గోదావరి పుష్కరాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పుణ్య స్నానం ఆచరించి తిరుగు ప్రయాణమైన విజయనగరం జిల్లా వాసులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
గండేపల్లి: గోదావరి పుష్కరాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పుణ్య స్నానం ఆచరించి తిరుగు ప్రయాణమైన విజయనగరం జిల్లా వాసులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
తూర్పుగోదావరి జిల్లా గండేపల్లికి సమీపంలో భక్తులు ప్రయాణిస్తోన్న టాటా ఏస్ వాహనం పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలోనూ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.