వేంపల్లె పట్టణంలోని దరుగు వీధిలో ప్రమాదవశాత్తూ మిద్దెపై నుంచి కిందపడి బొడ్డు రాజా(45) అనే వ్యక్తి మరణించాడు.
వైఎస్సార్ జిల్లా(వేంపల్లె): వేంపల్లె పట్టణంలోని దరుగు వీధిలో ప్రమాదవశాత్తూ మిద్దెపై నుంచి కిందపడి బొడ్డు రాజా(45) అనే వ్యక్తి మరణించాడు. కుటుంబసభ్యులతో కలిసి రాజా బుధవారం రాత్రి మేడపై పడుకున్నాడు. గురువారం తెల్లవారు జామున 3 గంటలకు మూత్రవిసర్జనకు లేచి నిద్రమత్తులో మేడపై నుంచి కిందపడి మరణించాడు.
దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.