Madanapalle
-
AP: మహిళా పోలీసు అనుమానాస్పద మృతి.. కారణం అదేనా?
సాక్షి, మదనపల్లె: సచివాలయ మహిళా పోలీసు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రామారావుకాలనీ స్టోర్వీధికి చెందిన అరుణమ్మ, రెడ్డెప్పల కుమార్తె రెడ్డిరోజా(35)ను, పట్టణంలోని నిమ్మనపల్లె రోడ్డు విద్యోదయా కాలనీకి చెందిన లక్ష్మీరవికుమార్తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. రెడ్డిరోజా కలికిరి మండలం పారపట్ల సచివాలయంలో మహిళా పోలీస్గా పనిచేస్తుండగా, కలికిరి పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో లక్ష్మీరవికుమార్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. దంపతులు ఇద్దరూ కలికిరిలో నివాసం ఉంటున్నారు.రెడ్డిరోజా శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వచ్చిన అనంతరం మదనపల్లెలో బంధువుల ఇంటిలో జరుగుతున్న శుభకార్యానికి హాజరైంది. సాయంత్రం భర్తతో కలిసి రామారావుకాలనీలోని ఇంటికి వెళ్లింది. అక్కడే ఇద్దరూ ఒకే గదిలో ఉండగా, భర్త టీ కోసం బయటకు వచ్చి పది నిమిషాల అనంతరం గదిలోకి వెళ్లాడు. అప్పటికే రెడ్డిరోజా చీరచున్నీతో గదిలోని ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతుండగా కిందకు దించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అక్కడి నుంచి హుటాహుటిన రెడ్డిరోజాను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీ గదికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ రమణ ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించారు.అయితే, గత 15 సంవత్సరాలుగా తమకు పిల్లలు లేకపోవడం, అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో తన భార్య రెడ్డిరోజా తీవ్ర మనస్తాపానికి గురైందన్నారు. పలుమార్లు ఈ విషయమై తన వద్ద బాధపడేదని, శనివారం శుభకార్యంలో మరోసారి రెడ్డిరోజా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని భర్త లక్ష్మీరవికుమార్ చెప్పారు. కాగా, రెడ్డిరోజా తల్లిదండ్రులు అరుణమ్మ, రెడ్డెప్పలు బంధువులతో కలిసి ఆస్పత్రికి చేరుకుని తమ బిడ్డ మృతికి అల్లుడు లక్ష్మీ రవికుమార్ కారణమని ఆరోపిస్తూ గొడవకు దిగారు. గదిలో ఉన్న 10 నిమిషాల్లోనే తమ కుమార్తె ఎలా ఉరివేసుకుంటుందని వాదనకు దిగారు. ఆస్పత్రి అవుట్పోస్ట్ పోలీస్ సిబ్బంది వారికి సర్దిచెప్పి, స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో అక్కడి నుంచి వెళ్లి వారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
మా ఎమ్మెల్యేకు నెలనెలా రూ.30 లక్షలు ఇవ్వాలట..
మదనపల్లె: ‘మా ఎమ్మెల్యే నన్ను పనిచేసుకోనివ్వట్లేదు. ప్రతినెలా రూ.30 లక్షలు కప్పం కట్టమంటున్నారు. ఆయన పురమాయించిన పనులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ చేసి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఆయన అక్రమాలకు సహకరించకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. నేను అవినీతిపరురాలినని.. పార్టీ అనుకూల పత్రికల్లో వార్తలు రాయించి వేధింపులకు గురిచేస్తున్నారు’.. అంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లె తహసీల్దార్ ఖాజాబీ ఏకంగా సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ను స్వయంగా కలిసి చెప్పుకున్న గోడు ఇది.తాను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితులు కల్పించాలని ఆమె వారిని వేడుకున్నారు. అధికార పారీ్టకి చెందిన మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై అక్కడి తహసీల్దార్ నేరుగా ముఖ్యమంత్రినే కలిసి ఆరోపించడం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. పాలనా వ్యవహారాల్లో టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల అరాచకం ఈ సంఘటనకు అద్దంపడుతోంది. తన ఫిర్యాదులో తహసీల్దార్ ఖాజాబీ ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ఆఫీసుకు రాకుండా అడ్డుకుంటున్నారు..‘ఆయన చెప్పిన పనులు వీలుకాక పోయినా చేసి తీరాల్సిందేనంటున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగే ప్రతీపని తనకు చెప్పి చేయాలని బెదిరిస్తున్నారు. మండలంలోని బసినికొండ గ్రామం సర్వే నంబర్లు 718/8ఎ, 774/3, 510/1ఏ/2, వెంకప్పకోట సర్వే నంబర్.71/2కు సంబంధించి రెవెన్యూ చట్టం ప్రకారం సరిగ్గా ఉండడంతో మ్యుటేషన్ చేశానని, ఎమ్మెల్యేకు చెప్పకుండా ఎందుకు చేశావంటూ బెదిరిస్తూ, నన్ను ఆఫీసుకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇక కోళ్లబైలు గ్రామం సర్వే నంబర్ 965/5, 595లో 1.80 ఎకరాల్లో లేఔట్ వేసి రెండు సెంట్ల చొప్పున ఎమ్మెల్యే మనుషులకు ఇవ్వాలన్నారు. కానీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు సెంట్లు ఇచ్చే అవకాశంలేదని చెబితే వినిపించుకోలేదు.ల్యాండ్ కన్వర్షన్లు, మ్యుటేషన్లు తదితర రెవెన్యూ సేవలు ఎమ్మెల్యేకు చెప్పకుండా చేయరాదని హుకుం జారీచేశారు. అలాగే, తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ అస్లాం బాషాను ఎమ్మెల్యే తన చెప్పుచేతల్లో ఉంచుకుని, రికార్డులను సబ్ కలెక్టరేట్, కలెక్టరేట్కు పంపకుండా, పాలనాపరమైన పనులు జరగనీయకుండా అడ్డుకుంటూ, మానసికంగా నన్ను తీవ్ర ఒత్తిడులకు గురిచేస్తున్నారు. పైగా.. టీడీపీ అనుకూల పత్రికలో నాపై అసత్యాలు ప్రచారం చేయించారు’.. అంటూ ఆమె సీఎం, లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. -
AP: ధర్మవరం సీఐ తల్లి కిడ్నాప్
మదనపల్లె/రాయచోటి: ధర్మవరం వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారి(62) మదనపల్లెలో కిడ్నాప్ అయ్యారు. గత నెల 28న ఆమె అదృశ్యమై ంది. 9 రోజులు కావస్తున్నా నేటికీ జాడ కనుక్కోలేని పరిస్థితి చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. మదనపల్లె శివారు వైఎస్ జగన్ కాలనీలో సీఐ తల్లి స్వర్ణకుమారి ఒంటరిగా నివసిస్తోంది. సెప్టెంబర్ 28న మధ్యాహ్నం ఆమె స్నేహితురాలు స్వర్ణకుమారికి ఫోన్ చేస్తే కాల్ ఫార్వర్డ్ వాయిస్ వినిపించింది. సాయంత్రమైనా ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమెకు దైవభక్తి అధికం కావడంతో తెలిసిన వారితో కలిసి దూరప్రాంతంలోని గుడికి వెళ్లిందేమోనని స్నేహితురాలు భావించింది.కాగా, అక్టోబర్ 1న పెన్షన్ తీసుకునేందుకు స్వర్ణకుమారి రాకపోవడంతో స్థానికులు ఆ విషయాన్ని కుమారుడైన సీఐ నాగేంద్రప్రసాద్కు తెలిపారు. దీంతో ఆయన మదనపల్లెకు చేరుకుని తల్లి ఆచూకీ కోసం విచారించారు. మూడు రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో అక్టోబర్ 2న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ కళా వెంకటరమణ అదృశ్యం కేసుగా నమోదుచేసి విచారణ చేపట్టారు. స్వర్ణకుమారి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, టవర్ లొకేషన్ ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తుండటంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. స్వర్ణకుమారి అదృశ్యం పట్టణంలో చర్చనీయాంశం కాగా.. ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. వెంకటేశ్ అనే యువకుణ్ణి బెంగళూరులో పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. సీఐ తల్లికే దిక్కులేకపోతే? సీఐ తల్లి అదృశ్యమైతేనే ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని జనం చర్చించుకుంటున్నారు. ముందెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో చిన్నారులు, మహిళలను కిడ్నాప్ చేసి అంతమొందించడం లాంటి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో 9 రోజులైనా సీఐ తల్లి ఆచూకీ తెలియలేదంటే.. ఆమె విషయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై వరుస అఘాయిత్యాలు భయపెడుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో వాసంతిని, పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ను తుదముట్టించిన ఘటనలు శాంతిభద్రతలను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోవడంతో బాధితులు శవాలుగా మారిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. పేపర్లకు ఉన్న విలువ ప్రాణాలకు లేదా?మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో కాగితాలు తగలబడితే చంద్రబాబు రాష్ట్ర డీజీపీని హెలికాప్టర్లో పంపించి దర్యాప్తు చేయించారు. అయితే.. బాలికలు, మహిళలను అపహరించుకుని పోయి అత్యాచారాలు చేస్తున్నా, హత్యలకు తెగబడుతున్నా పట్టించుకోవడంలేదు. -
ఫైళ్లు తగలబెడుతున్నారంటూ దుష్ప్రచారం
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): మదనపల్లె ఘటన తర్వాత ఉద్యోగులను వేధిస్తున్నారని, దీనిపై వాస్తవాలు ఇంకా నిర్ధారణ కాలేదని, ఉద్దేశపూర్వకంగా జరిగిందా? ప్రమాదమా? అనేది తేల్చలేదని ఏపీ రెవెన్యూ సరీ్వసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. దీనిపై నేటికీ సీఐడీ విచారణ కొనసాగుతోందని... ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదన్నారు. ఈ ఘటనలో ఉద్యోగులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ‘మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనలో వాస్తవాలు ఇంకా నిరా్ధరణ కాలేదు.ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా పనికిరాని కాగితాలను తీసివేస్తే.. వెంటనే ఉద్దేశపూర్వకంగా ఫైళ్లు తగలపెడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోంది. వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే మీడియా ప్రసారం చేయాలి’ అని వ్యాఖ్యానించారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు పనిచేసే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.తహసీల్దార్ కార్యాలయాల్లో రోజువారీ ఖర్చులకు కూడా నిధుల్లేవు. ప్రభుత్వం ఆదేశాలిస్తుంది గానీ నిధులివ్వట్లేదు’ అని అన్నారు. ‘ప్రస్తుతం తహశీల్దార్ కార్యాలయాల్లో అద్దె వాహనాలకు కూడా నిధులు లేవు. కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ తదితరాలకు నిధులివ్వకపోవడంతో.. సిబ్బంది జీతాల నుంచే ఖర్చు పెడుతున్నారు’ అని పేర్కొన్నారు. కాగా, ఏపీఆర్ఎస్ఏ ప్రధాన కార్యదర్శిగా రామిశెట్టి వెంకట రాజేశ్ను ఎన్నుకున్నట్లు చెప్పారు. -
ఒకటా రెండా?.. కాల్చుకు తింటోంది!
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు ఉద్యోగులు, అధికారులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వేధింపులకు గురి చేయడంపై ఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే గతంలో ఎన్నడూ లేనివిధంగా 50 మందికిపైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. నిత్యం డీజీపీ కార్యాలయానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే కూర్చుని సంతకాలు పెట్టి వెళ్లాలని 16 మంది ఐపీఎస్ అధికారులకు అవమానకరంగా ఒక మెమో జారీ చేయడంపై అధికార యంత్రాంగంపై తీవ్ర విస్మయం వ్యక్తమైంది.ఒక్క సివిల్ సర్వీసు అధికారులే కాకుండా గ్రూప్–1 అధికారులు, కింది స్థాయి ఉద్యోగులను సైతం ప్రభుత్వం అదే రీతిలో వేధింపులకు గురి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే ఈ ఘటనను రాజకీయం చేసేందుకు టీడీపీ సర్కారు ప్రయత్నించింది. మదనపల్లెలో ఫైల్స్ దగ్ధం వెనుక కుట్ర కోణం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాతో ప్రకటన చేయించింది.ప్రస్తుత ఆర్డీవో, పూర్వ ఆర్డీవోతోపాటు సీనియర్ అసిస్టెంట్ను సస్పెండ్ చేసింది. కార్యాలయంలోని మిగిలిన ఉద్యోగులను సైతం భయభ్రాంతులకు గురి చేసి తీవ్రంగా వేధించింది. అయితే ఇంతవరకు ఈ ఘటన ఎలా జరిగిందో, అసలు నిజాలు ఏమిటో తేల్చలేకపోయింది. ఇక కొద్దిరోజుల క్రితం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయానికి సంబంధించిన పనికిరాని ఫైళ్లను కిందిస్థాయి ఉద్యోగులు దగ్ధం చేస్తే దానిపైనా రాద్ధాంతం చేసింది. పోలవరానికి సంబంధించి పనికిరాని ఫైళ్లను రాజమహేంద్రవరంలో దగ్ధం చేస్తే దానిపైనా టీడీపీ హడావుడి చేసింది. ఈ ఘటనలన్నింట్లోనూ అధికారులు, ఉద్యోగులను అనుమానంతో వేధించడం మినహా ఆరోపణలను నిరూపించలేకపోయింది.ముద్ర వేసి ఇబ్బందులు..ప్రభుత్వం మారాక అన్ని శాఖల్లో అధికారులు, ఉద్యోగులను అనుమానపు చూపులు చూస్తూ వేధిస్తున్నారు. గ్రామ సచివాలయాల నుంచి రాష్ట్ర సచివాలయం వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర సచివాలయంలో వైఎస్సార్సీపీ కోసం పని చేసిన వారంటూ ఒక జాబితా విడుదల చేసి మరీ కొందరు దుష్ప్రచారానికి దిగారు. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన నియోజకవర్గంలో పనిచేసే కొందరు పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులపై పార్టీ ముద్ర వేసి పదోన్నతి లభించినా, బదిలీ అయినా రిలీవ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. -
ఆధారాలుంటే చూపండి.. నిరూపించండి
సాక్షి, హైదరాబాద్: మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనలో తన ప్రమేయం ఉన్నట్లు ఏ ఆధారాలు ఉన్నా చూపాలని, వాటిని నిరూపించాలంటూ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేశారు. ఆ ఘటనతో తనకే మాత్రం సంబంధం లేదని, సీబీఐ సహా ఎవరితో దర్యాప్తు జరిపినా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇదంతా చంద్రబాబు కుట్రే అని చెప్పారు. ఆయన బుధవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయాల్లోకి వచి్చన నాటి నుంచి తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని గుర్తు చేశారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన్ని ఎదుర్కొంటున్నందునే తనను టార్గెట్ చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. తానెలాంటి తప్పు చేయకపోయినా, కుట్రలతో దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, వ్యక్తిత్వ హననం చేస్తున్నారని మండిపడ్డారు. వారి అనుకూల పత్రికల్లో తనపై దు్రష్పచారం చేసి, వాటిని నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీఎం నుంచి మంత్రుల వరకు ఇష్టం వచి్చనట్లు మాట్లాడుతున్నారని, ఏ ఆధారాల్లేకపోయినా బురద చల్లుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచి్చన హామీలను అమలు చేయలేక, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఏమన్నా అంటే ఖజానా ఖాళీ అంటున్నారని, సూపర్ సిక్స్ గురించి కూడా బాబు మాట్లాడటంలేదంటూ దెప్పిపొడిచారు. నాపేరు చెప్పించే కుట్ర మదనపల్లెలో తగలబడ్డాయని చెబుతున్న రికార్డులు ఎమ్మార్వో, కలెక్టర్ ఆఫీస్తో పాటు సచివాలయంలో కూడా ఉంటాయని చెప్పారు. ఆ రికార్డులన్నింటి డేటా రిట్రీవ్ చేశామని చెబుతున్నారని, ఇక ఆ ఘటనలో కుట్ర కోణం ఏముందని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులను వేధిస్తూ, వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, వారితో తన పేరు చెప్పించే కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల తర్వాతా చాలా మందిని హత్య చేశారని, చాలా మంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయని, ఆ కేసులన్నింటిలో కూడా ప్రభుత్వం ఇంత వేగంగా ఎందుకు స్పందించడంలేదని ప్రశి్నంచారు. మదనపల్లెలో అగ్ని ప్రమాదం జరగ్గానే ఏదో పెద్ద విపత్తు సంభవించినట్లు ఏకంగా డీజీపీని హెలికాప్టర్లో పంపారని గుర్తు చేశారు. -
ఆధారాలుంటే నిరూపించండి.. చంద్రబాబుకు పెద్దిరెడ్డి సవాల్
సాక్షి, చిత్తూరు జిల్లా: వైఎస్సార్సీపీ నాయకులే టార్గెట్గా దాడులు చేస్తున్నారని.. కావాలనే తమ పార్టీ నేతలపై అవాస్తవాలు రాయిస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మదనపల్లె కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ చేయించుకోవచ్చని తేల్చి చెప్పారు.‘‘చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు వ్యతిరేకంగా పనిచేశారు. మదనపల్లెలో రికార్డులు తగలపడితే మాపై నిందలు వేస్తున్నారు. కార్యకర్తలతో మాపై తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారు. ఆధారాలు ఉంటే నిరూపించండి. తప్పుడు ఆరోపణలు చేసి అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. మా కుటుంబం పై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. మా ఆస్తులను ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచాం. కేసులు వేసి వేధించే ప్రయత్నం చేస్తున్నారు’’ పెద్దిరెడ్డి మండిపడ్డారు.టీడీపీ కుట్రలు రాష్ట్ర ప్రజలకు తెలుసు. రికార్డులు కాలిపోయాయని డీజీపీ హెలికాప్టర్ వేసుకొని వచ్చారు.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. రాజకీయ రంగు పులిమి.. అత్యుత్సాంతో కుట్రలు చేస్తున్నారు. కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల హామీలు నెరవేర్చాలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సూపర్ సిక్స్ అంటే చంద్రబాబు భయపడుతున్నారు. ఖజానాలో డబ్బులు లేవని సాకులు వెతుక్కుంటున్నారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా క్యారక్టర్ దెబ్బ తీసేవిధంగా చేస్తున్నారు. తాము అధికారంలోకి ఉన్నప్పుడు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు‘‘ అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్.. అగ్నిప్రమాదం కేసుకు రాజకీయ రంగు
సాక్షి, అన్నమ్మయ్య జిల్లా: మదనపల్లె అగ్నిప్రమాదం కేసులో పోలీసుల ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే టార్గెట్గా విచారణ పేరుతో హడావుడి చేస్తున్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మదనపల్లె అగ్నిప్రమాదం కేసు పేరుతో విచారణ చేపట్టారు.అగ్నిప్రమాదం కేసు పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అగ్ని ప్రమాదం కేసుకి ఒక్క పూటలోనే రాజకీయ రంగు పులిమిన సీఎం చంద్రబాబు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం టార్గెట్గా కేసును మలిచారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాజకీయ కోణంలోనే పోలీసుల విచారణ చేస్తున్నారు. రికార్డులు కాలితే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే కారణమంటూ విచారణ చేస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులందరినీ విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు.మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భారీ పోలీసు బలగాలతో విచారణ చేస్తున్నారు. ముందు 982 ఎకరాల ఫైళ్లు దగ్ధమంటూ హడావుడి చేసిన పోలీసులు.. తీరా ఆ 982 ఎకరాల పుంగనూరు రికార్డులు సెటిల్ మెంట్ ఆఫీసర్ దగ్గరే ఉన్నట్టు విచారణలో తేలింది. తాజాగా 22ఏ రికార్డుల దగ్ధమంటూ అడ్డగోలు విచారణ ప్రారంభించారు. రాజకీయ కక్ష సాధింపుకి ఫైళ్ల దగ్ధం కేసును వాడుకుంటున్న అధికార పార్టీ.. సహేతుకమైన ఫిర్యాదు లేకుండా ఇష్టానుసారంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు వేధింపులకు దిగుతున్నారు. -
మదనపల్లె సబ్కలెక్టరేట్లో అగ్నిప్రమాదం
సాక్షి రాయచోటి/బి.కొత్తకోట/మదనపల్లె/సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఆదివారం అర్థరాత్రి అగి్నప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏఓ ఛాంబర్ కుడివైపు సెక్షన్లు పూర్తిగా.. ఎడమవైపు సెక్షన్లు కొంతమేర దగ్థమయ్యాయి. అలాగే, వీటికి ఎదురుగా ఉన్న విభాగాలూ మొత్తం కాలిపోయాయి. ఈ విభాగాల్లోని రికార్డులు, కంప్యూటర్లు దగ్థమయ్యాయి. తీవ్రస్థాయిలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. దీనిపై సోమవారం సీఎం చంద్రబాబు అత్యవసర విచారణకు ఆదేశించారు. ఘటనపై కలెక్టర్ చామకూరి శ్రీధర్ను ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఉన్నపళంగా హెలికాప్టర్లో మదనపల్లెకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపు మూడు గంటలకు పైగా జరిపిన తనిఖీల్లో ఏపీఎస్పీడీసీఎల్, ఫోరెన్సిక్ ల్యాబ్, పోలీస్, రెవెన్యూ అధికారుల ద్వారా ప్రమాదానికి గల కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్రావు విద్యుత్ సరఫరా వైర్లు, మీటరు, ఇతర విద్యుత్ పరికరాలను పరిశీలించారు. విద్యుత్ సరఫరా వైరింగ్ కొన్నిచోట్ల కాలిపోయినట్లు గుర్తించారు. అలాగే, సీఐడీ, ఇంటెలిజెన్స్, శాంతిభద్రతల విభాగం, పోలీసు అధికారులూ విచారణ జరిపారు. ప్రమాదంపై విద్యుత్ శాఖాధికారులు, తహశీల్దార్లు, ఉద్యోగులనూ విచారించారు. అంతేకాక.. ఈ ఘటనపై విచారణకు పది బృందాలను ఏర్పాటుచేశారు. సెల్ఫోన్ సిగ్నల్స్పై దృష్టిపెట్టారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి డాగ్స్కా్వడ్లు.. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి ఫోరెన్సిక్ విభాగం నిపుణులను రప్పించారు.అధికారుల హడావుడితో హైటెన్షన్.. అంతకుముందు.. సోమవారం ఉదయమే పోలీసులు కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని కొద్దిమంది అధికార పార్టీ నేతలు, ఎల్లో మీడియా ప్రతినిధులను మినహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఇక అగి్నప్రమాదంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఆవరణకు చేరుకోవడం.. ఎక్కడలేని హడావుడి నెలకొనడంతో సబ్కలెక్టరేట్ చుట్టుపక్కల హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై చర్చించుకునేందుకు ఎవరూ సాహసించడంలేదు. ఎవరితో ఏం మాటా్లడితే ఏం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు.అవసరమైతే కేసు సీఐడీకి బదిలీ: డీజీపీ అనంతరం.. డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ.. అగి్నప్రమాదంపై వీఆర్ఏ డీటీకి తెలపడం, ఆమె ఆర్డీఓకి చెప్పడం.. ఆయన ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు మంటలను అదుపుచేశారన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు. అవసరాన్ని బట్టి సీఐడీకి కేసు బదిలీచేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. రెవెన్యూ శాఖలోని 25 అంశాలకు చెందిన రన్నింగ్ ఫైల్స్ దగ్థమైనట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. అలాగే, దగ్థమైన రికార్డులకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటర్ల నుంచి తిరిగి పునరుద్ధరిస్తామని వెలగపూడి సచివాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. -
మదనపల్లెలో గ్యాంగ్ వార్
భార్య, కుమార్తె చంపవద్దంటూ కాళ్లా వేళ్లా పడి వేడుకున్నా. కనికరం లేని కిరాతకులు వారి కళ్లెదుటే హతమార్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. వర్గాల ఆధిపత్య పోరుకు ప్రత్యర్థులు కలబడి బహుజన భీమ్సేన అధ్యక్షుడు పుంగనూరు శేషాద్రిని కిరాతకంగా నరికి చంపేశారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనతో పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు.మదనపల్లె : ఆధిపత్య పోరులో ప్రత్యర్థుల చేతిలో ఒకరు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని 2వ వార్డు మంజునాథ కాలనీ జగనన్న లే అవుట్లో బహుజన భీమ్సేన అధ్యక్షుడు పుంగనూరు శేషాద్రి(35) నివసిస్తున్నాడు. శేషాద్రి లారీడ్రైవర్గా పనిచేస్తున్న సమయంలో కలకత్తాకు చెందిన కమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె రెడ్డి మహేశ్వరి ఉంది. కమలకు తెలుగు సరిగా రాదు. రాత్రి 11 గంటల సమయంలో గొల్లపల్లె దళితవాడకు చెందిన కొండుపల్లి ఆనంద్, అతడి అనుచరులు చరణ్, మణికంఠ, చెన్నారెడ్డి, కొందరు లావాదేవీల విషయమై చర్చించాలని మిద్దె పైకి తీసుకెళ్లారు. మాటా మాటా పెరిగి వివాదం తలెత్తడంతో శేషాద్రిపైనా కత్తులతో దాడికి పాల్పడ్డారు. చేతి వేళ్లు అడ్డుగా పెట్టడంతో తెగి కిందపడ్డాయి. ప్రాణ భయంతో శేషాద్రి వారి నుంచి తప్పించుకుని మిద్దైపెనుంచి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. దుండగులు తలుపులు పగల గొట్టి బెడ్ రూమ్లో దాక్కున్న శేషాద్రిని హాల్ లోకి లాక్కొచ్చారు. తన భర్తను చంపవద్దని శేషాద్రి భార్య కమల, కూతురు రెడ్డిమహేశ్వరి వేడుకుంటున్నా.. అరిస్తే చంపేస్తామని బెదిరించారు. వారి కళ్లెదుటే శేషాద్రిని విచక్షణా రహితంగా నరికి చంపారు. భర్తను కళ్లముందే చంపేయడంతో కమల షాక్కు గురైంది. కొద్దిసేపటి తర్వాత తేరుకుని రోదిస్తూ పోలీసులకు హిందీలో వివరించడం కలచివేసింది. స్థానికుల సమాచారం మేరకు డీఎస్పీ ప్రసాదరెడ్డి, సీఐలు వలీబాషా, యువరాజు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. భార్య కమల ఫిర్యాదు మేరకు కొండుపల్లె ఆనంద్, చరణ్, మణికంఠ, చెన్నారెడ్డిలతో పాటు ఆరుగురిపై ప్రాథమికంగా హత్యకేసు నమోదుచేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఆధిపత్య పోరులో భాగంగానే శేషాద్రి హత్య జరిగిందని, ఇందులో రాజకీయకోణం లేదని ఆయన స్పష్టం చేశారు.పోలీసుల అదుపులో నలుగురు?హత్యకు కుట్రదారుగా భావిస్తున్న కొండుపల్లె ఆనంద్ 2014, 2020లో జరిగిన రెండు హత్యకేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. శేషాద్రి హత్యకేసులో దోషులు ఎంతమంది పాల్గొన్నారనే విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుల కోసం ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటుచేశామన్నారు. శనివారం ఉదయం శేషాద్రి ఇంటికి డాగ్స్క్వాడ్, క్లూస్టీం వెళ్లి ఆధారాలు సేకరించారు. అయితే హత్యచేసిన తర్వాత నలుగురు నిందితులు నేరుగా టూటౌన్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. ఆ సమయంలో వినియోగించిన ఏపీ–04ఏఎఫ్–5733 నెంబర్ ఇన్నోవా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితులు లొంగిపోవడంపై పోలీసులు ఎలాంటి నిర్ధారణ చేయలేదు.ఆధిపత్యం కోసమే హత్యపుంగనూరు శేషాద్రి, కొండుపల్లె ఆనంద్ ప్రజా సంఘాల్లో సభ్యులుగా పనిచేస్తున్నారు. కొండుపల్లె ఆనంద్ ప్రధాన అనుచరుడిగా ఉన్న శేషాద్రి చిన్న దందాలు, సెటిల్మెంట్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల కిందట శేషాద్రి మదనపల్లె ఎమ్మెల్యేకు పీఏ తానేనని చెబుతూ ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసినట్లు టూటౌన్ పోలీస్ స్టేషన్లో అతడిపై 420 కేసు నమోదైంది. అనంతరం శేషాద్రి తన మకాం మంజునాథ కాలనీకి మార్చాడు. ఇతరుల ప్రమేయం లేకుండా సొంతంగా ల్యాండ్ సెటిల్మెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఆనంద్కు పోటీగా బహుజన భీమ్ సేనను స్థాపించి కాలనీలో పట్టు సాధించే ప్రయత్నం చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న రామారావు కాలనీలో అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పాడు. దీంతో ఆనంద్, శేషాద్రి వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు చంపేస్తామని బెదిరించుకోవడం, గొడవలు పడడం, సామాజిక మాధ్యమాల్లో పరస్పరం విమర్శించుకోవడం, పోలీస్ స్టేషన్లో రాజీప్రయత్నాలు జరగడం వెనువెంటనే జరిగిపోయాయి. దీంతో శేషాద్రిని ముట్టుబెట్టేందుకు ఆనంద్ వర్గం పథకం వేసింది. ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని, శుక్రవారం రాత్రి శేషాద్రి టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆనంద్ వర్గీయుల చేతిలో అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. -
డబుల్ సెంచరీ గ్యారంటీ..జగన్ పిలుపు..
-
ఆంధ్రప్రదేశ్లో డబుల్ సెంచురీకి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటన... వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు నెగ్గాలని పిలుపు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సీఎం జగన్ మాస్ ర్యాగింగ్...దద్దరిల్లిన మదనపల్లె
-
పెన్షన్లు ఆపింది చంద్రబాబే: సీఎం జగన్
అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచి వచ్చే పశుపతి లాగా అధికారం కోసం ఐదేళ్ల తర్వాత ‘పసుపు’పతి చంద్రబాబు వస్తున్నాడు. వదల బొమ్మాళి వదలా.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు వస్తున్నాడు. కుర్చీ కోసం ఈ ‘పసుపు’పతి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతాడు. పొరపాటున నమ్మారంటే సంక్షేమాభివృద్ధికి వ్యతిరేకంగా ఓటేసినట్లే. ఇప్పుడున్న సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరించినట్లే. కుట్రలు, కుతంత్రాలతో జెండాలతో జత కట్టిన తోడేళ్లు ఒక్కటై వస్తున్నాయి. మోసపోకూడదని ఇంటింటా చెప్పాలి. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, కడప : ‘చంద్రబాబుకు పేదలంటే గిట్టదు. వారికి మేలు చేస్తున్న మన వలంటీర్ల వ్యవస్థ అంటే అసలే గిట్టదు. మొదటి నుంచీ ఈ వ్యవస్థపై ఏడుపే. ఈ ఏడుపులో భాగంగా మూడు రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ చూశారు. లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతు అక్కచెల్లెమ్మలకు, ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యుల ఇంటికి వలంటీర్లు వెళ్లి పింఛన్ ఇవ్వడాన్ని అడ్డుకున్నారు. ఈ పెన్షన్ డబ్బులు అందితే తప్ప జీవితాలు గడవని వారికి నెలనెలా 1వ తారీఖున ఇంటికే వచ్చి, సూర్యోదయానికంటే మునుపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇచ్చిపోతున్న వలంటీర్లపై తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత ఫిర్యాదు చేయించాడు. వారు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ ద్వారా ఆదేశాలు ఇప్పించారు. జగన్ను నేరుగా దెబ్బ కొట్టలేక ముసలి వాళ్లపై కక్ష తీర్చుకుంటున్నారు. ఇలాంటి మనిషిని ఏమనాలి?’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 6వ రోజు మంగళవారం సాయంత్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తున్నానన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు, వికలాంగులకు తోడుగా నిలిచిన వలంటీర్ వ్యవస్థను ప్రశంసించాల్సింది పోయి.. ఏకంగా ఆ వ్యవస్థను రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఈ పెద్దమనిషి గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియంను కూడా ఇలానే వ్యతిరేకించాడని, పేద పిల్లలకు ట్యాబులిస్తుంటే కూడా వ్యతిరేకించారని చెప్పారు. పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుల్లో కేసులు వేయించిన చంద్రబాబుది పెత్తందారీ భావజాలం కాదా? అని ప్రశ్నించారు. ఇలాంటి పెత్తందార్లకు, ఇలాంటి పేదల వ్యతిరేకులకు పొరపాటున ఓటు వేస్తే.. తమ పెన్షన్లు, తమకు అందే స్కీములు, ఇంటింటికీ వచ్చి సేవలందించే వలంటీర్ వ్యవస్థను రద్దు చేసేందుకు మనమే గ్రీన్న్ సిగ్నల్ ఇచ్చినట్లవుతుందని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మెరిట్ విద్యార్థి పరీక్షలకు భయపడతాడా? ► ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా విడివిడిగా రాలేకపోతున్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ లేదు.అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత కట్టి.. అబద్ధాలతో వస్తున్నారు. జెండాలు జత కట్టడమే వారి పని. ఇంత మంచి జరిగింది కాబట్టే మీ జగన్ ప్రజల గుండెల్లో గుడి కట్టాడు. అందుకే ఈరోజున ఒక్కడి మీద ఇంత మంది దాడి చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్.. వీళ్లందరూ కుట్రలు, కుతంత్రాలతో ఏకమవుతున్నారు. ► ఇంత మంది జతకట్టి వచ్చినా వాళ్లందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. 99 మార్కులు తెచ్చుకున్న మెరిట్ స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా? అటువైపు గతంలో వాళ్లు పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్.. పరీక్ష పాసవుతాడా? ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు 10 శాతం వాగ్దానాలు కూడా తన హయాంలో నెరవేర్చకుండా మోసం చేసిన చంద్రబాబు, ఆయన కూటమి నిలబడగలుగుతుందా? ► విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చినా మన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, వలంటీర్లు, పేద వర్గాలు భయపడరు. పైగా పెత్తందారులతో సమరానికి మేమంతా సిద్ధం.. అని చెబుతున్నారు. ► ‘175 అసెంబ్లీ స్థానాలకు 175, 25 ఎంపీ సీట్లుకు 25 మొత్తం రెండు వందల సీట్లు.. ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమేనా.. మళ్లీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను, పెత్తందార్లను ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలి వచ్చిన సమరయోధుల సముద్రంలా మదనపల్లె కనిపిస్తోంది. టీడీపీకి ఓటు వేసిన వారికీ మంచి చేశాం ► ఈ ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. ఇందులో 75 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారున్నారు. నాన్ డీబీటీ కూడా కలిపితే, అంటే నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాలు, వారి పిల్లలకు పెట్టే గోరుముద్ద, ట్యాబులు, విద్యా కానుక లాంటివి కలుపుకొంటే అది రూ.లక్ష కోట్లు అదనం. మొత్తంగా రూ.3.70 లక్షల కోట్ల పైచిలుకు పంపించాం. ఇదీ మన ట్రాక్ రికార్డు. ► చంద్రబాబు పేరు చెబితే.. ఆయన చేసిన ఏ మంచీ గుర్తుకు రాదు. అదే మీ జగన్ పేరు చెబితే గ్రామ, వార్డు సచివాలయాలు, అందులో 10 మంది శాశ్వత ఉద్యోగులు, ఇంటికే వచ్చి పింఛన్ ఇచ్చే, ఇతర సేవలు అందించే వలంటీర్లు, విలేజ్ క్లినిక్, మీ ఇంటి వద్దకే వైద్య సేవలు, ఉచితంగా మందులు, ట్యాబ్లెట్లు, ఉచితంగా టెస్టులు.. ఇంగ్లిష్ మీడియం, ట్యాబులు, డిజిటల్ బోధన, ఆర్బీకేలు, రైతన్నలకు సున్నా వడ్డీ, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్న్పుట్ సబ్సిడీ గుర్తుకొస్తాయి. ► 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చాం. మనం వచ్చేటప్పటికి 4 లక్షల ఉద్యోగాలుంటే, ఏకంగా మరో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మీ జగనే. ఇందులో 80 శాతం ఉద్యోగాలు నేను నా.. నా.. నా.. నా.. అని పిలుచుకునే వర్గాల వారే ఉన్నారు. ► అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, కళ్యాణమస్తు, షాదీ తోఫా.. ఈ పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మహిళా సాధికారత, దిశ యాప్, ప్రతి గ్రామంలో మహిళా పోలీసు ఉందంటే.. గుర్తుకొచ్చేది మీ జగనే. 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలోనూ వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. ► కొత్తగా 4 సీ పోర్టులు కడుతున్నాం. మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం. ఎయిర్ పోర్టులు, వాటి విస్తరణ వేగంగా జరుగుతోంది. పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ ఎవరూ వినని కంపెనీలు ఈరోజు రాష్ట్రంలోకి అడుగులు వేస్తున్నాయి. నిజమైన సామాజిక న్యాయానికి జైకొడదాం ► నిజమైన సామాజిక న్యాయానికి జై కొట్టండి. రాబోయే రోజుల్లో పేదలకు, పెత్తందార్లకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేదేమిటో తెలుసా? ప్రజలకు మంచి చేసిన ఫ్యాను.. మీ ఇంట్లోనే ఉంటుంది. అంటే అధికారంలోనే ఉంటుంది. ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది. బాబు ప్యాకేజీని గటగటా తాగేసి తన వారిని తాకట్టుపెట్టిన గ్లాసు సింక్లోనే ఉంటుంది. ఇది ప్రజల మాట. ► ఆ పొత్తుల, ఎత్తుల, జిత్తుల ముఠా ఎన్ని చేసినా, ఏమిచెప్పినా ఎంత ప్రయత్నించినా మన ప్రజలకు మనం చెప్పాల్సింది ఒక్కటే. మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు. మన భవిష్యత్తు, మన తల రాతలు ఈ ఓటు మీద ఆధారపడి ఉన్నాయని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మళ్లీ అన్నను తెచ్చుకుందాం.. అన్నే రావాలి. ఈ ఐదేళ్లుగా జరిగిన మంచిని కొనసాగించేందుకు, పేదవాడి భవిష్యత్ బాగు పడటానికి, మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడటానికి, మళ్లీ అన్నే రావాలని ప్రతి ఒక్కరికీ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి. పేదల రక్తం పీల్చే పసుపుపతి చంద్రబాబు ► మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం. ఆ ముఠా నాయకుడు నారా చంద్రబాబునాయుడు. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్న ఈ పసుపుపతి 2014లోనూ ఇదే మాదిరి పొత్తులు పెట్టుకున్నాడు. ఈ మూడు పార్టీలూ కలిసి ఇంటింటికీ ముఖ్యమైన హామీలు అంటూ పాంప్లెట్ పంపించారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, మోడీ ఫొటోలు.. కింద చంద్రబాబు నాయుడు సంతకంతో ఈ పాంప్లేట్ (చూపిస్తూ) పంపించాడు. ► ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో అడ్వర్ టైజ్మెంట్లతో హోరెత్తించారు. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రూ.87,612 కోట్లు రుణ మాఫీ చేశాడా? పొదుపు సంఘాల డ్వాక్రా రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేశాడా? ఇంటింటికీ ఉద్యోగం.. లేదా నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామ న్నాడు. ఐదేళ్లు.. అంటే 60 నెలలకు నెలకు రూ.2000 చొప్పున లెక్కిస్తే.. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చారా? అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు.. చేశాడా? ► మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మన మదనపల్లెలో ఏమన్నా కనిపించిందా? ఇలా 650 హామీలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే మోసం. అవే పొత్తులు. ఇప్పుడు సూపర్ సిక్సు, సూపర్ సెవెన్ అంటూ మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. ► గవర్నమెంట్ బడిలో ఇంగ్లిష్ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలా వద్దా? పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బ తింటుందని ఏకంగా కోర్టుకు వెళ్లి కేసులు వేసిన పార్టీలకు సమాధి కట్టాలా.. వద్దా? ఎస్సీలుగా పుట్టాలని ఎవరనుకుంటారని ఆ పుట్టుకనే అవమానించిన వారి రాజకీయాలకు చరమగీతం పాడుదాం. బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు తోకను, ఆ బాబును వెనకేసుకొస్తున్న తోకలను.. కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చుడదామని కోరుతున్నా. నాన్న గారు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్తో, మైనార్టీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాటం ఆడుతున్న ఈ చంద్రబాబుకు, కూటమికి ఈసారి ఎన్నికల్లో 30 చెరువుల నీళ్లు తాగించండి. మన అభ్యర్థులకు దీవెనలు అందించండి మన పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలుచున్న అభ్యర్థులపై మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఉండాలి. రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్రెడ్డి, రైల్వేకోడూరు నుంచి కొరుముట్ల శ్రీనివాసులు, రాయచోటి నుంచి శ్రీకాంత్రెడ్డి, రాజంపేట నుంచి అమర్నాథ్రెడ్డి, తంబళ్లపల్లె నుంచి ద్వారకనాథ్రెడ్డి, మదనపల్లె నుంచి నిస్సార్ అహ్మద్, పీలేరు నుంచి రామచంద్రారెడ్డి, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను గెలిపించాలి. మన గుర్తు ఫ్యాను అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ తిప్పికొట్టాలి. రెండు బటన్లు నొక్కాలి.. ► పేదలకు అందాల్సిన ప్రతి రూపాయి ఆగకూడదంటే, మీ పెన్షన్ మీకు హక్కుగా నేరుగా మీ ఇంటికే రావాలి అంటే బాబు లాంటి సైంధవులు ఎప్పటికీ అడ్డు పడే అవకాశం ఇవ్వకూడదు. అది జరగాలి అంటే ప్రతి పేదవాడు మరో 40 రోజుల్లో రెండు బటన్లు నొక్కాలి. ఆ పేదవాళ్ల కోసం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కాడు. ఆ పేదవాళ్లందరూ, అక్కచెల్లెమ్మలందరూ ఏకమై కేవలం రెండే రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. అప్పుడు ఈ వదల బొమ్మాళీ ఇక మన రక్తం పీల్చడానికి ముందుకు రాని పరిస్థితి ఉంటుంది. ► జగనన్నను మళ్లీ తెచ్చుకుందాం. అన్న మళ్లీ భారీ మెజార్టీతో వస్తే, జరుగుతున్న ఈ మంచి అంతా మళ్లీ కొనసాగుతుంది. మళ్లీ వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి నేరుగా ఆత్మగౌరవాన్ని కాపాడుతూ అక్కచెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటానని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఎన్నికల సంగ్రామంలో అబద్ధాన్ని, మోసాన్ని మట్టి కరిపించడానికి నేను సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమా.. (సిద్ధమే అని కేకలు). అలాగైతే సెల్ ఫోన్లు బయటకు తీసి.. టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. (ప్రజలందరూ సెల్లో టార్చ్ లైట్ ఆన్ చేసి పైకి ఎత్తి చూపించారు). ► ఓటు అడిగే నైతికత ఇంటింటికీ మంచి చేసిన మనకు మాత్రమే ఉందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని.. ఒక బైబిల్, ఖురాన్న్, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చాకే ప్రజల ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నాం. ఈ 58 నెలల్లో ఇంటింటికీ మేలు జరిగి ఉంటే మీ జగన్కు, మీ బిడ్డకు, మీ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తోడుగా నిలవాలి. -
మేమంతా సిద్ధం: సీఎం జగన్ రాకతో దద్దరిల్లిన మదనపల్లె సభ (ఫొటోలు)
-
పేదల రక్తం పీల్చే పసుపుపతిని ఎవరూ నమ్మొద్దు: సీఎం జగన్
సాక్షి, అన్నమయ్య జిల్లా : అధికారం కోసం చంద్రబాబు పసుపుపతిగా మారాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. అరుంధతి సినిమాలో పశుపతిలా చంద్రబాబు బయటకొచ్చారని మండిపడ్డారు. పసుపుపతి అయిదేళ్ల తరువాత వచ్చి వదల బొమ్మాళి అంటున్నారని దుయ్యబట్టారు. కుర్చీ కోసం పసుపుపతి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఆరో రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లాలో దారిపోడవునా సీఎం జగన్ను జనం నీరాజనాలు పలికారు. మంగళవారం మదనపల్లె బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. 2014లో ఈ పసుపుపతి మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడని ప్రస్తావించారు. ముగ్గురి ఫొటోలతో ఉన్న హామీల పత్రాలను ఇంటింటికి పంపించారని, ఆ హామీలను ఒక్కటేనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా ఇప్పుడు మరోసారి ఇదే డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. 2014 కంటే ఎక్కువ హామీలంటూ మరో డ్రామాకు తెరతీస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ పేదల రక్తం పీల్చేందుకు వస్తున్న ఈ పసుపుపతిని ఎవరైనా నమ్ముతారా అని నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని దోచుకోవాలని బాబు ప్లాన్ చేస్తున్నారని.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న బాబు తోక కత్తిరించాలన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఓర్వలేక.. కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ.. పేదలకు, పెత్తందారులకు కురుక్షేత్రం యుద్ధం జరగబోతుంది పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం ఆ ముఠా నాయకుడి పేరు చంద్రబాబు. జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం. మోసాలే అలవాట్లుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న వారితో ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నాం. గత హామీలు నెరవేర్చారా? గతంలో చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కిందరూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా? ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? ఉద్యోగం ఇవ్వలేకపోతే.. నిరుగ్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు. నిర్మించాడా? 10 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నాడు.. చేశాడా? ప్రజలంతా కూటమికి 30 చెరువుల నీళ్లు తాగించాలి జగన్ పేరు చెప్తేనే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకొస్తాయి జగన్ సీఎంగా ఉంటేనే పథకాలన్నీ కొనసాగుతాయి రూ. 2లక్షల 70 వేల కోట్ల పేదల ఖాతాల్లో జమ చేశాం. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ. 3 లక్షల 75 వేల కోట్లు ఇచ్చాం. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తు రాదు. లంచాలు, వివక్షలేని పాలన అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ పాలన. రైతు భరోసా అంటే గుర్తొచ్చేది మీ జగన్ పాలన. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ 2 లక్షల 31 వేల ఉద్యోగాలంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ 31 లక్షలపైగా ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేంది.. మీ జగన్ అమ్మ ఒడి, విద్యా దీవెన అంటే గుర్తు కొచ్చేది.. మీ జగన్ దిశ యాప్ అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి. బాబు గెలిస్తే పెన్షన్లు, పథకాలు, వాలంటరీర్ వ్యవస్థ రద్దు చేస్తాడు పేదలంటే చంద్రబాబుకు కక్ష తన మనుషులతో ఈసీకి ఫిర్యాదు చేయించి అవ్వతాతలకు పెన్షన్రాకుండా చేయించాడు. పెన్షన్లు ఇవ్వడానికి వీలు లేదని తన మనుషులతో పిటిషన్ వేయించాడు. నిమ్మగడ్డ రమేష్తో వాలంటీర్లపై ఫిర్యాదు చేయించి పేదలకు అన్యాయం చేశారు. బాబుకు ఓటు వేస్తే పెన్షన్, పథకాలను అందించిన వలంటీర్ల రద్దకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే. బాబు గెలిస్తే పెన్షన్లు, పథకాలు, వాలంటరీర్ వ్యవస్థను రద్దు చేస్తాడు. మీ పెన్షన్ మీ ఇంటికి రావాలంటే బాబులాంటి సైంధవులు రాకూడదు. వృద్ధులకు, వికలాంగులకు మంచి చేస్తున్న వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు రద్దుచేయాలన్నారు. -
ఈ సారి డబుల్ సెంచరీకి మీరు సిద్ధమా: వైఎస్ జగన్
-
99 మార్కులు తెచ్చుకున్న విద్యార్ధి పరీక్షలకు భయపడుతాడా?: సీఎం జగన్
వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలవబోతుంది. ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గేందుకు వీలు లేదు.. డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.. మీరంతా కూడా సిద్ధమేనా’ అంటూ మదనపల్లెలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్ధేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు మదనపల్లెలో కనిపిస్తున్న ప్రజాభిమానం.. జనసముద్రంలా తలపిస్తోందన్నారు సీఎం జగన్. పేదల వ్యతిరేకులను, పెత్తందారులను, ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలివచ్చిన సమరయోధుల సముద్రంలా కనిపిస్తుందని తెలిపారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే మరో ఆరు వారాల్లో జరగబోయే కురుసంగ్రామంలో పేదల పక్షాన, పేదల భవిష్యత్తు కోసం భవిష్యత్తులో గొప్ప విజయం కళ్ల ఎదుటే కనిపిస్తుందన్నారు. మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ప్రజాభిమానం పోటెత్తింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఆరోరోజు దిగ్విజయంగా సాగుతోంది. మంగళవారం చిత్తూరు జిల్లాలో దారిపోడవునా సీఎం జగన్కు జనం నీరాజనాలు పలికారు. ‘మేమంతా సిద్ధం’లో భాగంగా మదనపల్లి బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశామని.. 99 శాతం వాగ్దానాలు నెరవేర్చి ఓట్లు అడుగుతున్నామని చెప్పారు వారికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు ఇంటింటికి మంచి చేశామని, ప్రతి గ్రామానికి మంచి చేశామని.. ఆ మంచిని ప్రతి గడపకు వివరించి ఓట్లు అడుగుతన్నామని తెలిపారు. అధికారం కోసం గుంపులుగా తోడేళ్లుగా జెండాలు జత కట్టి అబద్ధాలతో వస్తున్నారని ప్రతిపక్ష కూటమిని ఉద్ధేశించి విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం ఏ ఒక్కరికీ లేదని దుయ్యబట్టారు. ఒక్కడిపై ఎంతమంది దాడి చేస్తున్నారో చూడాలని అన్నారు. 30 పార్టీలు కలిసి వచ్చినా భయపడతామా? ‘ఇంతమంది జతకట్టి వచ్చినా వాళ్లకు తెలియని విషయం ఏంటంటే.. 99 మార్కులు తెచ్చుకున్న విద్యార్ధి పరీక్షలకు భయపడుతాడా?. అటు వైపు గతంలో పరీక్షలు రాసి 10 మార్కులు కూడా తెచ్చుకొని వారు ఉన్నారు. ఇటు ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావించి 99 శాతం హామీలు నెరవేర్చిన మీ జగన్ ఉన్నారు. విలువలు, విశ్వసనీయత లేని వారు 30 పార్టీలు కలిసి వచ్చినా భయపడతామా. మేము మంచి చేయకపోతే ఇంతమంది కలిసి మాపై పోటీ చేస్తారా?. 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేని చంద్రబాబు మా ముందు నిలబడగలరా. విపక్షాల పొత్తులు చూసి ఎవరూ భయపడటం లేదు. మనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించాం. ఇంటింటికి వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు మనకు మాత్రమే ఉంది’ అని పేర్కొన్నారు. -
సీఎం జగన్ డైనమిక్ ఎంట్రీ దద్దరిల్లిన మదనపల్లె సభ
-
సీఎం జగన్ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరు..!
-
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జనగర్జన
-
Watch Live: మదనపల్లె మేమంతా సిద్ధం సభ
-
అన్నమయ్య జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, అన్నమయ్య జిల్లా: మదనపల్లి-బెంగుళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఐదుగురి మృతి చెందారు. మదనపల్లి మండలం బార్లపల్లి వద్ద ఘటన జరిగింది. -
బిల్డప్ బాబాయ్ అసలు గుట్టు బట్టబయలు
మదనపల్లె: మదనపల్లె టీడీపీ రేసులో ఉన్న బిల్డప్ బాబాయ్ కోడికొళ్ల అమరనాథ్ అసలు గుట్టు బయటపడింది. అతని ప్రధాన అనుచరుడు రాయల్ గణి మీడియా సమావేశం పెట్టి అతని చిట్టా బయటపెట్టాడు. అరచేతిలో స్వర్గం చూపించే రకం అమర్నాథ్.. గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబునే మించిపోయి నియోజకవర్గ ప్రజలను మోసగించేందుకు పలు గిమ్మిక్కులకు పాల్పడ్డాడు. వీటన్నింటిని అతని అనుచరుడు రాయల్ గణి మంగళవారం మీడియాకు వెల్లడించాడు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పీటీఎం మండలం రంగసముద్రానికి చెందిన వ్యక్తి కోడికళ్ల అమరనాథ్ గతంలో రైతుల నుంచి చీనీ, మామిడి, వేరుశెనగ కొనుగోలు వ్యాపారం చేసేవాడు. రైతులకు డబ్బులివ్వకుండా మోసం చేయడంతో మదనపల్లెతో పాటు కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో పలు స్టేషన్లలో అతనిపై 420, చెక్బౌన్స్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేళ్ల క్రితం మదనపల్లె వన్టౌన్లో కేసు నమోదయ్యాక బెంగళూరు పారిపోయి కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నాడు. ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పుడు బెంగళూరు నుంచి అద్దె గన్మెన్లు, బౌన్సర్లను వెంటేసుకుని హఠాత్తుగా మదనపల్లెలో ప్రత్యక్షమయ్యాడు. పట్టణానికి చెందిన రాయల్ గణిని వెంటేసుకుని టీడీపీ నాయకుడిగా ప్రచారం చేసుకుంటూ ఎల్లో మీడియాలో పబ్లిసిటీ చేసుకున్నాడు. ఆదికేశవులునాయుడు కుటుంబానికి సన్నిహితుడినని, బలిజ సామాజికవర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని టీడీపీ ముఖ్యనాయకుల్ని కలిసి అభ్యర్థించాడు. చంద్రబాబు దృష్టిలో పడేందుకు గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టాడు. బాబు సీఎం కావాలని 10 వేల మంది ముస్లింలకు అజ్మీర్ యాత్ర చేయిస్తున్నానని, దానికి రూ.కోటి చెక్కు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. 20 వేల మంది హిందువులను కాశీయాత్రకు సొంత ఖర్చులతో పంపుతానని, పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చాడు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మదనపల్లె నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి సీతారామ లక్ష్మణ పంచలోహ విగ్రహాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలో హడావుడి చేశాడు. ఇటీవల పీలేరులో జరిగిన ‘రా కదలిరా’ సభలో చంద్రబాబు దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో చెబుతున్నట్లు నటించి, ఫొటోలు తీయించుకుని, బాబుకు అత్యంత సన్నిహితుడినని ప్రచారం చేసుకున్నాడు. అయితే రాయల్గణితో అతనికి తేడా రావడంతో మీడియా ముందు అతని శిష్యుడే అక్రమాల్ని వెల్లడించాడు. అమర్నాథ్ పెద్ద మోసగాడని, ఆదికేశవులునాయుడు కుటుంబానికి, అతనికి ఏమీ సంబంధం లేదని గణి తెలిపాడు. అంబానీ, అదానీ, అమిత్షాతో తనకు వ్యాపార లావాదేవీలున్నాయని చెప్పడం పచ్చి అబద్ధమని, అతడిపై పలు రాష్ట్రాల్లో కేసులున్నాయని వెల్లడించాడు. అజ్మీర్ యాత్ర పేరుతో రూ.కోటి చెక్కు డ్రామా అని తెలిపాడు. అతని విషయం తెలిసిన టీడీపీ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఇదీ చదవండి: టీడీపీ ‘ఐ’ గేమ్..! -
విపరీతంగా పెరిగిపోతూ డబుల్ సెంచరీ కొట్టిన టమాట
-
టీడీపీ కార్యాలయంలో జై జగన్ అంటూ నినాదాలు..
చిత్తూరు జిల్లా: టీడీపీలో ఉన్న వర్గవిభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. నాయకులు ఏకంగా పార్టీ కార్యాలయంలోనే చంద్రబాబు వైఖరిపై విమర్శలు కురిపించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. మదనపల్లె టీడీపీ కార్యాలయంలో చంద్రబాబును బూతులు తిడుతూ టీడీపీ నేత విద్యాసాగర్ ఆగ్రహావేశం వ్యక్తం చేశారు. జై జగన్ అంటూ పార్టీ కార్యాలయంలోనే నినాదాలు చేశారు. టీడీపీ నేత విద్యాసాగర్.. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై ఈ సందర్భంగా వ్యగ్యాంస్త్రాలు సంధించారు. వయసైపోయాక బాబుకి వేపకాయంత వెర్రి వచ్చిందని మాట్లాడారు. బస్టాండ్లో టీడీపీ జెండా తగులబెడతానని అన్నారు. జగన్ మాకేమీ ద్రోహం చేయలేదు.. జై జగన్.. అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోకు సంబంధించిన ఘటన కొన్ని రోజుల క్రితం జరగగా.. ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదీ చదవండి: పార్లమెంట్ సాక్షిగా బయటికొచ్చిన వాస్తవాలు -
Madanapalle: పోలీస్స్టేషన్ ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : భర్త తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని, ఏడాది కాలంగా తనకు న్యాయం జరగలేదని మనస్తాపంతో ఓ వివాహిత ఆదివారం పోలీసుస్టేషన్ ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించింది. వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా బేతమంగళానికి చెందిన సుధా(34) మదనపల్లె మండలం కొత్తిండ్లుకు చెందిన బాలప్రసాద్తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి బాలాజీ(8) అనే కుమారుడు ఉన్నారు. అయితే భర్త, అత్త తనను వరకట్న వేధింపులకు గురి చేస్తూ చిత్ర హింసలు పెడుతున్నారని, బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ సుధా గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బాలప్రసాద్పై వరకట్నం, హత్యాయత్నం కేసులు నమోదు చేసి తాలూకా పోలీసులు రిమాండ్కు పంపారు. అనంతరం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఆదివారం సుధా మదనపల్లె తాలూకా పోలీసుస్టేషన్కు వచ్చింది. తన భర్త రెండో పెళ్లి చేసుకుని తనను మోసం చేశాడని న్యాయం చేయాల్సిందిగా కోరింది. అయితే ఎస్ఐ, సీఐలు లేరని వారు వచ్చాక రావాలని స్టేషన్ సిబ్బంది చెప్పారు. దీంతో ఆమె స్టేషన్ బయటకు వచ్చి తన వెంట తెచ్చుకున్న పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. తన భర్త తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకోవడంపై పోలీసులు కేసు నమోదు చేయలేదని, ఏడాదిగా తనకు న్యాయం జరగలేదని ఆరోపించింది. బాధితురాలిని వెంటనే పోలీసులు స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
మదనపల్లెలో కశ్మీరీ కుంకుమపువ్వు
సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కశ్మీరీ కుంకుమపువ్వు. వినడానికి ఇది ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా... అక్షరాల ఇది వాస్తవం. కుంకుమ పువ్వు సాగు చేయాలంటే కశ్మీర్కు వెళ్లాల్సినవసరం లేదు. పండించాలన్న ఆసక్తి ఉంటే.. అక్కడి వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా ఇక్కడ సృష్టించి సాగు చేయవచ్చు. అధిక దిగుబడులు సాధించవచ్చు. అలా ఎవరూ ఊహించని కశ్మీరీ కుంకుమపువ్వు సాగు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది వ్యవసాయ పట్టభద్రురాలు శ్రీనిధి. కశ్మీర్ నుంచి విత్తనాలు తెచ్చి.. కుంకుమపువ్వు సాగు కోసం శ్రీనిధి కశ్మీర్కు వెళ్లి 300 కిలోల నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేశారు. అందులో 225 కిలోలను సాగుకు వినియోగించారు. ఏరోఫోనిక్ పద్ధతిలో సుమారు 30,000 ట్రేలలో విత్తనాలను ఉంచి ఇంట్లో ముందుగానే ఏర్పాటు చేసుకున్న కశ్మీర్ తరహా వాతావరణం కలిగిన గదిలో వాటిని ఉంచారు. 2022, ఆగస్టు 20వ తేదీన ప్రారంభించిన కుంకుమపువ్వు సాగు... నవంబర్ 20కి సరిగ్గా మూడు నెలలకు తుదిదశకు చేరుకుంది. 30,000 మొక్కల్లో దాదాపుగా 20,000 మొక్కలు అంటే ఏడు గ్రాములకు పైన ఉన్న విత్తనాలు మాత్రమే పువ్వు దశకు చేరుకున్నాయి. సాధారణంగా 150 పువ్వుల నుంచి ఒక గ్రాము కుంకుమపువ్వు దిగుబడి ఉంటుంది. మదనపల్లెలో శ్రీనిధి ప్రయోగాత్మకంగా చేసిన సాగులో కశ్మీర్లో సంప్రదాయక సాగు పద్ధతిలో వచ్చే దిగుబడితో సమానంగా తొలి ప్రయత్నంలోనే 200 గ్రాముల కల్తీలేని, నాణ్యమైన ఏ గ్రేడ్ కుంకుమపువ్వును పండించింది. పునరుత్పత్తి ప్రక్రియ నవంబర్ 20 తొలి పంట తుది దశకు చేరుకునే క్రమంలోనే మలి పంటకు సన్నాహాలను ప్రారంభించారు. కుంకుమపువ్వు తీసేసిన తర్వాత మొక్కలను అలాగే పునరుత్పత్తి ప్రక్రియకు వినియోగించి వాటి నుంచే విత్తనాన్ని తయారు చేసుకున్నారు. ఒక విత్తనం నుంచి 3–5 పిలకలు ఉత్పత్తి అయ్యాయి. ఈ సారి వర్టికల్ ఫాంలో ప్రత్యేకగదిలో సాయిల్ బెడ్స్(మురిగిన నల్లమట్టి, నున్నటి ఇసుక, కోకోపిట్, వర్మీకంపోస్టు, వరిపొట్టు) రూపంలో తయారు చేసుకుని మొక్కలను నాటారు. వీటితో పాటుగా ట్రయల్ రన్లో భాగంగా ఓపెన్ ఎయిర్లో కొన్ని మొక్కలు నాటి చూశారు. ప్రత్యేకగదిలో ఏర్పాటు చేసిన మొక్కలు ఆశించిన స్థాయిలో పెరుగుతుండగా, బయట వేసిన మొక్కలు తొందరగా వాడిపోయాయి. ప్రస్తుతం వేసిన రెండో పంట ఏప్రిల్కు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది నవంబర్కు ఒక టన్ను విత్తనం నుంచి రెండు కిలోల కుంకుమపువ్వు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 5,000 చదరపు అడుగుల స్థలంలో గదిని ఏర్పాటు చేస్తున్నారు. మదనపల్లెకి ఉన్నతాధికారులు క్యూ హార్టికల్చర్, టూరిజం, ఆచార్య ఎన్.జి.రంగా వర్సిటీ, కృషి విజ్ఞాన కేంద్రం, టీటీడీ తదితర విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు మదనపల్లెకు వచ్చి ప్రయోగాత్మక సాగును పరిశీలించారు. భవిష్యత్ పరిశోధనలకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఆచార్య ఎన్.జి.రంగా వర్సిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల బాపట్లలో జనవరి 6, 7 తేదీల్లో జరిగిన 52వ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశాల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుని కుంకుమపువ్వు సాగుపై వ్యవసాయ పరిశోధక విద్యార్థులకు శ్రీనిధి విశదీకరించింది. ఆన్లైన్లో అమ్మకాలు.. కుంకుమపువ్వును అమ్మేందుకు వినూత్న పద్ధతిని అనుసరించింది. పర్పుల్ స్ప్రింగ్స్ పేరుతో బ్రాండ్ పేరును రిజిస్టర్ చేయించి ఆన్లైన్ వేదికగా అమ్మకాలను ప్రారంభించింది. గ్రాము రూ.600 చొప్పున విక్రయించి రూ.1,20,000 వరకు మొదటి ఆదాయాన్ని ఆర్జించింది. సామాజిక మాధ్యమాల వేదికగా యూట్యూబ్లో ఆమె ప్రారంభించిన పర్పుల్ స్ప్రింగ్స్ వెబ్సైట్కు మంచి ఆదరణ లభిస్తోంది. -
Annamayya District: ప్రభుత్వ బడుల్లో సీబీఎస్ఈ పాఠాలు
మదనపల్లె సిటీ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మెడిసిన్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు మెరుగైన ర్యాంకులు తప్పకుండా సాధించాలి. ఇందుకు జాతీయ స్థాయి విద్యా విధానం (సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) కీలకంగా మారింది. ఈ తరుణంలో నగరాలు, పట్టణాల్లోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకే పరిమితౖమైన సీబీఎస్ఈ సిలబస్ ఇక మారుమూల ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు అందనుంది. విద్యార్థుల బంగారు భవిష్యత్ లక్ష్యంగా మరింత నాణ్యమైన, ఖరీదైన విద్య చేరువ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉన్న సీబీఎస్ఈ సిలబస్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రక్రియను నిర్వహించేందుకు అన్నమయ్య జిల్లాలో తొలివిడతగా 44 పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయా బడుల్లో ప్రధానోపాధ్యాయులు, సహాయ ప్రధానోపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేసుకుని సిద్ధమయ్యారు. ప్రస్తుతం జాతీయస్థాయి పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు సీబీఎస్ఈ సిలబస్కు ఎంతో ప్రాధాన్యం ఉంది. పదో తరగతి, ఇంటర్మీడియట్ను సీబీఎస్ఈ సిలబస్లో పూర్తి చేసిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సత్తా చాటేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆరో తరగతిలో చేరితే +2 (ఇంటర్) విద్య వరకు విద్యాలయాల పర్యవేక్షణ సీబీఎస్ఈ బోర్డు పరిధిలో ఉంటుంది. పది అంశాలపై నివేదిక సీబీఎస్ఈను అమలు చేయనున్న పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వం ముందుగా పది అంశాలపై కేంద్ర విద్యామండలికి నివేదిక అందజేసింది. పాఠశాలల గుర్తింపు, ఫైర్సేఫ్టీ, ధ్రువపత్రం, పాఠశాల యాజమాన్య కమిటీ, ఈపీఎఫ్ గుర్తింపు సంఖ్య, ఏకో ఫ్రెండ్లీ వాతావరణం, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల విద్యార్హతలు, వెబ్సైట్ తదితర వివరాలను ఆ నివేదికలో పొందుపరిచారు. ఈ మేరకు జిల్లాలో 30 మండలాల పరిధిలో తొలివిడతగా 44 పాఠశాలలను ఎంపిక చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన అమలు కానుంది. అనంతరం సాధ్యాసాధ్యాలను పరిశీలించి మిగిలిన పాఠశాలల్లో కూడా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ జిల్లాలో సీబీఎస్ఈకి ఎంపికైన పాఠశాలల ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ ఇచ్చారు. సీబీఎస్ఈ విధాననం ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో కూడా లేదు. కార్పొరేట్ పాఠశాలల్లో తక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయనుంది. పేద విద్యార్థులకు వరం సీబీఎస్ఈ విధానం విద్యార్థులకు వరం. ఇప్పటి వరకు కార్పొరేట్, కేంద్ర ప్రభుత్వ విద్యాలయాల్లో మాత్రమే ఉన్న ఈ విధానం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తీసుకురావడం శుభపరిణామం. కేంద్ర విద్యా మండలి నిబంధనల మేరకు అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్న పాఠశాలల ఎంపిక వెబ్సైట్ ద్వారా జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం 9 వ తరగతి నుంచి ఈ విధానం అమలు చేసేందుకు ఇప్పటి నుంచే 8వ తరగతి విద్యార్థులను సన్నద్దం చేస్తున్నాం. – క్రిష్ణప్ప, డివైఈఓ, మదనపల్లె మంచి నిర్ణయం ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్ అవసరం. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నత విద్య అందే అవకాశం ఉంటుంది. – పి.మహమ్మద్ఖాన్, టీచర్, జెడ్పీహెచ్ఎస్,మదనపల్లె -
మదనపల్లెలో మూడుముక్కలాట.. రాజంపేటలో రచ్చరచ్చ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీ రామారావు 27వ వర్ధంతి సందర్భంగా బుధవారం అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ విగ్రహాల సాక్షిగా వాగ్వాదాలకు, ఘర్షణలకు తెర తీశారు. దీంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరువు కాస్తా మరింత దిగజారిపోయిందనే ఆవేదన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సాక్షి, రాయచోటి: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం కొనసాగుతోంది. ఆధిపత్య పోరులో ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయించేందుకు తహతహలాడుతున్నారు. అధినేత వద్ద మెప్పుకోసం ఒకరు.. అధిష్టానంలో పలుకుబడి కోసం మరొకరు అన్నట్లు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా తెలుగుదేశం పార్టీలో అంతర్యుద్ధం తప్పడం లేదు. ఎక్కడ చూసినా ప్రధాన నేతల మధ్య వర్గ విభేదాలతో ఉన్న కాస్త పార్టీ పరువు గంగలో కలుస్తోంది. జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కోలేక అల్లాడిపోతున్న టీడీపీకి ఈ వర్గ విభేదాలు మరింత తలనొప్పిగా తయారయ్యాయి. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కార్యక్రమాలు నిర్వహించడంతో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎవరికి వారే... యమునా తీరే! జిల్లా కేంద్రమైన రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్కుమార్రెడ్డి లక్కిరెడ్డిపల్లెలో కార్యక్రమం నిర్వహించగా, నియోజకవర్గ, టిక్కెట్ ఆశిస్తున్న టీడీపీ నేతలు మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, సుగవాసి ప్రసాద్బాబులు ప్రత్యేకంగా ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించారు. ముగ్గురు కలిసి ఒకేచోట పాల్గొన్న పరిస్థితులు కనిపించలేదు. నేతలు తలోదారి కావడంతో తమ్ముళ్లు కూడా ఎవరికి తోచిన రీతిలో ఏ వర్గానికి ఇష్టమున్న నాయకుడిని పిలిపించుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, టీడీపీ ఎంపీ అభ్యర్థి హరహరిలు పలుచోట్ల కార్యక్రమాల్లో పాల్గొంటే, మిగిలిన వర్గాలు పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. అలా వివిధ చోట్ల నాయకులు ఎవరికి వారుగా నిర్వహించడంతో వర్గ విభేదాలు బయటపడ్డాయి. రాజంపేటలోనూ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తే, మరో వర్గానికి చెందిన టీడీపీ నేత జగన్మోహన్రాజు విడిగా తన వర్గంతోకలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. చిట్వేలిలోనూ కస్తూరి విశ్వనాథనాయుడు, పంతగాని నరసింహప్రసాద్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది. చిట్వేలిలో చీలిన నాయకులు.. చిట్వేలి: రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలంలో బుధవారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించే విషయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు, పంతగాని నరసింహ ప్రసాద్ వర్గాల మధ్య వాదనలు చోటుచేసుకున్నాయి. మధ్యవర్తుల సూచన మేరకు కొంతసేపటి తర్వాత వివాదం సద్దుమణిగింది. కస్తూరి వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వెళ్లిపోగా, అనంతరం నరసింహ ప్రసాద్ వచ్చి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ చిత్రపటం పెట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మదనపల్లెలో మూడుముక్కలాట మదనపల్లె: నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ తొలుత పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈలోపు రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటానరహరి మదనపల్లెలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం అందడంతో దొమ్మలపాటిరమేష్ ఆయన కోసం అక్కడే ఎదురుచూడసాగారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే రాటకొండ శోభ భర్త రాటకొండ బాబురెడ్డి తన అనుచరులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చి నియోజకవర్గ ఇన్చార్జి దొమ్మలపాటి రమేష్ను మాటవరుసకైనా పలుకరించకుండానే పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత ఎంపీ అభ్యర్థి గంటానరహరి తంబళ్లపల్లె ఇన్చార్జి శంకర్తో కలిసి వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. తర్వాత దొమ్మలపాటి రమేష్ ఆయన వాహనంలో ఎక్కి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన రక్తదానశిబిరం ప్రా రంభోత్సవానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా గంటా నరహరి రాజంపేట టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో జిల్లా ప్రధానకార్యదర్శి యాలగిరి దొరస్వామినాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే దీనిని జరగనీయకుండా, ఆలస్యం చేయించి తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు దొమ్మలపాటి రమేష్ గంటానరహరిని మండలంలోని సీటీఎంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి తీసుకెళ్లారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాగా మరో ఎమ్మెల్యే ఆశావహుడు శ్రీరామినేని జయరామనాయుడు శివనగర్లోని తన కార్యాలయంలో వర్ధంతి వేడుకలు నిర్వహించి, చీకలబైలు సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదానంలో పాల్గొన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆర్.జే.వెంకటేష్ నిమ్మనపల్లె సర్కిల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజంపేటలో రచ్చరచ్చ రాజంపేట: నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు వేర్వేరుగా బుధవారం నివాళులు అర్పించారు. ర్యాలీలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, మరో ఆశావహుడు చమర్తి జగన్మోహన్రాజులు తమ వర్గీయులతో వేర్వేరుగా పలు మండలాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో బత్యాలకే టికెట్ అని ఆయన వర్గీయులు, కాదు చమర్తికే టికెట్ అని ప్రత్యర్థి వర్గీయులు గళం విప్పారు. (క్లిక్ చేయండి: ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..!) -
పాపను కాపాడబోయి.. జిల్లా హాకీ కార్యదర్శి గిరి మృతి
సాక్షి, మదనపల్లె సిటీ: నీటి కుంటలో మునిగిపోతున్న పాపను కాపాడబోయి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి, బీటీ కాలేజీ పూర్వపు ఫిజికల్ డైరెక్టర్ లెక్కల గోవర్థన గిరిరావు(53) గురువారం మృతి చెందాడు. దీంతో క్రీడాకారుల్లో విషాదం నెలకొంది. మదనపల్లె పట్టణం కృష్ణానగర్కు చెందిన గోవర్థన గిరిరావు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు. భార్య జలజ తంబళ్లపల్లె మండలం కన్నెమడుగు జెడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. సెలవులు కావడంతో తనతో పాటు పాఠశాలలో పని చేసే హిందీ టీచర్ దీప, ఫిజికల్ సైన్సు టీచర్ ఇంద్రాణి కుటుంబసభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండకు వెళ్లారు. దైవదర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మదనపల్లె– చౌడేపల్లె మార్గంలోని ఓ ఫామ్హౌస్ వద్ద వంటలు చేసుకునేందుకు వెళ్లారు. వీరితో పాటు వెళ్లిన పిల్లలు సరదాగా ఫామ్ హౌస్లో ఆడుకుంటుండగా హిందీ టీచర్ కుమార్తె లాస్య ప్రమాదవశాత్తు నీటికుంటలో పడటంతో కేకలు వేసింది. గమనించిన గిరిరావు వెంటనే లాస్యను కాపాడేందుకు నీటికుంటలో దూకాడు. నీటి కుంట బురదమయమై ఉండటంతో ఇరుక్కుపోయాడు. ఆందోళనతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. నీటి కుంటలో గిరిరావు ఇరుక్కపోవడాన్ని గమనించిన పిల్లలు కేకలు వేయడంతో, పరిసర ప్రాంతాలవారు అక్కడికి చేరుకుని ఆయన్ను వెలికితీశారు. స్థానికులు 108కు సమాచారం ఇచ్చి, ప్రాథమిక చికిత్స చేసినప్పటికి గిరిరావు మృతి చెందాడు. కుటుంబసభ్యులు, భార్య జలజ, కుమారుడు జస్వంత్లు ఆయన మృతిని తట్టుకోలేక బోరున విలపించారు. శుక్రవారం కురబలకోట మండలం కంటేవారిపల్లె వద్ద వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే పరామర్శ గిరిరావు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే నవాజ్బాషా గిరిరావు ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ,బీటీ కాలేజీ కరస్పాండెంట్ వై.ఎస్.మునిరత్నం, దివ్యభారతి ప్రసాద్రెడ్డి, జ్ఞానాంబిక డిగ్రీ కాలేజీ కరస్పాడెంట్ రాటకొండ గురుప్రసాద్, సాయిశేఖర్రెడ్డి, పీడీలు భౌతికకాయాన్ని సందర్శించి విచారం వ్యక్తం చేశారు. -
రేనాటి చోళులు ఏలారిక్కడ!
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని కొత్తరెడ్డివారిపల్లె వద్ద వ్యవసాయ భూముల్లో రేనాటి చోళుల కాలం నాటి శాసనం వెలుగుచూసింది. ఇది 7వ శతాబ్దానికి చెందిన రేనాటి చోళరాజు పుణ్యకుమారుడి శాసనంగా పరిశోధక విద్యార్థులు తేల్చారు. రాష్ట్రంలో క్రీ.పూ. 3–4 శతాబ్దాల్లోని శాసనాలు ప్రాకృత భాషలోను, 5వ శతాబ్దంలో సంస్కృతంలో ఉండగా.. 6వ శతాబ్దం నుంచి తెలుగులో ఉన్నట్టు చెబుతున్నారు. తెలుగులో మొదటి శాసనం వేసిన ఘనత రేనాటి చోళులకే దక్కిందని చరిత్ర చెబుతోంది. వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు తాలూకాలు, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, వాయల్పాడు తాలూకాలు ప్రాచీన ఆంధ్రదేశంలో రేనాడు ప్రాంతంగా గుర్తింపు పొందాయి. తెలుగును అధికార భాషగా స్వీకరించిన రేనాటి చోళులు తెలుగులోనే శాసనాలు వేసినట్టు తెలుస్తోంది. నాలుగు తామ్ర శాసనాలు, 50 శిలా శాసనాలు వీరి చరిత్రకు ఆధారాలుగా నిలుస్తున్నాయి. చిప్పిలి రాజధానిగా.. రేనాటి రాజుల్లో ముఖ్యుడైన పుణ్యకుమారుడు ‘చెప్పలియ పట్టు’ రాజధానిగా పాలించినట్టు తిప్పలూరు శాసనం ద్వారా తెలుస్తోంది. దీనిని అప్పట్లో కొంతమంది మదనపల్లె తాలూకాలోని చిప్పిలి గ్రామంగా గుర్తించినా.. తర్వాత కాలంలో పరిశోధకులు తిప్పలూరు గ్రామ సమీపంలోని కమలాపురం మండలంలోని పెద్ద చెప్పలి గ్రామ పరిసర ప్రాంతాల్లో రేనాటి చోళుల తామ్ర శాసనాలు, శిలాశాసనాలు అనేకం లభించడంతో దానిని రేనాటి చోళుల రాజధానిగా నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం మదనపల్లె తాలూకా కొత్తరెడ్డివారిపల్లెలోని పొలంలో వెలుగు చూసిన పుణ్యకుమార శాసనం చిప్పిలి గ్రామానికి సమీపంలోనే ఉంది. ఈ శాసనం పుణ్యకుమారుడిదే కావడం, ఇలాంటివి అక్కడే కాకుండా వేంపల్లె, చిప్పిలి పరిసర ప్రాంతాల్లో గతంలో అనేకం ఉండేవని చెబుతున్నారు. సమ్మర్ స్టోరేజి ట్యాంక్ తవ్వకాల్లోనూ ఒకటి రెండు కనిపించాయని గ్రామస్తులు చెబుతున్నారు. బ్రాహ్మణుడికి దానమిచ్చిన భూమి అని.. కొత్తరెడ్డిగారిపల్లెలోని ఒక పొలంలో రాయిపై శాసనం, మరోచోట బండపై చేతిలో కత్తి పట్టుకున్నట్టుగా, వాటి మీద మూడు బొమ్మలు, చుట్టూ కొన్ని శాసన అక్షరాలు, ఇంకొంత దూరంలో మరో బండమీద కత్తి పట్టుకున్న వీరుడు, అందులో రెండు గుర్రాలు, పైన ప్రాచీన తెలుగు లిపిలో కొన్ని అక్షరాలు (వైదుంబుల వీరగల్లులు) కనిపిస్తున్నాయి. వీటిని ఆ కాలంలో వీరగల్లులుగా పేర్కొనే వారని చెబుతున్నారు. రేనాటి చోళుల్లో మూడో తరానికి చెందిన పుణ్యకుమారుడు సూర అనే బ్రాహ్మణుడికి భూమిని దానంగా ఇచ్చినట్టు ఈ శాసనంలో ఉందని వాటిని పరిశీలించేందుకు వచ్చిన పరిశోధక విద్యార్థి చెప్పినట్లు స్థానిక రైతులు తెలిపారు. ఈ శిలాశాసనాలు తమ తండ్రుల కాలం నుంచీ అక్కడే ఉన్నాయని, వీటి గురించి తామెవరూ పట్టించుకోలేదని చెప్పారు. -
పితికిపప్పు కూర దోసెలు, రాగిసంగటిలో వేసుకుని తింటే..
మదనపల్లె సిటీ: ఎంతో అత్రుతగా ఎదురుచూసే అనపకాయల సీజన్ వచ్చేసింది. మార్కెట్ను అనపకాయలతో ముంచెత్తుతుంది. అన్నమయ్య జిల్లాలోని పడమటి మండలాల్లో ఖరీఫ్ సీజన్లో వేరుశనగతో పాటు అనపకాయలు పండిస్తారు. నవంబర్ నుంచి జనవరి చివరి వరకు సీజన్ ఉంటుంది. రామసముద్రం, మదనపల్లె, నిమ్మనపల్లె, కురబలకోట, వాల్మీకిపురం, పీలేరు ప్రాంతాల్లో అనపకాయలు పండిస్తున్న రైతులు మార్కెట్కు తెస్తున్నారు. కిలో రూ.30 వంతున విక్రయిస్తున్నారు. అనపకాయలతో చేసే పితికిపప్పు కూర దోసెలు, రాగిసంగటిలో వేసుకుని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. భోజనప్రియులు పితికిపప్పు కూరను ఎంతో ఇష్టంగా తింటారు. సంక్రాంతి వరకు ఘుమఘుమలే అనపకాయలు సంక్రాంతి దాకా విరివిగా లభ్యమవుతాయి. దీంతో ఇళ్లల్లో వారానికి మూడు సార్లయినా పితికిపప్పు రుచి చూడాల్సిందే. కేవలం వర్షా«ధారంగా చేళ్లల్లో పండిన నాటు అనపకాయలు మాత్రమే చాలా రుచిగా ఉంటాయి. వీటిని ముట్టుకోగానే బంకగా ఉండి, వాటి వాసన గంటసేపు ఉంటుంది. అబ్బా దాని రుచే వేరు అనపగింజలను గింజల కూర, చారు, సాంబారు చేస్తారు. అనపకాయలు ఒలిచి గింజలను గిన్నెలో నీటిలో రాత్రి నానబెట్టి మరుసటి రోజు గింజలను పితికి పప్పు కూరలు, చారుగా చేస్తారు. ఉదయమే దోసెల్లో పితికిపప్పు ఇష్టంగా తింటారు. కొందరు పితికిపప్పును ఎండబెట్టి నూనెలో వేపుడు చేసి తింటారు. పొరుగు రాష్ట్రాలకు.. మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండులో అనపకాయలకు మార్కెట్ ఉంది. రామసముద్రం, నిమ్మనపల్లె, మదనపల్లె, కురబలకోట, వాల్మీకిపురం ప్రాంతాల నుంచి మార్కెట్కు రైతులు ప్రతి రోజు సాయంత్రం అనపకాయలు సంచుల్లో తెస్తారు. ఇక్కడి నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి చెన్నై, వేలూరు, బెంగళూరు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాలకు నిత్యం ఎగుమతి అవుతున్నాయి. మార్కెట్కు ప్రతి రోజు 5 వేల కేజీల అనపకాయలు వస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో అనపకాయలకు మంచి డిమాండ్ ఉంది. రుచిగా ఉండటంతో వీటిని బాగా ఇష్టపడతారు. వర్షాలకు పంట దెబ్బతినింది అనపచెట్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. పురుగు పట్టడం వల్ల దిగుబడి తగ్గింది. ఎకరాలో అనపపంట సాగు చేశాను. ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. – మణి, రైతు, ఒంటిమిట్ట వారానికి రెండు, మూడు సార్లు వండుతా ఇది సీజన్. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చే కాయలు. అందుకే మదనపల్లె మార్కెట్కు వెళ్లి అనపకాయలు తెచ్చుకుంటా. వారంలో మూడురోజులైనా పితికిపప్పు కూర వండుతాం. పిల్లలు ఇష్టంగా తింటారు. – మంజుల, గృహిణి, సిటిఎం పోషకాలు మెండు ఈ సీజన్లో మాత్రమే లభించే అనపకాయలు, పితికిపప్పు మంచి పోషకాలు ఉంటాయి. క్రిమిసంహారక మందులు లేకుండా వర్షాధారంగా చేలల్లో పంట పండుతుంది. ఆరోగ్యానికి ఇవి చాలా మంచిది. – డాక్టర్ సరస్వతమ్మ, జిల్లా ఆస్పత్రి, మదనపల్లె -
చెరువు పోరంబోకులో టీడీపీ ఆఫీసు
మదనపల్లె: టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికార బలంతో అక్రమంగా ఆక్రమించుకున్న చెరువు పోరంబోకు స్థలంలో టీడీపీ కార్యాలయం ఏర్పాటుచేయడమే కాక అనుమతిలేకుండా అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టడం అధికారుల తనిఖీలో బట్టబయలైంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ అవినీతి, ఆక్రమణ, అక్రమ నిర్మాణాల బాగోతం అధికారుల హెచ్చరిక బోర్డు ఏర్పాటుతో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లు హైకోర్టులో కేసు ఉందని, లోనికి ఎవరూ ప్రవేశించరాదంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసిన ఆయన.. లోపల మాత్రం అక్రమ నిర్మాణాలు చేపట్టడంతోపాటు టీడీపీ కార్యాలయం ఏర్పాటుచేసుకుని దర్జాగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాక.. పెద్ద షెడ్లు ఏర్పాటుచేసి రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటుచేయడంపై పట్టణ ప్రజలు విస్తుపోతున్నారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. పట్టణంలోని బండమీద కమ్మపల్లె రెవెన్యూ గ్రామం సర్వే నంబర్–8 పార్టు, విస్తీర్ణం.3.09 ఎకరాల్లో ప్రభుత్వ స్థలానికి సంబంధించి హైకోర్టులో కేసులు పెండింగులో ఉన్నందున భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేయరాదని జిల్లా కలెక్టర్ గిరీషా ఉత్తర్వులతో మాజీ ఎమ్మెల్యే ఆక్రమిత స్థలంలో జాయింట్ కలెక్టర్ హెచ్చరిక బోర్డు పెట్టారు. అంతేకాక.. మున్సిపల్, రెవెన్యూ అధికారులు భూమి మొత్తం కలియతిరిగి అందులోని చెట్లను, టీడీపీ కార్యాలయాన్ని, కొత్తగా నిర్మించిన భవనాన్ని, అనుమతిలేకుండా ఏర్పాటుచేసిన రెండు షెడ్ల కొలతలు తీశారు. ఈ సమయంలో.. తాను మాజీ ఎమ్మెల్యేనని, కావాలంటే గూగుల్ మ్యాప్స్ తీసుకోవాలని దొమ్మలపాటి రమేష్ వ్యాఖ్యానించారు. అడ్డదారుల్లో దురాక్రమణ ఇలా.. బండమీద కమ్మపల్లె పంచాయతీలో సర్వే నంబర్–8లో ఐదెకరాలు పూర్తిగా చెరువు పోరంబోకు స్థలం. అందులో తప్పుడు రికార్డులతో దొంగపట్టాలు పుట్టించి సర్వే నెం.8/1 పేరుతో ఇంద్రసేనరాజు పేరుతో 1984లో ఇచ్చినట్లుగా డీకేటీ పట్టా సృష్టించారు. అయితే, అదే సంవత్సరం అదే నంబర్తో వేరే వారికి పట్టా ఇచ్చినట్లుగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే దొంగ డీకేటీ పట్టాను ఆన్లైన్లో ఎక్కించేందుకు కుదరకపోవడంతో కొన్నాళ్లు స్తబ్దుగా ఉండిపోయారు. 2016లో తహసీల్దార్ శివరామిరెడ్డి హయాంలో అన్లైన్లోకి ఎక్కించి ఇంద్రసేనరాజు నుంచి దొమ్మలపాటి రమేష్ భార్య దొమ్మలపాటి సరళ పేరు మీద రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేశారు. ఈ విషయమై అప్పట్లో పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు నోటీసు పంపగా దానిమీద హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. హైకోర్టు కేసు నంబర్లను ప్రహరీగోడ మీద ప్రత్యేకంగా పేర్కొంటూ అనుమతిలేకుండా ప్రవేశించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయించారు. లోపలమాత్రం అనుమానం రాకుండా పెద్ద భవనాలు, షెడ్ల నిర్మాణాలు చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. మరోవైపు.. ఆక్రమిత ప్రభుత్వ స్థలాన్ని మున్సిపల్, రెవెన్యూ అధికారులు పరిశీలిస్తుంటే టీడీపీ మండల అధ్యక్షుడు దేవరింటి శీను, మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ వెంకటేష్, ఇతర టీడీపీ నాయకులు అధికారుల విధులకు భంగం కలిగిస్తూ వారిని వీడియోలు, ఫొటోలు తీశారు. తాము విధి నిర్వహణలో ఉన్నామని అధికారులు వారిని వారిస్తున్నా మీ పని మీరు చేసుకోండి.. మా పని మేం చేసుకుంటామని వ్యాఖ్యానించడం కనిపించింది. -
ఆ ఒక్క దెబ్బ మామూలుగా లేదు కదా.. వణుకు మొదలైంది
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో సైకిల్ పార్టీ కనుమరుగవుతుందా? గత ఎన్నికల్లో కుప్పంలో మాత్రమే గెలిచి ఎలాగో ఒడ్డున పడ్డారు చంద్రబాబు. కానీ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు లభిస్తున్న ఆదరణ చూసి పచ్చ పార్టీకి చెమట్లు పడుతున్నాయని టాక్. మదనపల్లిలో జగన్ కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేనంతగా.. కనీవినీ ఎరుగని రీతిలో జనం హాజరయ్యారు. దీంతో టీడీపీ కేడర్లో గుబులు మొదలైంది. చావు తప్పి కన్ను లొట్టబోయి రాష్ట్రంలో 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలిచింది ఒకే ఒక స్థానం. అది కూడా కుప్పంలో చంద్రబాబు బొటా బొటి మెజారిటీతో ఒడ్డునపడ్డారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా తయారైంది టీడీపీ పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వశమైంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును కూడా ఓడిస్తామని వైఎస్ఆర్సీ నేతలు శపథం పూనారు. దానికి అనుగుణంగానే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. మదనపల్లిలో జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభకు పోటెత్తిన జనాన్ని చూసి టీడీపి శ్రేణుల్లో వణుకు ప్రారంభమైంది. ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో వైఎస్ జగన్ సభకు ప్రజలు హాజరుకావడమే ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనమిని పచ్చ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారట. వైఎస్ జగన్ చెప్పినట్లు వై నాట్ 175 ప్రకటనకు తగ్గట్టుగానే సభ జరిగిందని టిడిపి క్యాడర్ చెవులు కొరుక్కొంటోందని టాక్. మదనపల్లి దెబ్బ మామూలుగా లేదు కదా మదనపల్లిలో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ జరిగినప్పటినుంచీ.. ఏ ఇద్దరు టిడిపి కార్యకర్తలు కలిసినా సభ గురించే మాట్లాడుకుంటున్నట్లు చెబుతున్నారు. మదనపల్లితో పాటు తంబళ్లపల్లి, పీలేరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో సీఎం వైఎస్ జగన్ సభ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. చంద్రబాబు సైతం తమ పార్టీ శ్రేణులతో ఫోన్లో మాట్లాడి..సభ జరిగిన తీరు గురించి తెలుసుకున్నారట. ఇంత భారీగా జగన్ సభ ఎలా జరిగిందంటూ ఆరా తీస్తున్నారట. మదనపల్లిలో జగన్ సభ తర్వాత టిడిపి క్యాడర్ ఇక తమ పార్టీ బతికి బట్ట కట్టే అవకాశం లేదని నిర్ధారించుకున్నారట. అందుకే ఎవరిదారి వారు చూసుకునే ప్రయత్నాలు ప్రారంభించారనతి తెలుస్తోంది. మొత్తం మీద మదనపల్లిలో సీఎం జగన్ సభ టిడిపి క్యాడ తీవ్ర నిరాశలోకి నెట్టేసిందని ప్రచారం జరుగుతోంది. ఇక ముందు చంద్రబాబును నమ్ముకుంటే రాజకీయంగా భవిష్యత్ ఉండదని గ్రామస్థాయి నాయకులు, కేడర్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఎదగాలంటే మరో పార్టీలో చేరాల్సిందేనని పచ్చ పార్టీ కేడర్ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద సీఎం వైఎస్ జగన్ ఏ జిల్లాకు వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన సభకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. జగన్కు వస్తున్న ప్రజల్ని చూసి తెలుగుదేశం కేడర్లో ఆందోళన పెరుగుతుంటే..వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల్లో మరింత జోష్ పెరుగుతోంది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పొలిటికల్ కారిడార్ : చిత్తూరు జిల్లా టీడీపీలో వణుకు
-
వైఎస్సార్సీపీలోకి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్కుమార్రెడ్డి, పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి అఘా మొహిద్దీన్ వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం మదనపల్లెలో హెలిప్యాడ్ వద్ద వారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డిల ఆధ్వర్యంలో సీఎం జగన్ వద్దకు వెళ్లారు. వారికి ముఖ్యమంత్రి.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నరేష్కుమార్రెడ్డి.. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీ మదనపల్లె మున్సిపల్ చైర్మన్గా పని చేశారు. చదవండి: (సీఎం జగన్ను కలిసిన సీఎస్ జవహర్రెడ్డి) -
CM Jagan: చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం జగన్
మదనపల్లె(అన్నమయ్య జిల్లా): మదనపల్లెలో బుధవారం సీఎం వస్తున్న దారిలో హమీదా అనే మహిళ తన ఏడాదిన్నర వయసున్న చిన్నారిని చేతులపైకి ఎత్తుకుని ‘జగనన్నా.. నా బిడ్డను కాపాడన్నా’ అని వేడుకుంది. బస్సులో నుంచి ఆ దృశ్యం గమనించిన సీఎం.. ఆమెను సభాస్థలి వద్దకు పిలిపించారు. ‘అన్నా.. నా కుమారుడు షేక్ మహమ్మద్ అలీ తల రోజు రోజుకూ పెరిగిపోతోంది. వేలూరులోని సీఎంసీ ఆస్పత్రిలో చూపించాం. తలకు ఆపరేషన్ చేయాలని, చాలా డబ్బు ఖర్చవుతుందని చెప్పారు. మేం పేదోళ్లం. ఎలాగైనా మీరే ఆదుకోవాలి’ అని కన్నీటిపర్యంతమైంది. చిన్నారి ఆపరేషన్కు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. తక్షణ వైద్య ఖర్చులకు రూ.లక్ష, చిన్నారికి రూ.3 వేల పింఛన్ మంజూరు చేయాలని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ గిరీషా హమీదాకు రూ.లక్ష సాయం అందజేశారు. స్విమ్స్లో చికిత్సకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. చదవండి: జన సునామీ.. మదనపల్లె చరిత్రలో ఇదే ప్రథమం -
రాక్షసులు, గజ దొంగలతో యుద్ధం చేస్తున్నాం : సీఎం జగన్
-
నాడు మోసగించి, నేడు లెక్చర్లా?
ఫలానా ప్రాంతంలో.. ఫలానా పొలాలను.. ఫలానా రేటుకు అమ్ముకునేందుకు మాత్రమే ఒక రాజధాని కట్టాలన్నది వారి ఆలోచన. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తామంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వారు వాదిస్తున్నారు. ఇలాంటి వారి మెదళ్లను మార్చగల చదువులు ఎంతైనా అవసరం. వారికి మంచి జ్ఞానం, మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ దేవుడిని కోరాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లల చదువుల కొరకు ప్రభుత్వం పెట్టే ఏ ఖర్చైనా సరే.. దానిని నేను ఖర్చుగా భావించను. అది నేను నా పిల్లలకిచ్చే ఆస్తిగా భావిస్తాను. ‘మీరు గొప్పగా చదవండి.. మీ చదువులకి పూచీ నాది..’ అని ప్రతి చిట్టి చెల్లెమ్మకు, తమ్ముడికీ చెబుతున్నా. ‘మీ ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా పరవాలేదు.. అంతమందినీ చదివించండి.. మీ అన్న, తమ్ముడు చదివిస్తాడు’ అని ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ చెబుతున్నా. నేరుగా మీ ఖాతాల్లో పడుతున్న డబ్బును వారం పది రోజుల్లో కాలేజీలకు వెళ్లి చెల్లించండి. పిల్లలు ఎలా చదువుతున్నారో కూడా విచారించండని విజ్ఞప్తి చేస్తున్నా. మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ.. మనందరి ప్రభుత్వం.. అధికారం చేపట్టి ఈ రోజుకు సరిగ్గా మూడున్నరేళ్లు. ఈ సందర్భంగా మీలో ఒకడిగా, మీ వాడిగా నాతో సమయం పంచుకునేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కాచెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతకు, సోదరుడికి, స్నేహితుడికీ, ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మదనపల్లె నుంచి సాక్షి ప్రతినిధి: ‘రైతులను మోసం చేసిన చంద్రబాబునాయుడు వ్యవసాయం గురించి మాట్లాడుతుండటం విడ్డూరం. పిల్లలకు అన్యాయం చేసి, ఎడ్యుకేషన్ గురించి.. అక్కచెల్లెమ్మలకు ద్రోహం చేసి, మహిళా సాధికారత గురించి.. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలను అవమానించి, అన్యాయం చేసి.. సామాజిక న్యాయం గురించి ఈరోజు లెక్చర్లు దంచుతుంటే.. రాష్ట్ర ప్రజలంతా ఇదేమి ఖర్మరా బాబూ!’ అని అనుకుంటున్నారని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇలాంటి కుళ్లిపోయిన పెత్తందారీ మనస్తత్వం ఉన్న చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం ఆయన జగనన్న విద్యా దీవెన పథకం (పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్) కింద 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ నాలుగో ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికం నిధులు రూ.694 కోట్లు వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్షరాలు రాయడం, చదవడం మాత్రమే విద్యకు పరమార్థం కాదని.. ప్రతి ఒక్కరూ తమకు తాముగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగే శక్తిని ఇవ్వగలగడమే విద్యకు పరమార్థం అని ప్రపంచ ప్రఖ్యాత ఫిజిసిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చక్కగా చెప్పారన్నారు. ఈ రోజు అటువంటి ఆలోచనా శక్తి కొరవడిన ప్రతిపక్షాలకు ఎప్పటికైనా అది రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని చెప్పారు. పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదవడానికి వీల్లేదని వాదించే వారి సంస్కారాలు మారాలని, నా వారు మాత్రమే బాగుపడాలని కోరుకునే మనస్తత్వం నుంచి.. మనుషులంతా ఒక్కటే అన్న మానవతావాదంతో కూడిన జ్ఞానం వారందరికీ రావాలని కూడా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పిల్లలకు మనమివ్వగలిగే ఆస్తి చదువులే ► పిల్లలకు మనమివ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువులే. ఏ ఒక్క పాప, బాబు.. చదువులకు పేదరికం అవరోధం కాకూడదని మంచి మనస్సుతో అప్పట్లో ఆ ప్రియతమ నేత, దివంగత నాయకుడు రాజశేఖరరెడ్డి దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ గొప్ప పథకాన్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ నీరుగార్చుతూ వచ్చాయి. ► చదువుల కోసం ఎంతగా ఇబ్బంది పడుతున్నారో నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను. వారి కష్టాలు విన్నాను. నేను ఉన్నాను అని చెప్పాను. అందుకే అధికారంలోకి రాగానే ఆ పరిస్థితులను మారుస్తూ విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. ► జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను మీ ప్రభుత్వం భుజ స్కంధాలపై మోస్తోంది. హాస్టల్ ఖర్చుల కోసం ఏటా రూ.20 వేల వరకు సాయం చేసేలా జగనన్న వసతి దీవెన పథకాన్ని అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలోని 2017–18, 2018–19కు సంబంధించి రూ.1,778 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెడితే మనందరి ప్రభుత్వం చిరునవ్వుతో వాటిని చెల్లించింది. ► ఈ మూడున్నరేళ్లలో జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా రూ.3,349 కోట్లు.. మొత్తంగా ఈ రెండు పథకాల ద్వారా రూ.12,401 కోట్లు ఖర్చుపెట్టాం. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు ► ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాం. మీ పిల్లలను బడులకు పంపిస్తూ ప్రోత్సహిస్తున్నందుకు ‘జగనన్న అమ్మఒడి’ ద్వారా మీకు తోడుగా ఉన్నాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, మన బడి నాడు–నేడు, బైలింగ్వల్ టెక్ట్స్బుక్స్, బైజూస్తో ఒప్పందం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు, డిజిటల్ క్లాస్ రూములు.. ఇలా ఎన్నో పథకాలు, కార్యక్రమాల ద్వారా స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. ► ఉన్నత విద్యలో కరిక్యులమ్ అంతా కూడా జాబ్ ఓరియంటెడ్గా మార్పులు చేస్తూ వచ్చాం. డిగ్రీలు చదివేటప్పుడే ఇంటర్న్షిప్ తప్పనిసరి చేశాం. ఆన్లైన్ వర్టికల్స్ విత్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చాం. ఆ¯ŒŒ లైన్లో కూడా మంచి కోర్సులు ఎక్కడున్నాయా అని వెదికి పట్టుకుంటున్నాం. వాటిని కూడా మన పిల్లలకు నేర్పిస్తూ.. వాటికి కూడా క్రెడిట్ ట్రాన్స్ఫర్ కింద అనుమతులు ఇస్తున్నాం. ► ప్రఖ్యాత సంస్థలన్నింటితో మాట్లాడి సర్టిఫైడ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను మన పిల్లలకు అందుబాటులోకి తెస్తున్నాం. విద్యా రంగాన్ని ఉపాధికి చేరువగా తీసుకుపోతున్నాం. మూడున్నరేళ్లలో రూ.55 వేల కోట్లు ► జగనన్న అమ్మఒడి ద్వారా రూ.19,617 కోట్లు, జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.9,051 కోట్లు, జగనన్న వసతి దీవెన ద్వారా మూడున్నరేళ్లలో రూ.3,349 కోట్లు, జగనన్న విద్యా కానుక ద్వారా మరో రూ.2,368 కోట్లు ఖర్చు చేశాం. ఎనిమిదో తరగతి పిల్లలు, ఉపాధ్యాయులకు ట్యాబ్లు ఇచ్చేందుకు మరో రూ.685 కోట్లు ఈ డిసెంబర్లో ఖర్చు చేయబోతున్నాం. ► జగనన్న గోరుముద్ద ద్వారా రూ.3,239 కోట్లు, పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా మొదటి ఫేజ్లో రూ.3,669 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశాం. ఈ ఏడాది నాడు–నేడు ఫేజ్ 2 కింద మరో రూ.8 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. వైఎస్సార్ సంపూర్ణపోషణ కోసం రూ.4,895 కోట్లు, శానిటరీ నేప్కిన్స్ అందించే ‘స్వేచ్ఛ’ అనే కార్యక్రమం కోసం రూ.32 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మొత్తంగా ఈ మూడున్నరేళ్లలోనే విద్య కోసం మీ జగనన్న ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.55 వేల కోట్లు. ► మనందరి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఏటా మూడు లక్షల మంది పిల్లలు డిగ్రీ పట్టాలు అందుకుంటే.. వారిలో 37 వేల మందికే క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలొచ్చేవి. 2021–22లో క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా 85 వేల మంది పిల్లలకు ఉద్యోగాలొచ్చాయి. మదనపల్లెకు వరాల జల్లు నా సోదరుడు, ఎమ్మెల్యే నవాజ్ మదనపల్లి అభివృద్ధి కోసం కొన్ని కార్యక్రమాలు అడిగారు. మెడికల్ కాలేజీ ఇప్పటికే మంజూరు చేశాం. శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ నెలలోనే పనులు మొదలవ్వనున్నాయి. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 2 వేల అడుగుల లోతుకు బోరు వేస్తే తప్ప తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చాలన్న తపనతో వాటర్ గ్రిడ్ కోసం రూ.1,800 కోట్లు మంజూరు చేశాం. ఇందులో మదనపల్లెకే రూ.400 కోట్లు వస్తుంది. మున్సిపాల్టీ అభివృద్ధి కోసం రూ.38 కోట్లు ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మొలకలచెరువు నుంచి మదనపల్లె ఎన్హెచ్ రోడ్డుకు రూ.400 కోట్లతో, మదనపల్లె– తిరుపతి ఎన్హెచ్ రోడ్డుకు మరో రూ.1,600 కోట్లతో మంజూరు ఇప్పించాం. మీ అందరి కోరిక మేరకు మదనపల్లె బీటీ కాలేజీని ప్రభుత్వంలో విలీనం చేశాం. మదనపల్లె టిప్పుసుల్తాన్ మసీదు కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నాం. మదనపల్లె నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం రూ.30 కోట్ల ప్రతిపాదనలు ఇచ్చారు. వాటిని కూడా ఆమోదిస్తున్నాను. మదనపల్లె టౌన్ పరిధిలో 3 బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిని పూర్తి చేయడం కోసం మరో రూ.14 కోట్లు అడిగారు. అదీ మంజూరు చేస్తున్నాం. బహుదా నదిపై బ్రిడ్జి కోసం అవసరమైన మరో రూ.7 కోట్లు కూడా ఇస్తున్నాం. వీటిన్నింటి ద్వారా మదనపల్లెకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. పెత్తందార్ల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు ► నవరత్నాల పాలనతో పేదలకు మనందరి ప్రభుత్వం మంచి చేస్తుంటే.. దానిని జీర్ణించుకోలేక, పేదలు బాగుపడటం తట్టుకోలేక, తమకు పుట్టగతులుండవనే భయంతో ఈ పెత్తందార్లు అంతా కలిసి దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ బటన్ నొక్కడం వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుందట! ఇదే రాష్ట్రం వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు అమెరికా అట! ► ఈ గజదొంగల ముఠాకు దుష్టచతుష్టయం అని పేరు. అందులో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు. వీరికి తోడు దత్తపుత్రుడు. ఈ గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అనే పద్ధతిలో పాలించింది. అందుకే ఆ రోజు బటన్లు లేవు. నొక్కే వారూ లేరు. ప్రజలకు నేరుగా మంచి జరగాలనే ఆలోచనలే లేవు. ► ఈ ముఠా చేస్తున్న దౌర్భాగ్యపు రాజకీయాలను ఎవరూ రాయరు. ఎవరూ చూపరు. ప్రశ్నించే వారు కూడా లేరు. అటువంటి వారితో ఈరోజు మనం యుద్ధం చేస్తున్నాం. ఇవాళ మీ బిడ్డ ఇటువంటి పత్రికలను, టీవీ చానళ్లను నమ్ముకోలేదు. దత్తపుత్రుడినీ అంతకన్నా నమ్ముకోలేదు. ► మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగితే జగనన్నకు తోడుగా ఉండండి. ఇవాళ మనం రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నాం. ఈ రోజు చెడిపోయి ఉన్న రాజకీయ వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా రాష్ట్రానికి ఇదే బడ్జెట్ ఉండేది. మరి అప్పుడు పాలకులు ఎందుకు జగన్ మాదిరిగా నేరుగా బటన్ నొక్కి.. మా బ్యాంకు ఖాతాల్లోకి ఎందుకు డబ్బులు వచ్చేటట్లు చేయలేకపోయారని ఆలోచించండి. గత ప్రభుత్వానికి, మనందరి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించండి. ► మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని, మిమ్మల్ని మాత్రమే. మీతోనే నా పొత్తు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి 98 శాతం హామీలను అమలు చేశాం. మీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మీ ఇంటి గడపవద్దకు వచ్చి మీకు జరిగిన మేలు గురించి అడుగుతున్నారు. మీ బిడ్డ ప్రభుత్వాన్ని దీవించమని మీ ఆశీస్సులు తీసుకుంటున్నారు. -
జన సునామీ.. మదనపల్లె చరిత్రలో ఇదే ప్రథమం
మదనపల్లె నుంచి సాక్షి ప్రతినిధి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాకతో మదనపల్లె కిక్కిరిసింది. సభా ప్రాంగణం, రోడ్లన్నీ కిటకిటలాడాయి. ఇంత వరకు ఏ రాజకీయ నేతకు, ముఖ్యమంత్రికి దక్కని ఘన స్వాగతం, జన నీరాజనం ఆయనకు లభించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధుల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో పోటెత్తారు. ఇసుక వేస్తే రాలనంతంగా కనుచూపు మేర తరలివచ్చారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల ఊహకందని రీతిలో సభకు జనం హాజరు కావటం మదనపల్లె చరిత్రలో ఇదే ప్రథమం అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంచనాలకు మించి జనసంద్రంలా.. మదనపల్లెలో రాజకీయ నాయకుల సభలు మామూలుగా మిషన్ కాంపౌండ్లో జరుగుతుంటాయి. అయితే సీఎం సభకు భారీగా జనం తరలివస్తారని భావించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్రెడ్డి, కలెక్టర్ గిరీషాలు కదిరి రోడ్డులోని టిప్పు సుల్తాన్ మైదానంలో సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభలో 35 వేల మంది కూర్చునేలా.. ఇంకా జనం ఎక్కువైతే దాని చుట్టూ కూడా కూర్చొనేలా మరో పది వేల మందికి ఏర్పాట్లు చేశారు. అయితే అధికారులు, ప్రజా ప్రతినిధులు ఊహించని విధంగా ఉదయం 7 గంటల నుంచే ప్రజలు సభా వేదిక వద్దకు తరలిరావటం మొదలైంది. తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లి, రాయచోటి, పుంగనూరు నియోజక వర్గాల నుంచి ప్రజలు ప్రత్యేక వాహనాల్లో మదనపల్లెకు చేరుకున్నారు. విద్యార్థులు, మహిళల కోసం రిజర్వు చేసిన గ్యాలరీలు నిండిపోయాయి. ఉదయం 10 గంటలకల్లా సభ ప్రాంగణం నిండిపోయింది. ప్రాంగణం చుట్టూ.. పెద్ద సంఖ్యలో జనం ఉండిపోయారు. అప్పటికే పోలీసులు ట్రాఫిక్ను మళ్లించి ఉండటంతో కదిరి రోడ్డు మొత్తం జనంతో కిటకిటలాడింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలిప్యాడ్ చేరుకోగానే కదిరి రోడ్డు ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. అంటే సభలో కూర్చున్న వారికంటే.. రెండు మూడింతల జనం కదిరి రోడ్డు, సభ ప్రాంగణం చుట్టూ నిలుచుండిపోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగాన్ని అలానే తిలకించారు. అధికారులు ముందు జాగ్రత్తగా ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేయటం ప్రజలకు ఊరటనిచ్చింది. సభా ప్రాంగణం నిండిపోవడంతో బయట నుంచే సీఎం జగన్ ప్రసంగాన్ని ఆలకిస్తున్న అశేష జనవాహినిలో ఓ భాగం హోరెత్తిన నినాదాలు మదనపల్లె పట్టణం ‘జై జగన్’ నినాదాలతో హోరెత్తింది. సీఎం వైఎస్ జగన్ రేణిగుంట నుంచి ఉదయం 10.45 గంటల ప్రాంతంలో మదనపల్లె హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి 11.33 గంటలకు సభ వేదిక వద్దకు వచ్చారు. బీటీ కళాశాల మైదానం నుంచి బెంగుళూరు రోడ్డు మీదుగా బీసెంట్ కూడలి, పటేల్ రోడ్డు, ఎన్టీఆర్ కూడలి, కదిరి రోడ్డు మీదుగా టిప్పు సుల్తాన్ మైదానం చేరుకున్నారు. రహదారికి ఇరువైపులా ప్రజలు వైఎస్ జగన్కు స్వాగతం పలుకుతూ.. జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సభా వేదిక వరకు జనం రోడ్లపై కిక్కిరిసిపోయారు. మధ్యాహ్నం 1.11 గంటలకు సభ ముగించి వైఎస్ జగన్ తిరుగు పయనమయ్యారు. ఈ రెండు సమయాల్లోనూ సీఎం వైఎస్ జగన్కు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. నినాదాలతో నీరాజనం పలికారు. సభా ప్రాంగణానికి మరోవైపు నిలిచిపోయిన జన సందోహంలో ఓ భాగం సభ జరిగినంత సేపు విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు వైఎస్ జగన్కు మద్దతుగా సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేయడంతో మైదానం దద్దరిల్లింది. జగనన్న విద్యాదీవెన ద్వారా లబ్ధి పొందిన మదనపల్లెకు చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని షేక్ మహీర్, బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ములకలచెరువు మండలానికి చెందిన సౌజన్య సభలో ప్రసంగించారు. -
చిన్నారికి సీఎం జగన్ సాయం
-
కాన్వాయ్ ఆపి అంబులెన్సు కు దారి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్
-
మదనపల్లె పర్యటనలో సీఎం జగన్ ఉదారత
-
ఆంబులెన్స్కి దారివ్వండి.. అధికారులతో సీఎం జగన్
సాక్షి, అన్నమయ్య జిల్లా: బుధవారం మదనపల్లె పర్యటనలో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన మంచి గుణం ప్రదర్శించారు. పర్యటనలో భాగంగా వేదిక వద్దకు ఆయన చేరుకునే సమయంలో ఆయన కాన్వాయ్కు ఓ ఆంబులెన్స్ ఎదురొచ్చింది. అప్పటికే రోడ్డుకు ఇరువైపులా వైఎస్సార్సీపీ అభిమానులు, బందోబస్తుకు వచ్చిన పోలీసులతో రోడ్డు కిక్కిరిసిపోయింది. అయితే అంతహడావుడిలోనూ ఓ ఆంబులెన్స్ రాకను గమనించిన సీఎం జగన్.. దానికి దారి ఇవ్వాలంటూ అధికారులకు సూచించారు. దీంతో.. కాన్వాయ్ బస్సుని పక్కన ఆపించి అంబులెన్సుకు దారిచ్చారు అధికారులు. ఆ సమయంలో ఆంబులెన్స్ నుంచి పేషెంట్ బంధువులు చేతులెత్తి సీఎం జగన్కు నమస్కరించారు. ఇదీ చదవండి: మీ బిడ్డ.. ఈ వైఎస్ జగన్కు నిజాయితీ ఉంది -
మంచి జరిగితే జగనన్నకు తోడుగా ఉండండి: సీఎం జగన్
-
మీ బిడ్డకు నిజాయితీ ఉంది.. చెప్పిందే చేసి చూపిస్తాడు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహిళలను దగా చేసిన చంద్రబాబు మహిళా సాధికారత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను దగా చేసి నేడు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయకుండా ఇప్పుడు చంద్రబాబు మాటలు చూస్తుంటే ప్రజలు 'ఇదేం ఖర్మరా బాబూ' అనుకుంటున్నారని సీఎం జగన్ చెప్పారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై–సెప్టెంబర్ త్రైమాసికం నిధులను సీఎం వైఎస్ జగన్ బుధవారం విడుదల చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కుటుంబాల తలరాత మారాలన్నా.. పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గం. పేదరికం చదువులకు అవరోధం కావొద్దని దివంగత నేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తెచ్చారు. ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తపన పడ్డారు. ఆతర్వాత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ను నీరుగార్చాయి. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నాం అని సీఎం జగన్ చెప్పారు. 11.02లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లు చంద్రబాబు హయాంలో పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు చెల్లించాం. జగనన్న విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు కలిపి మొత్తంగా రూ.12,401 కోట్లు అందించాం. జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి 11.02లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లు జమ చేస్తున్నాం. నేరుగా తల్లుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేస్తున్నాం. పిల్లల చదువుకు పెట్టే ఖర్చును ఖర్చుగా భావించం.. ఆస్తిగా భావిస్తాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందిని చదివిస్తానని భరోసా ఇస్తున్నా. మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటా. మీ పిల్లలను పూర్తిగా చదివించే బాధ్యత నాదే అని సీఎం జగన్ అన్నారు. ఏపీలో తప్ప మరే రాష్ట్రంలోనూ లేదు పిల్లల చదువుతోనే ఇంటింటా వెలుగులు నింపాలని నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం. విద్యారంగాన్ని ఉపాధికి చేరువుగా తీసుకెళ్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం. పిల్లలను పాఠశాలలకు పంపితే అమ్మ ఒడి కింద సాయం చేస్తున్నాం. అమ్మ ఒడి పథకం ఏపీలో తప్ప ఏ రాష్ట్రంలోనూ లేదు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, డిజిటల్ క్లాస్రూమ్లు విద్యార్థులకు, టీచర్లకు ట్యాబ్లతో సమూల మార్పులు చేశాం. ఉన్నత విద్యలో కూడా మార్పులు తెచ్చాం. ప్రఖ్యాత కంపెనీల సర్టిఫైడ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అందిస్తున్నాం. అమ్మ ఒడి కింద రూ.19,617 కోట్లు, జగనన్న విద్యాకానుకకు రూ.2,368 కోట్లు విద్యార్థులు, టీచర్లకు ట్యాబ్లకు రూ.685 కోట్లు ఖర్చు చేశాం. నాడు-నేడు తొలి దశకు రూ.3,669 కోట్లు, రెండో దశకు రూ.8వేల కోట్లు, వైఎస్సార్ సంపూర్ణ పోషణకు రూ.4,895 కోట్లు.. ఇలా మూడున్నరేళ్లలో విద్యారంగానికి రూ.55వేల కోట్లు ఖర్చు చేశాం. క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా 85వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించాం. తేడా గమనించండి 'ప్రతిపక్షాలకు వివేకం రావాలని కోరుకుంటున్నా. నా భూముల్లోనే రాజధాని కట్టాలనే ఆలోచన నుంచి బయటపడే.. దేవుడు బుద్ది, జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నా. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదించే వారికి జ్ఞానం రావాలి. తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఇంగిత జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనం రాక్షసులు, మారీచులతో యుద్ధం చేస్తున్నాం. దుష్టచతుష్టయం మాటలు నమ్మొద్దు. మీ బిడ్డ పత్రికలు, చానళ్లు, దత్తపుత్రుడ్ని నమ్ముకోలేదు. మీ బిడ్డకు నిజాయితీ ఉంది.. చెప్పిందే చేసి చూపిస్తాడు. ప్రజల్ని, ఆ దేవుడ్ని మీ బిడ్డ నమ్ముకున్నాడు. అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా గమనించండి. మంచి జరిగితే మీ జగనన్నకు తోడుగా ఉండండి' అని సీఎం జగన్ ప్రజల్ని కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి: బొత్స
-
విద్యార్థులతో సీఎం జగన్
-
సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
మదనపల్లెలో నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్
-
మీరు చదవండి.. మీ చదువులకు నేనే పూచీ: సీఎం జగన్
►కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలకు మన ఇచ్చే ఆస్తి చదువే. కుటుంబాల తలరాత మారాలన్నా.. పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గం. పేదరికం చదువులకు అవరోధం కావొద్దని దివంగత నేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తెచ్చారు. ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తపన పడ్డారు. ఆతర్వాత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ను నీరుగార్చాయి. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నాం అని సీఎం జగన్ చెప్పారు. విద్యాదీవెనకు తోడు జగనన్న వసతి దీవెన ఇస్తున్నాం. విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొచ్చాం. పేదలకు చదువును హక్కుగా మార్చాం. చంద్రబాబు హయాంలో పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు చెల్లించాం. జగనన్న విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు కలిపి మొత్తంగా రూ.12,401 కోట్లు అందించాం. జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి 11.02లక్షల మంది విద్యార్థులకు రూ.684 కోట్లు జమ చేస్తున్నాం. నేరుగా తల్లుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేస్తున్నాం. పిల్లల చదువుకు పెట్టే ఖర్చును ఖర్చుగా భావించం.. ఆస్తిగా భావిస్తాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందిని చదివిస్తానని భరోసా ఇస్తున్నా. మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటా. మీ పిల్లలను పూర్తిగా చదివించే బాధ్యత నాదే అని సీఎం జగన్ అన్నారు. సుదీర్ఘ ప్రసంగం అనంతరం సీఎం జగన్ బటన్ నొక్కి నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు. దీనివల్ల మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం మీద ఇప్పటివరకు ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.12,401 కోట్లు విడుదల చేసింది. ఆర్థికస్తోమత లేక ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంటును అమలు చేస్తోంది. ►విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యారంగంలో అనేక సంస్కరణలు తెచ్చాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం అని చెప్పారు. 11:35AM అన్నమయ్య జిల్లా ►సీఎం కాన్వాయ్ కి ఎదురొచ్చిన అంబులెన్స్ ►బస్సుని పక్కన ఆపించి అంబులెన్సుకు దారిచ్చిన సీఎం వైఎస్ జగన్ ►సీఎం మానవత్వానికి చేతులెత్తి నమస్కరించిన పేషంట్ బంధువు 11:30AM ►మదనపల్లె సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ ►సీఎంతో పాటు హెలికాఫ్టర్లో వచ్చిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున 11:15AM ►హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో టిప్పు సుల్తాన్ గ్రౌండ్ సభా వేదిక వద్దకు బయలు దేరిన సీఎం ►బెంగళూరు రోడ్డు, గాంధీపురం జంక్షన్, సొసైటీకాలనీ గేటు, అనిబిసెంట్ సర్కిల్, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, యన్టీఆర్ సర్కిల్, భాగ్యలక్ష్మీ మిల్, ప్రశాంత్ నగర్, రెడ్డీస్ కాలనీ, కదిరి రోడ్డు మీదుగా టిప్పు సుల్తాన్ గ్రౌండ్ వరకు సాగనున్న కాన్వాయ్ ►సీఎంను చూసేందుకు రహదారి వెంబడి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు ,అభిమానులు ►రోడ్డుకు ఇరువైపులా బారులుతీరిన ప్రజలకు చిరునవ్వుతో నమస్కరిస్తూ ముందుకు సాగుతున్న సీఎం జగన్ 11:01AM అన్నమయ్య జిల్లా ►మదనపల్లి బీటీ కాలేజ్ గ్రౌండ్లోని హెలిప్యాడ్కు చేరుకొన్న సీఎం వైఎస్ జగన్ ►ఘనస్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ,మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్లు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు నవాజ్ బాషా, ద్వారకానాద్ రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, జడ్పీ చైర్మన్లు ఆకేపాటి అమర్నాథ రెడ్డి, శ్రీనివాసులు ,కలెక్టర్ గిరీషా ,డీఐజీ సెంథిల్ కుమార్ ,ఎస్పీ హర్షవర్ధన్ రాజు ,కార్పొరేషన్ ఛైర్మెన్లు 10:35 AM అన్నమయ్య జిల్లా ►మదనపల్లి టిప్పు సుల్తాన్ మైదానం సభా ప్రాంగణంలో కిక్కిరిసిన విద్యార్థిని, విద్యార్థులు ►సీఎం జగన్ రాక కోసం ఎదురు చూస్తున్న విద్యార్థిని, విద్యార్ధులు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 10:30AM ►తిరుపతి విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మదనపల్లి బయలుదేరిన సీఎం జగన్ 10:25AM తిరుపతి జిల్లా ►తిరుపతి విమానాశ్రయంకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►సీఎంను విమానాశ్రయం వద్ద కలిసిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెస్ బాబు, ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు 09:00 AM ►తాడేపల్లి: మదనపల్లె బయలుదేరిన సీఎం జగన్ ►మరికొద్దిసేపటిలో జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం సాక్షి, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై–సెప్టెంబర్ త్రైమాసికం నిధులను సీఎం వైఎస్ జగన్ బుధవారం విడుదల చేయనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేస్తారు. దీనివల్ల మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం మీద ఇప్పటివరకు ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.12,401 కోట్లు విడుదల చేసింది. ఆర్థికస్తోమత లేక ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంటును అమలు చేస్తోంది. తల్లిదండ్రులపై భారం పడకుండా కాలేజీలకు ఎంత మొత్తం ఫీజు ఉన్నా ఆ మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ ఫీజులను ప్రతి త్రైమాసికం క్యాలెండర్ ప్రకారం విడుదల చేయడంతో కాలేజీల యాజమాన్యాలకూ ప్రయోజనం చేకూరుతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పులపాలైన తల్లిదండ్రులు.. గత ప్రభుత్వం హయాంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేయలేదు. కాలేజీల్లో ఫీజు రూ.లక్షల్లో ఉన్నా కేవలం రూ.35,000 మాత్రమే ఇచ్చి అప్పటి టీడీపీ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. పైగా ఆ అరకొర మొత్తాన్ని కూడా సకాలంలో చెల్లించేది కాదు. దీంతో తల్లిదండ్రులు అప్పుల పాలయ్యారు. అనేకమంది విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇలా గత ప్రభుత్వం 2017 నుంచి పెట్టిన బకాయిలు దాదాపు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ. 3,349 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. ఈ నిధులతో కలిపి ఇప్పటివరకు ఈ రెండు పథకాల కింద రూ.12,401 కోట్లు సాయమందించింది. ఇంత పెద్దమొత్తంలో పేద విద్యార్థుల చదువుల కోసం వెచ్చించిన మరో ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేకపోవడం గమనార్హం. పేద విద్యార్థులు ఉన్నత చదువులు నిరాటంకంగా అభ్యసించేందుకు ఎలాంటి పరిమితులు విధించకుండా ఈ పథకాలను అందిస్తుండటం విశేషం. ఎప్పటి నిధులు అప్పుడే జమ.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. పేద విద్యార్థులు భోజనం, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకం కింద ఏటా 2 వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. -
నేడు మదనపల్లెలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
మదనపల్లె: జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల
సాక్షి, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై–సెప్టెంబర్ త్రైమాసికం నిధులను సీఎం వైఎస్ జగన్ బుధవారం విడుదల చేయనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేస్తారు. దీనివల్ల మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం మీద ఇప్పటివరకు ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.12,401 కోట్లు విడుదల చేసింది. ఆర్థికస్తోమత లేక ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంటును అమలు చేస్తోంది. తల్లిదండ్రులపై భారం పడకుండా కాలేజీలకు ఎంత మొత్తం ఫీజు ఉన్నా ఆ మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ ఫీజులను ప్రతి త్రైమాసికం క్యాలెండర్ ప్రకారం విడుదల చేయడంతో కాలేజీల యాజమాన్యాలకూ ప్రయోజనం చేకూరుతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పులపాలైన తల్లిదండ్రులు.. గత ప్రభుత్వం హయాంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేయలేదు. కాలేజీల్లో ఫీజు రూ.లక్షల్లో ఉన్నా కేవలం రూ.35,000 మాత్రమే ఇచ్చి అప్పటి టీడీపీ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. పైగా ఆ అరకొర మొత్తాన్ని కూడా సకాలంలో చెల్లించేది కాదు. దీంతో తల్లిదండ్రులు అప్పుల పాలయ్యారు. అనేకమంది విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇలా గత ప్రభుత్వం 2017 నుంచి పెట్టిన బకాయిలు దాదాపు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ. 3,349 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. ఈ నిధులతో కలిపి ఇప్పటివరకు ఈ రెండు పథకాల కింద రూ.12,401 కోట్లు సాయమందించింది. ఇంత పెద్దమొత్తంలో పేద విద్యార్థుల చదువుల కోసం వెచ్చించిన మరో ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేకపోవడం గమనార్హం. పేద విద్యార్థులు ఉన్నత చదువులు నిరాటంకంగా అభ్యసించేందుకు ఎలాంటి పరిమితులు విధించకుండా ఈ పథకాలను అందిస్తుండటం విశేషం. ఎప్పటి నిధులు అప్పుడే జమ.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. పేద విద్యార్థులు భోజనం, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకం కింద ఏటా 2 వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. -
మదనపల్లెకు సీఎం వైఎస్ జగన్
-
సర్కారీ వైద్యం సూపర్
మదనపల్లె: గత ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్యం అంటే ప్రజలు భయపడే పరిస్థితి. ప్రాణాపాయ స్థితిలో అత్యవసరంగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే వైద్యులు అందుబాటులో లేకపోవడం, ప్రమాదకర పరిస్థితుల్లో వైద్యం అందించలేమంటూ తిరుపతి, బెంగళూరు, వేలూరు ఆస్పత్రులకు రెఫర్ చేసేవారు. అరకొర వసతులతో సామాన్యులకు వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యరంగానికి మహర్దశ పట్టింది. పేదవాడికి కార్పొరేట్ వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు–నేడు పథకంతో మౌలికవసతులు, కోట్లాదిరూపాయలు వెచ్చించి అధునాతన పరికరాలు, ల్యాబ్, ఆక్సిజన్ సదుపాయాలు కల్పించారు. అన్నమయ్య జిల్లాలోని పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గాల ప్రజల వైద్య అవసరాలకు ఏకైక పెద్దదిక్కు మదనపల్లె జిల్లా ఆస్పత్రి. 2019 వరకు మదనపల్లె జిల్లా వైద్యశాలలో 15 నుంచి 20 మంది మాత్రమే డాక్టర్లు ఉండేవారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టుల భర్తీపై దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ గిరీషా.పీఎస్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి చైర్మన్గా, ఎమ్మెల్యే నవాజ్బాషా కో చైర్మన్గా ఉన్నారు. ఆస్పత్రి సమస్యలను ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి శాయశక్తులా కృషిచేయడంతో నేడు జిల్లా ఆస్పత్రిలో 34మంది వైద్యులు సేవలందిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రిలో లభించే ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రతిరోజు 700 నుంచి 800 వరకు ఔట్పేషెంట్లు వైద్యచికిత్సలు పొందుతున్నారు. 150 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఆప్తాల్మజీ, ఆర్థో, ఈఎన్టీ, సైకియాట్రి, జనరల్ సర్జరీ, జనరల్ ఫిజీషియన్ మెడిసిన్, గైనకాలజీ, రేడియాలజీ, పిడియాట్రిక్, ఏ.ఆర్.టి.(హెచ్ఐవీ) సెంటర్, టీబీ, డీ–అడిక్షన్ సెంటర్లకు సంబంధించి అనుభవజ్ఞులైన వైద్యులు సేవలందిస్తున్నారు. రాష్ట్రంలోనే మంచిపేరున్న బ్లడ్బ్యాంక్ ఆస్పత్రిలో అందుబాటులో ఉంది. ప్రతిరోజు నాలుగు షిఫ్ట్లలో నెలకు 100మందికి పైగా కిడ్నీవ్యాధిగ్రస్తులకు సేవలందించేందుకు డయాలసిస్ సెంటర్ ఉంది. పాయిజన్, హార్ట్స్ట్రోక్స్, ఇతర అత్యవసరాలకు సంబంధించి 10 బెడ్లతో ఐసీయూ, పుట్టిన పిల్లలకు తక్షణ వైద్యసేవలకు సిక్ న్యూ బార్న్ యూనిట్లో 10 బెడ్లను ఏర్పాటు చేశారు. డీఎన్బీ కింద గైనిక్, అనస్థీషియా విభాగాలకు సంబంధించి ఇద్దరు పీజీ వైద్య విద్యార్థులను ప్రభుత్వం కేటాయించింది. 24 గంటలు అత్యవసర వైద్యసేవలు అందేలా అన్ని చర్యలు తీసుకున్నారు. ఈసీజీ, వెంటిలేటర్లు, కంప్లీట్ ఆటోఅనలైజర్, డయాలసిస్, హార్మోన్ ఎనలైజర్ మిషన్లు, స్కానింగ్ అందుబాటులో ఉన్నాయి. జిల్లా వైద్యశాలలో త్వరలో బ్రెస్ట్ క్యాన్సర్, ఇతరాలకు సంబంధించి క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. 8కోట్ల రూపాయల అభివృద్ధి పనులు గడచిన రెండున్నరేళ్లలో జిల్లా వైద్యశాలలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. కరోనా సమయంలో ఆక్సిజన్ దొరక్క చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఎంపీ మిథున్రెడ్డి సొంత నిధులతో ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లను హైదరాబాదు నుంచి తెప్పించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఎమ్మెల్యే నవాజ్బాషా ఎంపీ సహకారంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్–1, పీఎస్ఏ ప్లాంట్లు–2 మొత్తం మూడింటిని ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా వీటిద్వారా 100 బెడ్లకు ఆక్సిజన్ అందించే అవకాశం ఉంది. అత్యవసర వైద్యసేవలు అందించేందుకు 10 ఐసీయూ బెడ్లు, 0–8 సంవత్సరాల పిల్లలకు సేవలందించేందుకు డీఐసీకు శాశ్వత భవనాన్ని సిద్ధం చేస్తున్నారు. కరోనా టెస్టులు చేసేందుకు వీఆర్డీఎల్ ల్యాబ్ ఉంది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు ప్రభుత్వాసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాము. సిబ్బంది కొరత లేకుండా అన్ని విభాగాలకు డాక్టర్లను నియమించాం. జిల్లా ఆస్పత్రికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది వచ్చినా స్వయంగా పర్యవేక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన పేదవాడు ఇక్కడ అందే ఉచిత వైద్యంతో ఆరోగ్యంగా ఇంటికెళ్లాలన్న ధ్యేయంతో పనిచేస్తున్నాం. –నవాజ్బాషా, ఎమ్మెల్యే అందుబాటులో స్పెషాలిటీ వైద్యసేవలు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పూర్తిస్థాయి స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. సిబ్బంది కొరత లేదు. గైనకాలజీ విభాగంలో నెలకు 300 వరకు కాన్పులు, ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఐసీయూ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. జిల్లా ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్యసేవలకు సంబంధించి అక్టోబర్కు సంబంధించి 2వ ర్యాంకును సాధించాం. – డాక్టర్ ఆంజనేయులు, మెడికల్ సూపరింటెండెంట్ రోగులకు మంచి వైద్యం అందుతోంది మాది నిమ్మనపల్లె మండలం దిగువపల్లె గ్రామం. పక్షవాతంతో బాధపడుతున్నాను. ఐదురోజుల క్రితం ఆయాసం, గొంతు, వెన్నునొప్పితో ఆస్పత్రిలో చేరాను. ఇక్కడ గతంతో పోలిస్తే ప్రస్తుతం మంచి వైద్యం అందుతోంది. సౌకర్యాలు బాగున్నాయి. – శివకుమార్ సింగ్, దిగువపల్లె, నిమ్మనపల్లె -
తొలిసారి అన్నమయ్య జిల్లా పర్యటనకు సీఎం జగన్
సాక్షి, మదనపల్లె: అన్నమయ్య జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా విచ్చేస్తున్న సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటనను సమన్వయంతో పనిచేసి విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్ గిరీషా.పీఎస్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పిలుపునిచ్చారు. జగనన్న విద్యాదీవెన నాలుగో విడత పంపిణీకి సంబంధించి ఈనెల 25న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మదనపల్లెకు రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ తలశిలరఘురాం, ఎస్పీ హర్షవర్దన్రాజు, జేసీ తమీమ్అన్సారియా, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిలు సభాస్థలి, హెలిప్యాడ్, రోడ్షో ఏర్పాట్లపై పట్టణంలోని టిప్పుసుల్తాన్ కాంప్లెక్స్, బీటీ కళాశాల గ్రౌండ్స్, చిప్పిలి విజయాడెయిరీ వెనుకవైపు మైదానాలను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో సభా ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..అన్నమయ్య జిల్లాలో తొలిసారిగా చేస్తున్న ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు జరగకుండా, పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి అధికారి ఆయా శాఖల పరిధిలో వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం పంపిణీ సభకు టిప్పుసుల్తాన్ మైదానాన్ని ఎంపిక చేశామన్నారు. చదవండి: (ఇతర పార్టీల పొత్తుకోసం పాకులాట.. మరి ఈ బిల్డప్ ఏంటి బాబు?) హెలిప్యాడ్, సభావేదిక, బారికేడ్లు, పార్కింగ్ వసతి, ఫైర్సేఫ్టీ, భద్రతాసౌకర్యం, ప్రొటోకాల్, విద్యుత్సరఫరా, ఆహారం, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, వైద్యసదుపాయాలు సమకూర్చాలన్నారు. హెలిప్యాడ్ నుంచి సభాస్థలికి చేరుకునేంతవరకు సీఎం పర్యటించే రహదారి పొడవునా ప్రతి 100 మీటర్లకు ఒక అధికారిని నియమించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి, సభాస్థలంలో పబ్లిక్ టాయిలెట్స్ వసతులను కల్పించాలని మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీలను ఆదేశించారు. మదనపల్లె సీఎం పర్యటనకు సంబంధించి పూర్తిస్థాయి పర్యవేక్షణ జేసీ తమీమ్అన్సారియా, ఆర్డీఓ ఎం.ఎస్.మురళీకి కేటాయించారు. రాజంపేట ఆర్డీఓ కోదండరెడ్డికి హెలిప్యాడ్, రాయచోటి ఆర్డీఓ రంగస్వామికి వేదిక ఏర్పాట్లపై బాధ్యతలు అప్పగించారు. సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిలరఘురాం మాట్లాడుతూ... విద్యాదీవెన కార్యక్రమానికి తక్కువ వ్యవధి ఉన్న నేపథ్యంలో సరైన ప్రణాళికతో పూర్తిస్థాయిలో కార్యక్రమం విజయవంతానికి అధికారులు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జెడ్పీచైర్మన్ శ్రీనివాసులు, ఏపీఎండీసీ చైర్పర్సన్ షమీంఅస్లాం, జెడ్పీటీసీ ఉదయ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి, వైస్చైర్మన్ జింకా చలపతి, వైఎస్సార్ సీపీ నాయకులు బాబ్జాన్, జబ్బలశ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ రాజ్కమల్, జిల్లా ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
హార్సిలీ హిల్స్తో సూపర్స్టార్ కృష్ణకు విడదీయరాని అనుబంధం
తెలుగు సినీ జగత్తులో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న సూపర్స్టార్ కృష్ణకు అన్నమయ్య జిల్లాలోని హార్సిలీ హిల్స్తో విడదీయరాని అనుబంధం ఉంది. తాను నటించిన ఎన్నో సూపర్హిట్ చిత్రాల చిత్రీకరణ ఇక్కడే జరిగింది. వేసవిలో హార్సిలీహిల్స్పై విడిది చేసేవారు. ఇలా హార్సిలీహిల్స్తో కృష్ణకు పెనవేసుకున్న కొండంత అనుబంధం సాక్షి పాఠకుల కోసం.. బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్తో సినీనటుడు ఘట్టమనేని కృష్ణకు విడదీయరాని అనుబంధం ఉంది. పర్యాటక, వేసవి విడిది కేంద్రమైన బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్పై సినిమా షూటింగులకు ఆద్యుడు ఆయనే. చిత్రపరిశ్రమకు హార్సిలీహిల్స్ను పరిచయం చేసింది కృష్ణనే. ఆయన రెండో చిత్రం కన్నెమనుసులు 1966లో విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించి ఎక్కువ భాగాలు కొండపైనే చిత్రీకరించారు. ఈ ఏడాదిలో మొదలు పెట్టిన సినిమాల చిత్రీకరణ 1997 వరకు కొనసాగింది. కొండపై తీసిన కృష్ణ మొదటి సినిమా కన్నెమనుసులు కాగా చివరి సినిమా పాతికేళ్ల క్రితం 1997లో ఎన్కౌంటర్ తీశారు. ఆ తర్వాత సినిమాలు చిత్రీకరించనప్పటికి 2007లో ఒకసారి విజయనిర్మల, నరేష్తో కలిసి కొండపై ఒక రోజు విడిది చేసి వెళ్లారు. ఆ తర్వాత కృష్ణ ఇక్కడికి రాలేదు. తొలి సెట్టింగ్ గాలిబండపై సముద్రమట్టానికి 4,141 అడగుల ఎత్తులో ప్రకృతి అందాలకు నిలయమైన కొండపై గాలిబండ, పాత వ్యూపాయింట్, ఘాట్రోడ్డు ప్రాంతాల్లో కృష్ణ సినిమాల చిత్రీకరణలు జరిగాయి. కృష నటించిన కన్నెమనసులు చిత్రం కోసం గాలిబండపై తొలి సెట్టింగ్ వేయడం ఈ సినిమాతోనే మొదలైంది. వెదురుకట్టెలు, పైకప్పు గడ్డితో గాజులమ్మ గుడిని నిర్మించగా అందులో ఓ పాట, గుడి మంటల్లో కాలిపోయే దృశ్యాలను చిత్రీకరించారు. గవర్నర్ బంగ్లా, దాని ఆవరణలో కృష్ణ, ఇతర నటులతో చివరి భాగం నిర్మించారు. ఈ చిత్రంతో కృష్ణకు కొండతో అనుబంధం ఏర్పడింది. దీని తర్వాత అసాధ్యుడు, అఖండుడు, నేనంటేనేనే, దొంగలదోపిడి, సింహగర్జన, పులిజూదం, ఏకలవ్య, గూడుపుఠాణి, పట్నవాసం తదితర 25కుపైగా సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి. 1997 అగస్టు 14న విడుదలైన ఎన్.శంకర్ దర్శకత్వంలో కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమా అత్యధికభాగంగా, పాటలను నెలరోజులు హార్సిలీహిల్స్ అడవిలో చిత్రీకరించారు. కొండపై కృష్ణ చివరి చిత్రం ఇదే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మే 31న కొండపై జన్మదినవేడుకలు జరుపుకోగా సతీమణీ విజయనిర్మల, ప్రముఖ నటులు వేడుకలకు హజరయ్యారు. చిత్రీకరణ పూర్తయ్యేవరకు అటవీశాఖ అతిథి గృహాలైన హార్సిలీ సూట్, మిల్క్హౌస్లో విడిది చేశారు. కాగా హార్సిలీహిల్స్పై షూటింగ్లను ప్రారంభించింది తానేనని, ఆ తర్వాత మిగతా నటులు ఇక్కడికి వచ్చారని ఎన్కౌంటర్ షూటింగ్ సందర్బంగా కృష్ణ చెప్పారు. తాను నటించిన అత్యధిక చిత్రాల షూటింగ్ హార్సిలీహిల్స్లోనే జరిపినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మారనని ప్రకటన 1997 మేనెలలో ఎన్కౌంటర్ సినిమా షూటింగ్ హార్సిలీహిల్స్పై జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ మారనని, ఏ పార్టీలో చేరనని, కొత్త పార్టీ పెట్టనని ప్రకటించారు. నెలరోజులు షూటింగ్ కోసం కొండపై ఉన్నారు. ఈ సమయంలో ఆయన తాను రాజీవ్గాంధీ పిలుపుతో కాంగ్రెస్లో చేరానని, ఆయ న మరణించాక పార్టీలో క్రీయాశీల రాజకీయాల్లో ఉండలేనని చెప్పారు. ఓసేయ్ రామ్ములమ్మ సినిమాలో కొన్ని వ్యవస్థల తీరుపై కృష్ణ వ్యాఖ్యలపై ఆయన విజయశాంతితో కలిసి పార్టీ పెట్టబోతున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయన అప్పట్లో అన్న మాటకు చివరిదాకా కట్టుబడ్డారు. సతీమణీ విజయనిర్మల టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసినా అండగా నిలవలేదు. అతిథిగృహం కోసం ప్రయత్నం నటుడు కృష్ణ ప్రతివేసవి ఊటీలో గడుపుతారు. అయితే హార్సిలీహిల్స్పైనా అతిథిగృహం ఉండాలని కృష్ణ ఆశించారు. దీనికోసం 2007లో విజయనిర్మల, నరేష్తో కలిసి హార్సిలీహిల్స్ వచ్చారు. ఇక్కడి సొసైటీ స్థలాలను పరిశీలించారు. శరత్బాబుకు చెందిన అసంపూర్తి అతిథిగృహం చూశారు. అయితే ఆయన ప్రయత్నం ఫలించలేదు. అతిథిగృహం నిర్మించుకోలేకపోయారు. మదనపల్లె అంటే భలే అభిమానం మదనపల్లె సిటీ: సూపర్స్టార్ కృష్ణకు మదనపల్లె అంటే ఎంతో అభిమానం. 1962లో కృష్ణ, విజయనిర్మల నటించిన రక్తసంబంధం సినిమా విజయోత్సవ సభకు మదనపల్లెకు వచ్చారు. స్థానిక పంచరత్న టాకీసులో సినిమా ఉత్సవాల్లో పాల్గొన్నారు. అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. పంచరత్న టాకీసు అధినేత బాబా వరప్రసాద్ ఇంటికి వెళ్లి అతిథ్యం స్వీకరించారు. 1976లో పాడిపంటలు సినిమా విజయోత్సవాలకు కూడా హాజరయ్యారు. కృష్ణ మృతితో పట్టణంలోని అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఎన్నికల ప్రచారంలో... 1991లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరపున మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండులో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు. -
టీడీపీ కార్యాలయంలో రికార్డింగ్ డ్యాన్స్లు.. ఐటమ్ సాంగ్లతో రెచ్చిపోయారు
మదనపల్లె(అన్నమయ్య జిల్లా): మదనపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో రికార్డింగ్ డ్యాన్సులు, అమ్మాయిల నృత్యాలు హోరెత్తాయి. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మత్తెక్కించే, హుషారైన ఐటమ్ సాంగ్లతో రెచ్చిపోయారు. చదవండి: World Stroke Day: సమయం లేదు మిత్రమా! నిమ్మనపల్లె సర్కిల్, చిత్తూరు బస్టాండ్, బెంగళూరు బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్లో జరిపిన వేడుకల్లో నడిరోడ్డుపైనే కార్యక్రమాలు ఏర్పాటుచేసి ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే నాయకులు, అభిమానులు, కార్యకర్తల కోసం మాజీ ఎమ్మెల్యే రమేష్ ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్సులు పట్టణంలో చర్చనీయాంశమయ్యాయి. -
AP: పెళ్లింట విషాదం.. శోభనం గదిలో వరుడు మృతి.. ఏం జరిగింది?
సాక్షి, అన్నమయ్య: జిల్లాలోని పెళ్లింట విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి జరిగి 12 గంటలు కూడా గడవక ముందే దారుణం జరిగింది. శోభనం గదిలోనే వరుడు మృతి చెందడం కలకలం సృష్టించింది. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. మదనపల్లెలో తులసీప్రసాద్, శిరీషకు పెద్దలు పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో, సోమవారం వీరికి పెళ్లి జరిగింది. కాగా, పెళ్లి రోజులు రాత్రి వారికి ఇరు కుటుంబాల పెద్దలు శోభనం జరిపాలని నిర్ణయించారు. అందుకు తగినట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, గదిలోకి ముందుగానే వెళ్లిన తులసీప్రసాద్ బెడ్పై నిర్జీవంగా పడిపోయాడు. గదిలోకి వెళ్లిన నవ వధువు శిరీష్.. తులసీప్రసాద్ గదిలో పడిపోయి ఉండటంతో టెన్షన్కు గురైంది. ఈ విషయాన్ని అత్తామామలకు చెప్పింది. వారు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో తులసీప్రసాద్కు పరిశీలించిన వైద్యులు అప్పటికే అతడు మరణించినట్టు నిర్ధారించారు. నవ వరుడు పెళ్లి జరిగిన 24 గంటల్లోనే ఇలా మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకింది. నవ వధువు శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే, వరుడు తులసీప్రసాద్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. -
నందిరెడ్డిగారిపల్లె ప్రత్యేకత ఏంటో తెలుసా!
కురబలకోట(అన్నమయ్య జిల్లా) : ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. బేల్దార్లు (తాపీ మేస్త్రీలు), భవన నిర్మాణ కార్మికులున్న ఊరుగా కురబలకోట మండలంలోని నందిరెడ్డిగారిపల్లె పెట్టింది పేరు. ఇది కష్టజీవుల ఊరు. ఏ ఇంట్లో చూసినా తాపీ, గజం కట్టి, టేపు, మూల మట్టం కన్పిస్తాయి. వీరు కూడా అంతా ముస్లిం మైనార్టీలే. 40 ఏళ్ల క్రితం తొలుత ఆ ఊరికి చెందిన షేక్ నూరాసాబ్ ఈ వృత్తికి ఆద్యులుగా చెబుతారు. ఆ తర్వాత దర్గా ఖాదర్వల్లీ ఈ వృత్తిని స్వీకరించడంతో అతని వద్ద మరికొందరు బేల్దార్లు, మేస్త్రీలు తయారయ్యారు. ఇలా ఒక్కరొక్కరుగా పనికి వెళుతూ మిగిలిన వారు కూడా కాలక్రమంలో బేల్దార్లు అయ్యారు. ఇప్పుడు ఆ ఊరిలో 75 శాతం మందికి ఇదే జీవనాధారం. ఈ వృత్తినే పరంపరగా సాగిస్తున్నారు. ఇంటికి ఇద్దరు ముగ్గురు కూడా బేల్దార్లు ఉన్నారు. చేతిపని కావడంతో వచ్చే ఆదాయం ఇళ్లు గడవడం ఇతర అత్యవసరాలు తీరడానికి సరిపోతోందని చెబుతున్నారు. ఉదయం ఏడు గంటలకు పనికి బయలు దేరి సాయంత్రం ఐదు గంటల వరకు పనులు చేసి తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. మంగళవారం మదనపల్లె సంత కావడంతో సెలవు తీసుకుంటారు. ఈ ఊరిలో 2221 జనాభా, 621 కుటుంబాలు, 1063 మంది ఓటర్లు ఉన్నారు. 90 శాతం అక్షరాస్యత ఉంది. ఈ ఊరి తర్వాత మండలంలోని సింగన్నగారిపల్లె, పందివానిపెంట కూడా భవన నిర్మాణ కార్మికులకు పెట్టింది పేరు. మదనపల్లె, కురబలకోట పరిసర ప్రాంతాలకు వీరు పనులకు వెళతారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి వీరికోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. (క్లిక్: చదివింది ఏడో తరగతి.. నాదస్వర సాధనలో దిట్ట) యువతరం చదువులపై దృష్టి నేటి తరం చదువులపై దృష్టి సారిస్తున్నారు. ఉద్యోగాల పట్ల మక్కువ చూపుతున్నారు. ఈ వృత్తి పట్ల యువకులు విముఖత చూపుతున్నారు. ప్రభుత్వ ఉర్దూ యూపీ స్కూల్ ఉంది. ఈ ఊరిలో సచివాలయం కూడా ఉంది. వెనుకబడిన ఆ ఊరు ఇప్పుడిప్పుడే వివిధ ప్రభుత్వ పథకాలతో క్రమేణా పేదరికం నుంచి బయటపడుతోంది. భవన నిర్మాణ కార్మికులకు 55 ఏళ్లకే పింఛన్ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా ఇళ్లు కట్టుకున్నాం. మా ఇళ్లను మేమే ఉన్నంతలో సంతోషంగా కట్టుకుంటాం. – మోదీన్ సాబ్, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె ఎన్నేళ్లయినా ఉపాధికి ఢోకాలేదు ఈ వృత్తితో ఎన్నేళ్లయినా ఉపాధికి ఢోకా లేదు. కట్టడాలు, భవన నిర్మాణాలు నిరంతరం జరుగుతుంటాయి. పని లేదన్న చింత లేదు. సీఎం జగన్ ప్రభుత్వంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ క్లినిక్ భవనాలు, జగనన్న ఇళ్లు లాంటి తదితర ఎన్నో అభివృద్ధి పనుల వల్ల రెండు చేతులా తరగని పని ఉంది. కాలానికి తగ్గట్టుగా టెక్నాలజీ వచ్చింది. యంత్రాల సాయంతో పని కూడా సులభతరంగా మారింది. తాపీనే మాకు పెట్టుబడి.. ఆపై జీవనాధారం. ఖర్చులు పోను నెలకు రూ. 20 వేలు వరకు మిగులుతుంది. – కమాల్సాబ్, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె అభివృద్ధి బాటపడుతోంది ఈ ఊరు దశాబ్దాలుగా పేదరికాన్ని అనుభవించింది. సచివాలయాలు రాక మునుపు సరైన రోడ్డు లేదు. వీధులు సరిగ్గా ఉండేవి కావు. ఇప్పుడు పక్కా రోడ్డు ఉంది. పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. పింఛన్లు వస్తున్నాయి. వివిధ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. 31 డ్వాక్రా గ్రూపులు ఉండగా వాటి ద్వారా రూ. 3 కోట్లు టర్నోవర్ ఉంది. డబ్బుకు ప్రైవేటు వారిని ఆశ్రయించాల్సిన పనిలేదు. ఈ ఊరు మదనపల్లె పట్టణానికి సమీపంలోనే ఉంది. ఇది కూడా వీరికి కలసి వచ్చింది – సఫియా, గ్రామ కార్యదర్శి, నందిరెడ్డిగారిపల్లె నాడు రూ. రెండున్నర.. నేడు రూ.800 మేము పనిచేసే తొలి నాళ్లలో బేల్దార్లకు రోజుకు రెండున్నర రూపాయి ఇచ్చేవారు. ఇప్పుడు రూ. 700 నుంచి రూ. 800 వరకు ఉంది. గుర్తుంపు కార్డులు ఇచ్చారు. వాటి అవసరం పెద్దగా ఏర్పడ లేదు. అల్లా దయవల్ల ప్రమాదకర ఘటనల బారిన పడలేదు. సత్తువ, శక్తి ఉన్నన్నాళ్లు ఈ పని చేసుకోవచ్చు. ఎప్పటికీ డిమాండు ఉంటుంది. – హైదర్వల్లీ, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె -
చదివింది ఏడో తరగతి.. నాదస్వర సాధనలో దిట్ట
మదనపల్లె : పిట్ట కొంచెం కూత ఘనం.. అన్నట్లుగా ‘ఉష’ చదివింది ఏడో తరగతి అయినప్పటికీ నాదస్వర సాధనలో దిట్ట. ఊపిరి బిగబట్టుకుని సప్తస్వరాలను సన్నాయిలో వినిపించేందుకు మగవారు సైతం జంకే పరిస్థితుల్లో 22ఏళ్ల ఉష నిష్ణాతురాలిలా ప్రదర్శనలు ఇస్తూ పలువురి ప్రశంసలు పొందుతోంది. ఆమె నాదస్వరగానం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. శ్రోతలను సంగీత, ఆధ్మాతికలోకంలోకి తీసుకెళుతుంది. తండ్రి నుంచి నేర్చుకున్న విద్యను.. సాధన చేసి మెరుగుపరచుకుని.. కళను కాపాడుకావాలనే లక్ష్యంతో.. భర్త ప్రోత్సాహంతో ముందుకెళుతున్న నాదస్వర కళాకారిణి ఉషపై సాక్షి ప్రత్యేక కథనం... కర్నాటక సంగీతంలోని గమకాలను యథాతథంగా పలికించగల వాయిద్యాల్లో అగ్రతాంబూలం నాదస్వరానిదే. పురాతనమైన ఆ వాయిద్యం ఎంతో మంగళప్రదమైనది కూడా. అందుకే శుభ కార్యాలలో ఆ వాద్య శ్రవణం చేయడం అనాదిగా ఆచారంగా వస్తోంది. నాదస్వరాన్ని తెలుగులో సన్నాయిగా పిలుస్తారు. తెలుగునాట నాదస్వరంలో నిష్ణాతులైన విద్వాంసులు అరుదనే చెప్పుకోవాలి. పురుషుల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ కళలో మహిళలు రాణించడం అరుదైన విషయం. అందులోనూ ఓ 22 ఏళ్ల యువతి రాణించడం విశేషం. కర్నాటకలోని గౌనిపల్లెకు చెందిన నాదస్వర విద్వాంసులు సుబ్రహ్మణికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి శ్వేత, చిన్నమ్మాయి ఉష. తన వారసత్వ కళను తన పిల్లల్లో ఒకరికి నేర్పిస్తే చాలనుకున్న సుబ్రహ్మణి ఇద్దరు పిల్లలు ఇష్టంగా నేర్చుకునేందుకు ముందుకు రావడంతో ఇంటిపట్టునే సాధన చేయించి నాదస్వరంలో దిట్టలుగా మలిచారు. పురుషుల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ కళలో వారికి ఏమాత్రం తీసిపోకుండా తన ఇద్దరు పిల్లలకు నాదస్వర విద్యను నేర్పించి ప్రావీణ్యతను సాధింపజేశారు. ఉష అక్క శ్వేత నాదస్వరాన్ని నేర్చుకునే క్రమంలో ఇంటిపట్టున సాధన చేస్తుండేది. దీన్ని చూసిన ఉష అక్కతో పాటుగా నాదస్వరం నేర్చుకుంటానని పట్టుబట్టింది. 11వ ఏట సన్నాయిని చేతపట్టిన ఉష సుమారు ఏడేళ్లపాటు కఠోర సాధనతో రాగం, తాళం, స్వరాలపై మంచి పట్టును సాధించింది. తండ్రి సుబ్రహ్మణి తనతోపాటుగా దేవాలయాలు, శుభకార్యాలు, కచేరీలకు పిల్లలు ఇద్దరినీ తీసుకెళ్లి ప్రదర్శనలు ఇప్పించేవారు. ఈ క్రమంలో పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు కావడంతో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిపోయారు. వివాహరీత్యా అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ–2, వైఎస్సార్ కాలనీలో స్థిరపడిన ‘ఉష’.. భర్త పురుషోత్తం, అత్తామామల ప్రోత్సాహంతో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో జరిగే సంగీతకార్యక్రమాలు, పెళ్లిళ్లు, శుభకార్యాల్లో ‘ఉష’ నాదస్వరాలాపన ప్రత్యేక ఆకర్షణగా మారింది. తండ్రి వారసత్వం ఉష నాన్న సుబ్రహ్మణి నాదస్వర విద్వాంసులు. ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. కోలారు, బెంగళూరు, శ్రీనివాసపురం తదితర ప్రాంతాల్లో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో ప్రదర్శనలు ఇచ్చి పలువురి ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో తొలిసారిగా ఉష తండ్రితో కలిసి తన 17 ఏళ్ల వయస్సులో బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో తొలి ప్రదర్శన ఇచ్చింది. మొదటి ప్రయత్నంలోనే తన నాదస్వరంతో శ్రోతలను ఆకట్టుకోవడంతో ప్రతిభను మరింత మెరుగుపరచుకునే దిశగా అడుగులు వేసింది. సరళి స్వరాలు, జంటలు, అలంకారాలు, పిల్లారి గీతాలు, కృతులు, వర్ణాలు, అన్నమాచార్య కీర్తనలు, లయ, తాళం, రాగం, శృతులను నేర్చుకుంది. మాఘ, చైత్ర, వైశాఖ, శ్రావణమాసాల్లో జరిగే సంగీత కార్యక్రమాల్లో నాదస్వరంలో రాణిస్తూ.. పలు ప్రశంసాపత్రాలు, షీల్డులు అందుకుంది. సన్మానాలు పొందింది. డోలు.. సన్నాయి.. ఉష సన్నాయి కళాకారిణి అయితే ఆమె భర్త పురుషోత్తం డోలు విద్వాంసుడు. డోలు, సన్నాయి వేర్వేరు వాయిద్యాలు అయినప్పటికీ ఆ రెండూ కలిస్తే అద్భుతమైన కలయిక. వాటి నుంచి వెలువడే మంగళ వాయిద్యం వినేందుకు ఎంత అద్భుతంగా ఉంటుందో... ఉష, పురుషోత్తంలు కలిసి ఇస్తున్న ప్రదర్శనలు అంతే గొప్పగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పురుషోత్తం తిరుపతి ఎస్వీ మ్యూజికల్ కళాశాలలో ఆరేళ్లపాటు డోలు విద్యలో కోర్సు పూర్తిచేశారు. తిరుమల నాద నీరాజనం, తిరుపతి త్యాగరాజ కళామండపం, టీటీడీ అనుబంధ దేవాలయాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందారు. భగవంతుడి అనుగ్రహంతో ఒక్కటైన ఈ జంట.. డోలు, సన్నాయిలా కలిసిపోయి ఒకవైపు వివాహబంధాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు వాయిద్య ప్రదర్శనలతో పలువురిని ఆకట్టుకుంటున్నారు. -
Horsley Hills: అదిరేటి అందం.. ఆంధ్ర ఊటీ సొంతం
సాక్షి, బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ వేసవి విడిది కేంద్రంగా ఎలా మారింది, దీని వెనుక చరిత్ర ఏమి అన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక్కడికి వచ్చే సందర్శకులు ప్రకృతి అందాలను తిలకిస్తూ మైమరచే ఆహ్లాదకరమైన వాతావరణానికి ముగ్ధులవుతారు. చిరుజల్లులు కురిస్తే ఆ ప్రకృతి అందానికి మైమరచే ప్రకృతి ప్రేమికులెందరో. అలాంటి అందమైన హార్సిలీహిల్స్ను 153 ఏళ్ల క్రితమే బ్రిటీష్ ప్రభుత్వం వేసవి విడిది కేంద్రంగా ప్రకటించి ఉత్తర్వులు జారీచేసింది. ఆ తర్వాత బ్రిటిష్ కలెక్టర్ హార్సిలీ కొండపై చేపట్టిన పనులు, దాని చరిత్ర ఆనవాళ్లు ఇప్పటికి కళ్లముందు కనిపిస్తున్నాయి. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులోని హార్సిలీహిల్స్పై దీన్ని కనుగొన్న డబ్ల్యూడీ హార్సిలీ చెరగని ముద్రవేశారు. డబ్ల్యూడీ హార్సిలీ తొలుత మదనపల్లె సబ్కలెక్టర్గా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై కడప కలెక్టర్ అయ్యాక గుర్రంపై కొండకు రాకపోకలు సాగించారు. మద్రాసు ప్రభుత్వ అనుమతితో వేసవి విడది కేంద్రంగా మార్చారు. తొలి అతిథి గృహ నిర్మాణం కోసం అనుమతి పొంది వాటికి కావాల్సిన పెంకులను ఓడ ద్వారా ఇంగ్లాండు నుంచి దిగుమతి చేసుకొని కొండకు తరలించుకొన్నారు. ఒకప్పటి దట్టమైన అడవితో నిండిన హార్సిలీహిల్స్పై భూమి అంతా అటవీశాఖదే. వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు దక్కిన 90 ఏళ్ల తర్వాత అంటే 1959లో అటవీశాఖ 103 ఎకరాలను రెవెన్యూశాఖకు బదలాయించింది. లేదంటే ఈ రోజుకు హార్సిలీహిల్స్ మొత్తం నిషేధిత రిజర్వ్ఫారెస్ట్ పరిధిలో ఉండేది. అతిథి గృహానికి ఇంగ్లాండ్ పెంకులు వేసవి విడిది కేంద్రంగా హార్సిలీహిల్స్కు బ్రిటీష్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇక్కడ విడిది చేసేందుకు అతిథిగృహం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ హార్సిలీ మద్రాసు ప్రభుత్వానికి లేఖ రాయగా రిజర్వ్ ఫారెస్ట్లో బంగ్లా నిర్మించుకునేందుకు 1869 జూన్9న జీఓఎంఎస్ నంబర్ 4162ను జారీచేసింది. దీంతో 1869లోనే తొలి అతిథి గృహ నిర్మాణం మొదలైంది. హార్సిలీ ఇంగ్లాండ్ నుంచి ఓడలో పెంకులను మద్రాసుకు తెప్పించి, అక్కడినుంచి కొండకు రవాణా చేయించుకున్నారు. అటవీశాఖ అతిథిగృహాల్లో ఒకటైన ఇప్పుడు కళ్యాణి అతిథిగృహంగా పిలుచుకునే గది పైకప్పుకు ఈ పెంకులు వాడారు. ఇంగ్లాండ్లో 1865లో బేస్డ్ మిషన్ టైల్ వర్క్స్ అనే కంపెనీ పెంకులను తయారు చేసినట్టు పెంకులపై అక్షరాలు, కంపెనీ వివరాలు కనిపిస్తున్నాయి. తర్వాత కొన్నేళ్లకు ఘాట్రోడ్డు నిర్మాణం చేసింది కూడా బ్రిటిష్ ప్రభుత్వంలోనే. 4,141 అడుగుల ఎత్తులో బావి హార్సిలీహిల్స్ను వేసవి విడిది కేంద్రంగా మార్చుకోవడం, అతిథిగృహం నిర్మించుకొన్న కలెక్టర్ హార్సిలీకి నీటికోసం ప్రస్తుత అటవీ ప్రాంగణంలో బావిని తవ్వించగా పుష్కలంగా నీళ్లు లభ్యమయ్యాయి. బావి చుట్టూ ఇటుకల్లా బండరాళ్లను ఒకదానిపై ఒకటిగా పేర్చి నిర్మాణం చేశారు. ఈ నిర్మాణం అప్పట్లో అద్భుతంగా చెప్పబడుతోంది. బావి నిర్మాణంలో నేటికి ఒక్క రాయి కూడా చెక్కుచెదరలేదు. నీళ్లు నిండుగా ఉంటాయి. కరువు పరిస్థితుల్లో బావి ఎండినా సాధారణ రోజుల్లో నీళ్లుంటాయి. 1869 నుంచి వేసవి విడిది కేంద్రం హార్సిలీహిల్స్ను అధికారిక విడిది కేంద్రంగా చేసుకునేందుకు అప్పటి ప్రభుత్వానికి అనుమతి కోరుతూ కడప కలెక్టర్ హార్సిలీ లేఖ పంపారు. ఈ లేఖపై బ్రిటీష్ మద్రాసు ప్రభుత్వం హార్సిలీహిల్స్ను వేసవి విడిది కేంద్రంగా ప్రకటిస్తూ 1869 మే4న జీఓఎంఎస్ నంబర్ 11579ను జారీచేసింది. అప్పటినుంచి 153 ఏళ్లుగా వేసవి విడది కేంద్రంగా హార్సిలీహిల్స్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. 60 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర గవర్నర్కు కూడా అధికారికంగా ఇది వేసవి విడిది కేంద్రంగా గుర్తించారు. పలువురు గవర్నర్లు ఇక్కడ విడిది చేశారు. ఒకేరోజు జననం, మరణం హార్సిలీహిల్స్పై మక్కువ పెంచుకొన్న కలెక్టర్ హార్సిలీ నిండుగర్భిణి అయిన సతీమణీతో కొండపై విడిది చేశారు. 1864 మే 31న ప్రసవం జరిగి కుమారుడు జన్మించగా అదేరోజు చనిపోయాడు. ఈ పసిబిడ్డకు జార్జ్హార్సిలీ అని నామకరణం చేసి కొండపై (టూరిజం ముఖద్వారం వద్ద) ఖననం చేశారు. హార్సిలీకి ఇష్టమైన విడిదిచోటనే బిడ్డ పుట్టడం, ఆ ఆనందం అదేరోజు ఆవిరి కావడం బాధాకరం. 90 ఏళ్లకు డీ రిజర్వ్ ఫారెస్ట్ హార్సిలీహిల్స్పై రెవెన్యూ, ఇతర శాఖలకు అడుగుపెట్టేందుకు చోటులేదు. 1869లోనే వేసవి విడిది కేంద్రంగా ప్రకటించినప్పటికి అటవీశాఖకు తప్ప ఎవరికి ప్రవేశంలేని పరిస్థితి. బ్రిటీష్ పాలన అంతమైనా మార్పులేదు. వేసవి విడిది కేంద్రంగా మారిన 90 ఏళ్ల తర్వాత 1959 ఏప్రిల్ 15న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 101523/సీ1/58–5 మెమో జారీ చేసింది. ఈ మెమో ద్వారా కోటావూరు రెవెన్యూ గ్రామం పరిధిలోని హార్సిలీహిల్స్పై సర్వేనంబర్ 538లోని 103 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ను డీ రిజర్వ్ఫారెస్ట్గా మార్పుచేసింది. ఈ 103 ఎకరాలను రెవెన్యూశాఖ 1959 జూలై 25న స్వాధీనం చేసుకొంది. -
Papaya Fruits Packing: బొప్పాయి ప్యాకింగ్.. వెరీ స్పెషల్!
గుర్రంకొండ: అన్నయమ్య జిల్లాలో పడమటి ప్రాంతాలైన పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సాగు చేసిన బొప్పాయిని ప్రత్యేక పద్ధతుల ద్వారా దేశరాజధాని ఢిల్లీకి ఎగుమతి చేస్తున్నారు. బొప్పాయి లోడింగ్ అన్నిటికంటే భిన్నంగా ఆసక్తికరంగానూ ఉంటుంది. ఇందుకోసం కాకినాడ, ఒంగోలు ప్రాంతాల నుంచి సిద్ధహస్తులైన కూలీలను వ్యాపారులు ఇక్కడికి తీసుకొస్తుంటారు. ముందుగా ఎండుగడ్డితో లారీని లోపలివైపు ప్యాకింగ్ చేయడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో కిలో బొప్పాయి ధర రూ.18 వరకు పలుకుతోంది. దీంతో ఢిల్లీ, ముంబై, రాజస్థాన్కు చెందిన బొప్పాయి వ్యాపారులు ఇక్కడే మకాం వేసి బొప్పాయి కాయలను వారి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వ్యాపారులు ఇక్కడే మకాం సాధారణంగా పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు జులై నెలలో ఇక్కడికి చేరుకొంటారు. ముఖ్యంగా మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో మకాం వేస్తుంటారు. అప్పటి నుంచి డిసెంబర్ నెల వరకు ఇక్కడే ఉండి బొప్పాయి కొనుగోలు చేసి ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏజెంట్లను నియమించుకొని బొప్పాయి సాగు చేసిన రైతుల వివరాలు సేకరించి తోటలవద్దకు వెళ్లి వారే నేరుగా రైతుల వద్ద నుంచి కాయల్ని కొనుగోలు చేస్తారు. లోడింగ్ కూలీల ప్రత్యేకత కాకినాడ, ఒంగోలు లాంటి ప్రాంతాలకు చెందిన కూలీలు ఈ తరహా కటింగ్, లోడింగ్ కోసం వస్తుంటారు. బొప్పాయి తోటల్లో వెళ్లే కూలీలు ఎగుమతికి పనికొచ్చే కాయలను చెట్టునుంచి కింద పడకుండా కిందికి దించుతారు. ఆ తరువాత ప్రతి కాయను పేపర్తో చుడతారు. లారీలోకి బొప్పాయి కాయల్ని లోడ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తారు. లారీ లోపల, కింద భాగంలో నాలుగువైపులా ఎండుగడ్డిని ఏర్పాటు చేస్తారు. పేపర్ చుట్టిన కాయల్ని లారీల్లో లోడ్ చేసి మళ్లీపైన కూడా ఎండుగడ్డిని ఎక్కువగా వేసి లోడ్ చేయడం వీరి ప్రత్యేకత. వందలాది మంది కూలీలు బయట జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి జీవనోపాధి పొందుతుండడం గమనార్హం. ఢిల్లీ కటింగ్కు ప్రత్యేకం సాధారణంగా మన ప్రాంతంలో బొప్పాయి సగం రంగు వచ్చే వరకు కోత కోయరు. ఢిల్లీ కటింగ్కు మాత్రం ఎంతో తేడా ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉన్న బొప్పాయి సన్నని సూది లావు అంత లేత పసుపు రంగు వర్ణం రాగానే వాటితో పాటు వాటిపైనున్న రెండు కాయల్ని కోత కోస్తారు. ఇందుకోసం అనుభవం కలిగిన కోత కూలీలను ఏర్పాటు చేసుకొంటారు. లోడింగ్ చేసేందుకు అనుభవం ఉన్న బయట ప్రాంతాల హమాలీలను తీసుకొస్తుంటారు. ఢిల్లీ కంటింగ్ కాయలు పచ్చిగా ఉండాలి, వారం రోజుల తరువాత వర్ణం వచ్చే కాయలనే తోటల్లో ఏరి మరీ కోస్తుంటారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి లోడ్ లారీ చేరుకోవాలంటే కనీసం ఆరు రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు కాయలు చెడిపోకుండా బందోబస్తు చేయడం కూలీల ప్రత్యేకత. బొప్పాయికి భలే డిమాండ్ బయట రాష్ట్రాలతో పాటు, రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లో గతంలో కురిసిన వర్షాలకు బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ఇక్కడి బొప్పాయికి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో కిలో రూ.18 వరకు ధర పలుకుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, రాజస్థాన్ మార్కెట్లలో కిలో రూ.50 నుంచి రూ. 60 వరకు ధరలు పలుకుతుండడం గమనార్హం. (క్లిక్: మదనపల్లెకు కొత్త మాస్టర్ ప్లాన్) తోటల వద్దనే కొనుగోలు చేస్తున్నారు బొప్పాయి తోటల వద్దకే వ్యాపారులు వచ్చి కాయల్ని కొనుగోలు చేస్తున్నారు. బయట రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ముందుగా తమను సంప్రదించి ధర నిర్ణయిస్తారు. ఢిల్లీకి తరలించే బొప్పాయిని జాగ్రత్తగా నైపుణ్యం కలిగిన కూలీల చేత కోయిస్తారు. వాటిని భద్రంగా ప్యాకింగ్ చేసి వాహనాల్లో లోడ్ చేసి తీసుకెళుతుంటారు. – సుధాకర్రెడ్డి, బొప్పాయి రైతు, చెరవుమొరవపల్లె మూడు ఎకరాల్లొ సాగు చేశా ఈసీజన్లో మూడు ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాను. ప్రస్తుతం తోటల వద్దకే వచ్చి వ్యాపారులు కిలో రూ. 18 చొప్పున ధర ఇస్తున్నారు. కూలీఖర్చు, మార్కెట్కు తరలించడం వంటి అన్ని ఖర్చులు వ్యాపారులే భరిస్తారు. ప్రస్తుతానికి మంచి గిట్టుబాటు ధరలే ఉన్నాయి. – రామయ్య, బొప్పాయి రైతు, కొత్తపల్లె -
చిరకాల స్వప్నం.. నెరవేరిన క్షణం.. సీఎం జగన్కు కృతజ్ఞతలు
సాక్షి, మదనపల్లె: ఎప్పుడెప్పుడా అని మదనపల్లె పట్టణ ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న చిరకాల స్వప్నం సాకారమైంది. స్వాతంత్య్రోద్యమంలో కీలకభూమిక పోషించి, పట్టణానికే తలమానికంగా నిలిచిన చరిత్రాత్మక బిసెంట్ థియోసాఫికల్ ఎయిడెడ్ కళాశాల ప్రభుత్వ పరమైంది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ బీటీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్లుగా మంగళవారం రాత్రి జీఓ విడుదల చేశారు. ఇప్పటివరకు బిసెంట్ సెనెటరీ ట్రస్ట్(బీసీటీ) ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగించిన కళాశాల ఇకపై ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో బిసెంట్ థియోసాఫికల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా సేవలందించనుంది. బుధవారం బీటీ కళాశాల స్పెషల్ ఆఫీసర్గా డాక్టర్ నాగలింగారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలుపుకుని బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేసినందుకు సీఎం జగన్మోహన్రెడ్డికి, ప్రజల ఆకాంక్షను సీఎం దృష్టికి తీసుకెళ్లి కార్యరూపం దాల్చడంలో విశేషంగా కృషిచేసిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్బాషాకు పూర్వవిద్యార్థులు, పట్టణ ప్రముఖులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ.. ఎమ్మెల్యే చొరవతో.. బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేసి విలువైన ఆస్తులను పరిరక్షించాల్సిందిగా 2015లో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని పూర్వవిద్యార్థులు, పట్టణ ప్రముఖులు విన్నవించారు. స్పందించిన మిథున్రెడ్డి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగంలో తీసుకువచ్చిన సంస్కరణల నేపథ్యంలో ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం దిశగా జీఓ వెలువరించారు. అయితే బీసీటీ ట్రస్ట్సభ్యులు ప్రభుత్వ ప్రతిపాదనలకు విముఖత తెలపడంతో బీటీ కళాశాల విద్యార్థులు ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్బాషాను కలిసి ప్రభుత్వ స్వాధీనానికి చొరవచూపాల్సిందిగా కోరారు. ఈ విషయమై ఎంపీ మిథున్రెడ్డి ప్రత్యేకశ్రద్ధ కనబరిచి బిసెంట్ సెనెటరీ ట్రస్ట్ సభ్యులను వ్యక్తిగతంగా కలుసుకుని ప్రభుత్వానికి అప్పగించేందుకు ఒప్పించారు. అంగీకారపత్రాన్ని తీసుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వపరం చేయడంలో కీలకభూమిక పోషించారు. ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలుపుకున్నారు. బీటీ కళాశాల ఘనచరిత్ర బిసెంట్ థియోసాఫికల్ కళాశాల రాయలసీమలో మొట్టమొదటి కళాశాల. 1915 జూలై 19న స్వాతంత్య్రసమరయోధురాలు, హోంరూల్లీగ్ ఉద్యమకారిణి డాక్టర్ అనిబిసెంట్ చేతులమీదుగా స్థాపించబడింది. రాయలసీమ విద్యారంగంలో మైలురాయిగా నిలిచిన బీటీ కళాశాల ప్రజాఉద్యమాలకు, స్వాతంత్య్రపోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది. మొదట మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా బీటీ కళాశాల నడిచింది. అయితే స్వాతంత్రోద్యమంలో బీటీ కళాశాల విద్యార్థులు పాల్గొనడం, ఉద్యమాలు చేయడంతో బ్రిటీష్ ప్రభుత్వం మద్రాసు విశ్వవిద్యాలయ గుర్తింపును రద్దుచేసింది. తర్వాత 1919లో రవీంద్రనాథ్ ఠాగూర్ బీటీ కళాశాలను సందర్శించారు. జనగణమణ గేయాన్ని బెంగాలీ నుంచి ఇంగ్లీషులోకి ఇక్కడే అనువదించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ చాన్సలర్గా వ్యవహరిస్తున్న నేషనల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోకి బీటీ కళాశాల మారింది. 1927లో ఆంధ్ర విశ్వవిద్యా లయం ప్రారంభమైన తర్వాత దానికి అనుబంధంగా ఉంటూ వచ్చింది. 1929లో అధికారపరిధి పునర్విభజనతో మళ్లీ మద్రాసు విశ్వవిద్యాలయ పరిధిలోకి వచ్చింది. 1956 శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించినప్పటి నుంచి దానికి అనుబంధంగా విద్యా సేవలందిస్తోంది. మహోన్నత వ్యక్తుల ఉన్నత ఆశయాలతో స్థాపించిన 106 సంవత్సరాల చరిత్ర కలిగిన బిసెంట్ దివ్యజ్ఞాన కళాశాల ఎందరో భావిభారత పౌరులను తీర్చిదిద్ది, ఉన్నతమైన వ్యక్తులుగా సమాజానికి అందించింది. రాష్ట్రగీతమైన మా తెలుగుతల్లికి మల్లెపూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి, కర్నాటక మాజీ గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య, సీపీఐ జాతీయనాయకుడు నారాయణ బీటీ కళాశాల పూర్వవిద్యార్థులు. బీటీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటిస్తున్న స్పెషల్ ఆఫీసర్ డాక్టర్.రామలింగారెడ్డి అనిబిసెంట్ ఆశయ సాధనకు కృషి... బీటీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ నాగలింగారెడ్డి బాధ్యతల స్వీకరణ సందర్భంగా బుధవారం కళాశాల ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ మహోన్నత ఆశయంతో బీటీ కళాశాలను స్థాపించిన డాక్టర్ అనిబిసెంట్ ఆశయ సాధనకు కృషిచేస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యార్థులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. చరిత్రాత్మక నేపథ్యం కలిగి, విలువైన కోట్లరూపాయల భవనాలను, స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించి సహృదయతను చాటుకున్న బిసెంట్ సెనెటరీ ట్రస్ట్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల స్వాధీనం తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో సిబ్బంది, నిర్వహణకు సంబంధించి విధి విధానాలు ఖరారు కావాల్సి ఉందన్నారు. కళాశాల అభివృద్ధికి పూర్వవిద్యార్థులు, పట్టణ ప్రజలు, మేధావులు, విద్యావేత్తలు తమవంతు సహకారం అందించి తోడ్పాటునందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చిత్తూరు ఐడీ కాలేజి ప్రిన్సిపాల్ ఆనందరెడ్డి, కరస్పాండెంట్ వైఎస్.మునిరత్నం, ప్రిన్సిపాల్ వెంకటశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గౌతమ బుద్ధుడి విగ్రహావిష్కరణ
మదనపల్లె : మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె వద్ద బుద్ధునికొండపై అంబేడ్కర్ సమాజ్, భారతీయ అంబేడ్కర్ సేవ ఆధ్వర్యంలో మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నవాజ్బాషా పాల్గొన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు, బౌద్ధ ఉపాసకులతో కలిసి తథాగతుడు గౌతమబుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ హితం కోసం సర్వ సుఖాలను త్యాగం చేసిన మహోన్నతుడు గౌతమ బుద్ధుడని కొనియాడారు. మానవ వికాసానికి హేతుబద్ధమైన గొప్ప జీవన మార్గాన్ని ఆయన ప్రపంచానికి అందించారని కీర్తించారు. ధార్మికసేవ పురస్కారాలు బాస్ సంస్థల వ్యవస్థాపకుడు పీటీఎం శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన ధర్మపునరుద్ధరణ సభలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న పలువురికి ధార్మిక సేవా పురస్కారాలు అందజేశారు. ఈ పురస్కారాలు అందుకున్న వారిలో విజయ భారతి హైస్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ సేతు, సీనియర్ మున్సిపల్ కౌన్సిలర్ మార్పురి నాగార్జున బాబు అలియాస్ గాంధీ, ఫోర్డు సంస్థ చైర్మన్ లలితమ్మ, హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్, గ్రామజ్యోతి సంస్థ అధ్యక్షురాలు సుభద్ర, హెడ్కానిస్టేబుల్ రామ్మూర్తి, కుబా సంస్థ అధ్యక్షుడు రోషన్, ధౌత్రి ఫౌండేషన్ అధ్యక్షురాలు స్వామి, ఏపీయూఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణయ్, సేదా సంస్థ అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ఖాన్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధ అంబేడ్కర్ సమాజ్ ప్రతినిధులు చాట్ల బయన్న, సోనగంటి రెడ్డెప్ప, నీరుగొట్టి రమణ, భారతీయ అంబేడ్కర్ సేన నాయకులు శ్రీచందు, రమణ, గణపతి, మోహన్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
దారి తప్పుతున్న యువత.. ప్రమాదంలో భవిత
‘రాయచోటికి చెందిన ఐదుగురు యువకులు పగలు కూలి పనులు చేస్తూ రాత్రులలో చోరీలు చేసేవారు. చెడు వ్యసనాలకు బానిసలు కావడంతో వచ్చే కూలీ డబ్బులు సరిపోక కనిపించిన వస్తువు ఎంత విలువైనది అనేది కాకుండా అన్నింటినీ చోరీ చేసేవారు. ఆటోలకు ఉన్న బ్యాటరీలు, సెల్ఫోన్లు, బంగారు ఆభరణాలు వంటివి దోచుకెళ్లి జల్సాలు చేసుకునేవారు. ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు’. ‘మదనపల్లె టూటౌన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లల్లోకి చొరబడి చోరీ చేసే ముఠాను పోలీసులు వలవేసి పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.20 లక్షల విలువ చేసే బంగారు, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అందరూ పాతికేళ్ల వయస్సు కుర్రాళ్లే. వీరు టెన్త్, ఇంటర్ చదివి విలాసాలకు అలవాటు పడి నేరస్తులుగా మారారు’. ‘మదనపల్లె మండలానికి చెందిన వారంతా ఇంటర్, డిగ్రీ చదువుతూ ఖర్చులకు డబ్బులు లేక రాత్రి పూట రహదారుల్లో తిరుగుతూ దోపిడీలకు పాల్పడేవారు. మారణాయుధాలతో వాహనదారులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలను దోపిడీ చేసేవారు. ఎట్టకేలకు పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు’. ‘అతడు విద్యావంతుడు. విలాసాలకు అలవాటు పడి మదనపల్లె పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలు చోరీ చేసేవాడు. ఇతని వయస్సు కేవలం 25 ఏళ్లే. బైకు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు’. ‘చెడు అలవాట్లకు బానిసలై.. గంజాయి సేకరించి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను మదనపల్లె పట్టణ పోలీసులు అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు’. ‘మదనపల్లెకు చెందిన నలుగురు యువకులు కలిసి కార్లను బాడుగకు తీసుకువచ్చి కుదవకుపెట్టి, మళ్లీ అదే కార్లను చోరీ చేసేవారు. వీరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు’. సాక్షి, మదనపల్లె సిటీ: అన్నమయ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పిల్లలపై పెద్దల పర్యవేక్షణ కొరవడటం, వారితో తగినంత సమయం గడపలేకపోవడం వంటివి ఈ తరహా ప్రవర్తనకు కారణమవుతున్నాయి. అరచేతిలో ఇమిడిన సాంకేతిక ఆయుధం సెల్ఫోన్ దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పిల్లలే ప్రపంచంగా కష్టపడుతున్న తల్లిదండ్రులు వారితో మనసు విప్పి మెలిగితేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని పోలీసు అధికారులు, మానసిక వైద్య నిపుణులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అనర్థాలపై యువకులకు అవగాహన నేరాల వల్ల జరిగే అనర్థాల గురించి యువకులకు అవగాహన కల్పిస్తాం. ఇప్పటికే పలు చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించాం. యువత మంచి మార్గంలో నడవాలి. బిడ్డలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. వారిని వదిలేస్తే చెడుదారుల్లో తిరుగుతూ నేరాలకు పాల్పడతారు. – రవిమనోహరాచారి, డీఎస్పీ, మదనపల్లె. నైతిక విలువలు ప్రధానం పిల్లలకు మార్కులు కాదు. బిహేవియర్ క్వాలిటీస్ ప్రధానం. నైతిక విలువలు బోధించే పెద్దలు ఇంట్లో లేకపోవడం కూడా ఇబ్బందులకు కారణమవుతోంది. నీతి శతకాలు, పురాణగాథలు చిన్నారులకు సన్మార్గంలో నడిపించడానికి ఎంతో ఉపకరిస్తాయి. – జల్లా లలితమ్మ, బాలల హక్కుల ఐక్య వేదిక అధ్యక్షురాలు విలువలు నేర్పించాలి పిల్లలకు చిన్నప్పటి నుంచే విలువలు నేర్పించాలి. దీని బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు తీసుకోవాలి. పిల్లలు అధిక సమయం పాఠశాలల్లోనే గడుపుతారు. వారికి నీతి కథలు, మంచి, చెడు గురించి సూక్తులు బోధించాలి. – ఎస్.మహమ్మద్ అయూబ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రాయచోటి. సమాజం పెను సవాళ్లను ఎదుర్కొంటోంది యువత వ్యసనాలకు లోనై నేరమార్గం వైపు అడుగులు వేస్తున్నారు. మద్యం, మత్తు మందులు, సిగరెట్లను స్టేటస్ సింబల్గా, హీరోయిజంగా భావిస్తున్నారు. చదువులకు క్రమంగా దూరమై కొత్తదనం కోరుకుంటూ నేరపూరిత వాతావరణంలోకి జారిపోతున్నారు. విలువలు, సామాజిక బాధ్యతతో కూడిన ప్రవర్తనను నేర్పేందుకు తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. – డాక్టర్ రాధిక, మానసిక వైద్యనిపుణురాలు, మదనపల్లె -
మదనపల్లె మున్సిపల్ కమిషనర్గా ప్రమీల
మదనపల్లె సిటీ: మదనపల్లె మున్సిపల్ కమిషనర్గా కె. ప్రమీలను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈమె సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ కమిషనర్గా పని చేస్తున్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె మదనపల్లె మున్సిపల్ కమిషనర్గా రానున్నారు. మదనపల్లె మున్సిపల్ కమిషనర్గా పని చేస్తున్న రఘనాథరెడ్డి కర్నూలు జిల్లా ఆదోనికి బదిలీ అయ్యారు. -
సాధనతో ఆరోగ్య యోగం
మదనపల్లె సిటీ: నాటి కాలంలో ధ్యానం, చక్కటి ఆహారపు అలవాట్లుతో జీవనం సాగేది. ప్రస్తుతం అడుగడుగునా ఆధునికత రంగులు పులుముకుంటున్న వేళ వివిధ రకాల అనారోగ్యాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు, మానసిక ప్రశాంతతకు ఇటీవల కాలంలో పలువురు యోగాపై మక్కువ పెంచుకుని సాధన అలవాటుగా మార్చుకున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చాలా మంది యోగాపై మక్కువ చూపుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగా గురువు శిల్ప గురించి ప్రత్యేక కథనం.. 12 ఏళ్లుగా తర్ఫీదు.. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన శిల్ప వివాహానంతరం మదనపల్లెలో స్థిరపడ్డారు. 2010లో శిల్ప బెంగుళూరులోని స్వామి వివేకానంద యోగా అనుసాధన సంస్థలో ప్రత్యేక శిక్షణ పొందారు. 2011 నుంచి పట్టణంలో పలు పాఠశాలల్లో యోగాపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణిస్తున్నారు. ప్రతి రోజు వందలాది మంది విద్యార్థులకు యోగా నేర్పిస్తూ ఆరోగ్య పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. సుమారు 12 సంవత్సరాలుగా పట్టణంలోని పలు పాఠశాలల్లో యోగాపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ►జాతీయ స్థాయిలో ఆలిండియా కల్చర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2012లో హైదరాబాదులో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు. యోగాలో ప్రత్యేక ప్రతిభ కనబరిచినందుకు అప్పటి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. గురువుల పర్యవేక్షణలో ఆసనాలు సాధన చేయాలి.. యోగాసనాలు నిత్య జీవితంలో జరిగే క్రియల్లో భాగం కావాలి. అనారోగ్యం పేరుతో వేలాది రూపాయలు ఔషధాలకు వినియోగించేకంటే, రోజు కొంత సమయం వ్యక్తి గత ఆరోగ్యం కోసం కేటాయించి గురువుల పర్యవేక్షణలో ఆసనాలు సాధన చేస్తే రోగాలకు దూరంగా ఉండొచ్చు. చిన్నతనం నుంచి యోగాసనాలపై ఆసక్తితో నిష్ణాతులైన గురువుల శిక్షణలో సాధన చేశాను. – శిల్ప, యోగా గురువు, మదనపల్లె -
మదనపల్లె వైద్య కళాశాల పనులు ప్రారంభం
మదనపల్లె : రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న వైద్యకళాశాల స్థలంలో పనులు ప్రారంభమయ్యాయి. గురువారం ఆర్డీఓ ఎం.ఎస్.మురళి, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ ఆనందరెడ్డి, డీఈ కరీముల్లా తదితరులు ఆరోగ్యవరం వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి కేటాయించిన 95.14 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఇందులో భాగంగా ఆ స్థలంలో అంతరరోడ్ల నిర్మాణం, ప్రహరీ, సరిహద్దులను గుర్తించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈఈ ఆనందరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సూపర్స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు, నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు వైద్యవిద్యను చేరువ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటుచేస్తామని ప్రకటించిందన్నారు. ఇందులో భాగంగా రాజంపేట పార్లమెంటరీ పరిధిలో రూ.475 కోట్లతో వైద్య కళాశాలను ఏర్పాటుచేస్తూ అనుమతిలిచ్చిందన్నారు. ఈ పనులకు సంబంధించి మేఘ ఇంజినీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ టెండర్లు దక్కించుకుందన్నారు. అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయిందని, 30 నెలలలోపు నిర్మాణాలు పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. మొత్తం 13,31,812 చదరపు అడుగుల విస్తీర్ణంలో వైద్యకళాశాల, నర్సింగ్ కళాశాల, ఆస్పత్రి భవనాలు, సిబ్బంది క్వార్టర్స్, ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్స్(పీఈబీ) నిర్మిస్తారన్నారు. ఆర్డీఓ ఎం.ఎస్.మురళి మాట్లాడుతూ మెడికల్ కళాశాల స్థలంలో పలుచోట్ల బండరాళ్లు ఉండటంతో వాటిని పగులగొట్టేందుకు బ్లాస్టింగ్ లైసెన్స్ కోసం కాంట్రాక్టర్ దరఖాస్తు చేసుకోవడంతో అనుమతులిచ్చేందుకు పరిశీలన చేశామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరయ్య, తహసీల్దార్ సీకే.శ్రీనివాసులు, మేఘ సంస్థ ఇంజినీర్లు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ఈఈగా ఆనందరెడ్డి మదనపల్లెలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజి ఈఈగా ఆనందరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. పెనుకొండ మెడికల్ కాలేజీ ఈఈగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను ప్రభుత్వం మదనపల్లె మెడికల్ కాలేజీ బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. -
లారీ ఢీకొని విద్యార్థి దుర్మరణం
మదనపల్లె టౌన్ : సిమెంట్ లారీ బైక్ను ఢీకొని విద్యార్థి మృత్యువాత పడిన సంఘటన మదనపల్లె పట్టణంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తంబళ్లపల్లె మండలం జుంజురపెంట పంచాయతీ బురుజుపల్లెకు చెందిన దంపతులు ప్రహ్లాద, లక్ష్మీదేవీలు 20 ఏళ్లక్రితం మదనపల్లెకు బతుకుదెరువు నిమిత్తం వచ్చారు. కదిరిరోడ్డులోని అమ్మచెరువుమిట్ట ఏసీ గోడౌన్వద్ద సొంతంగా ఇంటిని నిర్మించుకుని పాడిపశువుల పోషణతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారి ఒక్కగానొక్క కుమారుడు సి.ఉపేంద్ర (17) స్థానికంగా ఇంటర్ చదువుతున్నాడు. సెలవులు కావడంతో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ గురువారం ఉదయం పాడిఆవులకు పచ్చగడ్డి కొనుగోలు చేసేందుకు నీరుగట్టువారిపల్లెకు బైక్లో బయలుదేరాడు. గడ్డి కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళుతున్న క్రమంలో మార్గమధ్యంలో సిమెంట్లారీ వేగంగా వచ్చి బైక్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న వన్టౌన్ ఎస్ఐ లోకేష్ ప్రమాదస్థలికి చేరుకుని విచారణ చేపట్టి పంచనామా అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కగానొక్క బిడ్డ ఇక లేడని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక మాకు దిక్కెవరంటూ గుండెలు బాదుకోవడం చూపరుల హృదయాలను కలిచివేసింది. -
హార్సిలీహిల్స్లో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్లో రెవెన్యూ భూ ఆక్రమణలపై మదనపల్లె ఆర్డీఓ ఎంఎస్.మురళీ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం తహసీల్దార్ కీతలం ధనుంజయలు, ఎంపీడీఓ శంకరయ్య, డీఎల్పీఓ లక్ష్మీ, ఏఈ సంతోష్గౌడ్లతో సమావేశమయ్యారు. ఇక్కడి పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం టూరిజం అసిస్డెంట్ మేనేజర్ నేదురుమల్లి సాల్వీన్రెడ్డి, అధికారులతో కలిసి కొండపై ప్రతి నిర్మాణాన్ని, ఆక్రమిత స్థలాలను స్వయంగా పరిశీలించారు. బీఎస్ఎన్ఎల్ ప్రాంగణానికి తాళం కొండపై బీఎస్ఎన్ఎల్ టవర్ నిర్వహణ కోసం రెవెన్యూ అధికారులు భూమిని కేటాయించారు. ఈ భవనాన్ని ప్రయివేటు వ్యక్తులకు లీజుకు అప్పగించడంతో ఇక్కడ అనుమతి లేకుండా నిర్మాణాలు, పాత భవనాన్ని ఆధునికీకరించడం, ఖాళీ స్థలంలో కొత్తగా నిర్మాణాలు, అతిథిగృహలను నిర్మించారు. వీటిని పరిశీలించిన ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ సమయంలో అక్కడ పనులు జరుగుతుండటంతో ఆధునికీకరణకు, అతిథిగృహల నిర్మాణాలకు ఎవరి అనుమతి పొందారు, లీజు నిబంధనలు ఏమిటి, దేన్ని లీజుకు ఇచ్చారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి అనుమతి ఉందని అక్కడివారు చెప్పడంతో పత్రాలతో కార్యాలయానికి రావాలని అంతవరకు పనులు నిలిపివేసి తాళం వేయాలని ఆర్డీఓ ఆదేశించగా గేటుకు తాళం వేశారు. బీఎస్ఎన్ఎల్కు కేటాయించిన రెవెన్యూ భూమి కేటాయింపును రద్దు చేసి స్వాధీనం చేసుకుంటామని ఆర్డీఓ ప్రకటించారు. కొండపై కోర్టుకేసులు నడుస్తున్న వివాదాస్పద భూముల్లో జరిగిన భారీ నిర్మాణాలను ఆర్డీఓ పరిశీలించారు. వీరు నిర్మాణాలు చేసుకోవడమేకాక రోడ్డును అక్రమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తీర్ణం గుర్తించేందుకు తక్షణం సర్వే నిర్వహించి మార్కింగ్ ఇవ్వాలని తహసీల్దార్ను ఆదేశించారు. కొండపై రెవెన్యూ స్థలాలను ఆక్రమించుకొని వాణిజ్య, గృహ నిర్మాణాలు చేసుకొన్న వారితో ఆర్డీఓ మాట్లాడారు. ప్రతిఒక్కరి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. మీరు నిర్మించుకున్న నిర్మాణాలకు స్థలాన్ని ఎవరు కేటాయించారు, ఎవరి అనుమతి పొందారని ప్రశ్నించారు. కొండపై రెవెన్యూ భూమిని ప్రయివేటు సంస్థలకుకాని, వ్యక్తులకు కాని కేటాయించలేదు. అలాంటప్పుడు ఎలా ఇంటి నిర్మాణాలు చేశారని ప్రశ్నిస్తూ..ఇకపై గృహలు, దుకాణాలు హార్సిలీహిల్స్ టౌన్షిప్ కమిటీకి చెందుతాయని, ఎవరైనా ఇక్కడ ఉండాలంటే అద్దెలు చెల్లించాలని కోరారు. విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు రెవెన్యూ స్థలాల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించుకొన్న వారికి డిస్కం అధికారులు ఏ హక్కు పత్రాలతో విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారని ఆర్డీఓ మురళీ విస్మయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై డిస్కం అధికారులతో సమావేశం నిర్వహించి కనెక్షన్లను టౌన్షిప్ కమిటీ పేరుపై బదిలీ చేయిస్తామని చెప్పారు. కొండపై ఇటుక పేర్చాలన్నా, కదిలించాలన్నా టౌన్షిప్ కమిటీ అనుమతి తప్పనిసరని, ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొండపై ప్రభుత్వశాఖలకు కేటాయించిన భూములు, వాటి స్థితిగతులు, అసంపూర్తి క్రీడా ప్రాంగణ నిర్మాణ పనులను పరిశీలించారు. -
ఈసెట్ శిక్షణలో సనాతో పరిచయం.. రెండు నెలలు కాపురం చేసి..
సాక్షి, మదనపల్లె టౌన్: భార్య గర్భ స్రావంకు యత్నించిన భర్తను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు టూటౌన్ పోలీస్స్టేషన్ సీఐ మురళీక్రిష్ణ తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలు.. నల్గొండ జిల్లా చింతపల్లె మండలం కుడిమేకు గ్రామానికి చెందిన మహమ్మద్సనా(23), 2019లో ఈసెట్ శిక్షణలో ఉన్న సమయంలో మదనపల్లె రూరల్ మండలం దిగువగాండ్లపళ్లెకు చెందిన రమేష్తో పరిచయం ప్రేమగా మారి ఈ ఏడాది జనవరి 4న మదనపల్లెలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఎస్టేట్లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉండగా రెండు నెలల క్రితం రమేష్ భార్యను వదిలి వెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఆమె భర్తను పోలీసులు పట్టుకుని కౌన్సిలింగ్ ఇప్పించారు. సజావుగా సాగిన వారి కాపురంలో మళ్లీ ఘర్షణలు తలెత్తాయి. ఈ క్రమంలో మహ్మద్సనా తనకు గర్భస్రావం అయ్యేందుకు తన భర్త మందులు బలవంతంగా మింగించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ మురళీక్రిష్ణ ఆమె భర్తను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. చదవండి: (సమ్మర్లో స్లిమ్గా.. బరువు తగ్గాలనుకునే వారికి వేసవి కాలం వరం) -
తగ్గేదేలే అంటున్న టమాటా ధరలు
సాక్షి, మదనపల్లె : టమాట క్రయ, విక్రయాలకు దేశంలోనే అతి పెద్దదైన మదనపల్లె టమాట మార్కెట్లో ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వారం రోజులుగా ధరలను గమనిస్తే మే 7న మొదటి రకం టమాట ధరలు కిలో రూ.24–44, 8న రూ.27–50, 9, 10న రూ.30–52, 11, 12న రూ.35–56 మధ్య ధరలు పలికితే 13వ తేదీన రూ.39–60కు చేరుకున్నాయి. శుక్రవారం మదనపల్లె మార్కెట్కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు 198 మెట్రిక్ టన్నులు తీసుకువచ్చారు. బహిరంగ మార్కెట్లో నాణ్యతను బట్టి రూ.50–80 వరకు విక్రయిస్తున్నారు. దీంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నారు. మే నెలలో వివాహాది శుభకార్యాలు అధికంగా ఉండటం.. వాతావరణంలో అనూహ్యంగా చోటుచేసుకుంటున్న మార్పులు, పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం మదనపల్లె నుంచి తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఒరిస్సా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. బయటి మార్కెట్లలో స్థానికంగా సరుకు రాకపోవడం, డిమాండ్ అధికంగా ఉండటంతో ఇక్కడి వ్యాపారులు అధిక ధరలకు కొనుగోలు చేసి అక్కడికి తరలిస్తున్నారు. మే చివరి వరకు అధిక ధరలే పలుకుతాయని వ్యాపారులు చెపుతున్నారు. మార్కెట్లో టమాటకు లభిస్తున్న ధరలపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (Darbarevu Land: కీలక సమస్యకు ఏపీ కేబినెట్ పరిష్కారం.. రెండు, మూడు రోజుల్లో జీవో) -
ఆగిన లారీని ఢీకొన్న బైక్
మదనపల్లె టౌన్: మదనపల్లె–పుంగనూరు రోడ్డు ఈడిగపల్లె వద్ద శనివారం ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పలమనేరు పట్టణం గడ్డ ఊరికి చెందిన మెకానిక్ షేఖ్ఖాద్ బాషా(20), గంగవరం చెన్నారెడ్డిపల్లె నుంచి వచ్చి పలమనేరు పట్టణం గుడియాతం రోడ్డులో కాపురం ఉంటున్న స్నేహితుడు కిరణ్కుమార్(22) ద్విచక్ర వాహనంలో సినిమా కోసం మదనపల్లెకు వచ్చారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మార్గంమధ్యలోని మదనపల్లె–పుంగనూరు రోడ్డు ఈడిగపల్లె వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను 108లో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఖాదర్బాషా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కిరణ్కుమార్ పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి రుయాకు రెఫర్ చేయగా కుటుంబీకులు తీసుకెళ్లారు. ఆసుపత్రి ఔట్పోస్టు పోలీసులు పుంగనూరు పోలీసులకు సమాచారం అందించగా.. సీఐ గంగిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని నాతోనూ ఉంటానన్నాడు.. అయితే..
సాక్షి, మదనపల్లె: ఇంటర్ చదివే రోజుల్లో పరిచయమయ్యాడు.. అమ్మాయిగా మారితే పెళ్లి చేసుకుంటానన్నాడు.. అమ్మాయిగా మారాక ఆరేళ్ల పాటు నాతో సహజీవనం చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.. నాకు న్యాయం చేయండి.. అంటూ ఓ ట్రాన్స్జెండర్ పోలీసులను ఆశ్రయించింది. నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లెకు చెందిన స్వీటీ అలియాస్ లోకేష్ మదనపల్లెలో ప్రైవేట్ ఇంటర్ కళాశాలలో చదివేటప్పుడు ములకలచెరువు మండలం పత్తికోటకు చెందిన మహేష్తో పరిచయమేర్పడింది. ఇద్దరు ఒకరు విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు. చదవండి: (పెళ్లి చేసుకోవాలని కోరితే.. తల్లిని అడగాలని వెళ్లాడు.. అంతలోనే..) ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని లోకేష్ను అమ్మాయిగా మారాలని మహేష్ కోరాడు. దీంతో లోకేష్ శస్త్రచికిత్స చేయించుకుని స్వీటీగా మారిపోయాడు. ఇద్దరూ ఆరేళ్లపాటు సహజీవనం చేశారు. నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని, వంశవృద్ధి కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మహేష్ హేళన చేస్తూ ఇటీవల స్వీటీతో తెగతెంపులకు సిద్ధపడ్డాడు. దీంతో తనను ప్రేమించి మరొకరితో పెళ్లికి సిద్ధమైన ప్రియుడు మహేష్పై కేసు నమోదుచేసి తనతో పెళ్లి జరిపించాల్సిందిగా రూరల్ పోలీస్స్టేషన్లో కుటుంబ సభ్యులతో కలిసి స్వీటీ ఫిర్యాదుచేసింది. చదవండి: (ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ.. ఏకాంతంగా ఉండగా..) ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో స్వీటీ మీడియాతో మాట్లాడుతూ తమ ఇద్దరి మధ్య జరిగిన ప్రేమాయణానికి సంబంధించి ఆధారాలు తన సెల్ఫోన్లో ఉంటే వాటిని మహేష్ తొలగించాడంది. గతంలో ఓసారి వన్టౌన్ పోలీస్స్టేషన్లో మహేష్పై ఫిర్యాదుచేయగా.. పోలీసుల ముందు పెళ్లి చేసుకుంటానని అంగీకరించి ఆపై మాట మార్చాడని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేస్తామని గట్టిగా హెచ్చరించే సరికి.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని నాతోనూ ఉంటానని రాజీకి వచ్చాడంది. అయితే తనను కాకుండా మహేష్ వేరొకరిని పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదని కరాఖండిగా చెప్పడంతో తనను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని వాపోయింది. మహేష్ కోసం మగతనాన్ని త్యాగం చేసిన తనకు అతడితోనే పెళ్లి జరిపించి న్యాయం చేయాల్సిందిగా ప్రాధేయపడింది. చదవండి: ('లోన్ కట్టకపోతే.. న్యూడ్ ఫొటోలు ఇంట్లో వాళ్లకు పంపిస్తాం') -
టమాట ధర పైపైకి
మదనపల్లె : వేసవిలో ఎండలు పెరుగుతున్నట్లుగా మదనపల్లె మార్కెట్లో టమాట ధరలు మెల్లమెల్లగా పైకి ఎగబాకుతున్నాయి. ఎండ దెబ్బకు కూరగాయల పంటలు వాడిపోవడంతో పాటు దిగుబడులు తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా టమాటా పంటపై ఎండ తీవ్ర ప్రభావం చూపుతుండటంతో డిమాండ్కు సరిపడా సరుకు లభ్యత లేకపోవడంతో మెల్లమెల్లగా ధరలు పెరుగుతున్నాయి. వారంరోజుల క్రితం మొదటిరకం టమాటా కిలో రూ.30 ఉంటే గురువారం ఏకంగా రూ.44కు చేరుకుంది. నెలరోజుల క్రితం పరిస్థితిని పరిశీలిస్తే మార్చి 28న మొదటిరకం కిలో టమాటా రూ.9.20 ఉంది. ఈ లెక్కన వారంరోజుల వ్యవధిలో కిలోకు రూ.14, నెలరోజుల వ్యవధిలో రూ.35 పెరగడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో టమాటాకు పెట్టుబడి ఖర్చులు అధికం కావడం, ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్ష వరకు ఖర్చుచేయాల్సి రావడం, ఆశించిన స్థాయిలో «మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు సాగుపై ఆసక్తి కనబరచలేదు. మార్చి రెండోవారం నుంచి మార్కెట్లో టమాటా ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఆశలు చిగురించిన రైతులు నర్సరీల నుంచి నారును కొనుగోలు చేసి ఎక్కువ విస్తీర్ణంలో సాగును ఆరంభించారు. పంట చేతికి వచ్చేందుకు 45–50 రోజుల సమయం ఉండటంతో దిగుబడులు పెరిగేందుకు మరో నెలరోజులు పట్టే అవకాశం ఉంది. పెరిగిన ఎండలతో టమాటా దిగుబడులు తగ్గడం.. మరోవైపు పొరుగు జిల్లాల నుంచి టమాటాలు మార్కెట్కు రాకపోవడంతో ఒక్కసారిగా మార్కెట్లో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. రెండునెలల పాటు టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
అంతర్రాష్ట్ర కార్ల దొంగలు అరెస్టు
మదనపల్లె టౌన్: నలుగురు అంతర్రాష్ట్ర కార్ల దొంగలను అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లె గోపీనగర్కు చెందిన మహ్మద్ ఇయాజ్ అలియాస్ అయాజ్ (23), జామీ ప్రసాద్(28), అన్నమయ్య జిల్లా రాయచోటి పొద్దుటూరువారిపల్లెకి చెందిన నందలూరు రాజానర్మదారెడ్డి (36), రాయచోటి టౌన్ మాసాపేటకు చెందిన పగిడిపల్లె సుబహాన్ (50) హైదరాబాద్లో కార్లు అద్దెకు ఇచ్చేవారి వద్ద డ్రైవర్లుగా చేరేవారు. అక్కడ నమ్మకంగా ఉంటూ కార్ల యజమానుల వద్ద నెల, రెండు నెలల పాటు వాహనాలను బాడుగకు తీసుకునేవారు. తర్వాత తప్పుడు పత్రాలతో వాటిని మదనపల్లెకు తీసుకొచ్చి కొందరు వడ్డీ వ్యాపారులకు రూ.5 నుంచి 8 లక్షలకు అమ్మేసేవారు. యజమానులు వాహనాలు అడిగినప్పుడు అమ్మిన కార్లకు జీపీఎస్ ఉండడంతో తిరిగి మదనపల్లెకు వచ్చి ఆచూకీ తెలుసుకుని దాని రెండో తాళం సహాయంతో వడ్డీ వ్యాపారులకు తెలియకుండా తీసుకెళ్లి యజమానులకు ఇచ్చేసేవారు. ఈ క్రమంలో శనివారం దొంగలు మదనపల్లెకు వచ్చినట్లు తెలుసుకుని వలపన్ని ఎస్బీఐ కాలనీవద్ద పట్టుకున్నారు. అత్యంత ఖరీదైన తొమ్మిది కార్లను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు రూ.5కోట్లు ఉంటుందని.. మిగిలిన మూడు కార్లను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని డీఎస్పీ తెలిపారు. -
సిరుల పట్టు.!
మదనపల్లె సిటీ: పట్టుసాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. గత ఏడాది వైరస్లతో ఇబ్బందులు పడిన రైతులు ఇప్పుడు ధరల పెరుగుదలతో ఉత్సాహంగా ఉన్నారు. చైనా నుంచి ముడిపట్టు దిగుమతులు నిలిచిపోవడంతో దేశీయంగా దానికి డిమాండ్ పెరిగింది. జాతీయ స్థాయిలో ఆన్లైన్ మార్కెటింగ్లో బయ్యర్ల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనట్లు కిలో సగటున రూ.650 నుంచి రూ.700 పైగా ధర పలుకుతోంది. పట్టుగూళ్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇవే ధరలు మరికొన్ని నెలల పాటు కొనసాగవచ్చని రీలర్లు చెబుతున్నారు. గూళ్ల ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలో రెండవ అతి పెద్ద పట్టుగూళ్ల మార్కెట్ మదనపల్లె. సాధారణ పరిస్థితుల్లో ఇక్కడికి ప్రతి రోజు 2 వేల నుంచి 1500 క్వింటాళ్లకు పైగా పట్టుగూళ్లు వస్తుంటాయి. మదనపల్లె, వాల్మీకిపురం, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు ప్రాంతాల నుంచే కాకుండా కర్నాటక ప్రాంతాల నుంచి కూడా రైతులు పట్టుగూళ్లను తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. ధరల పెరుగుదలతో ఖుషీ మదనపల్లె పట్టుగూళ్ల మార్కెట్లో శనివారం గరిష్టంగా కిలో రూ.700 పలికింది. ఇటీవల చైనా నుంచి సిల్కు దిగుబడి తగ్గడంతో దేశీయ సిల్కుకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా మార్కెట్లో సిల్కు ధరలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది అత్యధికంగా రూ.3 వేల వరకు ఉన్న దేశీయ నాణ్యమైన సిల్కు ధర ప్రస్తుతం రెండింతలు పెరిగింది. ఈ ప్రభావం పట్టుగూళ్ల ధరలపైనా పడి రైతులు లాభాలు చూస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్ (కిలో బైవోల్టిన్ గూళ్లకు రూ.50) కూడా వారికి కలిసొస్తోంది. సంతోషంగా ఉంది ప్రస్తుతం పెరిగిన ధరలు సంతోషాన్నిస్తున్నాయి. పదేళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి ధరలు చూస్తున్నాం. గతంలో ఇలాంటి ధరలు చూడలేదు. మల్బరీ సాగు చేస్తే లాభాలు తప్పకుండా వస్తాయనేందుకు ఇప్పుడున్న ధరలే నిదర్శనం. ఏది ఏమైనా ఈ ధరలు మల్బరీ సాగు చేసిన రైతులందరికీ ఎంతో ఊరట కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. – సోమశేఖర్, రైతు, తవళం, నిమ్మనపల్లె మండలం మంచి లాభాలు చూస్తున్నా నేను రెండు ఎకరాల్లో మల్బరీ సాగు చేశాను. మార్కెట్లో మంచి ధరలు వస్తున్నాయి. ఎండల కారణంగా పురుగుల పెంపకం కొంత ఇబ్బంది అనిపించినా ధరలు మాత్రం బాగున్నాయి. –హరికుమార్రెడ్డి, పట్టురైతు, పేయలవారిపల్లె, తంబళ్లపల్లె మండలం జాగ్రత్తలతో మంచి దిగుబడి పట్టుగూళ్లకు మంచి ధరలు ఉండడం శుభపరిణామం. ఈ తరుణంలో రైతులు శాస్త్రీయ పద్దతులు, జాగ్రత్తలు పాటించి మంచి దిగుబడులు సాధించాలి. ముఖ్యంగా మల్బరీ కొరత రాకుండా తోటల పెంపకంపై దృష్టి పెట్టాలి. –రవి, ఇన్చార్జి ఏడీ, పట్టుపరిశ్రమశాఖ,మదనపల్లె. -
సౌర వెలుగులు.!
మదనపల్లె సిటీ: రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం సౌరవిద్యుత్పై దృష్టి సారించింది. ప్రధానంగా ప్రభుత్వ సంస్థల్లో సౌర విద్యుత్ను వినియోగించేలా అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో మదనపల్లె ఆర్టీసీ –1, 2 డిపోలు, గ్యారేజీలు, బస్స్టేషన్, జెడ్పీహైస్కూల్ ప్రాంగణాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. వీటిద్వారా వస్తున్న విద్యుత్ను ఆ సంస్థలు సమర్థవంతంగా వినియోగించుకుంటూ నెలనెలా వస్తున్న కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం పొందాయి. మదనపల్లెలో సౌర వెలుగులపై ప్రత్యేక కథనం. మదనపల్లె ఆర్టీసీ డిపోలు.. తన ఆస్తులను మరింత సమర్థవంతంగా సద్వి నియోగం చేసుకునే వ్యూహంలో భాగంగాఆర్టీసీ సౌర విద్యుత్ బాట పట్టింది. బస్ స్టేషన్, డిపోలు, గ్యారేజీ భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పారు. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో నాలుగు డిపోలను ఎంపిక చేశారు. అందులో భాగంగా 2018లో మదనపల్లె ఆర్టీసీ డిపోలో సోలార్ ప్లాంటును ఏర్పాటు చేశారు. 100 కిలో వాట్ల సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేశారు. ఇందు కోసం రూ.37 లక్షల వరకు వెచ్చించారు. ప్లాంటు ద్వారా నెలకు 10 వేల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. సుమిత్ సంస్థ టెండర్ ద్వారా ఆర్టీసీకి 25 ఏళ్లపాటు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తోంది. వీటి ద్వారా బస్స్టేషన్, రెండు డిపో కార్యాలయాలు, గ్యారేజీలో సోలార్ విద్యుత్ను వినియోగిస్తున్నారు. 1, 2 డిపో కార్యాలయాలపై 326 పలకలను ఏర్పా టు చేశారు. గతంలో విద్యుత్ బిల్లు నెలకు రూ.1.50 లక్ష వరకు వచ్చేది. సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసిన తరువాత నెలకు సరాసరి రూ.40–50 వేలు బిల్లు వస్తోంది. సగటున నెలకు రూ.లక్ష వరకు ఆదా అవుతోంది. గత 5 సంత్సరాలుగా సోలార్ ప్లాంటు విజయవంతంగా నడుస్తోంది. ఇతర డిపోల్లో ఏర్పాటుకు సన్నాహాలు మదనపల్లె ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంటు సక్సెస్ కావడంతో రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. త్వరలో అన్ని డిపోల్లో ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టారు. పూర్వ విద్యార్థి సహకారం.. జెడ్పీ పాఠశాలకు వరం పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన రవిసుబ్రమణ్యం ఖతర్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన చిన్నప్పుడు మదనపల్లెలో చదువుకున్నాడు. ఆయనకు విద్యబోధించిన ఉపాధ్యాయుడు ఫణీంద్ర ప్రస్తుతం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. గత ఏడాది మదనపల్లెకు వచ్చినప్పుడు తన గురువును కలిసి సన్మానం చేయాలనుకున్నాడు. దీనికి ఉపాధ్యాయుడు నిరాకరించి పాఠశాలలో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేయాలని కోరాడు. ఆయన అభ్యర్థన మేరకు రూ.4.50 లక్షల వ్యయంతో సోలార్ ప్లాంట్ను గత ఏడాది మార్చి నెలలో ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ 60 యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేలా 50 సోలార్ పలకలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా సరఫరా అయ్యే విద్యుత్ను పాఠశాలలోని 55 గదుల్లో ఫ్యాన్లు, లైట్లకు వినియోగించేలా వైరింగ్ చేశారు. పాఠశాల ఆవరణంలో తాగునీటి కోసం బోరు కూడా వినియోగిస్తున్నారు. గతంలో నెలకు రూ. 15 వేలు నుంచి 18 వేలు వరకు వచ్చే బిల్లు ప్రస్తుతం రూ.2 వేలు లోపే వస్తోంది. పాఠశాలలోని తరగతి గదులు, ల్యాబ్లు, గ్రంథాలయం, కార్యాలయంతో పాటు అవసరం ఉన్నచోట్ల సౌర విద్యుత్నే వినియోగిస్తున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సాహం సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రణాళికల్లో భాగంగా మదనపల్లె డిపోలోని బస్స్టేషన్పై సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేశారు. దీని వల్ల ఆర్టీసీకి నెలకు రూ. లక్ష వరకు ఆదా అవుతోంది. –వెంకటరమణారెడ్డి, వన్ డిపో మేనేజర్.మదనపల్లె దాతలు ముందుకు రావాలి మా పాఠశాలలో 2,138 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఖతర్లో పని చేసే రవిసుబ్రమణ్యం సోలార్ప్లాంటు ఏర్పాటు చేయడం అభినందనీయం. దాతలు ముందుకు వస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. –రెడ్డె్డన్నశెట్టి, హెచ్ఎం, జెడ్పీ ఉన్నత పాఠశాల, మదనపల్లె