బెంగళూరు, పుణే, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, కోయంబత్తూరు, నెల్లూరు, గుర్గావ్, మంగళూరు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉన్నాయి. తెలంగాణ 7వ స్థానంలో ఉంది. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న పట్టణాల జాబితాలో మొదటి స్థానంలో మహారాష్ట్ర, కర్ణాటక ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ కల్పన అవకాశాలను పెంచుకున్నట్లు వెల్లడించింది. ఉద్యోగ, ఉపాధి వనరులు ఎక్కువ కలిగిన నగరాల్లో ముంబై ముందు వరుసలో ఉండ గా, 60 శాతానికిపైగా స్కోర్తో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. అధిక ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులున్న రాష్ట్రాలు రాష్ట్రం ఉద్యోగ నైపుణ్యాలున్న వారి శాతం మహారాష్ట్ర 64.17 తమిళనాడు 60.97 ఉత్తరప్రదేశ్ 56.55 కర్ణాటక 51.21 ఆంధ్రప్రదేశ్ 48.18 ఢిల్లీ 42.57 తెలంగాణ 41.31 గుజరాత్ 36.68 పశ్చిమబెంగాల్ 35.72 రాజస్తాన్ 31.87 కోర్సుల వారీగా ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులు (శాతం) కోర్సు 2019 2020 2021 బీఈ/బీటెక్ 57.09 49 46.82 ఎంబీఏ 36.44 54 46.59 బీఏ 29.3 48 42.72 బీకాం 30.06 47 40.3 బీఎస్సీ 47.37 34 30.34 ఎంసీఏ 43.19 25 22.42 పాలిటెక్నిక్ 18.05 32 25.02 బీఫార్మసీ 36.29 45 37.24 -
చదివింది ఎంబీఏ.. చేసేది పార్ట్టైమ్ చోరీలు
సాక్షి, జగ్గంపేట: తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదించాలన్న ఆలోచన, జల్సాలకు అలవాటు పడి, చదువుకున్న చదువును కాదని నేర ప్రవృత్తిని ఎంచుకున్న యువకుడు చోరీలకు పాల్పడతూ పోలీసులకు చిక్కాడు. ఇతడి వద్ద నుంచి పోలీసులు రూ.రెండు లక్షల విలువైన 52 గ్రాముల బంగారం, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు జగ్గంపేట పోలీసుస్టేషన్లో మంగళవారం వివరాలు వెల్లడించారు. జగ్గంపేటకు చెందిన మేడిశెట్టి మణికంఠ అనే యువకుడు పాత నేరస్తుడు. ఇతను ఎంబీఏ వరకు విశాఖపట్టణంలో చదివి పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ నేరాలు కూడా పార్ట్టైమ్గా ప్రారంభించాడు. 2016లో విశాఖలోని మువ్వలపాలెం పోలీసుస్టేషన్లో మొదటి కేసు నమోదైంది. 2018లో మరో మూడు కేసుల్లో మణికంఠ ముద్దాయిగా ఉన్నాడు. కొంతకాలం క్రితం హైదరాబాద్ పారిపోయాడు. గత జూలైలో జగ్గంపేటలో జరిగిన పలు నేరాలు, చోరీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగ్గంపేటలో ఈనెల రెండో తేదీ సోమవారం పాత నేరస్తుడు మణికంఠ కానిస్టేబుళ్ల కంటపడడంతో జగ్గంపేట ఎస్సై రామకృష్ణ బృందం పట్టుకున్నారు. జగ్గంపేటలో జరిగిన రెండు నేరాలతో పాటు మరికొన్ని నేరాలకు సంబంధించిన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. పాతనేరస్తుడిని చాకచక్యంగా పట్టుకోవడంలో చొరవ చూపిన జగ్గంపేట హోంగార్డు కొండబాబుకు రూ.రెండు వేల రివార్డు అందించారు. జగ్గంపేట ఎస్సై రామకృష్ణను అభినందించారు. కార్యక్రమంలో జగ్గంపేట ఎస్సై రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
నేరానికో సెల్ ఫోన్– కొత్త సిమ్ కార్డు
బంజారాహిల్స్: అతనో ఉన్నత విద్యావంతుడు..ఎంబీఏ పూర్తి చేశాడు.. జల్సాలకు అలవాటు పడి అప్పుల పాలై వాటిని తీర్చుకునేందుకు మోసాలకు తెరలేపాడు. గత రెండు నెలలుగా పూణే పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న డాలర్ మోసగాడిని బంజారాహిల్స్ క్రైం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ముంబైలోని మలబార్ హిల్స్ 98 నిపినాసియా రోడ్డులోని శాంతినగర్లో ఉంటున్న రాహుల్ కిరణ్ ఘాటియా అలియాస్ నిఖిల్(31) ఎంబీఏ చదివాడు. అనంతరం మూడు కంపెనీలు ప్రారంభించాడు. అన్నిట్లోనూ నష్టాలే వచ్చాయి. ఒక వైపు జల్సాలకు అలవాటు పడి మరోవైపు వ్యాపారంలో నష్టాల కారణంగా అప్పులపాలయ్యాడు. దాదాపు రూ. 50 లక్షలు అప్పులు చేశాడు. వీటిని తీర్చుకునేందుకు మోసాలకు తెరలేపాడు. అందులో భాగంగానే డాలర్ ఎక్సైంజ్ పేరుతో మోసాలకు శ్రీకారం చుట్టాడు. గత నెల 26న బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని స్టార్ ఆస్పత్రి సమీపంలోని అట్లాస్ అపార్ట్మెంట్స్లో ఓ ప్లాట్ అద్దెకు తీసుకున్నాడు. జస్ట్ డయల్ ద్వారా ఓ మనీ ఎక్సైంజ్ సెంటర్కు ఫోన్ చేసిన అతను తనకు 7 వేల డాలర్లు కావాలని కోరాడు. డాలర్లు తీసుకొని వచ్చిన శ్రీధర్గౌడ్ నుంచి వాటిని తీసుకొని నగదు తెస్తానంటూ లోపలికి వెళ్లిన నిఖిల్ అటు నుంచి అటే జారుకున్నాడు. అదే రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ వైపు పోలీసులు అతడికోసం గాలిస్తుండగానే ఈ నెల 3న బంజారాహిల్స్లోని శాంతానివాస్లో ప్లాట్ అద్దెకు తీసుకున్న అతను మరో ఎక్సైంజ్ సంస్థకు ఫోన్ చేసి 7 వేల డాలర్లు కావాలని కోరాడు. మహేష్ అనే వ్యక్తి డాలర్లు తీసుకుని అక్కడికి రాగా వాటిని తీసుకొని నగదు ఇస్తానంటూ లోపలికి వెళ్లి జారుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ క్రైం పోలీసులు పక్కా నిఘా వేశారు. ఇందుకుగాను టెక్నాలజీని వినియోగించిన పోలీసులు నగరంలోని అన్ని ఫోరెక్స్ ఎక్సైంజ్ సంస్థలకు ఈ తరహా మోసాలపై సమాచారం అందించారు. మూడు రోజుల క్రితం మళ్లీ ఇదే తరహాలో ఓ సంస్థకు ఫోన్ రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వలపన్ని నిందితుడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. గత నెల 8, 20 తేదీల్లో పూణేలో కూడా ఇదే తరహాలో డాలర్లు కావాలంటూ ఫోన్ చేసి వాటితో ఉడాయించినట్లు విచారణలో వెల్లడైంది. కోల్కతాలోనూ అతడిపై చెక్బౌన్స్ కేసు ఉన్నట్లు తెలిపారు. నెల రోజుల వ్యవధిలో పూణే, హైదరాబాద్లో నాలుగు చోట్ల డాలర్ కేసులు నమోదయ్యాయి. కాగా పూణే పోలీసులు గత నెల 3 నుంచి నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే బంజారాహిల్స్ క్రైం పోలీసులు నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసి అతడి నుంచి రూ.7.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన బంజారాహిల్స్ క్రైం ఎస్ఐ భరత్ భూషణ్ను డీసీపీ అభినందించారు. సమావేశంలో ఏసీపీ కే.ఎస్.రావు, ఇన్స్పెక్టర్ ఆర్. కళింగరావు తదితరులు పాల్గొన్నారు. నేరానికో సెల్ ఫోన్– కొత్త సిమ్ కార్డు నిందితుడు రాహుల్ కిరణ్ అలియాస్ నిఖిల్ ఓ సారి మోసానికి పాల్పడిన అనంతరం అందుకు వినియోగించిన సెల్ఫోన్, సిమ్కార్డులను వాడడు. డాలర్లతో ఉడాయించిన మరుక్షణమే ఈ సెల్ఫోన్ను బద్దలు కొట్టి సిమ్కార్డును జేబులో వేసుకుంటాడు. ఇలా నెల రోజుల వ్యవధిలోనే నాలుగు సెల్ఫోన్లు, నాలుగు సిమ్కార్డులు వినియోగించాడు. పోలీసులకు చిక్కకుండా ఈ తరహా సిమ్లు వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదిలా ఉండగా తనను ఎవరూ గుర్తు పట్టకుండాముఖానికి సగం వరకు మాస్క్ ధరించే ఇతను నకిలీ గుర్తింపు కార్డులతో మోసాలకు పాల్పడుతుంటాడని తెలిపారు. -
ఎంబీఏ జాబ్రూటు ఇంజనీరింగ్ వెనకబాటు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏటా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఇంజనీరింగ్ (బీఈ/బీటెక్)లో ఎక్కువగా ఉండగా, ఉద్యోగానికి కావాల్సిన ప్రతిభా వారిలోనే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 2019లోనూ ఇంజనీరింగ్ విద్యార్థులే ఎక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాల విషయంలో వారు వెనుకబడిపోయారు. 2019లో ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఎంబీఏ విద్యార్థుల్లో ఎక్కువగా ఉన్నట్లు ఇండియా స్కిల్ రిపోర్టు–2020లో వెల్లడైంది. 2019 జూలై నుంచి నవంబర్ వరకు నేషనల్ ఎంప్లాయిబిలిటీ టెస్టు సర్వేను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సహకారంతో ది వీ బాక్స్ నిర్వహించింది. ఇండియా స్కిల్ రిపోర్టు–2020 పేరుతో ఆ నివేదికను విడుదల చేసింది. సంఖ్య పెరిగింది.. నైపుణ్యం తగ్గింది.. దేశంలోని 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3 లక్షల మంది విద్యార్థులను, వివిధ రంగాలకు చెందిన 150 కంపెనీలను కలసి చేసిన సర్వే నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. 2018లో ఉన్నత విద్యను చదివే విద్యార్థుల్లో బీఈ/బీటెక్ వారు 23 శాతం ఉన్నారు. మిగతా వారంతా ఇతర కోర్సుల్లో ఉన్నారు. 2019కి వచ్చే సరికి ఉన్నత విద్యను చదివే విద్యార్థుల్లో ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య 31 శాతానికి పెరిగింది. ఉద్యోగానికి కావాల్సి ప్రతిభ ఇంజనీరింగ్ చదివే వారిలో తక్కువ మందిలో ఉన్నట్లు తేలింది. 2018లో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 57.09% మందిలో ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నట్లు వెల్లడి కాగా, 2019లో మాత్రం ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్న విద్యార్థుల సంఖ్య 49 శాతానికి పడిపోయింది. ఇక 2018 సంవత్సరంలో ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో ఎంబీఏ విద్యార్థులు 13 శాతం ఉంటే, 2019లో వారి సంఖ్య 17 శాతానికి పెరిగింది. ఇక నైపుణ్యాల విషయానికి వస్తే 2018లో ఎంబీఏ ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్న వారి సంఖ్య 36.44%ఉండగా 2019లో ఎంబీఏ విద్యార్థుల్లో ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్న వారి సంఖ్య 54 శాతానికి పెరిగినట్లు తేల్చింది. -
అమెరికాలో ఎంబీఏకు గడ్డుకాలం
ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు, చైనాతో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాలోని ప్రఖ్యాత బిజినెస్ స్కూల్స్ విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఈ ఏడాది ఆయా బిజినెస్ స్కూళ్లలో విద్యార్థుల అడ్మిషన్లు గణనీయమైన సంఖ్యలో తగ్గిపోయాయి. హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తదితర అమెరికా అగ్రస్థాయి విద్యాసంస్థల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వీటి అనుబంధ బిజినెస్ స్కూళ్లలో ప్రతి ఏడాది అడ్మిషన్ దరఖాస్తుల సంఖ్య తగ్గిపోతోంది. డార్ట్మౌత్ కాలేజీకి చెందిన టక్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో దరఖాస్తుల సంఖ్య ఏకంగా రెండంకెల శాతానికి పడిపోయింది. చదవండి: హెచ్-1బీ వీసాలు: ట్రంప్కు సంచలన లేఖ వరుసగా ఐదో ఏడాది కూడా అమెరికాలో ఎంబీఏ కోర్సు దరఖాస్తుల సంఖ్య పడిపోయింది. గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ కౌన్సిల్ విశ్లేషణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. బిజినెస్ స్కూల్స్ అసోసియేషన్ అయిన ఈ స్వచ్ఛంద సంస్థ.. జీమ్యాట్ అడ్మిషన్స్ టెస్టు నిర్వహిస్తుంది. ప్రస్తుత వేసవికాలంలో ముగిసే విద్యా సంవత్సరానికిగాను అమెరికా బిజినెస్ స్కూళ్లకు విద్యార్థుల నుంచి 1,35,096 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో సంప్రదాయ ఎంబీఏ కోర్సు దరఖాస్తులు కూడా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే గత ఏడాది కన్నా దరఖాస్తులు 9.1శాతం పడిపోయాయి. గత ఏడాది కూడా బిజినెస్ కోర్సుల దరఖాస్తుల్లో 7శాతం తగ్గుదల నమోదైంది. ఒకప్పుడు విదేశీ విద్యార్థులు పెద్దసంఖ్యలో అమెరికాలో ఎంబీఏ కోర్సు చేసేందుకు ఉత్సాహం చూపేవారు. అగ్రరాజ్యంలో ఎంబీఏ చేస్తే.. ఆ దేశ ప్రముఖ కంపెనీల్లో అత్యున్నత మేనేజ్మెంట్ హోదాలో ఉద్యోగం సంపాదించవచ్చునని, తద్వారా కంపెనీ నాయకత్వ దశకు ఎదుగుతూ.. భారీ వేతనాలు అందుకోవచ్చునని ఆశించేవారు. కానీ, ఇటీవల చేపట్టిన ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు, చైనాతో రాజకీయ, వాణిజ్య ఘర్షణలు, టెక్నాలజీ పరిశ్రమ ఉద్యోగాలు ఎక్కువ ఆకర్షణీయంగా ఉండటంతో అమెరికాలో ఎంబీఏ చేసే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతూ వస్తోంది. రెండేళ్ల ఎంబీఏ కోర్సుకు అంతగా డిమాండ్ లేకపోవడం, ఉద్యోగావకాశాలు క్రమంగా తగ్గడం, దీనికితోడు అండర్ గ్రాడ్యుయేట్ రుణభారాలతో మినినీయల్స్ సతమతమవుతుండటంతో ఒకింత ఖరీదైన ఎంబీఐ కోర్సును చేసేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఎంబీఏ(గోల్డ్మెడలిస్ట్) చోరీల బాట..
సాక్షి, సిటీబ్యూరో: అతనో ఉన్నత విద్యావంతుడు. ఎంబీఏ(హెచ్ఆర్) గోల్డ్ మెడలిస్ట్. జల్సాలకు అలవాటుపడిన అతను చోరీలు ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. నాలుగుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా తన పంథా మర్చుకోలేదు. గతేడాది ఆగస్టులో చర్లపలి జైలు నుంచి విడుదలైన తర్వాత పది ఇల్లల్లో పంజా విసిరాడు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఘరానా దొంగను సైబరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.1,50,000 నగదు, 80 తులాల బంగారు ఆభరణాలు, బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బుధవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శినితో కలిసి సీపీ వీసీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. పీడీ యాక్ట్ ప్రయోగించినా.. ప్రకాశం జిల్లా, వేటపాలెం ప్రాంతానికి చెందిన చెందిన వంశీ కృష్ణ 2004లో ఎంబీఏ (హెచ్ఆర్)లో గోల్డ్మెడల్ సాధించాడు. ఆర్థికంగా స్థితిమంతుడైనా స్నేహితులతో కలిసి చెడువ్యసనాలకు అలవాటు పడిన అతను విలాసాల కోసం చోరీల బాట పట్టాడు. వీధుల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించేవాడు. అదను చూసుకుని కటింగ్ ప్లేయర్తో తాళాలు పగులగొట్టి ఇల్లల్లోకి చొరబడి నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లేవాడు. 2006లో ఆరు ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన ఇతను తొలిసారిగా సరూర్నగర్ పోలీసులకు చిక్కాడు. 18 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 2009లో మరో 7 కేసుల్లో సరూర్నగర్ పోలీసులు అతడిని అరెస్టు చేయడంతో 20 నెలల పాటు ఊచలు లెక్కపెట్టాడు. మరోసారి బాలానగర్ పోలీసులకు చిక్కి ఎనిమిది నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. బయటకి వచ్చిన అనంతరం ఏకంగా 13 చోరీలకు పాల్పడటంతో ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీంతో 21 నెలలు జైల్లోనే ఉన్నాడు. గతేడాది ఆగస్టు 18న జైలు నుంచి బయటకు వచ్చిన వంశీ కృష్ణపై సస్పెక్ట్ హిస్టరీ షిట్ తెరిచి నిఘా ఉంచారు. దీంతో పోలీసుల దృష్టిలో పడకుండా ఉండేందుకు వివిధ నగరాలకు వెళ్లి అక్కడే ఉంటూ మధ్యలో వచ్చి జీడిమెట్లలో రెండు, నాచారంలో రెండు, చిక్కడపల్లిలో రెండు, ఎస్ఆర్నగర్లో రెండు, మారేడ్పల్లిలో ఒకటి, కాచిగూడలో ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. సంఘటనాస్థలంలో లభించిన వేలిముద్రల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని పర్యవేక్షణలో బాలానగర్ సీసీఎస్ పోలీసులను రంగంలోకి దింపారు. బుధవారం నిందితుడిని జీడిమెట్లలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
21న టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించబోయే టీఎస్ఐసెట్–2019 షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య టి.పాపిరెడ్డి విడుదల చేశారు. ఐసెట్ షెడ్యూల్ వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 21న నోటిఫికేషన్ను విడుదల చేస్తామని, మార్చి 7 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.450, ఇతరులు రూ.650 చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తుల స్వీకరణ రిజిస్ట్రేషన్కు అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 29 వరకు ఉంటుందని పేర్కొన్నారు. రూ.500 అపరాధ రుసుముతో మే 6 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో మే 11 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో మే 15 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో మే 18 వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం ఉం దని వివరించారు. మే 9 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షలు మే 23, 24 తేదీల్లో 3 సెషన్లలో నిర్వహిస్తారని తెలిపారు. ఎక్కువ మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరో సెషన్ నిర్వహిస్తామని, తక్కువగా వస్తే 3 సెషన్లలోనే జరుపుతామన్నా రు. ప్రిలిమినరీ కీ మే 29న విడుదల చేస్తామన్నారు. ఫలితాలను జూన్ 13న విడుదల చేస్తామని వెల్లడించారు. -
స్వీపర్ కొలువుకు ఎంబీఏ, బీటెక్ గ్రాడ్యూయేట్లు
చెన్నై : దేశంలో నిరుద్యోగం రాజ్యమేలుతుంది. లక్షల్లో యువత డిగ్రీలు, ఎంబీఏలు, బీటెక్లు చదివి.. కొలువుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ జారీ అయిన లక్షల్లో అప్లై చేస్తారు. చదివిన చదువుకు, కొలువుకు సంబంధం ఉండటం లేదు. ఆఖరికి స్వీపర్ పోస్టు కోసం వందల్లో పట్టభద్రులు అప్లై చేశారంటే.. నిరుద్యోగం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. వివరాలు.. తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్లో స్వీపర్, సానిటరీ కార్మికుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టులకు ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్ల నుంచి వందల దరఖాస్తులు వచ్చి పడ్డాయి. వీరితో పాటు డిప్లామో పట్టా పొందిన వారు కూడా స్వీపర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 10 స్వీపర్ పోస్టులు, 4 శానిటరీ కార్మికుల పోస్టులకు గాను గత ఏడాది సెప్టెంబర్ 26న తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్ దరఖాస్తులను ఆహ్వానించింది. సంబంధిత విభాగంలో అనుభవం ఉంటే సరిపోతుందని పేర్కొంది. దీంతో ఎంప్లాయిమెంట్ ఎక్సైంజ్తో సహా మొత్తం 4,607 దరఖాస్తులు అందాయి. వీరిలో డిగ్రీలు, ఎంబీఏలు, బీటెక్లు చదివిన వారు కూడా ఉన్నారు. ఇలా వచ్చిన దరఖాస్తుల్లో సరైన వివరాలు నమోదు చేయనందున దాదాపు 677 మంది దరఖాస్తులను సంబంధిత అధికారులు తిరస్కరించారు. స్వీపర్ ఉద్యోగాలకు కూడా డిగ్రీలు, పీజీలు చదివిన వారు అప్లై చేసుకోవడంతో... అధికారులు సైతం అవాక్కయ్యారు. -
ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య
ప్రకాశం జిల్లా / బేస్తవారిపేట: ఎంబీఓ మొదటి సంవత్సరం చదువుతున్న బిక్కా కల్పన (21) కడుపునొప్పి భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన స్థానిక అచ్చిరెడ్డి కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అచ్చిరెడ్డి కాలనీకి చెందిన బిక్కా నరసింహారెడ్డి పెద్ద కుమార్తె కల్పన మార్కాపురంలో ఎంబీఏ చదువుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల నుంచి ఆమె తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. చదువుకునేందుకంటూ కల్పన బెడ్రూమ్లోకి వెళ్లి తలుపునకు గడియ పెట్టుకుంది. అర్ధరాత్రి మిగిలిన కుటుంబ సభ్యులు బాత్రూమ్కు వెళ్లేందుకు ఎంతసేపు తలుపుకొట్టినా తీయలేదు. అనుమానం వచ్చి గడ్డపారతో తలుపు పగులగొట్టారు. అప్పటికే కల్పన తన చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జనవరిలో సెట్స్ షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) షెడ్యూల్పై కసరత్తు మొదలైంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్ జారీ చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. గతంలో దేశం మొత్తం ఒకే రకమైన కోర్సులో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేసింది. అలాగే జేఈఈ మెయిన్ ద్వారానే ఇంజనీరింగ్ ప్రవేశాలను 2019–20 విద్యా సంవత్సరం నుంచి చేపట్టాలని ప్రయత్నించింది. అయితే దీనిపై ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడం, మరోవైపు జేఈఈ మెయిన్ నిర్వహణకు సెప్టెంబర్లోనే నోటిఫికేషన్ జారీ అవ్వడంతో ఉన్నత విద్యా మండలి ఈసారి ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో సెట్స్ షెడ్యూల్ జారీ చేయనుంది. ఈలోగా అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లతో ఓసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. అనంతరం ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, ఎల్ఎల్బీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్సెట్, లాసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసి ప్రకటించాలని భావిస్తోంది. ముఖ్యంగా ఎంసెట్ను ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటి వారంలో నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేయాలని యోచిస్తోంది. -
ఉద్యోగం తెచ్చుకోమన్నారని ..ఆత్మహత్య
కదిరి అర్బన్: మొటుకుపల్లితండా గ్రామానికి చెందిన గోవర్దన్(24) అనే ఎంబీఏ విద్యార్థి మంగళవారం అర్ధరాత్రి పురుగుమందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ ఎస్ఐ వెంకటస్వామి తెలిపిన మేరకు వివరాలిలాఉన్నాయి. బాగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకో అంటూ గోవర్దన్ను తల్లిదండ్రులు రత్నమ్మ సుధాకర్లు మంగళవారం రాత్రి మందలించారు. దీంతో మనస్తాపం చెందిన గోవర్దన్ పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బత్తలపల్లికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. -
ఎంబీఏ విద్యార్థి లోకేష్ అనుమానాస్పద మృతి
నెల్లూరు, దొరవారిసత్రం: కుటుంబానికి తన కుమారుడు అండగా ఉంటాడని భావించిన ఆ తండ్రిని విధి చిన్నచూపు చూసింది. ఏం జరిగిందో గానీ ఎంబీఏ ఆఖరి సంవత్సరం చదువుతున్న సర్వేపల్లి లోకేష్ (21) ఇంటినుంచి వెళ్లిపోయిన నాలుగురోజుల తర్వాత అటవీ ప్రాంతంలో శవమై కనిపించాడు. పోలీసులు, గ్రామస్తులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కల్లూరు గ్రామానికి చెందిన సర్వేపల్లి భాస్కర్, గౌరీ దంపతులకు లోకేష్, సౌజన్య సంతానం. గౌరీ అనారోగ్యంతో ఐదేళ్ల ఏళ్ల క్రితం మృతిచెందింది. భాస్కర్ మూడేళ్ల క్రితం కుమార్తెకు వివాహం చేశాడు. లోకేష్ సూళ్లూరుపేటలో ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 10వ తేదీన అతను కాలేజీకి వెళ్లాడు. తర్వాత ఇంటికి వచ్చి సాయంత్రం నాలుగు గంటల వచ్చి లుంగీ కట్టుకుని వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో భాస్కర్ గ్రామస్తుల సాయంతో రెండురోజులు పాటు వెతికాడు. ఆచూకి లేకపోవడంతో 12వ తేదీన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 13వ తేదీ గురువారం సాయంత్రం గ్రామానికి సమీపంలో అటవీ ప్రాంతంలో తెలుగుగంగ 14ఆర్ మేజర్ కాలువ దగ్గర ఓ వ్యక్తి గేదెలను మేపుతున్న సమయంలో మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులకు చెప్పారు. మృతదేహం బాగా ఉబ్బిపోయి ఉండటంతో దుస్తులను బట్టి లోకేష్గా గుర్తించారు. సమాచారం అందుకున్న నాయుడుపేట సీఐ మల్లికార్జునరావు, ఎస్సై ఎం.వెంకట్రావ్ ఘటనా స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. శవపంచనామ నిమిత్తం మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
హనుమాన్ జంక్షన్ పీఎస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద బుదవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాలోని గన్నవరం మండలం వీరపనేని గూడెంకు చెందిన బండి సతీష్ రెడ్డిని అనే ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్ చేయడంపై గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘర్షణలకు సంబంధంలేని వ్యక్తులను అరెస్టు చేయడంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. గత ఆదివారం రాత్రి బాపులపాడు మండలం కె. సీతారామపురం గ్రామంలో జరిగిన వివాదంతో సంబంధం లేని సతీష్రెడ్డిని అరెస్ట్ చేయడం ఏంటని నేతలు ప్రశ్నించారు. పైగా ఈ రోజు అతనికి పరీక్షలు ఉన్నాయని చెప్పినా పోలీసులు విడిచి పెట్టకపోవడం దారుణమన్నారు. వెంటనే సతీష్ రెడ్డిని విడుదల చేసి, విద్యార్థులపై అక్రమంగా పెట్టిన ఎసీ, ఎస్టీ, అట్రాసీటి కేసులను ఎత్తివేయాలన్నారు. లేనిపక్షంలో ఆమరణ దీక్షకు దిగుతామని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. చదవండి : టీడీపీ నేతల దౌర్జన్యకాండ -
ఉద్యోగం దొరకలేదని చోరీ
సాక్షి,అన్నానగర్ : ఉద్యోగం దొరకలేదని విరక్తితో ఎంబీఏ పట్టభద్రుడు 12 సవర్ల నగలను చోరీ చేశాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై తిరువికనగర్ ప్రభు వీధికి చెందిన అరివళగన్. ఇతను కుటుంబంతో మంగళవారం బయటికి వెళ్లి ఇంటికి వచ్చాడు. అప్పుడు తలుపులు తెరచి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న 12 సవర్ల నగలు చోరీ అయినట్టు తెలిసింది. అరివళగన్ తిరువికనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సహాయ కమిషనర్ హరికుమార్ ఆధ్వర్యంలో సీఐ రమణి, పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేశారు. అప్పుడు బీరువాలో ఉన్న రూ. 70వేలు నగదు చోరీకి గురికాలేదు. దీంతో అరివళగన్కి తెలిసిన వారు ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానించారు. బాడుగకు ఉన్నవారి వద్ద పోలీసులు విచారణ చేశారు. అప్పుడు తూత్తుకుడి జిల్లా ఉడన్కుడికి చెందిన ఇళమదిని పోలీసులు విచారణ చేశారు. విచారణలో అతను నగలు చోరీ చేసినట్లు నేరం అంగీకరించాడు. పోలీసుల విచారణలో ఇళమది ఎంబీఏ చదివి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఇతను అరిశలగన్ ఇంట్లో మూడు నెలల ముందు బాడుగకు చేరాడు. అరివళగన్ లగ్జరీ జీవితం చూసిన ఇళమది అతని ఇంట్లో చోరీ చేయాలని పథకం వేశాడు. దీని ప్రకారం మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నగలను చోరీ చేసిన ఇళమది వాటిని తన భార్యకు ఇచ్చాడు. భార్య మందలిచ్చి తీసిన స్థలంలో నగలను పెట్టాలని బుద్ధి చెప్పింది. నగలను బీరువాలో పెట్టడానికి ఇళమది వెళ్లేలోపు అరివళగన్ వచ్చాడు. దీంతో నగలను ఓ బంధువు వద్ద ఇచ్చి ఇళమది ఇంటికి వచ్చాడు. ఫిర్యాదు ఇచ్చిన ఆరుగంటల సమయంలోనే ఇళమదిని అరెస్టు చేసి నగలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
మంచి జన్మించిన రోజు
ట్రినా దత్తా బెంగాలీ అమ్మాయి. కోల్కతాలో పుట్టింది. ఎం.బి.ఎ చదివింది. అది కూడా ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో. ఇప్పుడు నైజీరియాలో ఉద్యోగం చేస్తోంది. పుట్టిన రోజు సొంత నేల మీద చేసుకోవాలనుకుంది. మొన్న (జూన్ 9) ఆమె పుట్టిన రోజు . ముప్పయ్యవ పుట్టిన రోజు. అంతకు కొన్ని రోజుల ముందే.. కోల్కతాలో దిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కంటపడిన దృశ్యాలు ఆమెని ఆలోచనలో పడేశాయి. అవి అంతకుముందు కూడా చూసినవే. ఇప్పుడు బయట దేశాన్ని చూసి వచ్చిన తర్వాత అవే దృశ్యాలు తీవ్రమైన ఆవేదనకు గురిచే శాయి ఆమెను. ముప్పై మందికి కొత్త జీవితం పుట్టిన రోజులకు నగరంలో ఒకవైపు కేక్లు, పేస్ట్రీలు, స్నేహితులు, బంధువులతో విందుల్లో మునిగి తేలుతున్నారు. అదే నగరంలో మరోవైపు పెద్ద ఇళ్ల సందుల్లో చిన్న గుడారాల్లో అర్ధాకలితో అలమటించేవాళ్లూ ఉన్నారు. బిడ్డ ఆకలి తీర్చడానికి చెయ్యి చాచే తల్లులున్నారు. ఆ ఆడవాళ్లలో ఎక్కువ భాగం ట్రాఫికింగ్ బాధితులే. అవన్నీ చూసిన ట్రినాకు ఓ ఆలోచన వచ్చింది. తన ముప్పయ్యవ పుట్టినరోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలని. బంధువులు, స్నేహితులు ఖరీదైన బహుమతులతో తనను సర్ప్రైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తన పుట్టిన రోజు తనకు మాత్రమే కాదు, తన వాళ్లకు కూడా స్వీట్ మెమొరీగా ఉండాలి. ఖర్చు చేసే ప్రతి రూపాయి మరొకరి జీవితాన్ని బాగు చేయాలి... ఇదీ ఆమెకు వచ్చిన కొత్త ఆలోచన. ట్రాఫికింగ్ బారి నుంచి బయటపడిన మహిళల్లో ముప్పయ్ మందికి కొత్త జీవితాన్నివ్వడానికి తన వంతు సహకారం అందివ్వాలనుకుంది. ఒక్కొక్కరికి ఫీజు ఏడు వేలు అక్రమ రవాణా విషవలయం నుంచి బయటపడిన ఆడవాళ్లకు ఆశ్రయం కల్పించి వారికి ఉపాధి కల్పించే ఎన్జివోను సంప్రదించింది ట్రినా. ఐటి డిప్లమో కోర్సు చేయడానికి ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలవుతుంది. ముప్పయ్ మందికి కోర్సు ఫీజు రెండు లక్షల పది వేల రూపాయలు. ట్రినా తన ఆలోచన ఇంట్లో చెప్పింది. ఫ్రెండ్స్ కూడా సంతోషంగా ముందుకొచ్చారు. తనకు గిఫ్ట్ కోసం ఇవ్వాలనుకున్న డబ్బును జమ చేయమంది. అందరూ ఇచ్చినంత ఇవ్వగా మిగిలిన డబ్బు తాను ఇవ్వాలనేది ట్రినా ఆలోచన. అయితే ట్రినా రూపాయి తీయాల్సిన పని లేకుండా అంతకు మించిన డబ్బు పోగయింది. మొత్తం రెండు లక్షల పాతిక వేల ఆరు వందల ఇరవై రెండు రూపాయలు. ‘ఒక బహుమతి మరొకరి జీవితాన్ని బాగు చేస్తుందంటే అంతకంటే సంతోషం మరోటి ఏముంటుంది’ అంటూ ట్రినా ఆలోచనను అభినందించారంతా. పాత ఆలోచనే.. కొత్తగా! ‘‘మా అమ్మ, ఆంటీలు చాలాసార్లు మా పుట్టిన రోజుకు వీధి పిల్లలకు స్వీట్లు ఇవ్వడం వంటివి చేసేవారు. ఆపన్నుల అవసరాలకు స్పందించేవారు. ఇప్పుడు నేను చేసిన ఆలోచన కొత్తదేమీ కాదు. కొద్దిగా మార్చుకున్నానంతే. సహాయం అందుకున్న వాళ్లంతా మనసారా విషెష్ చెప్పారు. నాకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వాళ్లు కూడా తమకు ఒక మంచి పని చేసే అవకాశం ఇచ్చావంటూ నన్ను అభినందించారు. నా ముప్పయ్యవ పుట్టినరోజు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఇండియాకి వచ్చాను. ఇంతకంటే గొప్ప సెలబ్రేషన్ ఇంకేముంటుంది’’ అంటోంది ట్రినా. – మంజీర -
23, 24న టీఎస్ ఐసెట్
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో 2018–19 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షకు మొత్తం 62,400 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని టీఎస్ఐసెట్ కన్వీనర్, కేయూ ప్రొఫెసర్ ఎం. సుబ్రమణ్యశర్మ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన పరీక్ష వివరాలను వెల్లడించారు. గతేడాది 73 వేల వరకు దరఖాస్తులు రాగా.. ఈ ఏడాది 62,400 వచ్చాయని, గతేడాదితో పోలిస్తే 11వేలకు పైగా తగ్గిపోయాయని చెప్పారు. తెలంగాణలో 58 కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్లో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో ఒకటి విశాఖపట్నం, మరొకటి విజయవాడలో ఉన్నాయని తెలిపారు. తొలిసారిగా ఐసెట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించం ఈ నెల 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్ష ఉంటుంద న్నారు. 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒక షిఫ్ట్లో పరీక్షను నిర్వహించనున్నట్లు చెప్పారు. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించమని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లతోపాటు ఫొటోపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించుకుని తీసుకురావాల్సి ఉంటుందన్నారు. అలాగే ఐడీ ప్రూఫ్ కార్డు కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. కరీంనగర్ను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకున్న అభ్యర్థుల్లో కొందరికి అక్కడే సెంటర్లను ఏర్పాటు చేసినప్పటికీ మరో 700 మందికి వేరే జిల్లాల్లో కేటాయించామన్నారు. జూన్ 7న ఐసెట్ ఫలితాలను విడుదల చేస్తామని కన్వీనర్ సుబ్రమణ్యశర్మ తెలిపారు. -
తగ్గిన క్యాంపస్ జాబ్స్.. 101 కాలేజీల మూసివేత
న్యూఢిల్లీ : ప్రాంగణ నియమాకాలు తగ్గడం, కళాశాలల్లో సీట్ల మిగులు పెరగడంతో 2017-18 సంవత్సరానికి గాను స్వచ్ఛంద మూసివేతకు అనుమతి ఇవ్వాల్సిందిగా దేశ వ్యాప్తంగా దాదాపు 100 మేనేజ్మెంట్ కళాశాలలు దరఖాస్తు చేసుకున్నట్లు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) తెలిపింది. జాతీయ సాంకేతిక విద్య సమాఖ్య(ఏఐసీటీఈ) వివరాల ప్రకారం మేనేజ్మెంట్ కోర్సులైన ఎంబీఏ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ కోర్సును అందించే ఈ 101 బిజినెస్ స్కూల్స్లో అత్యధిక భాగం ఉత్తరప్రదేశ్ (37)కు చెందినవి కాగా తరువాతి స్థానాల్లో కర్ణాటక (10), మహారాష్ట్ర (10) నిలిచాయి. ఈ దరఖాస్తుల్లో ఎక్కువ శాతం కళాశాలలు మూసివేతకు అనుమతి పొందుతాయని అధికారులు తెలిపారు. ఏఐసీటీఈ నివేదికి ప్రకారం 2015-16 సంవత్సరంలో 66 కళాశాలలు, 2016-17లో 76 మేనేజ్మెంట్ సంస్థలు మూతపడినట్లు వెల్లడించారు. కారణాలు ఇవే... ‘కొన్నాళ్ల కిందట మేనేజ్మెంట్ విద్య ఐఐఎమ్ల్లో, కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ మార్కెట్లో మేనేజ్మెంట్ కోర్సులు చదివిన విద్యార్థులకు డిమాండ్ పెరగడంతో ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో మేనేజ్మెంట్ కళాశాలను ఏర్పాటు చేసింది. కానీ సరైన వసతులు, ప్రావీణ్యం కల అధ్యాపకులను నియమించడంలో వెనకబడింది. దాంతో ప్రాంగణ నియమాకలు తగ్గాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 3వేల సాంకేతిక, మేనేజ్మెంట్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో చాలా కళాశాలలు కనీస నిబంధనలను కూడా పాటించడం లేదు. విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించడంలో విఫలమవుతున్నాయి. దాంతో ఏటా ప్రాంగణ నియమాకాలు తగ్గిపోతున్నాయి. 2016-17 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 1.50 లక్షల మంది ఎంబీఏ పట్టభద్రులు మాత్రమే ప్రాంగణ నియమాకాల ద్వారా ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం మూతపడనున్న 101 కాలేజీల వల్ల 10 వేల సీట్లు తొలగించబడతాయి. ఇవేకాక మరికొన్ని సంస్థలు కేవలం మేనేజ్మెంట్ కోర్సులను మాత్రమే రద్దు చేయాల్సిందిగా ఏఐసీటీఈని కోరాయి. ఫలితంగా మరో 11 వేల సీట్లు తొలగించబడతాయ’ని ఏఐసీటీఈ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ స్పందన... ప్రాంగణ నియామకాలు లేకపోవడమే కళాశాలల మూసివేతకు ప్రధాన కారణమని ఏఐసీటీఈ చైర్మన్ ఎస్ఎస్ మంథ తెలిపారు. కళాశాలల మూసివేతను ప్రభుత్వం పెద్ద సమస్యగా భావించడం లేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్ సుబ్రమణ్యం అన్నారు. ‘నాణ్యతా ప్రమాణాలు పాటించని కళాశాలలు స్వచ్ఛందగా మూతబడటం మంచి విషయమే. ఎందుకంటే ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించాలనుకుంటుంది. దానికి నంబర్లతో పనిలేదు. విద్యాప్రమాణాలను పెంచడం కోసం ప్రభుత్వం నూతన విధానాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా కళాశాలల గుర్తింపు కోసం మెనటర్షిప్ విధానాన్ని, విద్యార్థుల కోసం ఇండక్షన్ కార్యక్రమాలను రూపొందించింది. విద్యార్థులకు, పరిశ్రమకు మధ్య వారధి నిర్మించి అర్హులైన వారి ఉపాధి కల్పనకు ప్రభుత్వ కృషి చేస్తుంద’ని చెప్పారు. -
కానిస్టేబుళ్లుగా ఇంజనీర్లు, టెకీలు, ఎంబీఏలు!
అహ్మదాబాద్ : హరీశ్ విటల్ చదివింది ఎంబీఏ. కానీ ఉద్యోగం నవ్రంగ్పుర పోలీసు స్టేషన్లో లోక్ రక్షక్ దల్(ఎల్ఆర్డీ) జవానుగా పోస్టింగ్. హరీశ్ ఒక్కడే కాదు అదే పోలీసు స్టేషన్కు ఇటీవల బదిలీ అయిన మరో ఇద్దరు కూడా ఎంబీఏ గ్రాడ్యుయేట్లే. అదే పోలీసు స్టేషన్లో బీసీఏ, బీఏ, బీఎడ్, పీజీడీసీఏ, ఎంఎస్సీ వంటి ప్రొఫిషనల్ డిగ్రీలు కలిగి వారు మరో ఐదుగురు ఉన్నారు. ఇలా మెజార్టీ పోలీస్ స్టేషన్లలో లోక్ రక్షక్ దల్ జవానుగా ఎంపికైన వారు ఎక్కువగా ప్రొఫిషనల్ డిగ్రీవారే ఉన్నారని తెలిసింది. అంటే గతేడాది గుజరాత్ పోలీసు విభాగం నిర్వహించిన పరీక్షలో ఎల్ఆర్డీ జవానులుగా ఎంపికైన వారిలో చాలా మంది ప్రొఫిషనల్ డిగ్రీ అభ్యర్థులు కలిగివారేనని వెల్లడైంది. ఈ పోస్టులకు అర్హత కేవలం పన్నెండో తరగతి ఉత్తీర్ణత అయితే చాలు. కానీ ఈ కానిస్టేబుల్ పోస్టులకు ఎక్కువగా ఎంబీఏలు, టెకీలు, ఇంజనీర్లే అర్హత సాధించినట్టు తెలిసింది. ఐదేళ్ల కాలానికి పిక్స్డ్ పేతో ఎల్ఆర్డీలను నియమిస్తారు. ఆ తర్వాత రెగ్యులర్ కానిస్టేబుల్గా వీరికి పోస్టింగ్ ఇస్తారు. మొత్తం ఎంపికైన 17,532 మంది ఎల్ఆర్డీ జవాన్లలో 50 శాతం మందికి పైగా గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలు కలిగిన వారే ఉన్నారని 2017 ఎల్ఆర్డీ రిక్రూట్మెంట్ చైర్మన్, వడోదర రేంజ్ ఐజీపీ జీఎస్ మాలిక్ చెప్పారు. అర్హత కంటే మించిన వారే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో భద్రత లేకపోవడంతో, ఎక్కువగా యువత తక్కువ ప్రొఫైల్, వేతనం ఉన్నప్పటికీ, సెక్యుర్ జాబ్స్ వైపే ఆసక్తి చూపుతున్నట్టు గుజరాత్ యూనివర్సిటీ సోషయాలజీ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ గౌరంగ్ జాని అన్నారు. -
ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య
గచ్చిబౌలి: పార్ట్టైం జాబ్ చేసుకోవాలని అన్న మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ నదీమొద్దీన్ వివరాల ప్రకారం వినోభానగర్ షేక్పేట్కు చెందిన ఎం.జయరాంనాయక్(23) అబిడ్స్లోని రాజా బహద్దూర్ వెంకటరాంరెడ్డి కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ ముగిసిన తరువాత పార్ట్ టైం ఉద్యోగం చేస్తే ఆర్థిక భారం తగ్గుతందని అన్న రాజునాయక్ మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన జయరాం బుధవారం ఉదయం 8 గంటలు కాలేజీకి వెళుతున్నాని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. సాయంత్రమైనా తిరిగిరాలేదు. రాయదుర్గంలోని మల్లన్నగుట్ట వద్ద అతను మృతి చెంది ఉండడాన్ని దేవాలయానికి వెళ్లిన భక్తులు గమనించి పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మృత్యు శకటమైన అద్దె కారు..
వాయు వేగం ముగ్గురు భావి విద్యార్థినులను బలితీసుకుంది. బెంగళూరు హుళిమావు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఎంబీఏ విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు జార్ఖండ్, కేరళకు చెందిన వారుగా గుర్తించారు. సాక్షి, బనశంకరి: ఉన్నత చదువుల కోసం సుదూర ప్రాంతాల నుంచి నగరానికి చేరిన విద్యార్థినులను మృత్యువు కబళించింది. అతివేగం వల్ల వారు ప్రయాణిస్తున్న వాహనమే మృత్యు శకటమై ముగ్గురు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ముగ్గురు తల్లులకు కడుపు కోత మిగిల్చిన ఈ ఘోర ఉదంతం హుళిమావు ట్రాపిక్పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు...జార్ఘండ్, కేరళలకు చెందిన శ్రీవాత్సవ్(23), హర్షితకుమార్(24), శృతి(24)లు ఎలక్ట్రానిక్సిటీ అలెయన్స్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నారు. ఇదే కళాశాలలో చదువుతున్న పవిత్, ప్రవీణ్లతో కలిసి బన్నేరుఘట్టలో అద్దె ఇంటిలో నివాసముంటున్నారు.వీరంతా శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో అద్దె కారు తీసుకొని కళాశాలకు బయల్దేరారు. ప్రవీణ్ కారు డ్రైవింగ్ చేస్తూ బన్నేరుఘట్ట రోడ్డు నైస్రోడ్డులో అతివేగంతో వాహనాన్ని కుడివైపు టర్న్ చేసి అదే వేగంతో ఎడమవైపునకు తిప్పాడు. దీంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడి వంతెనను ఢీకొని ఆగిపోయింది. ప్రమాదంలో శ్రీవాత్సవ్, హర్షితాకుమార్ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన శృతి, స్వల్పంగా గాయపడిన ప్రవీణ్, పవిత్లను విజయశ్రీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శృతి మృతి చెందింది. ప్రమాద తీవ్రతకు వాహనం నుజునుజ్జు కావడంతో శ్రీవాత్సవ్, హర్షితాకుమార్ మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. హుళిమావు ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కట్టర్తో వాహనాన్ని కోసి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఉద్యోగాల ఎర..రూ.కోట్లలో టోకరా!
గద్వాల క్రైం : ఎంత చదివినా ఉద్యోగం కోసమే కదా..? లేకపోతే కోరుకున్న కాలేజీలో ఎంబీబీఎస్ సీటు రావాలి.. ఎంత కష్టపడినా అదృష్టం ఉండాలి.. ఇప్పుడు అదృష్టం మీ ఎదురుగా ఉంది.. నాకు పెద్ద పెద్ద అధికారులు తెలుసు.. నాతోపాటే రండి.. అన్ని విషయాలు తెలుస్తాయి..! ఇలా సామాన్యులకు కొందరు మోసగాళ్లు వల వేస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు నడిగడ్డలో ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. నడిగడ్డ ప్రాంతంలో.. జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంతోపాటు అలంపూర్, అయిజ, గట్టు, మల్దకల్, మానవపాడు, శాంతినగర్, ఇటిక్యాల తదితర మండలాలకు చెందిన అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాలు, ఉన్నత చదువుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసు శాఖలోనూ హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.లక్షలు వసూలు చేశారు. ఇందులో ఏపీకి చెందిన ఇద్దరిని గద్వాల పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. అయితే ఇలాంటి మోసగాళ్లకు దళారులు అండగా ఉండి నిరుద్యోగులకు వల వేస్తున్నారు. దళారులుగా ఉన్న వారిలో చాలామందికి పలుకుబడిన వ్యక్తులతో సంబంధాలు ఉండడంతో వారిపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేకపోతున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెన్సీలు సైతం ఏర్పాటు చేసుకుని రూ.కోట్లు వసూలు చేసి మకాం మార్చిన కేటుగాళ్లు సైతం జిల్లాలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నారు. అసలు సూత్రధారులు.. మధ్యవర్తులను నిలువరిస్తే మోసగాళ్లకు కళ్లెం వేయవచ్చు. ఇవిగో ఘటనలు.. గద్వాలకు చెందిన ఓ వ్యక్తి 2015లో తన కూతరు ఎంబీబీఎస్ ప్రవేశం కోసం హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తిని కలిసి ముందస్తుగా రూ.15 లక్షలు ఇచ్చి.. సీటు వచ్చిన తర్వాత రూ.50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా అంతర్జాతీయ ముఠా సభ్యులు పలు రాష్ట్రాల్లో 21 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.3.39 కోట్లు దోచుకున్నారు. 2015లో జరిగిన ఈ వ్యవహారం జిల్లా ఏర్పాటు తర్వాత ఈ నెల 1న ఈ ముఠా సభ్యులను గద్వాల పట్టణ పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. 2105లో గద్వాల, అయిజకు చెందిన 16 మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం తెలిసిన వ్యక్తిని ఆశ్రయించారు. జిల్లా సహకార కో–ఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల చొప్పున రూ.24 లక్షలు వసూలు చేశారు. తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చి మీరు ట్రైనింగ్లో ఉన్నారు.. కొన్ని నెలల తర్వాత పర్మనెంట్ అవుతుందని నమ్మబలికారు. కానీ ఉద్యోగం మాత్రం రాకపోవడంతో గట్టిగా నిలదీయగా అప్పుడు.. ఇప్పుడు అంటూ కాలయాపన చేశారు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు తాజాగా జిల్లా ఎస్పీ విజయ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ముఠాలోని ఓ వ్యక్తిని ఇటీవల అయిజ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 2016లో మల్దకల్ మండలం పాల్వాయికి చెందిన ఇద్దరు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఓ వ్యక్తిని ఆశ్రయించారు. సదరు మోసగాడు కేంద్ర ప్రభుత్వంలో కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి. రూ.3.50 లక్షల చొప్పున రూ.7 లక్షలు వసూలు చేశారు. ఇలా కొల్లాపూర్కు చెందిన మరో ఆరుగురు నిరుద్యోగుల నుంచి రూ.24 లక్షలు వసూలు చేశాడు. తర్వాత మౌఖిక పరీక్షలకు వెళ్లండి అంటూ నకీలి పత్రాలు ఇచ్చి హైదరాబాద్కు పంపారు. అక్కడికి వెళ్తే ఇలాంటి ఉద్యోగాలకు ఎలాంటి మౌఖిక పరీక్షలు లేవని చెప్పి వెనక్కి పంపారు. మోసపోయిన వీరు సైతం ఈ ఏడాది జనవరిలో గద్వాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ూ జిల్లాలో ఇప్పటి వరకు 30కిపైగా ఇలాంటి కేసులు నమోదైనట్లు పోలీసులు వివరించారు. నమోదు కాని కేసులు సైతం మరో 50 వరకు ఉన్నట్లు సమాచారం. 2015లో జరిగిన వ్యవహారం.. నడిగడ్డలో 2015 సంవత్సరంలో మోస పోయిన బాధితులు ప్రస్తుతం జిల్లా ఏర్పాటుతో ఒక్కొక్కరు ఎస్పీ విజయ్కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో కేటుగాళ్ల లీలలు బయటపడుతున్నాయి. ఇటీవల ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని రూ.3 కోట్లకుపైగా వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఈ వ్యవహారం నడిపించిన దళారులు, సూత్రధారులు ఎవరనే అంశంపై పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి తమదైన శైలిలో దూసుకువెళ్తున్నారు. ప్రజల్లో చైతన్యం రావాలి.. ప్రభుత్వ ఉద్యోగం డబ్బులు పెడితే రాదు. ప్రజలు మోసపోయేంత వరకు మోసగాళ్లు మోసం చేస్తూనే ఉంటారు. అంతా అయిపోయాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇకనైనా జిల్లా ప్రజల్లో చైతన్యం రావాలి. త్వరలో పోలీసు శాఖ తరపున అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. – విజయ్కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల -
భారత గ్రాడ్యుయేట్లపై చైనా ఆసక్తికర వ్యాఖ్యలు
బిజినెస్ గ్రాడ్యుయేట్లు... భారత్కు బలమైన వారు కాదట. వీరు భారత్కు బలహీనంగా మారుతున్నట్టు చైనా వ్యాఖ్యానించింది. చాలా మంది బిజినెస్ గ్రాడ్యుయేట్లు అమెరికాలోని టాప్ బహుళ జాతీయ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్ల్లో టాప్ పోస్టుల్లో ఉన్నారని, వారు సొంతంగా మల్టినేషనల్ కంపెనీలు నిర్మించనంత వరకు భారత్కు ఎలాంటి ఉపయోగకరం లేదంటూ పేర్కొంది. భారత్లో ఎంబీఏ గ్రాడ్యుయేట్లు అత్యధికంగా ఉన్నారని, అది భారత్కు ఒకానొక బలమైనప్పటికీ, ఉద్యోగాల పరంగా చూస్తే వారు భారత ఆర్థిక వ్యవస్థకు బలహీనంగా మారుతున్నట్టు చైనీస్ ప్రభుత్వ రంగ న్యూస్ అవుట్లెట్ గ్లోబల్ టైమ్స్ తన ఆర్టికల్లో తెలిపింది. ఉన్నత స్థాయి టెక్నికల్, మేనేజ్మెంట్ స్టాఫ్ ఎక్కువగా విదేశీ కంపెనీలకే సేవలందిస్తున్నారని పేర్కొంది. దీంతో ఆర్థిక వృద్ధిలో భారత్, చైనాను అధిగమించలేకపోతుందని తెలిపింది. ప్రతిభావంతులైన భారత మేనేజర్లతో భారత్ సొంతంగా బహుళ జాతీయ కంపెనీలను ఏర్పాటుచేయాల్సి ఉందని వివరించింది. ''ఆర్థిక వృద్ధిని పెంచుకోవాలంటే, భారత్కు ఉన్నత స్థాయి కంపెనీలు కావాలి. సొంతంగా టాప్ మల్టినేషనల్ కంపెనీలను నిర్మించుకోవాలి. భారతదేశం వ్యవస్థాపకతకు మరింత సానుకూల వాతావరణాన్ని కల్పించాలి'' అని గ్లోబల్ టైమ్స్ ఆర్టికల్ ప్రచురించింది. సొంత వ్యాపారాలు వృద్ధి చేసుకోవడానికే భారత్, మంచి వాతావరణం కల్పించనప్పుడు, విదేశీ పెట్టుబడిదారులకు మంచి వాతావరణం ఎలా సృష్టిస్తారని ప్రశ్నించింది. ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెడుతున్నప్పటికీ, విదేశీ పెట్టుబడులు పలు సవాళ్లను ఎదుర్కోవాల్సిందేనని వ్యాఖ్యానించింది. చైనాతో భారత్ను పోల్చినప్పుడు, చైనా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపింది. ఎందుకంటే తమ దేశంలో చాలా మంది ప్రజలు వ్యాపారాలను స్థాపించడం, మార్కెట్ ఆర్ధిక సంపదకు తోడ్పడటం, ఆర్ధికవృద్ధికి పునాది వేయడం చేస్తున్నారని పేర్కొంది. -
జీఎస్టీ చట్టం: ఓ ఆసక్తికరమైన వార్త
సాక్షి, ముంబై: బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ చట్టంపై మరో ఆసక్తికరమైన వార్త. పుణే యూనివర్శిటీ జీఎస్టీ చట్టంపై కొత్త కోర్సును ప్రవేశపెట్టబోతోంది. వచ్చే ఎకడమిక్ ఇయర్ నుంచి వివిధ కోర్సుల్లో జీఎస్టీ చట్టాన్ని ఒక కొత్త సబ్జెక్టుగా చేర్చనుంది. పుణే విశ్వవిద్యాలయం సావిత్రిబాయి ఫులే అకడమిక్ కౌన్సిల్ జీఎస్టీపై ఎంబీఏ, ఎంఏ కోర్సుల్లో ఈ సబ్జెక్టును ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను ప్రారంభించనుంది. యూనివర్శిటీ ప్రతినిధి అభిజిత్ గోర్పడే ఈ విషయాన్ని ప్రకటించారు. -
సంక్షోభంలో ఎంబీఏ గ్రాడ్యుయేట్లు : కారణమిదే!
1991 ఆర్థిక సరళీకరణ అనంతరం ప్రైవేట్ రంగం ఒక్కసారిగా ఉవ్వెత్తున్న ఎగిసింది. ఇదే క్రమంలో ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. డాలర్ల కొద్దీ వేతనాలతో ఎంబీఏ గ్రాడ్యుయేట్లను కంపెనీలు రిక్రూట్మెంట్ చేసుకున్నాయి. ఎంబీఏ డిగ్రీ ఉంటే చాలు.. ఇక జీవితం విజయవంతమైనట్టేనని విద్యార్థులు భావించారు. అటు మనీకి మనీ... ఇటు స్టేటస్కు స్టేటస్. అన్నీ ఎక్కువే. కానీ రెండు దశాబ్దాల అనంతరం ఈ ఎంబీఏ డిగ్రీ తన ప్రతిష్టతను కోల్పోయింది. ఒక్కసారిగా ఎంబీఏ సంక్షోభంలో కూరుకుపోయింది. 2016-17లో సగానికి పైగా ఎంబీఏ గ్రాడ్యుయేట్లు క్యాంపస్ ప్లేస్మెంట్లో రిక్రూట్ కాలేకపోతున్నారని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డేటా తేల్చింది. కేవలం 47 శాతం ఎంబీఏ గ్రాడ్యుయేట్లు మాత్రమే ప్లేస్ అవుతున్నారని, గతేడాది కంటే ఇది 4 శాతం తక్కువేనని తెలిపింది. అంటే ఇది ఐదేళ్ల కనిష్టం. ఎంబీఐ గ్రాడ్యుయేట్లకు జాబ్ ఆఫర్లు పడిపోవడానికి అతిపెద్ద కారణం పాత పాఠ్య ప్రణాళికేనని తెలిసింది.టాప్ 20 కాలేజీలను మినహాయిస్తే, ఇండియన్ బిజినెస్ స్కూల్స్ నుంచి కేవలం 7 శాతం మంది ఎంబీఏ విద్యార్థులే వెంటనే ఉద్యోగాలు పొందుతున్నారని అసోచామ్ రిపోర్టు కూడా తెలిపింది. నాణ్యత నియంత్రణ, అవస్థాపన లేకపోవడం, తక్కువ వేతన ఉద్యోగాలు, నిపుణులైన అధ్యాపకులు లేకపోవడం వంటివి బీ-స్కూల్స్ దెబ్బతినడానికి ప్రధాన కారణాలుగా అసోచామ్ వెల్లడించింది. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఇదే రకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా హోల్డర్స్ నియామకాలు పడిపోవడం కూడా చాలా ఎక్కువగా 12 శాతంగా ఉన్నాయి. ఈ గణాంకాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లను కలుపలేదు. -
ఐఐఎం విద్యార్థులకు..ఎంబీఏ ‘పట్టా’!
ఐఐఎం బిల్లు–2017తో స్వయం ప్రతిపత్తి ఐఐఎంలు.. పరిచయం అక్కర్లేని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు. కానీ.. అవి ఇచ్చే సర్టిఫికెట్లకు మాత్రం అంతర్జాతీయ గుర్తింపు విషయంలో ఒక్కో దేశంలో ఒక్కో నిర్ణయం. ఇన్స్టిట్యూట్స్లో పరిపాలనపరంగానూ పలు అడ్డంకులు. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ను నియమించుకోవాలన్నా ఎన్నో నిబంధనలు. ఇలాంటి పరిస్థితికి ఫుల్స్టాప్ పెట్టే దిశగా ఐఐఎంలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ తెచ్చిన ఐఐఎం బిల్లు–2017కు ఇటీవల లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో ఇన్స్టిట్యూట్లకు, విద్యార్థులకు కలగనున్న ప్రయోజనాలపై విశ్లేషణ.. ఇక ఎంబీఏ, పీహెచ్డీ పట్టాలు ఇప్పటివరకు ఐఐఎంలు తాము అందిస్తున్న కోర్సులను పీజీ డిప్లొమా లేదా, ఎగ్జిక్యూటివ్ డిప్లొమా పేరుతో సర్టిఫికెట్లను జారీ చేస్తున్నాయి. వీటికి మార్కెట్పరంగా, ఉన్నత విద్య కోర్సుల్లో చేరడం విషయంలోనూ పలు దేశాల్లో మాస్టర్ స్థాయి గుర్తింపు లభించడం లేదు. పీహెచ్డీకి సమానమైనదని పేర్కొనే ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (ఎఫ్పీఎం)ను సైతం పలు విదేశీ వర్సిటీలు పీహెచ్డీగా పరిగణించేందుకు సంకోచిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో.. ఐఐఎం బిల్లు–2017 అమలు ద్వారా ఐఐఎంలకు డిప్లొమాలకు బదులు డిగ్రీలు మంజూరు చేసే అవకాశం లభిస్తుంది. ఐఐఎంలు పీజీడీఎం, ఫెలో ప్రోగ్రామ్స్కు బదులు ఎంబీఏ, పీహెచ్డీలు ప్రదానం చేసే వీలు కలుగుతుంది. డైరెక్టర్ నియామకం తాజా బిల్లు ద్వారా కొత్త డైరెక్టర్ను నియమించుకోవడంలో ఐఐఎంలులోని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్కు స్వీయ అధికారాలు కల్పిస్తారు. ఇప్పటివరకు ఈ విషయంలో హెచ్ఆర్డీ శాఖ ఆమోదం తీసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల ఏళ్ల తరబడి డైరెక్టర్లు లేకుండానే ఇన్స్టిట్యూట్స్ నడవాల్సిన పరిస్థితి నెలకొంది. స్వయంప్రతిపత్తి కల్పించడం వల్ల ఒక డైరెక్టర్ పదవీ కాలం పూర్తవగానే కొత్త డైరెక్టర్ను నియమించుకునే వీలు కలుగుతుంది. ఫ్యాకల్టీ కొరతకూ పరిష్కారం ఐఐఎం–బిల్లు 2017లో ఫ్యాకల్టీ నియామకాల్లోనూ ఇన్స్టిట్యూట్లకు స్వయంప్రతిపత్తి ప్రతిపాదించారు. దీనివల్ల ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా ఐఐఎంలలో ఫ్యాకల్టీ కొరత సమస్యకు పరిష్కారం దొరకనుంది. విజిటింగ్ ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీని ఆహ్వానించే విషయంలోనూ ఐఐఎంలకు స్వేచ్ఛ లభించనుంది. కోఆర్డినేషన్ ఫోరమ్ బిల్లు ప్రకారం అన్ని ఐఐఎంలకు కలిపి ఒక కోఆర్డినేషన్ ఫోరమ్ ఏర్పాటు కానుంది. దీనికి అన్ని ఇన్స్టిట్యూట్ల బీఓజీ చైర్ పర్సన్స్ ప్రాతినిథ్యం వహిస్తారు. వారిలోంచి ఒకరిని కోఆర్డినేషన్ ఫోరమ్ చైర్ పర్సన్గా ఎంపిక చేస్తారు. చైర్ పర్సన్ రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. తద్వారా ప్రస్తుతం పలు అంశాలపరంగా ఒక్కో ఐఐఎంలో ఒక్కో తీరుగా అమలవుతున్న విధానాలకు తెరపడి.. కామన్ పాలసీ రూపొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రవేశ ప్రక్రియల్లో ఈ ఉమ్మడి విధానం వల్ల విద్యార్థులకు వ్యయప్రయాసల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతర ప్రాంతాల్లో... విదేశాల్లో సైతం ప్రస్తుత నిబంధనల ప్రకారం ఐఐఎంలు.. అవి నెలకొన్న ప్రాంతంలోనే అకడమిక్ తరగతులను నిర్వహించే వీలుంది. ఐఐఎం–బిల్లు 2017 ద్వారా కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఇతర ప్రాంతాల్లోనూ లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో విదేశాల్లో సైతం స్టడీ సెంటర్లను నెలకొల్పవచ్చు. ఈ సెంటర్లతో గ్లోబల్ ర్యాంకింగ్స్ పరంగా కీలక పారామీటర్గా ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రేషియో విషయంలో ముందంజలో ఉండొచ్చు. సెంటర్ ఏర్పాటు చేసిన విదేశీ యూనివర్సిటీతో ఒప్పందం ద్వారా కొలాబరేటివ్ రీసెర్చ్ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం కూడా లభిస్తుంది. ఇది కూడా గ్లోబల్ ర్యాంకింగ్స్ పరంగా పోటీ పడేందుకు, ముందు నిలిచేందుకు ఆస్కారం కల్పిస్తుంది. రీసెర్చ్కు ప్రాధాన్యం బిల్లులో మరో ప్రధానాంశం.. ఐఐఎంలు స్వయంగా రీసెర్చ్ యాక్టివిటీస్ దిశగా స్వతంత్రంగా వ్యవహరించడం. రీసెర్చ్కు అవసరమైన నిధుల సమీకరణ, ఎక్సే్ఛంజ్ ఒప్పందాలు, స్పాన్సర్డ్ రీసెర్చ్ కార్యకలాపాలు వంటివాటి విషయంలో సదరు ఐఐఎం గవర్నింగ్ కౌన్సిల్కే పూర్తి నిర్ణయాధికారాలు ఉంటాయి. ఈ ప్రతిపాదన విద్యార్థులకు రీసెర్చ్ యాక్టివిటీస్ పరంగా విద్యార్థులకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. వైవి«ధ్యానికి ప్రాధాన్యం బిల్లులో మరో కీలకాంశం వైవిధ్యం (డైవర్సిటీ)కు ప్రాధాన్యం ఇవ్వడం. రిజర్వేషన్లు, జండర్ డైవర్సిటీ ద్వారా అన్ని వర్గాలకు ఐఐఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టే వీలు కల్పిస్తోందీ బిల్లు. ఐఐఎంలు దేశవ్యాప్తంగా విస్తరించినా కొందరికే అవకాశం లభిస్తోంది. ఇలాకాకుండా ఫ్యాకల్టీ నియామకాల్లోనూ డైవర్సిటీని పాటించనున్నారు. దాంతోపాటు ఐఐఎంలలో ప్రవేశానికి నిర్వహించే క్యాట్ స్వరూపం అన్ని అకడమిక్ నేపథ్యాలవారికి అనుకూలంగా ఉండేలా చూడాలనేది కొత్త బిల్లులోని మరో ముఖ్యాంశం. ఫలితంగా ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నేపథ్యం ఉన్నవారికే క్యాట్ అనుకూలం, మిగతా వారికి అవకాశాలు స్వల్పం అనే అభిప్రాయాలకు స్వస్తి పలికే చర్యలు చేపట్టే వీలు కలుగుతుంది. ముఖ్యాంశాలు మాస్టర్స్ డిగ్రీ ప్రదానం చేసే అధికారం ఫ్యాకల్టీ, డైరెక్టర్ల నియామకంలో స్వేచ్ఛ కొలాబరేటివ్ రీసెర్చ్ విషయంలో స్వతంత్రత డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సెంటర్స్ ఏర్పాటు అడ్మిషన్ ప్రక్రియలో లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్కు ఆస్కారం ఇచ్చేలా చర్యలు ఐఐఎం కోఆర్డినేషన్ ఫోరం ఏర్పాటు – ఫలితంగా అన్ని ఐఐఎంలలో ఒకే తరహా విధానాలు అమలయ్యే అవకాశం ప్రైవేటు బి–స్కూల్స్కు స్వయంప్రతిపత్తి! దేశంలో ప్రముఖ ప్రయివేట్ బి–స్కూల్స్కు కూడా స్వయంప్రతిపత్తి హోదా ఇచ్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయంపై అధ్యయనానికి ఇప్పటికే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఒక కమిటీని నియమించింది. ఐఐఎంలకు దీటుగా రాణిస్తూ ప్రపంచ స్థాయిలో పేరుపొందిన ప్రైవేటు ఇన్స్టిట్యూట్లు.. ప్రభుత్వ నియంత్రణ సంస్థల కారణంగా కార్యకలాపాలు, అకడమిక్స్ నిర్వహణలో ఇబ్బందులకు గురి కాకూడదనే ప్రైవేటు బి–స్కూల్స్కు అటానమస్ హోదా ఇచ్చే దిశగా హెచ్ఆర్డీ యోచిస్తున్నట్లు సమాచారం. అటానమస్ హోదాతో ప్రయోజనం ఐఐఎంలకు స్వయంప్రతిపత్తి హోదా కల్పించడం వల్ల అటు విద్యార్థులు, ఇటు ఇన్స్టిట్యూట్లకు ప్రయోజనం కలుగుతుంది. విద్యార్థులకు గ్లోబల్ ఎక్స్పోజర్ లభిస్తుంది. ఇన్స్టిట్యూట్లు కూడా ఎక్సే్ఛంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహణ, కొలాబరేటివ్ రీసెర్చ్ పరంగా స్వతంత్రంగా వ్యవహరించే వీలు కలుగుతుంది. – ప్రొఫెసర్.దినేశ్ కుమార్, ఐఐఎం–బెంగళూరు -
వీరికి కొలువులే..కొలువులు
సాక్షి, న్యూఢిల్లీ : ఐటీ ఉద్యోగుల లేఆఫ్స్తో కొలువుల మార్కెట్ కళ కోల్పోయినా టాప్ కాలేజీలకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు మాత్రం భారీ డిమాండ్ నెలకొంది. నోట్ల రద్దు, మందగమనం నేపథ్యంలోనూ దేశంలోని ప్రతిష్టాత్మక 26 బిజినెస్ స్కూల్స్కు చెందిన గ్రాడ్యుయేట్లను ఈ ఏడాది మెరుగైన వేతన ప్యాకేజీలతో దిగ్గజ కంపెనీలు రిక్రూట్ చేసుకున్నాయి. పలు క్యాంపస్ నియామకాల్లో వేతన ప్యాకేజీలు గత ఏడాదితో పోలిస్తే పది శాతం పెరిగాయి. వ్యాపారాల డిజిటలీకరణ, విభిన్న పరిస్థితులను ఎదుర్కోవాల్సిన క్రమంలో బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్లకు బహుళజాతి కంపెనీల ప్రాధాన్యత పెరిగింది. ఈ ఏడాది 1700 మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకున్నట్టు కాగ్నిజెంట్ వెల్లడించింది. ప్రయివేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ 223 మంది బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. ఇంకా క్యాప్జెమని, డెలాయిట్, ఇన్ఫోసిస్, విప్రో,యాక్సెంచర్, కేపీఎంజీ, టీసీఎస్, అమెజాన్, ఐబీఎంలూ పెద్ద సంఖ్యలో ఎంబీఏలను రిక్రూట్ చేసుకున్నాయి. -
వచ్చేనెల 6 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
7 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు 14న సీట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు వచ్చే నెల 6 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహిíßంచాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో సాంకేతిక విద్య కమిషనర్ వాణీప్రసాద్, క్యాంపు అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలును ఖరారు చేశారు. వచ్చేనెల నెల 6 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కమిటీ వెల్లడించింది. 7 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 12న ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. వారికి వచ్చేనెల 14న సీట్లు కేటాయించనుంది. ప్రస్తుతం ఐసెట్లో అర్హత సాధించిన వారు 69,900 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఎన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయనేది మరో రెండు మూడు రోజుల్లో తేలనుంది. కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అది పూర్తి కాగానే సీట్ల సంఖ్య తేలనుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావాల్సిన వివరాలు, వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవాల్సిన తేదీలు, హెల్ప్లైన్ కేంద్రాల వివరాలను ్టటజీఛ్ఛ్టి.nజీఛి.జీn వెబ్సైట్లో పొందొచ్చు. స్పెషల్ కేటగిరీ వారికి మాసాబ్ ట్యాంకులోని సాంకేతిక విద్యా భవన్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఈసారి కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి. బయోమెట్రిక్ వివరాలను సేకరిస్తారు. వెంటతెచ్చుకోవాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లు హా ఐసెట్ ర్యాంకు కార్డు, హా హాల్టికెట్, హా ఆధార్ కార్డు, హా డిగ్రీ మార్కుల మె మో, పాస్ సర్టిఫికెట్, హా ఇంటర్మీడియట్ తత్సమాన మార్కుల మెమో కమ్ పాస్ సర్టిఫికెట్, హా పదో తరగతి మార్కుల మెమో, హా 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు, హా 2017 జనవరి 1న లేదా ఆ తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, హా స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్లు హా నాన్ లోకల్ అభ్యర్థులైతే వారి తల్లిదండ్రులు 10 ఏళ్లు తెలంగాణలో నివసించిన నివాస ధ్రువీకరణ పత్రం, హా రెగ్యులర్గా చదువుకోని వారైతే 7 ఏళ్ల నివాస ధ్రువీకరణపత్రం. -
విలాసాలకు బానిసై..
చోరీ బాట పట్టిన ఎంబీఏ విద్యార్థి రూ.15 లక్షల చోరీ సొత్తు స్వాధీనం కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : ఆ యువకుడు ఎంబీఏ చదువుతున్నాడు. విలాసాలకు, చెడు వ్యసనాలకు లోనై అతడు.. అక్రమమార్గంలో డబ్బు సంపాదించేందుకు చోరీల బాట çపట్టాడు. ఐదేళ్ల కాలంలో కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలో సుమారు 20 చోరీలకు పాల్పడ్డాడు. తాళం వేసి ఉన్న ఇళ్లు, సింగిల్గా ఉంటున్న గృహాలను ఎంచుకుని కటింగ్ మిషన్తో తలుపులను కట్ చేసి నగదు, బంగారు ఆభరణాలను అపహరించుకుపోతున్న అతడిని ఇంద్రపాలెం పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. అతడి నుంచి సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి, కారు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్స్టేషన్లో ఆదివారం కాకినాడ రూరల్ సర్కిల్ సీఐ వి.పవన్కిషోర్ ఈ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. పెదపూడి మండలం అచ్చుతాపురత్రయానికి చెందిన 23 ఏళ్ల అడబాల వెంకటశివ కాకినాడకు చెందిన ఓ కార్పొరేట్ కళాశాల్లో ఎంబీఏ చదువుతున్నాడు. 2016 ఆగస్టు నుంచి ఇంద్రపాలెంలో 4, పెదపూడి–2, కాకినాడ టూటౌన్–2, సర్పవరం–3 పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం 11 చోరీలకు పాల్పడ్డాడు. ఇతడు అద్దెకు తెచ్చుకున్న కారులో పగలు, రాత్రి సమయాల్లో జనావాసం లేని ఇళ్లు, ఇంటికి తాళం వేసి ఉన్న ఇళ్లు, సింగిల్గా విశ్రాంత ఉద్యోగుల గృహాల్లో చోరీలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు కాకినాడ కోకిల రెస్టారెంట్ వెనుక శాంతినగర్ 2వ వీధిలో అద్దె ఇంట్లో ఉన్నాడనే సమాచారంతో ఇంద్రపాలెం ఎస్సై డి.రామారావు ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేసినట్టు సీఐ పవన్కుమార్ తెలిపారు. నిందితుడు నుంచి 3.877 కిలోల బంగారు ఆభరణాలు, 650 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితుడు దొంగతనాలకు ఉపయోగించిన ఉడ్ కట్టర్ సామగ్రి, అద్దె కారును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గతంలో ఇతనిపై పెదపూడి పోలీసులు కేసు నమోదు చేయగా, రాజమహేంద్రవరంలోని జ్యూవైనల్ హోమ్కి ఒకసారి వెళ్లివచ్చాడన్నారు. మూడు నెలల క్రితం కొవ్వాడ సాయిబాబా గుడి వీధిలో రిటైర్డ్ టీచర్ పడాల శ్రీనివాసరెడ్డి ఇంట్లో చోరీ చేసిన 33 కాసుల బంగారం, ఇదే గ్రామంలో రైల్వే గేటు వెనకాల ఉన్న వెజ్జుల లక్ష్మీపతిరావు ఇంట్లో చోరీ చేసిన 180 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండి, కాకినాడ శాంతినగర్లో ఓ మహిళ కణితపై డమ్మీ తుపాకీ గురిపెట్టి 13 కాసుల బంగారం.. రికవరీ చేసిన దాంట్లో ఉన్నట్టు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు. -
వీల్చైర్లోని కొడుకు చదువు కోసం ఓ అమ్మ..
ఆరేంజ్ (కాలిఫోర్నియా): పక్షవాతం వచ్చి వీల్చైర్కు పరిమితమైన కన్నకొడుకు చదువు కోసం ఓ మాతృమూర్తి చూపిన అకుంఠిత దీక్షకు ఘనమైన సత్కారం లభించింది. కొడుకుతోపాటు ప్రతిరోజూ తరగతులకు హాజరై.. ఉపాధ్యాయులు చెప్పిన నోట్స్ తీసుకొని.. అతను ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) పూర్తిచేయడంలో అడుగడుగునా అండగా నిలిచింది ఆమె.. ఆ కొడుక్కే కాదు కన్నతల్లి దీక్షకు సైతం సత్కారం లభించింది. కొడుకుతోపాటు ఆ మాతృమూర్తికి కూడా ఓ అమెరికన్ యూనివర్సిటీ ఎంబీఏ పట్టాను అందజేసింది. ప్రాథమిక పాఠశాల రిటైర్డ్ టీచర్ అయిన జ్యూడీ ఓ కానర్ వీల్ఛైర్లోని తన కొడుకు మార్టిను స్నాతకోత్సవ వేదికపైకి తీసుకురాగా.. మార్టికే కాదు, జ్యూడీకి కూడా ఎంబీఏ పట్టాను అందజేస్తున్నట్టు ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తింది యూనివర్సిటీ. కాలిఫోర్నియా లాస్ఏంజిల్స్లోని చాప్మన్ యూనివర్సటీ ఈ అరుదైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ అనూహ్య ప్రకటనతో ఆనందంతో భావోద్వేగానికి లోనైన జ్యూడీ ‘స్కూల్లో ఉండటం తనకు ఇష్టమని, తరగతి గదిలో గడిపిన ప్రతి నిమిషాన్ని తాను ఆస్వాదించినట్టు పేర్కొంది. మార్టి ఓ కానర్ కొలరాడో యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. 2012లో ఓ ప్యాకేజింగ్ కంపెనీలో పనిచేస్తుండగా మెట్లమీద నుంచి జారిపడి పక్షవాతానికి గురయ్యాడు. అప్పటినుంచి వీల్చైర్లో ఉన్న కొడుకు చదువు కోసం అన్నీ తానై కష్టపడింది జ్యూడీ. ఫ్లోరిడాలో నివాసముండే జ్యూడీ కొడుకు చదువు కోసం దక్షిణ కాలిఫోర్నియాకు మకాం మార్చింది. వీల్చైర్లో ఉండే జ్యూడీ ఐప్యాడ్, లాప్ట్యాప్, వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ తదితర పరికరాలను ఉపయోగించగలడు. కానీ సొంతంగా నోట్స్ రాసుకోలేడు. ఆ పని చేసేందుకు తల్లి జ్యూడీ కూడా తరగతులకు హాజరయ్యేది. -
ప్రశాంతంగా టీఎస్ ఐసెట్
91.93 శాతం మంది అభ్యర్థుల హాజరు కేయూ క్యాంపస్: తెలంగాణలోని కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించిన ఐసెట్–2017 ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 16 రీజినల్ సెంటర్ల పరిధిలో మొత్తంగా 132 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 77,422 మంది అభ్యర్థులకుగాను 71,172 మంది (91.93శాతం) అభ్యర్థులు హాజరయ్యారని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.ఓంప్రకాశ్ తెలిపారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు జరగగా బయోమెట్రిక్ పద్ధతి ద్వారా హాజరు నమోదు చేయనున్నట్లు ముందుగానే ప్రకటించడంతో అభ్యర్థులు ఉదయం 8–30 గంటల నుంచే పరీక్షాకేంద్రాలకు చేరుకున్నారు. ఈ నెల 21న ప్రాథమిక కీని వెబ్సైట్లో అం దుబాటులో ఉంచుతామని, ఈ నెల 30న తుది కీ తోపాటు ఫలితాలను వెల్లడిస్తామని ఓంప్రకాశ్ వెల్లడించారు. టీఎస్ ఐసెట్–2017కు గురువారం ఉదయం 6 గంటలకు కాకతీయ వర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ హాల్లో ప్రశ్నపత్రాల సెట్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపి రెడ్డి ఎంపిక చేశారు. రెండు బాక్సుల నుంచి ‘ఏ’సెట్ ప్రశ్నపత్రాన్ని ఆయన ఎంపిక చేయగా అన్ని కేంద్రాలకు సమాచారం ఇచ్చారు. -
పట్టపగలే ఎమ్మెల్యే కూతురుపై కత్తితో దాడి
పుణె: పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఎంబీఏ చదువుతున్న ఓ బీజేపీ ఎమ్మెల్యే కూతురుపై కత్తితో దాడి జరిగింది. తనను ప్రేమించమంటూ గత కొంతకాలంగా వెంటపడుతున్నప్పటికీ తిరస్కరించిందనే విద్వేషంతో ఓ యువకుడు ఆమెను పలుమార్లు కత్తితో పొడిచాడు. ఆమెను రక్షించేందుకు వచ్చిన వారు కూడా ఈ దాడిని అడ్డుకునే క్రమంలో గాయపడ్డారు. అయితే, ఎట్టకేలకు బాధితురాలిని రక్షించగలిగారు. ఈ క్రమంలో దాడి చేసిన వ్యక్తి ఆమె చేతి చిటికెన వేలిని పూర్తిగా నరికివేశాడు. పోలీసుల వివరాల ప్రకారం బీజేపీకి చెందిన ఎమ్మల్యే సంజీవ్ రెడ్డి బోద్కుర్వార్కు ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. కూతురు అశ్విని రెడ్డి(22) పుణెలోని ఓ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. ఆమె సోదరుడు కూడా అక్కడే చదువుతున్నాడు. అశ్వినిరెడ్డి వెంట గత కొంతకాలంగా రాజేశ్ ప్రవీణ్ కుమార్ భక్షి(23) అనే యువకుడు వెంటపడుతున్నాడు. తనను ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని అశ్విని కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో తనపైన ఫిర్యాదు చేసినందుకు ప్రతీకారంగా అతడు కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె పుణెలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటోంది. శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలికం మేనేజ్మెంట్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి చేసిన భక్షిది హర్యానా అని, అశ్వినికి అతడికి మధ్య గత ఎనిమిది నెలలుగా పరిచయం ఉందని, ఈ మధ్య అతడి ప్రవర్తనలో మార్పు వచ్చి ఆమెను వేధించడం మొదలుపెట్టి చివరకు ఈ దారుణానికి దిగాడని పోలీసులు చెప్పారు. అశ్విని తల్లిదండ్రులు ఈ ఘటన గురించి తెలియగానే పుణె చేరుకున్నారు. -
అపార్ట్మెంట్పై నుంచి పడి ఎంబీఏ విద్యార్థి మృతి
హైదరాబాద్: అపార్ట్మెంట్ పై నుంచి పడి ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్లో వెలుగుచూసింది. స్థానిక స్టైల్ హోం అపార్ట్మెంట్పై నుంచి పడి ఓ ఎంబీఏ విద్యార్థి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఢిల్లీకి చెందిన మొహక్గా గుర్తించారు. ఇతను తార్నాకలోని నర్సిమోంజి కళాశాలలో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. ప్రమాదవశాత్తుపై నుంచి పడ్డాడా.. లేక ఎవరైనా కావాలనే తోసేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంబీఏ విభాగంలో ముగిసిన జాతీయసదస్సు
ఎస్కేయూ : వర్సిటీ ఎంబీఏ విభాగంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. కార్యక్రమానికి ఎస్కేయూ రెక్టార్ ఆచార్య లజపతిరాయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతర్జాతీయ వాణిజ్య విధానంలో భారత్ అవలంభించిన విధానాలు విద్యార్థులకు తెలియ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు అంతర్జాతీయ వాణిజ్యం పెరుగుదలకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కే.సుధాకర్ బాబు, ఫిజిస్తు కంపెనీ డిప్యూటీ మేనేజర్ మనోహర్ రెడ్డి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ అనిత తదితరులు పాల్గొన్నారు. -
ఆటోమేషన్ దిశగా అడుగులు!
ఎంబీఏ హెచ్ఆర్.. సంస్థ నిర్వహణలో కీలకమైన మానవ వనరుల (హెచ్ఆర్) విభాగం నేడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ కంపెనీ వృద్ధికి దోహదపడుతోంది. ఈ క్రమంలో ఎంబీఏ హెచ్ఆర్ స్పెషలైజేషన్ అభ్యర్థులు.. తమ నైపుణ్యాలకు నగిషీలు దిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ముఖ్యంగా హెచ్ఆర్ విభాగంలో ఆటోమేషన్ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు హెచ్ఆర్ నిపుణులు మెరుగుపరచుకోవాల్సిన స్కిల్స్పై ఫోకస్.. హెచ్ఆర్ విభాగంపై ఆటోమేషన్ ప్రభావం చాలాకాలంగానే ఉంది. అయితే ఇప్పుడు ఇది మరింత విస్తృతమవుతోంది. ప్రస్తుతం హెచ్ఆర్ విభాగంలో నియామకాల పరంగా ఆఫర్ లెటర్ అందజేయడం నుంచి ఉద్యోగుల అప్రైజల్స్ వరకూ అంతా ఆన్లైన్లోనే సాగుతోంది. హెచ్ఆర్ కన్సల్టింగ్ సంస్థల ద్వారా నియామకాలు చేపట్టే కంపెనీలు.. తమకు అవసరమైన సిబ్బంది సంఖ్య, వారికి ఉండాల్సిన అర్హతలు, నైపుణ్యాలు తదితర వివరాలను అందిస్తుండగా.. వీటి ఆధారంగా కన్సల్టింగ్ సంస్థలు క్లౌడ్ బేస్డ్ విధానంలో నిర్ణీత అర్హతలున్న అభ్యర్థుల జాబితాను కంపెనీల హెచ్ఆర్ విభాగాలకు అందిస్తున్నాయి. వాస్తవానికి ఒక సంస్థ హెచ్ఆర్ విభాగం ఒక ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు సగటున 40 నుంచి 45 రోజుల వ్యవధి పడుతుందని.. కానీ, కన్సల్టింగ్ సంస్థలు.. క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ వినియోగం ఆధారంగా వారం పది రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతోందని క్యాప్ జెమిని సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. అదే విధంగా చాలా సంస్థల్లో సిబ్బంది హాజరు నుంచి వారి పనితీరును విశ్లేషించడం వరకు అంతర్గతంగా ఆన్లైన్ విధానంలో జరుగుతోంది. వీటన్నింటినీ హెచ్ఆర్ విభాగంలో ఆటోమేషన్ ప్రభావం పెరిగిందనడానికి నిదర్శనాలుగా చెప్పొచ్చు. మేనేజ్.. బిగ్ డేటా n ఇప్పటి వరకు ఈ–కామర్స్, ఇతర కస్టమర్ ఓరియెంటేషన్ కంపెనీల్లో బిగ్డేటా మేనేజ్మెంట్ ప్రాధాన్య అంశంగా ఉండేది. కానీ, ఇప్పుడిది హెచ్ఆర్ విభాగాల్లోనూ కీలకంగా మారుతోంది. ముఖ్యంగా వందలు, వేల సంఖ్యలో ఉద్యోగులున్న సంస్థల్లో బిగ్ డేటా అనాలిసిస్కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఉద్యోగుల వివరాలను ఆన్లైన్ డేటాబేస్లో నిక్షిప్తం చేయడమే కాకుండా.. బదిలీలు, పదోన్నతుల సమయంలో ఈ సమాచార విశ్లేషణకు హెచ్ఆర్ సిబ్బంది.. డేటా మేనేజ్మెంట్ను ఉపయోగించుకుంటున్నారు. n ఆటోమేషన్ విధానంగా పేర్కొనే ఎంప్లాయీ డేటా బేస్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, పే–రోల్ ప్రిపరేషన్ సాఫ్ట్వేర్ టూల్స్ వంటి ఆధునిక పద్ధతులను అనుసరించడం వల్ల సిబ్బంది పనితీరు, ఇతర అంశాలను బేరీజు వేయడంలో చాలా తక్కువ లోపాలు నమోదవుతాయన్నది నిపుణుల అభిప్రాయం. విదేశాల్లో ఎప్పటి నుంచో.. అమెరికా, యూకే తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో హెచ్ఆర్ విభాగంలో కోర్ ఆటోమేషన్ ప్రక్రియ అయిదారేళ్ల క్రితం నుంచే ప్రారంభమైంది. EHRM (Electronic Human Resource Management), HRIS(Human Resource Information System), HRIM (Human Resource Information Management), CHRIS (Computerised Human Resource Information వంటి పేర్లతో మానవ వనరుల నిర్వహణ పరంగా ఐటీ టూల్స్ను అక్కడి సంస్థలు వినియోగిస్తున్నాయి. వీటి అన్నిటి ఉద్దేశం ఒకటే.. ఒక ఉద్యోగికి సంబంధించి నియామకం నుంచి యాన్యువల్ అప్రైజల్ వరకు అంతా ఆన్లైన్లోనే నిర్వహించడం.. తద్వారా సమయం, డబ్బు రెండిటినీ ఆదా చేయడం. ఉద్యోగుల కోణంలోనూ అసంతృప్తికి స్వస్తి పలకడం. హెచ్ఆర్ నియామకాలు తగ్గుతాయా? మానవ వనరుల నిర్వహణ పరంగా ఆటోమేషన్ విధానాలను అమలు చేసినా.. వాటిని నిర్వర్తించేందుకు నిపుణులైన హెచ్ఆర్ సిబ్బంది అవసరం ఎప్పుడూ ఉంటుందని, ఉద్యోగాల కోత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ప్రభావం ఉన్నా అది 10–20 శాతం వరకే ఉంటుందని అంటున్నారు. ఆందోళన అనవసరం నేటి ఆధునిక యుగంలో సంస్థల్లో అంతర్గత విభాగాల నిర్వహణలోనూ ఆటోమేషన్ కీలకమవుతోంది. అంతమాత్రాన భవిష్యత్తు ఉద్యోగాల పరంగా కోత పడుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హెచ్ఆర్ స్పెషలైజేషన్ ఔత్సాహిక విద్యార్థులు ఆధునికత దిశగా అడుగులు వేస్తే సుస్థిర కెరీర్కు ఢోకా ఉండదు. భవిష్యత్తులో మానవ వనరుల విభాగంలో సుస్థిర కెరీర్ను సొంతం చేసుకోవాలనుకునే అభ్యర్థులు హెచ్ఆర్ స్పెషలైజేషన్లో చేరినప్పటి నుంచే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టిసారించాలి. ముఖ్యంగా పే–రోల్ ప్రిపరేషన్, టైమ్ షీట్ ట్రాకింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్ వంటి విధులు నిర్వర్తించేందుకు ముందునుంచే సన్నద్ధమయ్యేలా శిక్షణ పొందాలి. హెచ్ఆర్ ఆటోమేషన్ ఫ్యాక్ట్స్ 90% కెరీర్ బిల్డర్ నిర్వహించిన సర్వేలో హెచ్ఆర్లో బిగ్ డేటా ఆవశ్యకత ఉందని పేర్కొన్న సీఈవోలు. 35% రానున్న రోజుల్లో ఆటోమేషన్ను అమలు చేయనున్నట్లు తెలిపిన సీఈవోలు. -
ఎంబీఏ / పీజీడీఎం.. ఏది బెస్ట్!
ఎంబీఏ.. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పీజీడీఎం.. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ రెండూ మేనేజ్మెంట్ నైపుణ్యాలను అందించేవే. కార్పొరేట్ కొలువులకు మార్గం చూపేవే. భవిష్యత్తు బిజినెస్ లీడర్లను తీర్చిదిద్దేవే. కానీ.. అదే సమయంలో.. రెండిటి మధ్య వ్యత్యాసం ఉందనే అభిప్రాయం.. ఇండస్ట్రీ వర్గాల్లో సైతం భిన్నాభిప్రాయాలు.. నైపుణ్యాల పరంగా కొన్ని తేడాలనే వ్యాఖ్యలు. ఇవి.. మేనేజ్మెంట్ విద్య ఔత్సాహికులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇక.. ఐఐఎం సహా పలు బి–స్కూల్స్లో ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఎంబీఏ, పీజీడీఎం ఏది మంచిదో తెలుసుకుందాం.. థియరీకి ప్రాధాన్యమిచ్చే ఎంబీఏ కరిక్యులం పరంగా ఎంబీఏ అధిక శాతం థియరీ ఓరియెంటేషన్తో ఉంటుంది. నిర్దిష్టంగా సంబంధిత యూనివర్సిటీ రూపొందించిన సిలబస్ను, బోధన విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఇక.. పీజీడీఎం ప్రాక్టికల్ ఓరియెంటేషన్, ఇండస్ట్రీ అవసరాలకు సరితూగే ఇతర నైపుణ్యాలను అందించే విధంగా ఉంటుందనే అభిప్రాయం. స్పెషలైజ్డ్ నైపుణ్యాలు అందించే పీజీడీఎం నైపుణ్యాల సముపార్జన కోణంలో ఎంబీఏ, పీజీడీఎంల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలిస్తే.. ఎంబీఏ పూర్తిగా.. అన్ని నిర్వహణ నైపుణ్యాలు అందించే విధంగా ఉంటోంది. పీజీడీఎం ఇందుకు భిన్నమని చెప్పొచ్చు. ఇందులో అభ్యర్థులకు నిర్దిష్టంగా ఒక సబ్జెక్ట్లో స్పెషలైజ్డ్ నైపుణ్యాలను అందిస్తుంది. కారణం రెండేళ్ల వ్యవధిలో ఉండే పీజీడీఎంలో మొదటి నుంచే అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్కు ఎక్కువ సమయం కేటాయించే అవకాశం లభిస్తుంది. కానీ ఎంబీఏలో స్పెషలైజేషన్ అంటే రెండో ఏడాదిలో మొదలవుతుంది. అంతేకాకుండా ప్రాజెక్ట్వర్క్ పేరుతో ఏదో ఒక విభాగంలోనే పని చేయాల్సి ఉంటుంది. బోధన పరంగానూ తేడాలు బోధన పరంగానూ ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ఎంబీఏ సాధారణంగా ఏడాదిలో రెండు టర్మ్లుగా రెండు సెమిస్టర్లుగా మొత్తం నాలుగు సెమిస్టర్లలో ఉంటుంది. పీజీడీఎంను అందిస్తున్న అటానమస్ ఇన్స్టిట్యూట్లు ట్రైమెస్టర్ విధానంలో బోధిస్తున్నాయి. ఇన్స్టిట్యూట్ ఆధారంగా డిగ్రీకి గుర్తింపు ఎంబీఏ, పీజీడీఎం విషయంలో ఇండస్ట్రీ వర్గాల గుర్తింపు, జాబ్ మార్కెట్లో ఆదరణ వంటివి సర్టిఫికెట్ అందించిన ఇన్స్టిట్యూట్కు ఉన్న ప్రామాణికతపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు.. ఎంబీఏను పరిగణనలోకి తీసుకుంటే సెంట్రల్ యూనివర్సిటీలు, యూనివర్సిటీల క్యాంపస్ కళాశాలలకు ఇప్పటికీ మంచి గుర్తింపు లభిస్తోంది. ఇక.. పీజీడీఎం విషయానికొస్తే ఐఐఎంల తర్వాత దేశంలో గరిష్టంగా యాభై ఇన్స్టిట్యూట్లకు మాత్రమే పరిశ్రమ వర్గాల నుంచి, జాబ్ మార్కెట్లోనూ గుర్తింపు లభిస్తోంది. ఎంబీఏకు తత్సమానమే.. కానీ.. పీజీడీఎం కోర్సును ఎంబీఏకు తత్సమాన కోర్సుగా పేర్కొంటున్నారు. ఇది వాస్తవమే అయినప్పటికీ ఈ తత్సమాన గుర్తింపు పొందాలంటే సదరు పీజీడీఎం వ్యవధి కచ్చితంగా రెండేళ్లు ఉండాల్సిందే. ఇటీవల కాలంలో జాబ్ మార్కెట్ ట్రెండ్స్ను పరిగణనలోకి తీసుకుని ఏడాది వ్యవధిలోనే పీజీడీఎం కోర్సులను బోధిస్తున్నాయి. ఈ వ్యవధి ఆసాంతం ఒక రంగానికి సంబంధించి (ఉదాహరణకు.. రిటైల్ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్ తదితర)న నైపుణ్యాలనే అందిస్తున్నాయి. ఇలాంటి ధోరణి కారణంగా విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. సదరు రంగంలో సంక్షోభం ఏర్పడితే మరో రంగంలో రాణించే నైపుణ్యాలు ఉండవు. అదే విధంగా సంబంధిత రంగంలో ప్రస్తుతమున్న క్రేజ్, డిమాండ్ భవిష్యత్తులో లేకపోతే ఇబ్బందే. కాబట్టి పీజీడీఎంలో చేరే అభ్యర్థులు కచ్చితంగా రెండేళ్ల వ్యవధి కోర్సునే ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉన్నత విద్యలో ఇలా మాస్టర్ డిగ్రీ తర్వాత ఉన్నత విద్య అంటే రీసెర్చ్ అని తెలిసిందే. ఈ విషయంలో ఇటీవల కాలంలో ఎంబీఏ, పీజీడీఎం రెండు సర్టిఫికెట్లకు సమాన అవకాశాలు లభిస్తున్నాయి. గతంలో కేవలం ఎంబీఏ ఉత్తీర్ణులకే పీహెచ్డీ అవకాశం కల్పించే యూనివర్సిటీలు ఇటీవల కాలంలో ఎంబీఏకు తత్సమాన హోదాతో ఏఐసీటీఈ, ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్స్ నుంచి పీజీడీఎం చేసిన వారిని సైతం రీసెర్చ్ ప్రోగ్రామ్లలో అర్హులుగా పేర్కొంటున్నాయి. ఇన్స్టిట్యూట్, కరిక్యులం ప్రధానం ఎంబీఏ, పీజీడీఎం దేన్ని ఎంపిక చేసుకున్నా విద్యార్థులు ఇన్స్టిట్యూట్కు ఉన్న గుర్తింపు, కరిక్యులం పరంగా అమలు చేస్తున్న విధానాలను తెలుసుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వ యూనివర్సిటీలైనా, అటానమస్ సంస్థలైనా విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుత జాబ్ మార్కెట్ ట్రెండ్స్ను పరిగణనలోకి తీసుకుంటే రెండు కోర్సులకూ సమాన అవకాశాలు లభిస్తున్నాయి. కాబట్టి ఆందోళన చెందక్కర్లేదు. – ప్రొఫెసర్. వి. వెంకట రమణ, ఎస్ఎంఎస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ -
కాంతులీనే కెరీర్కు..
ఎంబీఏ ఉత్తీర్ణులకు దీటుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిస్తున్న కోర్సు.. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ). ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ కోర్సును అందిస్తోంది. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ అనే మూడు దశలుగా ఉండే సీఎంఏను పూర్తిచేస్తే జాబ్ మార్కెట్లో మంచి వేతనాలతో కొలువులు దక్కించుకోవచ్చు. ఈ నేపథ్యంలో సీఎంఏ కోర్సులో దశలు, అర్హతలు.. పరీక్ష విధానం.. ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకుందాం.. సీఎంఏలో దశలివే..: సీఎంఏలో మూడు దశలుంటాయి. అవి.. 1. ఫౌండేషన్, 2. ఇంటర్మీడియెట్, 3. ఫైనల్. మొదటి దశ ఫౌండేషన్: సీఎంఏ కోర్సులోని మొదటి దశను ఫౌండేషన్ అని వ్యవహరిస్తారు. ఇంటర్ లేదా 10+2లో ఏ గ్రూప్ చదివినవారైనా దీనికి నమోదు చేసుకోవచ్చు. ఇందులోని మొత్తం 8 సబ్జెక్టులను నాలుగు పేపర్లుగా విభజించారు. ప్రతి పేపర్ను 100 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఏడాదిలో జూన్, డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తారు. ముందు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: సీఎంఏ చదవాలంటే ముందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనికోసం ఇంటర్మీడియెట్ లేదా 10+2, తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించాలి.రెండో దశ.. ఇంటర్మీడియెట్: ఫౌండేషన్ ఉత్తీర్ణులు ఇంటర్మీడియెట్కు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత ఏడాదికి పరీక్షలు రాయడానికి అర్హత లభిస్తుంది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు కూడా నేరుగా ఇంటర్మీడియెట్కు నమోదు చేసుకోవచ్చు. ఏటా జూన్, డిసెంబర్ల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ రెండు గ్రూపులుగా ఉంటుంది. అవి.. గ్రూప్–1: ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి. అవి.. ఫైనాన్షియల్ అకౌంటింగ్, లాస్ అండ్ ఎథిక్స్, డైరెక్ట్ ట్యాక్సేషన్, కాస్ట్ అకౌంటింగ్. ఒక్కో పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఒక్కో పేపర్లో కనీసం 40 శాతం మార్కులు, మొత్తం మీద 50 శాతం మార్కులు పొందితే ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. గ్రూప్–2: ఇందులో నాలుగు పేపర్లుంటాయి. అవి.. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇన్డైరెక్ట్ ట్యాక్సేషన్, కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిట్. ఒక్కో పేపర్ 100 మార్కులకు ఉంటుంది. నాలుగు పేపర్లకు కలిపి 400 మార్కులు కేటాయించారు. వీలును బట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా వేర్వేరుగా ఆరు నెలల వ్యవధిలో రాయొచ్చు. ప్రాక్టికల్ ట్రైనింగ్: సీఎంఏ ఫైనల్ పరీక్ష రాయాలంటే ఆరు నెలల ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు గుర్తింపు పొందిన సంస్థల్లో లేదా ఇప్పటికే పనిచేస్తున్న కాస్ట్ అకౌంటెంట్ల వద్ద ఆర్నెల్ల పాటు ప్రాక్టికల్ శిక్షణ పొందాలి. ఈ సమయంలో ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.2 వేలు నుంచి రూ.5 వేల వరకు సై్టపెండ్ పొందొచ్చు. మూడో దశ.. సీఎంఏ ఫైనల్: ప్రాక్టికల్ శిక్షణ పూర్తయిన విద్యార్థి ఫైనల్ పరీక్ష రాయొచ్చు. ఇందులో కూడా రెండు గ్రూపులు (గ్రూప్ 3, గ్రూప్ 4) ఉంటాయి. వీలును బట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా ఒక్కో గ్రూప్ వేర్వేరుగా ఆర్నెల్ల వ్యవధిలో రాయొచ్చు. ఏటా జూన్, డిసెంబర్ల్లో సీఎంఏ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫైనల్ పరీక్ష విధానం: గ్రూప్–3: ఇందులో నాలుగు పేపర్లుంటాయి. అవి.. కార్పొరేట్ లాస్ అండ్ కంప్లైయన్స్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ – డెసిషన్ మేకింగ్, డైరెక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్. ఒక్కో పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ప్రతి పేపర్లో కనీసం 40 మార్కులు, మొత్తం మీద 50 శాతం మార్కులు సాధించినవారిని ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. గ్రూప్–4: ఇందులో కూడా నాలుగు పేపర్లుంటాయి. అవి.. కార్పొరేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఇన్డైరెక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ప్రాక్టీస్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్, స్ట్రాటజిక్ ఫెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ వాల్యుయేషన్. ఒక్కో పేపర్ను 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి పేపర్లో కనీసం 40 మార్కులు, మొత్తం మీద 50 శాతం మార్కులు పొందితే ఉత్తీర్ణులైనట్లు. ఫైనల్ ఉత్తీర్ణులు కంప్యూటర్ శిక్షణ పూర్తయిన తర్వాత కాస్ట్ అకౌంటెంట్లుగా గుర్తింపు పొందుతారు. ఫైనల్ ఉత్తీర్ణులు నేరుగా ఉద్యోగంలో చేరొచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేయాలంటే మరో రెండున్నరేళ్లు ప్రాక్టికల్ శిక్షణ తీసుకోవాలి. దీన్ని పూర్తిచేసినవారికి కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా.. సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీవోపీ) అందిస్తుంది. అవకాశాలెన్నో..: సీఎంఏ ఉత్తీర్ణులకు సీఎంఏ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కల్పిస్తోంది. హెచ్సీఎల్, ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐటీసీ, సిప్లా, జెన్ప్యాక్ట్ వంటి బహుళజాతి కంపెనీలు మంచి వేతన ప్యాకేజీలతో వీరిని నియమించుకుంటున్నాయి. ఎంబీఏ చేసినవారికి ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయో.. సీఎంఏలకు కూడా అవే ఉంటాయి. మేనేజ్మెంట్, ప్రొఫెషనల్ కోర్సులు అందించే విద్యా సంస్థల్లో లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్గా పనిచేయొచ్చు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ కీలక పదవులను నిర్వర్తించొచ్చు. ఉద్యోగం ఇష్టం లేనివారు స్వయం ఉపాధి పొందొచ్చు. వెబ్సైట్: www.icmai.in ఎం.ఎస్.ఎస్. ప్రకాశ్, డైరెక్టర్, మాస్టర్మైండ్స్ -
ప్రేమించడం లేదనే కోపంతో..
అనంతపురం: తనను ప్రేమించడం లేదనే కోపంతో ఓ ప్రేమోన్మాది సహచర విద్యార్థిపై దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన అనంతపురంలోని అనంతలక్ష్మీ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం వెలుగుచూసింది. కళాశాలలో ఎంబీఏ చదువుతున్న లత అనే విద్యార్థినిపై తోటి విద్యార్థి హరీష్ దాడి చేశాడు. ఈ దాడిలో లతకు తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. -
యూఎస్లో బెస్ట్ బిజినెస్ స్కూల్స్ ఇవే..
వాషింగ్టన్: మార్కెట్లో ఎన్ని కోర్సులున్నా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)కు ఉన్న క్రేజ్ వేరే. కోర్సు సమయంలో ఇంటర్న్షిప్ అవకాశాలతో పాటు.. అనంతరం మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు సాధించాలనుకునే వారు సాధారణంగానే ఈ కోర్సు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే యూఎస్లోని టాప్ బిజినెస్ స్కూల్స్లో ఈ కోర్సు కాస్త వ్యయంతో కూడుకున్నదనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరముంది. బ్లూమ్బర్గ్ బిజినెస్ వీక్ ఇటీవల ఫుల్ టైం ఎంబీఏ కోర్సును అందిస్తున్న అమెరికాలోని ఉత్తమ బిజినెస్ స్కూళ్ల జాబితా-2016ను విడుదల చేసింది. ఈ జాబితాలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మొదటి స్థానంలో నిలువగా.. స్టాన్ఫోర్డ్ రెండో స్థానం దక్కించుకుంది. బిజినెస్ స్కూళ్ల పూర్వ విద్యార్థుల అనుభవాలు, కోర్సు పూర్తయిన తరువాత ఉద్యోగాలు పొందుతున్న సరళి, ట్యూషన్ ఫీజులు, ఇంటర్న్షిప్ అవకాశాలు లాంటి విస్తృతమైన సమాచారంతో ఈ ర్యాంకులను రూపొందించినట్లు బ్లూమ్బర్గ్ బిజినెస్ వీక్ వెల్లడించింది. ఈ జాబితాలో టాప్ 20లో నిలిచిన యూఎస్లోని ఉత్తమ బిజినెస్ స్కూళ్లు ఇవే.. 1. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ 2. స్టాన్ఫోర్డ్ 3. డ్యూక్ 4. చికాగో(బూత్) 5. డర్ట్మోత్ 6. పెన్సిల్వేనియా(వార్టన్) 7. ఎమ్ఐటీ 8. రైస్(జోన్స్) 9. నార్త్ వెస్టర్న్ (కెల్లాగ్) 10. యూసీ బర్క్లీ(హాస్) 11. కొలంబియా 12. వర్జీనియా 13. మిచిగాన్(రాస్) 14. యేల్ 15. కార్నేగి మిలాన్(టెప్పర్) 16. కార్నెల్(జాన్సన్) 17. ఎన్వైయూ(స్టెర్న్) 18. టెక్సాస్(మేస్) 19. వాషింగ్టన్(ఫాస్టర్) 20. ఎమోరి(గొయ్జుటా) -
ఎంబీఏ విద్యార్థిని బలిగొన్న లారీ
జూపూడి (ఇబ్రహీంపట్నం): బైక్పై వెళ్తున్న ఎంబీఏ విద్యార్థిని లారీ రూపంలో మృత్యువు కాటేసింది. నిమ్రా కళాశాల సమీపంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామానికి చెందిన భూబత్తుల రమేష్ (23) జూపూడి నోవా కళాశాలలో ఎంబీఏ రెండో ఏడాది చదువుతున్నాడు. రమేష్ తండ్రి రైతు. ఇటీవలే అతడు కొత్త బైక్ కొన్నాడు. కళాశాల ముగి శా క ఇబ్రహీంపట్నంలో అద్దెకు తీసుకున్న తన రూముకు బైకు పై వస్తున్నాడు. దారి మధ్యలో నిమ్రా కళాశాల సమీపంలో బూడిద చెరువుకు వెళ్లే లారీ ఇతని బైకును ఢీకొనడంతో కిందపడగగా లారీ ముందు టైర్లు తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఇబ్రహీంపట్నం స్టేషన్ ఎస్ఐ లు గణేష్, శ్రీనివాస్లు సంఘటనా స్థలానికి చేరుకుని అతని మిత్రులకు తల్లిదండ్రులకు సమాచారం అందించా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. -
మన ఎంబీఏకు
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ).. వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను అందించే కోర్సు! ఈ కోర్సు పూర్తిచేస్తే కార్పొరేట్ కొలువు అందినట్లే! ఎంబీఏ పట్టా ఉంటే మేనేజ్మెంట్ ట్రైనీ నుంచి మేనేజింగ్ డెరైక్టర్ స్థాయికి ఎదగొచ్చు. ఇంతటి ప్రాధాన్యమున్న కోర్సు ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగానే ఉందా? అభ్యర్థులకు పరిశ్రమ వర్గాలు కోరుకునే నైపుణ్యాలు లభిస్తున్నాయా? ఎంబీఏ కోర్సు పూర్తిచేసినా.. అరకొర జీతం అందడానికి కారణమేంటి?! మేనేజ్మెంట్ కోర్సుల ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లు వెలువడుతున్న తరుణంలో ఎంబీఏ కోర్సు తీరుతెన్నులపై ఫోకస్.. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థుల్లో అధిక శాతం మంది ఎంబీఏపైనే దృష్టిసారిస్తారు. జాతీయస్థాయిలో నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)తోపాటు ఐసెట్, మ్యాట్, సీమ్యాట్.. తదితర ప్రవేశ పరీక్షల గణాంకాలను చూస్తే వాటిని రాస్తున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. ఎంబీఏ కోర్సు తమను బిజినెస్ లీడర్లుగా తీర్చిదిద్దుతుందని.. తద్వారా కళ్లు చెదిరే కార్పొరేట్ కెరీర్ సొంతమవుతుందనే భావనతో ఔత్సాహికులు ఎంబీఏ వైపు అడుగేస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉందనేది తాజా సర్వేల సారాంశం. ఎంబీఏ పూర్తిచేసిన చాలామంది రూ.10 వేల జీతానికి చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నారని, కేవలం 7 శాతం మంది ఎంబీఏ పట్టభద్రుల్లోనే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉన్నట్లు ఆసోచామ్ సర్వే వెల్లడించింది. కరిక్యులం తీరుతెన్నులు రెండేళ్ల వ్యవధిలో నాలుగు సెమిస్టర్ల విధానంలో ఉండే ఎంబీఏ కోర్సు ప్రధాన ఉద్దేశం.. విద్యార్థులకు భవిష్యత్తు కార్పొరేట్ కెరీర్కు అవసరమైన మల్టీటాస్కింగ్ స్కిల్స్ను అందించడం. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) విధానం ప్రకారం ఎంబీఏ పూర్తిచేసిన విద్యార్థికి వివిధ నైపుణ్యాలు అందేలా సిలబస్ ఉండాలి. క్రాస్ ఫంక్షనల్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్, ఛేంజ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, గ్లోబలైజేషన్ అవేర్నెస్, స్ట్రాటజిక్ ప్రాస్పెక్టివ్, ఎథిక్స్, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, డైవర్సిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ తదితర నైపుణ్యాలు పెంపొందించేలా సబ్జెక్టులను రూపొందించాలి. దీనికోసం కోర్సు స్వరూపం, బోధన పరంగా నిర్దిష్ట విధానాన్ని అమలు చేయాలి. ఎంబీఏ విద్యార్థులందరికీ భవిష్యత్తులో వ్యాపార నిర్వహణ నైపుణ్యాలు అందించేందుకు అవసరమైన ఆర్గనైజేషనల్ బిహేవియర్, బిజినెస్ కమ్యూనికేషన్స్, అకౌంటింగ్ తదితర సబ్జెక్టుల బోధన ఉంటుంది. కెరీర్ పరంగా నిర్దిష్టంగా ఒక విభాగంలో రాణించాలనుకునే వారికి ఆయా విభాగంలో పూర్తిస్థాయి నైపుణ్యాలు అందించేందుకు స్పెషలైజేషన్ సబ్జెక్ట్ విధానం అమల్లో ఉంది. ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఆపరేషన్స్ రీసెర్చ్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని అభ్యర్థులు మూడో సెమిస్టర్ నుంచి (అంటే రెండో ఏడాదిలో) అభ్యసించాల్సి ఉంటుంది. నచ్చిన స్పెషలైజేషన్ను ఎంపిక చేసుకున్న విద్యార్థులు క్షేత్ర నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రాజెక్ట్ వర్క్ పూర్తిచేయాలి. నిరంతరం మారాలి ఎంబీఏ కోర్సు లక్ష్యం బాగానే ఉన్నా.. కోర్సు స్వరూపంలో మార్కెట్ అవసరాలకు తగ్గట్లు నిరంతరం మార్పులు జరగడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సిలబస్, బోధన విధానం, స్కిల్స్ అందించే విషయంలో ప్రమాణాలు పెరగాలని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ పరిస్థితుల నేపథ్యంలో వేగంగా మారుతున్న మార్కెట్ పరిస్థితులు, కంపెనీల అవసరాలు, వ్యాపార నిర్వహణ తీరుతెన్నులపై ఎంబీఏ విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఆ మేరకు నైపుణ్యాలు అందించేలా ఎంబీఏ కోర్సు సిలబస్లో క్రమం తప్పకుండా మార్పులు చేర్పులు చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది. కానీ ప్రస్తుతం నాలుగేళ్లకోసారి మాత్రమే కరిక్యులంలో మార్పులు చేసే పరిస్థితి ఉంది. సిలబస్ మార్పులో జాప్యం సిలబస్లో మార్పులు చేయాలి.. కరిక్యులం మారాలి.. అనే అభిప్రాయాలు ఎంతగా వినిపిస్తున్నా.. యూనివర్సిటీల స్థాయిలో వాటికి సంబంధించి జాప్యం జరుగుతోంది. సిలబస్లో మార్పులు చేయాలంటే ముందుగా సంబంధిత ఫ్యాకల్టీ ఆ మార్పులను ప్రతిపాదిస్తూ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ముందుంచాలి. బీవోఎస్ నిపుణులు కూడా ఆయా మార్పులు అవసరమని భావిస్తేనే కొత్త సిలబస్ రూపొందుతుంది. ఈ ప్రక్రియ పూర్తికావడానికి చాలా సమయం పడుతోంది. దాంతో సిలబస్లో మార్పుల పరంగా జాప్యం జరుగుతోంది. ఇది విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. అదే ఐఐఎంలు, ఇతర అటానమస్ (స్వయం ప్రతిపత్తి) ఇన్స్టిట్యూట్స్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. వీటిలో కనీసం రెండేళ్లకోసారైనా సిలబస్ మారుతోంది. ఐఐఎంలు సిలబస్ రూపకల్పనలో పరిశ్రమ వర్గాలకు భాగస్వామ్యం కల్పిస్తున్నాయి. ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేస్తూ ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్షిప్లను తప్పనిసరి చే స్తున్నాయి. ప్రాక్టికాలిటీకి ఆమడదూరం యూనివర్సిటీల్లో ఎంబీఏ చదువుతున్న విద్యార్థులకు క్షేత్ర నైపుణ్యాలు అందడం లేదు. ప్రొఫెసర్లు స్వీయ ఆసక్తితో విద్యార్థులను ప్రోత్సహించి ఇంటర్న్షిప్, ఫీల్డ్ అసైన్మెంట్స్ అవకాశాలు కల్పిస్తే తప్ప.. ఒక కచ్చితమైన విధానంగా ప్రాక్టికాలిటీ అమలు కావడంలేదు. అలాగే మన దేశంలో మేనేజ్మెంట్ విద్య పరంగా ఎదురవుతున్న మరో ప్రధాన సమస్య ఫ్యాకల్టీ కొరత. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ - స్టూడెంట్ నిష్పత్తి 1:15గా ఉండాలి. ఫ్యాకల్టీ సభ్యుల్లో ప్రతి విభాగంలో ఇద్దరు పీహెచ్డీ పూర్తిచేసినవారు ఉండాలి. కళాశాలలు పీహెచ్డీ ఫ్యాకల్టీని నియమించుకుంటే భారీగా వేతనాలు ఇవ్వాల్సి వస్తుందని వెనుకంజ వేస్తున్నాయి. ఉద్యోగ నైపుణ్యాలపై ప్రభావం సిలబస్లో మార్పులు లేకపోవడం, ఫ్యాకల్టీ కొరత, క్షేత్రస్థాయి నైపుణ్యాలు అందకపోవడంతో ఎంబీఏల్లో ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ మెరుగవడం లేదు. ఓ వైపు జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉంటున్నా.. నైపుణ్యాలు లేక అర్హతలకు తగిన ఉద్యోగాలు లభించడం లేదు. దాంతో అరకొర జీతాలతో ఏదో ఒక కొలువులో సర్దుకుపోతున్నారు. దీనికి ప్రధాన కారణం సిలబస్ను, కరిక్యులంను మార్చకపోవడమే! కాబట్టి మేనేజ్మెంట్ కోర్సుల్లో సిలబస్లో నిరంతరం మార్పులు తేవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంబీఏ సిలబస్లో మార్పులు చేయడం చాలా అవసరం. ఈ విషయంలో యూనివర్సిటీల స్థాయిలో ఇటీవల కాలంలో కొంత వేగవంతమైన చర్యలు జరుగుతున్నాయి. విద్యార్థులు కూడా సెల్ఫ్ లెర్నింగ్ టూల్స్పై దృష్టిసారించాలి. జాబ్ మార్కెట్ అవసరాలు, అందుకు పొందాల్సిన నైపుణ్యాలపై అవగాహన పెంపొందించుకోవాలి. దీనికి ప్రొఫెసర్ల సలహాలు తీసుకోవాలి. - ప్రొఫెసర్ కె.రామమోహన్ రావు, ఏయూ కాలేజ్ ఆఫ్ కామర్స్. -
జస్ట్ 145 ఏళ్లే..!
విడ్డూరం ఎవడు బతికాడు మూడు యాభైలు అని సందేహపడ్డాడో కవివరేణ్యుడు. మరో ఐదేళ్లాగితే, ‘నేను బతికాను మూడు యాభైలు’ అంటాడేమో ఈ పెద్దాయన. ఈయన వయసు ఎంతో కాదు, జస్ట్ 145 ఏళ్లు మాత్రమే! అంటే, సెంచురీ దాటేయడమే కాదు, మరో హాఫ్ సెంచరీ దిశగా బతుకు పరుగు సాగిస్తున్నాడీయన. గిన్నెస్బుక్ వారు ఇంకా ఈ ఘనతను గుర్తించలేదు గాని, బహుశ ఈయనే ప్రపంచంలోకెల్లా అత్యంత వృద్ధుడు. ఇండోనేసియాలోని జావా దీవికి చెందిన ఎంబా గోథో అనే ఈ పెద్దాయన 1870 డిసెంబర్ 31న పుట్టాడట. అందుకు ఆధారంగా అధికారులు ఎప్పుడో జారీ చేసిన గుర్తింపు కార్డు కూడా ఆయన వద్ద ఉంది. ఆయన మనవలు ఆ ఐడీ కార్డును ఫొటో తీసి ఆన్లైన్లో పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ పోస్టు ఆధారంగా వార్తలు కూడా రావడంతో జావా దీవిలోని స్రాగెన్ పట్టణ అధికారులు కూడా ఈ పెద్దాయన ఐడీ కార్డును ఇటీవలే తనిఖీ చేశారు. అయితే, పాత రికార్డులను తరచి చూసి, ఐడీ కార్డులోని వివరాలను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉందని వారు చెబుతున్నారు. గోథో వివరాలను అధికారులు అధికారికంగా ధ్రువీకరిస్తే, ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘాయుష్కుడిగా ఈయన పేరు గిన్నెస్ రికార్డును బద్దలు కొట్టడం ఖాయం. రెండో ప్రపంచ యుద్ధం నాటికి తన వయసు 74 ఏళ్లని చెబుతున్న ఈ పెద్దాయన.. తనకు ఇంకా మిగిలి ఉన్న కోరిక మరణం ఒక్కటేనని అంటున్నాడు. చూపు మందగించి, ఎక్కువగా తిరగలేని స్థితిలో ఉన్న ఈయన బాగోగులను మనవలు, మునిమనవలే చూసుకుంటున్నారు. గోథో నలుగురు భార్యలు, పది మంది పిల్లలు మరణించి చాలా కాలమే అయింది. ఇప్పుడు ఆయనకు ఉన్నవాళ్లంతా మనవలు, మునిమనవలు, ముమ్ముని మనవలు మాత్రమే. -
7,8వ తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ స్పాట్ అడ్మిషన్లు
ఎచ్చెర్ల: ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఎంబీఏ, ఎంసీఏ మిగులు సీట్లుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పెద్దకోట చిరంజీవులు శనివారం తెలిపారు. వర్సిటీలో ఎంసీఏలో 28 సీట్లు, ఎంబీఏలో 12 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంబీఏకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, ఎంసీఏకు ఎంపీసీ, ఎంపీసీ కంప్యూటర్స్ ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఫీజు స్ట్రక్చర్ ఎంబీఏకు రూ.10,000, ఎంసీఏకు రూ. 12,500, కౌన్సెలింగ్ రుసుం రూ.300 చెల్లించాలన్నారు. వర్సిటీ ఆడిటోరియంలో 7, 8 తేదీల్లో నిర్వహించే కౌన్సెలింగ్కు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, టీసీ, ఇతర వర్సిటీ విద్యార్థులు మైగ్రేషన్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. -
రైలు ప్రమాదంలో ఎంబీఏ విద్యార్థిని మృతి
మంచిర్యాల రూరల్ : మంచిర్యాల రాంగనర్లో నివాసం ఉంటున్న నగునూరి శివాని(22) అనే ఎంబీఏ విద్యార్థిని రైలు ప్రమాదంలో మృతి చెందింది. రైల్వే ఎసై ్స మునీరుల్లా కథనం ప్రకారం చెన్నూర్లోని తమ్మళ్లవాడకు చెందిన నగునూరి శంకర్ మంచిర్యాల రాంనగర్లో కొద్ది రోజులుగా నివాసం ఉంటున్నాడు. శంకర్ కూతురు అయిన శివాని(22) హైదరాబాద్లోని తీగల కృష్ణారెడ్డి ఎంబీఏ కళాశాలలో చదువుతోంది. శుక్రవారం మంచిర్యాల నుంచి కాలేజీకి వెళ్లేందుకు మంచిర్యాల రైల్వేస్టేషన్లో తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కింది. ఈ ప్రయాణంలో పెద్దంపేట వరకు వెళ్లగా ప్రమాదవశాత్తు శివాని రైల్లోంచి కిందపడింది. ఈ ప్రమాదంలో శివాని తలకు, శరీర భాగాలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై ్స తెలిపారు. -
రేపటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 26 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ఎంవీ రెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ 26వ తేదీ నుంచే ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఈనెల 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 31వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన విద్యార్థులు ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని, ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి 3వ తేదీన రాత్రి 8 గంటల తర్వాత సీట్లు కేటాయించనున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 243 ఎంబీఏ కాలేజీల్లో 28,174 సీట్లు, 36 ఎంసీఏ కాలేజీల్లో 2,336 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంబీఏలో గతేడాది దాదాపు 40 వేల సీట్లు అందుబాటులో ఉండగా ఈసారి 28,174 సీట్లలో ప్రవేశాలకే యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అంటే 11 వేలకు పైగా సీట్లు తగ్గిపోయాయి. ఎంబీఏ, ఎంసీఏల్లో చేరేందుకు నిర్వహించిన ఐసెట్లో అర్హత సాధించిన 63,549 మంది విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరు కానున్నారు. రాత పరీక్షకు 72,474 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, మే 19వ తేదీన జరిగిన పరీక్షకు 66,510 మంది హాజరయ్యారు. అందులో 63,549 మంది అర్హత సాధించారు. వివరాలు..ఎంబీఏలో.. ప్రభుత్వ కాలేజీలు: 23 సీట్లు: 1,330 ప్రైవేటు కాలేజీలు: 220 సీట్లు: 26,844 ఎంసీఏలో.. ప్రభుత్వ కాలేజీలు: 14 ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు: 700 ప్రైవేటు కాలేజీలు: 22 ప్రైవేటు కాలేజీల్లో సీట్లు: 1,636 -
వైవీయూలో ఎంబీఏ స్పాట్ అడ్మిషన్లు
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి గల అభ్యర్థులకు ఈనెల 29వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వైవీయూ ప్రవేశాల సంచాలకుడు ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, నిర్ణీతఫీజుతో డీఓఏ కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. ఎంబీఏ విద్యార్థులకు సంవత్సరానికి రూ.10వేలు, ఎంసీఏ విద్యార్థులకు రూ.12 వేలతో పాటు ప్రాసెసింగ్ ఫీజు రూ.500– చెల్లించి ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ఐసెట్–2016 రాసిన వారు, రాయని వారుకూడా ఈ ప్రవేశాలకు హాజరుకావచ్చని తెలిపారు. ఓసీ విద్యార్థులు డిగ్రీలో 50 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 45 శాతం మార్కులతో పాసై ఉండాలన్నారు. -
పీజీ కోర్సులకు బయోమెట్రిక్
ఈ ఏడాది నుంచే అమలుకు ఉన్నత విద్యామండలి యత్నం ఎంబీఏ కోర్సులపై ఎక్కువ ప్రభావం ప్రస్తుతం దూర విద్య కోర్సుల్లా కొనసాగుతున్న పీజీ కోర్సులు ఎచ్చెర్ల: కళాశాలల్లో బయోమెట్రిక్ అమలు అయిదేళ్ల నుంచి ప్రతి పాదనల దశలోనే ఉంది. అమలుకు మాత్రం నోచుకోలేదు. ఈ ఏడాది ఎలాగైనా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తప్పనిసరిగా పీజీ, యూజీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరం అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. ఉన్నత విద్యామండలి యూనివర్సిటీలకు నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీలు సైతం ఏఫిలియేష న్ కమిటీలకు నోటీసులు జారీ చేశాయి. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తే ప్రవేశాలపై తీవ్ర ప్రభావం తప్పదని కళాశాలలు భావిస్తున్నాయి. ప్రస్తుతం పీజీ కోర్సులు చాలా వరకు దూర విద్య కంటే దారుణంగా నడుస్తున్నాయి. సెమిస్టర్ పరీక్షలు మాత్రమే విద్యార్థులు రాస్తున్నారు. అంతకు మించి కళాశాలలకు వెళ్లడం లేదు. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తే చాలా కళాశాలలు పీజీ కోర్సులు రద్దు చేసుకోవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు మాత్రమే ఇకపై పీజీ కోర్సుల్లో చేరవలసి ఉంటుంది. అధిక శాతం ఎంబీఏ కళాశాలలు పీజీ కోర్సులకు సంబంధించి ఎంబీఏ జిల్లాలో ఎక్కువ కళాశాలలు నిర్వహిస్తున్నాయి. ఎనిమిది కళాశాలల్లో 600 సీట్లు ఉన్నాయి. గత ఏడాది మొత్తం సీట్లు నిండగా, ఈ ఏడాది ప్రవేశాలు కౌన్సెలింగ్ దశలో ఉంది. ప్రైవేట్ కళాశాలలు మాత్రం బయోమెట్రిక్ అమలు సాధ్యం కాదని, తమ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని అంటున్నారు. అయితే బయోమెట్రిక్ అమలు చేస్తే 50 శాతం ప్రవేశాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఎం.ఫార్మశీ, ఎంటెక్, ఎల్ఎల్ఎం వంటి కోరుసల్లో ప్రవేశాలు ఘణనీయింగా తగ్గిపోతాయి. ఎం.పార్మశీ రెండు కళాశాలల్లో నిర్వహిస్తుండగా, ఎంటెక్ ఏడు కళాశాలల్లో, ఎల్ఎల్ఎం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు. దాదాపు ప్రైవేటుగా ఉద్యోగాలు చేసున్న వారే ఈ కోర్సులు చేస్తున్నారు. దూర విద్య ద్వారా చేస్తే పాస్ శాతం, మార్కులు శాతం పీజీ కోర్సుల్లో తక్కుగా ఉంటుంది. రెగ్యులర్ కోర్సుల్లో మార్కులతో పాటు కొన్ని కళాశాలల్లో చూసిరాతను సైతం ప్రోత్సహిస్తున్నాయి. ఈ రెండు అంశాల వల్ల పీజీ కోర్సులకు డిమాండ్ ఉంది. ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న వారు ఎక్కువగా ఎంబీఏకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో ఎంబీఏ తరగతులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీతో పాటు, మరో రెండు కళాశాలల్లో మాత్రమే పక్కాగా తరగతులు నిర్వహిస్తున్నారు. మిగతా కళాశాలలో దూరవిద్యా కోర్సు కంటే ఆధ్వానంగా నిర్వహిస్తున్నారు. 75 శాతం హాజరు ఉంటేనే రీయింబర్స్మెంట్ బయోమెట్రిక్ పక్కాగా అమలు చేస్తే 75 శాతం హాజరు ఉంటేనే రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ సాధ్యం. కనీసం 65 శాతం ఉంటేనే పరీక్షలకు అనుమతి సాధ్యం అవుతుంది. బయోమెట్రిక్ అమలు చేస్తే విద్యార్థి ప్రవేశాన్ని ఆధార్తో సీడింగ్ చేస్తారు. జాతీయ సమాచార కేంద్రం పలు సంస్థలకు బయోమెట్రిక్ అనుసంధానం చేస్తుంది. ఉన్నత విద్యా మండలి, బీసీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, వర్సిటీలు ఇలా అన్ని విభాగాలు అనుసంధానం చేస్తే విద్యార్థులు హాజరు ఎక్కడైనా తెలుసుకోవచ్చు. దాదాపుగా విద్యార్థులు తరగతులకు హాజరు కాకుండా చదవడం సాధ్యం కాదు. బయోమెట్రిక్ హాజరు ఈ ఏడాది అమలు అవుతుందో... లేదో, ప్రవేశాలపై ఎటు వంటి ప్రభావం చూపుతుందో నిరీక్షించవలసిదే. అయితే మొదటి ఏడాదిలో తప్పని సరిగా అమలు చేయాలని రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ భారం తగ్గించుకోవాలన్న అభిప్రాయం ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులు అమలు చేయడం సాధ్యం అయ్యే పరిస్థికాదన్నది కళాశాలల భావన. -
ఏపీ ఎంబీఏ, ఎంసీఏ ఫీజులు ఖరారు
-
ఐసెట్ కౌన్సెలింగ్కు 768 మంది హాజరు
ఐసెట్ ద్వారా ఎంబీఏలో ప్రవేశానికి గాను సోమవారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 1–5500 ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించగా 484 మంది రిజిస్టరు చేసుకున్నారు. కెమికల్ ఇంజనీరింగు కాలేజీలో 5501–11000 ర్యాంకుల వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరపగా 284 మంది సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో డిగ్రీలో మార్కుల శాతం పరిశీలించాల్సి రావడంతో ఎక్కువ సమయం పట్టింది. దీంతో పాలిటెక్నిక్ కాలేజీలో పొద్దుపోయేవరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మంగళవారం పాలిటెక్నిక్ కాలేజీలో 11,001–16,500 ర్యాంకులు, కెమికల్ ఇంజనీరింగు కాలేజీలో 16,501–22,000 ర్యాంకుల వారికి సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాళ్లు డి.ఫణీంద్ర ప్రసాద్, డాక్టర్ బి.దేముడు కౌన్సెలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎస్టీ విద్యార్థులు అందరూ పాలిటెక్నిక్ కాలేజీకి హాజరు కావాల్సి ఉంటుంది. -
ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం
ఉస్మానియా యూనివర్శిటీ: ఎంబీఏ విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఓయూ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి కథనం ప్రకారం... హబ్సిగూడ ఎస్ఎస్నగర్ నివాసి వేణుముద్దల శ్రీనివాస్రెడ్డి కుమార్తె ప్రియాంక (21) నల్ల నర్సింహారెడ్డి కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈనెల 1న తెల్లవారుజామున 2 గంటలకు ప్రియాంక ఇంటి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం కుమార్తె ఇంట్లో కనిపించకపోవడంతో ప్రియాంకకు ఆమె తల్లి ఫోన్ చేయగా.. స్నేహితులతో కలిసి షిరిడీ వెళ్తున్నట్టు చెప్పింది. ఆ తర్వాత ఫోన్ చేస్తా సమాధానం లేదు. దీంతో ఆమె తండ్రి ఆదివారం ఓయూ పోలీసులకు తన కుమార్తె కనిపించడంలేదని ఫిర్యాదు చేశారు. ప్రియాంక ఆచూకీ తెలిసిన వారు సెల్: 94906 16733 నంబర్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
సీట్లకు కోతే కోత..!
బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంఫార్మసీ కాలేజీల్లో భారీగా సీట్ల తగ్గింపు సాక్షి, హైదరాబాద్: ఈసారి బీటెక్, బీఫార్మసీ కాలేజీల్లోనే కాదు.. ఎంటెక్, ఎంబీఏ, ఎం.ఫార్మసీ కాలేజీల్లోనూ సీట్ల సంఖ్య భారీగా తగ్గనున్నట్లు సమాచారం. ఆయా కాలేజీల్లో అనేక బ్రాంచీలకు అధికారులు కోత విధించినట్లు తెలిసింది. బీటెక్లో 45 వేల నుంచి 50 వేల సీట్లకు కోత పడే అవకాశం ఉండగా.. ఎంబీఏ, ఎంటెక్, ఎం.ఫార్మసీలో ఉన్న దాదాపు 70 వేల సీట్లలో 25 వేల సీట్ల వరకు కోత పడనున్నట్లు తెలిసింది. ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అనుబంధ గుర్తింపు, వాటిల్లో ఫీజులపై ఉత్తర్వులు జారీ అవుతాయని శనివారం అర్ధరాత్రి వరకు కాలేజీ యాజమాన్యాలు ఉత్కంఠతో ఎదురుచూశాయి. అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా ప్రకటన ఇదిగో అదిగో అని చెప్పినా.. అర్ధరాత్రి వరకు జారీ కాలేదు. ఫీజుల జీవోదీ అదే పరిస్థితి. అర్ధరాత్రి వరకు అధికారులు కాలేజీ వారీగా ఫీజులను పరిశీలిస్తూనే ఉన్నారు. ఇక ఆదివారం ఉదయమే ఫీజుల జీవో, అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. -
చిన్నారులపై లైంగిక దాడికి యత్నం
యువకుడికి దేహశుద్ధి నెల్లూరు (క్రైమ్) : కామంతో కళ్లు మూసుకు పోయిన ఓ యువకుడు చిన్నారులపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన మాగుంట లేఅవుట్ వెంకటేశ్వరస్వామి గుడి సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో శనివారం రాత్రి జరిగింది. దీంతో స్థానికులు ఆ యువకుడికి దేహశుద్ధి చేసి నాల్గోనగర పోలీసులకు అప్పగించారు. కొడవలూరు మండలం తలమంచికి చెందిన కె. అశోక్ ఎంబీఏ వరకు చదువుకున్నాడు. అతను మాగుంట లేఅవుట్లోని వెంకటేశ్వరస్వామి గుడికి వస్తూ సమీపంలోని అపార్ట్మెంట్ల వద్ద బయట ఆడుకుం టున్న చిన్నారులకు చాకెట్లు, బిస్కెట్లు ఇచ్చి వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇటీవల అతని చేష్టలను గమనించిన స్థానికులు పట్టుకునేలోపే అశోక్ పరారయ్యాడు. శని వారం అశోక్ గుడి సమీపంలో ఉన్న బాలాజీ నిలయం వద్దకు వచ్చాడు. అపార్ట్మెంట్ బయట ఆడుకుం టున్న ఆరేళ్లు, ఏడేళ్లు వ యస్సు ఉన్న ఇద్దరు చిన్నారులుకు బిస్కెట్లు, చాక్లెట్లు ఆశ చూపి అపార్ట్మెంట్ సెల్లార్లోని బాత్రూమ్ వద్దకు తీసుకెళ్లి వారిపై లైంగిక దాడికి యత్నించాడు. గమనించిన అపార్ట్మెంట్ వాసులు కేకలు వేయడంతో అక్కడ నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో తాను తీసుకువచ్చిన బైక్ను మరి చిపోయాడు. కొద్దిసేపటి తర్వాత బైక్ కోసం రాగా స్థానికులు కాపు కాసి అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడు తన తండ్రి శ్రీనివాసులు సొసైటీ అధ్యక్షుడని, తనపై చేయివేస్తే అంతు చూస్తామని బెది రించారు. దీంతో స్థానికులు అతన్ని నాల్గోనగర పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అశోక్ కుటుంబం నెల్లూరులోనే ఉంటున్నట్లు సమాచారం. గతంలోనూ అశోక్ ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు దేహశుద్ధి చేసి ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
పరీక్షల్లో ఫెయిలవడంతో విద్యార్థిని ఆత్మహత్య
యాడికి: పరీక్షల్లో ఫెయిలయ్యానని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని యాడికి మండలం బోగాలకట్ట గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ(23) విజయవాడలోని ఓ ప్రైవేటు కళశాలలో ఎంబీఏ చదువుతోంది. సెమిస్టర్ పరీక్షలు పూర్తయ్యాక ఆమె గత కొన్ని రోజులుగా ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అందులో వెంకటేశ్వరమ్మ ఉత్తీర్ణత చెందకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంబీఏ.. మెరుగైన కాలేజీ ఎంపిక ఎలా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐసెట్ ముగిసింది.. ఫలితాలు సైతం వెలువడ్డాయి. మరికొద్ది రోజుల్లో కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఐసెట్ ర్యాంకుతో ఎంబీఏలో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ఇప్పుడు ఎదురయ్యే ప్రధాన ప్రశ్న.. మంచి కాలేజీని ఎంపికచేసుకోవడం ఎలా?! కాలేజీ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రమాణాలేంటి? ఈ క్రమంలో ఎంబీఏ కాలేజీ ఎంపికపై నిపుణుల సలహాలు... ఏఐసీటీఈ ప్రమాణాలు కళాశాల ఎంపికలో విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు- ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ సంఖ్య, ఫ్యాకల్టీ అర్హతలు, ఫ్యాకల్టీ సైటేషన్స్, మౌలిక సదుపాయాలు, లైబ్రరీ, ఈ-జర్నల్స్ సదుపాయం, అందుబాటులో ఉన్న రియల్ కేస్ స్టడీస్. * ఫ్యాకల్టీ - స్టూడెంట్ నిష్పత్తి: 1:15 * ఫ్యాకల్టీలో 80 శాతం మంది శాశ్వత ప్రాతిపదికన నియమితులై ఉండాలి. * ఫ్యాకల్టీ హోదాల పరంగా ప్రొఫెసర్; అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలు ఉండాలి. వీరి నిష్పతి 1:2:6గా ఉండాలి. * లైబ్రరీలో కనీసం ఆరు వేల జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నల్స్ అందుబాటులో ఉండాలి. * వీటిలో 25 శాతం జర్నల్స్ను డిజిటైజేషన్ విధానంలో ఈ-జర్నల్స్గా అందుబాటులో ఉంచాలి. * కంప్యూటర్స్ పరంగా నలుగురు విద్యార్థులకు ఒక కంప్యూటర్ చొప్పున అందుబాటులో ఉండాలి. * ఇవన్నీ ఉంటేనే ఒక కళాశాలలో పరిపూర్ణమైన బోధన లభిస్తుందని ఏఐసీటీఈ అంచనా. ఫ్యాకల్టీ.. ప్లేస్మెంట్స్ ఎంబీఏ మొదటి సంవత్సరం అందరికీ కామన్గా ఉంటుంది. కాబట్టి రెండో సంవత్సరంలో స్పెషలైజేషన్కు అనుగుణంగా సంబంధిత అర్హతలున్న ఫ్యాకల్టీ వివరాలు తెలుసుకోవాలి. వీటన్నింటి కంటే ముఖ్యంగా ప్లేస్మెంట్స్ పరంగా గత నాలుగేళ్ల సమాచారం సేకరించాలి. ప్లేస్మెంట్స్లో పాల్గొంటున్న కంపెనీలు, వాటి ప్రొఫైల్స్, అవి ఆఫర్ చేసిన ఉద్యోగాలు తదితరాల గురించి తెలుసుకోవాలి. గత మూడేళ్ల కాలంలో కళాశాలలో ఉత్తీర్ణత శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బీటెక్ కళాశాలల్లో ఎంబీఏ వివిధ ఇంజనీరింగ్ కళాశాల్లో ఎంబీఏ కోర్సు కూడా ఉంది. ఒక రకంగా ఇది ఎంబీఏ విద్యార్థులకు అనుకూలమని చెప్పొచ్చు. కారణం.. బీటెక్ స్థాయిలో పేరున్న కళాశాలలకు ఇండస్ట్రీ వర్గాల గుర్తింపు ఉంటుంది. ప్లేస్మెంట్స్ పరంగా ఇవి ముందుంటాయి. ఇంజనీరింగ్ కళాశాలల్లో నిర్వహించే ప్లేస్మెంట్లో బీటెక్, ఎంటెక్ విద్యార్థులే కాకుండా.. ఎంబీఏ అభ్యర్థులు సైతం అవకాశాలు అందుకోవచ్చు. కాబట్టి ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేసే కళాశాలలో ఎంబీఏ కూడా ఉంటే అది సానుకూల అంశమే! ప్రత్యక్ష పరిశీలన వివిధ సర్వే సంస్థలు కాలేజీలకు ఇస్తున్న ర్యాంకుల్లో తేడాలు ఉంటున్నాయి. వీటివల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ప్రత్యక్షంగా కళాశాలలను సందర్శించి, అక్కడి సీనియర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకోవడం మేలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, కోర్సులను అందిస్తున్న కళాశాలల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్లకు ప్రాధాన్యమిస్తున్న కళాశాలలపై దృష్టిసారించాలి. స్పెషలైజేషన్ కళాశాల ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో అంశం.. స్పెషలైజేషన్లు. ప్రస్తుతం అన్ని కళాశాలల్లో ప్రధాన స్పెషలైజేషన్లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు, సదరు స్పెషలైజేషన్కు సంబంధించి రియల్ కేస్ స్టడీస్ అందుబాటులో లేకపోవడం, కేస్ అనాలిసిస్ చేస్తూ బోధించే అధ్యాపకులు లేకపోవడం సమస్యగా మారింది. ఇలాంటి సమస్యలకు తావు లేని కళాశాలలను ఎంపిక చేసుకోవాలి. పరిశ్రమ వర్గాలతో ఒప్పందాలు కళాశాల ఎంపిక విషయంలో మరో ముఖ్యమైన అంశం.. పరిశ్రమ వర్గాలతో ఉన్న ఒప్పందాలు. ఇలాంటి ఒప్పందాలున్న కళాశాలల ద్వారా ఆయా కంపెనీల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం లభిస్తుంది. కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యల్ని ఫ్యాకల్టీ ద్వారా కేస్ అనాలిసిస్ చేసే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో ఎంబీఏ కాలేజీలు ఇలాంటి ఏర్పాట్లపై దృష్టిసారిస్తున్నాయి. కొన్ని కళాశాలలకు సీఐఐ, ఫిక్కీ, అసోచామ్, ఫ్యాప్సీ తదితర మేనేజ్మెంట్ అసోసియేషన్స్తో సంబంధాలు ఉంటున్నాయి. ఇలాంటి వాటిని ఎంపిక చేసుకోవడం వల్ల క్షేత్రస్థాయి నైపుణ్యాలు లభిస్తాయి. ఐసెట్ 2015 గణాంకాల ప్రకారం.. ఏపీలో ఎంబీఏ కళాశాలలు, సీట్లు కళాశాలలు: 384 సీట్లు: 45,965 తెలంగాణలో ఎంబీఏ కళాశాలలు, సీట్లు కళాశాలలు: 347 సీట్లు: 41,796 ఐసెట్ కౌన్సెలింగ్కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే కళాశాల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలి. చివరి ర్యాంకులు, వెబ్సైట్ సమాచారం, సర్వే రిపోర్టులకే పరిమితం కాకుండా.. ప్రత్యక్షంగా కళాశాలలను సందర్శించి వివరాలు తెలుసుకోవడం మంచిది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో విద్యార్థులు కళాశాల ఎంపికతో పాటు రెండో సంవత్సరంలో తీసుకోవాల్సిన స్పెషలైజేషన్పై అవగాహన ఏర్పరచుకోవాలి. - ప్రొ॥ఓం ప్రకాశ్, టీఎస్ ఐసెట్ కన్వీనర్. గత కౌన్సెలింగ్ ‘చివరి ర్యాంకులు’ ఆధారంగా కళాశాలలపై ప్రాథమికంగా ఒక అంచనాకు రావొచ్చు. ఔత్సాహికులు తమ ప్రాథమ్యాల వారీగా కళాశాలలను ప్రత్యక్షంగా సందర్శించి, నిర్ణయం తీసుకోవడం మంచిది. కళాశాలల ఎంపికలో వాటికి పరిశ్రమ వర్గాలతో ఉన్న ఒప్పందాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అదే విధంగా విద్యార్థులు కోర్సులో భాగంగా ఇంటర్న్షిప్స్, రియల్టైం ప్రాజెక్ట్వర్క్కు ప్రాధాన్యమివ్వాలి. - ప్రొ॥కట్టా రామమోహన్ రావు, ఏపీ ఐసెట్ కన్వీనర్. -
నేడు ఐసెట్
14 కేంద్రాల్లో నిర్వహణ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఐసెట్ గురువారం జరుగనుంది. జిల్లా కేంద్రంలో పద్నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక పరిశీలకులను నియమించామని వరంగల్ రీజినల్ సెంటర్ కోఆర్డినేటర్, కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సాయిలు తెలిపారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12-30గంటల వరకు జరిగే పరీక్షకు వరంగల్ రీజినల్ పరిధిలో 7,870 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. అభ్యర్థులు 9గంటల వరకే కేంద్రాలకు చేరుకోవాలని, నిర్ణీత సమయం కంటే ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద తొలుత అభ్యర్థుల వేలిముద్రలు, ఫొటోలు తీసుకుంటామని.. దీని కోసం ప్రత్యేకంగా బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లను నియమించామని వెల్లడించారు. కాగా, అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్పారుుంట్ పెన్ తప్ప సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తీసుకురావొద్దని సారుులు సూచించారు. -
నేడే టీఎస్ ఐసెట్
హాజరుకానున్న 2,963 మంది విద్యార్థులు జిల్లా కేంద్రంలో 5, కోదాడలో ఒక సెంటర్ బయోమెట్రిక్ అమలు.. నల్లగొండ రూరల్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ పరీక్ష గురువారం జరుగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అర్హత పరీక్షను బయోమెట్రిక్ విధానం ద్వారా అమలు చేస్తున్నారు. ఈ పరీక్షకు మొత్తం 2,963 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఐసెట్ రీజినల్ కోఆర్డినేటర్ అల్వాల రవి, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ నాగేందర్రెడ్డి, కోదాడ రీజియన్ కోఆర్డినేటర్ ఎ.శంకర్ బుధవారం కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లను పూర్తి చేయించారు. ఒక్క నిమిషం నిబంధన ఉండడంతో విద్యార్థులు ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. జిల్లా కేంద్రంలో 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా కోదాడలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నల్లగొండలో అన్నెపర్తిలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మూడు కేంద్రాలను, ఎన్జీ కాలేజీ, ఉమెన్స్ డిగ్రీ కాలేజీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 2,397 మంది విద్యార్థులు, కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్లో 566 మంది పరీక్ష రాయనున్నారు. 250 మందికి ఒక బయోమెట్రిక్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు ఆరుగురు చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్టికెట్తో పాటు ఆన్లైన్ దరఖాస్తు ఫారంపై ఫొటో అతికించి గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించి వెంట తెచ్చుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. -
ఐసెట్కు 74,448 మంది అభ్యర్థులు
19న పరీక్ష, 21న ప్రాథమిక కీ, 31న ఫైనల్ కీ, ఫలితాలు విడుదల కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను టీఎస్ ఐసెట్-2016కు ఇప్పటి వరకు 74,448 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని రాష్ర్ట ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి వెల్లడించారు. గత ఏడాదిలో ఐసెట్కు 69,232 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. మంగళవారం కేయూలో ఐసెట్ రీజినల్ కోఆర్డినేటర్ల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 2 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఈ నెల 19న ఐసెట్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షాకేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. రూ.10 వేల అపరాధ రుసుముతో ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 19న పరీక్ష, 21న ప్రాథమిక కీ, 31న తుది కీ విడుదల, ఫలితాల వెల్లడి ఉంటుందని తెలిపారు. -
అడ్మిషన్ ఇన్ఫో
ఐఐటీటీఎంలో బీబీఏ ఆనర్స్ కోర్స్ దక్షిణ భారతదేశంలో ఒకే ఒక క్యాంపస్ (నెల్లూరులో) గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (ఐఐటీటీఎం).. 2016-17 విద్యా సంవత్సరంలో పర్యాటక కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనను విడుదల చేసింది. * టూరిజంలో ఇప్పటికే ఎంబీఏ ప్రోగ్రామ్ను అందిస్తున్న ఐఐటీటీఎం నెల్లూరు ఈ ఏడాది నుంచి ‘టూరిజంలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) ఆనర్స్ డిగ్రీ’ని కూడా ప్రారంభిస్తోంది. ఈవెంట్ అండ్ ఏవియేషన్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్తో లభించే ఈ కోర్సు వ్యవధి మూడేళ్లు. * బీబీఏ టూరిజం ప్రోగ్రామ్కి ప్లస్ టూ (ఇంటర్మీడియెట్) ఉత్తీర్ణులు అర్హులు. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ జూన్ 10. జూలై రెండో వారంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫారాలు, ఇతర వివరాలను www.iittmsouth.org లో పొందొచ్చు. 0861-2353199, 9866274850 నంబర్లతోపాటు www.iittmnlr@gmail.comలోనూ సంప్రదించొచ్చు. -
ఎంబీఏ చదువులు ఘోరం!
♦ ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల్లేవు ♦ వచ్చినా జీతం రూ.10వేలకన్నా తక్కువే ♦ ఐఐటీ, ఐఐఎం విద్యార్థుల స్థితీ తీసికట్టే ♦ ఇంజినీర్లయితే 20-30 శాతం నిరుద్యోగులే ♦ టీచర్ల వృత్తిలోకి సరైన వాళ్లు రావటంలేదు ♦ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలి: అసోచామ్ న్యూఢిల్లీ: దేశంలో ఉన్నత స్థాయి చదువులైన ఎంబీఏ, ఇంజినీరింగ్కు సంబంధించి కళ్లు తిరిగే వాస్తవాల్ని అసోచామ్ బయటపెట్టింది. ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో అతికొద్ది మందికి తప్ప మిగతావారికి ఉద్యోగాలే దొరకటం లేదని, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 20-30 శాతం మంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని స్పష్టంచేసింది. దీనికి కారణాలను విశ్లేషిస్తూ... మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సి ఉందని స్పష్టంచేసింది. ఈ మేరకు అసోచామ్ ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘ప్రతిష్టాత్మక ఐఐఎం వంటి కొన్ని అగ్రశ్రేణి బిజినెస్ స్కూళ్లను మినహాయిస్తే... చాలా బిజినెస్ స్కూళ్లలో చదివిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ స్కూళ్ల నుంచి వస్తున్న గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దొరకటమే లేదు. చచ్చీచెడీ ఉద్యోగాలు సంపాదించినా వారి జీతాలు మాత్రం రూ.10వేల కంటే తక్కువే ఉంటున్నాయి’’ అని నివేదికలో అసోచామ్ అభిప్రాయపడింది. చదువుల్లో నాణ్యత లేకపోవటం, నాసిరకం మౌలిక సదుపాయాలు, తక్కువ జీతాలకే ప్రాంగణ నియామకాలు జరపడం వంటివి దీనికి కారణాలని పేర్కొంది. నిజానికి దేశంలో దాదాపు 5,500 బిజినెస్ స్కూళ్లున్నాయి. ఇక గుర్తింపు లేనివి కూడా కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుంది. వీటి చదువుల్లో నాణ్యత మాత్రం నానాటికీ తీసికట్టుగా తయారవుతోందని ఈ నివేదికలో అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ ఆందోళన వ్యక్తంచేశారు. నివేదికలో వెల్లడించిన ముఖ్యాంశాలివీ... ♦ దేశంలో ప్రధాన 20 బిజినెస్ స్కూల్స్ను మినహాయిస్తే మిగతా వాటినుంచి ఉత్తీర్ణత సాధిస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో 7 శాతం మందికే చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. ♦ మరో విషయమేంటంటే ఈ గ్రాడ్యుయేట్లలో ఆ 7 శాతం మాత్రమే ఉద్యోగానికి నిజంగా పనికొస్తున్నారు. ♦ గడిచిన రెండేళ్లలో ఢిల్లీ, ముంబయి, కోల్కతా, లక్నో, అహ్మదాబాద్, హైదరాబాద్, డెహ్రాడూన్లలో దాదాపు 200 బిజినెస్ స్కూళ్లను మూసేశారు. ఈ ఏడాది మరో 120 స్కూళ్లు మూసేసే అవకాశముంది. ♦ ఇవన్నీ మూతపడటానికి కారణం నాసిరకం చదువులు, ఆర్థిక మందగమనమే. 2014-16 మధ్య క్యాంపస్ రిక్రూట్మెంట్లు ఏకంగా 45 శాతం పడిపోయాయి కూడా. ♦ గడిచిన ఐదేళ్ల కాలంలో బి-స్కూళ్లలో సీట్లు మూడింతలయ్యాయి. 2015-16 లో ఎంబీఏ కోర్సుల్లో మొత్తం సీట్ల సంఖ్య 5.20 లక్షలుగా ఉంది. 2011-12 ఈ సంఖ్య 3.2 లక్షలు. ♦ రెండేళ్ల ఎంబీఏ కోసం సగటున ప్రతి విద్యార్థీ రూ.3-5 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కానీ వారి జీతం రూ.8-10వేలు మాత్రమే ఉంటోంది. ♦ స్కూలు స్థాయిలో నాణ్యమైన విద్య అందకపోవటంతో ఐఐఎం, ఐఐటీ గ్రాడ్యుయేట్ల స్థాయి కూడా పడిపోతోంది. పదిహేనేళ్ల కిందటి వారితో పోలిస్తే ప్రస్తుత గ్రాడ్యుయేట్ల మేధో స్థాయి చాలా తక్కువగా ఉంది. ♦ నాణ్యమైన బోధన సిబ్బంది లేకపోవటం కూడా దీనికి కారణమే. ఈ వృత్తి అంత ఆకర్షణీయంగా లేకపోవటంతో ఎక్కువమంది ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ♦ ఇక ఉన్నత విద్య విషయానికొస్తే నాణ్యత మరీ దారుణంగా ఉంది. కార్పొరేట్ ప్రపంచానికి తగ్గట్టుగా ఏమాత్రం లేదు. ♦ ఏటా దేశంలో 15 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. వీరిలో 20 నుంచి 30 శాతానికి ఎలాంటి ఉద్యోగాలూ దొరకటం లేదు. చాలా మంది వారి సాంకేతిక అర్హతలకన్నా తక్కువవైన చిన్నచిన్న ఉద్యోగాల్లో చేరుతున్నారు. -
ఎంబీఏ ప్రశ్నపత్రం తారుమారు
ఎస్వీయూలో పరీక్ష వాయిదా యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఎంబీఏ పరీక్షల్లో ప్రశ్నపత్రం తారుమారు కావడంతో పరీక్ష వాయిదావేశారు. ఎస్వీయూనివర్సిటీలో ప్రస్తుతం ఎంబీనీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం ఇండస్ట్రియల్ మార్కెటింగ్ పరీక్ష జరగాల్సి ఉంది. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకుని ఆన్సర్ షీట్ తీసుకున్నారు. ఇక ప్రశ్న పత్రం తీసుకుని పరీక్ష రాయడమే మిగిలింది. ఆ సమయంలో ప్రశ్నపత్రం తెరిచి చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. ఇండస్ట్రియల్ మార్కెటింగ్ ప్రశ్నపత్రం స్థానంలో రిటైల్ మార్కెటింగ్ ఉండటంతో ఏంచేయాలో తోచక పరీక్షల విభాగానికి తెలియజేశారు. వారు ప్రశ్న పత్రం కోసం వెతకగా కన్పించలేదు. ఇండస్ట్రియల్ మార్కెటింగ్ ప్రశ్నపత్రం స్థానంలో రిటైల్ మార్కెటింగ్ ప్రశ్నపత్రం రూపొందించినట్లు గుర్తించారు. చేసేదేమిలేక పరీక్ష వాయిదా వేశారు. అదేవిధంగా బుధవారం ఇంటర్నేషనన్ ఫైనాన్స్ అనే సబ్జెక్ట్పై పరీక్ష జరగాల్సి ఉంది. ఆ ప్రశ్నపత్రం కూడా సిద్ధంగా లేదని గుర్తించారు. బుధవారం పరీక్షను కూడా వాయిదా వేశారు. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తారు. ప్రీపీహెచ్డీ పరీక్షలు వాయిదా ఎస్వీయూలో ఈనెల 28 నుంచి జరగాల్సిన ప్రీ పీహెచ్డీ పరీక్షలను వాయిదావేశారు. అనివార్య కారణాల వల్ల ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగపు డీన్ ఎం.సురేష్ బాబు తెలిపారు. పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ప్రశ్నపత్రాలు రాక పోవడం వల్లే వీటిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. -
ఇంజనీరింగ్లో ఏడాది గరిష్ట ఫీజు 1.58 లక్షలు
* జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికకు ఆమోదముద్ర * ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజుల నిర్ధారణ * ఇక దేశవ్యాప్తంగా ఒకే ఫీజుల విధానం అమలు * నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఏఐసీటీఈ * ఏపీలో ఇంజనీరింగ్ గరిష్ట ఫీజు 1.05 లక్షలు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సుకు ఏడాది గరిష్ట ఫీజు రూ.1.44 లక్షల నుంచి రూ.1.58 లక్షల మధ్య నిర్ధారిస్తూ అఖిలభారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. రెండేళ్ల ఎంబీఏ కోర్సుకు ఏడాదికి గరిష్ట ఫీజును రూ.1.57 లక్షల నుంచి రూ.1.71 లక్షల వరకు నిర్ణయించింది. ఈ గరిష్ట ఫీజు ఏటా బీ ఆర్క్ (ఆర్కిటెక్చర్)లో 2.05 లక్షల నుంచి 2.25లక్షలు, బీ ఫార్మా కోర్సులకు రూ.1.41 లక్షల నుంచి రూ.1.55 లక్షల వరకు ఎంసీఏ కోర్సులకు రూ.1.57 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకు ఉండొచ్చని నిర్ధారించింది. ఎంటెక్ కోర్సుల్లో ఏడాది గరిష్ట ఫీజు రూ.2.31 లక్షల నుంచి 2.51 లక్షలుగా నిర్ణయించింది. ఆయా విద్యాసంస్థలు నెలకొన్న ప్రాంతాలు, నిర్వహణ ఖర్చులను అనుసరించి ఫీజులను ఆయా రాష్ట్రాల ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండళ్లు (ఏఎఫ్ఆర్సీ)లు నిర్ణయించాలని ఏఐసీటీఈ పేర్కొంది. స్వయం ప్రతిపత్తి (అటానమస్) విద్యాసంస్థలు ఈ గరిష్ట ఫీజుల మొత్తంలో 10శాతం, అక్రిడేటెడ్ విద్యాసంస్థలు 20 శాతం చొప్పున పెంచుకోవచ్చు. జాతీయస్థాయిలో ఉన్నత సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి కేంద్రం ఏర్పాటుచేసిన జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని ‘నేషనల్ ఫీజుల కమిటీ’ గరిష్ట ఫీజులను నిర్ణయిస్తూ గతేడాది ఆగస్టులో ఇచ్చిన నివేదికను కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమోదించడంతో ఏఐసీటీఈ ఆదేశాలు జారీ చేసింది. నిర్ధారిత గరిష్ట ఫీజులకు మించి విద్యాసంస్థలు వసూలు చేయడానికి వీల్లేదని, భిన్నంగా వ్యవహరిస్తే ఆయా సంస్థల గుర్తింపును రద్దుచేయడంతో పాటు కాలేజీలను మూసివేస్తామని హెచ్చరించింది. జస్టిస్ శ్రీకృష్ణ సారథ్యంలో పది మంది సభ్యులతో 2014లో ఏర్పాటైన కమిటీ ఈ గరిష్ట ఫీజులను నిర్ణయించి ఇచ్చిన నివేదిక సిఫార్సులను 2016-17 నుంచి అమల్లోకి తేవాలని ఆదేశాలు జారీచేసింది. అయిదేళ్లవరకూ ఇదే ఫీజుల విధానం ప్రస్తుతం ఆయా రాష్ట్రాల ఏఎఫ్ఆర్సీలు మూడేళ్లకోసారి ఫీజులను నిర్ధారిస్తున్నాయి. ఈ గరిష్ట ఫీజులు అయిదేళ్లవరకు అమల్లో ఉండాలని కమిటీ సూచించింది. * ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం భూమి, భవనాలు, ఇతర సదుపాయాలు, లాబొరేటరీలు, ఫ్యాకల్టీ, ఇతర సిబ్బంది, ఆయాకాలేజీలకు మంజూరైన సీట్ల సంఖ్య, చేరిన విద్యార్థుల సంఖ్య తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఫీజులను కమిటీ నిర్ధారించింది. ఆయా సంస్థలు జీతభత్యాలు, సంస్థల నిర్వహణకు చేస్తున్న ఖర్చులను అనుసరించి వీటిని నిర్ణయించారు. * సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆయా రాష్ట్రాలు, కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అనుసరించి మాత్రమే ఫీజులు వసూలుచేయాలని కమిటీ స్పష్టం చేసింది. విదేశీ, ప్రవాస భారతీయ విద్యార్థులకు సూపర్న్యూమరరీ సీట్లు కేటాయించాల్సి వచ్చినప్పుడు గరిష్ట ఫీజులకు మూడురెట్లు వసూలుచేసి ప్రవేశాలు కల్పించవచ్చు. * ఆయా కాలేజీల్లో మేనేజ్మెంటు, కన్వీనర్ కోటాలతో పాటు ఇతర ఏ రకమైన ప్రవేశాలకైనా ఇవే గరిష్ట ఫీజులకు మించి వసూలు చేయరాదని కమిటీ స్పష్టం చేసింది. విద్యార్థుల నుంచి బీమా రుసుము వసూలు చేయవచ్చు. * అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, పీజీ కోర్సులు, డిప్లొమో, పోస్టు డిప్లొమో, పార్టు టైమ్, డ్యూయెల్ డిగ్రీ, సమీకృత ప్రోగ్రాముల ప్రకారం గరిష్ట ఫీజులను నిర్ణయించారు. ఏపీలో గరిష్ట ఫీజు 1.05 లక్షలు ఏఐసీటీఈ నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కాలేజీలకు నిర్వహణ వ్యయాలను అనుసరించి ఈ గరిష్ట ఫీజులను నిర్ణయించింది. రాష్ట్రంలో ఈ సిఫార్సులను అనుసరిస్తూనే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గరిష్ట ఫీజులను నిర్ణయించనున్నారు. ఈదిశగా రాష్ట్ర ప్రవేశాలు, పీజుల నియంత్రణ మండలి కసరత్తు చేస్తోంది. ఏపీలో ఇంజనీరింగ్ కోర్సులకు కనిష్టం రూ.30వేలనుంచి గరిష్ట ఫీజు రూ.1.05 లక్షల వరకు ఉంటుందని మండలి వర్గాలు వివరించాయి. అంతకు ముందు సంవత్సరాల్లో కాలేజీల నిర్వహణకు అయిన వ్యయాలను అనుసరించి ఫీజులుండాలని కోర్టు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాయి. రూ.లక్షకు మించి ఫీజులుండే కాలేజీలు నాలుగైదుకు లోపే ఉండనున్నాయి. తక్కినవన్నీ రూ.30వేల నుంచి 80వేల లోపే ఉండ వచ్చంటున్నారు. ఫీజులపై ఏఎఫ్ఆర్సీ ఈనెల 12 నుంచి 28వరకు ఆయా కాలేజీల వాదనలు విననుంది. మే రెండో వారంలో ఫీజులను నిర్థారించనుంది. జాతీయ ఫీజుల కమిటీ నిర్ధారించిన ఆయా కోర్సుల గరిష్ట ఫీజులు కోర్సు టైప్-ఎక్స్ నగరం టైప్-వై నగరం టైప్-జెడ్ నగరం (ఫీజు/రూపాయల్లో) (ఫీజు/రూపాయల్లో) par (ఫీజు/రూపాయల్లో) 4 ఏళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ 1,58,317 1,50,473 1,44,882 5 ఏళ్ల ఆర్కిటెక్చర్ డిగ్రీ 2,25,283 2,13,469 2,05,034 4ఏళ్ల టౌన్ప్లానింగ్ 2,25,582 2,13,768 2,05,333 5ఏళ్ల అప్లయిడ్ ఆర్ట్స్,క్రాఫ్ట్స్ 2,25,582 2,13,768 2,05,333 4 ఏళ్ల ఫార్మాస్యుటికల్ డిగ్రీ 1,55,125 1,47,250 1,41,628 పీజీ కోర్సులు.. ఎంఈ, ఎంటెక్ 2,51,361 2,39,953 2,31,361 ఎం ఆర్క్ 2,69,714 2,56,107 2,45,877 2ఏళ్ల టౌన్ప్లానింగ్ 2,69,714 2,56,107 2,45,877 2 ఏళ్ల అప్లయిడ్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ 2,69,714 2,56,107 2,45,877 ఎం ఫార్మ్ 2,27,519 2,16,111 2,07,518 హోటల్మేనేజ్మెంటు, కేటరింగ్ 2,27,519 2,16,111 2,07,518 3ఏళ్ల ఎంసీఏ 1,71,137 2,16,111 2,07,518 2 ఏళ్ల ఎంబీఏ 1,71,286 1,63,410 1,57,787 ఈ ఫీజులకు సంబంధించి కమిటీ నివేదికలు, మార్గదర్శకాలను ఏపీలోనూ అమలు చేయడానికి వీలుగా తమకు వాటి కాపీలను అందించాలని ఏపీ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం ఏఐసీటీఈని కోరింది. ఈమేరకు సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.శాంతిరాముడు ఏఐసీటీఈ చైర్మన్కు లేఖ రాశారు. -
బైకు ప్రయాణం.. రెండు కుటుంబాల్లో విషాదం
జాతీయ రహదారిపై ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు ఎంబీఏ విద్యార్థుల దుర్మరణం వారిద్దరూ ఎంబీఏ పూర్తి చేశారు. ఇక ఉద్యోగంలో చేరి తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలనుకున్నారు. అంతలోనే వారిపై విధి చిన్నచూపు చూసింది. వారి ఆశలు.. ఆశయాలను చిదిమేసింది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. దువ్వూరు మండలం ఏకోపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులు దుర్మరణం చెందిన సంఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ విద్యార్థులు తిరుపతిలోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో చదివారు. ప్రొద్దుటూరు క్రైం/దువ్వూరు (వైఎస్ఆర్ జిల్లా) కర్నూలులోని గుత్తిరోడ్ పెట్రోల్ బంకు వద్ద ఉన్న శారదానగర్లో నివాసముంటున్న మాసుంపీరా చిన్న కుమారుడు నబీరసూల్ తిరుపతిలోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కాలేజిలో ఎంబీఏ చదివాడు. ఇటీవల కాలేజిలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లో హిందూజా గ్లోబల్ సొల్యూషన్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. ఏడాదికి రూ.3 లక్షలు జీతం తీసుకునేలా కంపెనీ నుంచి ఒప్పందం కుదర్చుకున్నాడు. కొన్ని రోజుల ప్రాజెక్టు వర్క్ అనంతరం ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో స్నేహితుడితో కలిసి బైకులో వెళుతూ ప్రమాదంలో మృతిచెందాడు. అదేవిధంగా కర్నూలు జిల్లా కల్లూరు మండలం మహాత్మానగర్కు చెందిన కురువ రామకృష్ణ రెండో కుమారుడు ప్రవీణ్ తిరుపతిలోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నాడు. చిన్న హోటల్ను నిర్వహిస్తున్న రామకృష్ణ ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించాడు. ప్రవీణ్కు ఉద్యోగం వస్తే తమ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయని కలలుగన్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. తిరుపతిలో ఉన్న బైక్ను ఇంటికి తీసుకువస్తుండగా ప్రవీణ్ తన పల్సర్ బైక్ను తీసుకువెళ్లి తిరుపతిలో పెట్టుకున్నాడు. ఇటీవలే చదువు పూర్తికావడంతో బైక్ను ఇంటికి తీసుకురావాలని భావించాడు. ఈ క్రమంలో ప్రవీణ్, నబీరసూల్ బుధవారం రాత్రి తిరుపతిలో బైక్పై బయలుదేరారు. దువ్వూరు సమీపంలోని ఏకోపల్లిలో ఉన్న డాబా వద్ద ఆగి ఉన్న లారీ ని ఢీకొన్నారు. ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందగా, నబీరసూల్ తీవ్రంగా గాయ పడి ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందాడు. విషయం తెలియడంతో కర్నూలు నుంచి ఇరువురు విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కన్నీరు మున్నీరైన స్నేహితులు నిన్నటి వరకూ తమతో కలిసి ఉన్న ఇద్దరు స్నేహితులు మృత్యువాత పడడంతో మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రవీణ్, నబీరసూల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్న సమాచారం అందడంతో చదలవాడ ఇంజినీరింగ్ కాలేజిలో చదువుకున్న వారి స్నేహితులు ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. వారి మృతదేహాలను చూసి బోరున విలపించారు. -
ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
♦ 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. మే 16న పరీక్ష ♦ తెలంగాణలోని విద్యార్థులకూ ఏపీలోనే పరీక్ష ఏయూ క్యాంపస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఐసెట్)-2016 నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఐసెట్ చైర్మన్, ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు విలేకరులకు వెల్లడించారు. రూ. 350 రిజిస్ట్రేషన్ రుసుముతో ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 6 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. పరీక్షను మే 16న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పరీక్ష కేంద్రాల సంఖ్యను నిర్ణయిస్తామన్నారు. పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 17 రీజనల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాగా, తెలంగాణ పరిధిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయట్లేదని తెలిపారు. అక్కడి విద్యార్థులు కూడా ఏపీకి వచ్చి పరీక్ష రాయాల్సిందేనని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఠీఠీఠీ. ్చఞజీఛ్ఛ్టి.్ఛ్ట.జీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. -
'ఒక రోజే స్పెషల్ క్లాస్ తీసుకున్నారు'
కదిరి: అనంతపురం జేఎన్టీయూలో కీచకపర్వంపై వీసీ సర్కార్, రిజిస్ట్రార్ కృష్ణయ్య స్పందించారు. ఎంబీఏ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్ తమ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాదని వారు తెలిపారు. 2013లో ఒక రోజు మాత్రమే విద్యార్థులకు స్పెషల్ క్లాస్ తీసుకున్నారని వెల్లడించారు. ఆ తర్వాత ఎంబీఏ విద్యార్థిని, సుశీల్ కుమార్ మధ్య ఏం జరిగింతో తమకు తెలియదని చెప్పారు. ఈ వ్యవహారంతో యూనవర్సిటీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా, సునీల్ కుమార్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఎంబీఏ విద్యార్థిని మంగళవారం రాత్రి కదిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా చెప్పినట్టు వినకుంటే యాసిడ్ పోస్తానంటూ తనను బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. గతంలో లైంగిక వేధింపులకు గురిచేశాడని వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక రోజే స్పెషల్ క్లాస్ తీసుకున్నారు'
-
జెఎన్టీయూలో కీచకపర్వం
కదిరి: అనంతపురం జేఎన్టీయూ అధ్యాపకుడు ఓ విద్యార్థిని పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు కదిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు... కదిరి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని గతంలో జెఎన్టీయూ లో ఎంబీయే పూర్తిచేసింది. అప్పట్లో గెస్ట్ ఫ్యాకల్టీ అయిన సుశీల్ కుమార్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు గురిచేశాడు. కాగా, ఎంబీయేలో ఓ సబ్జెక్ట్కు సంబంధించి పరీక్షకు హాజరయ్యేందుకు తాజాగా ఆమె జేఎన్టీయూకు వెళ్లింది. ఆ సమయంలోనూ ఆమె పట్ల సుశీల్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా చెప్పినట్టు వినకుంటే యాసిడ్ పోస్తానంటూ విద్యార్థిని బెదిరించాడు. దీంతో వేధింపులు భరించలేని బాధితురాలు మంగళవారం రాత్రి కదిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకుని సుశీల్ కుమార్ కోసం గాలిస్తున్నారు. -
ఎంబీయే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
రాజాం : శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొత్తవలస గ్రామం సమీపంలో ఎంబీయే విద్యార్థిని సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. బాడంగి మండలానికి చెందిన ఓ యువతి విశాఖపట్నంలో ఎంబీయే చదువుతోంది. ఆమెకు కొత్తవలసకు చెందిన ఓ వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రియుడిని కలిసేందుకు సోమవారం కొత్తవలసకు చేరుకున్న ఆమె... పురుగుల ముందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ విఫలమే కారణంగా తెలుస్తోంది. -
విద్యార్థిని వేధిస్తున్న ఉద్యోగిపై కేసు నమోదు
గుంటూరు : కాంట్రాక్ట్ ఉద్యోగి తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడంటూ ఓ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన శనివారం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో చోటు చేసుకుంది. యూనివర్శిటీలోని విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి రమేష్... యూనివర్శిటీలో చదువుతున్న ఎంబీఏ విద్యార్థిని తనను పెళ్లి చేసుకోవాలని వెంట పడుతున్నాడు. దీంతో విసిగిపోయిన ఆమె పెదకాకాని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రమేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని... ప్రశ్నిస్తున్నారు. -
ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య
వెలిగొండ (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలిగొండ మండలం నర్సాయిగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాల వినోద్(24) ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఒత్తిడి తట్టుకోలేక గురువారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మరణించాడు. -
స్మృతికి ఝలక్ ఇచ్చిన స్టూడెంట్
జమ్మూ కాశ్మీర్: శ్రీనగర్ పర్యటనకు ముందే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఓ విద్యార్థి ఝలక్ ఇచ్చాడు. కేంద్రమంత్రి సోమవారం ఇస్లామిక్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. అయితే మంత్రి నుంచి ఎంబీఏ పట్టా తీసుకోబోనని ఓ విద్యార్థి ప్రకటించాడు. అందుకుగల కారణాలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి 2008లో సమీర్ గోజ్వారీ అనే విద్యార్థి ఎంబీఏ పూర్తి చేశాడు. సోమవారం కేంద్రమంత్రి చేతుల మీదగా సమీర్ పట్టా అందుకోవాల్సివుంది. భావప్రకటన స్వేచ్ఛపై దేశం జరుగుతున్న దాడులకు నిరసనగా తాను పట్టా తీసుకోవడం లేదంటూ సమీర్ ప్రకటించాడు. సాహిత్య అకాడమి అవార్డులు వెనక్కు ఇచ్చేస్తున్న రచయితలకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. ఓ విద్యార్థి తన జీవితంలో మాస్టర్ డిగ్రీను అందుకోవడంలో ఉన్న ఆనందం.. మిగతా ఏ ముఖ్యమైన అవార్డు అందుకున్నప్పుడు ఉండదన్నాడు. కానీ దేశంలో భావప్రకటన స్వేచ్ఛకు విలువలు తగ్గడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై స్మృతి ఇరానీ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. కాగా, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో శ్రీనగర్ అధికారులతో పాటు యూనివర్సిటీ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. -
వాచ్మన్ ఉద్యోగానికి ఎంబీఏ అభ్యర్థుల పోటీ
విశాఖపట్నం: ఆ మధ్య ఉత్తరప్రదేశ్ లో ప్యూన్ ఉద్యోగానికి పీహెచ్ డీ హోల్డర్లు సహా లక్షల మంది అభ్యర్థులు పోటీపడటం విన్నాం. ఇప్పుడిక ఆంధ్రప్రదేశ్ వంతు. విశాఖపట్టణం జిల్లా విద్యుత్ శాఖలో రెండు నైట్ వాచ్ మన్ పోస్టులకుగానూ శుక్రవారం నిర్వహించిన పరుగు పందెంలో డిగ్రీ ఏం ఖర్మ.. ఎంబీఏ పాసైన అభ్యర్థులు కూడా పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బాబు వస్తే.. మంచి జాబు వచ్చేమాట దేవుడెరుగు.. అమ్మకు రోగం వస్తేనో, నాన్నకు కష్టం కలిగితేనో కాస్తంత ఆసరగా ఉండొచ్చనుకున్నారో ఏమో.. చిన్న ఉద్యోగమనికూడా తలచకుండా పరుగు పందెంలో పాల్గొన్నారు. నిజానికి ఈ ఉద్యోగానికి పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ విద్యార్హత. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగాల నోటిఫికేషన్ ఎంతకూ రాకపోవడంతో వీరు అర్హత తగ్గ ఉద్యోగం కాకపోయినా పరుగు పోటీలో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. జిల్లా విద్యుత్ శాఖ డిపార్టుమెంట్ విభాగంలో ఒక పోస్టు, ఏపీఈపీడీసీఎల్ జిల్లా హెడ్ ఆఫీస్లో మరో పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు పోస్టులకు 462 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత్ శాఖ డిపార్టుమెంట్ విభాగంలో ఉద్యోగం కోసం ముడసర్లోవ వద్ద బీఆర్టీఎస్ రోడ్డులో శుక్రవారం ఉదయం ఆ శాఖ అధికారులు అభ్యర్థులకు పరుగు పోటీలు నిర్వహించారు. శనివారం హెడ్ ఆఫీస్లో వాచ్మన్ ఉద్యోగం కోసం పరుగు జరగనుంది. -
ఓయూలో 6న దూరవిద్య ఎంబీఏ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఓయూ దూరవిద్యలో 2015-16 విద్యాసంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు సెప్టెంబర్ 6న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు డెరైక్టర్ ప్రొ.హెచ్.వెంకటేశ్వర్లు తెలిపారు. అభ్యర్థులు వచ్చే నెల 4 నుంచి హాల్టికెట్లను ఓయూ వెబ్సైట్ లేదా దూరవిద్య వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష ఓయూ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో ఉదయం 10 నుంచి 11.30 వరకు నిర్వహించనున్నారు. వాస్తవంగా ఈ నెల 30న జరగాల్సిన ఈ పరీక్షను అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వచ్చే నెల 6కు వాయిదా వేసినట్లు డెరైక్టర్ తెలిపారు. యూ పీజీ ఫలితాలు విడుదల సాక్షి, హైదరాబాద్: ఓయూ పరిధిలో జరిగిన పలు ఎంఏ రెగ్యులర్ కోర్సుల సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలో మార్కుల జాబితాలను ఆయా కాలేజీలకు జారీ చేయనున్నట్లు చెప్పారు. నేడు (31న) ఎమ్మెస్సీ కోర్సుల ఫలితాలతో పాటు ఇది వరకు ప్రకటించని ఇతర పీజీ కోర్సుల ఫలితాలను వెల్లడించనున్నట్లు పీజీ కోర్సుల అడిషనల్ కంట్రోలర్ ప్రొ.సుధాకర్రెడ్డి తెలిపారు. -
రూ.10 వేలు ఇస్తాం.. కాలేజీకి రానక్కర్లేదు!
సాక్షి, హైదరాబాద్: ‘ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరాలనుకుంటున్నారా.. అయితే వెబ్ ఆప్షన్లలో మా కాలేజీని ఎంచుకోండి.. మీరు కాలేజీకి రావాల్సిన అవసరం లేదు.. మేమే మీకు రూ.10 వేలు ఇస్తాం’ అంటూ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ప్రలోభ పెడుతున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్ల్దిండ్రుల ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నాయి. ప్రధాన కాలేజీలు తప్ప చిన్న చిన్న కాలేజీలు మా కాలేజీలో చేరండంటే.. మా కాలేజీలో చేరండి అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. కన్వీనర్ కోటాలో చేరితే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి అందులో నుంచి కొంత మొత్తం ఇస్తామని విద్యార్థులకు ఎర వేస్తున్నాయి. పైగా కాలేజీకి రానవసరం లేదని అటెండెన్స్, మార్కులు తామే వేస్తామంటూ ప్రలోభ పెడుతున్నాయి. ఈ విషయం కాస్తా ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి దృష్టికి వెళ్లింది. అంతేకాదు ఆయన ఓ కాలేజీ యాజమాన్యానికి పేరెంట్లాగా ఫోన్ చేసి అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. ‘ఇదేమీ టెక్నికల్ కోర్సు కాదు కదా.. కాలేజీకి రానవసరం లేదు. మా కాలేజీలో చేర్చితే రూ.10 వేలిస్తాం’ అని యాజమాన్యం చెప్పడంతో పాపిరెడ్డి అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో కాలేజీల్లో విద్యార్థుల హాజరు విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంతోపాటు యాజమాన్యాల తప్పిదాలకు ఎలా చెక్ పెట్టాలన్న అంశంపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దాదాపు 250 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 28,228 సీట్లు అందుబాటులో ఉండగా, ఎంసీఏ కాలేజీల్లో 2,181 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. -
దినేష్ మృతికి చంద్రబాబే భాద్యత వహించాలి: శైలజానాథ్
-
స్నేహితురాలితో అసభ్యప్రవర్తన: ఎంబీఏ విద్యార్థి అరెస్టు
హైదరాబాద్: తాగిన మైకంలో స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించి ఓ ఎంబీఏ విద్యార్థి కటకటాల పాలయ్యాడు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రహ్మత్నగర్ నివాసి పవన్కుమార్ (23)ఎంబీఏ చదువుతున్నాడు. బోనాల సంద ర్భంగా ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. మద్యం మత్తులో ఉన్న పవన్ సోమవారం తె ల్లవారుజామున 4 గంటలకు శాలివాహననగర్లో నివసించే తన స్నేహితురాలి ఇంటి వద్దకు వెళ్లాడు. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. -
బస్సు ఢీకొని, ఎంబీఏ విద్యార్థి దుర్మరణం
సనత్నగర్: యాక్టివాపై వెళ్తున్న ఎంబీఏ విద్యార్థి ప్రై వేటు బస్సు ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్.ఐ. ఈశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం...కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీకి చెందిన నారాయణరెడ్డి కుమారుడు సాయికృష్ణ మల్లారెడ్డి కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం కంప్యూటర్ విడి పరికరాల కోసం యాక్టివా వాహనంపై అమీర్పేట్ మైత్రీవనంకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా భరత్నగర్ వద్ద హెటిరో కంపెనీకి చెందిన బస్సు బలంగా ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడ్డ సాయికృష్ణను కూకట్పల్లి రాందేవ్రావ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సినిమాల స్ఫూర్తితో చోరీలు
పోలీసులకు చిక్కిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ చాంద్రాయణగుట్ట: సినిమాల్లో వచ్చే దొంగతనం సన్నివేశాలు చూసి చోరీల బాటపట్టాడో ఎంబీఏ పట్టభద్రుడు. సదరు ప్రబుద్ధుడిని హుస్సేనీఆలం పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్కు తరలించారు. పురానీహవేళీలోని తన కార్యాలయంలో శనివారం దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... చాంద్రాయణగుట్ట నషీబ్నగర్కు చెందిన మహ్మద్ అవేజ్ అహ్మద్ (34) ఎంబీఏ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సినిమాల్లో వచ్చే చోరీ సన్నివేశాలు, పత్రికలలో వచ్చే దొంగతనాల వార్తలు చూసి చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకున్న తెలివితో పోలీసులు తిరగని బస్తీలలో గుట్టు చప్పుడు కాకుండా దొంగతనాలు చేయసాగాడు. ఈ క్రమంలోనే హుస్సేనీఆలం పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగు దొంగతనాలు చేశాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న హుస్సేనీఆలం అదనపు ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ సాంకేతిక ఆధారాలతో అవేజ్ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 10 తులాల బంగారం, రూ. 12,500ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా అవేజ్ దొంగతనం చేసే తీరును బట్టి భవిష్యత్లో గజదొంగ అయ్యేలా ఉన్నాడని, అలాంటి దొంగను ఆదిలోనే పట్టుకున్నందుకు అదనపు ఇన్స్పెక్టర్కు నగదు రివార్డును అందించనున్నామని డీసీపీ చెప్పారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ కె.బాబురావు, చార్మినార్ ఏసీపీ అశోక చక్రవర్తి, హుస్సేనీఆలం ఇన్స్పెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదుకు ప్రతిపాదనలు పంపామన్నారు. -
ఆ సెల్ ఫోన్లు ఎందుకు సీజ్ చేయలేదు?
న్యూఢిల్లీ: హర్యానాలోని జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఎంబీఏ విద్యార్థినిపై సీనియర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి 21 ఏళ్ల విద్యార్థినిపై సీనియర్, అతడి స్నేహితులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఏడాదిన్నరపైగా జరిగిన ఈ దారుణోదంతం వెలుగు చూసింది. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని న్యాయస్థానికి బాధితురాలు మొరపెట్టుకుంది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. స్టేటస్ నివేదిక సమర్పించాలని హర్యానా పోలీసులను ఆదేశించింది. నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. తన ఫోటోలు బయటపెడతారన్న భయంతోనే ఇన్నాళ్లు ఫిర్యాదు చేయలేదని తెలిపింది. ఇది సీరియస్ కేసు అని, నిందితుల సెల్ ఫోన్లు ఎందుకు సీజ్ చేయలేదని హర్యానా పోలీసులను జస్టిస్ ఏకే సిక్కి, జస్టిస్ యుయు లలిత్ లతో కూడిన బెంచ్ ప్రశించింది. వెంటనే స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. -
టీఎస్ ఐసెట్ -2015 ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2015-2016 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను శుక్రవారం టీఎస్ ఐసెట్-2015 ప్రారంభమైంది. 69,232 మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్ష రాయనున్నారు. టీఎస్ఐసెట్ నిర్వహణకు 15 రీజియన్ సెంటర్లు వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తిలో 119 పరీక్ష కేంద్రాలను కేటయించారు. ఈ పరీక్ష శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. పది గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించమని అధికారులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఐసెట్కు సంబంధించి మే 25న ప్రాథమిక కీ విడుదల చేసి, జూన్ 3వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఫలితాలను జూన్ 9న విడుదల చేస్తారు. . శుక్రవారం ఉదయం 6గంటలకు ఐసెట్ ప్రశ్నాపత్రం సెట్ను కేయూ ఇన్చార్జ్ వీసీ చిరంజీవులు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి కేయూలోని ఐసెట్ కార్యాలయంలో డ్రా తీయనున్నారు. icet - 2015, telangana icet, MBA,t.papireddy, ఐసెట్ 2015, తెలంగాణ, విద్యార్థులు, ఎంబీఏ -
ఎంబీఏకు దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రెండేళ్ల ఎంబీఏ(హాస్పిటల్ అండ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్) కోర్సులో 2015-16 సంవత్సరానికిగాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. డిగ్రీ చదివిన విద్యార్థులు దీనికి అర్హులని ఇందుకోసం జూన్ 13న అపోలో హెల్త్సిటీలో అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు 040-23556850 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
బయోటెక్నాలజీలో ఎంబీఏ...
నానోటెక్నాలజీలో ఎంటెక్ను ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్ల వివరాలు తెలపండి? -శ్రీధర్, ఆదిలాబాద్ కొన్ని ఇన్స్టిట్యూట్ల వివరాలు: హర్యానాలోని కురుక్షేత్రలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్ డిగ్రీని అందిస్తోంది. అర్హత: ఫిజిక్స్/అప్లైడ్ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీ/ ఎలక్ట్రానిక్స్/ ఇంజనీరింగ్ ఫిజిక్స్/ మెటీరియల్ సైన్స్/ నానోసైన్స్ అండ్ టెక్నాలజీలలో ఎంఎస్సీ లేదా బయోటెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ ఇంజనీరింగ్ ఫిజిక్స్/మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ కంప్యూటర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ప్రవేశం: గేట్ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.nitkkr.ac.in కేరళలోని కాలికట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. నానోటెక్నాలజీలో ఎంటెక్ కోర్సును అందిస్తోంది. అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ప్రవేశం: గేట్ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: http://nitc.ac.in/ ఉత్తరాఖండ్లో రూర్కీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నానోటెక్నాలజీలో ఎంటెక్ కోర్సును అందిస్తోంది. వెబ్సైట్: www.iitr.ac.in బయోటెక్నాలజీలో ఎంబీఏ అందించే ఇన్స్టిట్యూట్ల వివరాలు తెలపండి? -వేణు, ఆదిలాబాద్ హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్.. బయోటెక్నాలజీలో పీజీ డిప్లొమా కోర్సును అందిస్తోంది. అర్హత: కనీసం 50శాతం మార్కులతో డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.ipeindia.org న్యూఢిల్లీలోని అమిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ.. బయోటెక్నాలజీలో ఎంబీఏ డిగ్రీని అందిస్తోంది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో లైఫ్ సెన్సైస్లో డిగ్రీ. ప్రవేశం: మ్యాట్/ఎక్స్ఏటీ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.amity.edu పుణెలోని పుణె యూనివర్సిటీలో మేనేజ్మెంట్ సైన్స్ డిపార్ట్మెంట్.. బయోటెక్నాలజీలో ఎంబీఏ కోర్సును అందిస్తోంది. అర్హత: బయాలజీ/బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/బోటనీ/కెమిస్ట్రీ/ లైఫ్సెన్సైస్/ మెరైన్ బయాలజీ/ మైక్రోబయాలజీ/జువాలజీలలో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత. ప్రవేశం: ఇండియన్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్ నిర్వహించే ఎయిమ్స్ టెస్ట్ ఫర్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్(ఏటీఎంఏ) పరీక్షలో స్కోర్ ఆధారంగా. వెబ్సైట్: www.pumba.in. ముంబైలోని పద్మశ్రీ డీవై పాటిల్ యూనివర్సిటీ బయోటెక్నాలజీ మేనేజ్మెంట్లో ఎంబీఏ డిగ్రీని అందిస్తోంది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ప్రవేశం: దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.dypatil.com ఉపాధి అవకాశాలు: డ్రగ్ డెవలప్మెంట్, హెల్త్ కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్స్, బయో ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్, వేస్ట్ మేనేజ్మెంట్ న్యూట్రీషన్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్, యానిమల్ సెన్సైస్ లాంటి సంస్థల్లో, ప్రభుత్వ విభాగాలకు చెందిన బయోటెక్నాలజీ, హార్టీకల్చర్ లాంటి సంస్థల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. విదేశీ భాషల్లో దేన్ని నేర్చుకోవడం ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయో తెలపండి? -అశోక్, జడ్చర్ల కొన్ని యూనివర్సిటీల వివరాలు: హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ అరబిక్, ఫ్రెంచ్, పర్షియన్లలో ఎంఏను ఆఫర్ చేస్తోంది. దానితో పాటు ఫ్రెంచ్/జర్మన్/ రష్యన్ భాషలలో జూనియర్ డిప్లొమా, సీనియర్ డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా లాంటి కోర్సులను అందిస్తోంది. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా వెబ్సైట్: www.osmania.ac.in హైదరాబాద్లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ.. అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, రష్యన్ భాషల్లో ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా ఎంఏ డిగ్రీని అందిస్తోంది. దీనితో పాటు ఒకేడాది అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ రష్యన్ కోర్సును అందిస్తోంది. హైదరాబాద్లోని అలియన్స్ ఫ్రాంఛైజ్.. ఫ్రెంచ్లో డిప్లొమా ప్రోగ్రామ్లను అందిస్తోంది. వెబ్సైట్: http://hyderabad.afindia.org/ -
ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలు వాయిదా
హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈ నెల 6న జరగనున్న ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలను 7వ తేదీకి వాయిదా వేసినట్లు యూనివర్శిటీ డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ డా. కె. ఈశ్వరప్రసాద్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హోలీ సెలవు దినంగా శుక్రవారాన్ని ప్రభుత్వం ప్రకటించడంతో పరీక్షలను మరుసటి రోజు షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్లు తెలిపారు. -
పాముకాటుతో ఎంబీఏ విద్యార్థిని మృతి
గుంటూరు: గుంటూరు జిల్లా రేపల్లె మండలం జొన్నావారిపాలెంలో సోమవారం సాయంత్రం పాముకాటుతో కళ్యాణి(23) అనే ఎంబీఏ విద్యార్థిని మృతి చెందింది. గడ్డివాము నుంచి పశువులకు మేత తీస్తుండగా పాము కాటు వేసింది. కళ్యాణి గుంటూరులో ఎంబీఏ అఖరి సంవత్సరం చదువుతోంది. (రేపల్లె) -
ఓయూ దూరవిద్య ఎంబీఏ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఓయూ దూరవిద్య ఎంబీఏ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర పరీక్షలతో పాటు ఎంబీఏ రెగ్యులర్ కోర్సు 3వ సెమిస్టర్ ఫలితాలను ఉస్మానియా వెబ్సైట్లో ఉంచినట్లు అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ నవీన్ తెలిపారు. -
ఎంబిఏ విద్యార్థి ఆత్మహత్య
గ్రేటర్ నోయిడా: అనుమానస్పద స్థితిలో ఎంబిఏ విద్యార్థి మృతిచెందిన ఘటన గ్రేటర్ నోయిడాలోని ఓ హాస్టల్లో శనివారం వెలుగుచూసింది. పోలీసులు కథనం ప్రకారం.. బీహార్కు చెందిన రంజిత్ అనే విద్యార్థి ఓ ప్రైవేటు కాలేజీలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్ రూంలో రంజిత్ ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తోటి విద్యార్థులు హాస్టల్ యాజమాన్యానికి చెప్పారు. దాంతో హాస్టల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అతని రూంలో నిద్రమాత్రలు దొరికినట్టు పోలీసులు తెలిపారు. అయితే రంజిత్ మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్యచేసారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు ఇంకా నమోదు చేయలేదని, రంజిత్ సహాచరులు, మిత్రులను ప్రశ్నిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
విద్యా, పోటీ పరీక్షల సమాచారం
2 వరకు సంగీత పరీక్ష ఫీజు చెల్లింపు గడువు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు, పాఠశాలల్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మే నెలలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందు కోసం సర్టిఫికెట్ డిప్లొమా కోర్సుల రెగ్యులర్, ప్రైవేట్ అభ్యర్థులు ఫిబ్రవరి 2వ తేదీ లోగా ఫీజు చెల్లించాలని వర్సిటీ రిజిస్ట్రార్ కె. తోమాసయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ ఫలితాలు విడుదల సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గత సెప్టెంబర్ 28న నిర్వహించిన ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ టెస్టు ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో సెమిస్టర్ విధానం సాక్షి, హైదరాబాద్: డిగ్రీలోనూ సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ కాలేజీల్లో అమలు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్ఎస్క్యూఎఫ్, సీబీసీఎస్పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా శుక్రవారం సమావేశ మైంది. అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 15 వరకు ఇగ్నో అడ్మిషన్లకు గడువు విజయవాడ: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) 2015 సెషన్కు జరుగుతున్న అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ గడువును జనవరి 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్ బి.రాజగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం జూలై 2015 సెషన్కి ఎంబీఏ ప్రోగ్రామ్ అడ్మిషన్ల ప్రవేశ పరీక్ష (ఓపెన్మేట్) కోసం దరఖాస్తు ఫారాలు ఇగ్నో స్టడీ సెంటర్లలో, ఇగ్నో ప్రాంతీయ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ లోపు ఇగ్నో న్యూఢిల్లీ చిరునామాకు అందేలా పంపించాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 15వ తేదీన జరగనుందని తెలిపారు. -
‘విదేశీ’ వేదికపై ఉన్నత విద్య..!
నాణ్యమైన ఉన్నత విద్య పునాదులపై నిర్మించుకునే కెరీర్ సౌధం ఉజ్వల భవిష్యత్తుకు చుక్కాని అవుతుంది! అలాంటి ఉన్నత విద్యను విదేశాల్లో చేస్తే ఆ కెరీర్ మరింత ఉన్నతంగా ఉంటుందన్న ఆలోచన నేడు విద్యార్థులను ‘అబ్రాడ్’ విశ్వవిద్యాలయాల క్యాంపస్ల దిశగా అడుగులు వేయిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఎస్, ఎంబీఏ వంటి కోర్సులు చేసేందుకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశాలు-ఉన్నత విద్యావకాశాలపై స్పెషల్ ఫోకస్.. కాలేజీల నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాతో బయటకు రాకముందే విద్యార్థుల్లో ‘స్టడీ అబ్రాడ్’ దిశగా ఆలోచనలు మొదలవుతాయి. ప్రధానంగా ఇంజనీరింగ్, సెన్సైస్, బిజినెస్ మేనేజ్మెంట్ పీజీ కోర్సులు చేసి, సమున్నత కెరీర్లో స్థిరపడాలనుకునే వారిలో ఈ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ఉన్నత విద్య పూర్తయ్యాక యూఎస్లోనే కెరీర్ను సుస్థిరం చేసుకోవాలని అధిక శాతం మంది భావిస్తున్నారు. యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం అమెరికాలో పీహెచ్డీ పూర్తిచేసిన భారత్, ఇతర ఆసియా దేశాల విద్యార్థుల్లో 80 శాతానికి పైగా అక్కడే ఉండిపోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యం లో విదేశాల్లోని విద్యాసంస్థలు.. ఇక్కడి కన్సల్టెన్సీలతో ఒప్పందాల ద్వారా ప్రవేశ ప్రక్రియను సులభతరం చేస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఆధునికత వెంట కొత్త కోర్సులు: ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అనేక కొత్త కోర్సులకు రూపకల్పన జరిగింది. బయో ఇన్ఫర్మాటిక్స్, మెకట్రానిక్స్, ఇంటరాక్టివ్ డిజైన్ మీడియా, ప్రొడక్ట్ డిజైన్, నానో టెక్నాలజీస్, కంట్రోల్ సిస్టమ్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ (స్పెషలైజేషన్), డిఫెన్స్ ఎడ్యుకేషన్, ఫ్యాషన్ డిజైన్ అండ్ ఆర్ట్స్, ఫుడ్ టెక్నాలజీ తదితర అంశాల్లో ఉన్నత విద్య అవకాశాలున్నాయి. విదేశీ విశ్వవిద్యాలయాల్లోని ఇలాంటి కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇవి కాకుండా వివిధ యూనివర్సిటీలు డిమాండ్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు బిజినెస్, ఇంజనీరింగ్, సెన్సైస్లలో కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెడుతూ, భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. పూర్తి అవగాహనతో అడుగేయాలి: విదేశాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు తొలుత పూర్తిస్థాయి అవగాహన ఏర్పరుచుకోవాలి. లేదంటే తర్వాత ఇబ్బందులు తప్పవు. ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలి? ఏ దేశంలో ఏ కోర్సు చేయాలి? కోర్సు పూర్తిచేసిన కెరీర్కు సంబంధించి ఆర్వోఐ (రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్) ఎలా ఉంటుంది? చేరబోయే కోర్సుకు భవిష్యత్తులో స్వదేశంలో అవకాశాలుంటాయా? మొత్తం ఖర్చు ఎంతవుతుంది? ఆ కోర్సుకు స్వదేశంలోని సంస్థల గుర్తింపు ఉందా? ఇలాంటి వాటిపై అవగాహన ముఖ్యం. పేరున్న కన్సల్టెన్సీలు, వెబ్సైట్ల ద్వారా ఈ వివరాలను తెలుసుకోవాలి. వీసా, బ్యాంకుల విద్యా రుణాలు, ప్రయాణం, బీమా, ఇంటర్నేషనల్ సిమ్ కార్డులు తదితరాలకు సంబంధించిన సందేహాలను కూడా నివృత్తి చేసుకోవాలి.కోర్సులో ప్రవేశానికి ఆయా విశ్వవిద్యాలయాలు నిర్దేశించిన అర్హతలు, జీఆర్ఈ, జీమ్యాట్, ఐఈఎల్టీఎస్, టో ఫెల్ వంటి పరీక్షల్లో ఎంత స్కోర్ సాధించి ఉండాలి? అనేదానిపై తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలి. మేనేజ్మెంట్ కోర్సులు: విదేశీ విద్యలో ఇప్పుడు అధిక ప్రాధాన్యత కలిగిన కోర్సు ఎంబీఏ. ఇందులో చేరాలనుకునే విద్యార్థులకు దరఖాస్తు సమయం నుంచి అప్రమత్తత అవసరం. మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశించాలనుకునే వారు గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్)లో మంచి స్కోర్ సాధించాలి. అప్పుడే పేరున్న యూనివర్సిటీలో సీటును ఖాయం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను ఫాల్, స్ప్రింగ్ల్లో ఏ సెషన్కైనా కనీసం 6 నుంచి 9 నెలల ముందు ప్రారంభిస్తే మంచిది. జీమ్యాట్ స్కోరు ఉన్నప్పటికీ టాప్-బి స్కూళ్లల్లో ప్రవేశించాలంటే అడ్మినిస్ట్రేషన్, టీమ్ లీడర్షిప్ స్థారుులో రెండు, మూడేళ్ల పని అనుభవం తప్పనిసరి. ప్రాధాన్య దేశాలు అమెరికా విదేశీ విద్య విషయంలో తెలుగు విద్యార్థులు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే దేశం అమెరికా. ఆధునిక బోధనా విధానం, ఆర్థిక ప్రోత్సాహకాలు ఆ దేశం వైపు విద్యార్థులు ఆకర్షితులయేందుకు ప్రధాన కారణాలు. దీంతోపాటు అమెరికాలో ఒకసారి కాలుపెడితే, కెరీర్ బంగారుమయం కావడం ఖాయమనే అభిప్రాయం కూడా ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ వంటివి ప్రధాన విశ్వవిద్యాలయాలు. యూఎస్ వెళ్లే విద్యార్థుల్లో అధిక శాతం మంది కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్, బయోటెక్నాలజీ, ఎంబీఏ, బయలాజికల్ సెన్సైస్ కోర్సుల్లో చేరుతున్నారు. ఫాల్ (ఆగస్టు/సెప్టెంబర్), స్ప్రింగ్ (డిసెంబర్) సెషన్లలో అధిక శాతం యూనివర్సిటీలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. టోఫెల్, జీఆర్ఈ, ఐఈఎల్టీఎస్ తో పాటు పీటీఈ (పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్) పరీక్షల స్కోర్ల ఆధారంగా అడ్మిషన్ ఇస్తాయి. వీటిలో ఎంఎస్ కోర్సులకు టోఫెల్/ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ స్కోర్ తప్పనిసరి. మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్ స్కోర్ తప్పనిసరి. ఔత్సాహిక విద్యార్థులు ఆయా ఇన్స్టిట్యూట్లకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు నిర్దేశిత పత్రాలు (విద్యార్హతల సర్టిఫికెట్లు; ఫీజు నివాస వ్యయానికి సరిపడే విధంగా ఆర్థిక వనరుల రుజువు పత్రాలు, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, రికమండేషన్ లెటర్స్ తదితర) అందించాలి. వీటి ఆధారంగా.. ఆయా ఇన్స్టిట్యూట్లు ఆఫర్ లెటర్ అందిస్తాయి. దీన్నే ఐ-20 ఫామ్గా పిలుస్తారు. దీని ఆధారంగా స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేయాలి. అమెరికాలో ఫీజులు.. చదువుతున్న స్ట్రీమ్ను బట్టి 10 వేల నుంచి 25 వేల డాలర్ల మధ్యలో ఉంటాయి. పూర్తి వివరాలకు: www.educationusa.state.gov, www.usnews.com.. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాకు సంబంధించి సెన్సైస్ (కంప్యూటర్, ఐటీ), ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్/మెకానికల్), ఏవియేషన్, ఎంబీఏ, ఫుడ్ అండ్ డెయిరీ మేనేజ్మెంట్ ప్రధాన కోర్సులు. అధిక శాతం ప్రవేశాలు ఫిబ్రవరి/మార్చి, జూలై సెషన్లలో పూర్తవుతాయి. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, అడిలైడ్ యూనివర్సిటీ వంటివి ప్రధాన యూనివర్సిటీలు. ఇవి ఐఈఎల్టీఎస్ (6.5/9) స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్, టోఫెల్ స్కోర్ అవసరం. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. రెండు వారాల్లో(15 రోజులు) 40 గంటలు పార్ట్ టైమ్ జాబ్ చేసే వెసులుబాటును ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు కల్పించాయి. ఆస్ట్రేలియా కాన్సులేట్లోని డ్రాప్బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. పీజీ కోర్సులకు ఫీజు దాదాపు 9,000 నుంచి 18,500 ఆస్ట్రేలియన్ డాలర్లు ఉంటుంది. పూర్తి వివరాలకు: www.studyinaustralia.gov.au జర్మనీ హంబోల్ట్ యూనివర్సిటీ, ఫ్రీ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్, టెక్నికల్ యూనివర్సిటీ మ్యునిచ్, జార్జ్ అగస్ట్ యూనివర్సిటీ, ఎబర్హార్డ్ కార్ల్స్ యూనివర్సిటీ, టెక్నికల్ యూనివర్సిటీ బెర్లిన్ వంటివి ముఖ్యమైన విశ్వవిద్యాలయాలు. వీటిలో ప్రవేశాలు ఏప్రిల్, అక్టోబర్లో జరుగుతాయి. లైఫ్ సెన్సైస్, బయో సెన్సైస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ సంబంధిత కోర్సులకు సరైన వేదిక జర్మనీ. మాస్టర్ కోర్సులకు టోఫెల్ (స్కోర్ 80/120), ఐఈఎల్టీఎస్ (స్కోర్ 6.5/9) తప్పనిసరి. కొన్ని ప్రధాన కోర్సుల్లో జీఆర్ఈ (300/340) స్కోర్ అవసరం. మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్ స్కోర్ తప్పనిసరి. జర్మన్ భాషా పరిజ్ఞానం అవసరం. ఇక్కడ సంవత్సరానికి 90 రోజులు పార్ట్ టైమ్ జాబ్ చేయవచ్చు. కొన్ని యూనివర్సిటీలు మాత్రం సెలవుల్లోనే ఈ అవకాశం కల్పిస్తాయి. జర్మనీలో సెమిస్టర్కు ఫీజు దాదాపు 500-1,000 యూరోలు ఉంటుంది. పూర్తి వివరాలకు: www.studyin.de/en యూకే విద్యార్థుల నమోదు సంఖ్య, క్రేజీ కోర్సుల పరంగా అమెరికా తర్వాత స్థానం యూకే యూనివర్సిటీలదే. బిజినెస్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ కోర్సులకు కేరాఫ్గా నిలుస్తున్న దేశమిది. సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ వ్యవధి రెండేళ్లు ఉండగా అధిక శాతం యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు ఫాస్ట్ట్రాక్ కోర్సుల పేరుతో ఏడాది వ్యవధిలోనే పీజీ కోర్సులను అందిస్తుండటం కూడా ఇక్కడి వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణం. యూకేలో అధిక శాతం ప్రవేశాలు సెప్టెంబర్/అక్టోబర్ సెషన్లలో పూర్తవుతాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటివి ప్రధాన విశ్వవిద్యాలయాలు. విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది ఎంబీఏ, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, సెన్సైస్ కోర్సులను ఎంచుకుంటున్నారు. వర్సిటీలు ఐఈఎల్టీఎస్ (6.5/9), టోఫెల్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్త్తున్నాయి. మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్ స్కోర్ అవసరం. ప్రవేశం లభిస్తే యూకే కాన్సులేట్లోని డ్రాప్బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. యూకేలో ఫీజు.. పీజీ కోర్సులకు దాదాపు 12,000 పౌండ్లు, ఎంబీఏ కోర్సుకు 15,000 యూరోలు ఉంటుంది. పూర్తి వివరాలకు:www.ukvisas.gov.uk, www.ukba.homeoffice.gov.uk ఉపకారవేతనాలు విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలని ఉన్నా, ఆర్థిక పరిస్థితులు సరిగా లేని కారణంగా వెనకడుగు వేస్తారు. ప్రతిభావంతులకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో వివిధ యూనివర్సిటీలు, ట్రస్టులు, ప్రభుత్వాలు స్కాలర్షిప్స్ను అందిస్తున్నాయి. వీటి ద్వారా విదేశాల్లో అత్యుత్తమ విద్యా సంస్థల్లో చదవాలనే కోరికను తీర్చుకోవచ్చు. వీటిలో ఖొరానా ప్రోగ్రామ్ ఫర్ స్కాలర్స్, డాక్టర్ మన్మోహన్సింగ్ స్కాలర్షిప్స్, గేట్స్- కేంబ్రిడ్జ్ స్కాలర్షిప్స్, ద రోడ్స్ స్కాలర్షిప్, కామన్వెల్త్ స్కాలర్షిప్ అండ్ ఫెలోషిప్ ప్లాన్ వంటివి ఉన్నాయి. వెబ్సైట్ల ఆధారంగా వీటి పూర్తివివరాలు తెలుసుకోవచ్చు.స్కాలర్షిప్లు పొందాలంటే అకడమిక్ స్కోర్ 70 శాతం కంటే ఎక్కువ ఉండాలి. జీఆర్ఈ 300 ప్లస్, టోఫెల్ 100 ప్లస్, ఐఈఎల్టీఎస్ 7.5పైన ఉంటే స్కాలర్షిప్లు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టిప్స్ విదేశీ విద్య దిశగా ఆలోచించే విద్యార్థి తొలుత తన కు అనుకూలమైన కోర్సు, కాలేజీతో పాటు ఆ దేశం పై అవగాహన ఏర్పరుచుకోవాలి. విద్యాసంస్థ ప్రా ధాన్యతను ఆయా దేశాల ఇమిగ్రేషన్ శాఖ వెబ్సైట్లలోని సమాచారం ఆధారంగా విశ్లేషించుకోవాలి.అకడమిక్ షెడ్యూల్ ఒక్కో దేశానికి ఒక్కో రకంగా ఉంటుంది. ఆ మేరకు వీలైనంత ముందుగా సన్నాహకాలు ప్రారంభించాలి. కనీసం 8 నుంచి 12 నెలల ముందు దరఖాస్తు చేసుకుంటే సంబంధిత ప్రక్రియ ఆటంకం లేకుండా ముగియడానికి, వీసా దరఖాస్తుకు తగిన సమయం లభిస్తుంది.విదేశీ వర్సిటీలు ప్రవేశాలు కల్పించేందుకు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. మెరిట్(అకడమిక్ రికార్డ్), జీఆర్ఈ/జీమ్యాట్ వంటి పరీక్షల స్కోర్, టోఫెల్/ఐఈఎల్టీఎస్ స్కోర్, ఎస్ఓపీ, సమ్మరీ ప్రాజెక్ట్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్, రీసెర్చ్ ఎక్స్పీరియెన్స్, వర్క్ ఎక్స్పీరియెన్స్, రెజ్యుమె, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి. -
ఫాంహౌస్లపై పోలీసుల దాడి, పలువురి అరెస్ట్
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని పలు ఫాంహౌస్లపై పోలీసులు శనివారం మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా మద్యం, హుక్కాతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని అమ్దాపూర్లోని మల్లేష్యాదవ్ ఓ ఫాంహౌస్పై దాడి చేసిన పోలీసులు...అనుమతి లేకుండా ఫాంహౌస్లో విందు ఏర్పాటు చేసినవారిపై కేసు నమోదు చేసి 20మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం కూడా ఈ ఫాంహౌస్పై పోలీసులు దాడి చేసి సుమారు 40మంది విద్యార్థులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే పలు ఫాంహౌస్ల్లో పేకాడుతున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. గత కొద్దికాలంగా నగర శివార్లలో ఫాంహౌస్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారటంతో పాటు, రేవ్ పార్టీలు జోరుగా సాగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. -
అనుమతి లేకుండా ఫాంహౌస్లో విందు
మొయినాబాద్: అనుమతి లేకుండా ఫాంహౌస్లో విం దు ఏర్పాటు చేసినవారిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన ఎంబీఏ విద్యార్థులు దశరథ్, సుధీర్లు కళాశాలలోని విద్యార్థులతో కలిసి పార్టీ(విందు) ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. కళాశాలలోని 40 మంది విద్యార్థుల నుంచి రూ.1200 చొప్పున డబ్బులు వసూలు చేశారు. మండల పరిధిలోని అమ్డాపూర్ రెవెన్యూలో ఉన్న మల్లేష్యాదవ్ ఫాంహౌస్లో విందు ఏర్పాటు చేసేందుకు రూ.30 వేలకు అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం విందుకు ఏర్పాట్లు సిద్ధం చేసి మధ్యాహ్నం 3 గంటలకు విద్యార్థులంతా ఫాంహౌస్కు చేరుకున్నారు. విందు విషయం తెలుసుకున్న సీఐ రవిచంద్ర సిబ్బందితో కలిసి ఫాంహౌస్పై దాడి చేశారు. మొత్తం 40 మంది విద్యార్థుల్లో పది మంది అమ్మాయిలు ఉన్నారు. 8 కార్టన్ల బీరు బాటిళ్లు, 6 హుక్క బాటిళ్లు, డీజేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన విద్యార్థులు దశరథ్, సుధీర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఫాంహౌస్ యజమాని మల్లేష్యాదవ్, సూపర్వైజర్ శ్రీనివాస్యాదవ్లపైనా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. కొత్త సంవత్సరం స్వాగతం సందర్భంగా అనుమతులు లేకుండా విందులు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఈసందర్భంగా సీఐ హెచ్చరించారు. -
ఎంబీఏ చదివినా.. కులవృత్తి మానలే..
ఈత కల్లు గీస్తున్న ఈ యువకుడి పేరు బండి రమేష్. ఊరు పరకాల. అయితే ఏంటి..? అనేగా మీ అనుమానం. ఏమీ లేదు కానీ.. అతను చదువుకున్నది ఎంబీఏ మరి. పెద్ద చదువులు చదువుకున్నా కులవృత్తిపై ఉన్న మక్కువతో చెట్లు ఎక్కడం, కల్లు గీయడం నేర్చుకున్నాడు. సీజన్లో మోకు ముత్తాదు కట్టుకుని ఇలా కల్లు గీస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. బీఏ జర్నలిజం చేసిన తర్వాత ఎంబీఏ పూర్తిచేశాడు. సర్కారు కొలువు దక్కకపోవడంతో కులవృత్తికి అంకితమైపోయాడు రమేష్. -
అడ్మిషన్స, జాబ్స్
బీఐఎంలో ఎంబీఏ తిరుచిరాపల్లిలోని భారతీదాసన్ యూనివర్సిటీకి చెందిన భారతీదాసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (బీఐఎం) కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంబీఏ విభాగాలు: మార్కెటింగ్, ఫైనాన్స్, సిస్టమ్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్. కాలపరిమితి: రెండేళ్లు అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. క్యాట్/ సీమ్యాట్/ జీమ్యాట్లో అర్హత సాధించాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేది: ఫిబ్రవరి 9 వెబ్సైట్: http://www.bim.edu/ ఫ్యాక్ట్లో సర్టిఫికెట్ కోర్సులు ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ (ఫ్యాక్ట్) కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. హెవీ ఎక్యూప్మెంట్ ఆపరేషన్స్ కాలపరిమితి: మూడు నెలలు. అర్హతలు: పదో తరగతిలో ఉత్తీర్ణతతో పాటు లైట్, హెవీ వెహికల్ డ్రైవింగ్ లెసైన్స్ ఉండాలి. ఎంపిక: మెరిట్ ప్రాతిపదికన. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ మెయింటనెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. కాలపరిమితి: మూడు నెలలు. అర్హతలు: ఇన్స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ అప్లయిడ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్లో బీఈ/ బీటెక్/ డిప్లొమా/ బీఎస్సీ ఉండాలి. వయసు: 35 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15 వెబ్సైట్: http://www.fact.co.in/ పంజాబ్ యూనివర్సిటీ పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్.. ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కోర్సు: ఎంబీఏ విభాగాలు: జనరల్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ హ్యూమన్ రిసోర్స్. అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంపిక: క్యాట్ - 2014, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 18, 2015 వెబ్సైట్: http://puchd.ac.in ఐఐటీ - గాంధీనగర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - గాంధీనగర్.. ఎంఏ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కోర్సు: ఎంఏ (సొసైటీ అండ్ కల్చర్) వ్యవధి: రెండేళ్లు. అర్హత: 55 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: జనవరి 12, 2015 వెబ్సైట్: http://hss.iitgn.ac.in/masc బిట్స్ పిలానీ - దుబాయ్ బిట్స్ పిలానీ - దుబాయ్ క్యాంపస్.. వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంఈ ప్రోగ్రామ్స్: డిజైన్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ బయోటెక్నాలజీ మైక్రో ఎలక్ట్రానిక్స్ ఎంబీఏ కోర్సులు: ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ మేనేజ్మెంట్ అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్. పీహెచ్డీ అర్హత: 60 శాతం మార్కులతో ఎంఈ/ఎంఎస్/ఎంబీఏ/ఎంఫిల్ ఉత్తీర్ణత. ఎంపిక: అకడమిక్ రికార్డ్, పని అనుభవం, ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15 వెబ్సైట్: www.bits-dubai.ac.ae సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ - రూర్కీ.. సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సైంటిస్ట్/ సీనియర్ సైంటిస్ట్: 31 విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆర్కిటెక్చర్. అర్హత: సంబంధిత విభాగాల్లో పీహెచ్డీ ఉత్తీర్ణత. వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 32/37 ఏళ్లు. వేతన శ్రేణి: రూ.15600 - రూ.39100, గ్రేడ్ పే రూ.6600/రూ.7600 దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15 వెబ్సైట్: www.cbri.res.in మహాత్మాగాంధీ యూనివర్సిటీ కొట్టాయంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎంఫిల్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ రిహాబిలిటేషన్ సెన్సైస్, రిహబిలిటేషన్ సైకాలజీ, బిహేవిరియల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, పాలిమర్ కెమిస్ట్రీ. అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు. దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 12 వెబ్సైట్:http://mgu.ac.in/ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్రిమోట్ సెన్సింగ్ డెహ్రాడూన్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(ఐఐఆర్ఎస్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సైంటిస్ట్ ఖాళీల సంఖ్య: 3 విభాగాలు: జియోఫిజిక్స్, వాటర్ రిసోర్సెస్, అగ్రికల్చర్ జియాలజీ/ అప్లయిడ్ జియాలజీ/జియోఫిజిక్స్/ వాటర్ రిసోర్స్/ హైడ్రాలజీ/ ఆగ్రో -మెటీరియాలజీ/అగ్రికల్చర్ ఫిజిక్స్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. వయసు: 35 ఏళ్లక మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేది: జనవరి 2 వెబ్సైట్:http://bis.iirs.gov.in/ -
బీ టెక్ తర్వాత నిర్వహణ నైపుణ్యాలకు.. ఎంబీఏ
బీఈ/బీటెక్ పూర్తయ్యాక ఎక్కువ మంది విద్యార్థులు దృష్టి సారించేది ఎంటెక్ లేదా ఎంబీఏ వైపే. వీటిలో ఎంటెక్.. సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో విద్యార్థులను మరింత నిష్ణాతులుగా మారుస్తుంది. ఎంబీఏ.. నాలుగేళ్ల ఇంజనీరింగ్లో నేర్చుకున్న సాంకేతిక నైపుణ్యాలకు తోడుగా నిర్వహణ నైపుణ్యాలు అందిస్తుంది. భావి కెరీర్లో రాణించాలన్నా.. అత్యుత్తమ స్థాయికి చేరుకోవాలన్నా.. టెక్నికల్ స్కిల్స్తోపాటే మేనేజీరియల్ స్కిల్స్ తప్పనిసరి. ఈ కారణంగానే ఎంబీఏ కోర్సులో చేరే బీటెక్ గ్రాడ్యుయేట్స్ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. సిటీలో ఎన్నో విద్యా సంస్థలు ఎంబీఏ/పీజీడీఎం కోర్సులను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీటెక్ తర్వాత ఎంబీఏ చేయాలా? చేస్తే ఎలాంటి అవకాశాలుంటాయి? వంటి అంశాలపై నిపుణుల విశ్లేషణ.. బీటెక్ ఒక్కటే సరిపోదు ఇంజనీరింగ్లో ఏ కోర్సును ఎంచుకున్నా నేర్చుకునే సామర్థ్యాన్ని, క్లిష్ట సమయాల్లో అనుసరించాల్సిన తీరును ఆకళింపు చేసుకోవాలి. ఇంజనీరింగ్ కోర్సుల ద్వారా విద్యార్థి ఇంజనీరింగ్ సంబంధిత అంశాల్లో పట్టు సాధిస్తాడు. కానీ మేనేజ్మెంట్ సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం పొందలేడు. బీటెక్/బీఈ పూర్తిచేసిన వారిలో ఎక్కువమంది సాంకేతిక నైపుణ్యాలను ఒంటబట్టించుకుని ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. అయితే వారు ఉద్యోగం, వ్యాపారంలో రాణించాలంటే సాంకేతిక నైపుణ్యాలతోపాటు తప్పనిసరిగా నిర్వహణ నైపుణ్యాలు (మేనేజీరియల్ స్కిల్స్) అవసరమవుతున్నాయి. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థి మేనేజ్మెంట్ కోర్సులను కూడా చదివితే మంచి ప్రొఫెషనల్గా ఎదిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో రోల్ ప్లేయింగ్, మేనేజ్మెంట్ మెథడ్స్, కేస్ స్టడీస్, ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెథడాలజీస్, ప్రజంటేషన్స్ వంటివాటిపై అవగాహన పెంచుకోవాలి. ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థి ఆల్రౌండర్గా రాణించేందుకు దోహదపడే మేనేజ్మెంట్ కోర్సులేవి? అంటే.. ఎంబీఏ/పీజీడీఎం... అనే సమాధానం వస్తుంది. ఎంటెక్/ఎంబీఏ సాంకేతిక రంగంలో అత్యుత్తమంగా రాణించాలనుకుంటే ఎంటెక్ చేయాలి. ఒకవే ళ అలా కాకుండా స్వశక్తితో వ్యాపార రంగంలో ఎదగాలనే పట్టుదల ఉంటే ఎంబీఏను ఎంచుకోవాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థుల్లో చాలామంది మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లభిస్తున్నా వద్దనుకుని.. సొంత స్టార్టప్స్ వైపు అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలంటే ఎంబీఏ తప్పనిసరి. బీటెక్ గ్రాడ్యుయేట్స్తో పోల్చుకుంటే ఎంబీఏ పూర్తిచేసినవారికి ఎంటర్ప్రెన్యూర్షిప్పరంగానే కాకుండా మంచి ఉద్యోగావకాశాలు కూడా లభిస్తున్నాయి. అనుబంధ కోర్సులతో అదనపు లాభం ఎంబీఏలో అనుబంధ కోర్సులు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఆరోగ్య రక్షణ(హెల్త్ కేర్), పర్యాటకం (టూరిజం), ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ), రూరల్ మేనేజ్మెంట్, అగ్రిబిజినెస్, బ్యాంకింగ్- బీమా (బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్), రిటైల్, లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఫారెస్ట్ మేనేజ్మెంట్, టెలికాం మేనేజ్మెంట్లను పలు యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసినవారికి ప్రస్తుతం మంచి అవకాశాలు లభిస్తున్నాయి. స్పెషలైజేషన్ చేయాలంటే ? మార్కెటింగ్, మానవ వనరులు (హెచ్ఆర్), ఫైనాన్స్, ఆపరేషన్స్, సమాచారం-సాంకేతిక పరిజ్ఞానం (ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ), సిస్టమ్స్ ప్రధానమైనవి. కోర్సును ఎంపిక చేసుకునే ముందు స్వీయ అవగాహన ముఖ్యం. స్పష్టత లేకపోతే అధ్యాపకులు, అనుభవజ్ఞులు, మిత్రుల సలహా తీసుకోవాలి. తద్వారా సరైన నిర్ణయం దిశగా అడుగులేయాలి. మార్కెటింగ్ను ఎంచుకోవాలనుకుంటే..ప్రజలతో మాట్లాడటం, వారితో మమేకమయ్యే నైపుణ్యాలుతప్పనిసరి. మార్కెటింగ్ పరిశోధన, ఈ-మార్కెటింగ్, ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్, ప్రజా సంబంధాలు, డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ ప్రమోషన్, నేరుగా విక్రయించడం, మార్కెటింగ్ విశ్లేషణ, సేల్స్ ప్రమోషన్ అండ్ అడ్వర్టైజింగ్ మొదలైనవి ఇందులో ఉంటాయి. ప్రస్తుతం ప్రతి సంస్థకు పదుల సంఖ్యలో సేల్స్, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ అవసరం ఉంది. ఇక సంస్థల నిబంధనలు, యాజమాన్య నిర్వహణపై ఆసక్తి ఉంటే హ్యూమన్ రిసోర్సెస్లో స్పెషలైజేషన్ చేయడం ఉత్తమం. ఇందులోని మ్యాన్ పవర్ ప్లానింగ్, రిక్రూట్మెంట్, హెడ్ హంటింగ్, నియామకాలు, శిక్షణ, అభివృద్ధి, వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్, వివాదాల పరిష్కారం, విశ్లేషణ లాంటి పలు విభాగాల్లో క్రియాశీల పాత్ర పోషించవచ్చు. అయితే మార్కెటింగ్తో పోల్చుకుంటే హెచ్ఆర్లో అవకాశాలు కొద్దిగా తక్కువే. ఫైనాన్స్ ఎంచుకుంటే ఆర్థిక వ్యవహారాల్లో ఆసక్తి ఉంటే ఫైనాన్స్లో స్పెషలైజేషన్ చేయడం మంచిది. ప్రతి సంస్థకు అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుంది. ట్రెజరీ ఆపరేషన్స్, వ్యాల్యూయేషన్ , ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, సెక్యూరిటీ అనాలిసిస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఫారెన్ ఎక్స్ఛేంజ్ ఆపరేషన్స్, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్.. వంటివాటిలో అవకాశాలు అందుకోవచ్చు. అయితే చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్లకు ఈ రంగంలో ఉద్యోగాలు అధికం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ).. గత రెండు దశాబ్దాలుగా ఎంతో ఆదరణ పొందుతోంది. ఎక్కువ మంది విద్యార్థులు ఇందులోనే స్పెషలైజేషన్ చేస్తున్నారు. కారణం దీన్ని పూర్తి చేసిన వెంటనే మంచి ఉద్యోగ అవకాశాలు లభించడమే. క్లౌడ్ కంప్యూటింగ్, ఐటీ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్, వెబ్ అప్లికేషన్స్, బిజినెస్ కంప్యూటింగ్, సాఫ్ట్ కంప్యూటింగ్ వంటివి ఐటీలో ఉంటాయి. అయితే దీనిని ఎంచుకునే ముందు సిలబస్, దాని పరిధి ఏమిటో క్షుణ్నంగా తెలుసుకొని అడుగువేయాలి. ఐటీలో పట్టు సాధిస్తే కోరినంత ప్యాకేజీతో కొలువును సొంతం చేసుకోవచ్చు. ఔట్సోర్సింగ్ ద్వారా విదేశాల నుంచి కొన్ని ప్రాజెక్టులను కూడా చేపట్టవచ్చు. ఆపరేషన్స్ అండ్ లాజిస్టిక్స్.. ఆపరేషన్స్ స్పెషలైజేషన్లో ఎంబీఏ చేసినవారికితయారీ రంగానికి చెందిన కంపెనీల్లో ఉద్యోగాలుంటాయి. సప్లై చైన్ మేనేజ్మెంట్ కూడా లాజిస్టిక్స్లో ఓ భాగం. ఎంబీఏలో లాజిస్టిక్స్ స్పెషలైజేషన్ ఉత్తీర్ణులకు ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉంది. సీఈఓ కావొచ్చు స్పెషలైజేషన్ చేయాలనుకున్నప్పుడు ప్రధానంగా కావాల్సింది ఆత్మవిశ్వాసం, నమ్మకం. ఎంచుకున్న అంశంలో ఎంతవరకు రాణించగల అవకాశం ఉందో తెలుసుకోవాలి. ప్రతి స్పెషలైజేషన్కు ఒక ప్రత్యేకత ఉంటుంది. దానికి మీ శక్తి సామర్థ్యాలు, వ్యక్తిత్వం సరిపోతాయా? నలుగురినీ ముందుకు నడిపించే నాయకత్వ లక్షణాలు మీలో ఉన్నాయా? సరిచూసుకోవాలి. అంతర్గత నైపుణ్యాలు, మార్కెట్ స్థితిగతులపై మంచి పట్టు సాధిస్తే.. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటే 10-15 ఏళ్లలో మీరు పనిచేస్తున్న కంపెనీకి సీఈఓ కూడా కావచ్చు. అయితే ఎంబీఏ ఎక్కడ చేశారు? ఆ సంస్థ స్థాయి, గుర్తింపు వంటి అంశాలు కూడా ఉద్యోగ సాధనలో కీలకపాత్ర పోషిస్తాయి. అత్యుత్తమ ఎంబీఏ కళాశాలలేవో తెలుసుకోవడానికి వివిధ పత్రికలు, మేగజీన్స సర్వేలు నిర్వహిస్తుంటాయి. వీటి ఆధారంగా ఏ కళాశాలను ఎంచుకోవాలనేదానిపై అవగాహనకు రావచ్చు. ఎంబీఏ/పీజీడీఎంను అందించే విద్యా సంస్థలు ‘‘పోస్ట్గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం)/ పోస్ట్గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (పీజీపీఎం) అనేవి ఎంబీఏను పోలిన కోర్సులు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు ఈ కోర్సును అందిస్తున్నాయి. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) స్కోర్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్/బృంద చర్చలు/అకడమిక్ రికార్డ్/వర్క్ ఎక్స్పీరియన్స్/పర్సనల్ ఇంట ర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లు కూడా ఎంబీఏను ఆఫర్ చేస్తున్నాయి. అదేవిధంగా హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ (ఐపీఈ), యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ, నార్సీమోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ)లలో మేనేజ్మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నిర్దేశిత మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి సంస్థను బట్టి క్యాట్/మ్యాట్/ఎక్స్ఏటీ/జీమ్యాట్/ఐసెట్/ఏటీఎంఏ స్కోర్ ఆధారంగా ప్రవే శం కల్పిస్తున్నాయి. ఇక విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఎంబీఏ చే యాలంటే గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్) లో మంచి ర్యాంకు సాధించాలి. అయితే విదేశీ వర్సిటీలు అభ్యర్థుల రెండు, మూడేళ్ల పని అనుభవానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. - ప్రొఫెసర్. ఎ.రామచంద్ర ఆర్యశ్రీ, మాజీ డెరైక్టర్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, జేఎన్టీయూహెచ్ భావనలు, అన్వయ సామర్థ్యాలు ఇంజనీరింగ్ విద్యార్థి కెరీర్లో రాణించాలంటే ఇంజనీరింగ్ సూత్రాల అన్వయ సామర్థ్యం, నైపుణ్యాల నిర్వహణ, కింది స్థాయిలో పనిచేసేవారికి మార్గదర్శకత్వం, ప్రాజెక్టుల రూపకల్పనలో ప్రస్తుతం కావాల్సినవి ఏమిటో తెలుసుకోవడం వంటివి చాలా ముఖ్యం. భావనలు (కాన్సెప్ట్స్), అన్వయ సామర్థ్యాలు ఇంజనీరింగ్ డిగ్రీలోఉంటాయి. కానీ సంస్థాగత నైపుణ్యాలు, ప్రాజెక్టుల రూపకల్పనలో కిందిస్థాయి వారికి మార్గదర్శకత్వం, ప్రాజెక్టు నిర్వహణ లాంటి విషయాలు మేనేజ్మెంట్ డిగ్రీ అయిన ఎంబీఏలో ఉంటాయి. అందుకే బిజినెస్ స్కూళ్లలో ఎక్కువగా కేస్ స్టడీస్ అధ్యయనం చేయడంతోపాటు సంక్షోభం తలెత్తిన సందర్భంలో వాటిని ఎదుర్కొనే మార్గాలను బోధిస్తారు. -
దద్దరిల్లిన బందరు
దీపావళి బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు * ఎంబీఏ విద్యార్థి మృతి * మరో ఐదుగురికి గాయాలు * జిల్లాలో సంచలనం మచిలీపట్నం : దీపావళి మందుగుండు సామగ్రి తయారు చేస్తుండగా భారీ పేలుడు సంభవించడంతో మంగళవారం బందరు దద్దరిల్లింది. అర్ధగంట పాటు భారీగా శబ్దం రావడంతో పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. జోగి రాంబాబు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఏడాదిగా బందరు బైపాస్రోడ్డు వెంబడి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రాంబాబు తాను ఉంటున్న ఇంటి ఎదురుగానే చిన్న హోటల్ నిర్వహిస్తున్నారు. కొబ్బరి బొండాలు కూడా అమ్ముతున్నారు. ఇతనికి ఇద్దరు కుమారులు కిరణ్, తులసీ, ఒక కుమార్తె నాగలక్ష్మి ఉన్నారు. కిరణ్ గుడ్లవల్లేరులోని ఓ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. తులసీ ఇంటర్మీడియెట్, నాగలక్ష్మి తొమ్మిదో తరగతి చదువుతున్నారు. దీపావళి పండగను పురస్కరించుకుని రాంబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి తయారుచేస్తున్నారు. కిరణ్ ఉల్లిపాయ బాంబులు తయారుచేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించటంతోపాటు దట్టంగా పొగలు కమ్ముకోవడంతో బయటకు పరుగులు తీశారు. అయితే, పేలుడు ధాటికి చెలరేగిన మంటల్లో చిక్కుకుని కిరణ్ అక్కడికక్కడే మరణించాడు. ఇంట్లో ఉన్న కిరణ్ తండ్రి రాంబాబు, సోదరుడు, సోదరి, తులసీ స్నేహితుడు మాచవరానికి చెందిన దిరిశన చాణుక్య గాయపడ్డారు. పేలుడు సంభవించిన పక్క గదిలో ఉన్న ఇంటి యజమాని బంధువు పామర్తి నాగబాలకు కూడా గాయాలయ్యాయి. అర్ధగంటపాటు పేలుడు, దట్టమైన పొగ మందుగుండు సామగ్రి పేలిన ఇంటి నుంచి అర్ధగంట పాటు పేలుడు శబ్దాలు వినిపించాయి. పేలుడు జరిగిన ఇంటి నుంచి దట్టంగా పొగ బయటికి రావడంతో ఏం జరిగిందో తెలియక స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పేలుడు సంభవించిన గదిలో శ్లాబు పిల్లర్లు బీట్లిచ్చాయి. ఈ ఇంట్లో ఆరు గదులు ఉండగా, అన్నింటిలోనూ వస్తువులు ఛిద్రమయ్యాయి. గుమ్మాలు, కిటికీలు, వాటి తలుపులు ఊడి కిందపడ్డాయి. ప్రహరీ, ఇంటి గోడ ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దం పెద్దగా రావటంతో తొలుత అందరూ గ్యాస్ సిలిండర్ పేలిందని భావించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేసి, కిరణ్ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మంటలను ఆర్పు తున్న సమయంలోనూ మందుగుండు సామగ్రి పేలుతూనే ఉంది. గాయపడిన వారు కింద పడిపోవటంతో ఇల్లంతా రక్తసిక్తంగా మారింది. పేలుడు సంభవించిన గృహం వరండాలో ఐదు సంచుల తాటాకు టపాకాయలు ఉన్నాయి. ఇవి పేలకపోవడంతో మరింత ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం సమయంలో పేలుడు సంభవించటంతో పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కిరణ్ సోదరుడు తులసీకి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మాట్లాడలేని స్థితిలో ఉన్న చాణుక్య.. కిరణ్ అన్నయ్యకు ఏమైదంటూ దీనంగా పోలీసులను అడగడం చూపరులను కలచివేసింది. గాయాలపాలైన కిరణ్ సోదరి నాగలక్ష్మి చికిత్స పొందుతూనే ‘మా అన్నయ్య చనిపోయాడు..’ అంటూ కన్నీరుమురుగా విలపించింది. కిరణ్ను ఎంబీఏ చదివిస్తున్నామని, చేతికొచ్చే దశలో కళ్లెదుటే చనిపోయాడని తల్లిదండ్రులు, బంధువులు రోదించారు. బాధితులను పరామర్శించిన మంత్రి రవీంద్ర ఈ ఘటనలో గాయపడిన బాధితులను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం రాత్రి పరామర్శించారు. పేలుడు జరిగిన గృహాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జోగి తులసీ తదితరులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా బాధితులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన అధికారులు బైపాస్రోడ్డులో పేలుడు సంభవించిన ఇంటిని బందరు ఆర్డీవో పి.సాయిబాబు, డీఎస్పీ కేవీ శ్రీనివాసరావు, తహశీల్దార్ నారదముని, చిలకలపూడి సీఐలు సత్యనారాయణ, సుబ్బారావు, ఎస్ఐలు పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి పోలీసులు మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. -
ఐ-సెట్ కౌన్సెలింగ్కు విద్యార్థుల తాకిడి
గుంటూరు ఎడ్యుకేషన్ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఐ-సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. గుంటూరులోని రెండు హెల్ప్లైన్ కేంద్రాల్లో చేపట్టిన సర్టిఫికెట్ల పరిశీలనకు 763 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఐ-సెట్ కౌన్సెలింగ్ కోసం ఇన్నాళ్లూ ఆత్రుతగా ఎదురుచూసిన విద్యార్థులు జిల్లా నలుమూలల నుంచి పెద్ధ సంఖ్యలో తరలివచ్చారు. నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలన సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రం రాత్రి 10 గంటల వరకూ కొనసాగటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. ఈ కేంద్రానికి 400 మంది హాజరయ్యారు. విద్యార్థులకు తిప్పలు హెల్ప్లైన్ కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు చేయకపోవటంతో విద్యార్థులు ఇక్కట్ల పాలయ్యూరు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉదయం 9 గంటలకే వచ్చినవారు తమ వంతు కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. తాగేందుకు నీరు, కూర్చునేందుకు తగినన్ని కుర్చీలు లేక చెట్ల కిందే గడిపారు. నేడు 25,001 నుంచి 50 వేల ర్యాంకు వరకు పరిశీలన ఐ-సెట్ కౌన్సెలింగ్లో భాగంగా గురువారం జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని హెల్ప్లైన్ కేంద్రంలో 25,001 నుంచి 37,500 వరకూ, నల్లపాడు హెల్ప్లైన్ కేంద్రంలో 37,501 నుంచి 50 వేల ర్యాంకు వరకూ విద్యార్థులు హాజరుకావాలి. -
పల్లె అల్లం... పట్నం బెల్లం!
* ప్రాంతాల్లోని కళాశాలల్లో చదివేందుకు విముఖత * నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కళాశాల్లో చేరేందుకు ఆసక్తి * ఎంబీయే చదువు కోసం ఢిల్లీ, ఎన్సీఆర్కే మొదటి ఓటు * తర్వాతి స్థానాల్లో బెంగళూరు, పుణే, ముంబై నగరాలు న్యూఢిల్లీ: ఉపాధి కోసమే కాదు.. చదువుకునేందుకు కూడా జనం ఇప్పుడు పట్నంబాట పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కళాశాలలు ఉన్నా పట్టణాలు, నగరాల్లోని కళాశాలల్లో చేరేందుకు అమితాసక్తిని కనబరుస్తున్నారు. ప్రాంతీయ అసమానతలను రూపుమాపేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నా వాటిలో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఇష్టపడడం లేదు. పట్టణాలు, నగరాల్లోని కళాశాలల్లో సరైన సదుపాయాలు, బోధించే ఉపాధ్యాయులు లేకపోయినా అందులోనే చేరుతున్నారు. ప్రతి వంద మంది విద్యార్థుల్లో 66 మంది పట్టణాల్లో చదివేందుకే ప్రాధాన్యతనిస్తున్నారని శిక్షా డాట్ కామ్ సంస్థ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సర్వే ద్వారా వెల్లడైన వివరాల్లోకెళ్తే... రాజధాని రమ్మంటోంది... సాంకేతిక విద్య బాటపట్టే విద్యార్థులు... ప్రత్యేకించి ఎంబీఏ చదవాలనుకుంటున్న విద్యార్థుల్లో ఎక్కువమంది ఢిల్లీ, రాజధాని ప్రాదేశిక ప్రాంతం(ఎన్సీఆర్)లోని కళాశాల్లో చేరేందుకే తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 21.1 శాతం మంది విద్యార్థులు ఎంబీఏ చదివేందుకు ఢిల్లీ, ఎన్సీఆర్కే తొలి ప్రాధాన్యతనిచ్చారు. ఆ తర్వాత 17.58 శాతం మంది బెంగళూరు కళాశాలలకు, 10.63 మంది పుణే కళాశాలలకు, 8.4 శాతం మంది ముంబైలోని కాలేజీలకు తమ ఓటు వేశారు. అనేక కారణాలు... రాజధాని ఢిల్లీలోని కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు తొలి ప్రాధాన్యత ఇవ్వడానికి అనేక కారణాలున్నాయని శిక్షా డాట్ కామ్ బిజినెస్ హెడ్ మనీశ్ ఉపాధ్యాయ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాల్లో సరైన వసతులు లేకపోవడం, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు అంతగా అందుబాటులోకి లేకపోవడం వంటివి విద్యార్థులను హస్తినవైపు చూసేలా చేస్తున్నాయన్నారు. రాజధానిలో అయితే ఉద్యోగం చేసుకుంటూ కూడా చదువుకునే అవకాశముందనే అభిప్రాయాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేశారన్నారు. అంతేకాక తామ చదువుతున్న కోర్సుకు సంబంధించి కోచింగ్ వంటివి అందుబాటులో ఉన్నాయని, అదే ఇతర ప్రాంతాల్లో కష్టమేనని చెబుతున్నారు. ఇంజ నీరింగ్ విద్యార్థులేకాదు ఆర్ట్స్, సైన్స్, కామర్స్, డిజైన్ అండ్ మాస్ కమ్యూనికేషన్ చదువుతున్న విద్యార్థులు కూడా ఇదే అభిప్రాయంతో ఢిల్లీ, ఎన్సీఆర్లోని కళాశాలల్లో చేరామన్నారు. -
ఇంటర్నెట్కు బానిసలవుతున్న యువత
ఇంటర్నెట్.. అదో మాయాజాలం.. మనసు కన్నా వేగంగా ఆలోచించేది.. మనిషికన్నా ఎక్కువ విజ్ఞానాన్ని నింపుకున్నది ఇంటర్నెట్. ఇదో విజ్ఞాన సర్వస్వం. క్లిక్ చేస్తే చాలు.. ప్రపంచంలోని వింతలు విశేషాలు కళ్ల ముందుంటాయి. క్లిక్ చే స్తే చాలు.. ప్రపంచంలోని దేని గురించిన సమాచారం అయినా ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు యువతకు ఇంటర్నెట్ ఆరోప్రాణంగా మారింది. నిత్యావసరమై పోయింది. ఇంటర్నెట్ యువతకు ఏ మేరకు ఉపయోగపడుతోందో, ఎంత చెడుపు చేస్తోందో తెలిపే కథనమే ఇది.. న్యూఢిల్లీ: మారుతున్న కాలంలో సాంకేతిక పరిజ్ఞానం మన జీవితాల్లోకి దూసుకొస్తోంది. ఇంటర్నెట్ వాడకం నిత్యావ సరంగా మారిపోయింది. పిల్లలను ఎల్కేజీలో చేర్పించేందుకు దరఖాస్తు చేయడంతో మొదలయ్యే ఇంటర్నెట్ వాడకం ఉద్యోగాలు పొందే ప్రవేశ పరీక్షల వరకూ, ప్రతి సందర్భంలోనూ తప్పనిసరి అయింది. అందులో యువత మరీ ముఖ్యంగా ఇంటర్నెట్ను అధికంగా వాడుతున్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ సామాజిక వెబ్సైట్లను ఉపయోగించుకుంటున్నారు. ఇలా ఉపయోగపడుతోంది.. ముఖ్యంగా ఇంజనీరింగ్ ఎంబీఏ, ఎంసీఏ, వైద్య విద్యార్థులతో పాటు ఆయా డిగ్రీ, పీజీ, విద్యార్థులు ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగించుకుని వారికి కావాల్సిన విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. ఆంగ్ల వ్యాకరణం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాల మొదలు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రామాణిక గ్రంథాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఉద్యోగ వివరాలను తెలియజేసే వెబ్సైట్లూ ఇందులో కోకొల్లలు. ఇవీ నష్టాలు ప్రతి వస్తువులోనూ మంచీచెడూ రెండూ ఉంటాయి. మనం ఉపయోగించే విధానంతో అవి వెలుగులోకి వస్తాయి. ఇంటర్నెట్ యువతకు ఎంత ఉపయోగపడుతోందో అంతే స్థాయిలో చెడు కూడా చేస్తోంది. యువతలో దాదాపు 70 శాతం మంది ఇంటర్నెట్కు బానిసలవుతున్నారు. వీరిలో చాలా మంది అర్ధరాత్రి వరకు కంప్యూటర్ ముందు కూర్చుని ఉంటున్నారు. కొందరు అశ్లీల చిత్రాలను చూసేందుకు, వాటిని బయటివారితో షేర్ చేసుకునేందుకు కూడా వెనుకాడ్డం లేదు. ఇటీవల జిల్లాలో ఫేస్బుక్ల ద్వారా కొందరు అశ్లీల మెసేజ్లు పోస్ట్ చేయడంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కొందరిలో ఇంట ర్నెట్ చూడ్డం కూడా వ్యసనంలా మారుతోంది. మంచి కూడా మితంగా ఉన్నంత వరకే బాగుంటుంది. పరిమితి దాటితే చెడుగా మారుతుంది. ఇటీవల సర్వేలో వెలుగు చూసిన నిజాలు ఇంటర్నెట్ వాడకంపై ఇంజనీరింగ్, డిగ్రీ, బీఈడీ విద్యార్థుల్లో ఇటీవల ఓ సంస్థ సర్వే నిర్వహించింది. తమకు విషయ సేకరణకు, దరఖాస్తులు పంపడానికి ఇంటర్నెట్ ఉపయోగపడుతోందని 95 శాతం మంది తెలిపారు. యువత పెడతోవ పట్టేందుకు ఇంటర్నెట్ ప్రధాన కారణమని 60 శాతం మంది తెలిపారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం మనుషులను సోమరులుగా మారుస్తోందని 65 శాతం మంది తెలిపారు. జ్ఞాపక శక్తిని తగ్గిస్తోందని 35 శాతం మంది అన్నారు. -
కేఎల్యూలో సరికొత్త ఎంబీఏ కోర్సు
విజయవాడ: బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో విశ్లేషణాత్మక ఆలోచనలను పెంపొందించే లక్ష్యంతో సరికొత్త ప్రోగ్రామ్ పంపిణీ తరహా ఎంబీఏ కోర్సులను దేశంలోనే తొలిసారిగా కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంబీఏ విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచనలతో పాటు, సాంస్కృతిక అవగాహన పెంచేందుకు, వ్యాపార సరళిని లోతుగా అధ్యయనం చేసే లక్ష్యంతో కేఎల్యూ, టైమ్స్ ప్రో సంస్థ సంయుక్తగా ఎంబీఏ బ్యాంకింగ్, ఫైనాన్స్ విభాగాల్లో రెండేళ్ల పంపిణీ తరహా కోర్సులను ప్రారంభించనున్నాయి. ఈ మేరకు విజయవాడ నగరంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కేఎల్యూ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, టైమ్స్ప్రో అధ్యక్షుడు దీపక్ లంబా పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ ఎంబీఏ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉత్తమ ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు రిటైల్ బ్యాంకింగ్, విదేశీ మారకం, ఫైనాన్షియల్, కార్పొరేట్ బ్యాంకింగ్ వంటి కీలక అంశాలపై విద్యార్థులకు పరిపూర్ణమైన విజ్ఞాణాన్ని అందించాలనే లక్ష్యంతో దేశంలోనే మొదటి సారిగా పంపిణీ తరహా ఎంబీఏ కోర్సును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు సంస్థల్లోనూ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, రెండు సర్టిఫికెట్లు ఇవ్వడాన్నే పంపిణీ తరహాగా పేర్కొన్నారు. టైమ్ప్రో అధ్యక్షులు దీపక్ లంబా మాట్లాడుతూ విద్యార్థులను పరిశ్రమలతో అనుసంధానం చేసి, ప్రాక్టికల్ పరిజ్ఞానంతో కోర్సు బోధిస్తామని తెలిపారు. సమావేశంలో కేఎల్యూ ఉపాధ్యక్షులు రాజా హరీన్, వైస్ఛాన్సలర్ ఎల్ఎస్ఎస్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఆనందకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇండస్ట్రీ రెడీ... బీ-స్కూల్స్ కరిక్యులమ్
మేనేజ్మెంట్... ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ఎవర్గ్రీన్ కోర్సు. సంప్రదాయ కోర్సుల నుంచి ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులను పూర్తిచేసిన విద్యార్థుల వరకూ.. ఎంబీఏలో చేరడమే చాలామంది లక్ష్యం. కార్పొరేట్ కంపెనీలు మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతుండడమే ఇందుకు కారణం. మరోవైపు కంపెనీల అవసరాలకు అనుగుణంగా.. నైపుణ్యాలు అందించే విధంగా ప్రస్తుత బీ-స్కూల్స్ కరిక్యులమ్ ఉందా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. పరిశ్రమ ఆశించిన విధంగా కరిక్యులమ్ ఉండకపోవడంతో కోర్సు-జాబ్ మధ్య అంతరం ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సిలబస్ను ప్రస్తుత అవసరాలకనుగుణంగా రూపొందించే ప్రక్రియకు సిటీలోని ఐఎస్బీ, ఐపీఈ, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీ, ఐఎంటీ, ఎన్ఐఎంఎస్ తదితర బీ-స్కూల్స్ శ్రీకారం చుట్టాయి. దేశంలోని అధిక శాతం బీ-స్కూల్స్ జాబ్ మార్కెట్ డిమాండ్ మేరకు తమ విద్యార్థుల్లో అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే దిశగా కోర్సుల్లో మార్పులు చేస్తున్నాయి. ఎంప్లాయర్స్తోపాటు మారిన పని సంస్కృతికనుగుణంగా (బిజినెస్ ఎన్విరాన్మెంట్) సరిగ్గా సరిపోయే కోర్సులను తిరిగి రూపొందించడంలో నిమగ్నమయ్యాయి. 2015 విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన సిలబస్ను అమల్లోకి తీసుకురానున్నాయి. ఇందులో ప్రస్తుత మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంభాషణ చాతుర్యం.. గత కార్పొరేట్ వైఫల్యాల నుంచి పాఠాలను నేర్చుకోవడం.. చైనా వంటి కీలక మార్కెట్లను అవగాహన చేసుకునే సామర్థ్యం.. స్టార్ట్అప్లను ప్రారంభించడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించడం.. ఆర్థిక రంగంలో కొత్తగా వస్తున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం.. పెట్టుబడి దారుల ఆసక్తిని అధ్యయనం చేయడం.. సంస్థను సమర్థంగా నిర్వహించడం.. రిటెన్ కమ్యూనికేషన్పై పట్టు సాధించేందుకు దోహదపడే అంశాలకు చోటు కల్పిస్తున్నాయి. తద్వారా విద్యార్థి కోర్సు పూర్తయ్యే నాటికి ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ సొంతం చేసుకునేలా సిలబస్ను రూపొందిస్తున్నాయి. సిటీ బీ స్కూల్స్లో... హైదరాబాద్లోని ఐఎస్బీ, ఐపీఈ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ, నర్సీమొంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీల మేనేజ్మెంట్ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. వీటిల్లో ఐఎస్బీ, ఐపీఈల్లో 2015 విద్యాసంవత్సరం నుంచి సిలబస్లో కొన్ని మార్పులు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో మేనేజ్మెంట్ కోర్సుల సిలబస్ను 2010 విద్యాసంవత్సరంలో మార్చారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్ మార్పులపై ప్రస్తుతం సమీక్షిస్తున్నారు. యూజీసీ అనుమతితో ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంతో కోర్సులను ఎలక్టివ్ సబ్జెక్టులుగా ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) మిగతా ఇన్స్టిట్యూట్లకు భిన్నంగా ఐఎస్బీ ఐదు సంవత్సరాలకోసారి కరిక్యులమ్లో మార్పులు చేస్తోంది. అవసరాలకనుగుణంగా ఎప్పటికప్పుడూ నూతన కోర్సులను ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం ఇన్స్టిట్యూట్లో ఉన్న 763 మంది విద్యార్థుల కోసం కొత్తగా రెస్పాన్సిబుల్ లీడర్షిప్ అనే నూతన కోర్సును రూపొందించింది. సందర్భానుసారంగా ఎటువంటి రాగద్వేషాలు లేకుండా బాధ్యతాయుతమైన ప్రవర్తనను అలవరచుకోవడం.. అవసరమైన సమయంలో కఠినంగా వ్యవహరించడం.. సమర్థవంతంగా నిర్వహణ వ్యవహారాలను నిర్వర్తించడం.. వంటి నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశంతో ఈ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ ఇన్స్టిట్యూట్ ఏడాది వ్యవధి గల మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ను అందిస్తోంది. అంతేకాకుండా బిజినెస్ కమ్యూనికేషన్ కోర్సును కూడా నిర్వహిస్తోంది. వెర్బల్, రిటెన్ కమ్యూనికేషన్ పరంగా విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఈ కోర్సు దోహదం చేస్తుంది. మొత్తం మీద వ్యక్తిగత పనితీరును మెరుగుపరుచు కోవడంతోపాటు సహోద్యోగులతో ప్రభావవంతమైన సమన్వయం చేసుకోవడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ఈ ఇన్స్టిట్యూట్ మరో వినూత్న ఆలోచన కూడా చేస్తోంది. కొత్త సబ్జెక్ట్లను బోధించడానికి విదేశీ ఫ్యాకల్టీలను నియమించుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ‘‘కరిక్యులమ్లో 24 అంశాలున్నాయి. గ్లోబల్ మార్కెటింగ్ అవసరాలకు తగినట్లుగా సిలబస్లో మార్పు చేశాం. పోటీ వాతావరణానికి దీటుగా మార్కెట్ ఇంజనీరింగ్, సర్వీసెస్-గ్లోబల్ మార్కెటింగ్, రిటైల్ సెక్టార్ వంటి సబ్జెక్టులు ఇప్పటి మార్కెట్కు తగినట్లుగా రూపొందిస్తున్నాం’’ అని ఓయూ మేనేజ్మెంట్ డీన్ కృష్ణారెడ్డి చెప్పారు. స్వదేశీ, విదేశీ పెట్టుబడులు, బ్యాంకింగ్, ఫైనాన్స్, స్టాక్మార్కెట్ వంటి అంశాల్లో ఎప్పుడూ నూతనత్వం చోటుచేసుకుంటుంది. వ్యాపార లావాదేవీల్లో పెనుమార్పులుంటాయి. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్ ఉన్నప్పుడే.. సబ్జెక్టు నిపుణులు బయటకు వస్తారు. కాబట్టి సిలబస్లో మార్పు చేయడం చాలా అవసరం అంటున్నారు కృష్ణారెడ్డి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ(ఐఎంటీ)-హైదరాబాద్ విద్యార్థుల ఆకాంక్షలను తీర్చేందుకు ఐఎంటీ-హైదరాబాద్ పీజీడీఎం ప్రోగ్రామ్స్లో భాగంగా వివిధ ఎలక్టివ్స్ను ఆఫర్ చేస్తోంది. ఇష్టమైన ఐచ్ఛికాంశాన్ని ఎంచుకొనే స్వేచ్ఛను విద్యార్థులకు కల్పించింది. ఒక విభాగంలో పూర్తి పట్టు సాధించాలనుకునేవారు దానికి సంబంధించి కనీసం ఐదు ఎలక్టివ్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. మిగిలినవి ఏదైనా ఇతర విభాగంనుంచి ఎంచుకోవచ్చు. కనీసం 15 మంది విద్యార్థులు ముందుకొస్తే వారికి ఎలక్టివ్ కోర్సును ఆఫర్ చేస్తారు. ఐఎంటీ సంప్రదాయ ఫంక్షనల్ స్పెషలైజేషన్లతోపాటు బిజినెస్ ఎనలిటిక్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి ప్రత్యేక విభాగాల్లో కెరీర్ ఓరియెంటెడ్ ఎలక్టివ్లను కూడా ఆఫర్ చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి కెరీర్ ఓరియెంటెడ్ ఎలక్టివ్లను మరికొన్ని ప్రవేశపెట్టాలని ఐఎంటీ యోచిస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-బెంగళూరు దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూల్స్ల్లో ఒకటైన.. ఐఐఎం-బెంగళూరు కొత్తగా పబ్లిక్ పాలసీ కోర్సును ప్రారంభించింది. హెల్త్ కేర్ ఎకనామిక్స్, బిజినెస్ చైన్స్ ఇందులోని ఐచ్ఛికాంశాలు (ఎలెక్టివ్స్). ఈ కోర్సు రెండో సంవత్సరంలో 23 ఐచ్ఛికాంశాలు ఉన్నాయి. ఫ్యాకల్టీ, విద్యార్థులు, కార్పొరేట్ సంస్థలు ప్రతిపాదించిన స్పెషలైజేషన్స్కు ఈ 23 ఐచ్ఛికాంశాల్లో చోటు కల్పించడం ఈ కోర్సు ప్రత్యేకత. కార్పొరేట్ వైఫల్యాలు, ఆర్థిక రంగంలో ఆసియా దేశాలు దూసుకుపోతున్న అంశాలను నేపథ్యంగా తీసుకుని పబ్లిక్ పాలసీ/కార్పొరేట్ స్ట్రాటజీ ప్రొఫెసర్లు ఈ కోర్సును బోధిస్తారు. అంతేకాకుండా ఈ ఇన్స్టిట్యూట్ ప్రస్తుత సంవత్సరం నుంచి జర్మన్ లాంగ్వేజ్ను కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ ఇన్స్టిట్యూట్ అందజేసే నాన్-క్రెడిట్ కోర్సులను ఐచ్ఛికాంశాలు (ఎలెక్టివ్స్)గా వ్యవహరిస్తారు. వీటిని ద్వితీయ సంవత్సరంలో స్పెషలైజేషన్స్లో భాగంగా ఆఫర్ చేస్తారు. నైపుణ్యాలు పెంచుకోవాలి సిలబస్లో కొత్తగా వచ్చే మార్పులు ఏవిధంగా ఉన్నా.. మేనేజ్మెంట్ కోర్సుల విషయంలో విద్యావేత్తల అభిప్రాయం మాత్రం మరోలా ఉంది. కేస్ స్టడీస్ కంటే వాస్తవిక పరిస్థితులను అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశం కల్పిస్తే ఈ కోర్సులు మరింత ప్రభావవంతంగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో విద్యార్థులు కూడా జాబ్ ఆఫర్ల గురించి ఆలోచించకుండా.. కార్పొరేట్ ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడే నిజ జీవిత నైపుణ్యాలను పెంచుకోవడం ఉత్తమమనే సలహా ఇస్తున్నారు. వ్యాపార కళతో మేనేజ్మెంట్ విద్య ‘‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజ్(ఐపీఈ).. పీజీడీఎం కోర్సుల సిలబస్ను వ్యాపార రంగానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నాం. ఈ విద్యాసంవత్సరం బిజినెస్ ఎనలిటిక్స్, బిగ్ డేటా ఎనలిటిక్స్ వంటి కోర్సులను ప్రవేశపెట్టాం. బిజినెస్ ఎథిక్స్, పబ్లిక్ పాలసీ వంటి సబ్జెక్టులను కోర్ కోర్సుల్లో చేర్చాం. ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ను సబ్జెక్టుగా చేర్చడం ద్వారా మార్కెట్లో నూతనత్వంతోనే వ్యాపారం వృద్ధి చెందుతుందనే తాజా ట్రెండ్పై అవగాహన కల్పించనున్నాం. అంతర్జాతీయ మేనేజ్మెంట్ స్కూల్స్లో మాదిరిగా కాఫెతీరియా ప్రోగ్రాం ద్వారా క్యాంపస్లోకి రాగానే స్పెషల్ కోర్సులను ఎంచుకునే సౌలభ్యం కల్పిస్తున్నాం’’ -ప్రొఫెసర్ మిశ్రా, డెరైక్టర్, ఐపీఈ -
ఇంజనీరింగ్.. ఎవర్గ్రీన్
ఇంజనీరింగ్.. దేశంలో అత్యధిక మంది విద్యార్థులు ఎంచుకుంటున్న వృత్తి విద్యా కోర్సు.. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కలిపి దాదాపు 3,500కు పైగా కాలేజీలు.. పదుల సంఖ్యలో బ్రాంచ్లు.. లక్షల్లో విద్యార్థులు.. వెరసి మరే కోర్సుకు లేనంత ఆదరణనుఇంజనీరింగ్ సొంతం చేసుకుంది.. ఇంతలా ఇంజనీరింగ్ యువత కలల వేదికగా మారడానికి ఏయే అంశాలు ప్రాతిపదికగా నిలుస్తున్నాయి.. అసలు ఇంజనీరింగ్లో చేరడం వల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటి.. తదితర అంశాలపై నిపుణుల అభిప్రాయాలు.. ఉన్నత స్థానాల్లోకి.. త్వరగా ఆధునిక కోర్సుల్లో ఇంజనీరింగ్ విద్యకు ఉన్నంత గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా మరే కోర్సుకు లేదని చెప్పొచ్చు. వస్తున్న మార్పులకనుగుణంగా అన్ని రకాల సాంకేతిక అంశాలను ఎప్పటికప్పుడు సిలబస్లో ప్రవేశపెట్టడం ద్వారా ఇంజనీరింగ్ కోర్సు నవ్యతను సంతరించుకుంటుంది. తద్వారా సంప్రదాయ, ఆధునిక అంశాల కలయికగా ఇంజనీరింగ్ రూపాంతరం చెందింది. తద్వారా ఉపాధి పరంగా అవకాశాలు మెరుగవుతున్నాయి. ఉన్నతవిద్య విషయానికొస్తే.. మరే కోర్సుకు లేనంత సరళత్వం (ఫ్లెక్సిబిలిటీ) ఇంజనీరింగ్ సొంతం. ఎందుకంటే సంబంధిత బ్రాంచ్లో వివిధ స్పెషలైజేషన్స్తో ఎంఈ/ ఎంటెక్ వంటి కోర్సులను అభ్యసించవచ్చు. అంతేకాకుండా మేనేజ్మెంట్పై ఆసక్తి ఉంటే ఎంబీఏ/ పీజీడీఎం వంటి కోర్సులను ఎంచుకోచ్చు. తద్వారా టెక్నికల్ రంగంలోనేకాకుండా మేనేజ్మెంట్ రంగంలో కూడా ఉన్నత స్థానాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, నోకియా సీఈవో రాజీవ్ సూరి వరకు అగ్రస్థానంలో ఉన్న అన్ని కంపెనీ సీఈవోల్లో అత్యధిక శాతం మంది ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న వారే కావడం గమనార్హం. ఇంజనీరింగ్లో ఏబ్రాంచ్లోనైనా సబ్జెక్ట్ పరిధి విస్తృతం. నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు వంటివి నేడు ప్రతి రంగంలో తప్పనిసరిగా మారిన నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉన్నత విద్య మంచి అవకాశంగా నిలుస్తోంది. నాసా, మైక్రోసాఫ్ట్, రోల్స్రాయిస్, ఎయిర్బస్, బ్లాక్ బెర్రీ.. ఇలా ఏ కంపెనీ అయినా సృజనాత్మకత, సమస్యా సాధన నైపుణ్యం ఉన్న ఇంజనీర్లకు పెద్దపీట వేస్తున్నాయి. ఇటువంటి నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇంజనీరింగ్ పీజీలు చక్కని వేదికలు. గమనించాల్సిన మరో అంశం.. ఇంజనీరింగ్ అభ్యర్థులు వృత్తి పరంగా కూడా ఉన్నత స్థానాలకు త్వరగా చేరుకోవచ్చు. ఎందుకంటే విధుల్లో భాగంగా.. ఒక సమస్యను విశ్లేషించడం, పరిష్కరించడం వంటి అంశాలపై పని చేయాల్సి ఉంటుంది. తద్వారా నైపుణ్యాలు, సామర్థ్యాలు ప్రపంచానికి తెలుస్తాయి. అంతేకాకుండా ఉద్యోగుల మధ్య ఉండే పోటీతత్వం కూడా నిపుణులుగా (ప్రొఫెషనల్స్) ఎదగడానికి దోహదం చేస్తుంది. ఉద్యోగంపై ఆసక్తి లేకుంటే ఎంటర్ప్రెన్యూర్స్గా స్థిరపడే క్రమంలో కావల్సిన పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించడంలో ఇంజనీరింగ్ కోర్సుది ప్రత్యేక ఒరవడి.-డాక్టర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్,ప్రొఫెసర్ అండ్ హెడ్ (మెకానికల్),జేఎన్టీయూ-హైదరాబాద్. శాస్త్రీయ విజ్ఞానం సామాజిక అవసరాలకు చురుగ్గా, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించే గుణం ఉన్న విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుకు సరిగ్గా సరిపోతారు. ఇంజనీర్లకు సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి సమాజానికి ఉపయోగపడే ఎన్నో పనులకు ఇంజనీర్లే ఆద్యులుగా నిలుస్తున్నారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని సామాజిక అవసరాలకు అన్వయించడంలో ఇంజనీర్లు ఎప్పుడూ ముందుంటున్నారు. అవసరాల నుంచి సౌకర్యం వరకు అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఇంజనీర్లదే ప్రధాన భూమిక. రవాణా, రక్షణ, విద్య, వైద్యం, ఇలా ప్రతి రంగంలో మానవ జీవితాన్ని సౌకర్యవంతంగా మలిచే విధంగా నూతన టెక్నాలజీలను ఆవిష్కరించడంలో ఇంజనీర్లు ఎప్పుడే ముందే ఉంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మానవాళిని వేధిస్తున్న వ్యాధులు, ఆకలి, కాలుష్యం, శక్తి వంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపడంలో ఇంజనీర్ల పాత్ర కీలకంగా మారుతోంది. ఇంజనీరింగ్.. వివిధ శాస్త్రాలతో సహ సంబంధాన్ని కలిగి ఉంటుంది. తద్వారా ప్రపంచంలో ఎన్నో విషయాలకు సమాధానం ఇంజనీరింగ్ ద్వారానే సాధ్యమవుతుంది. ఉదాహరణకు సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా ఇతర వనరులను సూచించడం. అంతేకాకుండా సమాజంలో శాస్త్రీయ విజ్ఞానం పట్ల ఆసక్తి పెంచడంలో కూడా ఇంజనీర్లు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కాబట్టి సమాజానికి ఇంజనీర్ అవసరమనే కోణంలో కూడా ఇంజనీరింగ్ కోర్సు తన ప్రాముఖ్యతను చాటుకుంది.-ఇ. శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్,కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్-ఏఎన్యూ. ఆవిష్కరణలకు.. అవకాశాలకు కేరాఫ్ ఇంజనీరింగ్ కోర్సు దశాబ్దాల నుంచి నిత్యనూతనంగా మనుగడ సాగిస్తున్న కోర్సు. ప్రస్తుత ఆధునిక కాలంలో ఈ కోర్సు ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది. కారణం వ్యాపార, ఉత్పత్తి రంగాల్లో రోజుకో కొత్త ఆవిష్కరణ ఆవశ్యకమవుతోంది. రోజుకో కొత్త ఉత్పత్తి వినియోగదారుల ముందు ఉంటోంది. ఈ కొత్త ఉత్పత్తుల తయారీ వెనుక ఎంతో శ్రమ, పరిశోధన ఇమిడి ఉంటాయి. ఇదే క్రమంలో వీటికి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా విస్తృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ అండ్ డీ, కొత్త ఆవిష్కరణలకు మార్గం వేసే కోర్సు ఇంజనీరింగ్. అందుకే అటు పరిశ్రమ వర్గాల నుంచి, ఇటు విద్యార్థుల నుంచి ఈ కోర్సుకు ఆదరణ ఏటేటా పెరుగుతోంది. ఇంజనీరింగ్ ఎవర్గ్రీన్ అనేది నిస్సందేహం. కానీ.. దీనికి అదనంగా విద్యార్థులు కూడా నైపుణ్యాల సాధనకు తీవ్రంగా కృషి చేయాలి. నాలుగేళ్ల కోర్సులో ప్రతి రోజు పకడ్బందీ ప్రణాళికతో సాగాలి. అప్పుడే కోర్సులో చేరిన ఉద్దేశం నెరవేరుతుంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం అధిక శాతం విద్యార్థుల్లో కంప్యూటర్ సైన్స్ క్రేజీ బ్రాంచ్గా నిలుస్తున్నప్పటికీ.. కోర్ బ్రాంచ్లతో(సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) సుదీర్ఘ భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్కు ప్రాధాన్య పెరిగింది. ప్రతి రంగంలోనూ రెండు విభాగాల కలయికతో ఉత్పత్తులు ఆవిష్కృతమవుతున్నాయి. ఉదాహరణకు.. మెకానికల్ విభాగాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. కార్ల తయారీలో మెకానికల్తోపాటు సాఫ్ట్వేర్ నైపుణ్యం కూడా అవసరమవుతోంది. కాబట్టి విద్యార్థులు ఇంటర్ డిసిప్లినరీ దృక్పథం అలవర్చుకుంటే అవకాశాలు రెట్టింపు చేసుకోవచ్చు. ప్రస్తుతం అన్ని కంపెనీలు సబ్జెక్ట్ ఫండమెంటల్స్పై పట్టు వంటి అకడెమిక్ నైపుణ్యాలతోపాటు, కమ్యూనికేషన్ స్కిల్స్, మెంటల్ ఎబిలిటీ (మానసిక సామర్థ్యం)పై ప్రత్యేకంగా పరీక్షిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కమ్యూనికేషన్ స్కిల్స్, మెంటల్ ఎబిలిటీ స్కిల్స్ పెంచుకోవడానికి కృషి చేయాలి. ఇవి సిలబస్లో ఉండవు. ఏ బ్రాంచ్ అయినా మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇంజనీరింగ్ కోర్సులో చేరే విద్యార్థులు నాలుగేళ్ల తర్వాత పరిస్థితుల గురించి ఆలోచిస్తూ.. ఆందోళన చెందకుండా అకడెమిక్స్పై పరిపూర్ణత దిశగా కృషి చేస్తే అవకాశాలు వాటంతటవే సొంతమవుతాయి.- ప్రొఫెసర్ పి. రవికుమార్,ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ (ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్)నిట్-వరంగల్ ఆసక్తి, సామర్థ్యాలకు సరిపోయే బ్రాంచ్ ఇంజనీరింగ్ కోర్సులో చేరిన విద్యార్థుల ముందు ఎన్నో అవకాశాలు. ఇతర కోర్సులతో పోల్చితే ఈ కోర్సులో విద్యార్థులకు తమ ఆసక్తి అనుగుణంగా స్పెషలైజేషన్స్ను ఎంచుకోవచ్చు. తద్వారా చక్కని అవకాశాలను అందుకోవడమేకాకుండా ఉన్నత స్థానాల్లో స్థిరపడొచ్చు. ఇంజనీరింగ్లో దాదాపుగా 25కుపైగా బ్రాంచ్లు ఉంటాయి. కేవలం సంప్రదాయ బ్రాంచ్లకే పరిమితం కాకుండా మారుతున్న అవసరాలకనుగుణంగా నూతన బ్రాంచ్లను కూడా ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కెమికల్, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ వంటి బ్రాంచ్లకు మంచి డిమాండ్ ఉంది. ఇందులో కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అభ్యర్థులకు అవకాశాలు పుష్కలం. ఈ రెండు రంగాలు వేగంగా అభివృద్ధి దిశలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో వచ్చే దశాబ్దంలో సంబంధిత రంగాల్లో అవకాశాలు రెట్టింపవుతాయి. ఇంజీనిరింగ్ విద్యార్థులకు ఉన్న సౌలభ్యం ఏమిటంటే ఏ బ్రాంచ్ విద్యార్థులైనా కంప్యూటర్ రంగంలో స్థిరపడొచ్చు. నైపుణ్యాలు ఉంటే చాలు తగిన శిక్షణ ఇచ్చి సాఫ్ట్వేర్ సంబంధిత సంస్థలు ఇతర బ్రాంచ్ల విద్యార్థులను కూడా రిక్రూట్ చేసుకుంటున్నాయి. అదేవిధంగా ప్రభుత్వాలు విద్యుత్, సివిల్ (మౌలిక వసతులు) రంగాలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యతినిస్తున్నాయి. దాంతో సంబంధిత మానవ వనరులకు డిమాండ్ ఏర్పడుతోంది. బయోటెక్నాలజీ, కెమికల్ రంగాలకు సంబంధించి వచ్చే దశాబ్దం ఎంతో కీలకమైంది. పెరుగుతున్న పరిశోధనలు, ప్రభుత్వ ప్రోత్సహం కారణంగా ఈ రంగం స్వరూపం పూర్తిగా మారే అవకాశం ఉంది. తద్వారా విస్తృత ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్లో చేరినా అవకాశాల విషయంలో నిశ్చింతంగా ఉండొచ్చు. ఇటువంటి సరళత్వం (ఫ్లెక్సిబిలిటీ) కేవలం ఇంజనీరింగ్ కోర్సుకే సాధ్యం. కాబట్టి విద్యార్థులు తమ ఆసక్తి, సామర్థ్యాలకు సరిపోయే బ్రాంచ్ను ఎంచుకోవాలి. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. అవకాశాలను అందుకోవాలంటే మాత్రం కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే సంబంధిత నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఇంజనీరింగ్ కోర్సులో ఒక నైపుణ్యం నుంచి మరో నైపుణ్యంలోకి త్వరగా మారాల్సి ఉంటుంది. ఉదాహరణకు సమస్య సాధన నుంచి దాన్ని విశ్లేషించే వరకు వివిధ నైపుణ్యాలతో అవసరం ఉంటుంది. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థుల్లో మేథో సామర్థ్యం కూడా పెరుగుతుంది.-ప్రొఫెసర్ పి. ఎస్. అవధాని, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్,ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్-విశాఖపట్నం. -
ఎంబీఏ(ఐటీ)ని ఆఫర్ చేస్తున్న ఐఐఎం లేవి?
బీటెక్ (మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ లేవి? ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంటుంది? -రాజేష్, సూర్యాపేట. బీటెక్ (మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) కోర్సులో బయోఫిజికల్ టెక్నిక్స్, బయో మెటీరియల్ సైన్స్, స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ కైనటిక్స్ ఆఫ్ మెటీరియల్స్, ప్రాసెసింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అడ్వాన్స్డ్ మెటీరియల్ అండ్ అప్లికేషన్స్ తదితర అంశాలు ఉంటాయి. ఈ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- కాన్పూర్ అర్హత: ఇంటర్మీడియెట్ (ఎంపీసీ). {పవేశం: జేఈఈ-అడ్వాన్స్డ్ ఆధారంగా. వివరాలకు: www.iitk.ac.in అన్నా యూనివర్సిటీ - తమిళనాడు అర్హత: ఇంటర్మీడియెట్ (10+2) ఉత్తీర్ణత {పవేశం: రాత పరీక్ష ఆధారంగా వివరాలకు: www.annauniv.edu యూనివర్సిటీ ఆఫ్ ఎనర్జీ అండ్ పెట్రోలియం స్టడీస్ (యూపీఈఎస్)- డెహ్రాడూన్. అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (ఎంపీసీ) తోపాటు 10వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.ప్రవేశం: యూపీఈఎస్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా లేదా ఇంటర్ మార్కులు ఆధారంగా.వివరాలకు: www.upes.ac.in సీఎస్ఐఆర్ ఫెలోషిప్స్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్).. ఎస్ఆర్ఎఫ్ (సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్), సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎక్స్టెన్డెడ్), రీసెర్చ్ అసోసియేటిషిప్ (ఆర్ఏ)ల కోసం ప్రకటన విడుదల చేసింది. వివరాలు.. ఎస్ఆర్ఎఫ్ (సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్) అందజేస్తున్న విభాగాలు: మెడికల్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్, వెటర్నరీ, లైఫ్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్, ఫిజికల్ సెన్సైస్, మెటీరియల్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స, ఆర్గానిక్, ఎర్త్, ఓషన్, అట్మాస్ఫియరిక్ అండ్ ప్లానెటరీ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్. ఫెలోషిప్ కాల వ్యవధి: మూడు నుంచి నాలుగేళ్లు. స్టైఫండ్: ఎంపికైన అభ్యర్థులకు మొదటి మూడేళ్లు నెలకు రూ. 18 వేలు చెల్లిస్తారు. మెడికల్/వెటర్నరీ/ఫార్మసీ అభ్యర్థులకు మొదటి రెండేళ్లు నెలకు రూ. 18 వేలు తర్వాత ఏడాది నెలకు రూ. 20 వేలు అందజేస్తారు. అంతేకాకుండా కంటిన్జెన్సీ ఫండ్ కింద సంవత్సరానికి రూ. 20 వేలు మంజూరు చేస్త్తారు.అర్హత: ఎంటెక్/ఎంఈ/బీఈ/బీటెక్/బీఫార్మసీ/బీవీఎస్సీ/ బీఎస్సీ (అగ్రికల్చర్)/ఎంబీబీఎస్/బీడీఎస్/ఎంఫార్మసీ/ఎంవీఎస్సీ/ఎంఎస్సీ (అగ్రికల్చర్)/తత్సమానం. వయసు: 32 ఏళ్లు. సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ (ఎక్స్టెన్డెడ్) అందజేస్తున్న విభాగాలు: మెడికల్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్, వెటర్నరీ, లైఫ్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్, ఫిజికల్ సెన్సైస్, మెటీరియల్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స, ఆర్గానిక్, ఎర్త్, ఓషన్, అట్మాస్ఫియరిక్ అండ్ ప్లానెటరీ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్.అర్హత: పీహెచ్డీ/ఎండీ/ఎంఎస్/ఎండీఎస్ విభాగాల్లో థిసిస్ను సమర్పించిన అభ్యర్థులు. వయసు: 33 ఏళ్లు. కాల పరిమతి: ఏడాది ఫెలోషిప్: ఏడాదిపాటు నెలకు రూ. 20 వేలు రీసెర్చ్ అసోసియేట్షిప్ అందజేస్తున్న విభాగాలు: మెడికల్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్, వెటర్నరీ, లైఫ్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్, ఫిజికల్ సెన్సైస్, మెటీరియల్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స, ఆర్గానిక్, ఎర్త్, ఓషన్, అట్మాస్ఫియరిక్ అండ్ ప్లానెటరీ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్. కాల వ్యవధి: మూడేళ్లు. స్టైఫండ్: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.22వేలు, రెండో ఏడాది నెలకు రూ.23వేలు, మూ డో ఏడాది నెలకు రూ.24 వేలు చెల్లిస్తారు. కంటిన్జెన్సీ ఫండ్ కింద సంవత్సరానికి రూ.20వేలు అందజేస్తారు.అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్డీ లేదా ఎండీ/ఎంఎస్/ఎండీఎస్/ ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్. కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లు. ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులకు నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తును ప్రింట్ తీసి సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి నిర్దేశిత చిరునామాకు పంపాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 2, 2014. ప్రింట్ అవుట్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: సెప్టెంబర్ 8, 2014. వివరాలకు: www.csirhrdg.res.in బయోటెక్నాలజీ స్పెషలైజేషన్తో అందుబాటులో ఉన్న మేనేజ్మెంట్ కోర్సు వివరాలు? -చంద్ర, కరీంనగర్..ఔషధాలకు సంబంధించి రీసెర్చ్, అనుబంధ కార్యక్రమాలు విస్తృతమవుతుండటంతో ఇటీవల బయోటెక్ పరిశ్రమల వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నారుు. కంపెనీలు తమ మార్కెటింగ్ కార్యకలాపాల కోసం స్పెషలైజ్డ్ ఎగ్జిక్యూటివ్లు, మార్కెటింగ్ మేనేజర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. దీన్ని గుర్తించిన కొన్ని విద్యా సంస్థలు ఈ విభాగంలో పలు మేనేజ్మెంట్ కోర్సులకు రూపకల్పన చేశారుు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్-హైదరాబాద్ కోర్సు: పోస్ట్గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్- బయోటెక్నాలజీ అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ప్రవేశం: క్యాట్/ఎక్స్ఏటీ/మ్యాట్/ఏటీఎంఏ/ఐసెట్ స్కోర్తోపాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా. వివరాలకు: www.ipeindia.org యూనివర్సిటీ ఆఫ్ పుణె కోర్సు: ఎంబీఏ-బయోటెక్నాలజీ అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి సైన్స్లో మాస్టర్స్/బ్యాచిలర్స్ డిగ్రీ. వివరాలకు: www.unipune.ac.in డీవై పాటిల్ యూనివర్సిటీ-నవీ ముంబై వివరాలకు: dypatil.in ఎంబీఏ(ఐటీ)ని ఆఫర్ చేస్తున్న ఐఐఎం లేవి? -స్రవంతి, మెదక్. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఎంబీఏ(ఐటీ)కి మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి టాప్ ఎంఎన్సీలలో.. ప్రాజెక్ట్ మేనేజర్, సిస్టమ్ డిజైనర్/ఆర్కిటెక్ట్, డేటా అనాలిస్ట్, అప్లికేషన్ సపోర్ట్ అనలిస్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ప్రాసెస్ మేనేజర్ వంటి అవకాశాలు ఉంటాయి. పలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) లు ఎంబీఏ(ఐటీ)/తత్సమాన కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. క్యాట్ స్కోర్, జీడీ/రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం లభిస్తుంది. అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-అహ్మదాబాద్ కోర్సు: పీజీపీ(కంప్యూటర్ - ఇన్ఫర్మేషన్ సిస్టమ్) వివరాలకు: www.iimahd.ernet.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-బెంగళూరు కోర్సు: పీజీపీ (సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్) వివరాలకు: www.iimb.ernet.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్- కోజికోడ్ వివరాలకు: www.iimk.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-కోల్కతా కోర్సు: పీజీపీ(కంప్యూటర్ ఎయిడెడ్ మేనేజ్మెంట్) వివరాలకు: www.iimcal.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-లక్నో వివరాలకు: www.iiml.ac.in ఎంబీఏ(ఐటీ)ని ఆఫర్ చేస్తున్న ఐఐఎం లేవి? -స్రవంతి, మెదక్. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఎంబీఏ(ఐటీ)కి మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి టాప్ ఎంఎన్సీలలో.. ప్రాజెక్ట్ మేనేజర్, సిస్టమ్ డిజైనర్/ఆర్కిటెక్ట్, డేటా అనాలిస్ట్, అప్లికేషన్ సపోర్ట్ అనలిస్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ప్రాసెస్ మేనేజర్ వంటి అవకాశాలు ఉంటాయి. పలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) లు ఎంబీఏ(ఐటీ)/తత్సమాన కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. క్యాట్ స్కోర్, జీడీ/రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం లభిస్తుంది. అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-అహ్మదాబాద్ కోర్సు: పీజీపీ(కంప్యూటర్ - ఇన్ఫర్మేషన్ సిస్టమ్) వివరాలకు: www.iimahd.ernet.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-బెంగళూరు కోర్సు: పీజీపీ (సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్) వివరాలకు: www.iimb.ernet.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్- కోజికోడ్ వివరాలకు: www.iimk.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-కోల్కతా కోర్సు: పీజీపీ(కంప్యూటర్ ఎయిడెడ్ మేనేజ్మెంట్) వివరాలకు: www.iimcal.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-లక్నో వివరాలకు: www.iiml.ac.in పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ పరీక్ష వివరాలను తెలపండి? -తేజ, సిర్పూర్. టోఫెల్, ఐఎల్టీఈఎస్ మాదిరిగానే విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే అభ్యర్థుల ఆంగ్ల భాష పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన పరీక్ష పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్. ఇందులో రిటెన్ టెస్ట్, స్పోకెన్ టెస్ట్ అనే విభాగాలు ఉంటాయి. ఈ టెస్ట్ స్కోర్ ఆధారంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఈ టెస్ట్కు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ రెండు పనిదినాల్లో వస్తుంది. ఆ తర్వాత టెస్ట్ డేట్, సెంటర్ను బుక్ చేసుకోవాలి. ప్రిపరేషన్ మెటీరియల్, ఆన్లైన్ రిసోర్సెస్, స్కోర్స, యూనివర్సిటీలు తదితర వివరాలకు: www.pearsonpte.com -
నా పిల్లల్ని మాత్రం ఇండస్ట్రీకి రానివ్వను!
సంభాషణం మా అమ్మాయి ఎంబీయే చదువుతోంది. బాబు ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నాడు. వాళ్లిద్దరూ ఇండస్ట్రీవైపు రాకూడదన్నదే నా కోరిక. ఇక్కడి లాభనష్టాలు, కష్టసుఖాలు చూసిన తరువాత నేనా నిర్ణయం తీసుకున్నాను. ముఖ్యంగా పాపకు అలాంటి ఆశ ఉంటే మాత్రం కచ్చితంగా అడ్డుపడిపోతాను. బాబు ఏమంటాడో చూడాలి. మావాళ్లు వద్దన్నా నేను వచ్చేశాను కదా... వాడూ అలా చేస్తే నేనేం చేయగలను! ‘కొండలా కోర్సువుంది ఎంతకీ తగ్గనంది’ అంటూ ‘శివ’ సినిమాలో పుస్తకాల రాశిని చూసి బెంగపడిపోతూ ప్రేక్షకులను నవ్వించాడు. ‘తులసీదళం’ సీరియల్లో శ్రీనివాస పిళ్లై పాత్రలో క్రూరత్వాన్ని ప్రదర్శించి అందరినీ భయపెట్టాడు. ‘మహాత్మ’ చిత్రంలో గాంధీ మహాత్ముడిని తలపిస్తూ హృదయాలను స్పృశించాడు. ఇంత వైవిధ్యతను ప్రదర్శిస్తాడు కనుకనే ‘రాం జగన్’ అందరి మనసుల్లో స్థానం సంపాదించాడు. తన నట ప్రయాణంలోని ఒడిదుడుకుల గురించి ఆయన మనసు విప్పి చెప్పిన మాటలివి... ఈ మధ్య మిమ్మల్ని చూడగానే ‘మహాత్మ’ సినిమా గుర్తొస్తోంది...? ఈ మధ్య అందరూ ఇలానే అంటున్నారు. ఆ సినిమాలో గాంధీ వేషం గురించే మాట్లాడుతున్నారు. కొందరైతే చేతులెత్తి దణ్నం కూడా పెట్టారు. అసలా పాత్ర ఆఫర్ చేసినప్పుడు మీకేమనిపించింది? మొదట ఓ చిన్న షాట్ కోసమే అడిగారు. నాకు శ్రీకాంత్ అంటే చాలా ఇష్టం. అందుకే ఒక్క షాట్ అయినా ఫర్వాలేదని చేశాను. కొన్ని రోజుల తర్వాత కృష్ణవంశీ నుంచి కబురొచ్చింది. వెళ్తే రకరకాల గెటప్పులు వేయించి షూట్ చేశారు. ‘ఇదంతా నీకోసం కాదు, గెటప్స్ టెస్ట్ చేయడానికే, వీలైతే నీకు వేరే ఏదైనా పాత్ర ఇస్తాలే’ అన్నారు. కానీ నాలుగు రోజుల తర్వాత పిలిచి నువ్వే చేస్తున్నావ్ అన్నారు. ఆనందంతో నోట మాట రాలేదు. చాలా యేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అసలిటువైపు ఎలా వచ్చారు? మాది ప.గో. జిల్లాలోని చెరకువాడ. చిన్నప్పట్నుంచీ ఎన్టీయార్ అంటే పిచ్చి. ఆయన పోస్టర్లు కట్ చేసి, పుస్తకాలకు అట్టలు వేసుకునేవాడిని. ఇంటర్మీడియెట్ చేశాక మైన్స్ సర్వేయింగ్లో డిప్లొమో చేయడానికి గూడూరు వెళ్లాను. అక్కడ రూమ్మేట్స్తో కలిసి విపరీతంగా సినిమాలు చూశాను. అప్పుడే నటన మీద ఆసక్తి కలిగింది. మంచి కమెడియన్ని అవ్వగలనన్న నమ్మకంతో హైదరాబాద్ వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాను. తెరమీద ఎప్పుడు కనిపించారు? ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్నప్పుడే శోభన్బాబు హీరోగా చేసిన ‘మాంగల్యబలం’ సినిమాలో అవకాశం వచ్చింది. అప్పటికి ఇండస్ట్రీ ఇంకా మద్రాసులోనే ఉండటంతో... ఆ సినిమా పూర్తయ్యాక మద్రాస్ వెళ్లిపోయాను. కొన్ని సినిమాలు చేశాక ‘శివ’లో చాన్స్ వచ్చింది. ఆ సినిమాతోనే బ్రేక్ కూడా వచ్చింది. కొన్నాళ్ల తర్వాత డల్ అయ్యారెందుకు? ఇండస్ట్రీ హైదరాబాద్కు షిఫ్టయ్యాక ఇక్కడకు వచ్చేశాను. అప్పుడు ఓ చానెల్వారు సీరియల్స్లో వరుస అవకాశాలిచ్చారు. బుల్లితెర మీద బిజీ అయిపోవడంతో వెండితెర అవకాశాలు తగ్గాయి. మరి మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నించలేదా? నేనెప్పుడూ ఆల్బమ్స్ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగలేదు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ పోయాను. అయితే ఒక గుర్తింపు వచ్చిన తర్వాత ఏది పడితే అది చేయడానికి మనసొప్పలేదు. మహాత్మ తర్వాత మంచి అవకాశాలు వస్తాయనుకున్నాను కానీ అలా జరగలేదు. ఒకవేళ ప్రయత్న లోపమేమో? కావచ్చు. అయితే అవకాశాల కోసం ఒక హద్దు దాటి నేను ప్రయత్నించలేను. వెండితెర మీద వెలగడం కోసం విలువల్ని వదులుకోవడం నావల్ల కాదు. అలాగని పైకి వచ్చినవాళ్లంతా అలా చేశారనట్లేదు. నాకలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని మాత్రమే చెబుతున్నాను. కెరీర్ మీకు అసంతృప్తినే మిగిల్చిందన్నమాట? కాదని అంటే అబద్ధం చెప్పినట్టు అవుతుంది. హీరోని కావాలనుకోలేదు. సినిమా అంతటా కనిపించే పాత్రల్నీ కోరుకోలేదు. రెండు మూడు సన్నివేశాలే ఉన్నా, నా టాలెంటుకు తగిన రోల్స్ కోరుకున్నాను. నేను కోరుకున్నదే తక్కువ. ఆ తక్కువ కూడా దొరకలేదే అని ఫీలవుతుంటాను. ఓ ప్రెస్మీట్ జరిగితే... దర్శకుడు, హీరో, హీరోయిన్, విలన్లాంటి కొందరి పేర్లు రాసి, తదితరులు అంటూ వదిలేస్తారు తప్ప కనీసం మా పేర్లు కూడా రాయరు. అలా ఉంటుంది పరిస్థితి! సీరియల్స్ అయినా చేయవచ్చు కదా? చేస్తూనే ఉన్నాను. ఒక రకంగా సీరియళ్లు నాలోని నటుడిని తృప్తి పరిచాయి. కానీ ఎన్ని సీరియళ్లు చేసినా మనసంతా సినిమా మీదే ఉంటుంది. నటన కాకుండా ఇంకేమైనా...? నాకు నటన అంటేనే ఇష్టం. అదే చేస్తాను. సమాజానికి కూడా ఏదైనా చేయాలని ఉంది. ఏదో నాకున్న దానిలో కాస్త సేవకు వెచ్చిస్తుంటాను. ‘అక్షయపాత్ర’ ఫౌండేషన్కి ప్రతి యేటా విరాళాలు పంపిస్తాను. థ్యాంక్స్ చెబుతూ వాళ్లు పంపిన ఉత్తరం చూసినప్పుడల్లా మరొకరికి సాయపడగలిగే స్థాయిలో ఉన్నందుకు సంతోషపడుతుంటాను. లేనిదానికి బాధపడే తత్వం కాదు నాది. నవ్వుతూనే బతికేస్తాను. నిజాయతీగా ఉంటే చాలనుకుంటాను. ఇక అంతా ఆ పైవాడి దయ! - సమీర నేలపూడి -
MBA కోర్సుకి గల అవకాశాలు!
-
MBAకు ఉన్న అవకాశాలేంటి?
-
ఐసెట్ -2014 ఫలితాల విడుదల
* 92.45 శాతం మంది ఉత్తీర్ణత * జూన్ 17 నుంచి ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు హన్మకొండ, న్యూస్లైన్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది మే 23న కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్ -2014 పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఐసెట్ చైర్మన్, కేయూ ఇన్చార్జి వీసీ ఆర్ఎం.డోబ్రియాల్, ఐసెట్ కన్వీనర్, కేయూ ప్రొఫెసర్ ఓంప్రకాశ్లు ఫలితాలను ప్రకటించారు. ఐసెట్-2014 పరీక్షకు 1,42,462 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా... 1,29,529 మంది హాజరైనట్లు వెల్లడించారు. ఇందులో 1,19,756 మంది అభ్యర్థులు (92.45 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు. పురుషులు 83,868 మంది పరీక్షకు హాజరు కాగా... 77,211 మంది(92.06 శాతం) మహిళలు 45,661 మంది పరీక్షకు హాజరుకాగా.. 42,545 మంది (92.45 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 263 పరీక్ష కేంద్రాల్లో ఐసెట్ను ప్రశాంతంగా నిర్వహించారన్నారు. పరీక్ష ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా విడుదల చేశామన్నారు. ఫైనల్ కీ www,apicet.org.inవెబ్సైట్లో అందుబాటులో ఉందన్నారు. అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను ఈ నెల 17వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని వివరించారు. రీ కౌంటింగ్ ఆప్మార్క్స్, ఫొటోస్టాట్ కాపీ ఆఫ్ ఓఎంఆర్ ఆన్సర్షీట్ కోసం ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కన్వీనర్ ఐసెట్-2014 పేర డిమాండ్ డ్రాఫ్ట్ పంపించాలని అభ్యర్థులకు సూచించారు. బెస్ట్ కంపెనీలో మేనేజర్ కావాలని ఉంది ఐసెట్ ఫలితాల్లో 181 మార్కులతో మొదటి ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఇప్పటికే బీటెక్ పూర్తిచేశాను. మంచి కంపెనీలో మేనేజర్ కావాలనేదే లక్ష్యం. దీంతో ఐసెట్కు ప్రిపేరయ్యాను. కేరళలోని కోయికుడ్ లేదా జంషెడ్పూర్లో ఎంబీఏ కోర్సు చదువుకోవాలని ఉంది. ఇప్పటికే క్యాట్ పరీక్షను కూడా రాసి.. అందులో ప్రతిభ చూపాను. - అనుభవ్ కున్నేల్ ప్రేమ్, ఐసెట్ మొదటి ర్యాంకర్ -
17 మంది పోలీసులకు యావజ్జీవం
ఎంబీఏ విద్యార్థి బూటకపు ఎన్కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు న్యూఢిల్లీ: 22 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని కిడ్నాప్ చేసి, బూటకపు ఎన్కౌంటర్ చేసిన కేసులో దోషులుగా తేలిన 17 మంది ఉత్తరాఖండ్ పోలీసులకు ఢిల్లీ కోర్టు సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే దోషులకు ఉరిశిక్ష వేస్తామని, ఈ కేసు అత్యంత అరుదైనది కాదని, అందువల్ల యావజ్జీవ కారాగార శిక్షతో సరిపెడుతున్నామని పేర్కొంది. 2009 జులై 3న ఉద్యోగం కోసం ఘజియాబాద్ నుంచి డెహ్రాడూన్ వచ్చిన రణబీర్ సింగ్ అనే యువకుడిని అపహరించి బూటకపు ఎన్కౌంటర్ చేసి చంపేసిన కేసులో ఈ 17 మంది పాత్రా ఉందని ఇటీవలే కోర్టు నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సోమవారం తీర్పు వెలువరిస్తూ.. విద్యార్థి హత్యతో నేరుగా సంబంధమున్న ఏడుగురు పోలీసులకు(వీరిలో ఆరుగురు సబ్ ఇన్స్పెక్టర్లు) రూ.50 వేల చొప్పున, మిగతా 10 మందికి రూ.20 వేల చొప్పున జరిమానా విధించింది. ఈ సొమ్ము అంతటినీ బూటకపు ఎన్కౌంటర్లో మరణించిన యువకుడి తల్లిదండ్రులకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. అయితే వారికి జరిగిన నష్టాన్ని ఇది పూడ్చలేదని, ఈ నేపథ్యంలో మరింత పరిహారం చెల్లించేలా ఢిల్లీ న్యాయ సేవల అథారిటీ చర్యలు తీసుకోవాలని సూచించింది. దోషులకు ఉరిశిక్ష వేయాలని సీబీఐ కోరగా.. ఈ కేసు అత్యంత అరుదైనది కాదని, యావజ్జీవ శిక్ష అన్నది నిబంధన అని, ఉరిశిక్ష మినహాయింపని చెప్పింది. మృతుడి తల్లిదండ్రులు కోర్టు హాల్లోనే ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. లోక్సభకు ట్రాయ్ ఆర్డినెన్స్ న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్య కార్యదర్శిగా టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియూ (ట్రాయ్) మాజీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నియూమకానికి మార్గం సుగమం చేసిన ఆర్డినెన్స్ సోమవారం లోక్సభ ముందుకువచ్చిం ది. మిశ్రా నియూమకానికి చట్టపరంగా ఉన్న ఆటంకాలను తొలగించేందుకు వీలు గా కేంద్రం ఈ ఆర్డినెన్సు జారీ చేసింది. ట్రాయ్ (సవరణ) ఆర్డినెన్స్-2014 ప్రతి ని సభ ముందుంచినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సంతోష్ తెలిపారు. -
ఆ పోలీసులకు ఉరే సరి
ఉత్తరాఖండ్లో బూటకపు ఎన్కౌంటర్లో 22 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని కాల్చి చంపిన 17 మంది పోలీసులకు ఉరి శిక్ష విధించాలని సీబీఐ కోరుతోంది. వాళ్లకు విధించే శిక్ష ఈ సమాజం మొత్తానికి ఓ గుణపాఠం కావాలని వాదించింది. దీంతోపాటు బాధితుడి కుటుంబానికి తగిన పరిహారం కూడా ఇవ్వాలని కోరింది. ఈ కేసులో మొత్తం 18 మంది పోలీసులను నిందితులుగా పేర్కొనగా, వారిలో ఏడుగురిపై హత్య, పదిమందిపై నేరపూరిత కుట్ర, కిడ్నాప్ నేరాలు రుజువైనట్లు ఢిల్లీలోని సీబీఐ కోర్టు శుక్రవారం తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. మరొకరిపై కేవలం సాక్ష్యాలను ధ్వంసం చేసిన కేసు మాత్రమే రుజువైంది. ఘజియాబాద్కు చెందిన ఎంబీఏ విద్యార్థి రణ్బీర్ సింగ్ 2009 జూలైలో డెహ్రాడూన్లోని మోహిని రోడ్డులో 29 బుల్లెట్ గాయాలు తగిలి మరణించి కనిపించాడు. అతడు బెదిరింపుల రాకెట్ నడుపుతున్నాడని పోలీసులు ఆరోపించారు. కానీ, అది తప్పని తేలింది. కోర్టు మొత్తం 17 మంది పోలీసులను దోషులుగా తేల్చి, సోమవారం నాడు వారికి శిక్ష విషయం తేలుస్తామని తెలిపింది. దాంతో, దోషులందరికీ ఉరిశిక్ష విధించాల్సిందేనని ఈ సందర్భంగా సీబీఐ న్యాయవాది కోరారు. -
బూటకపు ఎన్కౌంటర్ కేసులో.. 17 మంది పోలీసులకు శిక్ష
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం జరిగిన ఓ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో ఢిల్లీ సీబీఐ కోర్టు 17 మంది పోలీసులను దోషులుగా నిర్ధారించింది. 18 మంది భద్రతా సిబ్బందిపై ఆరోపణలు రాగా ఒకరు మాత్రం కేసు నుంచి బయటపడ్డారు. నిందితులకు సీబీఐ కోర్టు శనివారం శిక్షలను ఖరారు చేసే అవకాశముంది. ఉత్తరాఖండ్లోని డూన్లో 2009లో రణ్బీర్ అనే ఎంబీఏ విద్యార్థిని ఎన్కౌంటర్ పేరుతో పోలీసులు కాల్చిచంపారు. ఎలాంటి నేరం చేయని రణ్బీర్ ను చంపడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ బూటకపు ఎన్కౌంటర్పై బాధితుడి బంధువులు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం 17 మందిపై హత్య, కిడ్నాప్, కుట్ర అభియోగాలు రుజువయ్యాయి. కోర్టు తీర్పు అనంతరం రణ్బీర్ తండ్రి మాట్లాడుతూ.. కోర్టు తీర్పు వల్ల తన కొడుకు తిరిగిరాడని, ఆ నష్టం పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నిందితులను కఠినంగా శిక్షించడం వల్ల ఇలాంటి నేరాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని వ్యాఖ్యానించారు. -
ఈతకు వెళ్లి ఎంబీఏ విద్యార్థి దుర్మరణం
తొగుట, న్యూస్లైన్ : సరదాగా స్నేహితులతో కలిసి చెరువులో ఈతక ని వెళ్లి అందులో మునిగి ఎంబీఏ విద్యార్థు ఒకరు గు రువారం మృతిచెందాడు. ఎస్ఐ జార్జ్ కథనం మేరకు.. మండలంలోని పెద్దమాసాన్పల్లి గ్రామానికి చెందిన పన్యాల ముత్యంరెడ్డి, యాదమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు పన్యాల సంతోష్రెడ్డి ఉన్నాడు. సంతోష్రెడ్డి సిద్దిపేటలోని ఎంల్లకి కళాశాలలో ఎంబీఏ ద్వితీయ ఏడాది చదువుతున్నాడు. అ యితే వేసవి సెలవులు కావడంతో స్వగ్రామానికి వచ్చా డు. ఈ నేపథ్యంలో గురువారం గ్రామానికి చెందిన ఇ ద్దరు స్నేహితులు కరుణాకర్రెడ్డి, సాయికుమార్రెడ్డిల తో కలిసి గ్రామ శివారులో ఉన్న పెద్దచెర్వుకు ఈతకని వెళ్లారు. అయితే వీరికి ఈత రాకపోవడంతో ముగ్గురూ చెరువు గట్టునే ఈత కొడుతున్నారు. ఈ క్రమంలో సంతోష్రెడ్డి ఈత కొడుతూ కొద్ది లోనికి వెళ్లాడు. అ క్కడ జేసీబీ గుంత ఉండడంతో అందులో మునిగిపోయాడు. సంతోష్రెడ్డిని కాపాడేందుకు స్నేహితులు సా హసం చేయలేదు. సమాచారం అందుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని సంతోష్రెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలిం చినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి తండ్రి ముత్యంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామంలో విశాదఛాయలు.. అందరితోనూ కలివిడిగా ఉండే సంతోష్రెడ్డి మృతి చె ందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నా యి. ఒక్కగానొక్క కుమారుడు చేతికి అందివచ్చే క్రమం లో మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, బంధువులు, మృతుని స్నేహితులు చెరువు వద్దకు చేరుకుని కన్నీటి పర్యాంతమయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ రాజాగౌడ్, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు కూచి మహిపాల్రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, పన్యాల ఎల్లారెడ్డి, రాజిరెడ్డి, రాధాకిషన్రెడ్డి, లతో పాటు మరికొందరూ సంఘటనా స్థలానికి చేరుకోని మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. -
ప్రశాంతంగా ఐసెట్
సాక్షి, సిటీబ్యూరో : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్-2014 పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా ముగిసిం ది. గ్రేటర్లో 59 పరీక్ష కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ముందస్తుగా చెప్పినట్లే నిర్దేశిత సమయానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించలేదు. అభ్యర్థులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. రాంగోపాల్పేట్ : సికింద్రాబాద్లోని ఎస్వీఐటీ, వెస్లీ డిగ్రీ కళాశాలల్లో ఈ పరీక్షకు కూడా నిమిషం నిబంధన వి ధించడంతో విద్యార్థులందరూ గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. 89 శాతం మంది హాజరు ఉస్మానియా యూనివర్సిటీ: హైదరాబాద్ రిజియన్లో ఏర్పాటు చేసిన 59 పరీక్షా కేంద్రాలలో 89 శాతం అభ్యర్థులు హాజరైన్నట్లు కోఆర్డినేటర్ ప్రొ.కృష్ణారెడ్డి తెలిపారు. కొన్ని పరీక్షా కేంద్రాలల్లో ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదన్నారు. ఓయూ క్యాంపస్లోని ఆంధ్రమహిళా సభ, బర్కత్పుర అంబేద్కర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను వీసీ ప్రొ.సత్యనారాయణ, రిజిస్ట్రార్ ప్రొ.ప్రతాప్రెడ్డి సందర్శించారు. -
ఐసెట్ ప్రశాంతం
కేయూ క్యాంపస్, న్యూస్లైన్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం నిర్వహించిన ఐసెట్ వరంగల్ రీజియన్లో ప్రశాంతంగా జరిగింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్న నిబంధనతో సరైన సమయానికే ఎక్కు వ శాతం మంది విద్యార్థులకు పరీక్ష కేంద్రాలకు చేరుకోగా, కొందరు మాత్రం ఉరుకులు, పరుగుల మీద కేంద్రాలకు చేరుకోవడం కనిపించింది. అయితే, ఆలస్యంగా వచ్చిన కొందరు విద్యార్థులు కేంద్రాల గేట్లు వేసి ఉండడంతో నిరాశగా వెనుతిరిగారు. జిల్లాకేంద్రం లో ఏర్పాటు చేసిన 16 పరీక్ష కేంద్రాల్లో 8,742 మందికి 8,210మంది అభ్యర్థులు(94శాతం) హాజరయ్యారు. తొలుత రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్రెడ్డి ఐసెట్ ప్రశ్నాపత్రం సెట్ను ఎంపిక చేశారు. కార్యక్రమంలో కేయూ ఇన్చార్జ్ వీసీ, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి డోబ్రియల్, కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాష్ పాల్గొన్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాష్, క్యాంపస్ ప్రిన్సిపాల్ ఎన్.రామస్వామి, ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ జి.భద్రునాయక్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామానుజరావుతో పాటు కె.దామోదర్రావు, యూజీసీ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు తదితరులు పరిశీలించారు. ఐసెట్ రాసిన జెడ్పీటీసీ సభ్యురాలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జఫర్గఢ్ జెడ్పీటీసీగా ఎన్నికైన బానోతు అరుణశ్రీ కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షా కేంద్రంలో ఐసెట్ రాశారు. హన్మకొండలోని భద్రుక కళాశాలలో గత ఏడాది బీకాం పూర్తి చేసిన ఆమెను ‘న్యూస్లైన్’ పలకరించగా, ఎంబీఏ చదవాలన్న లక్ష్యంతోనే ఐసెట్ రాసినట్లు తెలిపారు. -
సజావుగా ఐసెట్
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్లైన్ : రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నిర్వహించిన ఐసెట్-2014 జిల్లాలో సజావుగా ముగిసింది. జిల్లా నుంచి 1551 మంది దరఖాస్తు చేసుకోగా 1370 మంది(88.33 శాతం) హాజరయ్యా రు. శ్రీకాకుళంలోని నాలుగు కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. కొంచెం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల కేంద్రంలో 500 మందికి 439 మంది, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళల ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో 551 మందికి 478 మంది, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో 300 మందికి 274 మంది, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళల పాలిటెక్నిక్ కళాశాలలో 200 మందికి 179 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రత్యేక పరిశీలకురాలు ప్రొఫెసర్ అనిత, జిల్లా ఐసెట్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, పరిశీలకులు డాక్టర్ కూన అచ్యుతరావు, డాక్టర్ సంతోష్ రంగనాథ్లు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. పరీక్ష జరిగిన తీరును పరిశీలించారు. డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు బమ్మిడి పోలీస్, కె.మైథిలి, పాలిటెక్నిక్ల విభాగాధిపతులు మేజర్ కె.శివకుమార్, సత్యనారాయణలు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించారు. -
ప్రశాంతంగా ఐసెట్
88 శాతం విద్యార్థుల హాజరు 13 కేంద్రాలలో పరీక్ష నిర్వహణ ఏయూ వీసీ రాజు పర్యవేక్షణ ఏయూ క్యాంపస్, న్యూస్లైన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు శుక్రవారం నిర్వహించిన ఐసెట్కు విశాఖ రీజియన్ పరిధిలో 88 శాతం మంది హాజరయ్యారు. జిల్లాలో 6045 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, 5330 మంది హాజరైనట్టు ప్రాం తీయ సమన్వయకర్త ఆచార్య ఎ.నరసింహారావు తెలిపారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వర కు నగరంలోని 13 కేంద్రాలలో పరీక్ష నిర్వహించా రు. పరీక్ష సమయానికి గంట ముందుగా విద్యార్థులను కేంద్రంలోనికి అనుమతించారు. పరీక్షలు జరుగుతున్న తీరును వర్సిటీ వీసీ జి.ఎస్.ఎన్.రాజు పరిశీలించారు. ఆయన వెంట ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.సత్యరాజు, విభాగాధిపతి మధుసూదనరావు తదితరులున్నారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలోని న్యూస్ క్లాస్రూమ్ కాంప్లెక్స్, ఏయూ మ హిళా ఇంజినీరింగ్ కళాశాల, ఏయూ కామర్స్ మేనేజ్మెంట్ విభాగం, డాక్టర్ వి.ఎస్.కృష్ణా కళాశాల, బీవీకే కళాశాల, ప్రిజమ్ డిగ్రీ కళాశాల, గాయత్రి విద్యాపరిషత్ డిగ్రీ కళాశాల, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల బ్లాక్ 2 నుంచి 7 వరకు ఏర్పాటు చేసిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్న నిబంధనతో ఉదయం నుంచే పెద్దసంఖ్యలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. -
ఐ సెట్కు 91.7 శాతం హాజరు
- గుంటూరులో 15 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ - 6,895 మంది విద్యార్థులు హాజరు - పరీక్షా కేంద్రాలను సందర్శించిన ప్రొఫెసర్లు గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్లైన్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశ పరీక్ష ‘ఐసెట్-2014’కు జిల్లాలో 91.7 శాతం హాజరు నమోదయింది. శుక్రవారం గుంటూరు నగరంలోని 15 పరీక్షా కేంద్రాల పరిధిలో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసిన 7,519 మంది విద్యార్థులకు గానూ 6,895 మంది హాజరయ్యారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు ముందుగానే ప్రకటించిన దృష్ట్యా విద్యార్థులు సకాలంలోనే చేరుకున్నారు. కాకతీయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్కు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఆచార్యుడు జి.వి.చలం గుంటూరు ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఉప కులపతి ఆచార్య కె.వియ్యన్నారావు, రెక్టార్ వై.పి.రామసుబ్బయ్య గోరంట్ల సెయింట్ ఆన్స్ కళాశాల, లాం చలపతి ఫార్మశీ కళాశాల సహా పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు. ఎస్వీ, ఆంధ్ర, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి జిల్లాకు ప్రత్యేక పరిశీలకులుగా వచ్చిన ప్రొఫెసర్లు ఎం.సురేష్బాబు, జాలాది రవి, ఎ.శ్రీనివాసరావు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. -
కొనసాగుతున్న ఐసెట్ పరీక్ష
హైదరాబాద్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు ఐసెట్ ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జరిగే ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,42,464 మంది అభ్యర్థులు హాజరు అవుతున్నారు. ఇందుకోసం అధికారులు 263 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా ఐసెట్ పరీక్షకు సెట్- బి ప్రశ్నాపత్రంను అధికారులు శుక్రవారం ఉదయం ఎంపిక చేశారు. ఈనెల 26న ఐసెట్ కీ విడుదల చేస్తారు. జూన్ 9వ తేదీన ఐసెట్ ఫలితాలు వెలువడతాయి. -
నేడు ఐసెట్-14
-
నేడు ఐసెట్-14
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ హన్మకొండ, న్యూస్లైన్: రాష్ట్రవ్యాప్తంగా ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శుక్రవారం నిర్వహించనున్న ఐసెట్ -2014 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ తెలిపారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదన్నారు. 1,42,464 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని, ఈ మేరకు 263 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పకడ్బందీగా పరీక్ష నిర్వహించేందుకు అబ్జర్వర్లను కూడా నియమించినట్లు వెల్లడించారు. బ్లూ లేదా బ్లాక్ పాయింట్పెన్నే వినియోగించుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఉదయం 6 గంటలకు కాకతీయ యూనివర్సిటీలో ఐసెట్కు సంబంధించిన రెండు సెట్ల బాక్స్లలో ఒక సెట్ను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. -
రేపు ఐసెట్-2014
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు హన్మకొండ, న్యూస్లైన్: రాష్ట్రవ్యాప్తంగా ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఐసెట్ -2014ను ఈ నెల 23న నిర్వహించనున్నామని, అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐసెట్ కన్వీనర్, కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ బుధవారం వెల్లడించారు. ఐసెట్కు 1,42,464 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు. అభ్యర్థులు హాల్టికెట్లను www.apicet.org.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్ష శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అభ్యర్థులు గంట ముందు పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాలని, నిర్ణీత సమయూనికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్నే వినియోగించాలని ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్స్, పేజర్లు, క్యాలికులేటర్లు, ఇయర్ఫోన్స్ లాంటివి తీసుకురావద్దన్నారు. -
పవన్ సభకు ‘ఫ్యాక్టరీ’ మహిళలు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్ : ఒంగోలులో ఆదివారం సాయంత్రం జరిగిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు సింగరాయకొండలోని మాగుంటకు చెందిన ఫ్యాక్టరీ మహిళలను తరలించారు. మహిళల మద్దతు ఉందని చూపించేందుకు టీడీపీ నాయకులు పడరానిపాట్లు పడ్డారు. టీడీపీ తరఫున ఒంగోలు పార్లమెంటు నియోజకర్గం నుంచి పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులరెడ్డికి సింగరాయకొండలో ఫ్యాక్టరీ ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అందులో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ప్రత్యేక వాహనంలో ఒంగోలు తరలించారు. పవన్కళ్యాణ్ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ కార్యకర్తలను ఒంగోలు తరలించారు. నగదు, మందు, పెట్రోల్ పవన్కళ్యాణ్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ నాయకులు ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఒంగోలులోని నెల్లూరు బస్టాండుకు సమీపాన ఉన్న పెట్రోల్ బంకులో మోటార్సైకిళ్లకు ఉచితంగా పెట్రోల్ కొట్టించారు. మోటారుసైకిళ్లకు జనసేన, తెలుగుదేశం పార్టీల జెండాలు కట్టి నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో హడావిడి చేయించారు. మైక్ మొరాయింపుతో అసహనం ఏబీఎం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మైక్లు మొరాయించడంతో పవన్కళ్యాణ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆయన ప్రసంగించడం మొదలు పెట్టగానే మైక్లు సరిగా లేకపోవడంతో ఒకటికి రెండుసార్లు వాటిని మార్చారు. అయినప్పటికీ అవి అలాగే ఉండటంతో ఒకానొక దశలో పవన్కళ్యాణ్ తనకు సమీపంలో వేదికపై ఉన్న స్పీకర్లను అటూఇటూ స్వయంగా కదిలించారు. ఒంగోలుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నల్లజెండాలతో నిరసన పవన్కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో అదే సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నల్ల జెండాలతో నిరసన తెలిపారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డిపై పవన్కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసించారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని వారిని అక్కడ నుంచి బయటకు పంపించేశారు. టీడీపీకి ఝలక్.. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్కళ్యాణ్ ఝలక్ ఇచ్చారు. ఆ పార్టీ తరఫున ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులరెడ్డిని జనసేన పార్టీ వ్యక్తని సభాముఖంగా వ్యాఖ్యానించారు. అంతలోనే ఆయన నాలుక్కరుచుకుని సరదాగా అన్నాను.. తెలుగుదేశం క్యాడర్ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొనడం విశేషం. సభా వేదిక నుంచి పవన్కళ్యాణ్ దిగే సమయంలో పట్టుతప్పి కిందపడబోయారు. నేటితో ప్రచారం సమాప్తం ఒంగోలు, న్యూస్లైన్ : రెండు నెలలుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ కొన్నిరోజుల్లో తుది ఘట్టానికి చేరుకోబోతోంది. అందులో భాగంగా సోమవారం సాయంత్రం 6 గంటలతో ప్రచార పర్వానికి తెరపడనుంది. రెండు నెలలకుపైగా విస్తృత ప్రచారం వరుస ఎన్నికలు వైఎస్సార్సీపీకి బాగా కలిసి వచ్చాయి. మార్చి 3వ తేదీ ఎన్నికల కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చిన సంగతి విదితమే. వెనువెంటనే సాధారణ ఎన్నికల షెడ్యూలు, మరో వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూలు కూడా రిలీజైంది. దీంతో పూర్తిస్థాయిలో ఎన్నికలకు సన్నద్ధమైన వైఎస్సార్సీపీ అభ్యర్థులు రణరంగంలోకి దిగారు. పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ చేసిన బాలినేని ప్రచారం కూడా వైఎస్సార్సీపీ జిల్లాలో బలపడడానికి కారణంగా నిలిచింది. వీటన్నింటికి తోడు వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని అంశాలు పార్టీపై ప్రజలకు విశ్వాసాన్ని కలిగించడానికి కారణంగా నిలిచాయి. మద్యం, డబ్బు పంపిణీపై ఆధారపడిన టీడీపీ జిల్లాలో వైఎస్సార్సీపీ గాలి బలంగా వీస్తుండడంతో టీడీపీ అభ్యర్థులు డబ్బు, మద్యాన్ని నమ్ముకుని ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఓటును రూ.500 నుంచి రూ.3,500 మధ్య కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నట్లు సమాచారం. కనిపించని విశ్వాసం జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ జనంలోకి వస్తున్నా ఆదరణ మాత్రం కనిపించడంలేదు. ఆదివారం ఏబీఎం కాంపౌండ్లో జరిగిన బహిరంగ సభను పరిశీలిస్తే పరిస్థితి అర్థం అవుతుంది. చంద్రబాబు గుట్టు లోకానికి ఎరుకైనా.. అబ్బే ఆయనకు మచ్చే లేదంటూ పవన్కళ్యాణ్ నమ్మించే యత్నం చేయడంతో ఆయనకు ఉన్న ఇమేజ్ కూడా ఒక్కసారిగా పడిపోయిందని మేథావులు విశ్లేషిస్తున్నారు. -
ఐసెట్కు 1,44,436 దరఖాస్తులు
500 రుసుముతో నేటి వరకు గడువు హన్మకొండ, న్యూస్లైన్: రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఈ విద్యాసంవత్సరంలో (2014-2015)ఐసెట్ -2014కు ఇప్పటివరకు 1,44,436 దరఖాస్తులు వచ్చాయని ఐసెట్ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ సోమవారం తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు మంగళవారంతో ముగియనుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఇంకా దరఖాస్తులను అప్లోడు చేయని విద్యార్థులు రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 15వరకు అప్లోడుచేసుకోవాలన్నారు. రూ.2,000 అపరాధ రుసుముతో ఈ నెల 25వరకు, రూ.5,000 అపరాధ రుసుముతో మే 6వ తేదీవరకు, రూ 10 వేల అపరాధ రుసుముతో మే19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓంప్రకాష్ తెలిపారు. -
బీటెక్ టు గేట్.. వయా ఎంబీఏ
సక్సెస్ స్టోరీ గేట్ ఈసీఈ 4వ ర్యాంకర్ ఎంసెట్.. ఏఐట్రిపుల్ఈ.. ఐఐటీ.. బిట్శాట్.. ఇలా అన్ని ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు. అటు అకడమిక్గా పాఠశాల స్థాయి నుంచి కాలేజీ వరకు మంచి పర్సంటేజీలు. ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో బీటెక్ పూర్తి చేసి.. తర్వాత ఎంబీఏ చదివి.. మళ్లీ తనకిష్టమైన ఇంజనీరింగ్లో పీజీ కోసం దృష్టి సారించి.. అందుకు మార్గంగా గేట్ను ఎంచుకుని.. జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకుతో నిలిచారు కె.కె.శ్రీనివాస్.. నాన్నవృత్తి రీత్యా బరోడా నుంచి హైదరాబాద్ వచ్చాం. ఏడో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు హైదరాబాద్లోనే చదివాను. అన్ని తరగతుల్లోనూ 90 శాతానికి పైగా మార్కులు వచ్చాయి. సబ్జెక్ట్లను ఇష్టంగా చదవడం వల్లే ఈ ఫలితాలు లభించాయి. అందుకే ఇంటర్మీడియెట్ తర్వాత రాసిన నాలుగు ఎంట్రన్స్లలోనూ (ఎంసెట్, ఏఐఈఈఈ, ఐఐటీ-జేఈఈ, బిట్శాట్) మంచి ర్యాంకులు సొంతమయ్యాయి. అన్నిటికంటే బిట్స్ పిలానీ అంటే ఆసక్తి ఉండటంతో అక్కడ బీటెక్లో చేరాను. ఇంజనీరింగ్పై మక్కువ తగ్గలేదు: 2011లో బిట్స్ పిలానీలో బీటెక్ పూర్తిచేసిన వెంటనే ముంబైలోని కె.జె.సోమయ ఇన్స్టిట్యూట్లో ఎంబీఏలో చేరాను. ఫైనాన్స్ స్పెషలైజేషన్తో కోర్సు పూర్తి చేశాను. వాస్తవానికి మేనేజీరియల్ స్కిల్స్ పెంచుకోవాలని ఎంబీఏలో చేరా. కానీ, ఇష్టమైన ఇంజనీరింగ్ను వదులుకోలేకపోయా. అందుకే ఎంబీఏ పూర్తి చేశాక మళ్లీ ఇంజనీరింగ్లో ఉన్నత విద్య ఎంటెక్ కోసం గేట్ను లక్ష్యంగా ఎంచుకున్నాను. 2013 నుంచి ఏడాదిపాటు హైదరాబాద్లో పూర్తిస్థాయి కోచింగ్ తీసుకున్నాను. దీనివల్ల జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకు వచ్చింది. రెండేళ్ల విరామం: బీటెక్ తర్వాత ఎంబీఏలో చేరడంతో రెండేళ్ల విరామం వచ్చింది. అయినా బీటెక్లోని అన్ని అంశాలను సమగ్రంగా చదివి ఉండటంతో గేట్ ప్రిపరేషన్కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. నా ఉద్దేశంలో బీటెక్ చదివేటప్పుడే అన్ని సబ్జెక్టులను ఔపోసన పడితే గేట్ గురించి ఆందోళన చెందక్కర్లేదు. ప్రతి సబ్జెక్ట్కు సొంత ఫార్ములా: గేట్ ప్రిపరేషన్ పరంగా పకడ్బందీ కసరత్తు చేశాను. ప్రతి సబ్జెక్ట్లోని ముఖ్యమైన, క్లిష్టంగా భావించిన అన్ని ఫార్ములాలు, కాన్సెప్ట్లతో చిన్నపాటి నోట్స్లు రూపొందించుకున్నాను. పునశ్చరణకు ఇవి ఎంతో ఉపకరించాయి. అంతేకాకుండా ఆన్లైన్ మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లకు హాజరవడం కూడా లాభించింది. ఆ మూడు ఇన్స్టిట్యూట్లలో సీటే లక్ష్యం: గేట్ ప్రస్తుత ర్యాంకుతో ఐఐఎస్సీ బెంగళూరు లేదా ఐఐటీ ఖరగ్పూర్లో ఆర్ఎఫ్ అండ్ మైక్రోవేవ్ స్పెషలైజేషన్లో ఎంటెక్ సీటు పొందాలని భావిస్తున్నాను. ఐఐటీల్లో ప్రసిద్ధ క్యాంపస్గా గుర్తింపు పొందిన ఐఐటీ-బాంబేలో నా బ్రాంచ్కు సరిపడే ఏ స్పెషలైజేషన్లో సీటు వచ్చినా చేరతాను. ఎంటెక్ పూర్తి చేశాక మంచి కెరీర్లో అడుగుపెట్టి.. తద్వారా సమాజానికి సాధ్యమైనంత సేవ చేయడమే లక్ష్యం. ఔత్సాహికులకు సలహా: బీటెక్ మూడో సంవత్సరం నుంచే గేట్ కోసం కసరత్తు ప్రారంభించడం వల్ల సత్ఫలితాలు ఆశించొచ్చు. పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్ని సబ్జెక్ట్లకు ఆన్లైన్ మాక్టెస్ట్లకు హాజరవడం మంచిది. మాక్టెస్టుల వల్ల పరీక్ష అంటే భయం పోతుంది. సబ్జెక్ట్ల వారీగా కనీసం రెండు గ్రాండ్ టెస్ట్లకు హాజరవడం మంచిది. పరీక్షకు కనీసం పదిహేను రోజుల ముందునుంచి రివిజన్కు ప్రాధాన్యం ఇవ్వాలి. బీటెక్ సబ్జెక్టుల్లో పూర్తిస్థాయిలో కాన్సెప్టుల వారీగా పరిజ్ఞానం సంపాదిస్తే గేట్లో అత్యుత్తమ ర్యాంకు సాధించవచ్చు. సిలబస్లోని అన్ని అంశాలపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. అకడమిక్గా బీటెక్ స్థాయిలో చదివిన అంశాలను అప్లికేషన్ కోణంలో ప్రాక్టీస్ చేయాలి. ఉన్నత విద్యావకాశాలకు వీలు కల్పించే గేట్కు ఏటా పోటీ తీవ్రమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని స్వీయ ప్రణాళికలు రూపొందించుకొని పరీక్షకు సిద్ధమవాలి. అకడమిక్ నేపథ్యం: పదో తరగతి: 93 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్మీడియెట్: 98.1 శాతం మార్కులు. ఎంసెట్లో 131వ ర్యాంకు; ఏఐఈఈఈలో 795వ ర్యాంకు; బిట్శాట్లో 317వ ర్యాంకు; ఐఐటీ-జేఈఈలో 3210వ ర్యాంకు. 2011లో బిట్స్ పిలానీ నుంచి 9.42 సీజీపీఏతో బీటెక్ (ఈసీఈ) ఉత్తీర్ణత. 2013లో 72 శాతంతో ఎంబీఏ ఉత్తీర్ణత. -
విశాఖలో విద్యార్థులను మోసం చేసిన AIM సంస్థ
-
ఎంబీఏలో వినూత్న స్పెషలైజేషన్లు ఎన్నో..
ప్రపంచంలోనే తొలిసారిగా 1908లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎంబీఏ కోర్సును ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి మారుతున్న వ్యాపార, వాణిజ్య రంగాలు.. కార్పొరేట్ కంపెనీల అవసరాలకు తగ్గట్లు మేనేజ్మెంట్ విద్య ఎన్నో మార్పుచేర్పులకు లోనైంది. గతంలో ఎంబీఏలో మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్ వంటి సంప్రదాయ స్పెషలైజేషన్లకే పెద్దపీట ఉండేది. ఇప్పుడు ప్రపంచీకరణతోపాటే దేశ పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తోంది. దాంతో కార్పొరేట్ ప్రపంచానికి విభిన్నమైన నైపుణ్యాలున్న మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో జాబ్మార్కెట్కు అనుగుణంగా ఎంబీఏలో సరికొత్త స్పెషలైజేషన్లు తెరపైకి వచ్చాయి. ఆయా విశ్వవిద్యాలయాలు, బీస్కూల్స్లో ఎంబీఏలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న విభిన్న అప్కమింగ్ స్పెషలైజేషన్లపై ప్రత్యేక ఫోకస్.. 1-రూరల్ అండ్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ 2-పెట్రోలియం మేనేజ్మెంట్ 3-పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్ 4-ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ 5- టెలికం మేనేజ్మెంట్ 6-హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ 7-ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్ రూరల్ అండ్ అగ్రికల్చరల్ గ్రామీణాభివృద్ధి.. దేశ ప్రగతికి ప్రథమ సోపానం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు అత్యధికంగా ఉన్న మన దేశంలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగ ప్రగతి ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకం. అందుకే ఈ రంగాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపుల పరంగా ప్రతి ఏటా సుమారు రూ. లక్ష కోట్ల కేటాయింపులు చేస్తూ.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఎన్ఎల్ఆర్ఎం, ఎన్హెచ్ఆర్ఎం వంటి పలు పథకాలను అమలు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ పథకాలు సమర్థంగా అమలు కావాలంటే.. అందుకు అవసరమైన ఆర్థిక నిర్వహణ నైపుణ్యాల ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ నైపుణ్యాలను అందించే కోర్సు.. రూరల్ అండ్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్! ఈ కోర్సును అభ్యసించిన విద్యార్థులకు రూరల్ డెవలప్మెంట్ మార్కెటింగ్, మేనేజీరియల్ ఎకనామిక్స్, మేనేజీరియల్ అకౌంటింగ్, రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధిలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనువర్తనాలు తదితర అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. ఇక.. అవకాశాల పరంగా చూస్తే.. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి కేటాయింపులు, పథకాల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. దాంతో గ్రామీణాభివృద్ధి రంగంలో సుశిక్షితులైన వందల మంది మానవ వనరుల డిమాండ్ నెలకొనడం ఖాయం. మన దేశంలో ఈ కోర్సును అందిస్తున్న కళాశాలల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ కోర్సుల గురించి విద్యార్థులకు పూర్తి అవగాహన, సమాచారం కూడా అందుబాటులో లేదు. అయితే విద్యార్థులు ఈ కోర్సును చక్కటి ఉపాధికి వేదికగా భావించి ఎంచుకోవాలి. రూరల్ అండ్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ విద్యార్థులు.. ప్రభుత్వ రంగంలో ప్రణాళిక సంఘం, ఆయా పథకాల నిర్వహణ విభాగాలు, వ్యవసాయం తదితర విభాగాలు.. ప్రైవేటు రంగంలో స్వచ్ఛంద సంస్థలు మొదలైనవాటిలో ఉద్యోగావకాశాలు పొందొచ్చు. అంతేకాకుండా ఇటీవల కాలంలో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) పేరిట కార్పొరేట్ సంస్థలు కూడా పలు సామాజిక అభివృద్ధి కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న నేపథ్యంలో ఎంఎన్సీ సంస్థల్లోనూ అవకాశాలు లభిస్తాయి. ఈ కోర్సులో చేరే విద్యార్థులకు వివిధ సంస్కృతుల ప్రజలతో కలిసిపోయే తత్వం.. గ్రామీణ ప్రాంతాలపై సహజమైన ఆసక్తి, అంకిత భావం.. కెరీర్ ప్రారంభంలోనే భారీ మొత్తాలతో వేతనాలు ఆశించకుండా పనిచేయగల సంసిద్ధత వంటి ప్రత్యేక లక్షణాలు ఉండాలి. డా॥ఎస్.ఎం. ఇలియాస్ డెరైక్టర్, సెంటర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ఎన్ఐఆర్డీ, హైదరాబాద్ పెట్రోలియం మేనేజ్మెంట్ పెట్రోల్.. పెట్రోలియం అంటే.. పెట్రోల్ నిక్షేపాల వెలికితీత, పెట్రోల్ వినియోగం.. ఇవే సాధారణంగా మనందరికీ తెలిసిన విషయాలు! కానీ, క్షేత్రస్థాయిలో పెట్రోలియం నిక్షేపాలను కనుగొనడానికి, వెలికితీయడానికి ఎంతటి సాంకేతిక సామర్థ్యం అవసరమో.. అంతే స్థాయిలో నిర్వహణ నైపుణ్యాలూ ఉండాలి. ఎక్స్ప్లొరేషన్, ఉత్పత్తి, రిఫైనింగ్, డిస్ట్రిబ్యూషన్.. ఇలా క్షేత్ర స్థాయి నుంచి వినియోగదారులకు చేరే వరకూ ప్రతి దశలోనూ నిపుణుల అవసరం ఎంతో ఉంటుంది. ఈ నైపుణ్యాలను అందించే కోర్సే.. పెట్రోలియం మేనేజ్మెంట్. ఇప్పటికే అన్ని దేశాలు సహజ, పునరుత్పాదక ఇంధన వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. పెట్రోలియం వనరుల అన్వేషణ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ముఖ్యంగా షెల్ గ్యాస్, ఆయిల్ ఎక్స్ప్లొరేషన్, క్రూడ్ నాణ్యత నిర్ధారణ వంటి అంశాల్లో సాంకేతికపరమైన అవసరాలతోపాటు నిర్వహణ నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల డిమాండ్ పెరగనుంది. ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న వారికి మరింత కలిసొచ్చే కోర్సుగా పెట్రోలియం మేనేజ్మెంట్ను పేర్కొనొచ్చు. దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించే కీలక ఇంధనాలు.. చమురు, సహజ వాయువు. ఎంబీఏ పెట్రోలియం పూర్తయ్యాక.. చమురు, గ్యాస్ కంపెనీల్లో ఫైనాన్స్, ఆపరేషన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, పెట్రోలియం ఎకనామిక్స్ తదితర రంగాల్లో స్థిరపడొచ్చు. కన్సల్టింగ్ ఏజెన్సీల్లోనూ పనిచేయొచ్చు. ఈ కోర్సులో చేరే విద్యార్థులకు సాంకేతిక దృక్పథం, న్యూమరికల్ స్కిల్స్, ‘థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అప్రోచ్’ ఎంతో అవసరం. అంతేకాకుండా ‘డూ ఇట్’ అనే వైఖరి ఉంటే తక్కువ సమయంలోనే కెరీర్ పరంగా ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయిదారు ఇన్స్టిట్యూట్లు మాత్రమే ఈ కోర్సును అందిస్తున్నప్పటికీ.. మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా వీటి సంఖ్య కూడా సమీప భవిష్యత్తులోనే పెరగడం ఖాయం. ఈ కోర్సులో చేరాలనుకునేవారికి విస్తృత ఆలోచన పరిధి.. కష్టపడి పనిచేసే స్వభావం.. ఒత్తిడిని తట్టుకునే నైపుణ్యం.. నిరంతరం నేర్చుకునే తత్వం.. అంతర్జాతీయ విపణిపై నిరంతర అవగాహన ఎంతో అవసరం. ప్రొ॥హేమంత్ సి. త్రివేది డెరైక్టర్, స్కూల్ ఆఫ్ పెట్రోలియం మేనేజ్మెంట్, పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్ ఆవశ్యకత ఎంతో ఉంది. దేశంలో ఎన్నో పథకాలు అమల్లో ఉన్నాయి. కానీ వాటి అమలులో మరెన్నో లోపాలు. వీటిని సరిదిద్దుతూ అసలైన లబ్ధిదారులకు వాటిని చేర్చే విధంగా నైపుణ్యాలను అందించే కోర్సు.. పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కొన్ని దశాబ్దాల పాటు పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్ కేవలం సివిల్ సర్వెంట్లకు, ఇతర ప్రభుత్వ అధికారులకు మాత్రమే పరిమితమైంది. తర్వాత మారుతున్న కాలంతోపాటు ప్రభు త్వ ఆలోచనా దృక్పథంలోనూ మార్పు వచ్చింది. దీనికి అనుగుణంగా.. ప్రభుత్వం తాను చేపడుతున్న పథకాలపై విశ్లేషణ, సలహాలు, సూచనల కోసం కేవలం సివిల్ సర్వెంట్లే కాకుండా.. సమాజంలో నిపుణులు, మేధావుల సహకారం తీసుకుంటోంది. ఈ క్రమంలో.. ఇటీవల కాలంలో ప్రభుత్వ విధానాలు, వాటికి సంబంధించి పర్యవసానాలు, లాభనష్టాలు, పథకాల ఫలాలు ప్రజలకు సక్రమంగా చేరేందుకు గల మార్గాలు వంటి వాటిపై శిక్షణనిచ్చేందుకు తెరపైకి వచ్చిన కోర్సు.. పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్. పబ్లిక్ పాలసీ అనేది నిర్దేశిత లక్ష్యాల సాధనకు సంబంధించి సంస్థాగత నిర్ణయాలు, నిర్వహణ, ఆర్థిక, పరిపాలన విధానాల రూపకల్పన వంటి విషయాల్లో నైపుణ్యం అందిస్తుంది. ముఖ్యంగా విధాన సమస్యల సమీక్ష, డేటా అనాలిసిస్, సాధారణ ప్రజానీకానికి ఎదురవుతున్న సమస్యల పరిష్కార మార్గాలపై నిర్వహణ పరమైన నైపుణ్యాలను పూర్తి స్థాయిలో అందించేలా ఉంటుంది. కోర్సు పూర్తిచేసిన వారు అవకాశాల గురించి ఆందోళన చెందనక్కర్లేదు. ప్రస్తుతం పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్న ఈ కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులకు పరిశోధనా సంస్థల్లో అనలిస్ట్లు, ప్రభుత్వ శాఖల్లో.. అదే విధంగా స్వచ్ఛంద సంస్థల్లో సలహాదారులు లేదా మేనేజర్లుగా అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కాన్సెప్ట్ పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రైవేట్ సంస్థల్లో కూడా అవకాశాలు లభిస్తున్నాయి. కోర్సును ఎంచుకోవాలనుకునేవారికి ప్రజా సంక్షేమం పట్ల ఆసక్తి, అవగాహన ఉండాలి. ఇక.. అకడమిక్ పరంగా డేటా అనాలిసిస్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అవసరం. ప్రొ॥ఆర్. సుదర్శన్ డీన్, జిందాల్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ పాలసీ, ఒ.పి. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ- హర్యానా ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ దేశంలో ఇన్సూరెన్స్ రంగం శరవేగంగా వృద్ధి చెందుతున్న తరుణమిది. భారత్లో బీమా రంగంలో ప్రభుత్వంతోపాటు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు సైతం ప్రవేశించాయి. మరోవైపు బీమాపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో ఈ రంగం వేగంగా విస్తరిస్తోంది. దాంతో ఇన్సూరెన్స్ డొమైన్ ఏరియాలో.. వైవిధ్యమైన పోర్ట్ఫోలియోలు, వినియోగదారుల సేవాపరమైన అంశాలు, నిర్వహణ విభాగాల్లో సమర్థవంతమైన నిర్వహణ అత్యవసరంగా మారింది. అందుకు అనుగుణంగా బీమా రంగానికి అవసరమైన నిపుణులను తీర్చిదిద్దే కోర్సు.. ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్! ఈ కోర్సులో భాగంగా.. జీవితబీమా సంబంధ వ్యవహారాల నిర్వహణతోపాటు జనరల్ ఇన్సూరెన్స్ కార్యకలాపాలు (ఉదా: మెరైన్ కార్గో ఇన్సూరెన్స్, హెల్త్ అండ్ పర్సనల్ ఇన్సూరెన్స్, మిస్లేనియస్ ఇన్సూరెన్స్, లయబిలిటీ ఇన్సూరెన్స్) బోధిస్తారు. అంతేకాకుండా రిస్క్ మేనేజ్మెంట్, యాక్చుయేరిల్ సైన్స్ వంటి సాంకేతిక అంశాలపైనా శిక్షణ ఉంటుంది. ఫలితంగా.. కోర్సు పూర్తయ్యే సమయానికి ఒక విద్యార్థి బీమా రంగ కార్యకలాపాలకు సంబంధించి అన్ని విభాగాల్లో పరిపూర్ణత సాధిస్తాడు. ఎంబీఏ ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్ను అభ్యసిస్తే బీమా సంస్థల్లో ఉద్యోగం దక్కించుకోవచ్చు. ఆసక్తిని బట్టి బీమా సలహాదారుగా పనిచేయొచ్చు. భవిష్యత్తులో మరిన్ని బీమా సంస్థలు ప్రవేశించే అవకాశముంది. కాబట్టి సమర్థులైన మానవ వనరుల అవసరం మరింత పెరగనుంది. అయితే, ఔత్సాహిక అభ్యర్థులకు ఇన్సూరెన్స్ రంగంతోపాటు.. ఈ రంగాన్ని ప్రభావితం చేసే దేశ ఆర్థిక పరిస్థితులపై నిరంతర అవగాహన ఉండాలి. దీంతోపాటు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, బృందంలో పనిచేసే లక్షణాలు ఉంటే మరింతగా రాణించగలరు. ప్రొ॥డి. విజయ లక్ష్మి చైర్ ప్రొఫెసర్, నేషనల్ ఇన్సూరెన్స్ అకాడెమీ- పుణె టెలికం మేనేజ్మెంట్ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం టెలికం. ప్రపంచంలోని అతిపెద్ద రంగాల్లో భారత టెలికం రంగం కూడా ఒకటి. ఆర్థిక సంస్కరణల తర్వాత టెలికం రంగంలో ప్రైవేట్ రంగానికి అనుమతినిచ్చారు. అదేసమయంలో టెలికం సేవల వినియోగం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అంతకంతకూ పెరుగుతోంది. ఒకవైపు ప్రైవేట్ రంగం విస్తరణ.. మరోవైపు సేవలకు డిమాండ్ వెరసి.. ఈ రంగంలో భారీగా నిపుణుల అవసరం ఏర్పడింది. టెలికం రంగం నిర్వహణకు సుశిక్షితులైన నిపుణులను తీర్చిదిద్దే కోర్సు.. టెలికం మేనేజ్మెంట్! అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ఈ కోర్సు ఆవశ్యకత ఎంతో ఉంది. కోర్సులో భాగంగా.. మార్కెటింగ్, మేనేజీరియల్ ఎకనామిక్స్, బిజినెస్ కమ్యూనికేషన్ వంటి రెగ్యులర్ ఎంబీఏ సబ్జెక్టులతోపాటు టెలికం విభాగానికి సంబంధించి.. టెలికం సర్వీసెస్ టెక్నాలజీస్, వైర్లెస్ కమ్యూనికేషన్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, టెలికం సర్వీసెస్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఐటీ సెక్యూరిటీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, కన్వర్జెన్స్ ఆఫ్ టెలికం నెట్వర్క్, సర్వీసెస్ అండ్ టెక్నాలజీ ట్రెండ్స్ ఇన్ టెలికం, కేస్ స్టడీస్ ఇన్ టెలికం మేనేజ్మెంట్ వంటి కోర్ సబ్జెక్ట్లలో శిక్షణ ఉంటుంది. ఇక.. ఈ రంగం భవిష్యత్ కోణంలో విశ్లేషిస్తే.. రోజుకో సరికొత్త టెక్నాలజీ.. కొత్త సంస్థల ప్రవేశంతో సేవల రంగంలో ఒకటైన కమ్యూనికేషన్కు సంబంధించి టెలికం విభాగం వేగంగా పురోగమిస్తోంది. ఈ నేపథ్యంలో.. సమీప భవిష్యత్తులో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. బ్యాచిలర్ స్థాయిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నేపథ్యం ఉన్న విద్యార్థులకు కెరీర్ ఉన్నతి పరంగా టెలికం మేనేజ్మెంట్ మరింత కలిసొచ్చే కోర్సు. ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు కష్టించేతత్వం, నిరంతరం ఆవిష్కృతమవుతున్న కొత్త టెక్నాలజీలపై అవగాహన పెంచుకునే దృక్పథం అవసరం. ప్రొ॥సునీల్ పాటిల్ డెరైక్టర్, సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలికం మేనేజ్మెంట్- పుణే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ దేశంలో హెల్త్కేర్ రంగం సగటున 15.5 శాతం చొప్పున వృద్ధి నమోదు చేసుకుంటూ శరవేగంగా పయనిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఆధునిక హంగులతో హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ సెంటర్స్ భారీగా ఏర్పాటవుతున్నాయి. అంతేకాకుండా హెల్త్కేర్ సంబంధిత హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ తదితర విభాగాలు కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. ఫలితంగా క్లినికల్ నిపుణులతోపాటు ఆస్పత్రుల నిర్వహణ, రోగులకు సేవలందించే విషయంలో నిర్వహణా నిపుణుల ఆవశ్యకత ఏర్పడుతోంది. వైద్యులు.. రోగులకు చికిత్సపరంగా సేవలందిస్తే.. సదరు ఆస్పత్రి పరిపాలన వ్యవహారాలు, రోగులకు సేవలందించేందుకు పలు విభాగాలను సమన్వయం చేయడం వంటి విధులను హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు నిర్వర్తిస్తారు. ఈ క్రమంలో ఆదాయ-వ్యయాల విషయంలో అటు సంస్థకు, ఇటు రోగులకు అనుకూలమైన విధానాలు రూపొందించడం.. నిర్ణయాలు తీసుకోవడం వంటి నైపుణ్యాలు ఎంతో అవసరం. అటువంటి స్కిల్స్ను అందించే కోర్సు.. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్! ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడం, అదే విధంగా ప్రభుత్వం మెడికల్ టూరిజం కాన్సెప్ట్ను విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో ఈ రంగంలో భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని భావించొచ్చు! కేవలం హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్గానే కాకుండా.. హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు, హెల్త్ ఎన్జీఓలు, ఫార్మాస్యూటికల్ సంస్థలు, క్లినికల్ రీసెర్చ్ సంస్థల్లోనూ అవకాశాలు లభిస్తాయి. ఈ రంగంలో ప్రవేశించాలనుకునే అభ్యర్థులకు అకడమిక్ నేపథ్యంతోపాటు వైద్యులతో సమానంగా ప్రజలకు సేవలందిస్తున్నామనే ఆత్మ సంతృప్తి, సేవా దృక్పథం, పలు సంస్కృతుల ప్రజలతో మమేకం కావడం, కష్టపడి పనిచేసే తత్వం వంటి లక్షణాలు ఉంటే కెరీర్ మరింత ఉజ్వలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య రంగం అనేది ఆర్థిక మాంద్యం సెగ తగలని విభాగం కాబట్టి.. కెరీర్ పరంగా దీన్ని ఎవర్గ్రీన్గా పేర్కొనొచ్చు. డా॥ధీరేంద్ర కుమార్ డెరైక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్, బెంగళూరు. ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్ భారత ఆర్థిక వ్యవస్థకు కుటుంబ వ్యాపారాలే వెన్నెముకలు. దేశంలోని మొత్తం వ్యాపారాల్లో 90 శాతం సంస్థలు, పరిశ్రమలు కుటుంబాల నిర్వహణ పరిధిలోనివే. ఈ సంస్థలపైన మరెన్నో అనుబంధ వ్యాపారాలు ఆధారపడి ఉన్నాయి (ఉదా: వెండర్స్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్ట్ సంస్థలు తదితర). ఎన్ని బహుళ జాతి సంస్థలు దేశంలో అడుగుపెట్టినా భవిష్యత్తులోనూ దేశ ప్రగతి విషయంలో ఫ్యామిలీ బిజినెస్ కీలక పాత్ర పోషించనుంది. ఇంతలా ప్రాధాన్యం సంతరించుకున్న ఫ్యామిలీ బిజినెస్కు సంబంధించి.. సదరు యజమాని లేదా వారసుల్లో వ్యాపార వృత్తి నిర్వహణ నైపుణ్యాలు లేకపోవడం.. నిర్వహణ లోపం వంటివి సమస్యగా మారుతోంది. ఇలాంటి నైపుణ్యాలను అందించే కోర్సే.. ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్. గతంలో సాధారణంగా ఈ తరహా కోర్సులను ఆయా సంస్థల యాజమాన్యాల వారసులే అభ్యసించేవారు. కానీ పరిస్థితులు మారుతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో.. ఒక కుటుంబ అధీనంలోని వ్యాపార సంస్థల నిర్వహణ దిశగా ఆయా యాజమాన్యాలు తమకు సహకరించేందుకు ఫ్యామిలీ బిజినెస్లో నిష్ణాతులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. కోర్సులో భాగంగా సాధారణ ఎంబీఏ సబ్జెక్ట్లతోపాటు ఫ్యామిలీ బిజినెస్కు సంబంధించి కొన్ని ప్రత్యేక అంశాలలో(స్ట్రాటజీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ బిజినెస్, ఎంటర్ప్రెన్యూరియల్ బయోగ్రాఫిక్స్, ఎంటర్ప్రెన్యూర్ మేనేజ్మెంట్) శిక్షణ ఉంటుంది. కోర్సు ఔత్సాహికులకు అకడమిక్ లక్షణాలకంటే ప్రధానంగా మూడు సహజ లక్షణాలు అవసరం. అవి.. వ్యాపార నిర్వహణపై ఆసక్తి, నేర్చుకోవాలనే తపన, వ్యాపారంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలనే ఉత్సాహం. ఇవి ఉంటే ఫ్యామిలీ బిజినెస్ విభాగంలో రాణించడం ఎంతో తేలిక. ప్రొ॥పరిమళ్ మర్చెంట్ డెరైక్టర్- పీజీపీఎఫ్ఎంబీ, ఎస్.పి.జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ - ముంబై -
ఎంబీఏ చదవలేక పోతున్నా..!
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం పరిస్థితి విషమం కీసర, న్యూస్లైన్: ఓ ఎంబీఏ విద్యార్థిని కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన తిరుమల శెట్టి వేణుగోపాల్రావు, సుజాత దంపతులు. వీరి చిన్న కూతురు అనూష(23) చీర్యాల గీతాంజలి ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల్లో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. అనూష గతేడాది నగరంలోని ఓ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసింది. ఎంబీఏ కోర్సు తనకు సంబంధం లేకపోవడంతో రాణించలేకపోతున్నానని ఆమె తరచూ స్నేహితులతో వాపోయేది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన మొదటి సెమిస్టర్లో కూడా అనూషకు తక్కువ మార్కులు వచ్చాయి. తాను ఎంబీఏ కోర్సు చదవలేకపోతున్నానని మానసిక వేదన గురవుతోంది. శుక్రవారం కళాశాలకు చేరుకున్న అనూష తరగతి గది నుంచి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కు వెళ్తున్నట్లు స్నేహితులకు చెప్పింది. భవనం మొదటి అంతస్తు పెకైళ్లి కిందికి దూకింది. అనూష తలకు తీవ్రగాయాలై రెండు కాళ్లు విరిగిపోయాయి. గమనించిన కళాశాల సిబ్బంది ఆమెను ఈసీఐఎల్లోని తులసి ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అనూష ఆత్మహత్యాయత్నానికి మానసిక ఒత్తిడే కారణమా.. లేక మరేమైనా కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణకిషోర్ తెలిపారు. -
భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కీసర గీతాంజలీ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఎంబీఏ విద్యార్థిని శుక్రవారం ఉదయం కళాశాల భవనం పై నుంచి దూకింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఆత్మహత్యాయత్నాకి గల కారణాలు తెలియరాలేదు. -
ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలెన్నో..!
గతంలో కొన్ని రంగాలకే పరిమితమైన ఎంబీఏ గ్రాడ్యుయేట్ల అవసరం ప్రస్తుతం ఇతర రంగాలకు సైతం వేగంగా విస్తరిస్తోంది. అంటే ఎంబీఏ పూర్తిచేసిన వారికి డిమాండ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ కోర్సును ఎంచుకున్న వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) సీనియర్ డెరైక్టర్, కెరీర్ అడ్వాన్స్మెంట్ సర్వీసెస్, అడ్మిషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఎయిడ్.. వి.కె. మీనన్. దేశంలో మేనేజ్మెంట్ విద్య, ఎంబీఏ కళాశాలల స్థితిగతులు, భవిష్యత్ పరిణామాలపై తాజాగా ఆయన తన అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు.. మేనేజ్మెంట్ విద్యలో భారతదేశం ఇప్పుడిప్పుడే ప్రపంచస్థాయి వేదికగా అవతరిస్తోంది. ప్రస్తుతం మేనేజ్మెంట్ స్టడీస్లో అమెరికా ఆధిపత్యం కొనసాగుతోందని చెప్పొచ్చు. ఎందుకంటే యూఎస్లోని విద్యా సంస్థలు అత్యుత్తమ మేనేజ్మెంట్, పీహెచ్డీ ప్రోగ్రామ్స్ను అందిస్తున్నాయి. భారత్లో మేనేజ్మెంట్ విద్య ఇప్పటిదాకా సంప్రదాయబద్ధమైన తరగతి గది బోధనకే పరిమితం. ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తోంది. ఇక్కడ బీ స్కూల్స్లో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల నిపుణులను, అధ్యాపకులను ఆకర్షిస్తున్నాయి. ఎంబీఏ... అదనపు అర్హత తమ సంస్థ విలువను పెంచే సామర్థ్యాలు ఉన్నవారినే యాజమాన్యాలు ఉద్యోగులుగా నియమించుకుంటాయి. అదనపు అర్హతగా ఎంబీఏ చేసిన వారికి జాబ్ మార్కెట్లో తిరుగుండదు. ఉదాహరణకు.. ఒక ఆసుపత్రిని సమర్థంగా నిర్వహించాలంటే కేవలం వైద్యుడిగా పట్టా సంపాదిస్తే సరిపోదు. ప్లానింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, టెక్నాలజీ వంటి వాటిపై పట్టుండాలి. కాబట్టి వైద్య విద్య తర్వాత ఎంబీఏ చేస్తే పుష్కలమైన అవకాశాలున్నాయి. వైద్య రంగంతోపాటు ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల తయారీ రంగాల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. ఐఎస్బీలో ఏటా చాలామంది వైద్యులు మేనేజ్మెంట్ విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం ఎంబీఏ పూర్తిచేసిన వైద్యుల కొరత ఎక్కువగా ఉంది. ఇలాంటి వారికి మంచి డిమాండ్ ఉంది. కేవలం మెడిసిన్ మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో ఉన్నవారు సైతం ఎంబీఏ చేసి అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. గతంలో కంటే మెరుగైన అవకాశాలు ఎంబీఏ వ్యాపారంలో విజయానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పుతుంది. ప్రపంచీకరణతో ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు గతంలో కంటే ఎన్నో రెట్లు అవకాశాలు పెరిగాయి. బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ కన్సల్టింగ్ రంగంలో స్థిరపడాలంటే ఎంబీఏ దాదాపు తప్పనిసరిగా మారింది. దీంతోపాటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ప్రైవేట్ ఈక్విటీ, కార్పొరేట్ బ్యాంకింగ్ రంగాలూ వీరికే ప్రాధాన్యమిస్తున్నాయి. సాంకేతిక రంగంలో అవకాశాలు అపారం! ఇక సాంకేతిక రంగం ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు సాదర స్వాగతం పలుకుతోంది. బిజినెస్ డెవలప్మెంట్, టెక్నాలజీ కన్సల్టింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో వీరికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కన్సల్టింగ్, ఫైనాన్స్, సేల్స్, మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్ రంగాలు సంప్రదాయ ఎంబీఏ ప్రొఫెషనల్స్ను ఎంచుకుంటున్నాయి. కొత్తకొత్త రంగాల్లో ఎంబీఏల అవసరం పెరిగినట్లు మా పరిశీలనలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా హెల్త్కేర్, ఫార్మా, లైఫ్సెన్సైస్, మ్యానుఫ్యాక్చరింగ్, లైఫ్స్టైల్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీడియా, ఎంటర్టైన్మెంట్ తదితర రంగాల్లో ఎంబీఏ గ్రాడ్యుయేట్లకే మొదటి ప్రాధాన్యత దక్కుతున్నట్లు తేలింది. పలు కీలక రంగాల్లో ఐఎస్బీ గ్రాడ్యుయేట్లకు ఉన్నత ఉద్యోగాలు దక్కడమే ఇందుకు నిదర్శనం. పరిశోధనాపరమైన బోధన కావాలి ప్రపంచంలోని ఉత్తమ మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో నాణ్యమైన పరిశోధనలు జరుగుతున్నాయి. వాటి ఫలితాలను ఆయా సంస్థల విద్యార్థులు పొందుతున్నారు. భారత్లోనూ పరిశోధనలు పెరుగుతుండడం శుభ పరిణామం. బిజినెస్ స్కూల్స్ ప్రధాన లక్ష్యం.. సమస్యలను పరిష్కరించే, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడమే. పరిశోధనాపరమైన వాస్తవిక బోధన ఇందుకు కచ్చితంగా ఉపకరిస్తుంది. సామాజిక బాధ్యతను మరవొద్దు బిజినెస్ స్కూల్స్పై సామాజిక బాధ్యత కూడా తప్పనిసరిగా ఉంటుంది. సమాజం ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యలకు పరిష్కార మార్గాలను చూపేందుకు కృషి చేయాలి. అత్యధిక జనాభా ఉన్న భారత్లో ఈ అవసరం మరింత ఎక్కువగా ఉంది. నిరుపేదలు, నిరక్షరాస్యులకు మేలు కలిగించే విధానాలను అభివృద్ధి చేయాలి. ఈ దిశగా ఐఎస్బీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. పేదలకు గృహ వసతిపై ఇప్పటికే ఎన్నో ప్రాజెక్ట్లు చేపట్టాం. భారత్లో కంటే విదేశాల్లో బిజినెస్ స్కూల్స్ వేగంగా అభివృద్ధి చెందాయి. దీనికి కారణం.. పరిశ్రమల నుంచి, దాతల నుంచి తగిన ఆర్థిక సహాయం లభించడమే. భారత్లో మేనేజ్మెంట్ విద్యా సంస్థలకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి సాయం అందాల్సిన అవసరం ఉంది. కరిక్యులమ్పై పున:సమీక్ష భారత బిజినెస్ స్కూల్స్ కరిక్యులమ్ను పున:సమీక్షించాల్సిన సమయం వచ్చింది. కరిక్యులమ్ సమకాలీనంగా, ప్రపంచస్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇది ప్రస్తుత మార్కెట్ అవసరాలను తీర్చేలా తీర్చిదిద్దాలి. కేస్ టీచింగ్ మెథడాలజీని ప్రవేశపెట్టాలి. విదేశీ విద్యార్థులను మరింతగా ఆకర్షించేలా ఎంబీఏ కోర్సును రూపొందించాలి. అంతర్జాతీయంగా విదేశీ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాల వల్ల భారత విద్యార్థులకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఎంబీఏ విద్యార్థికి, పరిశ్రమకు మధ్య సన్నిహిత సంబంధం ఉండాలి. దీనివల్ల పరిశ్రమల అవసరాలేంటో విద్యార్థులకు తెలుస్తాయి. దానికనుగుణంగా వారు సంసిద్ధులయ్యేందుకు అవకాశం ఉంది. కుటుంబ వ్యాపారాలకు మేలు మనదేశ వ్యాపారాల్లో 85 శాతానికిపైగా కుటుంబ వ్యాపారాలే ఉన్నాయి. ఈ వ్యాపార కుటుంబాలు తమ సంప్రదాయ పాత పంథాను వీడి ఆధునికతను అందిపుచ్చుకుంటున్నాయి. దీనివల్ల ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు విస్తృతమవుతున్నాయి. వ్యాపార కుటుంబాలను భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావించవచ్చు. ఈ కుటుంబాల నుంచి వ్యాపారంలోకి ప్రవేశించే కొత్త తరాలకు తగిన శిక్షణ అవసరమవుతోంది. ఇలాంటి వారి కోసం ఐఎస్బీ.. మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఫ్యామిలీ బిజినెస్(ఎంఎఫ్ఏబీ) కోర్సుకు రూపకల్పన చేసింది. కుటుంబ వ్యాపారాలను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన నైపుణ్యాలను బోధిస్తోంది. వ్యాపారంలో భవిష్యత్ నాయకులుగా ఎదిగేందుకు తోడ్పాటును అందిస్తోంది. -
ఐసెట్ నోటిఫికేషన్ జారీ
హన్మకొండ, న్యూస్లైన్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్-2014 నోటిఫికేషన్ శుక్రవారం జారీ అయింది. మే 23న పరీక్ష ఉంటుందని ఐసెట్ కో ఆర్డినేటర్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ తెలిపారు. ఈనెల 24 నుంచి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మరిన్ని వివరాలను ఠీఠీఠీ.్చఞజీఛ్ఛ్టి.ౌటజ.జీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. -
ఐసెట్ షెడ్యూల్ విడుదల
హన్మకొండ(వరంగల్ జిల్లా), న్యూస్లైన్: రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్-2014 షెడ్యూల్ విడుదలైంది. ఇక్కడి కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనంలోని సెనేట్హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐసెట్ చైర్మన్, కేయూ వీసీ బి.వెంకటరత్నం ఈ షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ నెల 14న ఐసెట్-2014 నోటిఫికేషన్ను విడుదల చేస్తామని, మే 23న ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. వివరాలివీ.. అభ్యర్థులు ఈ నెల 24 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 15 వరకు, రూ.2,000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 25 వరకు, రూ.5,000 అపరాధ రుసుంతో మే ఆరు వరకు, రూ.పదివేల అపరాధ రుసుంతో మే 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. - ఏప్రిల్ 21 నుంచే అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. - ప్రవేశ పరీక్ష మే 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది. - ప్రిలిమినరీ కీని మే 26న విడుదల చేస్తారు. అభ్యంతరాలను జూన్ 3 వరకు స్వీకరిస్తారు. ఫైనల్ కీ, ప్రవేశపరీక్షల ఫలితాలను జూన్ 9న విడుదల చేస్తారు. - అభ్యర్థులు www.apicet.org.in వెబ్సైట్లో ఆన్లైన్ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర సమాచారంకోసం ్ఛఝ్చజీ: convernericet2014@gmail.com ను సంప్రదించవచ్చు. కొత్తగూడెంలో పరీక్ష కేంద్రం.. ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్మిశ్రా మాట్లాడుతూ.. గత ఐసెట్లో రీజినల్ సెంటర్లు 29 ఉండగా, ఈసారి ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతంలోని అభ్యర్థుల సౌకర్యార్థం కొత్తగూడెంలో కొత్తగా సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసారి ఓఎంఆర్ షీట్పై పెన్సిల్ను వాడొద్దని, బ్లూ లేదా బ్లాక్ పాయింట్పెన్నే ఉపయోగించాలని సూచించారు. పరీక్ష హాల్లోకి రావడం నిమిషం ఆలస్యమైనా అనుమతించరని తెలిపారు. సమావేశంలో ఉన్నత సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్జైన్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ విజయప్రకాశ్, సెక్రటరీ కె.సతీష్రెడ్డి, కేయూ రిజిస్ట్రార్ కె.సాయిలు, ఐసెట్ కన్వీనర్ ఓంప్రకాశ్ పాల్గొన్నారు. -
నాన్న కారు డ్రైవర్...కూతురు ఎంబీఏ టాపర్
అమలాపురం, న్యూస్లైన్ : చదువులతల్లి వీవీవీడీఎస్ ప్రసన్నది సాధారణ కుటుంబం. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు కారు డ్రైవర్. తల్లి రమాకుమారి గృహిణి. వారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి ప్రసన్న. పెద్ద చదువులు చదివించాలంటే వారి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. అయినప్పటికీ ప్రసన్న మొక్కవోని దీక్షతో ఎంబీఏ ఫస్టియర్లో యూనివర్సిటీ టాపర్గా నిలిచింది. యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఈనెల 10న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకోనుంది. ప్రసన్న స్థానిక ఏఎస్ఎన్ పీజీ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో గల 78 ఎంబీఏ కళాశాలలకు చెందిన 3,900 మంది విద్యార్థులు ఎంబీఏ తొలి సంవత్సరం పరీక్షలు రాయగా ప్రసన్న యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. సివిల్ పరీక్షలు రాసి విజయం సాధించాలని పట్టుదలతో చదువుతున్నానని ప్రసన్న చెబుతోంది. ప్రసన్నను ఏఎస్ఎన్ పీజీ కళాశాల అధినేత యేడిద రామనాథశాస్త్రి, ప్రిన్సిపాల్ ఎం.అరుణకుమార్, రెసిడెంట్ డెరైక్టర్ జి.ఫణిరాజా అభినందించారు.