-
‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కోసం డెల్ ఉద్యోగులు చేస్తున్న రిస్క్ ఏంటి?
వర్క్ ఫ్రమ్ హోమ్కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడం కంపెనీలకు కత్తిమీద సాములా మారింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, కఠిన నిబంధనలు తీసుకొస్తున్నా ఉద్యోగులు జంకడం లేదు. ఆఫీస్కు రావడానికి ససేమిరా అంటున్నారు. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ ఉద్యోగులైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ప్రమోషన్లు సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు.డెల్ కంపెనీ గత ఫిబ్రవరిలో రిటర్న్-టు-ఆఫీస్ తప్పనిసరి నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. హైబ్రిడ్గా పనిచేస్తారా.. లేక రిమోట్గా పనిచేస్తారా అన్నది అధికారికంగా తెలియజేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ను ఎంచుకున్న ఉద్యోగులు ప్రమోషన్ లేదా పాత్ర మార్పులకు అర్హులు కాదని కంపెనీ పేర్కొంది.హైబ్రిడ్ను ఎంచుకున్న ఉద్యోగులకు త్రైమాసికానికి 39 రోజులు, వారానికి సుమారు మూడు రోజులు ఆఫీసులో హాజరును కంపెనీ తప్పనిసరి చేసింది. వారి హాజరును కలర్-కోడ్ సిస్టమ్ ద్వారా పర్యవేస్తుంది. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం.. డెల్ ఫుల్టైమ్ యూఎస్ ఉద్యోగులలో దాదాపు 50 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ను ఎంచుకున్నారు.దీని అర్థం ఈ ఉద్యోగులు పదోన్నతికి అర్హులు కాదు. ఇక అంతర్జాతీయ సిబ్బందిలోనూ మూడింట ఒక వంతు మంది వర్క్ ఫ్రమ్ హోమ్నే ఎంచుకున్నారు. ఆఫీసుకు వెళ్లడం కన్నా ఇంటి నుంచి పనిచేయడంలోనే తమకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నారు. దీంతో ప్రమోషన్లను సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు. -
ఉద్యోగులు లేట్గా వస్తే ఫైన్ : పాపం బాస్కే చుట్టుకుంది! ట్విస్ట్ ఏంటంటే!
ఉద్యోగులు సమయాన్ని కచ్చతంగా పాటించాలనే ఉద్దేశంతో ఒక బ్యూటీ కంపెనీ బాస్ కఠినమైన నియమం తీసుకొచ్చాడు. ఆఫీసుకు ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులెవరైనా రూ. 200 ఫైన్ చెల్లించాల్సిందే అంటూ రూల్ పెట్టాడు. అది తిరిగి తిరిగి బాస్కే చుట్టుకుంది. దీంతో ఆయన ఫన్నీగా ఒక పోస్ట్ పెట్టాడు. ఇది వైరల్గా మారింది. ఈ స్టోరీలో అసలైన ట్విస్ట్ ఇంకోటి ఉంది. అదేంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే. ముంబైలోని ఈవోర్ బ్యూటీ వ్యవస్థాపకుడు కౌశల్ షా ఉద్యోగులకు సమయానికి రావాలని రూల్ విధించాడు. కంపెనీ ఉత్పాదక పెరగాలని, క్రమశిక్షణ అండాలంటూ ఉద్యోగులు ఉదయం 9:30 గంటలకు కార్యాలయానికి చేరుకోవాలనే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాడు. అలాగే ఆలస్యంగా వచ్చిన వారికి రూ. 200 జరిమానా విధించారు. ఈ రూల్ అలా పెట్టాడో లేదో ఆయనే అయిదుసార్లు లేట్ వచ్చినందుకు స్వయంగా షా వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ఆయన ఎక్స్లో షేర్ చేశాడు. ఈ రూల్తో తనకే ఎదురుదెబ్బ తగిలిందని హాస్యాస్పదంగా పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది. అలాగేవిష సంస్కృతి అని కొందరు, “ఉద్యోగులందరికీ మీకున్నంత జీతం ఉందా?, మరి ఎక్కువ పనిగంటలకి అదనంగా చెల్లిస్తున్నారా?. ఇలా రక రకాల కమెంట్స్ వచ్చాయి. ‘‘ఇది చాలా దారుణం. మీ నుండి ఇది ఊహించలేదు బ్రో రూ. 200 కోసం వారు తొందరపడితే, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగదే ఎలా?’’ అంటూ మరికొందరు ఇంకొంచె ఘాటుగా స్పందించారు. దీంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. తన పోస్ట్కు వచ్చిన స్పందన నేపథ్యంలో షా, తన ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించాడు.ఇదీ సంగతి!తన పోస్ట్ వెనకాల ఉన్న ఉద్దేశాన్ని నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారని షా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేశాడు. కంపెనీ ఒక రూల్ పెట్టినపుడు, ఫౌండర్ నుంచి కింది స్థాయి ఉద్యోగి దాకా అన్ని స్థాయిల్లో అందరూ దీన్ని తు.చ. తప్పకుండా పాటించాలనే సూత్రాన్ని నొక్కిచెప్పడమే తన ఉద్దేశమని పేర్కొన్నాడు. అంతేకాదు లేటు ఫీజు ద్వారా సేకరించిన డబ్బును తన సొంత యూపీఐ వాలెట్కు చెల్లించడం గురించి కూడా వివరణ ఇచ్చాడు. దీన్ని ప్రత్యేక టీమ్ ఫండ్గా చేసి టీమ్ ఈవెంట్లకు, లంచ్కు ఉపయోగిస్తామని వెల్లడించాడు. -
గురుకులాలకు ఉద్యోగుల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ మొదలైంది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు జీఓ 317 జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పలు సొసైటీలు ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు పూర్తి చేసినప్పటికీ ఉద్యోగి వారీగా కేటాయింపులు విడుదల చేసే క్రమంలో పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఏడాదిన్నరగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది.న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఉద్యోగులను మినహాయిస్తూ మిగతా ఉద్యోగులకు నూతన జోనల్ విధానానికి అనుగుణంగా జిల్లా, జోనల్, మలీ్టజోన్ కేటగిరీలను కేటాయి స్తూ గురుకుల సొసైటీలు చర్యలు వేగవంతం చేశాయి. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో గురువారం ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ పూర్తయింది. ఈమేరకు సొసైటీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో కూడా ఈ కసరత్తు దాదాపు కొలిక్కి వచి్చనట్లు సమాచారం.ఒకట్రెండు రోజుల్లో ఈ సొసైటీలో కూడా ఉద్యోగ కేటాయింపులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో ఏడాది క్రితమే ఉద్యోగ కేటాయింపులు జరిగాయి. తాజాగా ఉద్యోగుల వారీగా కేటాయింపు ఉత్తర్వులు జారీ కానున్నాయి. తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) పరిధిలో మాత్రం ఈ ప్రక్రియ పెండింగ్లోనే ఉంది. స్పౌజ్ కేటగిరీ ఉద్యోగులకు న్యాయం చేయాలి: టిగారియా గురుకుల విద్యా సంస్థల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జీఓ 317 అమలు ప్రక్రియ పరిష్కారం కావడం శుభసూచకమని తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టిగారియా) అధ్యక్ష, కార్యదర్శులు మామిడి నారాయణ, మధుసూధన్ గురువారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి స్పౌజ్గా ఉన్న కేటగిరీని పరిగణనలోకి తీసుకుని న్యాయం చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వ, పీఎస్యూల పరిధిలో ఉద్యోగి స్పౌజ్గా ఉన్న వారికి కూడా న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా పీహెచ్ కేటగిరి, సింగిల్ ఉమెన్, డివోర్స్, అన్ మ్యారీడ్, మెడికల్ కేటగిరీలను కూడా పరిగణించి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈమేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించారు. -
చైనా యువత వినూత్న నిరసన .. ఎందుకో తెలుసా?
బీజింగ్ : చైనా యువత నిరసన తెలపడంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్కడ చూసినా పక్షుల తరహాలో being a bird దుస్తులు ధరిస్తున్నారు. వాటిలాగే శబ్ధాలు చేస్తున్నారు. అందుకు ప్రభుత్వాలు తీసుకున్న మతిలేని చర్యే కారణమని తెలుస్తోంది. చైనాలో ‘996’ పని విధానాన్నిఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పని విధానంలో ఉద్యోగులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 9గంటల వరకు పనిచేయాలి. వారానికి 6 రోజులు పనిదినాలు. అయితే ఈ వర్క్ కల్చర్ను ఉద్యోగులు,యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పక్షుల తరహా దుస్తులు ధరిస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెక్కల్ని ధరించి చెట్లెక్కడం, కుర్చీ ఎక్కి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.ఇక పక్షుల తరహాలో ప్రవర్తించడం కొంచెం వింతగా ఉన్నప్పటికీ.. పనివిధానం, లేదంటే గంటల కొద్ది నిర్వహిస్తున్న స్టడీ అవర్స్ నుంచి తమకు విముక్తి కలిగించాలని, పక్షుల్లా తమకూ స్వేచ్ఛ కావాలనే ఉద్దేశ్యంతో ఈ చర్యలకు ఇలా ప్రవర్తిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల డిగ్రీని పూర్తి చేసుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు ఆందోళన చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. ర్యాట్రేస్లాంటి వర్క్ కల్చర్ , 996 పని విధానం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని వాపోతున్నారు. ఇక.. చైనాలోని యువత సోషల్ మీడియాలో దేశ పని సంస్కృతిపై తమ నిరాశను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో బాయి లాన్ అనే పదాన్ని ట్రెండ్ చేశారు. ఎన్బీయే బాస్కెట్ బాల్ వీడియో గేమ్లో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా బాస్కెట్ బాల్ను విసిరే పద్ధతి. ఈ కాన్సెప్ట్ను ఉపయోగించిన చైనా పౌరులు పని సంస్కృతిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తమగళాన్ని వినిపించారు. -
ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపరాఫర్.. రూ.8 లక్షల బోనస్!
ప్రముఖ టెక్ దిగ్గజం 'ఇన్ఫోసిస్' తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంప్లాయిస్ ట్రాన్స్ఫర్ పాలసీ కింద ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ ప్రకటించింది. ముంబై-కర్ణాటక ప్రాంతంలోని టైర్-2 నగరమైన హుబ్బల్లిలో తన ఉనికిని పెంచుకోవడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.హుబ్బల్లిలోని క్యాంపస్కు కంపెనీ స్థానిక ఉద్యోగులను రప్పించడానికి ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ ప్రకటించింది. దీనికి సంబంధించి కంపెనీ తమ ఉద్యోగులకు ఒక మెయిల్ కూడా పంపింది. అందులో ''భవిష్యత్తును నిర్మించడానికి మీలాంటి ప్రతిభ ఉన్నవారి కోసం వేచి ఉందని'' పేర్కొంది.ఇక ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ విషయానికి వస్తే.. లెవెల్ 3 లేదా అంతకంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు రీలొకేషన్ సమయంలో రూ. 25,000 అందిస్తారు. ఆ తరువాత రెండు సంవత్సరాలలో.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రూ. 25000 అందిస్తారు. ఇలా మొత్తం 24 నెలల్లో రూ.1.25 లక్షలు లభిస్తాయి.లెవెల్ 4 ఉద్యోగులకు కంపెనీ ప్రారంభంలో రూ. 5000 అందిస్తుంది. ఆ తరువాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి రూ. 50000 జమచేస్తుంది. ఇలా రెండు సంవత్సరాల్లో ఈ కేటగిరి ఉద్యోగులు మొత్తం రూ. 2.5 లక్షల బోనస్ పొందవచ్చు. ఉన్నత స్థాయి ఉద్యోగులకు రీలొకేషన్ సమయంలో రూ. 1.5 లక్షలు అందిస్తారు. వీరికి రెండు సంవత్సరాల్లో మొత్తం రూ. 8 లక్షలు అందిస్తారు.ఇన్ఫోసిస్ ఇప్పుడు ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ తీసుకురావడానికి ప్రధాన కారణం.. కర్ణాటక ప్రభుత్వంతో ఏర్పడిన కొన్ని విభేదాలే అని తెలుస్తోంది. కర్ణాటకలోని కొన్ని రాజకీయ పార్టీలు నుంచి సంస్థ మీద ఒత్తిడి పెరగటం మాత్రమే కాకుండా.. ఇన్ఫోసిస్ స్థానికులకు ఉద్యోగాలను కల్పించడంలో విఫలమైందని విమర్శిస్తున్నారు. కంపెనీకి ఉపాధి కల్పన కింద కేటాయించిన 58 ఎకరాల భూమిని కూడా వెన్నక్కి తీసుకోవడానికి ప్రయతిస్తున్నారు. ఈ కారణంగా ముంబై కర్ణాటక ప్రాంతాలకు చెందిన తమ ఉద్యోగులను కంపెనీ హుబ్బళ్ళికి తరలించడానికి ఈ ఆఫర్ తీసుకువచ్చింది. -
లేటుగా వస్తే.. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక
ఢిల్లీ: కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి అనుగుణమైన ఆదేశాలు ఇప్పటికే ఉన్నతాధికారులకు అందాయి. కొందరు ఉద్యోగులు బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్)లో హాజరు నమోదు చేయకపోవడం, మరికొందరు ఉద్యోగులు నిత్యం ఆఫీసుకు ఆలస్యంగా రావడం జరుగుతోంది. దీనిపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వ ఈ విధమైన ఆదేశాలు జారీచేసింది.సిబ్బంది మంత్రిత్వ శాఖ తాజాగా మొబైల్ ఫోన్ ఆధారిత ప్రమాణీకరణ వ్యవస్థను ఉపయోగించాలని ఉన్నతాధికారులకు సూచించింది. ఏఈబీఏఎస్ అమలు తీరును సమీక్షించిన ప్రభుత్వానికి దీని అమలులో అలసత్వం కనిపించింది. దీనిని సీరియస్గా తీసుకున్న మంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ విభాగాల సిబ్బంది హాజరు నివేదికలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని నిర్ణయించింది. కొందరు ఉద్యోగులకు కార్యాలయానికి ఆలస్యంగా రావడం, త్వరగా బయలుదేరడం అలవాటుగా మారిందని, దీనిని నియంత్రించాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను కోరింది.ఈ నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అప్పుడే ఏఈబీఏఎస్లో రిజిస్టర్డ్, యాక్టివ్ ఉద్యోగుల మధ్య ఎలాంటి తేడాలు ఉండవని ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సంబంధిత సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలను పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, డిఫాల్టర్లను గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయానికి సిబ్బంది ఎవరైనా ఆలస్యంగా వస్తే, దానిని హాఫ్-డే క్యాజువల్ లీవ్గా పరిగణించాలని సూచించింది. నెలలో ఒకటి లేదా రెండుసార్లు, న్యాయమైన కారణాలతో ఆలస్యంగా కార్యాలయానికి ఎవరైనా సిబ్బంది వస్తే అధికారులు వారిపై చర్యలు తీసుకోవలసిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. -
పోరాటం.. ఆరాటమే!
సాక్షి, హైదరాబాద్: భారత్లోని ఉద్యోగుల్లో అత్యధికులు తమ జీవితం సాగుతున్న తీరు పట్ల సంతోషంగా లేరని ఓ సర్వేలో వెల్లడైంది. వారి ఉద్యోగ, వ్యక్తిగత జీవితం మానసికంగా, భావోద్వేగాల పరంగా, సామాజిక అంశాల పరంగా సంతోషంగా సంతృ›ప్తికరంగా సాగడం లేదని స్పష్టమైంది. దేశంలోని 86 శాతం మంది ఉద్యోగులు ఇబ్బందులు లేదా కష్టాల్లో సాగుతున్నట్టుగా గ్యాలప్ స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ వర్క్ఫోర్స్– 2024 వార్షిక నివేదిక తెలిపింది. మొత్తం ఉద్యోగుల్లో 14 శాతం మంది మాత్రమే తాము అన్ని విధాలుగా పురోగతి సాధిస్తూ సంతృప్తిగా, పూర్తి ఆశావాహ దృక్పథంతో ముందుకు అడుగు వేస్తున్నట్టుగా ఈ అధ్యయనం వెల్లడించింది.అధ్యయనం ఇలా... దక్షిణాసియాలోనే రెండో పెద్ద వర్క్ఫోర్స్గా ఉన్న మన దేశంలోని ఉద్యోగుల పరిస్థితులపై రూపొందించిన ఈ నివేదికలో భాగంగా..ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల మానసిక స్థితి, శ్రేయస్సు, అభ్యున్నతి ఎలా ఉందనే అంశంపై ఈ సంస్థ అంచనా వేసింది. ప్రధానంగా గ్యాలప్ కేటగిరీల వారీగా జీవన మూల్యాంకన సూచీ.. సంతృప్తి–పురోగతి, కష్టాలు ఎదుర్కోవడం (స్ట్రగులింగ్), బాధ–కుంగుబాటు (సఫరింగ్) మూడు గ్రూపులుగా ఉద్యోగులను వర్గీకరిస్తోంది. ఉద్యోగులు తాము సాగిస్తున్న జీవనం, భవిష్యత్ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారా లేదా ? అనే అంశంపై పది పాయింట్లకు గాను కనీసంగా ఏడు, ఆ పై స్థాయిలో పాయింట్లు సాధించే వారిని ‘త్రైవింగ్’(సంతృప్తితో) కేటగిరీలోని వారిగా ఈ సంస్థ లెక్కిస్తోంది. ఉద్యోగులు తమ జీవితం పట్ల అభధ్రతా భావంతో అగమ్యగోచరంగా లేదా ప్రతికూలతతో ఉన్న వారిని, రోజువారి ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని ‘స్ట్రగులింగ్’(కష్టాలు ఎదుర్కోవడం)గా పరిగణిస్తోంది. ‘సఫరింగ్’ (బాధ–ఇబ్బందులు) గ్రూపులో ఉన్న వారిని...వ్యక్తులుగా వారి ప్రస్తుత జీవనం, భవిష్యత్ దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా, కనీస అవసరాలను కూడా తీర్చుకోలేక, శారీరకంగా, భావోద్వేగపరంగా బాధను అనుభవిస్తున్న వారిగా వర్గీకరిస్తోంది.ఏమిటీ గ్యాలప్ సంస్థ ? ప్రపంచవ్యాప్తంగా 80 ఏళ్లుగా వివిధ కంపెనీలు, సంస్థలు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలపై అధ్యయనం చేసి, అవసరమైన విశ్లేషణలు అందిస్తూ ఆయా సమస్యలను అధిగమించేందుకు ‘గ్యాలప్’కృషి చేస్తోంది. ఉద్యోగులు, వినియోగదారులు, విద్యార్థులు, పౌరుల వైఖరులు, వారి ప్రవర్తన తీరు తెన్నులపై ఈ సంస్థ పూర్తి అవగాహన కలిగి ఉండడంతో ఈ వర్గాల వారు ఎదుర్కుంటున్న సమస్యలను సరిగ్గా ఎత్తిచూపగలుగుతోంది.ఉద్యోగి చేస్తున్న ఉద్యోగం, నిర్వర్తిస్తున్న విధులు, పనిలో భాగంగా ఎదురయ్యే అనుభవాలు, ఇబ్బందులను మాత్రమే కాకుండా.. జీవితంలో త్రైవింగ్, స్ట్రగులింగ్, సఫరింగ్ను తాము పరిశీలించినపుడు రోజువారీ భావోద్వేగాలు, కెరీర్ ముందడుగు వంటివి ప్రాథమికంగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టుగా వెల్లడైందని గ్యాలప్ వరల్డ్ పోల్ గ్లోబర్ రీసెర్చ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీనివాసన్ చెబుతున్నారు. ఉద్యోగం చేసే చోట్ల, పని ప్రదేశాల్లో సవాళ్లను, కష్టమైన పరిస్థితులను ఎదుర్కొనే వారికి... ఆయా అంశాలు వారి ఆరోగ్యం, సంతోషాలను ప్రభావితం చేస్తున్నట్టు స్పష్టమైందని తెలిపారు. ‘స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ వర్క్ఫోర్స్’ నివేదికలో ఏముందంటే..?⇒ ప్రతీరోజు భావోద్వేగ పరంగా ఎదురవుతున్న అనుభవాలు, మనస్థితిని బట్టి 35 శాతం మంది భారతీయులు రోజూ కోపానికి, ఆగ్రహానికి గురవుతున్నారు. ఇది దక్షిణాసియాలోనే అత్యధికం ⇒ భారత్లో రోజువారీ ఒత్తిళ్లు అనేవి అత్యల్పంగా ఉన్నట్టు తేలింది. దక్షిణాసియాలో చూస్తే... శ్రీలంకలో ఇది 62 శాతంగా, ఆఫ్గానిస్తాన్లో 58 శాతంగా ఉండగా, భారత్లో 32 శాతం ఉంది⇒ తాము ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగాలు విడిచిపెట్టి కొత్త వాటిని కోరుకుంటున్నవారు 58 శాతం కాగా,.. భారత్లో మాత్రం 52 శాతంగా ఉన్నారు. -
ఇన్ఫోసిస్లో రూ.కోటి పైగా జీతం.. ఈసారి ఎంత మందికంటే..?
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్లో ఏడాదికి రూ.కోటికి పైగా జీతం తీసుకునే వారి సంఖ్య ఈ ఏడాది తగ్గింది. కనీసం రూ.1.02 కోట్ల వార్షిక వేతనంతో ఇన్ఫోసిస్ లో ఉద్యోగుల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 17 శాతం క్షీణించి 103కు పడిపోయిందని సీఎన్బీసీ-టీవి 18 గణాంకాలు చెబుతున్నాయి. ఈ 103 మంది ఉద్యోగులు మొత్తంగా ఏడాదికి రూ.176 కోట్ల స్థూల వేతనాన్ని అందుకున్నారు.ఈ టెక్ దిగ్గజంలో సుమారు 124 మంది టాప్ ఎగ్జిక్యూటివ్లు 2023 ఆర్థిక సంవత్సరంలో రూ .221 కోట్ల వేతనం పొందారు. రూ. కోటికి పైగా వేతనం పొందే ఉద్యోగుల సంఖ్య 2022 ఆర్థిక సంవత్సరంలో 100 మార్కును దాటగా, 2023 ఆర్థిక సంవత్సరంలో కూడా 124 మంది ఉద్యోగుల సంఖ్యతో అదే స్థాయిలో ఉంది. ఈ జాబితాలో భారత్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఇందులో కంపెనీ టాప్ 10 ఉద్యోగులు తీసుకున్న వేతన పరిహారాన్ని చేర్చలేదు.(విప్రోకు భారీ కాంట్రాక్ట్.. వేల కోట్ల అమెరికన్ డీల్)ఇన్ఫోసిస్కు ఇటీవల రాజీనామా చేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ లలో నర్సింహారావు మన్నెపల్లి, రిచర్డ్ లోబో, శ్వేతా అరోరా, విశాల్ సాల్వి తదితరులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఈ 103 మంది ఉద్యోగుల్లో మూడింట ఒక వంతు మంది 2000 సంవత్సరం కంటే ముందే ఇన్ఫోసిస్ లో చేరారు. వీరు ఏడాదికి సగటున రూ.1.7 కోట్ల వేతనం తీసుకున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో కీ మేనేజిరియల్ పర్సనల్ సహా పురుష ఉద్యోగులందరి సగటు వేతనం రూ .11 లక్షలుగా ఉంది. అదే విధంగా మహిళా ఉద్యోగులు సగటున రూ .7 లక్షలు వార్షిక వేతనం పొందారు. కాగా ఏడాది మధ్యలో 34 మంది ఉద్యోగులను నియమించుకోగా వీరి సగటు వేతనం నెలకు 8.5 లక్షలు.2024 ఆర్థిక సంవత్సరంలో అధిక చెల్లింపులు అందుకున్న ఉద్యోగులలో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) పదవికి రాజీనామా చేసిన నీలాంజన్ రాయ్ రూ .10.7 కోట్ల వార్షిక వేతనంతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కొత్తగా నియమితులైన సీఎపఫ్వో జయేశ్ సంఘ్ రాజ్కా రూ.6.1 కోట్లు, దినేష్ ఆర్, సతీష్ హెచ్ సీలు వరుసగా రూ.4.6 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు వేతనం అందుకున్నారు. దినేష్, సతీష్ ఇద్దరూ ఇన్ఫోసిస్ లో ఈవీపీ అండ్ కో-హెడ్ ఆఫ్ డెలివరీగా నియమితులయ్యారు. -
ఈపీఎఫ్ అకౌంట్లో తప్పులున్నాయా? ఇలా సులభంగా మార్చుకోండి..
సాధారణంగా ఉద్యోగం చేసేవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ అకౌంట్ వివరాల్లో ఏవైనా తప్పులు ఉండే అవకాశం ఉంటుంది. గతంలో ఉద్యోగులు తమ జాయింట్ డిక్లరేషన్ ఫారంను నింపి, దానిని ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఇచ్చేవారు. ఇప్పుడు ఏవైనా మార్పులు చేసుకోవాలనుంటే.. ఫిజికల్ ఫారమ్తో పనిలేకుండా.. ఆన్లైన్లో మార్చుకోవచ్చు. ఈ కథనంలో ఈపీఎఫ్ చందాదారులు ఆన్లైన్లో తమకు చెందిన 11 వ్యక్తిగత వివరాలను ఎలా మార్చుకోవాలో వివరంగా తెలుసుకుందాం.ఆన్లైన్లో మార్చుకోగలిన 11 వ్యక్తిగత వివరాలుపేరుజెండర్పుట్టిన తేదీతండ్రి / తల్లి పేరురిలేషన్షిప్వైవాహిక స్థితిజాయినింగ్ డేట్రీజన్ ఫర్ క్విట్టింగ్ డేట్ ఆఫ్ క్విట్టింగ్నేషనాలిటీఆధార్ఆన్లైన్లో ఎలా మార్చుకోవాలంటే?👉ఉద్యోగి ముందుగా ఈపీఎఫ్ఓ అధికారికి వెబ్సైట్ ఓపెన్ చేయాలి👉హోమ్ పేజీలో మొదట కనిపించే 'సర్వీస్' ట్యాబ్ మీద క్లిక్ చేసిన తరువాత 'ఫర్ ఎంప్లాయిస్' అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.👉ఆ తరువాత సర్వీస్ సెక్షన్ కింద కనిపించే 'మెంబర్ యూఏఎన్ / ఆన్లైన్ సర్వీస్' ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి.👉ఆలా క్లిక్ చేయగానే మీకు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.👉కొత్త పేజీలో కుడివైపు కనిపించే బాక్సులలో 'యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా' వంటి వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. 👉ఇవన్నీ పూర్తి చేసిన తరువాత అసలైన ఈపీఎఫ్ఓ అకౌంట్ పేజీ ఓపెన్ అవుతుంది.👉ఈపీఎఫ్ఓ అకౌంట్ పేజీ ఓపెన్ అయినా తరువాత స్క్రీన్ మీద కనిపించే.. 'మేనేజ్' ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ మెంబర్ ఐడీ ఎంటర్ చేసిన తరువాత.. ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. వాటిని ఎంటర్ చేసుకోవాలి.👉అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తరువాత సబ్మిట్ చేయాలి.👉అన్ని సరిగ్గా అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన తరువాత రిక్వెస్ట్ యాక్సెప్ట్ అవుతుంది. ఆ తరువాత వివరాలు మీకు అందుతాయి.ఎంప్లాయర్ చేయాల్సింది..👉ఎంప్లాయ్ వివరాలను అందుకున్న తరువాత ఎంప్లాయర్.. ఈపీఎఫ్ఓ అధికారికి వెబ్సైట్లో ఎంప్లాయర్ ఐడీతో ఎంటర్ అవ్వాలి. 👉మెంబర్ ట్యాబ్ మీద క్లిక్ చేసి.. జాయింట్ డిక్లరేషన్ చేంజ్ రిక్వెస్ట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.👉ఉద్యోగి అభ్యర్థను చెక్ చేసిన తరువాత ఎంప్లాయర్ అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు.👉ఎంప్లాయర్ ఉద్యోగి రిక్వెస్ట్ అంగీకరిస్తే.. అది ఈపీఎఫ్ఓకు చేరుతుంది. -
పేటీఎం ఉద్యోగులకు భారీ షాక్.. త్వరలోనే లేఆఫ్స్
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం ఉద్యోగులకు షాకివ్వనుంది. త్వరలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ఆ సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తన కంపెనీలోని షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్లో పెట్టుబడులు పెట్టడం, ఉద్యోగులకు చెల్లించే జీతాల ఖర్చులు గణనీయంగా పెరిగాయని, కాబట్టే సంస్థ ఖర్చు తగ్గించేందుకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక పెట్టుబడులు కొనసాగుతుండగా ఉద్యోగుల ఖర్చులను తగ్గించేందుకు కూడా సంస్థ చర్యలు తీసుకుంటుందని, ఈ నిర్ణయంతో సంస్థకు ఏటా రూ. 400-500 కోట్ల వరకు ఆదా అవుతుందని పేటీఎం సీఈఓ చెప్పారు. రాబోయే సంవత్సరానికి, మేం బిజినెస్ సేల్స్ విభాగంతో పాటు రిస్క్ అండ్ కంప్లైయన్స్ ఫంక్షన్లలో పెట్టుబడులు కొనసాగిస్తూనే.. లేఆఫ్స్తో ఖర్చులను తగ్గించుకుంటున్నట్లు.. ఫలితంగా ఏడాదికి రూ.400 నుంచి రూ. 500 కోట్లు ఆదా అవుతుందని మేం ఆశిస్తున్నట్లు విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. అంతేకాదు కంపెనీ తన కస్టమర్ కేర్ను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తోందని, ఆదాయాన్ని పెంచుకుంటూనే ఖర్చుల్ని తగ్గించే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తన కంపెనీ షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. -
ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్!.. శుభవార్త చెప్పిన కంపెనీ
గత కొన్ని రోజులుగా దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియకుండా ఇప్పటికీ చాలామంది బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఈ తరుణంలో సింగపూర్ ఎయిర్లైన్స్ తన ఉద్యోగులకు ఎగిరి గంతేసే శుభవార్త ప్రకటించింది. ఇందులో భాగంగానే ఎనిమిది నెలల బోనస్ అందిస్తామని పేర్కొంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ ఎయిర్లైన్స్ రికార్డు స్థాయిలో 1.98 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు పేర్కొంది. ఏడాది పొడవునా విమాన ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగిన కారణంగా ఈ సంస్థ గొప్ప లాభాలను ఆర్జించింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ తమ సరిహద్దుల మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో ఎయిర్లైన్స్ లాభాలను గడించింది.ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా సింగపూర్ ఎయిర్లైన్స్.. 'స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్లైన్ అవార్డ్' పొందింది. ఈ అవార్డును ఈ ఎయిర్లైన్స్ గతంలో ఐదు సార్లు సొంతం చేసుకుంది. 23 ఏళ్ల చరిత్ర కలిగిం సింగపూర్ ఎయిర్లైన్స్ ఆరు సార్లు ఈ అవార్డును దక్కించుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. -
ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం.. టెక్ దిగ్గజం వార్నింగ్
ఇప్పటికే ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు.. తమ ఉద్యోగులకు ఆఫీస్ నుంచే పనిచేయాలని (రిటర్న్-టు-ఆఫీస్) ఆదేశాలు జారీ చేశాయి. ఈ విధానాన్ని ఇప్పుడు 'కాగ్నిజెంట్' కంపెనీ అమలు చేసింది. ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను అతిక్రమిస్తే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.భారతదేశంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తప్పకుండా 'రిటర్న్ టు ఆఫీస్' పాలసీకి అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. 2023లో విప్రో, టీసీఎస్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఆఫీసుకు రప్పించే ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో కాగ్నిజెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.టెక్ సంస్థలన్నీ కూడా తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్న క్రమంలో.. కాగ్నిజెంట్ సీఈఓ 'రవి కుమార్' తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తూ.. ఇండియాలో పనిచేస్తున్న కంపెనీ ఎంప్లాయిస్ ఆఫీసు నుంచి వారానికి కనీసం మూడు రోజులు పనిచేయాలని పేర్కొన్నారు.కాగ్నిజెంట్ కంపెనీలు మొత్తం 3.47 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 2.54 లక్షల మంది భారతదేశంలోనే పనిచేస్తున్నట్లు సమాచారం. ఇంటి నుంచి పని చేయడంలో కంటే ఆఫీసు నుంచి పనిచేస్తేనే పనితీరు మెరుగ్గా ఉంటుందని సీఈఓ రవి కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే పలు కంపెనీల సీఈఓలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. -
జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అధికారులు, వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఇక నుంచి విధుల్లో ఆ తరహా వస్త్రధారణ కూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.డ్రైవర్లు, కండక్టర్లకు ’ఖాకీ’.. మిగిలిన వాళ్లు ఇష్టమొచ్చినట్టుగా!ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ డ్రెస్లో కనిపిస్తారు.. బస్టాపులు, బస్టాండ్లలో ఉండే సూపర్వైజర్లు తెల్లరంగు దుస్తుల్లో ఉంటారు.. కానీ, డిపోలు, ఇతర ఆర్టీసీ కార్యాలయాల్లో ఉండే అధికారులకు యూనిఫాం అంటూ లేదు. డ్రెస్ కోడ్ కూడా లేకపోవటంతో ఇంతకాలం క్యాజువల్ వస్త్రధారణ తో విధులకు హాజరవుతున్నారు. దీన్ని పెద్దగా పట్టించుకునేవారు లేకపోవటంతో, రంగురంగుల డ్రెస్సులు, జీన్స్ ప్యాంట్లు, టీ షర్డులు ధరించి వస్తున్నారు.కొందరు ఉన్నతాధికారులు కూడా ఈ తరహా వస్త్రధారణతో విధుల్లో కనిపిస్తున్నారు. తాజాగా దీన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. ఇటీవల ఆయన తరచూ అధికారులతో గూగుల్ సమావేశాలు నిర్వహిస్తు న్నారు. కొన్ని సందర్భాల్లో డిపో స్థాయి సిబ్బందితో కూడా ఆన్లైన్ సమావేశాల్లో ముచ్చటిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులు మొదలు డిపో స్థాయి సిబ్బంది వరకు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టుల్లో కనిపిస్తున్నారు. ఇది ఆయనకు చికాకు తెప్పించింది.ఫార్మల్ డ్రెస్సుల్లోనే రావాలని ఆదేశాలుదేశంలోనే పేరున్న రవాణా సంస్థలో ఇలా ఇష్టం వచ్చిన వస్త్రధారణతో అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొనటాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదే విషయాన్ని ఆయన ఈడీ ‘అడ్మిన్) దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు తాజాగా ఈడీ (అడ్మిన్) లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. సంస్థకు ఉన్న పేరు, డిపో కార్యాలయాల గౌరవానికి వారి డ్రెస్సింగ్ భంగంగా ఉందంటూ ఆయన అందులో అభిప్రాయపడ్డారు. ఇక నుంచి గౌరవప్రదంగా ఉండే ఫార్మల్ డ్రెస్సుల్లోనే అధికారులు విధుల్లో కనిపించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆయా అధికారుల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు.యూనిఫాంలో కనిపించని స్పష్టతఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫాంలో కనిపిస్తారు. కొన్ని బస్సుల్లో నీలి రంగు యూనిఫాం ఉంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించింది. ఆర్టీసీలో అతిపెద్ద సమ్మె విరమణ తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో సిబ్బంది యూనిఫాంపై ప్రస్తావించారు. మహిళా కండక్టర్లకు యాప్రాన్ అందజేస్తామని చెప్పి.. ఆ యాప్రాన్ ఏ రంగులో ఉండాలో నిర్ధారించేందుకు ఓ కమిటీ వేశారు.రెండు మూడు సమావేశాలు నిర్వహించిన తర్వాత, మెరూన్ రంగులో ఉండే యాప్రాన్ను సిఫారసు చేశారు. ఆ మేరకు ఓ ప్రముఖ కంపెనీకి వస్త్రం కొనుగోలు ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ యాప్రాన్ కూడా కనిపించటం లేదు. డ్రైవర్లు, కండక్టర్లకు యూనిఫాం కూడా కొన్నేళ్లపాటు సరఫరా కాలేదు. వారికి ఖాకీ బదులు మరో రంగు ఇవ్వాలన్న అంశం కూడా తెరమరుగైంది. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల స్టాండ్..కూటమిని ఓడిద్దాం..
-
ఉద్యోగుల తొలగింపు..టీసీఎస్లో అసలేం జరుగుతోంది?
ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగుల తొలగింపు మరోసారి చర్చకు దారి తీసింది. గతేడాది ‘లంచాలకు ఉద్యోగాలు’ కుంభకోణంలో పలువురికి ఉద్వాసన పలకగా.. తాజాగా భద్రత పేరుతో అనుమానం ఉన్న ఉద్యోగుల్ని తొలగించడం టెక్ విభాగంలో చర్చాంశనీయంగా మారింది. భద్రత పేరుతో టీసీఎస్ తమను ఉద్యోగాల నుంచి తొలగించిందంటూ పలువురు ఉద్యోగులు సోషల్ మీడియాలో వాపోతున్నారు.రెడ్డిట్ పోస్ట్ల ప్రకారం.. లేఆఫ్స్ ఇచ్చిన ఉద్యోగులు వ్యక్తిగత ల్యాప్ట్యాప్లను ఉపయోగించి వారి సున్నితమైన లాగిన్ క్రెడిన్షియల్స్ను షేర్ చేశారని, భద్రత దృష్ట్యా వారిని తొలగించినట్లు మేనేజర్ ఆరోపిస్తున్నట్లు సదరు బాధిత ఉద్యోగులు రెడ్డిట్ పోస్ట్లో తెలిపారు. I got suspended from tcs today because of a security incident which was reported by me byu/Personal_Stage4690 indevelopersIndia తమను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించినప్పుడల్లా క్లయింట్ అడ్రస్లు షేర్ చేయడం, వ్యక్తిగత ల్యాప్టాప్లను ఉపయోగించడం, వాట్సాప్లో కమ్యూనికేట్ చేయడం ఇలా ప్రతిదానిపై నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఉద్యోగుల తొలగింపులపై టీసీఎస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. I got suspended from tcs today because of a security incident which was reported by me byu/Personal_Stage4690 indevelopersIndia -
చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నన్నాళ్లూ ప్రభుత్వ ఉద్యోగులను ముప్పతిప్పలు పెట్టిన చంద్రబాబును మరోసారి నమ్మవద్దని పలువురు విశ్రాంత ఉద్యోగులు, మేధావులు, విద్యావేత్తలు కోరారు. సమస్యలపై ప్రశ్నిస్తే ఉద్యోగుల తోకలు కత్తిరించాలంటూ వారి ఆత్మాభిమానంపై దెబ్బకొట్టారని గుర్తు చేశారు. ‘ప్రజలు–ప్రభుత్వం–ఉద్యోగులు’ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు విజయవాడలో మంగళవారం జరిగింది. ఓపెన్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఉద్యోగుల మద్దతు వారికి మేలు చేసిన వైఎస్సార్సీపీకే ఉంటుందని తేల్చిచెప్పారు. ఉద్యోగులు, సీఎం వైఎస్ జగన్ మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉందని వెల్లడించారు. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల డిమాండ్లు ఉంటే బాగుంటుందన్నారు. వారు కూడా ప్రభుత్వంలో అంతర్భాగం కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని హితవు పలికారు. పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే 15వ తేదీకి కూడా జీతాలు అందవని హెచ్చరించారు. అసలు ప్రభుత్వ ఉద్యోగులనే వ్యవస్థే కనుమరుగయినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. కార్యక్రమంలో మెజర్ కిరణ్ కుమార్, లెక్చరర్ కళ్యాణి, సమాజిక కార్యకర్త శాంతమూర్తి, సాఫ్ట్వేర్ ప్రొఫెçషనల్ జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు ఏమన్నారంటే..3రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది చంద్రబాబే..రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని చంద్రబాబు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక దానికి కాయకల్ప చికిత్స చేయడం మొదలుపెట్టారు. కానీ కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ మళ్లీ దెబ్బతింది. రూ.60 వేల కోట్లను ప్రభుత్వం నష్టపోయింది. రాష్ట్ర బడ్జెట్లో సగం ఉద్యోగుల జీతభత్యాలకే పోతోంది. మిగిలిన సగం నాలుగున్నర కోట్ల మంది ప్రజలకు ఖర్చు చేయాల్సి ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు వ్యవస్థను ప్రవేశపెట్టారు. కొత్త ఉద్యోగాలివ్వలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నియామకాల విప్లవం తెచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం 1వ తేదీనే నేరుగా జీతాలందేలా చేశారు. దశాబ్దాలుగా పదోన్నతులు లేని వారికి పదోన్నతులిచ్చారు. చైల్డ్ కేర్ సెలవులను 180 రోజులకి పెంచారు. సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేశారు. తాజా మేనిఫెస్టోలో మరికొన్ని హామీలిచ్చి నెరవేరుస్తాననే నమ్మకమిచ్చారు. అదే చంద్రబాబు హామీలు నెరవేర్చాలంటే పీఆర్సీ, జీతాలు ఎగ్గొట్టాలి. లేదంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదు. –డాక్టర్ ఎన్.రాజశేఖర్రెడ్డి, అధ్యక్షుడు, ఓపెన్ మైండ్స్చంద్రబాబు వస్తే జీతాలు కష్టమే..అడగకుండానే సీఎం జగన్ క్లాస్ 4 ఉద్యోగుల జీతాలను పెంచారు. అదే చంద్రబాబు ‘ఉద్యోగుల తోకలు కత్తిరించాలి’ అన్నమాటను నేటికీ ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు రూ.లక్ష కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని అంటున్నారు. అంటే అప్పుడు 15వ తేదీకి కూడా జీతాలు రావు. పోనీ ఉద్యోగులకు ఏదైనా చేస్తానని మేనిఫెస్టోలో చెప్పారా అంటే లేదు. గతంలో ఉద్యోగుల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు దెబ్బతీశారు. ప్రభుత్వ ఉద్యోగులు అనే వ్యవస్థనే లేకుండా చేయాలనుకున్నారు. –పి.విజయబాబు, అధ్యక్షుడు, ఏపీ ఇంటలెక్చువల్ ఫోరంచంద్రబాబు ఉద్యోగులకు డీఏ అవసరం లేదన్నారు..ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి సహకరించాలి. ఎందుకంటే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయాల ద్వారా సీఎం జగన్ తీసుకువచ్చారు. విద్యకు ఆయన అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్దారులకు డీఏ అవసరం లేదన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఎంత దారుణంగా మాట్లాడారో చూశాం. –ప్రొఫెసర్ జి. రామచంద్రారెడ్డి, విద్యావేత్తఆర్టీసీని ఆదుకుంది జగన్ ప్రభుత్వమే..అప్పుల్లో ఉన్న ఆర్టీసీని సీఎం వైఎస్ జగన్ తమ ప్రభుత్వంలో విలీనం చేశారు. గతంలో జీతాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అప్పుచేసి జీతాలిచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి నెలా రూ.300 కోట్లు ఇస్తోంది. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ ఉద్యోగుల జీతాలు పెరిగాయి. ప్రభుత్వ సహకారంతో అప్పులు రూ.6 వేల కోట్ల నుంచి రూ.2 వేల కోట్లకు ఆర్టీసీ తగ్గించగలిగింది. –కోటేశ్వరరావు, విశ్రాంత ఆర్టీసీ అధికారిమంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాలివైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. వేతన సవరణ అడగకుండానే ఇచ్చింది. మళ్లీ అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇస్తామంటోంది. ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని అందరం కాపాడుకోవాలి. –ప్రొ.వి.నారాయణరెడ్డి, మాజీ రిజిస్ట్రార్ప్రభుత్వానికి ఉద్యోగులు మద్దతు ఇవ్వాలిప్రభుత్వాన్ని ఉద్యోగులు విమర్శించడం సరికాదు. అన్నదమ్ముల్లా ఉద్యోగులు, ప్రభుత్వం కలిసుండాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో అవన్నీ చేస్తోంది. సంక్షేమ పథకాలను ఇంటి వద్దే అందిస్తోంది. ఉద్యోగులు కూడా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకునే ప్రభుత్వానికే మద్దతివ్వాలి. –పి.సుశీలరెడ్డి, సామాజిక కార్యకర్త -
ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
మీరు ఉద్యోగం చేస్తున్నారా? చాలిచాలనీ జీతంతో ఇబ్బంది పడుతున్నారా? ఎక్కువ జీతం కావాలని కోరుకుంటున్నారా? అయితే ఈ సలహా పాటిస్తే మీ ప్రతిభకు తగ్గ వేతనం పొందొచ్చు. డెహ్రడూన్కు చెందిన ఐటీ ఉద్యోగి అక్షయ్ సైనీ ఉద్యోగులకు అప్రైజల్ సీజన్పై అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో కార్పొరేట్ కంపెనీల గురించి పచ్చి నిజాల్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ అక్షయ్ సైనీ ఏం చెప్పారంటేమీరు ఎక్కువ జీతం కావాలంటేమీరు ఎక్కువ జీతం కావాలంటే కంపెనీలు మారడమే సరైన నిర్ణయం. భారత్లో అత్యధిక కంపెనీల్లో ఇంట్రర్నల్ అప్రైజల్స్ ఓ జోక్గా అభివర్ణించారు. అంతేకాదు, సగటు కంటే ఎక్కువ ఉన్న ఇంజనీర్లు, డబుల్ డిజిట్ శాలరీ హైక్ను పొందలేదు. మీ వేతనం తక్కువగా ఉన్నట్లయితే, అతిగా ఆలోచించకండి. వెంటనే ఉద్యోగం మారండి! అంటూ తన పోస్ట్లో తెలిపారు. HARD TRUTH : Switching jobs is the only way to reach high salaries.In most Indian companies, the internal appraisals is a joke. Even above average engineers hardly get a double digit hike %If you're underpaid, don't overthink, just Switch! 🤷♂️— Akshay Saini (@akshaymarch7) May 2, 2024తక్కువ జీతంతో మీ కెరీర్ను ప్రారంభిస్తేమరో కఠినమైన నిజం ఏమిటంటే, మీరు తక్కువ జీతంతో మీ కెరీర్ను ప్రారంభిస్తే, అధిక జీతం (సాఫ్ట్వేర్ ఇంజనీర్గా) పొందాలంటే మీరు ఉద్యోగాలు మారాల్సి ఉంటుంది. కావాలంటే మీరే చూడండి తక్కువ వేతనంతో తమ కెరియర్ను ప్రారంభించిన ఐటీ ఉద్యోగులు జీతాలు పెంచుకునేందుకు తరుచూ ఉద్యోగాలు మారుతుంటారు. తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో ఇరుక్కుపోయికాబట్టి, మీరు తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో ఇరుక్కుపోయి శాలరీ హైక్, డిజిగ్నేషన్ కోసం ప్రయత్నించి విఫలమైతే మీరు ఉద్యోగం మారడం మంచింది. మంచి పని ఎంత ముఖ్యమో జీతం కూడా అంతే ముఖ్యం చివరగా గుర్తుంచుకోండి. మీకు తక్కువ జీతం ఉంటే అది మీ తప్పు అని అక్షయ్ సైనీ పేర్కొన్నారు.అక్షయ్ సైనీ అభిప్రాయాలపై నెటిజన్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. ఉద్యోగం చేస్తూ ఎక్కువ జీతం పొందాలంటే కంపెనీలు మారడమే సరైన నిర్ణయమని, ఎక్కువ జీతం పొందేందుకు తాము కూడా సంస్థలు మారినట్లు చెబుతున్నారు. -
ఢిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. 223 మంది మహిళా కమిషన్ ఉద్యోగులపై వేటు
ఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ (ఎల్జీ) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్లోని 223 మంది ఉద్యోగులను ఎల్జీ వీకే సక్సేనా తొలగించారు. ఈ మేరకు ఎల్జీ గురువారం ఉత్తర్వుల జారీ చేశారు. అమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్.. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగులను నియమించినట్లు ఆరోపణలు రావటంతో ఎల్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఎల్జీ నిర్ణయంపై స్పందించిన ఎంపీ స్వాతి మలివాల్ తీవ్రంగా ఖండించారు. ‘కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తే.. మొత్తం కమిషన్ మూతపడుతుంది. కమిషన్ ప్యానెల్లో ప్రస్తుతం 90 మంది మాత్రమే ఉన్నారు. అందుతో కేవలం 8 మంది మాత్రమే ప్రభుత్వ సిబ్బంది. మిగిలిన వారంతా మూడే నెలలపాటు పని చేసే.. కాంక్రాక్టు ఉద్యోగులు. ఇలా ఎందుకు చేస్తున్నారు. మహిళా కమిషన్ అస్సలు మూత పడనివ్వను. నన్ను జైలులో పెట్టండి కానీ, మహిళలను హింసించకండి’అని ‘ఎక్స్’ వేదికగా ఉన్నారు.LG साहब ने DCW के सारे कॉंट्रैक्ट स्टाफ को हटाने का एक तुग़लकी फ़रमान जारी किया है। आज महिला आयोग में कुल 90 स्टाफ है जिसमें सिर्फ़ 8 लोग सरकार द्वारा दिये गये हैं, बाक़ी सब 3 - 3 महीने के कॉंट्रैक्ट पे हैं। अगर सब कॉंट्रैक्ट स्टाफ हटा दिया जाएगा, तो महिला आयोग पे ताला लग जाएगा।…— Swati Maliwal (@SwatiJaiHind) May 2, 2024ఢిల్లీ మహిళా కమిషన్ చట్టం ప్రకారం ప్యానెల్లో 40 ఉద్యోగాలు, కొత్తగా కొల్పించిన 223 ఉద్యోగ పోస్టులకు ఎల్జీ అనుమంతి తీసుకోలేదని జారీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగులను నియమించే అధికారం కమిషన్కు లేదని తెలిపారు. స్వాతి మలివాల్ ఆప్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కాకముందు 9 ఏళ్లు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేవారు. ప్రస్తుతం ప్యానెల్ చైర్మన్ పదవి ఖాళీ ఉంది. తాజా చర్యలతో మరోసారి ఆప్ ప్రభుత్వానికి, ఎల్జీకి మరోసారి వివాదం ముదరనుందని ప్రచారం జరుగుతోంది. -
ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర
కడప కార్పొరేషన్: ఉద్యోగులు, పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు, ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఇక్కడి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసిందని, ఆ కౌన్సిల్ ఏడాదిలో ఏడెనిమిది సార్లు సమావేశమై ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, జీపీఎఫ్, సరెండర్ లీవులు, టీఏ, ఏపీజీఎల్ఐ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగినా, ఎందుకు జరిగిందో ఉద్యోగులకూ తెలుసన్నారు. రెండేళ్లు కోవిడ్ వల్ల ప్రపంచం యావత్తు అల్లాడిపోయిందని, రాష్ట్రానికి రూ.76 వేల కోట్ల నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు. 10,177 మంది రెగ్యులరైజ్ రాష్ట్ర బడ్జెట్ లక్షా ఇరవై ఐదు వేల కోట్లుగా ఉంటే అందులో 95 వేల కోట్లు జీతాలకే పోతోందని, మిగిలిన బడ్జెట్ సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. వారం రోజులుగా పీఎఫ్ బకాయిలను క్లియర్ చేశారని తెలిపారు. కొంతమంది ప్రభుత్వంపై బురదజల్లుతూ రూ.25 వేల కోట్ల బకాయిలున్నాయనడం దారుణమన్నారు. 11వ పీఆర్సీ అరియెర్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, వాటినీ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పెన్షన్ తగ్గిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. ఐఆర్ 23 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్ష¯Œన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 10,177 మందిని రెగ్యులరైజ్ చేశారని, వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న 11 వేల మందికి 010 పద్దు కింద జీతాలిచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని తెలిపారు. లక్షా ముప్పై ఐదు వేల మందిని సచివాలయాల్లో నియమించిన సీఎం జగన్.. 12వ పే రివిజన్ కమిషన్ కూడా వేసి జూలై నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మే నెలతో పాటు ఒక డీఏ ఇస్తున్నారని, జూన్లో మరో డీఏ ఇస్తారని చెప్పారు. సీపీఎస్ వల్ల ప్రభుత్వంపై ఎక్కువ భారం పడుతుందనే జీపీఎస్ తీసుకొచ్చారని వివరించారు. కీలకమైన విద్య, వైద్యరంగాల్లో ఖాళీలన్నీ భర్తీ చేశారని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారని తెలిపారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నారని, చిన్న స్థాయి ఉద్యోగులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయనున్నారని చెప్పారు. పాత జిల్లాలతో పాటు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న వారికీ 16 శాతం హెచ్ఆర్ఏ వర్తింపజేశారన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ రెండు నెలల నుంచి ఆరు నెలలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ని చేసిన జగన్ను మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులు, పెన్షనర్లపై ఉందని చెప్పారు. వలంటీర్లపై నిత్యం చంద్రబాబు అక్కసు.. 2014లో చంద్రబాబు ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి గాలికొదిలేశారని, తాజాగా ఆయన ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయాలంటే అదనంగా లక్షా యాభై వేల కోట్లు కావాలన్నారు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, ఇన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. వలంటీర్లపై నిత్యం అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు.. అధికారంలోకొస్తే రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ సభల్లోనే అధికారులను తిడితే ఎంతో మంది గుండెపోటుకు గురయ్యారని గుర్తుచేశారు. ఇప్పుడూ రెడ్ బుక్లో నోట్ చేస్తున్నాం.. శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం.. అంటూ పోలీసులు, ఉద్యోగులను బెదిరిస్తున్నారని «ధ్వజమెత్తారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 4 డీఏలు ఇవ్వాలని అడిగితే.. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాను గానీ డీఏలు ఇచ్చేది లేదని మొండికేసిన విషయం ఉద్యోగులు ఇంకా మర్చిపోలేదని చంద్రశేఖర్రెడ్డి వివరించారు. -
భారీగా తగ్గిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు.. 23 ఏళ్లలో ఇదే మొదటిసారి!
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా 25,994 మంది ఉద్యోగులను తొలగించింది. 2001 తరువాత కంపెనీ ఒక సంవత్సర కాలంలో ఇంత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి. సుమారు 23 సంవత్సరాలలో కంపెనీ ఇంత మంది ఉద్యోగులను ఎప్పుడూ తొలగించలేదని తెలుస్తోంది.ప్రస్తుతం కంపెనీలో 3,17,240 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. గతంతో పోలిస్తే ఈ సంఖ్య 7 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అయితే జనవరి నుంచి మార్చి వరకు కంపెనీ కేవలం 5,423 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది వరుసగా ఐదవ త్రైమాసికంలో కంపెనీ లాభాల తగ్గుదల వల్ల జరిగినట్లు తెలుస్తోంది. గత పన్నెండు నెలల ప్రాతిపదికన Q4 అట్రిషన్ రేటు 12.9 శాతం నుంచి 12.6 శాతానికి తగ్గిందని స్పష్టమవుతోంది.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా గత వారం దాని Q4 ఫలితాలను వెల్లడించింది. ఇందులో కూడా ఉద్యోగుల సంఖ్య 13,249 మంది తగ్గినట్లు తెలిసింది. 2004 తరువాత ఇంతమంది తగ్గడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. జనవరి-మార్చి త్రైమాసికం నాటికి కంపెనీ 1,759 మంది ఉద్యోగులను తగ్గించింది.ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. వేలాది ఉద్యోగులు ఇంటికి!కరోనా మహమ్మారి దేశంలో అధిక సంఖ్యలో ప్రబలిన తరువాత ఐటీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఎంతోమంది ఉద్యోగులు తమ ఉద్యోగులను కోల్పోవాల్సి వచ్చింది. ఉన్నవారిని ఉద్యోగాల నుంచి తొలగించడం మాత్రమే కాకుండా.. కొత్త వారిని చేర్చుకోవడానికి కూడా సంస్థలు వెనుకడుగు వేసాయి.ఇక ఇన్ఫోసిస్ కంపెనీ క్యూ4 ఫలితాల విషయానికి వస్తే.. కంపెనీ 2024 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో మంచి లాభాలను ఆర్జించినట్లు తెలుస్తోంది. కంపెనీ లాభాలు అంతకు ముందు త్రైమాసికం కంటే 30 శాతం వృద్ధి చెంది రూ. 7969 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. -
సంతోషంగా ఉంటేనే విధులు.. లేకుంటే 10 రోజులు సెలవులు!
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో చర్చనీయాంశంగా మారిన అంశం. దీని ప్రాముఖ్యత గత దశాబ్ద కాలంలో విపరీతంగా పెరిగింది. పనితోపాటు కుటుంబంతో గడపడం, అభిరుచులు మొదలైనవాటికి ఒక రోజులో కొంత సమయం కేటాయించడం మధ్య సమతౌల్యాన్ని ఈ పదం సూచిస్తుంది. దీని గురించి బాగా ఆలోచించిన ఒక చైనీస్ రిటైల్ వ్యాపారవేత్త తన సంస్థలో "అన్హ్యపీ లీవ్" అనే భావనను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఉద్యోగులు సంతోషంగా లేకుంటే విధులకు రాకుండా సెలవు తీసుకోవచ్చని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక పేర్కొంది. చైనాలోని రిటైల్ చైన్ అయిన పాంగ్ డాంగ్ లై వ్యవస్థాపకుడు, ఛైర్మన్ యూ డాంగ్లాయ్ ఈ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారు. ఇది సిబ్బంది తమ అభీష్టానుసారం 10 రోజుల అదనపు సెలవులు తీసుకుకోవడానికి అనుమతిస్తుంది. "ప్రతి సిబ్బందికి స్వేచ్ఛ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికీ వారు సంతోషంగా లేని సమయాలు ఉంటాయి, కాబట్టి మీరు సంతోషంగా లేకుంటే, పనికి రావద్దు" అని ఆయన చెప్పారు. సెలవులు తీసుకోవాలనుకునే ఏ ఉద్యోగికీ యాజమాన్యం నో చెప్పదని డోంగ్లాయ్ స్పష్టం చేశారు. "ఈ సెలవును యాజమాన్యం తిరస్కరించలేదు. తిరస్కరణ అనేది ఉల్లంఘన" అని ఆయన స్పష్టం చేశారు. -
ఒకే కంపెనీలో ఏళ్ల తరబడి ఉద్యోగం.. ఎందుకో తెలుసా?
ఉద్యోగం చేసేవారిలో చాలామంది ఒకే సంస్థలో ఏళ్లతరబడి జాబ్ చేస్తుంటారు. మరికొందరు సంవత్సరానికి ఓ కంపెనీలో జాబ్ చేస్తూ ముందుకు వెళ్లిపోతుంటారు. ఇంతకీ ఒకే కంపెనీలో సంవత్సరాలు తరబడి జాబ్ చేయడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ప్రస్తుత జాబ్ మార్కెట్ ట్రెండ్స్పై Apna.co ఒక ఆన్లైన్ సర్వే చేపట్టి.. వివిధ రంగాల్లో పనిచేస్తున్న పదివేల మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ అభిప్రాయాలను సేకరించింది. వేతనం అనేది ఒక ముఖ్యమైన అంశం అయినప్పటికీ, 54 శాతం మంది ఉద్యోగులు తమ ప్రస్తుత ఉద్యోగాల్లో కొనసాగడం కంటే కెరీర్లో పురోగతి సాధించడానికి ఇష్టపడుతున్నట్లు తెలిసింది. అంటే ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీలలోనే వృత్తిపరమైన వృద్ధిని కోరుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది. 37 శాతం మంది ఉద్యోగులు వర్క్ విషయంలో స్వేచ్ఛను కోరుకుంటున్నారు. 44 శాతం మంది ఉద్యోగులు తాము చేస్తున్న కంపెనీలోని వర్క్ కల్చర్కు అలవాటు పడినట్లు సమాచారం. కొందరు లీడర్షిప్ రోల్స్ కోసం లేదా కీలక బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేటగిరిలో సుమారు 54 శాతం మంది ఉన్నారు. 40 శాతం ఉద్యోగులు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ యాక్టివిటీస్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు, 36 శాతం మంది సీనియర్ లీడర్షిప్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. చేస్తున్న పనిలోనే స్కిల్ పెంచుకోవడానికి చూస్తున్న వారు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. అది మాత్రమే కాకుండా కంపెనీలు తమ ఉద్యోగులను సంతృప్తి పరిస్తే (జీతాలు పెంచడం, ప్రోత్సాహాలు అందించడం) ఎక్కువ కాలం ఒకే సంస్థలో పనిచేయడానికి ఉద్యోగులు ఇష్టపడతారని సర్వేలు తేలింది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న చాలామందిలో ఉన్న కంపెనీలలోనే జాబ్ చేస్తూ.. ఉన్నత స్థాననానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పని విషయంలో స్వేచ్ఛ మాత్రమే కాకుండా.. వర్క్ కల్చర్, కమ్యూనికేషన్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వేలో తెలిసినట్లు Apna.co సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'నిర్మిత్ పారిఖ్' వెల్లడించారు. -
ఆఫీస్లో నోటీసులు.. షాక్లో ఉద్యోగులు
ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు ఆర్ధిక మాంద్యం దెబ్బకు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ వైపు ఉద్యోగుల్ని తొలగిస్తూనే.. ఆఫీస్లో పనిచేసే ఉద్యోగుల టైం విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అలా ఓ ఆఫీస్ మేనేజ్మెంట్ ‘టైమ్ క్లాక్ ఫ్రాడ్’ పేరుతో ఓ మెమోను జారీ చేసింది. ఇప్పుడు ఆ మెమో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఓ రెడ్డిట్ యూజర్ హెచ్ఆర్ విభాగం జారీ చేసిన మెమోని షేర్ చేశారు. ఆ మెమోలో ఇలా ఉంది. టైమ్ క్లాక్ మోసాన్ని అరికట్టేందుకు ఉద్యోగులు ఐదు నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాలలో భాగంగా ఆఫీస్ వర్క్ ప్రారంభించే ముందు ఉద్యోగులు వ్యక్తిగత కార్యకలాపాలు, బ్యాగ్, ఇతర వస్తువులను సర్ధడం లాంటి పనులు చేసుకోవాలి. ప్రతి ఉద్యోగి తప్పని సరిగా మెమోలోని అంశాలను పాటించాలని, లేదంటే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నట్లు మెమోలో హైలెట్ చేసింది. దీంతో పాటు 10 మంది ఉద్యోగులు రోజుకు 10నిమిషాలు వృధా చేస్తే... అంటే రోజుకు వంద గంటలు నెలకు మూడు వేలగంటలు.. అలా 50 గంటల పేరోల్ లాస్ అవుతుందని తెలిపింది. దీంతో మెమోలో పేర్కొన్న నిబంధనలపై నెటిజన్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది తమ అఫీస్లో ఎదురవుతున్న అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
మా జాబ్స్ తీసేసి వాళ్లకు ఇస్తున్నారు.. టీసీఎస్పై తీవ్ర ఆరోపణలు
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)పై అమెరికన్ ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేశారు. జాతి, వయసు ఆధారంగా టీసీఎస్ తమపై చట్టవిరుద్ధంగా వివక్ష చూపుతుందని, షార్ట్ నోటీసుతో తమను తొలగించి హెచ్1బీ వీసాలపై భారత్ నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేస్తోందని అమెరికన్ ఉద్యోగుల బృందం ఆరోపించింది, వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. డజన్ల కొద్దీ అతిపెద్ద అమెరికన్ క్లయింట్లు ఉన్న టీసీఎస్కు వ్యతిరేకంగా సుమారు 22 మంది అమెరికన్ ఉద్యోగులు యూఎస్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. తొలగింపునకు గురైన టీసీఎస్ మాజీ ఉద్యోగుల్లో యూఎస్లోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న కాకేసియన్లు, ఆసియన్-అమెరికన్లు, హిస్పానిక్ అమెరికన్లు, 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో ఎంబీఏ, ఇతర ఉన్నత డిగ్రీలున్నవారూ ఉండటం గమనార్హం. అయితే ఈ ఆరోపణలను టీసీఎస్ ప్రతినిధి కొట్టిపారేశారు. 'చట్టవిరుద్ధమైన వివక్ష'కు సంబంధించిన ఆరోపణలు' అర్హత లేనివి, తప్పుదారి పట్టించేవి' అని తెలిపారు. "యూఎస్లో సమాన అవకాశాలు కల్పించే సంస్థగా టీసీఎస్ బలమైన రికార్డును కలిగి ఉంది. దాని కార్యకలాపాలలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది" అని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. -
ఈ అలవాట్లు ఉన్న ఉద్యోగులకు తిరుగులేదంతే...