గోదావరి నమోస్తుతే | godavari ending pushkara | Sakshi
Sakshi News home page

గోదావరి నమోస్తుతే

Published Sat, Aug 6 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

పుష్కరఘాట్‌ వద్ద గోదావరికి హారతి ఇస్తున్న పూజారి

పుష్కరఘాట్‌ వద్ద గోదావరికి హారతి ఇస్తున్న పూజారి

గోదావరి అంత్యపుష్కరాలను పురస్కరించుకుని శుక్రవారం ఆరో రోజు సాయంత్రం పూజారులు గోదారమ్మకు ప్రదోశకాల హారతినిచ్చారు. ఉదయం వేళలో భక్తులు కార్లు, ప్రైవేట్‌ వాహనాల్లో మంగపేట పుష్కరఘాట్‌కు తరలివచ్చి పుష్కరస్నానాలు ఆచరించారు.

  • ఆరో రోజు ప్రదోశకాల హారతి
  • మంగపేట ఘాట్‌వద్ద భక్తుల పుష్కరస్నానాలు
  • మంగపేట : గోదావరి అంత్యపుష్కరాలను పురస్కరించుకుని శుక్రవారం ఆరో రోజు సాయంత్రం పూజారులు గోదారమ్మకు ప్రదోశకాల హారతినిచ్చారు. ఉదయం వేళలో భక్తులు కార్లు, ప్రైవేట్‌ వాహనాల్లో మంగపేట పుష్కరఘాట్‌కు తరలివచ్చి పుష్కరస్నానాలు ఆచరిం చారు. ఈ సందర్భంగా మహిళలు గోదావరి వద్ద కొబ్బరికాయలు కొట్టి, నదిలో పసుపు, కుంకుమలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  పూలు, పండ్లు, జాకెట్, గాజులు నీటిలో వదిలారు. కొందరు భక్తులు తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement