Canada MBA Student From Visakhapatnam Died, Crime News - Sakshi
Sakshi News home page

కెనడాలో విశాఖ జిల్లా విద్యార్థి మృతి 

Mar 14 2022 3:58 AM | Updated on Mar 14 2022 8:38 AM

Visakhapatnam District Student Dies in Canada - Sakshi

సాక్షి, పాయకరావుపేట: కెనడాలో ఎంబీఏ చదువుతున్న విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన నిట్టెల మధుకుమార్‌ (30) ఆదివారం ఆకస్మికంగా మృతి చెందాడు. పట్టణానికి చెందిన నిట్టెల నూకరాజు మూడో కుమారుడైన మధుకుమార్‌ నెల రోజుల క్రితమే టోరెంటో నగరంలోని యార్క్‌ యూనివర్సిటీలో చదివేందుకు కెనడా వెళ్లాడు. ఈవెనింగ్‌ వాక్‌ చేస్తూ (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) హఠాత్తుగా కుప్పకూలిపోయాడని, స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణం పోయిందని మృతుని స్నేహితులు తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement