Vizianagaram
-
విజయనగరం జిల్లాలో టీడీపీ - జనసేన నేతల కొట్లాట
-
విజయనగరం జిల్లా రాజాంలో టీడీపీ గూండాల అరాచకం
-
బతకాలంటే భయమేస్తోందమ్మా.. నన్ను క్షమించు తమ్ముడు ...
నెల్లిమర్ల: తమ కుమారుడు వైద్య వృత్తిలో స్థిరపడతాడని ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోయారు. మరికొన్ని రోజుల్లో ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకుని, రోగులతో పాటు తమకు కూడా వైద్యసేవలు అందిస్తాడని ఆశ పడ్డారు. అయితే వారి ఆశలు ఆడియాసలయ్యాయి. చేతికి అందివచ్చిన కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం నుంచి బ్యాక్లాగ్స్ ఉండిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు, సహ విద్యార్థులు అందించిన వివరాల ప్రకారం.. నెల్లిమర్ల పట్టణంలో ఉన్న మిమ్స్ వైద్య కళాశాలలో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన అతుకూరి సాయి మణిదీప్(24) ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం కళాశాల ప్రాంగణంలో ఉన్న హాస్టల్ గదిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్లో పురుగుల మందు తెప్పించుకుని, కూల్ డ్రింకులో కలుపుకుని తాగా డు. విషయం తెలుసుకున్న సహ విద్యార్థులు విషయాన్ని మిమ్స్ యాజమాన్యానికి తెలియజేశారు. యాజమాన్య ప్రతినిధులు నెల్లిమర్ల పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ గణేష్ తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాయి మణిదీప్ బెడ్ కింద పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. చదువు విషయంలో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సదరు నోట్లో మృతుడు ప్రస్తావించాడు. బ్యాక్ లాగ్స్ ఎక్కువగా ఉండటం, చదువుపై ఏకాగ్రత లేకపోవడంతో చనిపో తున్నట్లు రాసాడు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గణేష్ తెలిపారు. -
తవ్వేస్తాం.. దోచేస్తాం అంటున్న తెలుగు తమ్ముళ్లు!
-
విజయనగరంలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల సందడి (ఫొటోలు)
-
విజయనగరంలో ‘క’ సినీ హీరో కిరణ్ అబ్బవరం సందడి (ఫొటోలు)
-
భోగాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,విజయనగరంజిల్లా: భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం(నవంబర్30) ఘోర ప్రమాదం జరిగింది.శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళుతున్న కారు అదుపుతప్పింది.దీంతో కారు డివైడర్ మీదుగా పల్టీ కొట్టి పక్కరోడ్డుపైకి దూసుకెళ్లింది.అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. -
కూటమి ప్రభుత్వంపై YSRCP ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్
-
ఇద్దరు చిన్నారులు, వివాహితపై అత్యాచారయత్నం
పూసపాటిరేగ/బేతంచర్ల/సాక్షి టాస్క్ఫోర్స్: అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులపై, వివాహితపై మానవ మృగాలు అత్యాచారానికి యతి్నంచాయి. ఈ ఘటనలు విజయనగరం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలం, పతివాడ గ్రామానికి చెందిన మైనపు హరీశ్ (19) గ్రామ పాఠశాల వెనుకభాగంలో సోమవారం పశువులను మేపుతున్నాడు. అటుగా వెళ్తున్న ఇద్దరు బాలికలను పిలిచి మంచినీళ్లు తీసుకురావాలని కోరాడు.వారిద్దరు సమీపంలోని నిందితుడి ఇంటికెళ్లి మంచినీళ్లు తీసుకొచ్చారు. వారిలో ఓ చిన్నారి (5)ని ఉండమని లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో భయపడిన అతడు, చిన్నారిని ఇంట్లో అప్పగించాడు. విషయాన్ని చిన్నారి తన తల్లికి చెప్పడంతో గ్రామపెద్దల సహాయంతో పూసపాటిరేగ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.నంద్యాల జిల్లాలో.. నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గంలోని కొలుములపల్లెకు చెందిన ఏడేళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఆ చిన్నారికి తండ్రి లేడు. తల్లి కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈనెల 7న బాలిక స్కూల్కు వెళ్లలేదు. ఇంటి దగ్గర ఆడుకుంటుండగా గ్రామానికి చెందిన దండగాల్ల ఎల్లయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలకు చుట్టుపక్కల వారు రావడంతో ఎల్లయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివాహితపై టీడీపీ నేత అత్యాచారయత్నం కర్నూలు జిల్లా, గూడూరు మండలం ఆర్.ఖానాపురం గ్రామంలో మంగళవారం పొలం పనులకు వెళ్లిన ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత బోయ గోపాల్ అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. అయితే ఆ మహిళ పెద్దగా కేకలు వేస్తూ తప్పించుకుని ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. అనంతరం భర్తతో కలిసి ఆమె గూడూరు ఎస్ఐ తిమ్మయ్యకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. గతంలోనూ ఇలాంటి దుశ్చర్యలు.. కాగా టీడీపీ నేత గోపాల్ గతంలో కూడా ఇదే గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలపై అత్యాచారాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెప్పారు. వారంతా నిందితుడు గోపాల్కు భయపడి కేసులు పెట్టేందుకు ముందుకు రాలేదని పేర్కొన్నారు. గోపాల్ టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్ మునిస్వామికి స్వయాన మేనల్లుడు. -
ప్రియాన్షు అజేయ సెంచరీ
సాక్షి, విజయనగరం: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలి విజయం కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర జట్టుకు నాలుగో మ్యాచ్లోనూ మెరుగైన ఆరంభం దక్కలేదు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన ఆంధ్ర జట్టు... ఎలైట్ గ్రూప్ ‘బి’లో అట్టడుగున కొనసాగుతోంది. విజయనగరం స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బుధవారం ప్రారంభమైన మ్యాచ్లో టాస్ గెలిచిన ఉత్తరాఖండ్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 232 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాన్షు ఖండూరి (272 బంతుల్లో 107 బ్యాటింగ్; 11 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగగా... మరో ఓపెనర్ అవ్నీశ్ (158 బంతుల్లో 86; 12 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 157 పరుగులు జోడించి ఉత్తరాఖండ్కు బలమైన పునాది వేశారు. 29 ఏళ్ల ప్రియాన్షుకు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇది రెండో సెంచరీ కాగా... శతకం చేసేలా కనిపించిన అవ్నీశ్ను ఆంధ్ర స్పిన్నర్ లలిత్ మోహన్ అవుట్ చేశాడు.ఆ తర్వాత కెప్టెన్ రవికుమార్ సమర్థ్ (30 బ్యాటింగ్; 2 ఫోర్లు) కూడా సాధికారికంగా ఆడాడు. ఎలాంటి తొందరపాటుకు పోకుండా ఆచితూచి ఆడిన ఉత్తరాఖండ్ ఆటగాళ్లు రోజంతా బ్యాటింగ్ చేసిన 2.66 రన్రేట్తో పరుగులు రాబట్టారు. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఉత్తరాఖండ్ను గురువారం ఆంధ్ర బౌలర్లు ఏమాత్రం అడ్డుకుంటారో చూడాలి. స్కోరు వివరాలు ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్: అవ్నీశ్ (సి) షేక్ రషీద్ (బి) లలిత్ మోహన్ 86; ప్రియాన్షు ఖండూరి (బ్యాటింగ్) 107; రవికుమార్ సమర్థ్ (బ్యాటింగ్) 30; ఎక్స్ట్రాలు 9; మొత్తం (87 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి) 232. వికెట్ల పతనం: 1–157, బౌలింగ్: చీపురుపల్లి స్టీఫెన్ 19–6–42–0; శశికాంత్ 18–8–31–0; సత్యనారాయణ రాజు 15–3–50–0; లలిత్ మోహన్ 26–2–83–1; త్రిపురాణ విజయ్ 6–1–15–0; మారంరెడ్డి హేమంత్ రెడ్డి 3–0–6–0. -
జగన్ మామయ్య ఉన్నప్పుడే బాగుంది
-
ప్రభుత్వం సిగ్గుపడాలి: వైఎస్ జగన్
గుర్ల మండలంలో డయేరియాతో 345 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో అంత కంటే ఎక్కువగా దాదాపు 450 మంది చికిత్స పొందారు. ఇప్పటికీ విజయనగరం జిల్లాలోని గరివిడి, గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లో డయేరియా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇంకా 62 మంది చికిత్స పొందుతున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితి ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోగా ఏం చేస్తోంది? ఏదైనా ఇష్యూ జరిగితే దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి.. ఎలా కవరప్ చేయాలి.. అది అసలు జరగనట్లు ఎలా చూపించాలి.. అన్న దిక్కుమాలిన ఆలోచన చేస్తోంది. అందుకు ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తలదించుకోవాలి. – వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీ పాలనలో గ్రామ స్వరాజ్యం సాకారమైతే, కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే పరిస్థితులు ఎంత దారుణంగా మారాయనేదానికి ‘గుర్ల’ డయేరియా ఘటనే నిదర్శనమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. బాధ్యత మరచి దాన్ని కప్పిపుచ్చుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండటం సిగ్గు చేటని మండిపడ్డారు. కనీసం తాగునీటి క్లోరినేషన్ కూడా చేయని ఫలితంగా డయేరియా విజృంభించి విజయనగరం జిల్లా గుర్లలో 14 మంది చనిపోయిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. గురువారం ఆయన మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.మృతికి దారితీసిన పరిస్థితులను, ఇతరత్రా అన్ని వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని అభయమిచ్చారు. ప్రభుత్వం నుంచి పైసా సాయం కూడా అందలేదన్న వారి ఆవేదన విని చలించిపోయారు. వైఎస్సార్సీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. ‘వైఎస్సార్సీపీ పాలనలో గ్రామాల్లో నాలుగు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్స్ కనిపించేవి. అక్కడే రోజంతా, వారంలో ఏడు రోజుల పాటు అక్కడే నివాసం ఉండే సీహెచ్ఓలు కనిపించే వారు. వారికి అనుసంధానంగా ఏఎన్ఎంలు, వారికి రిపోర్ట్ చేస్తూ ఆశ వర్కర్లు కనిపించే వారు. విలేజ్ క్లినిక్స్తో పాటు ఒక పటిష్టమైన వ్యవస్థ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నడిచేది. పీహెచ్సీలు, విలేజ్ క్లినిక్స్ను అనుసంధానం చేసి, పీహెచ్సీల్లో డాక్టర్ల సంఖ్యను పెంచి, ప్రతి గ్రామానికి 15 రోజులకు ఒకసారి డాక్టర్లు వచ్చే వ్యవస్థ ఉండేది. అదే గ్రామంలో నాడు–నేడుతో బాగు పడిన స్కూళ్లలో పిల్లలు నవ్వుతూ కనిపించే వారు. రైతన్నలను చేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రాలు కనిపించేవి. చక్కగా ఈ–క్రాపింగ్ జరిగేది. రైతులకు ఉచిత పంటల బీమా అందేది. సకాలంలో పెట్టుబడి సహాయం అందేది. సచివాలయంలో వెంటనే పనులు చేసిపెట్టే ఉద్యోగులు కనిపించే వారు. ఈ రోజు అవేవీ కనిపించడం లేదు. ఆ గ్రామ స్వరాజ్యం ఎంతో దయనీయంగా తయారైందని చెప్పడానికి గుర్ల గ్రామం ఒక ఉదాహరణ’ అని మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. జగన్ ట్వీట్ చేస్తే వెలుగులోకి.. గుర్లలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 14 మంది చనిపోయిన పరిస్థితి. తాగు నీరు బాగోలేక డయేరియా వచ్చి మృతి చెందారు. ఇందుకు సంబంధించి జగన్ అనే వ్యక్తి అక్టోబర్ 19న ట్వీట్ చేస్తే తప్ప ఇక్కడ 14 మంది చనిపోయారని ప్రభుత్వం చెప్పని పరిస్థితి. సెపె్టంబర్ 20వ తేదీన, అంటే 35 రోజుల కిందట ఇదే మండలంలోని పెనుబర్తిలో ఒక వ్యక్తి చనిపోయాడు. అలా తొలి డయేరియా కేసు నమోదైంది. అయినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఎవరూ స్పందించని దుస్థితి. అక్టోబర్ 12 వచ్చే సరికి డయేరియా మరింత విజృంభించింది. గుర్ల, కోట గండ్రేడు, గోషాడ, నాగళ్లవలస గ్రామాల్లో ఉధృతంగా ప్రబలింది. ఏకంగా 14 మంది చనిపోయారు. అక్టోబర్ 19న నేను ట్వీట్ చేస్తే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అయినా ప్రభుత్వం కదిలిందా.. అంటే లేదు. తప్పుడు లెక్కలతో మాయ చేసే ప్రయత్నం గుర్లలో డయేరియాతో కేవలం ఒకరే చనిపోయారని జిల్లా కలెక్టర్ చెబుతారు. మంత్రులు, అధికారులు అదే ప్రయత్నం చేశారు. ఎవరూ డయేరియాతో చనిపోలేదని చెప్పే కార్యక్రమం చేశారు. తీరా అక్టోబర్ 24 వచ్చే సరికి 14 మంది చనిపోయారని తేలింది. ఇష్యూ పెద్దది కావడంతో సీఎం చంద్రబాబు కూడా ఒప్పుకోక తప్పలేదు. ఇక్కడ డయేరియాతో ఎనిమిది మంది చనిపోయారని చెప్పారు. ఇక్కడికి వచ్చిన డిప్యూటీ సీఎం 10 మంది చనిపోయారని చెప్పారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు కనీసం క్షమాపణ చెప్పి జరిగిన తప్పును సరిదిద్ద లేదు. సమీపంలో చంపావతి నది ఉంది. దాంట్లో నీళ్లు దారుణ పరిస్థితిలో ఉన్నాయి. ఈ నది నీటితో నడిచే సమగ్ర సురక్షిత మంచినీటి సరఫరా (సీపీడబ్ల్యూఎస్) పథకానికి సంబంధించి చంద్రబాబు వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ రెన్యూవల్ చేయలేదు. దాని ఫిల్టర్లు మార్చారా.. లేదా? కనీసం క్లోరినేషన్ జరిగిందా.. లేదా? అన్నది కూడా పట్టించుకోలేదు. స్థానికంగా సచివాలయం సిబ్బంది సహాయ, సహకారంతో శానిటేషన్ చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించారు ⇒ ఇక్కడి గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్, పీహెచ్సీలను బాగు పరచకపోగా, సీహెచ్సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసేశారు. వైద్య శాఖలో జీరో వెకెన్సీ పాలసీ మేము తీసుకొస్తే, దాన్నీ రద్దు చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు మార్చి నెల నుంచి కట్టడం లేదు. దాంతో దాదాపు రూ.1,800 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు పోలేని పరిస్థితి. ⇒ ఆరోగ్యశ్రీని నీరుగార్చింది. గతంలో కేవలం వెయ్యి ప్రొసీజర్లకు మాత్రమే పథకాన్ని పరిమితం చేస్తే, మా ప్రభుత్వం వచ్చాక 3,300 ప్రొసీజర్లకు తీసుకుపోయాం. రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసే ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీతో పాటు ఆరోగ్య ఆసరానూ çపూర్తిగా నీరుగార్చిన పరిస్థితి కనిపిస్తోంది. ⇒ మెరుగైన వైద్యం అందేలా మా ప్రభుత్వం ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టింది. వాటిలో ఐదు కాలేజీలను గత ఏడాది ప్రారంభించాం. మిగిలిన 12 మెడికల్ కాలేజీల్లో పూర్తి చేసి, వాటిని కూడా నడపాల్సిన ప్రభుత్వం.. వాటిలో 5 కాలేజీల్లో సీట్లు మంజూరైతే కూడా, వాటిని నిర్వహించలేమని లేఖ రాసింది. ఆ తర్వాత ఈ 12 మెడికల్ కాలేజీలతో పాటు, గత ఏడాది మొదలైన 5 మెడికల్ కాలేజీలు...మొత్తం 17 మెడికల్ కాలేజీలను తమకు అనుకూలమైన వారికి అమ్మేయడానికి, స్కామ్ వైపు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మేము విపక్షంలో ఉన్నప్పటికీ పార్టీ తరఫున బాధితులను ఆదుకుంటాం. డయేరియాతో చనిపోయిన 14 మంది కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆరి్థక సాయం చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్న మేమే సాయం చేయడానికి ముందుకు వచ్చాం. అధికారంలో ఉన్న మీకు (చంద్రబాబు) మరింత బాధ్యత ఉంటుంది. మరి మీరు ఎంత ఇవ్వబోతున్నారో చెప్పండని సూటిగా ప్రశి్నస్తున్నాం. – వైఎస్ జగన్జగన్ గుంటూరుకు వస్తున్నాడు.. గుర్లకు వస్తున్నాడు.. అనే సరికి మళ్లీ టాపిక్ డైవర్ట్. మా చెల్లెలు, మా అమ్మ ఫొటోలు పెడతారు. అయ్యా చంద్రబాబూ.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా.. ఈనాడు.. టీవీ5.. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు ఏం లేవా? ఇవన్నీ ఘర్ ఘర్కీ కహానీలు. ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటిని మీ స్వార్థం కోసం పెద్దవి చేసి, నిజాలను వక్రీకరించి చూపడం మానుకుని ప్రజల మీద ధ్యాస పెట్టండి. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలని చంద్రబాబుకు చెబుతున్నా. మీడియా ముసుగులో చంద్రబాబును మోస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పాటు దత్తపుత్రుడిని కూడా అడుగుతున్నా. – వైఎస్ జగన్మెరుగైన చికిత్స చేయించ లేదు ⇒ గుర్ల మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం కేవలం 17 కి.మీ దూరంలో ఉంది. మరి ఇక్కడి వారిని ఎందుకు విజయనగరం తీసుకెళ్లలేకపోయారు? ఇక్కడి నుంచి విశాఖపట్నం 80 కి.మీ దూరంలో ఉంది. పది అంబులెన్సులు ఏర్పాటు చేసి డయేరియా బారినపడిన వారిని మెరుగైన చికిత్స కోసం అక్కడికి ఎందుకు తరలించ లేదు? అలా రోగులను తరలించకపోవడంతో గుర్లలో 9 మంది, మండలంలో 14 మంది చనిపోయారు. ⇒ మన ప్రభుత్వంలో నాడు–నేడు మనబడి కార్యక్రమంలో బాగు చేసిన స్కూళ్లలో డయేరియా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేశారు. బెంచీలపై వారిని పడుకోబెట్టారు. అంటే స్కూళ్లలో వైద్యం చేసే పరిస్థితి. ఒకవేళ మా ప్రభుత్వ హయాంలో ఇలా స్కూళ్లు బాగు చేసి ఉండకపోతే పరిస్థితి ఏమిటి? ఇక్కడ మా ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీ (విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ) కూడా వచ్చింది. ⇒ డయేరియా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. ఇదే విషయం వారంతా చెప్పారు. సహాయం చేయకపోగా డయేరియాతో చనిపోయారని చెప్పొద్దన్నారు. అలా చెబితే గ్రామంలో భయాందోళన ఏర్పడుతుందని, గుండెపోటుతో చనిపోయారని చెప్పండని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ప్రభుత్వం అలా చెప్పమని చెబుతోంది అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఆలోచించాలని కోరుతున్నా.డైవర్షన్ పాలిటిక్సే చంద్రబాబు రాజకీయం ⇒ ప్రతి అడుగులో ఈ ప్రభుత్వం డైవర్షన్న్పాలిటిక్స్ చేస్తోంది. ఏదైనా ఇష్యూ వస్తే దానిని డైవర్ట్ చేసేలా అడుగులు వేస్తోంది. ఈ ప్రభుత్వం తీరుపై మేము ఢిల్లీలో ధర్నా చేస్తే, ఆ రోజు మదనపల్లెలో ఏదో అగ్ని ప్రమాదం జరిగితే ఏకంగా హెలికాప్టర్లో డీజీపీని, అధికారులను పంపింది. అదే ఇక్కడ (గుర్లలో) 14 మంది చనిపోతే హెలికాప్టర్ కాదు కదా.. కనీసం మంత్రులు వచ్చి బాధిత కుటుంబాలను పలకరించలేదు. ⇒ ఈ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైంది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్.. సెవెన్.. అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి.. చిన్న పిల్లలు కనబడితే నీకు రూ.15 వేలు అని, ఆ పిల్లల తల్లులు కనబడితే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లో పిల్లల పెద్దమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, ఇంకా ఆ ఇంట్లో 20 ఏళ్ల వయసున్న వారు కనబడితే నీకు రూ.36 వేలు అని, ఆ ఇంట్లో ఎవరైనా కండువా వేసుకున్న రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు అని చెప్పి నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు ప్రజలు ఇవన్నీ నిలదీస్తారని చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. తిరుపతి లడ్డూపై దుష్ప్రచారం చేశారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి దాంట్లోనూ డైవర్షన్. అదే చంద్రబాబు రాజకీయం. ⇒ జగన్ గుంటూరుకు వస్తున్నాడు.. గుర్లకు వస్తున్నాడనే సరికి మళ్లీ టాపిక్ డైవర్ట్. మా చెల్లెలు, అమ్మ ఫొటో పెడతారు. అయ్యా చంద్రబాబూ.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా.. ఈనాడు.. టీవీ5.. దత్తపుత్రా.. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు ఏం లేవా? మీ స్వార్థం కోసం నిజాలను వక్రీకరించడం మానుకుని ఇకనైనా ప్రజల మీద ధ్యాస పెట్టండి. ⇒ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అక్కచెల్లెమ్మల జీవితాలు చెల్లాచెదురవుతున్నాయి. చిన్న పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయి. శాంతి భద్రతలు కుదేలైపోయాయి. ప్రభుత్వం మాది అని చెప్పి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు విచ్చలవిడిగా అక్కచెల్లెమ్మలు, చిన్న పిల్లల మీద దాడులు చేస్తున్నారు. ఇప్పటికైనా బాధితులకు క్షమాపణలు చెప్పి, వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేయాలి. ఈ ప్రభుత్వానికి ఇకనైనా బుద్ధి రావాలని దేవుడిని ప్రారి్థస్తున్నా. బాధ దిగినట్లు అనిపించింది నా భర్త చింతపల్లి అప్పారావు ఇంటికి చేదోడు వాదోడుగా ఉండేవారు. డయేరియాతో మృతి చెందారు. దుఃఖాన్ని దిగమింగుతూ బాధతో గడుపుతున్నాం. ప్రభుత్వం తరఫున వచ్చిన వారంతా ఏదో చెప్పి వెళ్లిపోయారు. వైఎస్ జగన్ మాత్రం మా దగ్గరకే వచ్చి, ఇక్కడే కూర్చుని నా భర్త మృతికి కారణాలు వివరంగా అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందిందా.. అని ఆరాతీశారు. బాధ పడవద్దని, మా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఆయన మాటతో బాధ దిగినట్లు అనిపించింది. – చింతపల్లి అప్పయ్యమ్మ, గుర్లఎంతో ధైర్యం వచ్చిందిఏం జరిగిందని ప్రతీ విషయాన్ని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి మమ్మల్ని అడిగారు. మా మామయ్య సారిక పెంటయ్య ఎలా చనిపోయాడో జరిగిందంతా చెప్పాను. ఆస్పత్రిలో వైద్యం, ఊర్లో తాగునీటి ఇబ్బందుల గురించి అడిగారు. ఆ సమస్యలన్నీ పరిష్కరించేలా చేస్తామన్నారు. మా కుటుంబానికి భరోసా ఇచ్చారు. అధైర్య పడవద్దన్నారు. కష్టాలు తీర్చే నాయకుడు మా దగ్గరికే రావడం మాకు ఎంతో ధైర్యం ఇచ్చింది. – సారిక హైమావతి, గుర్లనేనున్నానని ధైర్యం చెప్పారు...డయేరియా మా ఇంట్లో ఇద్దరిని పొట్టనబెట్టుకుంది. నా భార్య కలిశెట్టి సీతమ్మ చనిపోయింది. ఆమె అకాల మరణాన్ని తట్టుకోలేక నా పెద్ద కొడుకు రవి మనోవేదనతో రెండు రోజులకే చనిపోయాడు. నాకు దిక్కుతోచని పరిస్థితి. చాలా బాధలో ఉన్న సమయంలో జగన్మోహన్రెడ్డి పరామర్శించడంతో కొంత బాధ తగ్గింది. ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతామని ధైర్యం చెప్పడం ఊరట కలిగించింది. – కలిశెట్టి సత్యారావు, గుర్ల -
నా కుటుంబం గురించి తర్వాత.. ముందు రాష్ట్రాన్ని కాపాడండి
-
గుర్ల గ్రామంలో అడుగుపెట్టిన జగన్..
-
పోలీసులపై జగన్ అసహనం..
-
తమ ఆవేదనను జగన్ తో పంచుకున్న చిన్నారి
-
డయేరియా తీవ్రతను జగన్ కు వివరించిన గుర్ల బాధితులు
-
Watch Live: డయేరియా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
-
Watch Live: కాసేపట్లో విజయనగరం గుర్లకు వైఎస్ జగన్
-
గుర్ల శిబిరంలో సౌకర్యాల లేమిపై ఎక్స్ లో ప్రశ్నించిన YS జగన్
-
కలరాతో 15 మంది చనిపోవడం ఈ జిల్లాలో ఎప్పుడు జరగలేదు
-
డయేరియా కేసులు కారణం ఇదే.. పద్ధతి మార్చుకోవాలి
-
సాక్షి వరుస కథనాలు ఎట్టకేలకు కదిలిన టీడీపీ ప్రభుత్వం
-
అవి సహజ మరణాలు కాదు.. ప్రభుత్వ నిర్లక్ష్యం: బొత్స
సాక్షి, విజయనగరం: జిల్లాలో డయేరియా తీవ్రత తగ్గడం లేదు. ఇవాళ మరో ఇద్దరు డయేరియా బారినపడ్డారు. ఆసుపత్రిలోనే ఇంకా 145 మంది బాధితులు ఉన్నారు. వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. గుర్లలో అప్రకటిత బంద్ కొనసాగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలతో గుర్ల వైద్య శిబిరంలో 3 బెడ్లను ఏర్పాటు చేశారు. వైద్య శిబిరం ఖాళీ చేసి రోగులు లేరంటూ అధికారులు చూపిస్తున్నారు.డయేరియా బాధితులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడూతూ, డయేరియాతో జిల్లాలో 16 మంది మృతి చెందారన్నారు. ఇవి సహజ మరణాలు కాదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఇంత మంది చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదు. కొత్త ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయింది. గ్రామాల్లో పారిశుధ్యం అధ్వాన్నం గా ఉంది. తాగునీరు సరఫరా బాగులేకే డయేరియా వ్యాప్తి అయింది’’ అని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: సర్కారుకు నిర్లక్ష్యపు సుస్తీ 'ఈ రోగానికి మందేదీ'? -
విజయనగరం జిల్లాలో తగ్గని డయేరియా తీవ్రత
-
విజయనగరంలో డయేరియా కలకలం.. 11కు చేరిన మరణాలు
సాక్షి, విజయనగరం: ఏపీలో డయేరియా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విజయనగరం జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. తాజాగా మరో ఇద్దరు మృతిచెందడంతో మృతుల సంఖ్య 11కు చేరుకుంది.తాజాగా విజయనగరంలోని గుర్ల మండలం నాగళ్లవలసలో డయేరియాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో, జిల్లాలో డయేరియా మృతుల సంఖ్య 11కు చేరింది. ఇక, మరో 200 మందికిపైగా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డయేరియా కారణంగా గుర్ల, గరివిడి, చీపురుపల్లి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం..భారీగా తరలివచ్చిన భక్తజనం (ఫొటోలు)
-
అంబరాన్నంటే సిరిమాను సంబరం... 260 ఏళ్ల చరిత్ర
Sirimanotsavam 2024: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి సిరిమాను సంబరానికి విజయనగరం సిద్ధమవుతోంది. ఊర్లకు ఊర్లే కదిలి వచ్చే ఈ జనజాతరతో విజయనగరం వీధులు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోతాయి. దారులన్నీ జన సెలయేరులై విద్యలనగరివైపు సాగిపోతుంటాయి. కొలిచినవారికి కొంగు బంగారమై.. కోరిన కోర్కెలెల్లా నెరవేర్చే పైడిమాంబ అంటే ఉత్తరాంధ్రులకు అంత నమ్మకం మరి.. 260 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఉత్తరాంధ్రకే పరిమితం కాకుండా రాష్ట్ర పండుగగా వాసికెక్కింది. ఏటా విజయనగరం వీధుల్లో కనులపండువగా జరిగే ఈ జనజాతరకు లక్షలాది మంది తరలివస్తారు. 260 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఉత్సవం నెల రోజుల పాటు జరుగుతుంది. మహిళలు ప్రతి రోజూ ఘటాలు నెత్తిన పెట్టుకుని అమ్మకు నివేదన చేస్తారు. ఆశ్వయుజ మాసంలో విజయదశమి మరుసటి సోమవారం తొలేళ్ల ఉత్సవం, మంగళవారం సిరిమానోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ప్రకారం ఈనెల 14వ తేదీన తొలేళ్ల ఉత్సవం, 15వ తేదీన సిరిమానోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.బొబ్బిలి యుద్ధం నేపథ్యంలో... విజయనగరం రాజు పూసపాటి విజయరామగజపతిరాజు సోదరే పైడితల్లి. బొబ్బిలి సంస్థానంతో యుద్ధానికి వెళ్లవద్దని, తన మనసు కీడు శంకిస్తోందని సోదరుడిని వారించిందట. అయినా యుద్ధం ఆగలేదు. 1757 జనవరి 23న జరిగిన బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుడు చేతిలో తన అన్న వీరమరణం పొందాడని తెలుసుకున్న పైడితల్లి విజయనగరం పెద్దచెరువులో ఆత్మార్పణ చేసుకుంది. సేవకుడైన పతివాడ అప్పలనాయుడికి కలలో కనిపించి ఆమె చెప్పిన ప్రకారం ఆ చెరువులో జాలర్లతో వెతికిస్తే విగ్రహం దొరికింది. అక్కడే గుడి కట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. విజయనగరం రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న వనంగుడి అదే.రసవత్తరంగా సిరిమానోత్సవం... సిరిమానోత్సవం తిలకించడానికి ఈసారి ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సిరిమాను 55 నుంచి 60 అడుగుల పొడవుంటుంది. దాని చివరిభాగంలో ఇరుసు బిగించి పీట ఏర్పాటు చేస్తారు. ఆ పీటపై ఆలయ ప్రధాన పూజారి కూర్చుంటారు. సిరిమాను వేరొక చివర రథంపై అమర్చుతారు. సిరిమాను ఊరేగింపు మూడులాంతర్లు వద్ద గల పైడితల్లి అమ్మవారి గుడి నుంచి రాజాబజారు మీదుగా కోట వరకూ మూడుసార్లు సాగుతుంది. ఈ సిరిమాను ముందుండే బెస్తవారివల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ ఉత్సవానికి భక్తుల రద్దీ దృష్ట్యా 2 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.చదవండి: బాబు గారి ‘కొవ్వు’ బాగోతం బట్టబయలు నెల రోజుల పండగ సెపె్టంబర్ 20వ తేదీన పందిరి రాటతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అత్యంత అట్టహాసంగా జరిగే తొలేళ్ల ఉత్సవం, సిరిమానోత్సవం ఇందులో భాగమే. అలాగే ఈ నెల 22వ తేదీన తెప్పోత్సవం, 27న కలశ జ్యోతుల ఊరేగింపు, 29న ఉయ్యాలకంబాల ఉత్సవం, 30న చండీయాగం, పూర్ణాహుతితో పైడితల్లి అమ్మవారి జాతర ముగుస్తుంది. విజయనగరం రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అమ్మవారి వనంగుడి, మూడులాంతర్లు జంక్షన్ వద్ద ఉన్న చదురుగుడిలో విశిష్ట కుంకుమార్చనలు, అభిషేకాలు నెల రోజులు కొనసాగుతాయి. నగరపాలక సంస్థ పరిధిలో 50 వార్డుల్లోని మహిళలు రోజుకొక వార్డు చొప్పున ఘటాలను సమర్పిస్తుంటారు. అమ్మవారికి చీర, రవికె, సారె ఇచ్చి చల్లదనం చేస్తారు. పప్పు బియ్యం, చలివిడి నైవేద్యంగా సమర్పిస్తారు. -
కనుడు కనుడు రామాయణ గాథ
విజయనగరం రూరల్: రామాయణంలోని మానవత్వ విలువలను భావితరాలకు అందించడం కోసం ప్రముఖ వ్యాపారవేత్త నారాయణం నరసింహమూర్తి పన్నెండేళ్ల క్రితం బృహత్ సంకల్పం చేసి శ్రీరామనారాయణం ప్రాంగణం నెలకొల్పారు. నరసింహమూర్తి మొదటినుంచీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. నరసింహమూర్తి మరణాంతరం ఆయన సంకల్పానికి తోడుగా వాల్మికి రామాయణంలోని వివిధ కోణాలపై పరిశోధనల్ని ప్రోత్సహించడంతోపాటు రామాయణాన్ని భావితరాల జీవన మార్గంగా మలిచేందుకు ఆయన కుటుంబ సభ్యులు శ్రీవాల్మికి రామాయణ రీసెర్చ్ సెంటర్ను ఇటీవల ప్రారంభించారు. ఇప్పటివరకూ శ్రీరామనారాయణం ఒక ఆధ్యాతి్మక కేంద్రం మాత్రమే. వాల్మికి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో రామాయణంపై పరిశోధనలకు మరో అడుగు ముందుకు పడింది.12 వేల గ్రంథాలు ఏర్పాటు వాల్మికి రామాయణం రీసెర్చ్ కేంద్రంలో రామాయణానికి సంబంధించిన 12 వేల గ్రంథాలను అందుబాటులో ఉంచారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను లక్షకు పైగా పెంచే ఆలోచనతో ఉన్నామని నరసింహమూర్తి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ గ్రంథాలు తెలుగు, హిందీ, సంస్కృతం, ఆంగ్లంతో పాటు ఇతర ప్రముఖ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, యువత, ఆధ్యాతి్మక వేత్తలు, పండితులు, ప్రవచనకర్తలు, గురూజీలు, నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలుగా రీసెర్చ్ కేంద్రంలోనే ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పీహెచ్డీ చేసే వారికి ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని నరసింహమూర్తి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.యువత రావాలి ఈ కేంద్రానికి ప్రధానంగా యువత ముందుకు వచ్చి రీసెర్చ్ చేయాలి. రామాయణం ప్రబోధించే విలువలు, సీతారాముల కథను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి. ఇంతటి అద్భుతమైన కేంద్రాన్ని ప్రారంభించి సమాజానికి అవకాశం కలి్పంచిన నారాయణం కుటుంబ సభ్యులు అభినందనీయులు. ప్రతి ఒక్కరూ ఈ కేంద్రాన్ని సందర్శించి జీవన మార్గాన్ని సుగమం చేసుకోవాలి. – డాక్టర్ ఎస్.వైష్ణవి, అసిస్టెంట్ ప్రొఫెసర్, సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి పూర్వజన్మ సుకృతంమా తండ్రి ఆశయం మేరకు శ్రీరామనారాయణం ప్రాంగణంలో వాల్మీకి రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. దేశంలో పలు మార్గాల్లో ఉన్న ఆధ్యాత్మిక గురువుల సలహాలు, ఆశీస్సులతో ఈ కేంద్రం ఏర్పాటుచేసి సమాజ శ్రేయస్సుకు మా వంతు కృషి చేస్తున్నాం – నారాయణం శ్రీనివాస్, ఫౌండర్, శ్రీరామనారాయణం ప్రాంగణం -
మూడు జిల్లాల నేతలతో వైఎస్ జగన్ భేటీ
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నేతలతో తన క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల నుంచి వచ్చిన ముఖ్య నేతలతో ఆయన తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల నియామకాలు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. -
టీడీపీ 100 రోజల పాలనపై ప్రజల రియాక్షన్
-
కేదార్నాథ్లో చిక్కుకున్న విజయనగరం యాత్రికులు
విజయనగరం క్రైమ్: చార్ధామ్ యాత్రకు వెళ్లి ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్నాథ్ ఆలయం ప్రాంతంలో కొండపై విజయనగరం జిల్లాకు చెందిన భక్తులు చిక్కుకుపోయారు. ఢిల్లీకి చెందిన సదరన్ ట్రావెల్స్ ద్వారా ఇటీవల చార్ధామ్ యాత్రకు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 30 మంది వెళ్లారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు. రెండు రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తుండడం, వాతావరణం అనుకూలించకపోవడంతో భక్తులు కొండలపైనే నిలిచిపోయారు. జిల్లాకు చెందిన నలుగురిలో గొట్టాపు త్రినాథరావు దంపతులు గురువారం హెలికాప్టర్లో కొండ కిందకు వచ్చేశారు. డిప్యూటీ తహసీల్దార్ కొట్నాన శ్రీనివాసరావు, ఆయన భార్య హేమలత ఇంకా కేదార్నాథ్ కొండపైనే ఉన్నారు. కేదార్నాథ్ ఆలయం ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేదని హెలికాప్టర్ ప్రయాణం నిలిపివేశారని, తాము కొండపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు స్థానిక విలేకరులకు వారు శుక్రవారం ఫోన్లో తెలిపారు. భోజన, వసతి లభించక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు దృష్టికి వెళ్లడంతో ఆయన అక్కడి అధికారులతో మాట్లాడారు. శుక్రవారం కొంత మేరకు వాతావరణం సహకరించడంతో రెండు హెలికాప్టర్లు మాత్రమే కేదార్నాథ్ ఆలయం వద్దకు వెళ్లగలిగాయని, అయితే వాటిలో ఏపీ వారికి అవకాశం ఇవ్వకపోవడంతో కొండపైనే ఉండిపోయారని తెలిసింది. -
ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల గోల్ మాల్
-
విజయనగరం: నిలిచిపోయిన ఈవీఎంల రీ-వెరిఫికేషన్
Updatesవిజయనగరం ఎంపీ నియోజకవర్గంలోని ఈవీఎంల రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయిందిఈవీఎం బ్యాటరీ అంశంపై డిక్లరేషన్ ఇవ్వలేమన్న జిల్లా కలెక్టర్ఈసీ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ చేస్తామన్న కలెక్టర్మా దరఖాస్తులో మాక్ పోలింగ్ కోరలేదు. కోరకుండా మాక్ పోలింగ్ చేయడం ఏమిటని ప్రశ్నించిన బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పలనర్సయ్య.ఈసీ,జిల్లా అధికారుల తీరుపై మరింత బలపడిన అనుమానాలు.ఎన్నికల ఈవీఎంల అక్రమాలు బయటపడకుండా కుంటిసాకులు చెప్పి దరఖాస్తు చేసిన అభ్యర్ధులను తప్పు దారి పట్టిస్తున్న జిల్లా యంత్రాంగం.కోర్టు లేదా ఈసీ వద్ద తేల్చుకోండని వెరిఫికేషన్ కేంద్రం నుండి వెళ్లిపోయిన జిల్లా కలెక్టర్ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో నిలిచిపోయిన ఈవీఎంల రీ-వెరిఫికేషన్మాక్ పోలింగ్కు అంగీకరించని వైఎస్సార్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్బ్యాటరీ స్టేటస్ మాత్రమే వెరిఫై చేయాలని చంద్రశేఖర్ పట్టుజిల్లా కలెక్టర్కు సమాచారం ఇచ్చిన ఆర్డీవో సూర్యకళవెరిఫికేషన్ కేంద్రానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రారంభం అయింది. నెల్లిమర్ల ఈవీఎం గోడౌన్లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం స్థానానికి చెందిన 2 ఈవీఎంలను ఎన్నికల అధికారులు రీ వెరిఫికేషన్ ప్రారంభించారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్ర శేఖర్ హాజరయ్యారు.నెల్లిమర్ల నియోజకవర్గం కొండ గుంపాం, బొబ్బిలి నియోజక వర్గం కోమటపల్లి ఈవీఎంలు అభ్యర్థుల సమక్షంలో వెరిఫికేషన్ చేస్తారు. ఈవీఎం బాటరీ స్టేటస్పై వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్ర శేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. బెల్లాన చంద్రశేఖర్ అభ్యర్థనతో ఈవీఎంల రీ వెరిఫికేషన్ను చేస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.ఈవీఎం బ్యాటరీల్లో గోల్ మాల్ఈవీఎం తనిఖీల్లో అడ్డంగా ఈసీ దొరికిపోయింది. గజపతినగరం బూత్ నంబర్ 20 ఈవీఎం తనిఖీల్లో లోగుట్టు బయటపడింది. పోలింగ్ నాడు 50 శాతం.. కౌంటింగ్ నాడు 99 శాతం ఛార్జింగ్ కనిపించింది. 84 రోజుల తరువాత తనిఖీ నాడు కూడా ఈవీఎం బ్యాటరీ 99 శాతం చార్జింగ్ చూపించింది. ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు పెరిగిందో ఈవీఎం తయారీ ఇంజనీర్లు, ఎన్నికల అధికారులు వెల్లడించలేదు.దత్తిరాజేరు మండలంలోని పెదకాడ ఈవీఎంని అధికారులు తనిఖీ చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య ఫిర్యాదుతో ఈవీఎం వెరిఫికేషన్ చేశారు. వెరిఫికేషన్ కోసం ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ 9 గంటల పాటు నిర్వహిస్తే ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ 80 శాతానికి తగ్గింది. మరి పోలింగ్ జరిగిన ఈవీఎంలో 99 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఎలా ఉందో అధికారులు చెప్పలేదు. ఈవీఎంలో డేటాను అధికారులు తొలగించారు. ఈవీఎం వీవీ ప్యాట్లను అధికారులు మాయం చేశారు. ఈవీఎంలో ఫ్యాన్, సైకిల్ గుర్తులు లేకుండా అధికారులు మాక్ పోలింగ్ చేపట్టారు. ఈవీఎం భద్రపరచిన తాళాలను అధికారులు పోగొట్టారు. మూడు గంటల తర్వాత స్పేర్ తాళం తెచ్చి తెరిచారు. ఈవీఎం కౌంటింగ్ హాల్ టేబుల్ సీసీ కెమెరా ఫుటేజీని అధికారులు ఇవ్వకపోవటం గమనార్హం. చదవండి: ఈవీఎంలు ఇక్కడ.. తాళాలు ఎక్కడ? -
నెల్లిమర్ల జూట్మిల్ మళ్లీ మూత
నెల్లిమర్ల: విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జూట్మిల్ మరోసారి మూతపడింది. జూట్ కొరతను కారణంగా చూపి సోమవారం కర్మాగారాన్ని లాకౌట్ చేశారు. ఇటీవల కాలంలో తరచూ మిల్లును లాకౌట్ చేస్తుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మిల్లులో పనిలేక, వేరేపనికి వెళ్లలేక కార్మిక కుటుంబాలు యాతన పడుతున్నారు. జూట్మిల్లో సుమారు 200 మంది రెగ్యులర్, మరో 1,800 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ముడిసరుకు కొరత పేరిట యాజమాన్యం మిల్ను అక్రమంగా మూసివేయడంపై కార్మిక కుటుంబాల ఆవేదన చెందుతున్నాయి. కొన్నేళ్లుగా ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలు చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కార్మికులకు ఎలాంటి సదుపాయాలు అందటం లేదు. 2016 నుంచి గ్రాట్యుటీ బకాయిలు కూడా జూట్ యాజమాన్యం చెల్లించలేదని కార్మికులు చెబుతున్నారు. చెక్కులు ఇచ్చినప్పటికీ ఖాతాలో నగదు లేకపోవడంతో చెల్లకుండాపోతున్నాయని రిటైర్డ్ కార్మికులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మిల్ను తెరిపించే ఏర్పాట్లు చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.కార్మికులకు న్యాయం చేయాలిరిటైర్డ్ కార్మికులకు 2016 నుంచి గ్రాట్యుటీ బకాయిలు కూడా జూట్ యాజమాన్యం చెల్లించలేదు. వారికి చెక్కులు ఇచ్చినప్పటికీ ఖాతాలో నగదు లేకపోవడంతో చెక్కులు చెల్లకుండా పోతున్నాయి. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జూట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. కర్మాగారం తెరిపించే ఏర్పాట్లు చేయాలి. – కిల్లంపల్లి రామారావు, సీపీఎం నాయకుడు, నెల్లిమర్ల -
ప్రేమోన్మాది ఘాతుకం.. విజయవాడలో వ్యాపారి దారుణహత్య!
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడ బృందావన కాలనీలోని గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించడం లేదనే కారణంతో ఓ ఉపాధ్యాయుడు.. యువతి తండ్రిని కత్తితో నరికి హత్య చేసిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు విద్యాధరపురానికి చెందిన కంకిపాటి శ్రీరామచంద్రప్రసాద్(56) లబ్బీపేటలోని బృందావన్ కాలనీలో సింధూ భవన్ సమీపంలో కిరాణా షాపు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఉదయం వచ్చి వ్యాపారం నిర్వహించుకుని రాత్రి ఇంటికి వెళ్తుంటాడు. ఆయన కుమార్తె బీ.టెక్ పైనలియర్ చదువుతుంది.గత కొన్ని నెలలుగా ఒక ప్రైవేట్ స్కూల్లో పీటీ మాస్టర్గా పనిచేస్తున్న విద్యాధరపురానికి చెందిన మణికంఠ ప్రేమిస్తున్నానని తనను పెళ్లిచేసుకోమని శ్రీరామచంద్రప్రసాద్ కుమారై వెంటపడుతూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం యువతి తల్లిదండ్రులు మణికంఠను మందలించారు. గురువారం సాయంత్రం తండ్రితో పాటు కుమార్తె కూడా షాపునకు వెళ్లింది. రాత్రి 10 గంటల సమయంలో షాపు మూసి ఇద్దరు ఇంటికి బయలుదేరుతున్నారు.ఆ సమయంలో వారిపై కోపం పెంచుకున్న మణికంఠ షాపు వద్దకు చేరుకున్నాడు. అతను తన వెంట తెచ్చుకున్న కత్తితో శ్రీరామచంద్రప్రసాద్పై దాడి చేసి నరికి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే వ్యాపారి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మణికంఠను పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. -
ప్రాణం తీసిన పరిచయం
-
విజయనగరం టీడీపీలో మంత్రి పదవుల చిచ్చు
ఏపీ నూతన మంత్రివర్గంలో పదవుల పందేరం విజయనగరం జిల్లాలో అసంతృప్తి జ్వాలలకు కారణం అయింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల టీడీపీ వాట్సప్ గ్రూపుల్లో పార్టీ కార్యకర్తలు నాయకత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంత్రి పదవులు దక్కని వారంతా సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీరుపై మండిపడుతున్నారు. విజయనగరం రాజు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు?ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ కూర్పుతో విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో మంటలు రేగుతున్నాయి. మంత్రి పదవులు తప్పనిసరిగా దక్కుతాయనుకున్నవారికి పార్టీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. చంద్రబాబు, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చల వరకు మంత్రి పదవులు లిస్ట్ లో చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన పేర్లు ఉన్నాయని స్థానికంగా ప్రచారం జరిగింది.అయితే అనూహ్యంగా గవర్నర్ కు ఇచ్చిన జాబితాలో వీరిద్దరి పేర్లు మాయం అయ్యాయి. సీనియర్లకు బదులుగా ఎన్నికలకు రెండు నెలల ముందు పార్టీలోకి వచ్చి టికెట్ కొట్టేసిన ఎన్.ఆర్.ఐ, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కింది. పార్టీ కోసం ఏనాడు పనిచేయని శ్రీనివాస్ కు మంత్రి పదవి ఎలా ఇస్తారని సీనియర్ లు దుమ్మెత్తి పోస్తున్నారు.విజయనగరం జిల్లా రాజకీయాల్లోకి కళా వెంకట్రావు రాకను అశోక్ గజపతిరాజు తొలినుండి అడ్డుకుంటూనే ఉన్నారు. కళా వెంకటరావు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి వీళ్ల మద్య విభేదాలు ఉన్నాయనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల టికెట్ ఆశించిన కళావెంకటర్రావుని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి పోటీకి దింపారు.ఇక్కడ బొత్స సత్యన్నారాయణపై గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందని చంద్రబాబు చెప్పినట్టు అప్పట్లో జిల్లాలో వార్తలు వినిపించాయి. చంద్రబాబు హామీ మేరకు..ఎన్నికల్లో విజయం సాధించిన కళావెంకటరావు మంత్రి పదవి ఆశించారు. విజయనగరం జిల్లా టిడిపిలో కూడా కళాకే మంత్రి పదవి అంటూ హోరెత్తించారు. మరో పక్క బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయనకు కూడా చంద్రబాబు మంత్రి పదవి హామీ ఇచ్చారని ఎన్నికల ప్రచారంలోనే ఆయన చెప్పుకున్నారు.ఇక్కడే జిల్లాలో సీనియర్ నేత, మాజీ కేంద్రం మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. బొబ్బిలి రాజులకు విజయనగరం రాజులకు ఉన్న శతాబ్దాల వైరం కారణంగా.. ఇప్పుడు బొబ్బిలి రాజ వంశస్తుడు అయిన బేబినాయనకి మంత్రి పదవి దక్కకుండా అశోక్గజపతరాజు అడ్డు చక్రం వేశారని సమాచారం. ఇదే విషయం బొబ్బిలి టిడిపి వాట్సప్ గ్రూపుల్లో హల్ చల్ చేసింది. దీనికి బేబినాయన కూడా వాయిస్ మెసేజ్ ద్వారా కేడర్ కు సమాధానం చెప్పుకున్నారు.రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావుకు, అశోక్ గజపతిరాజు, ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడులతో గతంలో ఉన్న విభేదాలే ఆయనకు మంత్రి పదవిని దూరం చేశాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నుండి కళా వెంకటరావును అచ్చెన్నాయుడు తరిమేయగా, విజయనగరం జిల్లాలో బొత్స సత్యన్నారాయణ లాంటి ఉద్దండుడుపై ఓటమి తప్పదనే పోటీకి అవకాశం ఇచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కళా వెంకటరావు గెలిచారు. అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి రాకుండా అశోక్ గజపతి రాజు అడ్డుకున్నారంటూ జిల్లాలో చర్చసాగుతోంది.రాజాం, ఎస్.కోట నియోజకవర్గాల నుండి గెలిచిన కొండ్రు మురళీ మోహన్, కోళ్ల లలిత కుమారి కూడా మంత్రి పదవి ఆశించిన వారిలో ఉన్నారు. సామాజికవర్గం ప్రాధాన్యతల దృష్ట్యా అవకాశం కోసం లాబీయింగ్ చేసుకున్నా వీళ్లకూ అశోక్ గజపతి రాజు ఆశీస్సులు దక్కలేదు. విజయనగరం జల్లాలో మంత్రిపదవులు ఆశించి భంగపడ్డ సీనియర్ల అసంతృప్తికి అశోక్ గజపతిరాజే కారణం అని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. -
విజయనగరం: ఆ ఆర్టీసీ డ్రైవరన్న టైమింగ్.. దెబ్బకు స్మగ్లర్లు పరార్
విజయనగరం: గుర్తుతెలియని వ్యక్తులు బస్సులో విడిచిపెట్టి వెళ్లిన గంజాయితో కూడిన రెండు బ్యాగులను దత్తిరాజేరు మండలం పెదమానాపురం పోలీస్ స్టేషన్కు ఆర్టీసీబస్సు డ్రైవర్ పి.గణపతి సోమ వారం అప్పగించారు. ఎస్ఐ శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరు నుంచి వైజాగ్ వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సులో రామభద్రాపురం వద్ద ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. పెదమానాపురం వద్దకు వచ్చేసరికి బస్సులో ఎంత మంది ఉన్నారో ఆర్టీసీ సిబ్బంది లెక్కిస్తున్న సమయంలో వారు టిక్కెట్లు తీయలేదని గమనించి నిలదీశారు. వారు వెంటనే బస్సుదిగి పారిపోయారు. ప్రయాణికులతో కలిసి వారు తెచ్చిన బ్యాగులు తెరిచి చూడగా గంజాయి ఉన్నట్టు గమనించారు. వెంటనే బస్సును స్టేషన్ వద్ద ఆపి గంజాయిని ఆర్టీసీ డ్రైవర్ అప్పగించారు. తహసీల్దార్ సుదర్శన్, వీఆర్వో ఆధ్వర్యంలో బ్యాగులో ఉన్న గంజాయిని తూకంవేసి 14.3 కేజీలు ఉన్నట్టు నిర్ధారించారు. గంజాయిని సీజ్ చేసి పరారైన వ్యక్తుల కోసం గాలిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
కోట్లు పంచి అగచాట్లు
అంతా భ్రాంతియేనా..జీవితాన వెలుగింతేనా..అని ఓ సినీకవి అన్నట్లు తయారైంది జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన నాయకుల పరిస్థితి. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కోట్ల రూపాయలు ఓటర్లకు పంచినప్పటికీ తమను విజయం వరిస్తుందా? అన్న సందేహం వీడక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. వైఎస్సార్సీపీకి పూర్తి పట్టున్న ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎలాగైనా ఉనికిని కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఎన్ని అడ్డదారులు తొక్కినప్పటికీ ఫలితం ఎలా ఉంటుందో అంతుబట్టక దిగాలుగా ఉన్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: పోలింగ్ ముగిసి రెండు వారాలైంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మళ్లీ ఎగిరేది వైఎస్సార్సీపీ జెండాయేనని, రానున్న విజయం ఫ్యాన్దేనని రాజకీయ విశ్లేషకుల్లో అధికశాతం మంది ఢంకా భజాయించి చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ ముహూర్తం కూడా చెప్పేశారు. ప్రత్యర్థులైన టీడీపీ, జనసేన నాయకులు మాత్రం ఓట్ల కోసం తాము ఖర్చు చేసిన కోట్ల రూపాయలతో తమకు అనుకూల ఫలితం వస్తుందనే భ్రమలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేసిన ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎలాగైనా ఉనికి కాపాడు కోవాలన్నది వారి ఉద్దేశం. ఇందుకోసం తాయిలాలతో పాటు మద్యం ఏరులై పారించారు. కోట్లాది రూపాయలు వెదజల్లారు. ఓటరైతే చాలు వెయ్యి రూపాయలు, ప్రత్యర్థి పార్టీవారైతే రెండు వేల రూపాయల వరకూ పంచడమే వారి అధికార దాహానికి అద్దం పడుతోంది. కరోనా వంటి కష్టకాలంలో తామంతా ముఖం చాటేసినా, కోటల గేట్లు మూసేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ఏవిధంగా అండగా నిలబడిందీ, ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పనులు ఏవిధంగా చేసిందీ ప్రజలు గుర్తుంచుకున్నారన్న విషయమే ఇప్పుడు టీడీపీ, జనసేన నాయకులకు నిద్ర పట్టనీయడం లేదు. నోట్లు తీసుకున్నవారంతా ఓట్లేస్తే గట్టెక్కుతామన్న ధీమా వారికి కనబడడం లేదు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసి ఎన్ని పక్కదారులు తొక్కినా ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. దీన్ని కప్పిపుచ్చుకుంటూనే తమ్ముళ్లలో మనోధైర్యం కల్పించడానికి టీడీపీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా పోటీచేసిన వారిని విజయనగరం రప్పిస్తూ, మనమే గెలుస్తున్నామంటూ రోజుకొకరితో ప్రకటనలు ఇప్పిస్తున్నారు. ఈ ప్రకటనల భ్రమలో తెలుగు తమ్ముళ్లు భారీగా బెట్టింగ్లకు దిగుతున్నారు.పదవే పరమావధిగా పందేరంగతంలో ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ప్రజలకు తాయిలాలు ఇవ్వడమెరగని తండ్రి శైలికి భిన్నంగా ఆయన వారసురాలు మాత్రం ఈసారి రూ.కోట్లలో డబ్బులు బయటకు తీసినట్లు సమాచారం. అసెంబ్లీలో అధ్యక్షా అనాలనేదే లక్ష్యంగా విజయనగరం జిల్లాకేంద్రంలో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకూ ఖర్చు చేయడంపై ప్రజలే ఆశ్చర్యపోతున్నారు.👉 టీడీపీ సీనియర్ నాయకులను కంగుతినిపించి మరీ పారిశ్రామిక ప్రాంతంలో టికెట్ తెచ్చుకున్న మాజీ మంత్రి ఒకరు ఈసారి ఎలాగైనా గెలవాలని తనదైన ఎత్తులు జిత్తులన్నీ అమలుచేశారు. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు చోటుచేసుకున్న మారణకాండ మచ్చ నుంచి బయటపడటానికి, ఓటర్లను మభ్యపెట్టడానికి గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా పారించారు. ఓటర్ల లెక్క ప్రకారం ఒక్కో గ్రామానికి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ గుట్టుచప్పుడు గాకుండా మూటలు పంపించారంటేనే పరిస్థితి ఊహించవచ్చు.👉 గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకపోయినా ఈసారి టీడీపీ నాయకులకు ఝలక్ ఇచ్చి మరీ టికెట్ తెచ్చుకున్న కూటమి అభ్యర్థిని అధికార దాహంతో అడ్డదారులన్నీ తొక్కారు. తన విద్యాసంస్థను, తనకున్న స్వదేశీ, విదేశీ కంపెనీలను చూపించి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. ఓట్లేస్తే అందరికీ ఉద్యోగాలిచ్చేస్తానంటూ భ్రమలు కల్పించారు. గ్రామీణ ప్రజలకు మాత్రం అప్పటికే బకెట్లు పంచిన ఆమె పోలింగ్కు ముందు డబ్బుల పందేరానికి తెరతీశారు. ఇందుకు తమ సంస్థ ఉద్యోగులనే పావులుగా వాడుకున్నారు.👉 దీర్ఘకాలంగా తాను నమ్ముకున్న నియోజకవర్గం నుంచి కొత్త నియోజకవర్గానికి వలసవచ్చిన టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరతీశారు. చీపురుపల్లి–విజయనగరం ప్రధాన రహదారిని ఆనుకుని ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయమే కేంద్రంగా తాయిలాలు, నగదు పంపిణీ జరిగింది. ఒడిశా నుంచి చీప్ లిక్కర్తో పాటు సారా కూడా రప్పించి మరీ గ్రామాల్లో పారించారు.👉 బాబాయ్ సీటుకు ఎసరుపెట్టి ఆఖరి నిమిషంలో టికెట్ తెచ్చుకున్న ఓ టీడీపీ అభ్యర్థి తన తరఫున భారీ ఎత్తున డబ్బు పంపిణీకి ఏకంగా ఎన్నారైలను రంగంలోకి దించారు. అవినీతిలో అన‘కొండ’గా పేరొందిన తన తండ్రికి ఆ బాధ్యతలు అప్పగిస్తే ఎక్కడ తేడా కొడుతుందోనని ఆలోచించినట్లు ఉంది. అన్ని మార్గాల్లో నుంచి చేతికి అందొచ్చిన రూ.30 కోట్ల వరకూ పందేరం చేసినట్లు వినికిడి.👉 తనదే గెలుపు అని రెండేళ్లుగా కత్తి దూసి మరీ సోషల్ మీడియాలో చాటింపు వేయించుకున్న ఓ రాజు ఆఖరి నిమిషంలో తాయిలాల మోత మోగించారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకూ పంపిణీ చేయించారు. ఇందుకోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి లాడ్జిల్లో మకాం వేసిన బంధువులతో పాటు గతంలో మంత్రి పదవి కోసం పార్టీ ఫిరాయించిన సోదరుడి సాయం తీసుకున్నారు. మరోవైపు ఖరీదైన మద్యాన్నే మందుబాబులకు రుచి చూపించారు.👉 గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ఓ నాయకురాలు తాయిలాల పంపిణీలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. తన చేతిలో ఉన్నది ఇదేనంటూ రూ.10 కోట్ల వరకూ ఎంపీ అభ్యర్థి చేతిలో పెట్టి ఊరుకున్నారట. ఇదే అదునుగా ఆ నియోజకవర్గానికి చెందిన కుటుంబంలోని భార్య ఒక పార్టీలో, భర్త ఒక పార్టీలో ఉంటున్న వారు డబ్బు పందేరంలో చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. తన విద్యాసంస్థకు చెందిన విద్యార్థులనే పావులుగా వాడుకుంటూ ఎంపీ అభ్యర్థి పంపించిన డబ్బు మూటలు ఎవరికి ఎంతమేర ఇవ్వాలో చెబుతూ ఈ ఆదర్శ దంపతులు రూ.కోట్లలోనే వెనకేసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటుకు రూ.వెయ్యి చొప్పున డబ్బుతో పాటు మద్యం బాగానే ఇక్కడ టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. -
విజయనగరం పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ వద్ద హైడ్రామా
-
విజయనగరం జిల్లాలో 144 సెక్షన్
-
టీడీపీ మేనిఫెస్టోని మోదీయే నమ్మడం లేదు..
-
ఆ కష్టాలు మాకొద్దు ‘రాజా’..!
విజయనగరం: విజయనగరం.. చారిత్రక నేపథ్యం కలిగిన నగరం. ఏళ్ల తరబడి రాజుల పాలనలో ఉన్నా అభివృద్ధి శూన్యం. రాజులను నమ్మి జనం అధికారం కట్టబెట్టినా అది అలంకార ప్రాయంగానే చూశారు. ప్రజల కష్టాలు అరణ్యరోదనగానే మిగి లాయి. ఏ నాడూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న ధ్యాస, మంచిచేయాలన్న తపన రాజరిక కుటుంబానికి లేకపోవడమే దీనికి కారణం. ఓ వైపు నగర జనాభా పెరుగుతున్నా... కాలనీలు విస్తరించినా ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు కనీ సం కృషి చేయలేదు. ఆ ఆలోచన కూడా రాలేదు. కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు కోటదాటి బయటకు వచ్చిన సందర్భాలు అరుదు. జనానికి రాజు మొహం కనిపించిందంటే అదే మహాభాగ్యంగా ఉండేది. ఎన్నికల వేళ జనంలోకి రావడం.. తర్వాత బంగ్లాకు లేదంటే ఢిల్లీకి పరిమితం కావ డమే ఏళ్ల తరబడి సాగుతున్న తంతు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో నగర వాసులు దాహార్తితో అల్లాడినా మంత్రిగా ఉండి కనీసం పట్టించుకోలేదు. గుక్కెడు తాగునీటి కోసం బంగ్లా వద్ద ఆందోళనలు చేసినా కనికరించలేదు. రోడ్ల విస్తరణ పరిస్థితీ అంతే. తవ్వేసి వదిలేశారు. పాడైన రోడ్లపై రాకపోకలకు పట్టణ వాసుల అవస్థలు వర్ణనాతీతం. పదవీ కాలమంతా కోట, పరిసరాలను అందంగా తీర్చిదిద్దేందుకే పరిమితమయ్యారు. అన్ని రంగాల్లో నగర అభివృద్ధిని మసకబారించారన్న అపవాదను అశోక్ మూటగట్టుకున్నారు. కార్పొరేషన్ స్థాయిలో సదుపాయాల కల్పనకు అశోక్ కనీసం ఆలోచన చేయలేదని జనం బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నగరంలోని శివారు కాలనీల పరిస్థితి అయితే ఐదేళ్ల కిందట దుర్భరం. తాగునీరు, డ్రైనేజీలు, రోడ్ల సదుపాయాలు కల్పించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అశోక్ కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు కుమార్తె తరఫున ప్రచారానికి వస్తున్న అశోక్ను జనం బహిరంగంగానే నిలదీస్తున్నారు. మీరు పదవులు అనుభవించడమే తప్ప జనానికి ఏ రోజైనా మేలు చేశారా..? కనీసం మా సమస్యలు ఆలకించారా..? మాట్లాడేందుకు అవకాశం కల్పించారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.జనాభా పెరిగినా..విజయనగరంలో 2001 సంవత్సరంలో సుమారు లక్ష వరకు ఓటర్లు ఉండగా... 2005 నాటికి 1.05 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 2.44 లక్షల జనాభా ఉండగా.. 2014 సంవత్సరం నాటికి జనాభా సంఖ్య సుమారు 3 లక్షలు ఉండేది. అప్పట్లో గాజులరేగ, జమ్ము, ధర్మపురి, అయ్యన్నపేట, వేణుగోపాలపురం, కెఎల్పురం ప్రాంతాలను విజయనగరం మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పట్టణ విస్తీర్ణం పెరిగింది. వీటి పరిధిలో గుర్తింపు పొందిన మురికివాడలు 80 వరకు ఉండేవి. వీరిలో అర్హులైన వారికి హౌస్ఫర్ ఆల్ పథకంలో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు స్వీకరించగా.. లబ్ధిదారుల నుంచి టీడీపీకి చెందిన దిగవ స్థాయి నాయకులు లంచాలు వసూలు చేసి చివరికి ఇల్లు అప్పగించకుండా మోసం చేసినట్టు కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 2014–19 మధ్య రూ.279 కోట్లతో రెండువేల పనులు చేపట్టేందుకు అప్పటి టీడీపీ పాలకవర్గం ఆమోదించగా... అందులో రూ.93 కోట్లతో 700 పనులు మాత్రమే పూర్తిచేయగలింది.నాటికి నేటికీ తేడా చూడు..రాజులు కోట, బంగ్లాకే పరిమితమైతే.. నేటి పాలకులు జనం మధ్యనే ఉంటూ.. జనం అవసరాలు తెలుసుకుంటూ అభివృద్ధి పనులు చకచకా పూర్తిచేస్తున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. కేవలం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ 59 నెలల పాలనలో ఇది మన విజయనగరం అని మురిసిపోయేలా.. గర్వంగా చెప్పుకునేలా అన్ని కూడళ్లను అందంగా తీర్చిదిద్దారు. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేలా చెరువు గట్లను పార్కులుగా మలిచారు. మహిళల కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా పార్కును నిర్మించారు. తాగునీటి పథకాలు నిర్మించి నగరవాసులకు శాశ్వతంగా తాగునీటి కష్టాలను దూరం చేశారు. శివారు కాలనీలకు రోడ్లు వేశారు. విద్య, వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. సరస్వతీ నిలయాలకు సొబగులద్దారు. నగరంలో రోడ్ల విస్తరణ పనులు పూర్తిచేశారు. నగరానికి ఏ వైపు నుంచి వచ్చిన వారికై నా ఇది మన విజయనగర వైభవం అని చాటిచెప్పేలాహంగులు కల్పించారు.పాలకుడంటే జనం కష్టాలు తెలిసిన వాడు.. తెలుసుకునేవాడై ఉండాలి.. ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చగలగాలి. ఆపద సమయంలో నేనున్నాంటూ ఆపన్నహస్తం అందించి ఆదుకోవాలి. ఓ విజన్తో నగరాభివృద్ధికి కృషిచేస్తూ.. ప్రతీ ఒక్కరికీ మంచి చేయాలన్న తపనతో ముందుకు సాగాలన్నది జనం మాట. అధికారాన్ని అలంకారంగా భావించి.. కష్ట కాలంలో కోటదాటని పాలకులు.. ఎన్నికల వేళ ప్రజల వద్దకు వస్తుంటే ఛీకొడుతున్నారు. దాహార్తితో అల్లాడుతున్నా పట్టించుకోని రాజులు.. రోడ్ల విస్తరణ పనులు పూర్తిచేయనివారు.. విజయనగర వైభవాన్ని మసకబారించేలా వ్యవహరించే రాజరిక పాలన మాకొద్దంటూ మొహంమీదే చెబుతున్నారు. అనునిత్యం అందుబాటులో ఉంటూ.. కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా విజయనగర అభివృద్ధికి అనునిత్యం పాటుపడే నాయకుడే పాలకుడుగా ఉండాలని సుస్పష్టం చేస్తున్నారు. -
బాబును చీల్చి చెండాడిన మహిళలు
-
చెరకు రైతుల నోట్లో... చంద్రన్న విషం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వ్యవసాయాధార ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో ఒకప్పుడు చెరకు సాగు రైతులకు లాభదాయకమైన పంట. ఇందుకు భీమసింగి సహకార చక్కెర కర్మాగారం, లచ్చయ్యపేట వద్దనున్న ప్రభుత్వ చక్కెర కర్మాగారం వల్ల ఎంతో మేలు పొందేవారు. కానీ వాటిని చూసి చంద్రబాబుకు కన్నుకుట్టింది. కమీషన్ల కోసం రైతుల కడుపుకొట్టడానికి వెనుకాడలేదు. ఆ రెండు చక్కెర కర్మాగారాల జీవం తీసేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 ఏళ్ల పాలన వాటికి శాపంగా మారింది. భీమసింగి చక్కెర కర్మాగారాన్ని మొట్ట మొదట మూతవేసింది 2003లోనే. అదే సమయంలోనే సీతానగరం మండలం లచ్చయ్యపేటలోనున్న ప్రభుత్వ చక్కెర కర్మాగారాన్ని అత్యంత చౌకగా ప్రైవేట్పరం చేసేశారు. 2004లో వై.ఎస్. రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భీమసింగి సుగర్ ఫ్యాక్టరీకి జీవం పోశారు. లాభాల బాట పట్టించారు. మళ్లీ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా నష్టాల్లో ముంచారు. ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం రైతుల వంతుగా సేకరించిన రూ.5 కోట్ల సొమ్మును అప్పటి టీడీపీ నాయకులు దుర్వినియోగం చేశారు. చంద్రన్న విషగుళికల్లాంటి అసంజస నిర్ణయాల ఫలితంగా చెరకు రైతులు దారుణంగా నష్టపోయారు.భీమసింగిలో ఇలా...చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా పాలన (1995–2003)లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనున్న 18 ప్రభుత్వ, సహకార చక్కెర కర్మాగారాల్లో 8 ప్రైవేట్పరం చేసేశారు. ఆ సమయంలోనే భీమసింగి సుగర్ ఫ్యాక్టరీపై కత్తికట్టారు. 2003–04 సీజన్లో క్రషింగ్ చేయకూడదని ఆదేశాలివ్వడంతో తొలిసారిగా మూతపడింది. పాదయాత్రలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఫ్యాక్టరీని తెరిపించారు. ప్రభుత్వ గ్యారెంటీతో రూ.3.50 కోట్ల రుణం అందించారు. ఫ్యాక్టరీకి గుదిబండగా మారిన అప్పులు రూ.18.04 కోట్లను ప్రభుత్వ షేరు ధనంగా మార్చారు. ఆధునికీకరణకు రూ.36.18 కోట్లు మంజూరు చేశారు. తద్వారా క్రషింగ్ సామర్థ్యాన్ని 1205 మెట్రిక్ టన్నుల నుంచి 2 వేల మెట్రిక్ టన్నులకు పెంచడం, పవర్ ప్లాంట్ ఉత్పత్తి కూడా 1.5 కిలోవాట్ల నుంచి 12 కిలోవాట్లకు పెంచడం లక్ష్యాలుగా నిర్దేశించారు. మిగులు విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా ఫ్యాక్టరీ కొంత లాభపడటం అనేదీ ఇందులో భాగం. మరోవైపు ఫ్యాక్టరీ ఆధునికీకరణకు తమ వంతు సహకారంగా రైతులు నుంచి రూ.3 కోట్ల వరకూ పెట్టుబడి నిధి కూడా సేకరించారు. దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే అది వడ్డీతో రూ.5 కోట్లు అయ్యింది. ఆ నిధికి టీడీపీ నాయకులు గండికొట్టేశారు. 2014 సంవత్సరంలో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం శాపంగా మారింది. రైతులు అడగకపోయినా ఆ డిపాజిట్లను పంచేశారు. అలా ఆధునికీకరణ ప్రతిపాదనను ఉద్దేశపూర్వకంగానే అటకెక్కించేశారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాల ఫలితంగా ఫ్యాక్టరీ సుమారు రూ.47.88 కోట్లు నష్టాల్లోకి వెళ్లింది. ఆప్కాబ్ నుంచి తెచ్చిన రూ.25 కోట్ల రుణంపై ఏటా రూ.3.2 కోట్ల వరకూ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి. మరోవైపు యంత్రాలన్నీ పనిచేయకుండాపోయాయి.జగనన్న ప్రభుత్వంలోనే భరోసా.... లచ్చయ్యపేట కర్మాగారం యాజమాన్యం బకాయిపడిన బిల్లులు చెల్లించాలని రైతులు, వేతనాల కోసం కార్మికులు రోడ్డున పడ్డారు. వారికి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తన ప్రజాసంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎనిమిది నెలల వ్యవధిలోనే కర్మాగారం భూములను బహిరంగవేలం ద్వారా విక్రయించి రైతులకు, కార్మికులకు, ఉద్యోగులకు బకాయిలు చెల్లించారు. అలాగే లచ్చయ్యపేట, భీమసింగి ఫ్యాక్టరీలపై ఆధారపడిన చెరకు రైతులకు నష్టం లేకుండా మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ప్రభుత్వంతో చర్చించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఫలితంగా రైతులు గత నాలుగేళ్లుగా రేగిడి మండలం సంకిలి వద్దనున్న ఈఐడీ ప్యారీ సుగర్ ఫ్యాక్టరీకి చెరకును విక్రయిస్తున్నారు.లచ్చయ్యపేటలో అలా... తొలుత పార్వతీపురం డివిజన్లో రైతుల కోసం సీతానగరం, బొబ్బిలి ప్రాంతాల్లో 1936 సంవత్సరంలో శ్రీరామా చక్కెర కర్మాగారాలు ప్రారంభమయ్యాయి. వాటిలో బొబ్బిలి కర్మాగారం 1973లో, సీతానగరం కర్మాగారం 1974లో మూతపడ్డాయి. ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ 1992లో లచ్చయ్యపేట వద్ద కర్మాగారాన్ని నిర్మించడానికి అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దనరెడ్డి శంకుస్థాపన చేశారు. ఇది నిర్మాణం పూర్తయిన సందర్భంలోనే చంద్రబాబు తొలిసారిగా 1995 సెప్టెంబర్లో సొంత మామ ఎన్టీఆర్కు వెన్నుపోటుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కర్మాగారాన్ని ప్రారంభించిందీ ఆయనే. లాభాల్లో సాగుతున్న సమయంలో నష్టాల ముసుగువేసి 2002 సంవత్సరంలో అత్యంత చౌకగా అమ్మకం పెట్టేసిందీ చంద్రబాబే. ఎన్సీఎస్ యాజమాన్యంలో కర్మాగారం పరిస్థితి మరింత దిగజారింది. ఏడాదికేడాది చెరకు రైతులకు బిల్లులు చెల్లించక ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. చెరకు రైతులకు రూ. 24 కోట్లు, కార్మికుల జీతాలు, బ్యాంక్ రుణాలు కలిపి మరో రూ.19 కోట్లు బకాయిలు పెట్టేశారు. దీంతో ఆందోళనకు దిగిన రైతులను, కార్మికులను బుజ్జగించడానికి చంద్రబాబు 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు యాజమాన్యం పరిధిలోఉన్న కర్మాగారం భూములను ఐడీఆర్ చట్టం కింద స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే వాటిని వేలం వేయకుండా 2019 సంవత్సరంలో పదవి దిగిపోయేవరకూ నాన్చుతూ వచ్చారు. -
అడుగడుగునా నీరా‘జనం’
(‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): మరోసారి చరిత్ర సృష్టించేందుకు చారిత్రక విజయనగరం జననేత జగనన్నకు అఖండ స్వాగతం పలికింది. అడుగడుగునా ప్రజలు జననీరాజనాలు పలికారు. ఉత్తరాంధ్ర కళారూపాలైన చెక్క భజనలు, కోలాటాలతో తమ అభిమాన నేతను అక్కున చేర్చుకున్నారు. విశాఖలోని ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద అభిమానుల కోలాహలం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభమైంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో 21వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఎండాడ నుంచి విజయనగరం వరకు సాగింది. దారిలో అడుగడుగునా అభిమానులు వెంటరాగా సీఎం జగన్ బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్ స్టేడియం, పీఎం పాలెం మీదుగా సాగిన యాత్ర జాతీయ రహదారి మొత్తం అభిమానులతో నిండిపోయింది. కొత్తవలస మండలంలోని చీడివలస గ్రామానికి చెందిన చెక్కభజన బృందంలోని అక్కచెల్లెమ్మలు జగన్ కోసం తరలివచ్చారు. ఎండాడ నుంచి కార్షెడ్ జంక్షన్, మధురవాడ, కొమ్మాది, పరదేశీపాలెం, గంభీరం, తాళ్లవలస వరకు వెంటనడిచారు. దారిపొడవునా అక్కచెల్లెమ్మల హారతులు, మహిళల కోలాటాలు, యువకుల తీన్మార్ డ్యాన్సులతో వారంతా సీఎం జగన్ యాత్ర వెంట అడుగులు వేశారు. జగన్ సైన్యంతో జాతీయ రహదారి కిటకిట.. ఇక ఉదయం పీఎంపాలెం వద్దకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్రలో పాల్గొనేందుకు అప్పటికే ఆయన రాకకోసం పెద్దఎత్తున మహిళలు, పిల్లలతో పాటు ఆటోడ్రైవర్లు తరలివచ్చారు. జగన్ బస్సుపై నుంచి అభివాదం చేయగానే ఆ ప్రాంతమంతా జగన్నినాదాలతో మార్మోగింది. వైఎస్సార్ స్టేడియం నుంచి మొదలైన జనప్రవాహం కొమ్మాది, మారికవలస మీదుగా ఆనందపురం జంక్షన్కు చేరుకుంది. అక్కడ వేచి ఉన్న అక్కచెల్లెమ్మలు జగనన్నకు ఘనస్వాగతం పలికారు. జగన్ను దూరం నుంచి చూసిన అపార్ట్మెంట్లలోని మహిళలు, విద్యార్థులు సైతం బాల్కనీల్లో హుషారుగా కేరింతలు కొట్టారు. ‘గత ప్రభుత్వంలో ఏ చిన్న పనికావాలన్నా జన్మభూమి కమిటీల ద్వారా స్థానిక టీడీపీ నేతలను కలవాల్సి వచ్చేది. వారు అడిగింది ముట్టజెప్పినా, ఇష్టం లేకపోతే నెలల తరబడి తిప్పించుకునే వారు’ అని మహిళలు నాటి పీడకలలను గుర్తుచేసుకున్నారు. జగనన్న తీసుకొచ్చిన వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలతో ఇంటికే వచ్చి మీకేం అవసరమో చెప్పాలని అడిగి మరీ చేస్తున్నారని నేటి పరిస్థితులను వివరించారు. ఇది సామాన్యుల ప్రభుత్వమని, తామంతా ఆనందంగా ఉన్నామని జనం ముక్తకంఠంతో చెప్పారు. ఇక యాత్రలో భాగంగా సీఎం జగన్ ఆనందపురం జంక్షన్లోని చెన్నాస్ కన్వెన్షన్లో సోషల్ మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. అనంతరం.. మోదవలస జంక్షన్ మీదుగా విజయనగరం జిల్లాలో యాత్ర కొనసాగింది. జిల్లా నాయకులు, జగన్ అభిమానులతో మోదవల కూడలి జనసందోహంతో నిండిపోయింది. యువకులు ర్యాలీగా వెంటరాగా, మ.2 గంటలకు జొన్నాడ సమీపంలో ముఖ్యమంత్రి భోజన విరామం తీసుకున్నారు. అనంతరం సా.5 గంటలకు జొన్నాడ నుంచి చెల్లూరు వరకు ర్యాలీగా వచ్చి అక్కడ అశేష జనావాహినితో నిండిపోయిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఈ బహిరంగ సభకు విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగులు సీఎం జగన్కు మద్దుతుగా మూడు చక్రాల మోటార్ సైకిళ్లపై పెద్దఎత్తున తరలివచ్చారు. జగన్ సీఎం అయ్యాకే తమ భవిష్యత్తు బాగుందని ఎంతో సంతోషంతో చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోకి బస్సుయాత్ర.. సభ అనంతరం సీఎం జగన్ చింతలవలస మీదుగా విజయనగరం జిల్లా సరిహద్దు గ్రామం కొప్పెర్ల చేరుకున్నారు. అప్పటికే చీకటి పడినా జగన్ కోసం పెద్దఎత్తున అభిమానులు అక్కడే ఉండి తమ ప్రియతమ నేతకు భారీ పూలదండలతో శ్రీకాకుళం జిల్లాలోకి ఆహ్వానించారు. కిక్కిరిసిన జన సందోహం మధ్య జగన్ అభివాదం చేస్తూ సవరవిల్లి, భోగాపురం మీదుగా రణస్థలం చేరుకున్నారు. అక్కడ ప్రజలు, నాయMý ులు రహదారిపై బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి జన సంద్రాన్ని తలపించింది. అక్కడి నుంచి అక్కివలస సమీపంలోని రాత్రి బసకు జగన్ చేరుకున్నారు. వైఎస్సార్సీపీలోకి బీజేపీ నేతలు ఎండాడ నైట్ క్యాంపులో ఎస్.కోట, గాజువాక, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, భీమిలి నియోజకవర్గ అభ్యర్థులతో పాటు ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్ను కలిశారు. వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పార్టీ కార్యకలాపాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇందులో బీజేపీ గాజువాక నియోజకవర్గం నుంచి మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాశరావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవిందు, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి,సంపత్కుమార్ ఉన్నారు. వీరితోపాటు విశాఖ ఉత్తరం నుంచి జనసేన నాయకురాలు దివ్యలత, బీజేపీ నుంచి హేమాంబర్, వ్యాపారవేత్త షేక్ సలీమ్, షేక్ హుస్సేన్ బాషా తదితరులున్నారు. -
నా తండ్రి లాంటి వారు ఎమోషనల్ అయిన బొత్స
-
వీళ్ళే మన అభ్యర్థులు .. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
చంద్రబాబు అంటే చంద్రముఖి: వైఎస్ జగన్
-
చంద్రబాబు పాలన రక్తాన్ని పీల్చే పాలన.. బాబుపై సీఎం జగన్ సెటైర్లు
-
కూటమికి కొత్త పేరు పెట్టిన సీఎం జగన్..!
-
నారా సైన్యానికి బుద్ధి చెప్పటానికి ప్రజా సైన్యం సిద్ధం..!
-
ప్రజల అండతో సీఎం జగన్.. ఇతర పార్టీల అండతో చంద్రబాబు
-
ర్యాంప్ పై నడుస్తూ ప్రజలకు అభివాదం
-
సీఎం జగన్ డైనమిక్ ఎంట్రీ
-
పొలాల్లో దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చు కానీ.. బాబును నమ్మలేం: సీఎం జగన్
సాక్షి, విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబు వెనక బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఒకరు ప్రత్యక్షంగా మరొకరు పరోక్షంగా మద్దతిస్తున్నాయని విమర్శించారు. ఒక్క జగన్ మీదకు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఎగబడుతున్నారని మండిపడ్డారు. ఇంత మంది తోడేళ్లు ఏకమై తన మీద యుద్ధానికి వస్తున్నారని తెలిపారు. పెత్తందార్లకు, నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేసిన జగన్పై తోడేళ్ల దాడి సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజు మంగళవారం విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చెల్లూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగారు. ప్రజలను మోసాలతో వంచించడమే చంద్రబాబు పని అంటూ ధ్వజమెత్తారు. ప్రజలకు మంచి చేసిన జగన్పై తోడేళ్లు దాడికి దిగుతున్నాయని దుయ్యబట్టారు. మీ బిడ్డకు తోడుగా దేవుడి దయ, కోట్ల ప్రజల హృదయాలు ఉన్నాయన్నారు. మోసాల బాబుకు బుద్ది చెప్పేందుకు సిద్ధమా? ఎన్నికలప్పుడు కూటమి నమ్మించి మోసం చేస్తుందని మండిపడ్డారు సీఎం జగన్. నమ్మించి మోసం చేసిన కూటమి నేతల్ని 420 అంటారని అన్నారు. చంద్రబాబు వెనక దత్తపుత్రుడు ఉన్నాడని అన్నారు. ఓవైపు జగన్ ఒక్కడే అయితే మరోవైపు తోడేళ్లు ఏకమయ్యాయని విమర్శించారు. మోసాల బాబుకు బుద్ది చెప్పేందుకు మీరంతా సిద్ధమా?..చంద్రబాబుబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమా? అంటూ చెల్లూరు సభకు హాజరైన జనవాహినిని ఉద్ధేశించి సీఎం జగన్ ప్రసంగించారు. సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ. విజయ నగరం జిల్లాలో మహాసముద్రం కనిపిస్తోంది. శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించేందుకు మీరంతా సిద్ధమా? ఈ ఎన్నికలు.. రాబోయే అయిదేళ్ల భవిష్యత్తు. 58 నెలల్లో 130సార్లు బటన్ నొక్కి సంక్షేమం అందించాం. దాదాపు 40 పథకాలను పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందించాం. 2 లక్షల 70 వేల కోట్లు నేరుగా ప్రజలకు అందించాం. నాన్డీబీటీ ద్వారా మరో లక్ష కోట్లకు పైగా ఇచ్చాం. మొత్తం రూ. 3 లక్షల 75 వేల కోట్లకు పైగా అందించాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాలకు నగదు వేశాం. మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను. పిల్లలను చదివించేందుకు అమ్మఒడి పథకం తీసుకొచ్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. పిల్లల ఉన్నత చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన. డ్రీమ్స్ పేదింటి అమ్మది.. స్కీమ్స్ మీ బిడ్డవి. అక్కాచెల్లెమ్మల సాధికారత కోసం వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ. అక్కాచెల్లెమ్మల కోసం వైఎస్సార్ చేయూత తీసుకొచ్చాం. వైఎస్సార్ కాపునేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. చంద్రబాబుకు ఎప్పుడైనా ఇంతమంచి ఆలోచన వచ్చిందా? పేద ప్రజల గురించి ఏ ఒక్కరోజు కూడా చంద్రబాబు ఆలోచన చేయలేదు. చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి ఆ ఆలోచన రాలేదు. చంద్రబాబు హయాంలో చంద్రముఖి పాలన చూశాం. డ్రీమ్స్ అవ్వాతాతలవి.. స్కీమ్స్ మీ బిడ్డవి అవ్వాతాతల డ్రీమ్స్ నెరవేరుస్తూ ప్రతినెలా రూ.3 వేల పెన్షన్. వాలంటీర్ల ద్వారా ఒకటో తేదీనే ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్. డ్రీమ్స్ యువతది.. స్కీమ్స్ మీ జగనన్నది. దేశంలో ఎప్పుడూ జరగని విధంగా ఉద్యోగాలిచ్చాం. 58 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం. 31 లక్ష ఇళ్ల పట్టాలను పేదింటి మహిళలకు ఇచ్చింది మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంత మంచి చేసిన మీ అన్నకు రాఖీ కడతారా?. స్టార్ క్యాంపెయిన్లుగా మీరంతా మీ అన్నకు తోడుగా ఉంటారా? చంద్రబాబు హయాం అంతా.. మోసం,మోసం, మోసం బాబు పాలనలో స్కీంలు ఉండవు.. స్కాంలు మాత్రమే ఉంటాయి. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారు. విజయవాడలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ నడపడం తప్ప చంద్రబాబు చేసింది ఏంటి? ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి. డ్రీమ్స్ రైతులవి.. స్కీమ్స్ మీ జగన్వి ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్. పెట్టుబడి సాయంగా రైతు భరోసా రూ. 13,500 ఇచ్చాం. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, రూ. 65 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు. దోచుకోవడం.. పంచుకోవడమే చంద్రబాబు డ్రీమ్. పొలాల్లో పెట్టే దిష్టిబొమ్మనైనా నమొచ్చేమోకానీ చంద్రబాబును నమ్మలేం. ప్రతి ఎన్నికల సమయంలో రంగరంగుల మేనిఫెస్టో తెస్తారు. ఎన్నికల అయిపోయాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడు చంద్రబాబు. నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. గ్రామాల కోసం 7 స్కీమ్లు తీసుకొచ్చాం సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే, విలేజ్క్లినిక్ స్కూళ్ల రూపురేఖలు, మహిళా పోలీస్, డిజిటల్ లైబ్రరీలు 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి మాట ఇస్తే నిలబడే పాలన మీ జగన్ది చంద్రబాబు మోసాలను గుర్తు చేసుకోండి ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచన చేయండి -
అడుగడునా ప్రజల కష్టాలు వింటూ ముందుకు సాగుతున్న సీఎం జగన్
-
చెల్లూరు సీఎం జగన్ బహిరంగ సభ భారీ ఏర్పాట్లు..!
-
సీఎం జగన్ బహిరంగ సభ భారీ ఏర్పాట్లు..@చెల్లూరు
-
చంద్రబాబు కుట్ర రాజకీయాలతో... ‘ప్రతిభ’కు దక్కని గౌరవం!
విజయనగరం: కావలి ప్రతిభా భారతి... టీడీపీ సీనియర్ నాయకురాలు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో ఆమె కీలక నేత. మంత్రిగా, స్పీకర్గా ఆమె విశేష సేవలు అందజేశారు. చిత్తశుద్ధి, విలువలతో కూడిన రాజకీయాలకు ఆమె కేరాఫ్గా మారారు. అలాంటి నాయకురాలి కుటుంబానికి చంద్రబాబు నాయుడు రాజకీయ సమాధికట్టారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినట్టే ప్రతిభా భారతి కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారని సొంత పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. తన సొంత నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కేటాయించకుండా.. డబ్బులకోసం వలసనాయకుడికి టికెట్ అమ్మేశారని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు గెలిచి రాష్ట్రంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభా భారతిని చంద్రబాబు నిలువునా ముంచడంతో ఏమిచేయాలో తోచక.. చంద్రబాబు, కోండ్రుల కుట్ర రాజకీయాలను చూసి ఓర్వలేక.. సొంతగ్రామానికి కూడా రాకుండా విశాఖపట్నం, హైదరాబాద్లలో ఆమె గడుపుతున్నారు. గ్రీష్మకు రిక్తహస్తం.. ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ టీడీపీ కోసం చాలా కష్టపడ్డారు. తల్లికి అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 2014 నుంచి 2019 వరకూ రాజాంలోనే ఉంటూ అనేక కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు సొంత సొమ్ము ఖర్చుచేశారు. 2019లో టిక్కెట్ వస్తుందని ఆశపడి భంగపాటుకు గురయ్యారు. తల్లీకూతుళ్ల వద్ద డబ్బులు లేవని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి చెందిన కోండ్రును టీడీపీలోకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు చేతిలో 16,800 ఓట్ల తేడాతో కోండ్రు ఓడిపోయారు. అనంతరం దాదాపు మూడున్నరేళ్లు నియోజకవర్గంలో టీడీపీ కేడర్ను ఆయన పట్టించుకోలేదు. ఈ సమయంలో గ్రీష్మ పార్టీకి అండగా నిలిచారు. 2022లో ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడు సభలో తొడగొట్టి వైఎస్సార్సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. టికెట్ తనకే వస్తుందని ఆశపడ్డారు. రాజాంలో చంద్రబాబు, లోకేశ్ల పర్యటనల విజయవంతానికి కృషిచేశారు. చివరకు తండ్రీకొడుకులిద్దరూ ఆమెకు టికెట్ కేటాయించకుండా పంగనామాలు పెట్టడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని తమ అనుచరుల వద్ద తరచూ ఏకరువు పెడుతూ.. కోండ్రును చిత్తుగా ఓడించేందుకు తమదైన శైలిలో పావులు కదుపుతున్నట్టు సమాచారం. 25 ఏళ్లుగా ఊరిస్తూ.. మరోవైపు అటు పాలకొండ ఎస్సీ నియోజకవర్గంగా, ఇటు రాజాం నియోజకవర్గం ఏర్పడిన తరువాత పాలకొండ, రాజాం ప్రాంతాల్లో నివసిస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగినికి కూడా చంద్రబాబు నిరాశే చూపించారు. 1994 నుంచి ఓ ప్రభుత్వ ఉద్యోగి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తూ వస్తోంది. టీడీపీ కార్యక్రమాలకు అండగా ఉంటూ ఆర్థిక సాయంచేస్తూ వచ్చింది. పాలకొండ ఎస్సీ రిజర్వేషన్లో ఉన్న సమయంలోనే ఆమెకు టికెట్ ఇస్తామని టీడీపీ ఆశచూపింది. అప్పట్లో పలు పత్రికల్లో కూడా ఆమె పేరు బయటకు వచ్చింది. ఆమెకు టికెట్ కేటాయిస్తామని ఆశచూపిన చంద్రబాబు.. తిరిగి నిరాశే మిగిల్చారు. డబ్బున్నవారికే టీడీపీ టిక్కెట్ ఇస్తామని చేతలతో స్పష్టంచేశారు. రాజాంలో సోమవారం నిర్వహించిన ప్రజాగళం సభకు కూడా టీడీపీ వ్యతిరేక వర్గం హాజరుకాలేదు. ప్రతిభాభారతి అభిమానులు, ఇటు సామాజిక వర్గ నేతలు తమ ప్రతాపాన్ని ఓటు రూపంలో చూపిస్తామని చెబుతున్నారు. కన్నింగ్ నాయకుడికి బుద్ధిచెబుతామని స్పష్టంచేస్తున్నారు. -
చంద్రబాబు కుట్రతో పెన్షన్ దారులకు అష్టకష్టాలు
-
చంద్రబాబు చేసిన పనికి పెన్షన్ కోసం ఇబ్బందులు
-
పాపం.. కళావెంకటరావు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావు పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకప్పుడు చక్రం తిప్పింది ఆయనేనా? అనే సందేహం కళా అనుచరులను వెంటాడుతోంది ఇప్పుడు! గ్రామస్థాయి నాయకుడైన నడికుదిటి ఈశ్వరరావు (ఎన్ఈఆర్) టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించి మరీ ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి టికెట్ను తన్నుకుపోయారు. అతనికి ఇప్పించేందుకు చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆడిన రాజకీయ వైకుంఠపాళిలో కళా పావుగా మారిపోయారని ‘సాక్షి’ ఇప్పటికే వెలుగులోకి తెచ్చింది. ఆఖరి నిమిషంలో కళా తేరుకొని హైదరాబాద్, విజయవాడ మధ్య చక్కర్లు కొట్టినా వ్యయప్రయాసలు మాత్రమే మిగిలాయి. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఈశ్వరరావు పేరును బీజేపీ బుధవారం ప్రకటించింది. తూర్పు కాపు (బీసీ) సామాజికవర్గ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గంలో ‘కమ్మ’ని వ్యూహం ఫలించింది. టీడీపీలో మరో సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు వద్దు వద్దంటున్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కటే కళావెంకటరావు ముందు కనిపిస్తోంది. కుటుంబ హెచ్చరికలను బేఖాతరు చేసి అక్కడికి వెళ్తారా అనేదీ సందేహమే. ఇక మిగిలిన మరో దారి విజయనగరం లోక్సభ టిక్కెట్ మాత్రమే. తీరా అక్కడ ఐవీఆర్ఎస్ సర్వేల్లోనూ కళావెంకటరావు వినిపించట్లేదు. దీన్నిబట్టి అక్కడా టికెట్ వచ్చేట్లు కనిపించట్లేదు. పాపం... కళావెంకటరావు! ఆయన పరిస్థితి కరివేపాకు కన్నా అధ్వానంగా అయిపోయిందని ఆయన అనుచరులు చంద్రబాబుపై లోలోనే రగిలిపోతున్నారు. -
విజయనగరం జిల్లా టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
-
లోకేష్ సభలో తన్నుకున్న తమ్ముళ్లు
-
IPL- CSK: ఆడుదాం–ఆంధ్రా నుంచి ఐపీఎల్కు..
Adudam Andhra- సాక్షి, విజయనగరం(జామి): వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సంకల్పం నెరవేరుతోంది. గ్రామీణ ప్రాంతం క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఆడుదాం–ఆంధ్రా పోటీల్లో రాణించిన క్రీడాకారులకు ఆఫర్లు వరుసకడుతున్నాయి. క్రికెట్ పోటీల్లో రాణించిన జామి మండలం అలమండకు చెందిన కె.పవన్కు ఐపీఎల్లో ఆడే అవకాశం చేరువైంది. పవన్ ప్రతిభను గుర్తించిన సీఎస్కే (చెన్త్నె సూపర్ కింగ్స్) అతడిని దత్తత తీసుకుంది. అతడికి శిక్షణ ఇచ్చి జట్టులో ఆడే అవకాశం కల్పించనుంది. వివరాల్లోకి వెళ్తే.. పవన్కు చిన్నప్పటి నుంచి క్రికెట్పై మక్కువ. మొదట్లో ఇంటి వెనుక ఉన్న చిన్న గ్రౌండ్లో క్రికెట్ ఆడుకునేవాడు. తరువాత గ్రామంలో హైస్కూల్ గ్రౌండ్లో ఆడేవాడు. తల్లిదండ్రుల మరణంతో క్రికెట్ లో బాగా రాణించేవాడు. అయితే, శిక్షణ తీసుకోవడానికి ఎటువంటి ఆసరా లేదు. చాలా నిరుపేద కుటుంబం. తండ్రి చిన్న వయసులోనే మృతిచెందాడు. తల్లి కూడా మృతిచెందింది. మామయ్య పైడిరాజు వద్ద ఉంటున్నాడు. ఈ సమయంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం–ఆంధ్రా క్రీడపోటీలకు హాజరయ్యాడు. మండల, నియోజకవర్గం, జిల్లాస్థాయి పోటీల్లో అలమండ జట్టు విజయంలో పవన్ ఆల్రౌండర్ ప్రతిభ చూపాడు. విశాఖపట్నంలో జరిగిన సెమీ ఫైనల్స్లో ఫీల్డింగ్, బౌలింగ్లో ప్రతిభ చూపాడు. పవన్లోని క్రీడా నైపుణ్యాన్ని సీఎస్కే గుర్తించి దత్తత తీసుకుంది. అతడి ఆట మరింత మెరుగుపడేలా శిక్షణ ఇవ్వనుంది.కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రీడా యజ్ఞం ఆడుదాం ఆంధ్రా ఈవెంట్కు విచ్చేసిన సీఎస్కే టాలెంట్ హంట్లో భాగంగా పవన్ను ఎంపిక చేసింది. అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కేవీఎం విష్ణు వర్ధినిని కూడా సెలక్ట్ చేసింది. ఆడుదాం–ఆంధ్రాతో నాకు ఈ గుర్తింపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి ఆలోచనతో ఆడుదాం–ఆంధ్రా క్రీడాపోటీలు నిర్వహించారు. దీనివల్ల మా లాంటి గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ చూపేందుకు వేదిక దొరికింది. సీఎస్కే నన్ను దత్తత తీసుకోవడం ఆనందంగా ఉంది. విశాఖలో జరిగిన రాష్ట్రస్ధాయి పోటీల్లో ముఖ్యమంత్రి అభినందించారు. – కె.పవన్, క్రికెట్ క్రీడాకారుడు, అలమండ గ్రామం చదవండి: Adudam Andhra: విజేతల జాబితా ఇదే.. -
ఖుర్దా రోడ్-విజయనగరం మధ్య మూడో రైల్వే లైన్
సాక్షి, ఢిల్లీ: ఒడిశాలోని ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం వరకు 363 కిలో మీటర్ల దూరం మూడవ రైల్వే లైన్ నిర్మాణంతోపాటు భద్రక్-విజయనగరం సెక్షన్లో నెర్గుడి - బరంగ్ మధ్య 22 కిలో మీటర్ల మేర మూడో రైల్వే లైన్ను 4962 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ప్రతిపాదనలకు గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. ప్రధాన మంత్రి గతి శక్తి పథకం కిందపైన పేర్కొన్న రెండు సెక్షన్లలో మూడో రైల్వే నిర్మాణ ప్రాజెక్ట్ ఎప్పటిలోగా పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేమని మంత్రి వివరించారు. రైల్వే ప్రాజెక్ట్ల నిర్మాణం పూర్తి చేయడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ప్రాజెక్ట్ల నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన పూర్తి చేయాలి. రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకంగా నిలిచే అడవుల తొలగింపుకు అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయాలి. వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి అవసరమయ్యే అనుమతులు లభించాలి. రైల్వే లైన్ నిర్మాణం తలపెట్టే భూమి స్వరూప స్వభావాలపై అధ్యయనం జరగాలి. ప్రాజెక్ట్ సైట్లో శాంత్రి భద్రతలను పటిష్టం చేయాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏడాది కాలంలో ఎన్ని నెలలపాటు ప్రాజెక్ట్ పనులు నిర్విరామంగా కొనసాగుతాయే వంటి పలు అంశాల ఆధారంగా మాత్రమే ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందో ఒక అంచనాకు రాగలమని రైల్వే మంత్రి తన జవాబులో వివరించారు. హస్త కళల అభివృద్ధి కోసం ఏపీకి 3911 కోట్లు జాతీయ హస్తకళల అభివృద్ధి కార్యక్రమం, సమగ్ర హస్తకళల క్లస్టర్ అభివృద్ధి పథకం కింద గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.3911.25 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ పేర్కొన్నారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ 2018-19 నుంచి 2023-24 వరకు నేషనల్ హాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎన్హెచ్డిపి), సీహెచ్డీసీ పథకాల కింద విడుదల చేసిన మొత్తం నిధుల్లో రూ.2439.8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎన్హెచ్డీపీ కింద ఐదేళ్లలో రూ.3378.99 కోట్లు విడుదల చేయగా రూ.1907.54 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే కాంప్రహెన్సివ్ హ్యాండిక్రాఫ్ట్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం కింద ఐదేళ్లలో రూ.532.26 కోట్లు నిధులు మంజూరు చేసి విడుదల చేయగా మొత్తం నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. హస్త కళల అభివృద్ధి కోసం ఎన్హెచ్డిపి, సీహెచ్డీసీ పథకాలను వేర్వేరు ఉద్దేశాలతో రూపొందించినట్లు మంత్రి తెలిపారు. హస్త కళాకారులు పదివేల మందికి మించి ఉన్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి గొలుసు అభివృద్ధి చేయడం సీహెచ్సీడీ పథకం ఉద్దేశమైతే, హస్త కళాకారులకు వ్యక్తిగతంగా అలాగే 1000 మందికి మించని చిన్న క్లస్టర్లకు మార్కెటింగ్ ప్లాట్ ఫాంలు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పించడం, నైపుణ్యాలను పెంపొందించడం ఎన్హెచ్డీపీ ఉద్దేశ్యమని తెలిపారు. ఎన్హెచ్డీపీ స్కీం కింద మార్కెటింగ్ సదుపాయం, నైపుణ్యాభివృద్ధి, క్లస్టర్ అభివృద్ధి, ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పాటు, హస్తకళాకారులకు డైరెక్ట్ బెనిఫిట్, మౌలిక సదుపాయాలు, సాంకేతిక సహకారం, హస్తకళాకారులకు, క్లస్టర్లకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సహకారం అందించడం ద్వారా వ్యాపార ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించడం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సీహెచ్డీఎస్ కింద రాష్ట్ర స్థాయిలో ప్రాజక్టులు ఏర్పాటు చేయడం, అవి ఆయా రంగాల్లో విశేష అనుభవం కలిగిన కేంద్ర/ రాష్ట్ర హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా క్లస్టర్ ప్రాజక్టు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. -
డబ్బు సంచులు తెచ్చినోళ్ళు ముందుకు రండి!
సీనియర్లు పక్కకు వెళ్ళిపోండి.. డబ్బు సంచులు తెచ్చినోళ్ళు ముందుకు రండి. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న రాజకీయం ఇదే. ఎన్నికలు ముంచుకొస్తుండటంతో చంద్రబాబు వక్రబుద్ధి మరోసారి బయటపెట్టుకుంటున్నారు. జిల్లా ఏదైనా, నియోజకవర్గం ఏదైనా డబ్బుతో వచ్చేవారికే టిక్కెట్ అని తేల్చి చెప్పేస్తున్నారు. పార్టీ పుట్టినప్పటినుంచీ ఉన్నవారిని, వారి వారసుల్ని కాదని కొత్తవారి కోసం వెతుకుతున్నారు. దీంతో ఉత్తరాంధ్రలోని ఓ జిల్లా సీనియర్లంతా చంద్రబాబుపై మండిపడుతున్నారు. ఆ జిల్లా ఏదో.. ఆ నేతలెవరో చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి విజయనగరం జిల్లాలో పచ్చ జెండా ఎగురుతోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం తర్వాత ఫ్యాన్ స్పీడ్కు సైకిల్ అడ్రస్ గల్లంతయింది. జిల్లాలోని కొన్ని రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు టీడీపీ పుట్టినప్పటినుంచి ఆ పార్టీ జెండాను మోసాయి. మూడు కుటుంబాలు టీడీపీలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వెలిగారు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా వెనకబడ్డాయి. దీంతో సీనియర్ నేతల కుటుంబాలకు ఈసారి టిక్కెట్లు ఇచ్చేది లేదని పచ్చ పార్టీ బాస్ చంద్రబాబు తెగేసి చెబుతున్నారు. డబ్బు గుమ్మరించే వారిని తీసుకురండి అని చెబుతున్నారు. అటువంటి వారు కనిపిస్తే వారికే టిక్కెట్ అని హామీలిచ్చేస్తున్నారు. ఆక్..పాక్..కరివేపాక్..అంటూ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుతో సీనియర్ నేతలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్.కోట నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత కోళ్ల అప్పలనాయుడు కోడలు లలితకుమారికి ఈసారి టిక్కెట్ లేదని చెప్పేశారు. టీడీపీ ఏర్పడకముందు ఇండిపెండెంట్గా గెలిచిన కోళ్ల అప్పలనాయుడు టీడీపీ వచ్చాక ఆ పార్టీ తరపున 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తర్వాత అప్పలనాయుడు కోడలు లలిత కుమారి రెండు సార్లు టిడిపి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎస్.కోట టీడీపీలో ఈ కుటుంబానిది తిరుగులేని నాయకత్వం. కానీ ఈ ఎన్నికల్లో లలిత కుమారికి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవలే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన NRI పారిశ్రామిక వేత్త గొంప కృష్ణకు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయ నేపధ్యం లేకపోయినా బాగా డబ్బున్న వ్యక్తి కావడం అనే కారణంతో కోళ్ల కుటుంబాన్ని పక్కన పెట్టి గొంప కృష్ణకు ఎస్.కోట టికెట్ ఇవ్వబోతున్నారనే చర్చ పార్టీలో సాగుతోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో పతివాడ నారాయణస్వామి 7 సార్లు టిడిపి తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఈయన అనుభవం అపారం. అయితే వృద్దాప్యం కారణంగా వారసులుకి అవకాశం కల్పించాలని ఆయన చంద్రబాబును కోరారు. కానీ ధనికులకే టికెట్ అనే కాన్సెప్ట్ తీసుకువచ్చిన చంద్రబాబు.. పతివాడ నారాయణస్వామి కుటుంబం విన్నపాన్ని విస్మరించారు. ఎయిర్పోర్ట్ వస్తున్న భోగాపురం పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా సంపాదించిన కర్రోతు బంగార్రాజుకు నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా ఇంజనీరింగ్ కాలేజీలు, సాఫ్ట్వేర్ కంపెనీల యజమాని అయిన లోకం మాధవి జనసేన తరపున టికెట్ రేసులోకి వచ్చారు. బంగార్రాజు కంటే ఈమె దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయని తెలియడంతో నెల్లిమర్ల సీటును టీడీపీ తరపున లోకం మాధవికి ఇస్తామని హింట్ ఇచ్చారు. దీంతో రియల్టర్ బంగార్రాజు ఖంగు తిన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో బొబ్బిలి చిరంజీవి మాస్టర్ టిడిపి తరపున మూడు సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయనను పక్కన పెడతారనే ప్రచారం సాగుతోంది. బోనెల విజయచంద్ర అనే వ్యాపారవేత్తను పార్వతీపురం రాజకీయ తెరమీదకు తీసుకుచ్చారు. ఇది ఎస్సీ నియోజకవర్గం అయినా చంద్రబాబు విడిచి పెట్టలేదు. డబ్బు బాగా ఖర్చు పెట్టగలవారికే టికెట్ అని తేల్చి చెప్పేశారు. విజయచంద్రకు రాజకీయ నేపధ్యం లేకపోయినా పార్వతీపురం టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని నియోజకవర్గం టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. బలమైన కేడర్, పార్టీతో లాంగ్ జర్నీ, ఆపద కాలంలో పార్టీని నిలబెట్టారు అనే సెంటిమెంట్, ఎమోషన్ ఏ మాత్రం లేకుండా డబ్బున్నోడు కనబడగానే సీనియర్లను పూచిక పుల్లల్లా తీసి పక్కన పడేస్తున్నారు పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు. చంద్రబాబు నైజం తెలుసుకుంటున్న జిల్లా సీనియర్లు ఆయనపై మండిపడుతున్నారు. -
రేపు వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం
-
విజయనగరం జిల్లాలో డ్వాక్రా సంఘాల మహిళలకు ఆర్థికసాయం
-
సీనియర్లకు టీడీపీ అధినేత ఝలక్
అవసరానికి వాడుకోవడం.. అవసరం తీరాక మోహంచాటేయడం.. మాట విననివారికి వెన్నుపోటు పొడవడం వంటివి చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య!. ఓటర్లు, నాయకులు, సొంత బంధువులపైనా ఆయనది అదే ధోరణి!. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార దాహంతో రగిలిపోతున్నారు. దీనికోసం పార్టీకి దశాబ్దాల తరబడి సేవలందించిన సీనియర్ నాయకులను కాదని డబ్బున్నోళ్లకే సీట్లు కేటాయించేందుకు రెడీ అవుతుండడంతో ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేగుతోంది. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును కొన్ని వర్గాలవారు బహిరంగంగానే విమర్శిస్తుండగా, మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: వారంతా ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు... సుదీర్ఘ కాలంగా తెలుగుదేశంపార్టీలో విశేషమైన సేవలు అందించినవారు... అందులోనూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా! టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఆ పార్టీను, అధినేత చంద్రబాబును నమ్ముకునే ఇన్నాళ్లూ ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర వైఫల్యం చెందినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబును ప్రజలు ఛీదరించుకున్నప్పటికీ ఆయన వెన్నంటే ఉంటూ నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చారు. తీరా 2014 ఎన్ని కలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నో దశాబ్దాలుగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వారి కష్టాన్ని గుర్తించకుండా వారి దగ్గర డబ్బు సంచులు లేవనే నెపంతో ఇప్పుడు వారిని పక్కనపెట్టేసి కోట్లకు పడగలెత్తిన ప్రవాస భారతీయులను, పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు నాయకులు ఎవరైనా సరే అవసరానికి వాడుకొని కరివేపాకులా పక్కనపడేస్తారన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది. బీసీ జపం చేసే చంద్రబాబు ఆచరణలోకి వచ్చేసరికి గెలుపుగుర్రాల పేరుతో ధనబలం ఉన్న వారివైపే మొగ్గు చూపిస్తున్నారని జిల్లాలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరి నాయకత్వానికి తిలోదకాలు! ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఎస్.కోట, నెల్లిమర్ల, పార్వతీపురం నియోజకవర్గాల్లో టీడీపీ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే నాయకులు కోళ్ల అప్పలనాయుడి కోడలు కోళ్ల లలితకుమారి, పతివాడ నారాయణస్వామినాయుడు, బొబ్బిలి చిరంజీవులు. ఈ ముగ్గురు నాయకులు టీడీపీలో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్నావారే. కానీ ప్రస్తుతం వారి ముగ్గురి పరిస్థితి త్రిశంకుస్వర్గంలా మారింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ టిక్కెట్ దక్కే అవకాశాలు దాదాపుగా లేవనే చర్చలు సాగుతున్నాయి. ఆ ముగ్గురు సీనియర్ నాయకులు జిల్లాలోని ప్రధాన సామాజిక వర్గాలైన కొప్పలవెలమ, తూర్పుకాపు, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం. 45 ఏళ్ల సీనియార్టీకి చిక్కులు ఎస్.కోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కుటుంబానికి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. ఆమె మామ కోళ్ల అప్పలనాయులు ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అందులో ఆరు సార్లు టీడీపీ నుంచే కావడం గమనార్హం. ఒకసారి మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన రాజకీయ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన కోడలు లలిత కుమారి రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఐదేళ్లూ ప్రతిపక్షంలో సైతం టీడీపీ అండగా ఉన్నారు. అయితే, ఆమె దగ్గర ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి రూ.కోట్లలో డబ్బులు లేవని, ఉన్నా ఖర్చు చేయరనే ఒకేఒక్క సందేహంతో చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఆమెను పక్కనపెట్టేస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలే రాజకీయ తెరంగేట్రం చేసిన ప్రవాస భారతీయుడు గొంప కృష్ణకు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడం అందుకు ఊతమిస్తోంది. వేపాడ మండలానికి చెందిన ఆయనకు రాజకీయ నేపథ్యం లేకున్నా డబ్బులు బాగానే ఉన్నాయని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. పార్టీలో తనకు జరిగిన అవమానంపై లలితకుమారి కొన్నాళ్లుగా అగ్గి మీద గుగ్గిలం మాదిరిగా రగిలిపోయినా చంద్రబాబు ఏమి మంత్రం వేశారో కానీ తర్వాత చల్లబడిపోయారు. లోకేశ్తో డీల్... చిరంజీవులుకు ఎసరు! పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టిక్కెట్ బోనెల విజయచంద్రకేనని చంద్రబాబు విస్పష్టంగా చెప్పేశారు. ప్రవాస భారతీయుడైన ఆయనకు ఏమాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా కేవలం ధనబలం ఉందన్న కారణంతోనే టిక్కెట్ ఇస్తున్నారనే విమర్శలు ఆ పార్టీలోనే వస్తున్నాయి. నేరుగా నారా లోకేశ్తో డీల్ కుదుర్చుకొని వచ్చి ఇంతవరకు ఆ పార్టీ బాధ్యతలు చూసుకున్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు టిక్కెట్కు ఎసరు పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పతివాడకు తీవ్ర పరాభవం... నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ వింత ఆచారానికి తెరతీసింది. నలభై సంవత్సరాలుగా టీడీపీలో ఎనలేని సేవలు అందిస్తూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపొందిన పతివాడ నారాయణస్వామినాయుడిది ఒక రికార్డు. ప్రోటెం స్పీకర్గా, చక్కెర, వాణిజ్యశాఖా మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం ఆయనను, ఆయన వారసులను కనీసం పట్టించుకోవడం లేదు. వారిని పక్కనబెట్టి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కర్రోతు బంగార్రాజును ఏడాది కిందట టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా చంద్రబాబు నియమించారు. కానీ ఇప్పుడు టీడీపీ–జనసేన పొత్తులో భాగంగా నెల్లిమర్ల టీడీపీ టిక్కెట్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవికి కేటాయించడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో బంగార్రాజు వర్గం కంగుతింది. విజయనగరానికి చెందిన ఆమె, ఆమె భర్త మిరాకిల్ ఇంజినీరింగ్ కాలేజీ, మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలకు అధిపతులు. కోట్లాది రూపాయల సంపద ఉన్న వారి ముందు పతివాడ 40 ఏళ్ల అనుభవం, కర్రోతు బంగార్రాజు సామాజిక బలం చంద్రబాబుకు కనిపించకుండాపోయాయనే చర్చ సాగుతోంది. ఎక్కువ కాలం విదేశాల్లోనే ఉన్న మాధవి జనసేన పార్టీ తరఫున నెల్లిమర్ల టిక్కెట్ తనకే వస్తుందన్న ధీమాలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోవైపు గంటా శ్రీనివాసరావు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఐదేళ్లకోసారి నియోజకవర్గం మార్చేసే ఆయన ఈసారి నెల్లిమర్ల నుంచి టీడీపీ టిక్కెట్తో బరిలోకి దిగుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. ధన బలం ఉన్న లోకం మాధవి, గంటా శ్రీనివాసరావుల పేరు తప్ప పతివాడ కుటుంబం పేరు ఎక్కడా టీడీపీ–జనసేనలో వినిపించలేదు. కనిపించట్లేదు! -
ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా పాలన: డిప్యూటీ స్పీకర్
-
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో తెరుచుకున్న అంగన్వాడీ కేంద్రాలు
-
నకిలీ రిజిస్ట్రేషన్లు.. టీడీపీ నేతల భూకబ్జా
-
గెలిచేది వైఎస్సార్సీపీ జెండా.. నిలిచేది జగన్ అజెండా
సాక్షి విజయనగరం: జిల్లా బొబ్బిలి గడ్డపై వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర గర్జించింది. అశేష జనవాహిని స్వాగత నినాదాల మద్య వైఎస్సార్ సీపీ సామాజిక సాదికార బస్సు యాత్ర బొబ్బిలిలో అడుగుపెట్టింది. ఈ సందర్బంగా స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. బొబ్బిలి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో వైఎస్ఆర్ సీపీ నేతలు, ప్రజా ప్రతినిదులుముచ్చటించారు. అనంతరం బొబ్బిలి జంక్షన్ వద్ద జరిగిన బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు శంబంగి చిన అప్పలనాయుడు, పుష్పశ్రీ వాణి, బొత్స అప్పలనర్సయ్య తదితరులు హాజరయ్యారు. రుణాల మాపీపై బాబు పంగనామాలు పెట్టాడు, జగన్ టీడీపీ వదిలిన అప్పులు తీర్చారు - డిప్యూటీ సీఎం బూడి ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని గత పాలకులు ఎంతలా విస్మరించారో, యువనేత జగన్ సీఎం అయ్యాక ఎలా ప్రజల కలలను సాకారం చేసారో ప్రజలు గమనిoచాలన్నారు. బొబ్బిలి కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేస్తే, జగన్ అధికారంలోకి రాగానే ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారని వివరించారు. ఎస్టీ మహిళ అయిన పుష్ప శ్రీవాణి, ఎస్టీ నేత అయిన పీడిక రాజన్నదొర, బీసీ వర్గానికి చెందిన తాను ఉప ముఖ్యమంత్రులుగా ముఖ్యమంత్రి జగన్ పక్కన కూర్చొని పాలన సాగించడమే సామాజిక సాధికారతకు నిదర్శనమన్నారు. 25 మంది కేబినెట్ మంత్రులు ఉండగా, వారిలో 17 మంది బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకే కేటాయించారని గుర్తు చేసారు. గడిచిన ఎన్నికలలో ఎవరు ఏ పార్టీకి ఓటు వేసారనే లెక్క లేకుండా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కరేనన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో చంద్రబాబు పంగనామాలు పెట్టి మోసం చేస్తే, జగన్ సీఎం కాగానే బాబు ఎగ్గొట్టిన అప్పులన్నీ తీరుస్తున్నారన్నారు. వచ్చే జనవరి నుంచి అవ్వా తాతలకు పింఛన్ రూ. 3 వేలు చేయబోతున్నారని, ఎప్పుడూ రెండు వేళ్లు చూపే టీడీపీ నేతలకు పండగ నుంచి మూడు వేలు తీసుకుని వారికి మూడు వేళ్లు చూపాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ స్థాయి సంపన్నుల పిల్లలు ఎలా చదువుకుంటారో, పేదల పిల్లలు కూడా అలానే అభ్యసించాలని ప్రభుత్వ స్కూల్స్ ను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మార్చారని వివరించారు. పేద విద్యార్థుల ఉజ్వల భవిత కోసం జగన్ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసారని, బొబ్బిలి రాజుల పిల్లలే ఆంగ్లంలో చదువుకోవాలా, ఎస్సీ, బీసీ, ఎస్టీ పిల్లలు చదువుకోకూడదా అని జగన్ నాడు - నాడు ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. 2024 ఎన్నికల్లో బొబ్బిలిలో శంబంగి చిన అప్పల నాయుడును, రాష్ట్రంలో జగన్ ను మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ముత్యాల నాయుడు ఉద్గాటించారు. జగన్ ఆశీస్సులతో 11,500 ఎకరాలకు సాగునీరిచ్చాం. బొబ్బిలి రాజులు సొంత ఆస్తులు పెంచుకున్నారు - ఎమ్మెల్యే శంబంగి బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు మాట్లాడుతూ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ, ఇప్పుడు వైఎస్ జగన్ సారథ్యంలో బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతాంగానికి నాలుగున్నరేళ్లలో 11,500 ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందించామని, మరో 4,500 ఎకరాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి లేని పాలనను దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అందిస్తున్నారని వివరించారు. మాట తప్పని, మడమ తిప్పని ఖ్యాతి జాతీయ స్థాయిలో జగన్ కు మాత్రమే ఉందని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 606 హామీలిచ్చి కనీసం ఆరు హామీలు కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. అర్హతలే ప్రతిపాదికగా తీసుకుని సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరుస్తున్నారని, కుల, మతాలకు, రాజకీయాలకు తావు లేకుండా అమలు చేస్తున్నారని వెల్లడించారు. బొబ్బిలి రాజులను నమ్ముకుంటే సొంత డబ్బుతోనైనా ఆదుకుంటారని ప్రచారం చేసుకుంటే, ప్రజల నమ్మి గెలిపిస్తే సొంత ఆస్తులే పెంచుకుని ఓటర్లను వంచించారని విమర్శించారు. గెలిచేది వైఎస్సార్ సీపీ జెండా... నిలిచేది జగన్ అజెండా - కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ, బొబ్బిలి అడ్డా.. జగన్ అన్న అడ్డాగా నిలిపి బొబ్బిలి కోటపై వైఎస్సార్ సీపీ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఎప్పుడూ గెలిచేది వైెఎస్సార్ సీపీ జెండానే అని, ఎన్నడూ నిలిచేది జగన్ అజెండానే అని అభివర్ణించారు. జగన్ ను విమర్శించే టీడీపీ నాయకులకు తాను సవాల్ చేస్తున్నానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యథికంగా మేలు చేసినట్లు చెప్పే ధైర్యం తమకు ఉందని, అలా చెప్పే దమ్ము తెలుగు తమ్ముళ్లకు ఉందా అని సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందో, చంద్రబాబు ప్రభుత్వంలో మేలు జరిగిందో తేల్చుకుందాం రావాలని సవాల్ విసిరారు. ఇది దళితుల, ఎస్టీల, బీసీల ప్రభుత్వమని, పేదల కోసం పాటుపడుతోందని వివరించారు. ఓట్ల కోసం ఇంటికి వచ్చే టీడీపీ నేతలను గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసారో, ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని నిలదీయాలని పిలుపునిచ్చారు. చెరకు రైతులను టీడీపీ మోసం చేస్తే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ. 35 కోట్లు యాజమాన్యం నుంచి వసూలు చేసి చెల్లించింది - జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, బొబ్బిలిలో సామాజిక సాధికార యాత్రకు వచ్చిన ప్రజానీకాన్ని చస్తుంటే జన సునామీని తలపిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా మోసం చేసి ఇప్పుడు మళ్లీ ఓట్లు కోసం వస్తున్నారని, వారిని చెప్పే మాయ మాటలను నమ్మవద్దని హితవు పలికారు. చెరకు రైతులను షుగర్ ఫ్యాక్టరీ నిలువునా ముంచేసి మోసం చేస్తే వైెఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ. 35 కోట్లు యాజమాన్యం నుంచి ముక్కుపిండి వసూలు చేసి రైతులకు అందించామన్నారు. విజయనగరం జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల రూపు రేఖలు మారుస్తున్న ఘనత జగన్ దేనని కొనియాడారు. వెనుకబడిన వర్గాలన్నీ జగన్ సారథ్యంలో అథికారం అనుభవిస్తున్నామని, టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ పనుల కోసం బొబ్బిలి రాజుల గేటు వద్ద కాపలా కాయాలని వివరించారు. తోటపల్లి, మడ్డువలస వంటి ప్రాజెక్టులను తీసుకువచ్చి రైతులను ఆదుకున్నామని, చెరకు రైతుల సమస్యలను పరిష్కరించి వారికి కూడా అండగా ఉంటామన్నారు. విద్య,వైద్యం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు జగన్ కే సాధ్యం - ఎంపీ బెల్లాన విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి పేదలకు చేరువ చేస్తున్నారన్నారు. సంక్షేమం ఓ వైపు, అభివృద్ధి మరోవైపున చేస్తూ జగన్ జనరంజక పాలన చేస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి పాలనను ప్రజల చెంతకు తీసుకువచ్చి గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ఏకైక నేత ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. -
13 అడుగుల గిరినాగు అలజడి
ఎస్.కోట పట్టణంలోని ఇండియన్ ఆయిల్ బంక్ సమీపంలో రాత్రి 7.30 గంటల సమయంలో సుమారు 13 అడుగుల పొడవు ఉన్న గిరినాగు హల్చల్ చేసింది. దీనిని స్థానికులు గుర్తించి స్నేక్క్యాచర్ వానపల్లి రామలింగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు. ఆయన చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాటిపూడి రిజర్వాయర్ అటవీప్రాంతంలో పామును విడిచిపెడతానని స్నేక్క్యాచర్ తెలిపాడు. -
విజయనగరం: పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ (ఫొటోలు)
-
విజయనగరంలో YSRCP సామాజిక సాధికార బస్సు యాత్ర
-
బాధితులకు సత్వర భరోసా
సాక్షి ప్రతినిధి, విజయనగరం/ఆరిలోవ (విశాఖ తూర్పు): బాధితులకు సహాయం చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనితీరు మరోసారి రుజువైంది. జెట్స్పీడ్తో ఆయన తీసుకున్న నిర్ణయాలు విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో ప్రాణనష్టాన్ని కనిష్టస్థాయికి తీసుకురాగలిగాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును సంఘటన స్థలికి పంపించారు. క్షతగాత్రులను త్వరగా ఆస్పత్రికి తరలించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు. మిగతా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా బస్సులు ఏర్పాటు చేయించారు. విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్షతగాత్రుల కోసం రెండు వార్డులను సిద్ధం చేశారు. తీవ్ర రక్తస్రావంతో వచి్చనవారికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వెనువెంటనే వైద్యులు తగిన చికిత్స చేశారు. దీంతో కొంతమందికి ప్రాణాపాయం తప్పింది. సోమవారం మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్ విజయనగరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 23 మంది క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎక్స్గ్రేషియాను ప్రకటించడంలోనూ, రెండురోజుల వ్యవధిలోనే వారి చేతికి చెక్కులను అందించడంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవను విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు. మానవతా దృక్పథంతో ఎక్స్గ్రేషియా.. రైల్వే శాఖ ప్రకటించిన నష్టపరిహారంతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా మంజూరుచేశారు. 13 మంది మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున రూ.1.30 కోట్లు, క్షతగాత్రులకు తీవ్రతను బట్టి రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కులను క్షతగాత్రులకు మంగళవారం, బుధవారం ఇచ్చారు. బుధవారం చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని నాలుగు కుటుంబాలకు మంత్రి బొత్స సత్యనారాయణ, శృంగవరపుకోట నియోజకవర్గం పరిధిలో ఒక కుటుంబానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చెక్కు అందజేశారు. మిగతావారికి గురువారం అందించనున్నారు. విశాఖలో రైలు ప్రమాద బాధితులకు పరిహారం విజయనగరం జిల్లా రైలు ప్రమాదంలో మృతిచెందిన రైల్వేగార్డు మరిపి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నష్టపరిహారాన్ని ప్రజాప్రతినిధులు బుధవారం అందించారు. విశాఖపట్నం ఆరిలోవ బాలాజీనగర్లో ఉంటున్న ఆయన కుటుంబసభ్యులకు నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి వైఎస్సార్సీపీ నాయకుడు గొలగాని శ్రీనివాస్, అధికారులతో కలిసి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. హెల్త్సిటీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్వతీపురం మన్యం జిల్లా ఇందిరాకాలనీకి చెందిన కోలా నానాజీకి రూ. 5 లక్షల చెక్కు ఇచ్చారు. ఇక, కేజీహెచ్లో చికిత్స పొందుతున్న నల్లా కుమారికి రూ. 5 లక్షలు, రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బి.తేజేశ్వరరావుకు రూ. 2 లక్షల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే వాసుపల్లి గణే‹Ùకుమార్ అందజేశారు. రైలు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి మహారాణిపేట (విశాఖ దక్షిణ): విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముర్రు లక్ష్మి (40) మృతి చెందారు. గాజువాకకు చెందిన ఆమె బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ తెలిపారు. కుటుంబంలో ముగ్గురూ ఒకేచోట.. రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయనగరం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ వ్యక్తి పేరు జక్కల వెంకటరమణ. ఆ పక్కనున్న బెడ్పై ఉన్నవారు అతని భార్య బంగారుతల్లి, చిన్నారి కుమార్తె కోమలి. విశాఖపట్నం గాజువాకకు చెందిన ఆ కుటుంబం విజయనగరం జిల్లా గరివిడిలోని అత్తారింటికి వస్తూ ఈ ప్రమాదం బారినపడ్డారు. తండ్రి, తల్లి, చిన్నబిడ్డ.. ఇలా ముగ్గురు ఒకేచోట గాయాలతో ఉండటం చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చలించిపోయారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బంగారుతల్లికి రూ.10 లక్షలు, వెంకటరమణకు రూ.5 లక్షలు, కోమలికి రూ.2 లక్షలు.. మొత్తం రూ. 17 లక్షలు ఎక్స్గ్రేషియా మంజూరు చేశారు. ఆ చెక్కులను మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం అందజేశారు. సీఎం జగన్కు రుణపడి ఉంటాం రైలు ప్రమాదంలో నా భర్త రాము చనిపోయాడని తెలిసి కుప్పకూలిపోయాను. మా కుటుంబానికి ఆ దేవుడే దిక్కు అని కుమిలిపోయాను. అంతటి విషాదంలో ఉన్న మాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా నిలబడటంతో కొండంత ధైర్యం వచ్చింది. రూ. 10 లక్షలు ఇచ్చిన ఆయనకు రుణపడి ఉంటాం. వైఎస్సార్ బీమా కింద మరో రూ. 5 లక్షలు సాయం అందుతుందని చెప్పారు. తక్షణ సాయం కింద రూ. 10 వేలు ఇచ్చారు. – మజ్జి శారద, గదబవలస, గరివిడి మండలం, విజయనగరం జిల్లా చెప్పిన వెంటనే సాయమందించారు నా భర్త పిళ్లా నాగరాజు రైలు ప్రమాదంలో చనిపోయారు. ఎలా బతకాలో తెలియక కుటుంబమంతా రోదిస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో మా పట్ల ముఖ్యమంత్రి స్పందించిన తీరు మరచిపోం. ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పిన వెంటనే చెక్కు పంపించారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. – పిళ్లా కళావతి, కాపుశంభాం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా