గాజా : గాజా స్ట్రిప్లోని ఖాన్ యూనిస్ నగరంపై శనివారం ఇజ్రాయిల్ వైమానికి దాడి చేసింది. ఆ దాడిలో ఎనిమిది మంది మరణించగా, మరో 10 మంది గాయపడ్డారని ఉన్నతాధికారి వెల్లడించారు. నగరంలోని నివాసంపై మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఖాన్ యూనిస్ నగరంలోని జనావాసాలపై దాడి చేయడంతో ఇళ్లలోని వారంతా చనిపోయారని చెప్పారు. గాజా నగరంపైపై ఇజ్రాయిల్ శుక్రవారం నిర్వహించిన వేర్వేరు దాడుల్లో అయిదుగురు మరణించారని తెలిపారు.