లారీ ఢీకొని పురోహితుడి మృతి | man died in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని పురోహితుడి మృతి

Published Sat, Jan 2 2016 11:26 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

man died in road accident

ముదినేపల్లి: మంచు ప్రభావంతో ఎదురుగా వస్తున్న లారీ కనిపించక ద్విచక్రవాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా ముదినేపల్లి సమీపంలోని చినపాలపర్రు వద్ద శనివారం చోటు చేసుకుంది. వడాలి గ్రామానికి చెందిన జంద్యాల శాస్త్రీ(42) పౌరోహిత్యం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈ రోజు మరో వ్యక్తితో కలిసి బైక్ పై వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో జంధ్యాల శాస్త్రీ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement