ఫైళ్లు తగలబెడుతున్నారంటూ దుష్ప్రచారం | Bopparaju Venkateshwarulu Comments on TDP Govt | Sakshi
Sakshi News home page

ఫైళ్లు తగలబెడుతున్నారంటూ దుష్ప్రచారం

Published Tue, Aug 27 2024 4:24 AM | Last Updated on Tue, Aug 27 2024 4:24 AM

Bopparaju Venkateshwarulu Comments on TDP Govt

ఉద్యోగులను వేధిస్తున్నారు

దీనివల్ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోంది

ఏపీఆర్‌ఏస్‌ఏ రాష్ట్ర అ«ధ్యక్షుడు బొప్పరాజు

గాంధీనగర్‌(విజయవాడ సెంట్రల్‌): మదనపల్లె ఘటన తర్వాత ఉద్యోగులను వేధిస్తున్నారని, దీనిపై వాస్తవాలు ఇంకా నిర్ధారణ కాలేదని, ఉద్దేశపూర్వకంగా జరిగిందా? ప్రమాదమా? అనేది తేల్చలేదని ఏపీ రెవెన్యూ సరీ్వసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. దీనిపై నేటికీ సీఐడీ విచారణ కొనసాగుతోందని... ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదన్నారు. ఈ ఘటనలో ఉద్యోగులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ‘మదనపల్లె సబ్‌ కలె­క్టర్‌ కార్యాలయంలో అగ్ని ప్రమా­దం ఘటనలో వాస్త­వా­లు ఇంకా ని­రా­్ధరణ కా­లేదు.

ఏ ప్రభుత్వ కా­ర్యాలయంలోనైనా పనికిరాని కా­గి­తాలను తీసి­వేస్తే.. వెంటనే ఉద్దేశపూ­ర్వకంగా ఫైళ్లు తగల­పె­డుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దీని­వల్ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోంది. వాస్తవా­ల­ను నిర్ధారించుకున్న తర్వాతే మీడియా ప్రసారం చేయా­లి’ అని వ్యాఖ్యానించారు. సోమవారం విజయ­వాడలో ఆయన మీడి­యాతో మాట్లాడారు.‘ప్రభుత్వ కార్యా­ల­యా­ల్లో ఉద్యో­గు­లకు పనిచేసే వాతావరణం కల్పించా­ల్సిన బాధ్యత ప్రభుత్వా­నిదే.

తహసీల్దార్‌ కార్యా­లయా­ల్లో రోజువారీ ఖర్చులకు కూడా నిధుల్లేవు. ప్రభు­త్వం ఆదే­శాలిస్తుంది గానీ నిధులివ్వ­ట్లేదు’ అని అన్నారు. ‘ప్రస్తు­తం తహశీల్దార్‌ కార్యాల­యా­­ల్లో అద్దె వాహనాలకు కూడా నిధులు లేవు. కంప్యూ­టర్లు, ప్రింటర్లు, ఇంటర్‌నెట్‌ కనెక్టి­విటీ తదిత­రాలకు నిధు­లివ్వ­కపో­వడంతో.. సిబ్బంది జీతాల నుంచే ఖర్చు పెడుతు­న్నా­రు’ అని పేర్కొన్నారు. కాగా, ఏపీఆర్‌ఎస్‌ఏ ప్రధాన కార్య­దర్శిగా రామి­శెట్టి వెంకట రాజేశ్‌ను ఎన్నుకు­న్నట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement