మదనపల్లిలో లక్ష గర్జన సమర భేరి | Laksha Garjana samarabheri : A Voice Against State Bifurcation By 1 Lakh People in chittoor district Madanapalle | Sakshi
Sakshi News home page

మదనపల్లిలో లక్ష గర్జన సమర భేరి

Published Mon, Aug 26 2013 10:20 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM

మదనపల్లిలో లక్ష గర్జన సమర భేరి

మదనపల్లిలో లక్ష గర్జన సమర భేరి

మదనపల్లి : సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం  చిత్తూరు జిల్లా మదనపల్లిలో లక్ష గర్జన సమరభేరి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక హెడ్ పోస్టాఫీసు సమీపంలోని అనిబిసెంట్ సర్కిల్ వద్ద లక్ష గర్జన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు సమైక్యవాదులు పాల్గొన్నారు.  లక్షసార్లు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేపట్టారు. అలాగే బెంగళూరు రోడ్డు, మల్లికార్జున సర్కిల్, పటేల్ రోడ్డులను దిగ్బంధం చేశారు.

ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు జేఏసీ నేతలు, ఆర్టీసీ, కార్మిక సంఘాలు, న్యాయవాదులు, మహిళ సంఘాలు, ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలలు, వ్యాపారులు, రైతులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement