Godavari pushkaralu
-
చిన్నమ్మా.. చేతకాలేదా?
చిన్నమ్మకు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం చేతకావడం లేదా.. ఎంపీగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదా.. బీజేపీ పెద్దల వద్ద ఆమె మాట చెల్లడం లేదా.. టీడీపీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారనే అనుమానంతో చిన్నమ్మను కేంద్రం దూరం పెట్టిందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఇటీవలి కేంద్ర బడ్జెట్టే దీనికి నిదర్శనంగా నిలుస్తూండగా.. రైల్వే బడ్జెట్లో సైతం జిల్లాకు కేటాయింపులు లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వలస వచ్చినా ఇక్కడి ప్రజలు ఆమెను ఆదరించారు. 54.82 శాతం ఓట్లు వేసి, 2,39,139 ఓట్ల మెజార్టీతో పట్టం కట్టారు. ఆమె ద్వారా జిల్లాకు మరిన్ని మంచి రోజులు వస్తాయని, తమ గళం ఢిల్లీ వరకూ వినిపిస్తుందని భావించారు. కానీ, ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. తనపై అంత అభిమానం చూపిన జిల్లా ప్రజల అభ్యున్నతి, అభివృద్ధిపై చిన్నమ్మ కనీస శ్రద్ధ కూడా చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కుబడిగా సమావేశాలకు రావడం, వెళ్లడం తప్ప గోదారోళ్ల గుండె ఘోష తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలి కేంద్ర బడ్జెట్లో మోదీ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించకపోవడమే ఇందుకు నిదర్శనమని పలువురు పెదవి విరుస్తున్నారు. స్వయానా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికే నిధులు రాబట్టుకోలేని చిన్నమ్మ నిస్సహాయతను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కనీసం రైల్వే అభివృద్ధికి కూడా పాటు పడిన దాఖలాలు లేకపోవడంతో కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అలాగే మిగిలిపోయాయి.ప్రత్యామ్నాయ మార్గం ప్రస్తావనేదీ?రాష్ట్రంలో రాజమండ్రి రైల్వే స్టేషన్కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రతి రోజూ సుమారు 200కు పైగా ప్రయాణికుల, గూడ్సు రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తూంటాయి. మామూలు రోజుల్లో 30 వేల మంది, పండగ సమయాల్లో 40 వేల మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో రాకపోకలు సాగిస్తూంటారు. ఆదాయంలోనూ ఈ స్టేషన్ మేటిగా నిలుస్తోంది. ఏటా రూ.123 కోట్లకు పైగా ఆదాయంతో ఎన్ఎస్జీ–2 హోదా సొంతం చేసుకుంటోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం బడ్జెట్లో నయా పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ట్రాక్లు నిత్యం రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉంటాయి. ఈ దృష్ట్యా గోదావరి బ్రిడ్జిల పైన, కొవ్వూరు, ఔటర్లోను పలు సందర్భాల్లో రైళ్లను నిలిపివేస్తూ, ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి కడియం నుంచి నిడదవోలు వరకూ ప్రత్యామ్నాయ రైల్వే లైన్ వేయాలనే ప్రతిపాదన ఉంది. తద్వారా గూడ్స్ రైళ్లను అటు మళ్లించడంతో రాజమండ్రి స్టేషన్కు ట్రాఫిక్ ఒత్తిడి లేకుండా చేయవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, ఈ రైల్వే లైన్ నిర్మాణ విషయం బడ్జెట్లో ప్రస్తావనకు రాలేదు. నిధుల కేటాయింపుపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.గత నిధులనే ఇప్పుడిచ్చినట్లు!రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.271 కోట్లు కేటాయించారు. పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ప్రస్తుత రైల్వే బడ్జెట్లో మరోసారి కేటాయింపులు ఉంటాయని భావించారు. కానీ, గతంలో మంజూరైన నిధులనే కొత్తగా ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చారు. కేంద్రం తెలివితేటలు చూసి, జిల్లా ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.ఆర్వోబీల ఏర్పాటుపై నీలినీడలురైల్వే గేట్ల వద్ద ప్రమాదాలు నివారించాలంటే ఆర్వోబీల నిర్మాణం చేపట్టాలని రైల్వే శాఖ భావించింది. దీనికి గాను 2027 నాటికి గేట్లను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం నగరంలోని అన్నపూర్ణమ్మపేట, కేశవరం, అనపర్తి ఆర్వోబీల ఏర్పాటుకు రైల్వే శాఖ పంపిన ప్రతిపాదనలకు తాజా బడ్జెట్లో దిక్కూమొక్కూ లేకుండా పోయింది.కొవ్వూరు – కొత్తగూడెం రైల్వే లైన్ ఊసే లేదువిశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని సుమారు 130 కిలోమీటర్ల మేర తగ్గించాలనే ఉద్దేశంతో కొవ్వూరు నుంచి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వరకూ కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని చాలా కాలం కిందటే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఇటీవల తిరిగి పట్టాలెక్కినట్టు కనిపించింది. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిగింది. ఈ రైల్వే లైను నిర్మాణం అన్నివిధాలుగా ఉపయోగకరమని నివేదికలు సైతం స్పష్టం చేశాయి. దీనికి ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని భావించినా నిరాశే ఎదురైంది.పుష్కర నిధులపై స్పష్టత ఏదీ?గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు రూ.1,286 కోట్లు అవసరమని ప్రజాప్రతినిధులు, అధికారులు లెక్కలు వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు జరుగుతుందని భావించారు. కానీ, ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో అసలు పుష్కరాలకు కేంద్రం తన వాటా ఇస్తుందా, లేదా.. ఇస్తే ఏ మేరకు అనే ప్రశ్న తలెత్తుతోంది. పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమీక్ష నిర్వహించిన ఎంపీ పురందేశ్వరి నిధుల మంజూరుపై దృష్టి సారించలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. అలాగే, రైల్వే సమస్యలపై కూడా ఆమె ఎందుకు శ్రద్ధ చూపలేదని ప్రశ్నిస్తున్నారు.అమృత్ స్టేషన్ల అభివృద్ధేదీ?అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా నిడదవోలు జంక్షన్, కొవ్వూరు, రాజమహేంద్రవరం, కడియం, ద్వారపూడి (కోనసీమ జిల్లా), అనపర్తి స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని వర్చువల్గా శంకుస్థాపనలు చేశారు. ప్రకటనలే తప్ప ఈ పనులు నత్తకు మేనత్తలా మారాయి. ప్రస్తుత బడ్జెట్లో వీటికి భారీగా నిధులు కేటాయిస్తారని భావించారు. కానీ, నయాపైసా కూడా ఇవ్వలేదు. -
అవినీతి ఫైలు అటకెక్కించేశారు
సాక్షి, అమరావతి: గోదావరి పుష్కరాల సందర్భంగా హాలోజన్ బల్బుల పేరుతో జరిగిన గోల్మాల్ను గత టీడీపీ ప్రభుత్వం విచారణ దశలోనే అటకెక్కించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పటి ప్రభుత్వ పెద్దల అవినీతి వెలుగులోకి రాకుండా ఈ పనిచేశారని ప్రస్తుత ప్రభుత్వానికి ఇప్పుడు ఓ ఫిర్యాదు అందింది. దీంతో ఏపీ విజిలెన్స్ అధికారులు ఈ వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయని ట్రాన్స్కో విజిలెన్స్ జేఎండీ వెంకటేశ్వరరావు వివరించారు. అప్పుడేం జరిగిందంటే? ► పుష్కరాల సమయంలో రాజమండ్రిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద హాలోజన్, రంగుల విద్యుద్దీపాలు అమర్చాలని 2015లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించి రూ.1,71,82,836లను మంజూరు చేసింది. నిజానికి రూ.5 లక్షలు దాటిన ప్రతీ కాంట్రాక్టుకు టెండర్ పిలవాలి. ఇదేమీ లేకుండా ఈ మొత్తాన్ని ఇష్టానుసారం ఖర్చుచేశారు. ► రూ.99 లక్షలతో హాలోజన్ ల్యాంపులు, డెకరేషన్ బల్బులు అద్దెకు తెచ్చినట్లు రూ.72 లక్షలతో హాలోజన్ ల్యాంపులు, కేబుల్, జీఐ వైర్, ఇన్సులేషన్ టేపులు, పిన్స్, ఎంసీబీలు, బల్బులు, ల్యాంపులు, హోల్డర్లు కొనుగోలు చేసినట్లు లెక్కల్లో చూపించారు. ► అలాగే, ఒక్కో ల్యాంపు రూ.824 చొప్పున 654 ల్యాంపులు కొన్నామని, వీటి విలువ దాదాపు రూ.5.4 లక్షలని, మరో 500 వాట్స్ హాలోజన్ ల్యాంపులు ఒక్కొక్కటీ రూ.588 చొప్పున.. 553 కొనుగోలు చేశామని, వీటి విలువ రూ.3.25 లక్షలని అధికారులు లెక్కలు చెప్పారు. లేబర్ ఛార్జీల కోసం రూ.10,32,500 ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టారు. ► కానీ, రికార్డుల్లో చూపించిన షాపులన్నీ హాలోజన్ బల్బులు అద్దెకిచ్చే పరిస్థితే లేదని, బల్బుల నాణ్యతా ప్రమాణాలు కూడా ఏమాత్రం లేవని ఆరోపణలు వచ్చాయి. అసలు కొనుగోలు చేసిన హాలోజన్ బల్బులు ఆ తర్వాత మాయమవ్వడం, ఆ తర్వాత తుక్కుగా చూపించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ► ఈ నేపథ్యంలో.. ‘సాక్షి’ 21–8–2015న ఈ బాగోతంపై ‘హలోజన్ హాంఫట్’ పేరుతో అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రమేయాన్ని, అవినీతినీ ఆధారాలతో బయటపెట్టింది. దీంతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముత్యాలరాజు ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ► మాయమైన బల్బులు, కొనుగోలులో అక్రమాలు, అద్దెకు తేవడం బూటకమని ప్రాథమిక ఆధారాలు లభించడంతో అప్పట్లోనే పదిమంది అధికారులకు సీఎండీ నోటీసులు జారీచేసి సమగ్ర విచారణకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ► కానీ, ఆ తర్వాత 2016లో ఈపీడీసీఎల్ సీఎండీగా వచ్చిన ఎంఎం నాయక్పై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో 2016 ఏప్రిల్లో విచారణలో ఉన్న ఈ కేసును మూసేశారు. ► ట్రాన్స్కో విజిలెన్స్ అప్పట్లో ఈ కేసుపై విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈపీడీసీఎల్కు సిఫార్సు చేసింది. అయితే, ఈ ఆదేశాలు డిస్కమ్ సీఎండీ పక్కనపెట్టారు. ఇప్పుడా ఫైలే కన్పించకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు. లోతుగా దర్యాప్తు చేస్తున్నాం అవినీతికి పాల్పడిన వారిపై చర్యలే లేకుండా ఫైలు మూసేయడం ఆశ్చర్యంగా ఉంది. ట్రాన్స్కో సిఫార్సుల ఫైలే ఈపీడీసీఎల్లో లేకపోవడం మరో విడ్డూరం. అందుకే లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో వివరాలు తెలుస్తాయి. – కె. వెంకటేశ్వరరావు (ట్రాన్స్కో విజిలెన్స్ జేఎండీ) దోషులకు శిక్ష తప్పదు హాలోజన్ బల్బుల కొనుగోళ్లలో అనేక అనుమానాలు వస్తున్నాయి. అవినీతి జరిగిందనే తెలుస్తోంది. అందుకే తిరిగి విచారణ చేపట్టాం. దోషులను శిక్షించి తీరుతాం. – శ్రీకాంత్ నాగులాపల్లి (ట్రాన్స్కో సీఎండీ) -
గోదావరి పుష్కర ఘటనకు ఐదేళ్లు
-
బోయపాటికి షూటింగ్ చేయమని చెప్పింది ఎవరు?
సాక్షి, అమరావతి : పుష్కరాల పేరిట గత ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాలయను మంచి నీళ్లలా ఖర్చు పెట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు జోగి రమేశ్ విమర్శించారు. గోదావరి పుష్కరల్లో 29 మంది అమాయకపు భక్తులు చనిపోవడానికి కారణం టీడీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. గోదావరి, కృష్ణా పుష్కరాల్లో వేలాది కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తరువాత స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయంలో పుష్కరాల నిర్వహణపై జోగి రమేశ్ మాట్లాడుతూ.. పుష్కరాలకు వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించిన టీడీపీ ప్రభుత్వం.. అందుకు సరిపడ ఏర్పాట్లు చేయలేకపోయింది. పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు చనిపోవడానికి కారణమేవరు?. దర్శకుడు బోయపాటి శ్రీనును అక్కడ షూటింగ్ చేయమని ఎవరు చెప్పారు?. బోయపాటిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు షూటింగ్ చేయమన్నారా లేక బోయపాటినే సినిమా షూటింగ్ చేశారా అనేది టీడీపీ సమాధానం చెప్పాలి. చంద్రబాబు ఎందుకు సామాన్య ఘాట్లో పుష్కర స్నానం చేయాల్సి వచ్చింది?. అంత పెద్ద ఘటన జరిగిన కూడా కనీసం ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. 29 మంది మరణానికి కారణమైన వారికి శిక్ష తప్పదు. గోదావరి పుష్కరాల ఘటనపై సభాసంఘం వేయాలి. అసలైన దోషులను గుర్తించాల్సిన అవసరం ఉంది. కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఇబ్రహీం గాంధీ సెంటర్లో ఉన్న మహత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించి మురికి కాలువలో వేశారు. కృష్ణా పుష్కరాల కోసం వేలాది మంది పేదల ఇళ్లను అక్రమంగా తొలగించార’ని తెలిపారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే 29 మంది చనిపోయారు.. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తులు చనిపోయారని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. పర్యాటక శాఖ ద్వారా నేషనల్ జియో గ్రాఫిక్ ఛానల్కు రూ. 64 లక్షలతో డాక్యుమెంటరీ చిత్రీకరించే యత్నం చేశారు. బోయపాటి శీనుతో ఆ షూట్ చేశారు. లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు కనీసం జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. 29 మంది చనిపోవడానికి చంద్రబాబు కారణమని విమర్శించారు. పైగా భక్తుల తొక్కిసలాట వల్లే ప్రమాదం జరిగిందని గత ప్రభుత్వం సమర్ధించుకుందని గుర్తుచేశారు. ఈ ఘటనకు సోమయాజులు కమిషన్ నివేదనకు పట్టించుకోలేదన్నారు. బాధితులకు ఇప్పటికీ పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు గోదావరి పుష్కరాల కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. ఆ నిధులను పూర్తిగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గోదావరి పుష్కరాల ఘటనపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. కేబినెట్ సబ్కమిటీతో విచారణ చేయిస్తాం సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వెళ్లిన పుష్కర ఘాట్ వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోలేదని సోమయాజులు కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఆ నివేదికను కూడా చంద్రబాబు ప్రభుత్వం తొక్కిపెట్టిందని మండిపడ్డారు. మృతుల కుటుంబసభ్యులు కూడా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఘాట్కు చంద్రబాబు రావడం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నట్టు వెల్లడించారు. కేబినెట్ సబ్కమిటీ ద్వారా ఈ ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. -
‘టీడీపీ అధర్మ పాలన వల్లే 29 మంది మృతి’
సాక్షి, అమరావతి : శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి టీడీపీ ప్రభుత్వం, జస్టిస్ సోమయాజులు కమిషన్పై నిప్పులు చెరిగారు. గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కొసలాటకు మీడియా అత్యుత్సాహం, భక్తుల అవగాహనాలేమి కారణమని తేల్చిన సోమయాజులు కమిషన్కు భారతరత్న, ఆస్కార్ అవార్డులు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు అధర్మపాలన సాగుతోంది కనుకనే అంతటి ఘోరం జరిగిందని వాపోయారు. పుష్కరాల్లో చనిపోయిన 29 మంది కుటుంబాల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని అన్నారు. టీడీపీకి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారు.. తిరుమల శ్రీవారి ఆభరణాలపై ప్రశ్నించినందుకే ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని శివస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పోలీసులు తనపై మూడు అక్రమ కేసులు పెట్టారని, విచారణ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. కేసుకు సంబంధించిన విషయాలను విచారించాల్సిందిపోయి.. శైవక్షేత్ర ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ బ్యాలెన్స్లు అడుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిన టీడీపీకి వ్యతిరేకంగా ప్రజలు మంచి తీర్పునిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి : దోషం భక్తులది.. పాపం మీడియాది -
సోమయాజులు కమిషన్పై మండిపడుతున్న పండితులు
-
‘భక్తికి కాకుండా మీడియా దేనికి ప్రచారం కల్పించాలి’
సాక్షి, తూర్పు గోదావరి జిల్లా : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట ప్రమాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ జస్టిస్ సోమయాజులు కమిషన్పై పండితులు, ప్రవచనకర్తలు మండిపడుతున్నారు. పుష్కరాలపై పండితులు, మీడియాను తప్పుపట్టడం సరికాదని పంచాంగ జ్యోతిష్య పండితులు మధురపాల శంకర్ శర్మ ధ్వజమెత్తారు. పంచాంగ కర్తలపై నిందవేయడం దారుణమన్నారు. పుష్కరాల తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వవైఫల్యమేనని పేర్కొన్నారు. సంప్రదాయాలు లేని చోటే దుర్మార్గాలు పుట్టుకొస్తాయని నిప్పులు చెరిగారు. పండితులపై చేసిన వ్యాఖ్యలను జస్టిస్ సోమయాజులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు గోదావరి పుష్కరాలకు ముహూర్తపెట్టింది పంచాంగ కర్తలు కాదని, అలాంటప్పుడు తమపై ఎందుకు నిందవేస్తున్నారన్నారు. భక్తి విషయాల్లో కాకుండా మీడియా దేనికి ప్రచారం కల్పించాలన్నారు. ఆధ్యాత్మిక విషయాలకు మీడియా ప్రచారం కల్పించకుండా, తప్పుడు విషయాలకు ప్రచారం చేయాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కమిటీని మళ్లీ వేసి దాంట్లో సరైన పంచాంగ కర్తలని తీసుకొని, ముహూర్త దోషాలు ఉన్నాయా లేదా అని తేల్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక పారదర్శకంగా ఇచ్చిందని భావించడం లేదని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లకుగరై కమిషన్ నివేదిక ఇచ్చినట్లుందని తెలిపారు. గోదావరి పుష్కరాల దుర్ఘటనను భక్తుల నమ్మకాల మీదకు నెట్టేయడం దారుణమన్నారు. పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే దుర్ఘటనకు కారణమని పేర్కొన్నారు. పుష్కరాలను ప్రభుత్వం ఈవెంట్ మేనేజ్మెంట్గా తీసుకుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పుష్కరఘాట్ లో స్నానం చేస్తారన్న విషయం ముందుగానే అధికారులు ప్రజలకు చెప్పాల్సిందని తెలిపారు. అలా చెప్పకుండా భక్తులను ఘాట్ బయట నిలబెట్టడం తప్పు అన్నారు. కాగా, గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందడానికి భక్తులు, పండితులు, ప్రసార మాధ్యమాలే కారణమని రిటైర్డ్ జస్టిస్ సోమయాజులు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ తేల్చేసింది. 2015 జూలై 14న పుష్కరాల తొలి రోజున స్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ముహూర్త కాలంలోనే స్నానం చేయకపోతే పుణ్యం రాదేమోనన్న ఆందోళనతో భక్తులంతా ఒక్కసారిగా నదిలోకి దూసుకురావడం వల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని నివేదికలో స్పష్టం చేయడం గమనార్హం. ఈ దుర్ఘటనపై మూడేళ్లపాటు సుదీర్ఘ విచారణ చేసిన జస్టిస్ సోమయాజులు కమిషన్ ఇచ్చిన ఈ నివేదికను చూసిన రాష్ట్ర ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. -
బాబును కాపాడేలా నివేదిక
-
పాపం ప్రజలదేనట..!
-
ఆ వీడియోలను బయటపెట్టాలని డిమాండ్
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల సందర్భంగా 2015 జూలై 14న జరిగిన తొక్కిసలాటపై జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ దాదాపు మూడేళ్లపాటు విచారణ జరిపి, ఇచ్చిన నివేదికపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దుర్ఘటనకు మీడియా ప్రచారం, భక్తుల రద్దీయే కారణమని తేల్చడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. ఈ తొక్కిసలాటతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధం లేదని, పైగా చంద్రబాబు ఆస్పత్రిలో బాధితులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారని కితాబు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాల్లో ముఖ్యమంత్రి స్నానం చేస్తుండగా చిత్రీకరించిన వీడియోలు ఎక్కడున్నాయో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్ష్యాధారాలను మాయం చేశారని, సీఎం ప్రచారం యావ వల్లే ఈ తొక్కిసలాట జరిగి, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, దీనికి మీడియాను, భక్తులను కారకులను చేయడం సరికాదని పేర్కొంటున్నారు. సాధారణ భక్తుల ఘాట్కు సీఎం ఎందుకెళ్లారు? గోదావరి పష్కరాలకు తరలి రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది ముందుగానే టీవీ చానళ్లు, పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాల్లో సాగించిన ప్రచారాన్ని సోమయాజులు కమిషన్ తన నివేదికలో కనీసం ప్రస్తావించలేదు. వీఐపీలకు ప్రత్యేకంగా రాజమహేంద్రవరంలోనే సరస్వతి ఘాట్ ఉండగా, సీఎం చంద్రబాబు కుటుంబం, మంత్రులు సాధారణ భక్తులకు కేటాయించిన పుష్కర ఘాట్లోకి ఎందుకు వెళ్లారో చెప్పలేదు. పుష్కరఘాట్లో భక్తులను నిలిపివేసి ఒక్కసారిగా వదిలారన్న అంశాన్ని కమిషన్ విస్మరించింది. రద్దీ అధికంగా ఉంటే భక్తులను పక్కనే 200 మీటర్ల దూరంలో ఉన్న కోటిలింగాల ఘాట్, పద్మావతి ఘాట్లకు ఎందుకు మళ్లించలేదు? అని నివేదికలో ఎక్కడా ప్రశ్నించలేదు. ఆ వీడియోలు ఎక్కడున్నాయి? తొక్కిసలాట ఘటనకు మీడియా, భక్తులను బాధ్యులను చేయడం దారుణం. రూ.64 లక్షలకు ఏపీ టూరిజం శాఖ నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్తో ఒప్పందం కుదుర్చుకుంది. పుష్కరాల్లో ముఖ్యమంత్రి స్నానం చేస్తుండగా చిత్రీకరించిన వీడియోలు ఎక్కడున్నాయి? – ముప్పాళ్ల సుబ్బారావు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు. రాజమహేంద్రవరం సీఎం ప్రచార యావ వల్లే తొక్కిసలాట 2003 నాటి గోదావరి పుష్కరాల ఫొటోలు ఉన్నాయి, మరి 2015 పుష్కరాల సీసీ కెమెరాల ఫుటేజీలు ఎందుకు లేవు? సాక్ష్యాధారాలను మాయం చేశారు. సీఎం ప్రచారం యావ వల్లే తొక్కిసలాట జరిగింది. మీడియా, భక్తులను కారకులను చేయడం సరికాదు. – కూనపురెడ్డి శ్రీనివాసరావు, న్యాయవాది, అఫిడవిట్దారుడు, రాజమహేంద్రవరం అబద్ధం ఎవరిది? తాను అక్కడ ఉండగానే తొక్కిసలాట గురించి తెలిసిందని, వెంటనే కంట్రోల్ రూమ్లోకి వెళ్లి కంట్రోల్ చేయాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఏకసభ్య కమిషన్ మరోలా చెప్పింది. ఇక్కడ చంద్రబాబు అబద్ధం అడారా? లేక కమిషన్ అబద్ధం చెప్పిందా? – ఉండవల్లి అరుణ్కుమార్, మాజీ ఎంపీ మీడియాను నిందించడం సరికాదు పుష్కరాలపై సమాచారం తెలియజేయడం మీడియా ప్రధాన విధి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే పుష్కరాల్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. దానికి మీడియాను కారణంగా చూపడం సరికాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – మండేలా శ్రీరామమూర్తి, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు. రాజమహేంద్రవరం -
దోషం భక్తులది.. పాపం మీడియాది
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందడానికి భక్తులు, ప్రసార మాధ్యమాలే కారణమని రిటైర్డ్ జస్టిస్ సోమయాజులు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ తేల్చేసింది. 2015 జూలై 14న పుష్కరాల తొలి రోజున స్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ముహూర్త కాలంలోనే స్నానం చేయకపోతే పుణ్యం రాదేమోనన్న ఆందోళనతో భక్తులంతా ఒక్కసారిగా నదిలోకి దూసుకురావడం వల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని నివేదికలో స్పష్టం చేయడం గమనార్హం. ఈ దుర్ఘటనపై మూడేళ్లపాటు సుదీర్ఘ విచారణ చేసిన జస్టిస్ సోమయాజులు కమిషన్ ఇచ్చిన ఈ నివేదికను చూసిన రాష్ట్ర ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం ప్రచార యావకు సామాన్యులు బలి గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటపై అప్పటి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను గానీ, అలాగే ఘటన ఎలా జరింగిందనే దానిపై మీడియాలో వచ్చిన కథనాలను గానీ ఏకసభ్య కమిషన్ ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్తో పాటు పలువురు కమిషన్ ముందు విచారణకు హాజరై ఇచ్చిన నివేదికలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. గోదావరి పుష్కరాలను కుంభమేళ తరహాలో అట్టహాసంగా నిర్వహించామని ప్రచారం చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్నానం చేస్తుండగా వెనుక పెద్ద ఎత్తున జనసందోహం కనిపించేలా వీడియోలు చిత్రీకరించడం, దానివల్లే తొక్కిసలాట జరగడాన్ని ఏకసభ్య కమిషన్ పట్టించుకోలేదు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏది చెబితే అదే నివేదికలో రాసిచ్చినట్లుగా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పైగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుష్కర స్నానాన్ని కూడా ప్రస్తావిస్తూ దానికి మీడియాలో ప్రచారం కల్పించారని నివేదికలో పేర్కొనడం గమనార్హం. అధికార పార్టీపై ఇతర పార్టీలు ఆరోపణలు చేస్తాయని నివేదికలో ప్రస్తావించారు. 29 మంది మృతి చెందడం సాధారణ విషయమేనని, అందులో ప్రభుత్వం తప్పేమీ లేదని, పొరపాటంతా పుష్కర భక్తులది, ప్రచారం చేసిన మీడియాదేనని నివేదికలో పేర్కొన్నారు. కమిషన్ నివేదికలో ఏముందంటే... ‘‘పుష్కరాలలో తీర్థవిధులు నిర్వర్తించడమే చాలా ముఖ్యమైన అంశం. భక్తులు తమ పెద్దల పుణ్యతిథి రోజు ఈ తీర్థవిధులు నిర్వర్తిస్తారు. అందరు తల్లిదండ్రుల తిథులు ఒకే రోజు రావుకదా! ఈ ఇంగితాన్ని తెలుసుకోలేని ప్రసార మాద్యమాలు, ప్రవచన పండితులు, పంచాగకర్తలు, స్వామీజీలు ప్రజలను మూఢ నమ్మకాల్లో ముంచెత్తారు. నదీ స్నానం తెల్లవారుజామున చేస్తే అది దేవత స్నానం, సూర్యోదయం తరువాత చేస్తే మనుష్య స్నానం, ఎప్పుడుపడితే అప్పుడు చేస్తే అది రాక్షస స్నానం అని విశ్వాసం. కానీ, పుష్కరాల సమయంలో ఎప్పుడు స్నానం చేసినా అది పుణ్యప్రదమేనని సూత మహర్షి తన శిష్యులకు చెప్పారని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ సంగతిని ఏ టీవీ చానల్లోనూ సరిగ్గా చెప్పలేకపోయారు. ప్రజల్లో గుడ్డి నమ్మకాన్ని కలిగించి తప్పుదోవ పట్టించారు. పుష్కరాలు జరిగే 12 రోజులూ పుణ్యకాలమేనని పురాణాలు ఘోషిస్తున్నాయి. దీన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించలేక తాము ఓ గొప్ప విషయాన్ని చెబుతున్నట్లుగా భావించి ఆ ముహూర్తానికే పుష్కర స్నానం చేయాలంటూ మీడియాలో ఊదరగొట్టారు. దీనివల్ల లక్షలాది మంది భక్తులు గోదావరి తీరాన పడిగాపులు పడ్డారు. ముహూర్తకాలంలోనే స్నానం చెయ్యకపోతే పుణ్యం రాదేమోనన్న ఆందోళనతో ఒక్కసారిగా వెల్లువలా నదిలోకి పరుగులు పెట్టారు. పల్లంలోకి ప్రవహించే నీటిని ఆపగలమా? ప్రచారమనే చెడ్డవాహిక వల్ల ఎన్నో ప్రాణాలను మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి స్నానం చేసి వ్యాన్లోకి వెళ్లిన తరువాతే తొక్కిసలాట ఘటన జరిగింది’’ అని ఏకసభ్య కమిషన్ నివేదికలో వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు వీఐపీ ఘాట్ను వదిలి ఉదయమే 6.26 గంటలకు ఇతర వీఐపీలతో కలిసి పుష్కర ఘాట్కు ఎందుకు వచ్చారనే విషయాన్ని కమిషన్ అసలు పరిగణనలోకి తీసుకోలేదు. అక్కడ షూటింగ్ ఎందుకు నిర్వహించారనే అంశాన్ని ప్రస్తావించలేదు. తొక్కిసలాట ఘటనపై అప్పటి జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ఆ నివేదిక గురించి ఏకసభ్య కమిషన్ కనీసం ప్రస్తావించకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా వీవీఐపీలు, వీఐపీల కోసం పుష్కర ఘాట్ను గంటల తరబడి మూసివేశారని, తరువాత ఒక్కసారిగా గేట్లు తెరవడం వల్లనే తొక్కిసలాట జరిగినట్లు అప్పటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదికలో స్పష్టం చేశారు. రెండు రోజుల ముందు నుంచే భక్తులు రాజమండ్రికి రావడం ప్రారంభించారని, పుష్కరాలు ప్రారంభం కాగానే నదిలో స్నానం చేయాలని ఉత్సుకతతో ఆ రోజు తెల్లవారుజూమునే పుష్కర ఘాట్కు తరలివచ్చారని జిల్లా కలెక్టర్ తన నివేదికలో తెలియజేశారు. సీఎం చంద్రబాబుతోపాటు వీవీఐపీలు, వీఐపీలు ఉదయం 6.26 గంటల నుంచి పుష్కర ఘాట్లో ఉన్నారని, గోదావరి నదిలో తొలుత స్నానం చేసి పుష్కరాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారని, వారు స్నానం పూర్తయ్యి బయటకు వచ్చేసరికి ఉదయం 8.30 గంటలైందని కలెక్టర్ పేర్కొన్నారు. తెల్లవారుజాము నుంచి ఉదయం 8.30 గంటల వరకూ భక్తులను అనుమతించకపోవడంతో తాకిడి విపరీతంగా పెరిగిపోయిందని, ఆ తర్వాత కూడా కేవలం ఒక్క గేటునే తెరవడంతో తొక్కిసలాట జరిగిందని, పోలీసులు నిలువరించలేకపోయారని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయాలను ఏకసభ్య కమిషన్ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. బోయపాటి శ్రీను డైరెక్షన్లో షూటింగ్ గోదావరి పుష్కరాల్లో లక్షలాది మంది జనం వెనుక కనిపిస్తుండగా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు పుష్కర స్నానం చేస్తుండగా షూటింగ్ చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఈ వీడియోలను పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకోవాలని భావించారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో షూటింగ్కు ఏర్పాట్లు చేశారు. వీఐపీల స్నానానికి తొలుత సరస్వతి ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. సీఎం, కుటుంబ సభ్యులు సరస్వతి ఆలయం వద్ద పుష్కర స్నానం ఆచరించాల్సి ఉంది. అయితే, చివరి నిముషంలో జనసమూహం మధ్య స్నానం ఆచరిస్తున్నట్లు షూటింగ్ చేసి, డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయాలని నిర్ణయించారు. దీంతో సీఎం, కుటుంబ సభ్యులు వీఐపీ ఘాట్ను వదిలి పుష్కర ఘాట్కు వచ్చారు. దీంతో భక్తులందరినీ అధికారులు నిలిపివేశారు. భక్తులంతా పెద్ద సమూహంగా కనిపించేలా పుష్కరాల ప్రారంభ ఘట్టాలను డ్రోన్ కెమేరాల ద్వారా చిత్రీకరించారు. ఆ చిత్రీకరణ పూర్తయ్యేదాకా భక్తులను స్నానాలకు అనుమతించలేదు. చిత్రీకరణ పూర్తయ్యాక ఒక్కసారిగా గేట్ తెరిచారు. దీంతో అందరూ ఒకేసారి ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ప్రత్యక్ష సాక్షులంతా ఇదే విషయం చెప్పారు. అయితే ఏకసభ్య కమిషన్ తన నివేదికలో దీనిగురించి ప్రస్తావించకపోవడం పట్ల బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి పుష్కరాల షూటింగ్లు, ప్రచారాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసింది. -
.. ఇది క్షమార్హం కాదు!!
ఆగ్రహోదగ్రులైన జనాన్ని చల్లార్చడానికి విచారణ కమిషన్లు మత్తు మందుగా పనికొస్తాయని విఖ్యాత న్యాయ కోవిదుడు స్వర్గీయ జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ కమిషన్లకు నేతృత్వం వహించేవారిని ఎంపిక చేయటం మొదలుకొని జరిగే మొత్తం ప్రక్రియంతా సంశయాత్మక క్రీడ అని కూడా ఆయన చెప్పారు. ఏం చేయడానికైనా సిద్ధపడే రిటైర్డ్ న్యాయమూర్తుల దురాశను ఆయన చెరిగిపారేశారు. మూడేళ్లక్రితం గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్ర వరంలో తొక్కిసలాట జరిగి 29 నిండు ప్రాణాలు బలైన ఉదంతంపై నియమించిన జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్ సమర్పించిన నివేదిక చూస్తే జస్టిస్ కృష్ణయ్యర్ అభిప్రాయాలు అక్షర సత్యాలని అర్ధమవుతుంది. సాధారణంగా కమిషన్లు ఏర్పాటు చేసేటపుడు ప్రభుత్వాలు చాలా విష యాలు చెబుతాయి. జరిగిన ఉదంతానికి దారితీసిన పరిస్థితులేమిటో, వాటికి బాధ్యులెవరో, భవి ష్యత్తులో ఈ మాదిరి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి తీసుకోదగిన చర్యలేమిటో సూచించటం తదితరాలు అందులో ఉంటాయి. మూడేళ్లపాటు సాగిన విచారణలోఎందరో పాల్గొని అనేక అంశాలను జస్టిస్ సోమయాజులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఆనాటి ప్రమాదంలో గాయాలపాలైనవారితో, మరణించినవారి కుటుంబసభ్యులతో అఫిడవిట్లు దాఖలు చేయించారు. ఏం జరిగుంటే ఈ విషాదాన్ని నివారించటం సాధ్యమయ్యేదో సవివరంగా చెప్పారు. పుష్కరాలకు భారీయెత్తున ఏర్పాట్లు చేస్తున్నామంటూ వందల కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం తగిన సంఖ్యలో అంబులెన్స్ల మాట అటుంచి, కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో ఉంచకపోవడాన్ని ఎత్తిచూ పారు. పైగా నిబంధనలు అతిక్రమించి ఘటనాస్థలికి సమీపంలో పలు వీఐపీ వాహనాలు, ఇతర వాహనాలు పార్క్ చేసిన తీరును వెల్లడించారు. ఊరునిండా పద్మవ్యూహాన్ని తలపించేలా బారికేడ్లు పెట్టి ఎటు పోవాలో తెలియని అయోమయ స్థితిని కల్పించిన వైనాన్ని వెల్లడించారు. వీటన్నిటికీ ఆధారాలుగా వీడియోలు, ఫొటోలు, పత్రికల క్లిప్పింగ్లు కమిషన్కు సమర్పించారు. వాదనలన్నీ విని, వీరందరూ సమర్పించిన నివేదికలను పరిశీలించి చివరాఖరికి జస్టిస్ సోమయాజులు కమిషన్ తేల్చిందేమిటన్నది చూస్తే ఎవరికైనా విస్మయం కలుగుతుంది. ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు క్లీన్ చిట్ ఇవ్వడానికి... పుష్కర ఏర్పాట్లతో, నిర్వహణతో, ఆనాటి ఘటనతో ఏమాత్రం సంబంధంలేని వారిపై బురదజల్లడానికి కమిషన్ చూపించిన ఉత్సాహం దిగ్భ్రమగొలుపుతుంది. పుష్కరఘాట్లో జరిగిన తొక్కిసలాటకు కారణాలేమిటో అక్కడ విధులు నిర్వహించిన హోంగార్డు స్థాయి ఉద్యోగి సైతం చెప్పగలడు. రాజమహేంద్రవరం పరిసరాల్లో దాదాపు 30 ఘాట్లు ఏర్పాటు చేశామని, ఎన్ని లక్షలమందైనా సునాయాసంగా స్నానాలు చేయడానికి వీలుంటుందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. ఒక్క పుష్కరఘాట్ మినహా ఇతర ఘాట్లలో వాస్తవానికి అలాంటి పరిస్థితే ఉంది. ఉన్నవాటిలో పుష్కరఘాట్ చిన్నది. అయినా అక్కడ మాత్రమే ఇంత భారీయెత్తున జనం ఎందుకు గుమిగూడారన్న అంశంపై కమిషన్ దృష్టి సారించి ఉంటే ఎన్నో అంశాలు వెలుగు లోకొచ్చేవి. వేకువజామున 6.26 నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉన్నదని, ఆ సమయంలో స్నానం చేస్తే ఏడేడు జన్మాల్లో చేసిన పాపాలన్నీ పోతాయని దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రభుత్వం భారీయెత్తున ప్రచారం చేసింది. ఆ ముహూర్తానికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు తమ తమ కుటుంబాలతో స్నానానికి తయారయ్యారు. చేస్తే చేశారు... వీరంతా వీఐపీల కోసం కేటాయించిన విశాలమైన సరస్వతి ఘాట్ను కాదని, వైశాల్యంలో చిన్నదిగా ఉండే ఈ పుష్కరఘాట్కు పొలోమంటూ ఎందుకు పోవాల్సివచ్చిందో కమిషన్ అడగలేదు. ప్రభు త్వంవైపు నుంచి ఎవరూ చెప్పలేదు. సందేహాలే విజ్ఞానానికి బాటలు పరుస్తాయంటారు. కమిషన్కు ఈ విషయంలో సందేహం రాకపోవడం వల్ల అనేక అంశాలు మరుగునపడ్డాయి. పుష్కర సంరం భాన్ని, ముఖ్యమంత్రి కుటుంబసమేతంగా స్నానం చేస్తున్న దృశ్యాలను సినీ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రీకరించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఆ దృశ్యాల్లో జనసందోహం భారీయెత్తున కనబడాలన్న ఉద్దేశంతో చంద్రబాబు కుటుంబాన్ని పుష్కరఘాట్కు తీసుకొచ్చారు. గోదావరి స్టేషన్లో దిగేవారు, ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చే భక్తులు వేర్వేరు‡ఘాట్లకు పోతే ఇక్కడ జనం తక్కువవుతారన్న ఆలోచనతో పోలీసులు, ఇతర సిబ్బంది సాయంతో అందరినీ పుష్కర ఘాట్కు మళ్లించారు. ఆ విధంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తెల్లారుజామున 4.30 మొదలుకొని 8 గంటల సమయం వరకూ ఆ ఘాట్ వెలుపల పడిగాపులు పడ్డారు. ఇంతమంది భక్త జనం కెమెరా ఫ్రేంలో అద్భుతంగా కనబడి ఉండొచ్చుగానీ, అది వారందరికీ శాపంగా మారింది. బాబు అక్కడినుంచి నిష్క్రమించగానే, అంతవరకూ అక్కడున్న బందోబస్తు మాయమైంది. ఆ ఘాట్కున్న ఒకే ఒక ప్రవేశద్వారాన్ని తెరవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. అందులో గాయ పడినవారు గుక్కెడు నీళ్లిమ్మని రోదిస్తున్నా సమీపంలో ఎక్కడా మంచినీరు లేని తీరును చాలామంది మీడియాకు ఆ వెంటనే వివరించారు. అలా నీళ్లు అందించి ఉంటే కొందరి ప్రాణాలైనా కాపాడటం సాధ్యమయ్యేదని చెప్పారు. ఆ దరిదాపుల్లో అంబులెన్స్ల జాడలేదని, చేతులపై మోసుకెళ్లామని వివరించారు. పైగా సీసీ టీవీ ఫుటేజ్గానీ, నేషనల్ జియోగ్రఫిక్ చానెల్ కోసం తీసిన వీడియోగానీ కమిషన్ ముందుకు రానేలేదు. మూడేళ్ల తర్వాత సమర్పించిన నివేదికలో ఇలాంటి కీలకమైన అంశాలు లేవు సరిగదా పంచాంగకర్తలు మొదలుకొని ప్రతిపక్షాల వరకూ టోకున అందరినీ ‘దోషుల్ని’ చేసిన వైనం, ప్రజలనూ, మీడియాను బాధ్యులను చేసిన తీరు విస్మయపరుస్తుంది. తనకనుకూలంగా అన్ని వ్యవస్థలనూ దిగజార్చటంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఆఖరికి విచారణ కమిషన్లపై జనంలో కొద్దో గొప్పో ఉండే విశ్వసనీయతను కూడా దారుణంగా దెబ్బతీశారని నివేదిక చూస్తే అర్ధమవుతుంది. ఇది క్షమార్హం కాదు. -
వీఐపీ ఘాట్లో ఉండాల్సిన సీఎం.. : శివస్వామి
సాక్షి, అమరావతి : గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాటకు కారణాలు వివరిస్తూ సోమయాజులు కమిషన్ ఇచ్చిన నివేదికను శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తప్పుపట్టారు. భక్తుల మూఢనమ్మకాలు, పంచాంగ కర్తలు, స్వామిజీలు, మీడియా వల్లే గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగిందంటూ నివేదిక ఇవ్వడం దారుణమన్నారు. గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఆ వ్యవహారాన్ని దాచేందుకే.. పుష్కరాల కోసం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారన్న శివస్వామి.. పుష్కరాల్లో బోయపాటి శ్రీను డాక్యుమెంటరీ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అయినా పుష్కరాల సమయంలో వీఐపీ ఘాట్లో ఉండాల్సిన ముఖ్యమంత్రి సామాన్యులు స్నానం చేసే ఘాట్లో ఎందుకు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈ ఘటనను స్వామిజీలు, మీడియాపైకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలదే తప్పు అన్నట్లుగా కమిషన్ నివేదిక ఇవ్వడాన్ని స్వామిజీల తరపున ఖండిస్తున్నామన్నారు. కాగా 2015లో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటకు అతి ప్రచారమే కారణమని జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఆ నివేదిక సీఎం రాసినట్టుంది: వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడును కాపాడటానికే జస్టిస్ సోమాయాజులు నివేదిక ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. బుధవారం ఆమె పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరని చెప్పడానికి సోమయాజుల కమిటీ నివేదికే నిదర్శనమన్నారు. తప్పంతా భక్తులదే.. మూడ నమ్మకంతో అంతమంది అక్కడికి వెళ్లటం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పించడం సిగ్గుచేటని ఆగ్రహం వక్తం చేశారు. అసలు సోమయాజులు కమిటీ ఎందుకు వేశారని, ఏం చెప్పారని ప్రశ్నించారు. ఈ నివేదికను చంద్రబాబే రాసినట్టుందని, ఆయన రాసిన రిపోర్ట్పై సోమయాజులు సంతకం పెట్టినట్లుందన్నారు. ముఖ్యమంత్రి స్నానం చేసే వరకు ఎవరిని అనుమతించలేదని, తొక్కిసలాట జరుగుతున్న విషయం సీఎంకు చెప్పమని జిల్లా ఎస్పీ మీడియాకు చెప్పారని, సీఎం ఉన్నప్పుడే తొక్కిసలాట జరిగిందని ఎస్సీ నివేదిక కూడా ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కమిషనేమో సీఎం వెళ్లిన తర్వాత జరిగిందని చెబుతోందన్నారు. పుష్కరాల మరణాలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. లేని ముహూర్తం పెట్టి.. ప్రచార యావతో 30 మందిని పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ ప్రమాదంపై చంద్రబాబుకి కనీసం మానత్వం కూడా లేదని విమర్శించారు. సీఎం స్నానం చేసే దృశ్యం డాక్యుమెంటరీ కోసం డైరెక్టర్ బోయపాటి బృందంతో ఏర్పాట్లు చేశారన్నారు. కమిషన్ రిపోర్ట్లో ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉందని, ప్రజలకు ఇంగితం లేదని సోమయాజులు ఎలా అంటారని ప్రశ్నించారు. అలాంటి రాతలు రాయటానికి చేతులెలా వచ్చాయని మండిపడ్డారు. తొక్కిసలాట ఫుటేజ్ తొక్కేశారని, సోమయాజులు అనే వ్యక్తికి గోదావరి గుణపాఠం తప్పదన్నారు. గోదావరి ఆయనను క్షమించదని, ఈ నివేదికను తమపార్టీ వ్యతిరేకిస్తుందని.. ఈ ఘటనపై తమ పోరాటం కోనసాగుతుందని స్పష్టం చేశారు. -
పుష్కరాల మరణాలకు చంద్రబాబే కారణం
-
‘షార్ట్ ఫిల్మ్ కోసమే వారిని బలితీసుకున్నారు’
సాక్షి, అమరావతి : గోదావరి పుష్కరాల సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుతో షార్ట్ ఫిల్మ్ తీయించాలని 29మంది భక్తుల చావుకు కారణమయ్యారని వైఎస్సార్ సీపీ నేత కురసాల కన్నబాబు ఆరోపించారు. జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక.. తప్పంతా భక్తులదే.. మూడ నమ్మకంతో అంతమంది అక్కడికి వెళ్లటం వల్లే ప్రమాదం జరిగిందనటంపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవటమే ప్రజలు చేసిన పెద్ద తప్పిదంగా ఆయన అభివర్ణించారు. కీర్తి ఖండూతి, పబ్లిసిటీ యావ ఉన్న చంద్రబాబు లాంటి నాయకుడు ఈ ప్రపంచం అంతా వెతికినా కనపడరని అన్నారు. చంద్రబాబు వీఐపీ ఘాట్లో కాకుండా పుష్కర ఘాట్లో ఎందుకు స్నానం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సీసీ కెమెరాల ఫోటేజీలను మాయం చేసి, మూడు సంవత్సరాలు కాలయాపన చేసి తూతూ మంత్రంగా ఒక నివేదికను ఇచ్చారని మండిపడ్డారు. బాధితులపై బండలేసే పరిస్థితి అమరావతి : గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన ప్రమాదానికి భక్తుల మూడనమ్మకమే కారణమనటాన్ని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తప్పుబట్టారు. ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోకుండా బాధితులపై బండలేసే పరిస్థితి ఉందని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం.. మానవత్వం లేని ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదకను తొక్కిపట్టి కొత్త నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కలెక్టర్ ఇచ్చిన నివేదిక చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండటం వల్లే కలెక్టర్కు మొట్టికాయలు వేసి నివేదికను తొక్కిపట్టారని అన్నారు. ప్రచార ఆర్భాటం వల్లే 29మంది ప్రాణాలు గాల్లోకి.. అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రచార ఆర్భాటం వల్లే గోదావరి పుష్కర సమయంలో 29మంది ప్రాణాలు గాల్లోకి కలిసిపోయాయని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. కేవలం కంటితుడుపు చర్యగా మాత్రమే కమిషన్ వేశారని అన్నారు. ప్రమాద సమయంలో అత్యవసర వైద్యం అందకపోవటం వల్లే అంతమంది చనిపోయారని పేర్కొన్నారు. చంద్రబాబే తప్పుచేసి ఎవరి తప్పలేదన్నట్లు చూపిస్తున్నారని మండిపడ్డారు. -
పుష్కర తొక్కిసలాటకు బాధ్యులెవరు!?
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఒకే చోట వీఐపీలందరూ స్నానం చేయాలన్న కారణంతో పోలీసులు సాధారణ భక్తులను ఆపేశారు. ఫలితంగానే తొక్కిసలాట జరిగింది’ అని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటపై జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలోనే ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీనిపై గురువారం మంత్రివర్గ సమావేశంలోనూ చర్చ జరిగింది. దీంతో ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని తేలిపోయింది. వీఐపీలందరికీ ప్రత్యేకంగా రాజమహేంద్రవరంలోనే సరస్వతీ ఘాట్ను కేటాయించినా.. సీఎం, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులందరూ ప్రజలకు కేటాయించిన పుష్కరఘాట్లో స్నానం చేశారు. షార్ట్ ఫిల్మ్ తీయాలని, అందులో భారీగా ప్రజలు కనిపించాలనే లక్ష్యంతో వారిని పుష్కర ఘాట్కు మళ్లించారు. మార్గదర్శకాల అమల్లో విఫలం.. మార్గదర్శకాల ప్రకారం.. విపరీత రద్దీ ఏర్పడకుండా నిర్దేశిత ప్రాంతాల్లో భక్తులను నిలువరించాలి. ఇతర ఘాట్లకు మళ్లించాలి. ఘాట్లలో ప్రతి 50 మీటర్లను కంపార్ట్మెంట్లుగా విడగొట్టాలి. సీసీ టీవీలు ఏర్పాటు చేసి 72 గంటల రికార్డును ఉంచుకోవాలి.. కానీ ఇవేమీ అధికారులు చేయలేదు. పైగా పుష్కరఘాట్కు ప్రజలను మళ్లించారు. పూజ చేసిన అనంతరం సీఎం చంద్రబాబు ప్రజలకు అభివాదం చేసిన సమయంలో భారీగా జనం షార్ట్ ఫిల్మ్లో కనిపించాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు స్పష్టమవుతోంది. కానీ వాస్తవాలు బయటకొస్తాయన్న కారణంతోనే నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ చిత్రీకరించిన సార్ట్ఫిల్మ్ను నేటికీ విడుదల చేయలేదు. అంబులెన్స్ వచ్చేందుకు దారిలేదు.. ఘాట్లలో అంబులెన్స్లు వచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లుండాలని మర్గదర్శకాల్లో ఉన్నా.. అలాంటివేం జరగనట్లు స్పష్టమవుతోంది. ఉదయం 8 గంటల సమయంలో తొక్కిసలాట జరగ్గా 9.15 గంటలకు మొదట బాధితుడిని ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు అంబులెన్స్ లాగ్బుక్లో పేర్కొన్నారు. సరైన సమయంలో అంబులెన్సులు వచ్చి ఉంటే.. పలువురు బతికేవారని చెబుతున్నారు. ఎవరిని బాధ్యులను చేస్తారు! పుష్కరఘాట్లో వీఐపీల స్నానానికి అనుమతించిందెవరు? షార్ట్ ఫిల్మ్ కోసం గంటల తరబడి ప్రజలను ఆపిందెవరు? ఎవరి ఆదేశాలతో ఆపారు? దాదాపు మూడేళ్ల తర్వాత కమిషన్ తన విచారణ పూర్తి చేసి నివేదిక ఇచ్చింది. మరి బాధ్యులను ఎవరిని చేస్తారు? ఎవరిపై చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మార్గదర్శకాలు అమలు చేయకే.. పుష్కరాల నిర్వహణ మార్గదర్శకాలకు భిన్నంగా వ్యవహరిచండంతోనే తొక్కిసలాట జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – ముప్పాళ్ల సుబ్బారావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బాబు ప్రచార యావే భక్తులను పొట్టనపెట్టుకుంది.. చంద్రబాబు ప్రచార యావ భక్తులను పొట్టన పెట్టుకుంది. 29 మంది చనిపోవడానికి సీఎం చంద్రబాబే కారణమని తేలింది. – జక్కంపూడి విజయలక్ష్మి, న్యాయవాది, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు -
మూడేళ్ల క్రితం ఇదే రోజున..
మండపేట: మూడేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు గోదావరి పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చి సర్కారు ప్రచార దాహంకారణంగా తొక్కిసలాటలో చిక్కుకుని 29 మంది బలయ్యారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 2015 జూలై 14న పుణ్యస్నానాల కోసం రాజమహేంద్రవరం వచ్చిన 29 మంది సీఎం చంద్రబాబు ప్రచార యావ కారణంగా మృత్యువాత పడ్డారు. 52 మంది గాయాలపాలయ్యారు. పుష్కర ఘాట్లో తాను నిర్వహించే పూజలను చిత్రీకరించి ప్రచారం చేసుకోవాలన్న సీఎం తాపత్రయమే అమాయకుల ప్రాణాలను బలిగొంది. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు రెండు గంటలకు పైగా ఘాట్లోనే ఉండిపోవడంతో రద్దీ పెరిగింది. షూటింగ్ పూర్తయిన అనంతరం చంద్రబాబు వెళ్లాక ఒక్కసారిగా భక్తులను వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకుని మృత్యువాత పడ్డారు. దీనిపై నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం నియమిచిన జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. 19 మంది గిరిజనులు జలసమాధి ఈ ఏడాది మే 15న దేవీపట్నం మండలం మంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా వాడపల్లి మధ్య గోదావరిలో లాంచీ తిరగబడిన సంఘటనలో 19 మంది గిరిజనులు జలసమాధి అయ్యారు. పడవ ప్రయాణాలకు సంబంధించి నిబంధనల అమలులో వైఫల్యం, లాంచీ యజమాని నిర్లక్ష్యం ప్రమాదానికి కారణంగా గుర్తించారు. లాంచీ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి నాలుగు రోజులు హడావుడి చేసినా తర్వాత పరిస్థితి షరా మామూలే అయింది. కాలిపోయిన పర్యాటక బోటు పాపికొండల అందాలను తిలకించేందుకు గత మే 11వ తేదీన పర్యాటకులు పడవలో వెళ్తుండగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సరంగు సమయస్ఫూర్తితో ప్రాణ నష్టం తప్పింది. షార్ట్ సర్కూట్ వల్ల ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. పర్యాటక బోటులో గ్యాస్ సిలిండర్, కిరోసిన్ తదితర నిషేధిత వస్తువులు ఉండకూడదని నిబంధనలు పేర్కొంటున్నా పాటించడం లేదు. నాడు కృష్ణాలో... సాక్షి, విజయవాడ: ప్రకాశం జిల్లా ఒంగోలు వాకర్స్ క్లబ్కు చెందిన దాదాపు 60 మంది సభ్యులు గత ఏడాది నవంబర్ 12న అమరావతి వెళ్లి అక్కడ దైవ దర్శనం తరువాత విజయవాడకు వచ్చారు. భవానీ ద్వీపం చూసిన తరువాత పున్నమీ ఘాట్కు చేరుకున్నారు. అక్కడి నుంచి కృష్ణా, గోదావరి నదులు కలిసే పవిత్ర సంగమం వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చీకటి పడడంతో ఏపీ పర్యాటక శాఖకు చెందిన బోటు వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో రివర్ బోటింగ్ అండ్ అడ్వెంచర్ సంస్థకు చెందిన ప్రైవేట్ బోటు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.300 తీసుకుని 38 మందితో బయల్దేరింది. కృష్ణా–గోదావరి నదులు కలిసే ప్రదేశం వద్దకు వచ్చే సరికి బోటు పెద్ద కుదుపునకు గురైంది. ఏం జరుగుతోందో తెలిసేలోపే ఒక వైపునకు ఒరిగిపోయింది. బోటులోని వారంతా నదిలో పడిపోయారు. ఈత వచ్చిన వారు ఈదుకుంటూ నది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడే ఉన్న జాలర్లు కొంతమందిని రక్షించారు. చివరికి 22 మంది జలసమాధి అయ్యారు. -
ఆ మహా ఘోరానికి మూడేళ్లు
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 29 మంది 2015 గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. 52 మంది గాయాలపాలయ్యారు. మహా పుష్కరాల పేరుతో తొలిరోజే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార ఆర్భాటం కారణంగా జరిగిన ఈ దుర్ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ దుర్ఘటన జరిగి నేటికి మూడేళ్లయినా.. ఈ ‘మహా’పాపానికి గల కారణాలు, దోషులెవ్వరనేది ఇంకా తేలలేదు. ఈ నిజాలను నిగ్గు తేల్చేందుకు వేసిన ఏక సభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పటి వరకూ చంద్రబాబు సర్కారు బహిర్గతం చేయలేదు. రాజమహేంద్రవరం క్రైం: ‘మహా’ ఘోరం జరిగి నేటికి మూడేళ్లు పూర్తయ్యింది. 2015 జూలై 14న గోదావరి మహా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారయావ కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 52 మంది గాయాలపాలయ్యారు. మహా పుష్కరాల పేరుతో నెలల తరబడి ప్రచారం నిర్వహించింది చంద్రబాబు సర్కారు. మరోవైపు ఆ ప్రచారాన్ని తన లబ్ధి కోసం వినియోగించుకునేందుకు సినిమా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్కు పుష్కర క్రతువును చిత్రీకరించే బాధ్యత అప్పగించారు. ఈ నేపథ్యంలో పుష్కర ఘాట్లో తన కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర స్నానం ఆచరించి సుమారు రెండు గంటలకు పైగా ఘాట్లోనే ఉండిపోవడంతో పుష్కర ఘాట్ జన సంద్రమైంది. ప్రజలు పుష్కర స్నానం ఆచరించడానికి తీవ్ర జాప్యం జరగడం, పుష్కర ఘాట్ సమీపంలో గోదావరి రైల్వేస్టేషన్, గోకవరం బస్టాండ్ల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఘాట్కు చేరుకోవడం, ఒకేసారి ఏడు రైళ్లు గోదావరి రైల్వే స్టేషన్కు చేరడం తదితర కారణాల వల్ల ఘాట్ పూర్తిగా లక్షలాది మంది భక్తులతో నిండిపోయింది. వీఐపీ ఘాట్(సరస్వతీ ఘాట్) ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రులు, రాష్ట్ర అధికారులు మొత్తం 20కి పైగా వాహనాల కాన్వాయి ఘాట్లో గంటల తరబడి ఉండిపోవడంతో ప్రజలు విపరీతంగా పెరిగిపోయారు. తెల్లవారు జాము నుంచి ఘాట్లోకి వదలకుండా ముఖ్యమంత్రి తన పుష్కర స్నానం ముగించుకొని వెళ్లగానే భక్తులను ఘాట్లోకి అనుమతించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి మొత్తం 29 మంది అక్కడికక్కడే మృతి చెందగా 52 మంది గాయాలపాలయ్యారు. నిజాయితీ నిరూపించుకునేందుకు కమిషన్ సంఘటన జరిగిన ఏడాది తరువాత ప్రభుత్వం తన తప్పులేదని, ప్రజల తప్పే అని నిరూపించుకునేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సోమయాజులుతో ఏకసభ్య కమిషన్ను వేసింది. ఈ కమిషన్ రాజమహేంద్రవరం ఆర్ అండ్బీ అతిథి గృహంలో అనేక సార్లు బహిరంగ విచారణ జరిపినా ప్రభుత్వ శాఖలు సమాచార శాఖ, పర్యాటక శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ, తదితర శాఖలు తమ వద్ద ఉన్న ఆధారాలు, వీడియో క్లిప్పింగ్లు, నివేదికలు సమర్పించడంలో కమిషన్కు సహకరించలేదు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య నమోదు చేయడంలో ఒక శాఖకు, మరో శాఖకు పొంతన లేకుండా ఉంది. ఆ వీడియోలు బయటపెట్టని ప్రభుత్వం పుష్కర క్రతువు జరుగుతున్న తీరును ప్రపంచానికి చూపించాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ జియోగ్రఫీ ఛానల్తో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.40 లక్షల వ్యయంతో చిత్రీకరించేందుకు ఆ చానల్ ఒప్పందం కుదుర్చుకొని భారీస్థాయిలో పుష్కర ఘాట్లో చిత్రీకరణ చేశారు. ఈ ఛానల్తో పాటు ప్రైవేటు చానళ్లు, ఘాట్లో ఏర్పాటు చేసిన సీసీ, డ్రోన్ కెమెరాల ద్వారా పెద్ద ఎత్తున చిత్రీకరణ చేశారు. అయితే తొక్కిసలాట దుర్ఘటన జరిగిన తరువాత నేషనల్ జియోగ్రఫీ ఛానల్చిత్రీకరించిన ఫుటేజీ, ఇతర శాఖలు చిత్రీకరించిన ఫుటేజీని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు. గుట్టు బయట పెట్టాలి ఈ సంఘటనకు కారకులు ఎవరో బయట పెట్టాలి. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ తీసిన ఫుటేజీ బయటకు రాకుండా అడ్డుకుంటున్న వారు ఎవరో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి. పుష్కర తొక్కిసలాటకు కారకులైన వారిపై కేసులు పెట్టాలి. కమిషన్ గడువు పొడిగించి వాస్తవాలు బయటకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.– ముప్పాళ్ల సుబ్బారావు,రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గడువు పెంచరు.. నివేదిక బయటకు రాదు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ సోమయాజులు కమిషన్ గడువు ముగిసి ఏడాది పూర్తయినా ప్రభుత్వం కమిషన్ గడువు పొడిగించకపోవడంతో కమిషన్ నివేదిక బయటకు రావడం లేదు. కమిషన్ గడువు పొడిగిస్తే నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం తన తప్పులు బయట పడతాయనే ఉద్దేశంతో కమిషన్ కడువు పొడిగించడం లేదు. దీంతో కమిషన్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత మంది మృతికి, గాయాలు పాలైన సంఘటనలో ఏవరు దోషులనేది బయటపడకుండానే మిగిలిపోయింది. ఇప్పటికీ పోలీస్ శాఖ చార్జ్ షీటు దాఖలు చేయని స్థితిలో ఉంది. ప్రగల్భాలు పలికే చంద్రబాబు తన నిజాయితీ నిరూపించుకోవాలంటే తక్షణం కమిషన్ గడువు పొడిగించాలి. ప్రజల సొమ్ము లక్షలాది రూపాయల వ్య యంతో నేషనల్ జియోగ్రఫీ ఛానల్తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ఆ ఛానల్ వారు పుష్కరాల కోసం చిత్రీకరించిన ఫుటేజీని బయట పెట్టాలి. -
విచారణ ’పుష్కర’కాలం కొనసాగుతోంది
-
సోమయాజులు కమిషన్ విచారణ గడువు పెంపు
రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల మొదటి రోజు రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్లో జరిగిన తొక్కిసలాటపై విచారణ జరుపుతున్న జస్టిస్ సీవై సోమయాజులు ఏకసభ్య కమిషన్ గడువును ప్రభుత్వం మూడోసారి పెంచింది. రెండోసారి పెంచిన గడువు సెప్టెంబర్ 29తో ముగియడంతో 2017 జనవరి 29 వరకు నాలుగు నెలలపాటు పొడిగిస్తూ ఈనెల 25న ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జూలై 14న తొక్కిసలాట ఘటన చోటుచేసుకుని 29మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన మూడు నెలల తర్వాత అక్టోబర్ 15న విచారణ కమిషన్ను నియమించి 2016 మార్చి 29కి విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. అయితే పలుమార్లు విచారణ చేపట్టిన కమిషన్కు ప్రభుత్వ అధికారులు ఆధారాలు సమర్పించకపోవడం వల్ల గడువులోపు విచారణ పూర్తి కాలేదు. ఈ విషయాన్ని పిటిషనర్లు ఎప్పటికప్పడు కమిషన్ దృష్టికి తీసుకొస్తూ అవసరమైన ఆధారాలు సమర్పించేలా ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఆధారాలు సమర్పించలేదు. సీసీ కెమెరాల రికార్డులు, పుష్కరఘాట్ వద్ద వీఐపీ కాన్వాయ్ రావడానికి అనుమతి ఎవరు ఇచ్చారు, రోడ్లు భవనాల శాఖ ఏర్పాటు చేసిన బారికేడ్లు ఎవరు తొలగించారు వంటి వివరాలను కమిషన్ కు సమర్పించాల్సి ఉంది. సీఎం చంద్రబాబు గంటలపాటు పుష్కరఘాట్లో ఉండడమే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణమని పిటిషనర్లు వాదిస్తుండగా ఘటన జరిగిన సమయంలో అక్కడి పరిస్థితులు కూడా ఇందుకు బలం చేకూరుస్తుండడంతో ప్రభుత్వం కావాలనే విచారణను సాగదీస్తోందన్న ఆరోపణలు బలపడుతున్నాయి. మొదటిసారి గడువు పెంచిన ప్రభుత్వం నెల తర్వాత జీవో జారీ చేసింది. రెండో దఫా జూన్ 29న గడువు ముగియగా ఈసారి దాదాపు నెల తర్వాత ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పడు తాజాగా సెప్టెంబర్ 29తో సమయం ముగియగా 26 రోజుల తర్వాత జీవో జారీ చేసింది. ఇలా గడువు పెంచిన ప్రతిసారీ నెల రోజులపాటు సమయం వృథా అయ్యేలా ప్రభుత్వం వ్యవహరించడం విచారణపై ప్రభుత్వ నాన్చివేత ధోరణికి అద్దం పడుతోందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. -
విచారణ కొలిక్కి రాకుండానే ముగిసిన గడువు
-
ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్!
అక్షర తూణీరం ‘‘గొప్పోడు నవ్వడు, నవ్విస్తాడు. గొప్పోడు ఏడవడు, ఏడిపిస్తాడు. అయినా, వడ్డించేవాడు తింటాడేంటిరా’’ అని మరోసారి సర్ది చెప్పాడు సాటి మిత్రుడు. రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి ముఖతా ‘‘ఆనంద ఆంధ్రప్రదేశ్’’ ఆవిష్కృతమైంది. అంతకు ముందు దోమరహిత రాష్ట్రంగా చేయాలని నిర్భయంగా తీర్మానించారు. దానికిముందు కరువు రహిత రాష్ట్రంగా చేయడానికి కంకణ బద్ధులైనారు. చక్కని ఆలోచనలు చేస్తున్నారు. వింటుంటే పిచ్చి సంతోషంగా ఉంది. మన నేత ఏమి చెయ్యలేరో చెప్పడం కష్టం. ఆయన తలచుకుంటే డ్రోన్లతో దోమలకు పొగ పెట్టగలరు. ఆనంద ఆంధ్రప్రదేశ్లో భాగంగా పుష్కరాల రేవుల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు గజ్జెలు కట్టి, తెరలు తీయనున్నారు. ఒకవైపు నాట్యాలు, ఇంకోవైపు గాన గోష్ఠులు, ఆవైపు కవి సమ్మేళనాలు, ఈవైపు జానపద కళారీతులు - కృష్ణా తరంగాలు నవరసా లొలికిస్తూ సాగిపోతుంటాయి. మల్టీఫ్లెక్స్లు వచ్చి వాలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే అవి రెక్కలు తొడుక్కుని అమరా వతి పరిసరాల్లో వాలడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరూ ఆనందంగా ఉండాలన్నదే నిన్నటి మానిఫెస్టో లక్ష్యం. ఉద్యోగులు, శ్రామికులు, మరీ ముఖ్యంగా రైతులు ఆడుతూ పాడుతూ పనులు చేసుకోవాలి. ముఖ్యంగా ట్రాఫిక్ కానిస్టేబుళ్లు మన తెలుగువారి సొంత సంప్రదాయమైన కూచిపూడి బాణీలో వారి సొంత సంప్రదాయమైన కూచిపూడి బాణీలో వీధి కూడళ్ల దగ్గర సిగ్నల్స్ ఇస్తే కళాత్మకంగా ఉంటుంది. అవసరమైతే వారందరికీ సామూహిక శిక్షణ ఇప్పిస్తాం. ‘‘ఆనందమే బ్రహ్మ. ఆనందమే విష్ణువు. ఆనందమే యన్టీఆర్.’’ ఈ మూడోది నేవిన్లేదని ఒక రిక్షా కార్మికుడు వాదనకి దిగాడు. ‘‘ఇప్పుడు విన్నా వుగా’’ అంటూ సర్ది చెప్పాడు సాటి మిత్రుడు. ‘‘నవ్వులో ఆనందం ఉంది. అదే విధంగా ఆనందంలో నవ్వు ఉంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండాల’’ అనగానే ‘‘ఆయన నవ్వడం నేనెప్పుడూ చూడనేలేదురా’’ అన్నాడు నిష్టురంగా. ‘‘గొప్పోడు నవ్వడు, నవ్విస్తాడు. గొప్పోడు ఏడవడు, ఏడిపిస్తాడు. అయినా, వడ్డించేవాడు తింటాడేంటిరా’’అని మరోసారి సర్ది చెప్పాడు. ‘‘ఇది కాదుగాని, చూడగా చూడగా ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్గా మారి పోతోందని నాకు సందేహంగా ఉందండీ’’ అంటూ ఒక పెద్దాయన ఇంద్రకీలాద్రి మొగలో నిలబడి టాపిక్ మార్చాడు. ‘‘అదెలాగ’’ అన్నాను. గోదావరి పుష్కరాలు మహోధృతంగా సాగినాయి. నెల్లాళ్లు ఆధ్యాత్మిక శోభ. దర్భలు, పిండాలు, స్నానాలతో గడిచింది. ఆనక కృష్ణా పుష్కరం. పైగా గోదావరి అంత్య పుష్కరం వచ్చి పడింది. ఆ రెండు పుణ్యనదులు బాబుగారి పుణ్యమా అని సంగమించి మహాతీర్థమై కూచుంది. ఇదంతా ఒక నెలపాటు శ్రాద్ధ విధులతో, మంత్రాలతో తల్లడిల్లింది. రకరకాల హారతులతో మహానది వెలిగిపోయింది. ఇంతలో వినాయక ఉత్సవాలు ఓ రెండువారాలు భక్తిలో జనాన్ని ముంచెత్తాయి. ఆ పందిళ్లలోనే ఇప్పుడు అమ్మవారిని నిలుపుతున్నారు. శరన్నవరాత్రులు! ఇక కొండ మీదా సందడే. కొండకిందా సందడే. ఆయన సామాన్యుడు కాదు. అవసరమైతే బోలెడు కొత్త పండుగలు పుట్టించి ఆధ్యాత్మికాంధ్రప్రదేశం చేయడం ఖాయం’’ అంటూ అక్కడనించే దుర్గమ్మకి దణ్ణం పెట్టాడు. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) - శ్రీరమణ -
రోడ్డెక్కిన పుష్కర పనుల కాంట్రాక్టర్లు
నరసాపురం : గోదావరి పుష్కరాల్లో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఆందోళనబాట పట్టారు. సోమవారం నరసాపురంలో రిలే దీక్షలు ప్రారంభించారు. పనులు పూర్తి చేసి ఏడాది దాటినా ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో తాము అప్పుల ఊభిలో కూరుకుపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు గుత్తుల సత్యనారాయణ, కోటిపల్లి దొరయ్య, గోరు సత్తిబాబు మాట్లాడుతూ పుష్కరాల సమయంలో తక్కువ సమయంలో పనులు పూర్తి చేయాల్సి వచ్చిందని, అధికారుల ఒత్తిడి కారణంగా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశామని, పుష్కరాలు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లిస్తామని చెప్పడంతో రూ.లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పనులు చేశామని, పనులు పూర్తి చేసి 14 నెలలు అయినా బిల్లులు ఇవ్వకపోవడంతో తెచ్చిన అప్పుల కంటే వడ్డీలు ఎక్కువయ్యాయని వాపోయారు. సుమారు రూ. 7 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని చెప్పారు. తొలిరోజు దీక్షలో కాంట్రాక్టర్లు యర్రంశెట్టి పార్ధసారధి, గుగ్గలపు శివరామకృష్ణ, అడబాల బాబులు, యాతం పెద్దిరాజు, చినిమిల్లి మురళీకృష్ణ, కంబాల మామాజీ, ఆచంట మూర్తి, కొండ్రెడ్డి బాబు, పెరికల హరిబాబు తదితరులు కూర్చున్నారు. వైఎస్సార్ సీపీ మునిసిపల్ ఫ్లోర్లీడర్ సాయినాథ్ ప్రసాద్ తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. -
పుష్కరాల పుణ్యం.. అందని భత్యం!
⇒ పుష్కర విధులకు వెళ్లిన అధికారులకు అందని భత్యం ⇒ గోదావరి పుష్కరాలకు ఏడాది ⇒ పంపేశామంటున్న ఉన్నతాధికారులు ⇒ రాలేదంటున్న జిల్లా అధికారులు ⇒ బాధ నేరుగా చెప్పుకోలేక ఆకాశ రామన్న ఉత్తరాలు పన్నెండేళ్లకోమారు పుష్కరాలు వస్తే... ఒక్క మునకతోనే పుణ్యం వస్తుందంటూ వేలాదిమంది పరుగులు పెడతారు. అదే డెప్యుటేషన్పై విధి నిర్వహణ నిమిత్తం వెళ్లినవారైతే రోజూ మునకలు చేయొచ్చు. ఇక వారికి లెక్కనేనంత పుణ్యం లభిస్తుందనుకున్నారో ఏమో.. వారికివ్వాల్సిన భత్యం మాత్రం చెల్లించలేదు. గోదావరి పుష్కరాలకు ఏడాది పూర్తయ్యాయి. తాజాగా కృష్ణా పుష్కరాలు ముగిసిపోయాయి. కానీ నాటి భత్యం గురించి మాత్రం నోరు మెదపడంలేదు. డబ్బులిచ్చేశామని ఉన్నతాధికారులు చెపుతుండగా.. రాలేదని ఇక్కడి అధికారులు సెలవిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆకాశరామన్న ఉత్తరం ద్వారా ఉద్యోగులు తమ విలాపం తెలియజేశారు. గత ఏడాది గోదావరి పుష్కరాలు.... ఈ ఏడాది కష్ణాపుష్కరాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. కోట్లాదిరూపాయలు ఖర్చుచేసి విస్తతంగా చేపట్టిన ప్రచార పుణ్యమాని ఎక్కడెక్కడినుంచో జనం వెళ్లి మునకలు పూర్తి చేశారు. వారికి పుణ్యఫలం దక్కిందో లేదోగానీ... అక్కడి సేవలందించే తహసీల్దార్లు... ఉపతహసీల్దార్లకు మాత్రం గత ఏడాది నిర్వహించిన పుష్కరసేవల భత్యం ఇప్పటికీ అందలేదు. అదేంటి? ఎంతో ఖర్చు చేసిన పెద్ద కార్యక్రమ బాధ్యతను తమ భుజస్కంధాలపై మోసిన అధికారులకు ఇంకా భత్యం చెల్లించలేదా అని ఆశ్చర్యపోతున్నారా? విషయమేమంటే ఆ నిధులు పంపించేశామని విజయవాడలోని ఉన్నతాధికారులు చెబుతుంటే అసలు రాలేదని ఇక్కడి అధికారులు చెప్పడం విశేషం. మిగతా జిల్లాలవారికి అందినా.. గతేడాది నిర్వహించిన గోదావరి పుష్కరాల్లో సేవలకు ఇక్కడినుంచి పదిమంది తహసీల్దార్లు, మరో 15మంది ఉప తహసీల్దార్లు రెండు రోజుల ముందే అక్కడకు వెళ్లారు. పుష్కరాలు ముగిశాక ఇక్కడకు వచ్చిన వారంతా తమకు రావాల్సిన టీఏ, డీఏలకోసం బిల్లులు పెట్టుకున్నారు. కానీ ఒక్క అధికారికీ పైసా కూడా ఇవ్వలేదు. మిగతా జిల్లాల అధికారులకు మాత్రం ఈ బిల్లులు అందినా... ఇక్కడివారికి ఎందుకో ఇవ్వలేదు. ఇప్పటికీ వాటికోసం అడుగుతున్న అధికారులకు డబ్బులు రాలేదన్న సమాధానమే వస్తోంది. ఒక్కొక్కరికీ సుమారు రూ. 5వేలకు పైగానే చెల్లించాల్సి ఉంది. పలుమార్లు అడుగుతున్నా లేదన్న సమాధానం రావడంతో కొందరు తహసీల్దార్లు తూర్పు, పశ్చిమగోదావరి కలెక్టరేట్ను సంప్రదించగా.. వారు ఆ డబ్బులు ఎప్పుడో డ్రాఫ్ట్ తీసి జిల్లాకు పంపించేసినట్టు చెప్పారని తెలుసుకున్నారు. అయితే ఇక్కడి ఉన్నతాధికారులను అడగలేక ఓ ఆకాశ రామన్న ఉత్తరం రాశారు. పేరు పొందుపరచకుండా వెంటనే డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జిల్లా మంత్రి మణాళిని, ఇన్చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్ వివేక్ యాదవ్, మీడియా ప్రతినిధుల పేరున ఆ లేఖలు పంపించారు. ఇలా గోదావరి పుష్కరాల్లో సేవలందించిన జిల్లాకు చెందిన వారికి సుమారు రూ. 10లక్షలు ఇంకా చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాత్రీ పగలు నిద్రలు లేనిరాత్రులు కూడా గడిపి సేవలందిస్తే కష్ణా పుష్కరాలు కూడా వచ్చి వెళ్లిపోయినా ఇంకా నిధులు రాలేదని చెప్పడంపై వీరు మండిపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత కలెక్టర్ వివేక్ యాదవ్ ఈ బిల్లులు వచ్చాయా? రాలేదా? అన్న అంశంపై కొద్దిపాటి విచారణ చేస్తే విషయం తెలుస్తుంది. అప్పుడయినా వీరికి బిల్లులు అందే అవకాశం లేకపోలేదని సంబంధిత అధికార వర్గాలు భావిస్తున్నాయి.