హ్యాండర్లతో టచ్‌లో ఉంటూ బాంబు పేలుళ్లకు కుట్ర చేశాం! | Key Facts In Vizianagaram Blasts Conspiracy Case | Sakshi
Sakshi News home page

హ్యాండర్లతో టచ్‌లో ఉంటూ బాంబు పేలుళ్లకు కుట్ర చేశాం!

May 28 2025 5:48 PM | Updated on May 28 2025 7:24 PM

Key Facts In Vizianagaram Blasts Conspiracy Case

విజయనగరం:  ఉ‍గ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసుకు సంబంధించి పోలీసుల విచారణ ముగిసింది.  ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సిరాజ్, సమీర్ లను ఆరు రోజుల పాటు విచారించారు పోలీసులు. ఈ రోజు(బుధవారం) వైద్య పరీక్షల అనంతరం వీరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. అయితే పోలీసుల విచారణలో పలు చోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకరించాడు.  దీనిలో భాగంగా పలు దేశాల హ్యాండర్లు టచ్ లో ఉన్నట్లు సిరాజ్ స్పష్టం చేశాడు.

ఉ‍గ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్‌ అరెస్ట్‌ తర్వాత విజయనగరంలో అదృశ్యమైన వారు ఎవరు?. హైదరాబాద్‌లో సమీర్‌ ఇంట్లో సమావేశమైన వారు ఇప్పుడు ఎక్కడ?’’ అనే వివరాలను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులు పురోగతి సాధించినట్లు కనబడుతోంది.

బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సూత్రధారి సిరాజేనని, దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు వ్యూహరచన చేశాడని నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) విచారణలో తేలినట్టు సమాచారం. ఉగ్రవాద భావజాలం, పేలుడు పదార్థాలు కలిగిన హైదరాబాద్‌కు చెందిన సమీర్, విజయనగరం జిల్లా ఆబాద్‌వీధికి చెందిన సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌ను ఈ నెల 16న కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ ఆరు రోజులు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయనగరం పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలలో ఎన్‌ఐఏ, స్థానిక పోలీస్‌ అధికారులు విచారించారు.

Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం

ఆరు రోజుల పాటు విచారణలో తొలి మూడు రోజులు నోరు విప్పని సిరాజ్‌, సమీర్‌లు.. ఆ తర్వాత కీలక విషయాలను బహిర్గతం చేయక తప్పలేదు.  ప్రధానంగా పేలుళ్లకు పథకం ర.చన చేసింది సిరాజేనని సమీర్‌ స్నష్టం చేశాడు. అయితే దీనిపై ఈరోజు(బుధవారం) సిరాజ్‌ను పోలీసులు విచారించగా నిజాన్ని అంగీకరించాడు. బాంబు పేలుళ్లకు పథకం రచన చేసింది తానేనని చెప్పుకొచ్చాడు. పల ఉగ్ర కుట్ర హ్యాండర్లతో టచ్‌ లో ఉంటూ బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలిపాడు. 

ఇదిలా ఉండగా, సౌదీలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన సిరాజ్, హైదరాబాద్‌లో ఉంటూ తరచూ సౌదీతోపాటు ఓమెన్‌ దేశాలకు వెళ్లినట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. వరంగల్‌కు చెందిన ఫర్హన్, ఢిల్లీకి చెందిన బాదర్, సౌదీకి చెందిన ఇమ్రాన్‌తో మిలాఖత్‌ అయ్యి పాకిస్థాన్‌కు చెందిన ఓ ముస్లిం సంస్థతో టై అప్‌ అయినట్టు సమాచారం. అహీం గ్రూప్‌ ద్వారా ఆ సంస్థతో సిరాజ్‌  ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ భారీ కుట్రకు ప్లాన్‌ చేసినట్లు వెల్లడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement