ఒకటా రెండా?.. కాల్చుకు తింటోంది! | Tdp Harassment of officers and employees in Madanapalle: AP | Sakshi
Sakshi News home page

ఒకటా రెండా?.. మరీ అంతలా కాల్చుకు తింటోంది!

Published Tue, Aug 27 2024 4:17 AM | Last Updated on Tue, Aug 27 2024 6:34 AM

Tdp Harassment of officers and employees in Madanapalle: AP

మదనపల్లె ఘటనతో మొదలు.. 

పలుచోట్ల పనికిరాని ఫైల్స్‌ కాలిపోతే హంగామా

అధికారులు, ఉద్యోగులను వెంటాడుతున్న ప్రభుత్వం

గత ప్రభుత్వానికి అనుకూలంగా పని చేశారంటూ వేధింపులు

గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం దాకా ఇదే తీరు

సాక్షి, అమరావతి: కూటమి సర్కారు ఉద్యోగులు, అధికారు­లను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వేధింపులకు గురి చేయడంపై ఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవు­తోంది. ఇప్పటికే గతంలో ఎన్నడూ లేనివిధంగా 50 మందికిపైగా ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు పోస్టి­ంగ్‌లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న విష­యం తెలిసిందే. నిత్యం డీజీపీ కార్యాలయానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే కూర్చుని సంతకాలు పెట్టి వెళ్లాలని 16 మంది ఐపీఎస్‌ అధికారులకు అవమానకరంగా ఒక మెమో జారీ చేయడంపై అధికార యంత్రాంగంపై తీవ్ర విస్మయం వ్యక్తమైంది.

ఒక్క సివిల్‌ సర్వీసు అధికా­రులే కాకుండా గ్రూప్‌–1 అధికారులు, కింది స్థాయి ఉద్యోగులను సైతం ప్రభుత్వం అదే రీతిలో వేధింపు­లకు గురి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం అన్న­మయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో  కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే ఈ ఘట­నను రాజకీయం చేసేందుకు టీడీపీ సర్కారు ప్రయత్నించింది. మద­న­పల్లెలో ఫైల్స్‌ దగ్ధం వెనుక కుట్ర కోణం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడి­యాతో ప్రక­టన చేయించింది.

ప్రస్తుత ఆర్డీవో, పూర్వ ఆర్డీవోతో­పాటు సీనియర్‌ అసిస్టెంట్‌ను సస్పె­ండ్‌ చేసింది. కార్యాల­యంలోని మిగిలిన ఉద్యో­గులను సైతం భయభ్రాంతులకు గురి చేసి తీవ్రంగా వేధించింది. అయితే ఇంతవరకు ఈ ఘటన ఎలా జరిగిందో, అసలు నిజాలు ఏమిటో తేల్చ­లేక­పోయింది. ఇక కొద్దిరోజుల క్రితం పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు కార్యాల­యానికి సంబంధించిన పనికిరాని ఫైళ్లను కింది­స్థాయి ఉద్యో­గు­లు దగ్ధం చేస్తే దానిపైనా రాద్ధాంతం చేసింది. పోలవ­రా­నికి సంబంధించి పనికిరాని ఫైళ్లను రాజ­మ­హేంద్రవరంలో దగ్ధం చేస్తే దానిపైనా టీడీపీ హడావుడి చేసింది. ఈ ఘటనలన్నింట్లోనూ అధికా­రులు, ఉద్యో­గులను 
అను­మానంతో వేధించడం మినహా ఆరోపణలను నిరూపించలేక­పోయింది.

ముద్ర వేసి ఇబ్బందులు..
ప్రభుత్వం మారాక అన్ని శాఖల్లో అధికారులు, ఉద్యోగులను అనుమానపు చూపులు చూస్తూ వేధి­స్తు­న్నారు. గ్రామ సచివా­లయాల నుంచి రాష్ట్ర సచి­వా­లయం వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర సచివాలయంలో వైఎస్సార్‌సీపీ కోసం పని చేసిన వారంటూ ఒక జాబితా విడుదల చేసి మరీ కొందరు దుష్ప్రచారానికి దిగారు. ఏలూరు జిల్లా దెందు­లూరు ఎమ్మె­ల్యే చింతమనేని ప్రభాకర్‌ తన నియోజక­వర్గంలో పనిచేసే కొందరు పంచాయతీ కార్యదర్శులు, ఉద్యో­గు­ల­పై పార్టీ ము­ద్ర వేసి పదోన్నతి లభించినా, బదిలీ అయినా రిలీవ్‌ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement