పుష్కర తొక్కిసలాటలో గాయపడిన మహిళ మృతి | Woman dies who injured in Godavari pushkaralu stampede | Sakshi
Sakshi News home page

పుష్కర తొక్కిసలాటలో గాయపడిన మహిళ మృతి

Jul 31 2015 3:07 PM | Updated on Sep 3 2017 6:31 AM

గోదావరి పుష్కరాల మొదటి రోజు రాజమండ్రి పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఓ మహిళ శుక్రవారం కన్నుమూసింది.

బాడంగి (విజయనగరం) : గోదావరి పుష్కరాల మొదటి రోజు రాజమండ్రి పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఓ మహిళ శుక్రవారం కన్నుమూసింది. విజయనగరం జిల్లా బాడంగి మండలం తాల్తేరు గ్రామానికి చెందిన పూడి తారమ్మ(65) కుటుంబ సభ్యులతో కలసి పుష్కర స్నానం కోసం రాజమండ్రి వెళ్లింది.

ఆ రోజు జరిగిన ఘోర తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా ఆ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన వారిలో తారమ్మ కూడా ఉన్నారు. అప్పటి నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారమ్మ పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement