man dies
-
సమీరా వచ్చేస్తున్నా!.. నువ్వేం కంగారుపడకు.. బాబు తిన్నాడా..!
శ్రీకాళహస్తి: ‘సమీరా వచ్చేస్తున్నా... మరో 15 నిమిషాల్లో నీ ముందుంటా.. నువ్వేం కంగారుపడకు.. బాబు తిన్నాడా..! నువ్వు భోజనం చేసి పడుకో.. ఐ యామ్ ఆన్ది వే..’ అన్న భర్త తెల్లారేసరికి విగత జీవిగా కనిపించడం ఆమె గుండెల్ని పిండేసింది. ఈ ఘటన స్థానికంగా పెను విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం.. బుచ్చినాయుడుకండ్రిగ మండలం, జోగికండ్రిగకు చెందిన కొప్పల ధర్మయ్య కుమారుడు కొప్పల నారాయణ(25) డిగ్రీ వరకు చదివి రౌతుసూరమాల సమీపంలో ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. నారాయణకు పెళ్లకూరు మండలం, నెలబల్లి దళితవాడకు చెందిన సమీరాతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో భార్య సమీరా కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఆమెను చూసేందుకు నారాయణ రెండు రోజుల కిందట నెలబల్లి వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంలో శ్రీకాళహస్తికి వెళ్లాడు. తిరిగి వస్తూ తన మేనత్త ఊరైన తాటిపర్తికి చేరుకున్నాడు. రాత్రి పది అవుతున్నా నారాయణ ఇంటికి రాకపోవడంతో సమీరా భర్తకు ఫోన్ చేసింది. తాను తాటిపర్తిలో ఉన్నానని, మరో 15 నిమిషాల్లో నీ ముందుంటానని సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో నెలబల్లికి మార్గమధ్యంలో నాయుడుపేట–మదనపల్లి జాతీయ రహదారికి అతి సమీపంలో రామానాయుడు ఎస్టీ కాలనీ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి బండరాయిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. బండరాయిని ఢీకొన్న సమయంలో నారాయణ బైక్తో పాటు ముళ్లపొదల్లో పడిపోవడంతో ఎవ్వరూ గుర్తించలేకపోయారు. ఇప్పుడే వస్తానన్న భర్త తెల్లారైనా ఇంటికి రాకపోవడంతో సమీరా తాటిపర్తిలోని తమ బంధువులకు సమాచారం అందించింది. దీంతో వారు ఆరా తీయగా ముళ్లపొదల్లో విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి బోరుమన్నారు. తొట్టంబేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసు కుని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపారు. -
అమెరికాలో ఏపీ యువకుడు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అమెరికాలోని సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల ఘటనలో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం మజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ మరణించారన్న వార్తపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా నిలవాలని, వారిని అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. గోపికృష్ణ కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖను కోరారు. గోపికృష్ణ కుటుంబానికి వైఎస్ జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. -
సంపులో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
హైదరాబాద్: ప్రమదవశాత్తు సంపులో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వైరా మండలం గార్లకు చెందిన ఖలీల్ పాషా కుమారుడు షేక్ అక్మల్ సుఫుయాన్ (25) సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. గచ్చిబౌలి అంజయ్యనగర్లోని షుణ్ముక్ మెన్స్ పీజీ హాస్టల్లో నివాసముంటున్నాడు. సోమవారం ఉదయం 10.30 గంటలకు జిమ్కు వెళ్లి తిరిగి హాస్టల్కు వస్తుండగా దారిలో తెరిచి ఉంచిన నీళ్ల సంపులో ప్రమాదవశాత్తు అక్మల్ పడిపోయాడు. తీవ్రగాయాలు కావడం, నీటిలో పడడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ మేనేజర్ కె. మధుసూదన్రెడ్డి నిర్లక్ష్యంతో వ్యవహరించినందునే ఘటన చోటుచేసుకుందని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Continuation of video… pic.twitter.com/w6CNRNIQMx — Sudhakar Udumula (@sudhakarudumula) April 22, 2024 -
సినిమా చూసేందుకు వెళ్లి మృత్యుఒడిలోకి.. ఏమైందంటే?
లక్నో: ఇటీవలి కాలంలో గుండెపోటు కారణంగా చూస్తుండగానే అకస్మాత్తుగా ఎంతోమంది చనిపోయారు. ఉన్నట్టుండి కూర్చున్న, నిలుచున్న చోటే కుప్పకూలిన ఘటనలు ఎన్నో ఘటనలు సోషల్ మీడియాలో చనిపించాయి. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. సినిమా చూసేందుకు థియేటర్కు వెళ్లిన వ్యక్తి ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఉన్నచోటే కుప్పకూలి మృతిచెందాడు. వివరాల ప్రకారం.. యూపీలోని లఖింపుర్ఖేరీలో సినిమా చూసేందుకు వెళ్తున్న ఓ యువకుడు సినిమా హాలులో నడుస్తుండగానే కుప్పకూలిపోయాడు. కాగా, ఇటీవల విడుదలైన గదర్ -2 సినిమాను చూసుందుకు థియేటర్లోకి వస్తున్న 35 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. శనివారం రాత్రి 7.43 గంటల సమయంలో ఒక్కసారిగా ఫ్లోర్పై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు థియేటర్లో ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తిని అక్షత్ తివారీగా గుర్తించారు. प्रदेश के लखीमपुर खीरी के एक मॉल में चलते–चलते एक युवक को हर्ट अटैक आ गया, युवक नीचे गिरा और मर गया।#lakhimpurkheri pic.twitter.com/jmQpfWvO9w — Aviral Singh (@aviralsingh15) August 28, 2023 అయితే, తివారీ.. థియేటర్ వద్ద ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ సినిమా హాలు మెట్లు ఎక్కి పైకి వచ్చాడు. అనంతరం.. ఓ స్టాల్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అతడి ముందు ఇద్దరు యువకులు నడుస్తున్నట్టుగా సీపీ టీవీ వీడియోలో రికార్డు అయ్యింది. అతడు కుర్చీల వద్ద పడిపోవడాన్ని గమనించిన మరికొందరు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో వెంటనే తివారీని ఆసుపత్రికి తరలించారు. తివారీని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది కూడా చదవండి: విమానంలో అద్భుతం.. పసిబిడ్డ ప్రాణాలు కాపాడిన ఎయిమ్స్ డాక్టర్లు -
గేమ్లో ఓడిపోయాడని ముందు మందు బాటిళ్లు.. మితిమీరి తాగడంతో..
సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకోవడానికి యువత పోటీపడుతుంటారు. రకరకాల వీడియోలతో ఫాలోవర్స్ను ఆకర్షిస్తుంటారు. వివిధ స్టంట్స్ చేస్తూ కొన్నిసార్లు ప్రాణాలమీదికి తెచ్చుకుంటారు. అలాంటి ఘటనే చైనాలో జరిగింది. లైవ్ స్ట్రీమింగ్లో పోటీపడి పరిమితికి మించి మద్యంతాగి ప్రాణాలను కోల్పోయాడో వ్యక్తి. ఇంతకూ ఎంత తాగాడో తెలిస్తే షాకవుతారు! చైనా షార్టు వీడియో ప్లాట్ఫామ్ 'డౌయిన్'(చైనా టిక్టాక్)లో ఆన్లైన్ స్ట్రీమింగ్ గేమ్స్ నడుస్తుంటాయి. మధ్యరాత్రి ఒంటిగంటకు మొదలై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తాయి. ఇందులో లైవ్లో రకరకాల స్టంట్స్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తారు. ఈ క్రమంలో ఇద్దరు కంటెండర్లు 'పీకే'అనే పేరుతో ఓ క్రేజీ గేమ్ ఆడారు. ఆడియన్స్ నుంచి ఎక్కువ గిఫ్ట్స్ సంపాదించాలని గేమ్లో పోటీపడ్డారు. ఓడిన వ్యక్తి క్రేజీ శిక్షను అనుభవించాలని నిబంధన విధించుకున్నారు. వీడియోలో పేర్కొన్న ప్రకారం.. ఈ గేమ్లో ఓడిన వ్యక్తే జియాంగ్సు ప్రావిన్స్కు చెందిన జూవా. గెలిచిన వ్యక్తి సాంక్యూజ్. గేమ్లో భాగంగా లైవ్లో జువా ముందు ఏడుబాటిళ్ల'బైజు'(చైనా ఓడ్కా)ను పెట్టాడు సాంక్యూజ్. గేమ్లో ఓడినందుకు ఆ రోజురాత్రి లైవ్లోనే ఏడుబాటిళ్ల 'బైజు'ను తాగాడు జువా. మద్యం మత్తులోనే అస్వస్థతకు గురైన జువా.. నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు చూస్తే అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జువా ఎంత వైన్ తాగాడో సరిగ్గా తెలియదు.. కానీ రాత్రి లైవ్లో నాలుగో బాటిల్ తాగడం వరకు తనకు జ్ఞాపకం ఉందని తన స్నేహితుడు వెల్లడించాడు. జువా ఈ మధ్యే లైవ్స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో చేరాడని తెలిపాడు. 'బైజు' మద్యంలో సాధారణంగా 30 నుంచి 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఒకబాటిల్ పూర్తిగా తాగితేనే ప్రాణాలకు ప్రమాదం అని వైద్యులు తెలిపారు. డౌయిన్ ప్లాట్ఫామ్లో 10లక్షల వ్యూయర్స్ ఉన్నారు. దాదాపు రూ.28బిలియన్ల ఆదాయాన్ని కలిగి ఉంది. ఇదీ చదవండి:మీరు లావుగా ఉన్నారా.. అయితే ఆ రెస్టారెంట్లో పుడ్ ఫ్రీ, ఫ్రీ! -
ఘోరం.. కళ్ల ముందే మరిగే జావలో పడిన వ్యక్తి
వైరల్: అంతా చూస్తుండగా కళ్ల ముందు ఘోరం జరిగింది. పొయ్యి మీద వేడి వేడి జావ మరుగుతుండగా.. ఓ వ్యక్తి అందులో పడిపోయాడు. అది చూసి చుట్టుపక్కల వాళ్లు రక్షించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ మరిగే జావ నుంచి అతను బయటపడగలిగాడు. కానీ.. కడకు ఈ ఘటన విషాదంగా ముగిసింది. తమిళనాడు మధురైలో జులై 29న ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఇవాళ(మంగళవారం) బాధితుడు మృతి చెందాడు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ ఘటన.. ఇప్పుడు వైరల్ అవుతోంది. తమిళనాడులో ‘ఆడి వెల్లి’ జాతర సందర్భంగా అమ్మవారి గౌరవార్థం జావను వండి.. ప్రజలకు పంచుతారు. గత శుక్రవారం మధురై పలగనాథంలో ముత్తు మారియమ్మ ఆలయం సమీపంలో భక్తులు కొందరు ఇళ్ల ముందరే మీదే పెద్ద పెద్ద వంట పాత్రల్లో జావను మరిగిస్తున్నారు. ఆ సమయంలో ముత్తుకుమార్ అనే ఓ వ్యక్తి మైకంతో అక్కడికి వచ్చాడు(తాగి ఉన్నాడని స్థానికులు చెప్తున్నారు). తూలిపోతూనే ఆ గంజులో పడిపోయాడు. అతను పడిపోయే టైంలోనే చూసి కొందరు అరుస్తూ అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. జావ వేడిగా ఉన్నా.. ముత్తుకుమార్ మైకంలో ఉండిపోయిన ముత్తుకుమార్ కదలకుండా అలాగే ఉండిపోయాడు. చివరికి తమ వల్ల కాకపోవడంతో స్థానికులు జావ గంజునే బోర్లించారు. కాలిన గాయాలతో పైకి లేచిన ముత్తుకుమార్ను స్థానికులు రాజాజీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 65 శాతం గాయాలతో చికిత్స పొందుతూ మంగళవారం అతను మృతి చెందాడు. video disclaimer: ఈ వీడియో ఘటనకు సంబంధించింది.. కొందరికి ఇబ్బందికరంగా అనిపించొచ్చు -
ఒళ్లు గగుర్పొడిచే భయానక దృశ్యం.. కాళ్లు, చేతులు, తల మాయం
అనంతపురం సిటీ: ఏ ఊరో.. ఏం పేరో తెలియదు.. పట్టుమని 30 ఏళ్లు కూడా ఉండవు. తనంతట తాను రైలు కిందే పడ్డాడో.. లేక రైలొచ్చి ఢీకొందో ఏమో గానీ శరీర భాగాలన్నీ ఎక్కడికక్కడ వేరయ్యాయి. కాళ్లు, చేతులు, తల మాయం కాగా పట్టాల మధ్యలో మొండెం మాత్రమే పడి ఉంది. మోకాళ్ల నుంచి నడుం భాగం మాత్రమే మిగిలింది. చూడ్డానికే ఒళ్లు గగుర్పొడిచే ఈ భయంకరమైన దృశ్యం అనంతపురంలోని రాంనగర్ ఫ్లై ఓవర్ నుంచి ప్రసన్నాయపల్లి వైపు నగరానికి సుమారు కిలోమీటరు దూరంలో చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం అటుగా వెళ్లిన వారు గుర్తించి, భయంతో పరుగులు తీశారు. చదవండి: బంజారాహిల్స్లో కారు బీభత్సం.. సమాచారం అందుకున్న జీఆర్పీ సీఐ నాగరాజు, ఎస్ఐ విజయ్కుమార్, హెడ్ కానిస్టేబుల్ రాజశేఖరరెడ్డి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం 8 గంటలోపు ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం వద్ద లేత నీలం రంగు చెప్పులు పడి ఉన్నాయి. తల, కాళ్లు, చేతులు మాయమై ఉండడాన్ని బట్టి చూస్తే కుక్కలో, పందులో లాక్కెళ్లి ఉంటాయని రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల పరిసరాల్లో గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని సర్వజనాస్పత్రి మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు చేపట్టినట్లు జీఆర్పీ సీఐ నాగరాజు తెలిపారు. కాగా, మృతుడు ఎవరు, ఏం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన ప్రదేశానికి కొంత దూరంలో శనివారం రాత్రి ఓ ఫంక్షన్ జరిగిందని, మృతుడికి ఆ ఫంక్షన్కు సంబంధాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
భార్య కాపురానికి రావడం లేదని వ్యక్తి ఆత్మహత్య
మనోహరబాద్(తూప్రాన్): భార్య కాపురానికి రావడంలేదని తీవ్ర మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చెట్లగౌరారంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెట్ల గౌరారం గ్రామానికి చెందిన డ్రైవర్ బాబర్(30)తో తూప్రాన్కు చెందిన నూర్జహాన్ బేగంతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆరు నెలలుగా భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. భర్తతో గొడవపడి నూర్జహాన్ బేగం పుట్టింకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాబర్ మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈనెల 2న డ్యూటీకి వెళ్తున్నట్లు ఇంటిలో చెప్పి తిరిగిరాలేదు. మక్సాని కుంటబావిలో ఆదివారం శవమై తేలాడు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. మృతుడి తండ్రి మౌలానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
‘నా చావుకి ఎవరూ బాధ్యులు కారు’
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకి పని వత్తిడి పెరగడం.. మరోవైపు చేసిన అప్పు ఎలా కట్టాలని మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం... బాలాజీనగర్ పాతబస్తీలో నివాసం ఉంటున్న బొల్లి అశ్వినికి బొల్లి వెంకటేష్ (31)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వెంకటేష్ హిమాయత్నగర్లో ఉన్న కర్ణాటక బయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పని చేస్తున్నాడు. అశ్విని స్ధానికంగా ఓ టైలరింగ్ దుకాణంలో పని చేస్తోంది. గురువారం భర్త వెంకటేష్ ఇంట్లో ఉన్న సమయంలోనే అశ్విని పనికి వెళ్లింది. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు కుమారుడిని పాఠశాల నుంచి ఇంటికి తీసుకుని వచ్చింది. ఇంటి తలుపులు కొట్టినప్పటికి వెంకటేష్ తీయకపోవడంతో కిటికీ నుంచి చూడగా వంటగదిలో ఉన్న ఫ్యాన్రాడ్కు ఉరివేసుకుని కనిపించాడు. చుట్టు పక్కలవారి సహాయంతో తలుపులు తెరిచి వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే అశ్విని పోలీసులకు సమాచారం అందించింది. ‘ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతున్నా... నా చావుకు ఎవరూ బాధ్యులు కారు’ అంటూ వెంకటేష్ సూసైడ్నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రైతు శిబిరం వద్ద యువకుడి అనుమానాస్పద మృతి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఉద్యమ శిబిరం వద్ద యువకుడి దారుణ హత్య ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం రైతు నిరసన శిబిరం వద్ద అనుమానాస్పద మృతదేహం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. నిహాంగ్ సిక్కులే ఆ వ్యక్తిని హతమార్చారని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. దీనిపై ఒకప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. చదవండి : తగ్గేదే..లే అంటున్న వరుణ్: బీజేపీకి షాక్, సంచలన వీడియో సోనిపట్ జిల్లా కుండ్లిలోని రైతు నిరసన వేదిక వద్ద యువకుడి మృతదేహం పోలీసు బారికేడ్కు వేలాడుతూ కనిపించింది. బాధితుడిని లఖ్వీర్ సింగ్గా గుర్తించారు. ఎడమ మణికట్టు తెగిపడి రక్తపు మడుగులో ఉన్న వైనం ఆందోళన రేపింది. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేసినందుకు నిహాంగ్లు లఖ్బీర్ సింగ్ను కొట్టి చంపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దీనిపై హర్యానా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. చేతులు, కాళ్లు నరికివేసి ఉన్న మృతదేహాన్ని గుర్తించినట్టు పోలీసున్నతాధికారి హన్సరాజ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్ట్ నిమిత్తం సోనిపట్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అనేదానిపై ఆరా తీస్తున్నామన్నారు. సుమారు గత ఏడాది కాలంగా వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు నిరసన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీ వద్ద జరిగిన హింసలో రైతులు ప్రాణాలు కోల్పోవడం ఉద్రిక్తతను రాజేసింది. రైతుల్ని కారుతో గుద్ది హత్య చేశారన్న ఆరోపణలపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలంలో గురువారం పోలీసులు సీన్ రీక్రియేషన్ కార్యక్రమన్ని కూడా చేపట్టారు. At about 5 am today, a body was found hanging with hands, legs chopped at the spot where farmers' protest is underway (Kundli, Sonipat). No info on who's responsible, FIR lodged against an unknown person. Viral video is a matter of probe, rumours will linger: DSP Hansraj pic.twitter.com/IfWhC2wW4l — ANI (@ANI) October 15, 2021 -
విందుకు వెళ్లి వస్తూ.. కాసేపట్లో ఇంటికి ,అంతలో..
సాక్షి, పరిగి( హైదరాబాద్): ఎదురుగా వస్తున్న బైక్ను లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం తాండూర్ పట్టణ కేంద్రంలోని వినాయకచౌక్ పసాలిగల్లికి చెందిన షేక్ అబ్రార్(23), సయ్యద్ ఉమర్ రిజ్వాన్లు ఆదివారం నగరంలోని ఓ విందుకు హజయ్యారు. సోమవారం తెల్లవారుజామున తాండూర్ బయలు దేరారు. ఉదయం 5:30గంటలకు మండల పరిధిలోని గడిసింగాపూర్ సమీపంలో కొడంగల్ నుంచి పరిగి వైపు అతివేంగా వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్నడుపుతున్న షేక్ అబ్రార్ అక్కడిక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న సయ్యద్ ఉమర్ రిజ్వాన్కు తీవ్రగాయాలవ్వడంతో ఆయన్ను చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అక్కడికక్కడే మృతి చెందిన అబ్రార్ మృతదేహం రోడ్డుపై పడటంతో వెనుక వస్తున్న వాహనాలు మృతదేహంపై నుంచి వెళ్లడంతో మృతదేహం నుజ్జునుజ్జయింది. మృతుల బంధువు షబ్బీర్ అహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చదవండి: Drugs Case: రేవ్ పార్టీ.. ఎవరికీ అనుమానం రాకుండా అందులో డ్రగ్స్..షాకైన పోలీసులు -
చేనుపనులు ముగించుకుని వస్తున్నాడు.. అంతలోనే
సాక్షి, జైనథ్(ఆదిలాబాద్): చేను పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తాడనుకుంటే భర్త పిడుగుపాటుకు గురై తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటన జైనథ్ మండలం గూడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుంట భగవాండ్లు(49), తన భార్య మల్లమ్మ, జీతగాడు(పాలేరు) దాగిరి సంతోశ్, మరో నలుగురు కూలీలతో కలసి శుక్రవారం తన పత్తి చేనులో కలుపు నివారణ, పురుగుల మందు పిచికారీ పనులకు వెళ్లారు. ఆ తర్వాత కూలీలతో కాలినడకన భార్య మల్లమ్మ ఇంటికి చేరుకుంది. సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో పాలేరు సంతోశ్ ఎడ్ల బండి తోలుతుండగా, వెనుకాల నిల్చోని భగవాండ్లు వస్తున్నాడు. ఎడ్లబండిపై ఒకసారిగా పిడుగుపడి భగవాండ్లు అక్కడిక్కడే మృతిచెందాడు. సంతోశ్కు కాలి భాగంలో గాయాలయ్యాయి. ఎడ్లకు సైతం స్వల్ప గాయాలు కాగా, ఎటువంటి హాని జరుగలేదు. స్థానికులు సంతోశ్ను జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చదవండి: విధుల్లో ఉన్న వలంటీర్పై టీడీపీ నేత దాడి -
డ్రైనేజీ మృతుల కుటుంబాలకు డబుల్ ఇళ్లు
సాక్షి, ఎల్బీనగర్( హైదరాబాద్): బీఎన్రెడ్డి నగర్ డివిజన్లోని పద్మావతినగర్ కాలనీలో ఇటీవల డ్రైనేజీ పూడికతీత పనుల్లో మరణించిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు చెరో డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేశారు. ఈ మేరకు సోమవారం నగర మేయర్ విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మేయర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ను శివకుమార్ భార్య ధరణి శ్రావణిగౌరి, అంతయ్య భార్య నల్లవెల్లి భాగ్యమ్మకు అందచేశారు. వనస్థలిపురంలోని రైతుబజార్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ప్లాట్లలో 701 నెంబర్ను భాగ్యమ్మకు, 702 ప్లాట్లును శ్రావణి గౌరికి కేటాయించారు. ఇప్పటికే వీరికి రూ.17 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు. -
గుండెపోటుతో మల్లన్నసాగర్ నిర్వాసితుడు మృతి
గజ్వేల్రూరల్: పరిహారం అందలేదన్న మనస్తాపంతో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుడు గుండెపోటు కారణంగా గురువారం మృతిచెందాడు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండపాక మండలం ఎర్రవల్లికి చెందిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితుడు ఆరె నరసింహులుకు భార్య సత్తమ్మ, నలుగురు కూతుళ్లు ఉన్నారు. గ్రామంలో ఆయనకు 13 గుంటల వ్యవసాయ భూమి, ఇల్లు ఉన్నాయి. కాగా, తమ బంధువులకు పరిహారం అందగా, తమకు ఇంతవరకు ప్యాకేజీకానీ, ఇల్లు కానీ రాలేదని ఆరు నెలలుగా ఆయన మనస్తాపంతో ఉన్నాడు. ఇదే బెంగతో నరసింహులు గుండెపోటుతో మృతి చెందాడని ఆయన భార్య సత్తమ్మ గజ్వేల్ ఆర్డీఓకు రాసిన లేఖలో పేర్కొంది. భూమి, ఇల్లు కోల్పోయిన ఈ కుటుంబం ప్రస్తుతం సంగాపూర్లో అద్దెకు ఉంటోంది. -
వికటించిన ప్రయోగం: హెలికాప్టర్ తయారీ.. బ్లేడ్ పడి వ్యక్తి మృతి
ముంబై: విమానయానం ఇంకా సామాన్యులకు చేరువకాలేదు. ఆశగా ఆకాశంలోకి చూడటమే తప్ప.. ఆ రెక్కల విహంగంలో ఎక్కి ప్రయాణించడం నేటికి కూడా సామాన్యుడికి తలకు మించిన భారమే. ఈ క్రమంలో ఓ వ్యక్తి తానే హెలికాప్టర్ను తయారు చేద్దామని భావించాడు. కానీ దురదృష్టం కొద్ది.. దాని బ్లేడ్ అతడి మీద పడి మరణించాడు. ఈ విషాదకర సంఘటన మహారాష్ట్ర యావత్మాల పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. మహగావ్ తాలుకా ఫుల్సవంగా గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ షేక్ ఇబ్రహీం అనే వ్యక్తి మెకానిక్గా పని చేసుకుంటూ ఉండేవాడు. అతడికి చిన్నప్పటి నుంచి విమానాలు, గాల్లో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. ఈ క్రమంలో ఇబ్రహీం తానే సొంతంగా ఒక హెలికాప్టర్ తయారు చేయాలని భావించాడు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇబ్రహీం హెలికాప్టర్ను పరీక్షిస్తుండగా.. దానిలో తలెత్తిన లోపం వల్ల బ్లేడ్ అతడి తలపై పడింది. తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతుండగానే ఇబ్రహీం మృతి చెందాడు. -
వ్యాక్సిన్ సెంటర్లో పోలీసుల ఓవర్ యాక్షన్, యువకుడి ఆత్మహత్య
లక్నో: వ్యాక్సిన్ సెంటర్లో వివాదం విషాదాన్ని నింపింది. పోలీసులు తనను అవమానించి, దాడి చేశారనే క్షణికావేశంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్, బాగ్పట్ జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అయిదుగురు పోలీసులపై కేసు నమోదైంది. బాధితుల సమాచారం ప్రకారం పశ్చిమ యూపీ జిల్లాలోని ఒక టీకా కేంద్రంలో పోలీసుల ఓవర్ యాక్షన్ వివాదానికి తెర తీసింది. ఎలాంటి కారణంగా లేకుండానే టీకా కేంద్రంలోకి వెళ్లనీకుండా బాధిత యువకుడిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వివాదం మొదలైంది. మెడికల్ సిబ్బంది వ్యాక్సీన్ తీసుకునేందుకు అతని పేరు పిలిచినా లోనికి వెళ్లనీయకుండా అడ్డుపడి, అతనిపై దాడి చేసి కొట్టారు. సోమవారం మధ్యాహ్నం బాగ్పట్లోని టీకా కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి తోడు సంఘటన అనంతరం పోలీసులు ఇంటికి వెళ్లి మళ్లీ ఆ యువకుడిపై దాడి చేశారు. అడ్డొచ్చిన బాధితయువకుడి తల్లిపై కూడా దాడి చేశారు. దీంతో ఈ అవమానాన్ని తట్టుకోలేని యువకుడు గ్రామానికి సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఉసురు తీసుకున్నాడు. పోలీసులు తన కొడుకును టీకా కేంద్రంలోకి అనుమతించకపోవడంతో ఘర్షణ మొదలైందని బాధితుడి తండ్రి ఆరోపించారు. పోలీసులు తన కొడుకును చుట్టుముట్టి, దారుణంగా కొట్టారని, ఆ తరువాత ఇంటికి వచ్చి తనపై భార్యపై కూడా దాడి చేశారని వాపోయాడు. దీంతో భయపడి తన కొడుకు పారిపోయి చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడని కన్నీంటి పర్యంతమయ్యాడు. మరోవైపు బాధితుల ఫిర్యాదు మేరకు పదిమంది పోలీసులను విధులనుంచి తొలగించామనీ, బాగ్పట్ పోలీసు అధికారి అభిషేక్ సింగ్ తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతోందని, విచారణ అనంతరం దోషులపై కఠినచర్యలు తీసుకుంటామని, రు. -
16 ఏళ్ల నిర్లక్ష్యం.. పోయిన ప్రాణం
సాక్షి, జగిత్యాల: జిల్లా వెల్గటూరు మండలం పాత గూడూరు గ్రామానికి చెందిన మల్లవేని రాజు (35) గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ట్రాక్టరు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య స్వప్న, కూతురు అవిఘ్నయ(2) ఉన్నారు. ఈ నెల 13న విధుల్లో భాగంగా గ్రామానికి చెందిన ఓ కౌలు రైతు వ్యవసాయ భూమిలో పనికి వెళ్లాడు. అయితే ఆ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ నుంచి స్తంభానికి విద్యుత్ లైన్ ఉంది. ఎన్నో ఏళ్లుగా తీగలు వేలాడుతూ ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారు పట్టించు కోలేదు. దీంతో భూమి యజమాని తాత్కాలికంగా కర్రను సపోర్టుగా పాతాడు. పొలంలో రాజు ట్రాక్టరుతో పని చేస్తుండగా.. వేగంగా వీచిన గాలులకు కర్ర కింద పడిపోవడంతో ట్రాక్టరుకు తగిలిన తీగలు రాజుకు చుట్టుకుపోయాయి. దీంతో తీవ్ర విద్యుత్షాక్కు గురైన రాజు అక్కడికక్కడే చనిపోయాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే తన భర్త చనిపోయాడని రాజు భార్య స్వప్న ఆరోపిస్తోంది. 16 ఏళ్ల నుంచి ఆ సమస్య ఉందని రాజు సోదరుడు లక్ష్మణ్ చెప్పాడు. ఇదే ప్రాంతంలో 16 ఏళ్ల క్రితం వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి నాలుగు గేదెలు చనిపోయినా విద్యుత్ సిబ్బంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్యను పట్టించుకోలేదు. చదవండి: మూగజీవాలపై యమపాశం -
నిరుద్యోగి సునీల్ మృతి, గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్యాయత్నం చేసిన నిరుద్యోగి బోడ సునీల్ నాయక్.. నిమ్స్లో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఏడేళ్లు అవుతున్నా ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ప్రకటించడం లేదని ఆవేదన చెంది మార్చి 27న సునీల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి విదితమే. పురుగుల మందు తాగిన సునీల్ను విద్యార్థులు.. ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సునీల్ మరణించాడు. సునీల్ స్వస్థలం వరంగల్ జిల్లా గూడూరు మండలం గుండెంగ సోమ్లా తండా. గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత సునీల్ మృతదేహాన్ని నిమ్స్ నుండి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. గాంధీ ఆసుపత్రికి పెద్ద ఎత్తున చేరుకున్న బీజేపీ నేతలు, విద్యార్థులు, సునీల్ బంధువులు మార్చూరి ముందు ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి.. సునీల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భారీగా మోహరించిన పోలీసులు.. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేశారు. కేసీఆర్పై కేసు నమోదు చేయాలి: బండి సంజయ్ సునీల్ నాయక్ కుటుంబాన్ని గాంధీ ఆసుపత్రి వద్ద రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, సునీల్ నాయక్ది ఆత్మహత్య కాదని.. ఇది కేసీఆర్ సర్కార్ హత్య అంటూ ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకునే ముందు సునీల్.. కేసీఆర్ పేరు ప్రస్తావించాడన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదు కాబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. కేసీఆర్పై కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు తొందరపడి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఉద్యోగాలు కల్పిస్తామని బండి సంజయ్ అన్నారు. -
ప్రాణం తీసిన పంచాయితీ తీర్పు
తరిగొప్పుల: పల్లెల్లో పెద్ద మనుషులు ఇచ్చే తీర్పులు మనుషుల ప్రా ణాలు బలికొంటున్నా యి. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం వాల్యా తండాకు చెందిన బానోతు రాజు (22), అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం ఇద్దరూ ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో వారి కోసం సదరు వివాహిత భర్త, బంధువులు వెతకగా.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బస్టాండ్లో దొరికారు. అనంతరం గ్రామంలో పెద్ద మనషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా రూ.20 లక్షలు సదరు వివాహిత భర్తకు రాజు చెల్లించేలా తీర్మానించారు. దీంతో మనస్తాపం చెందిన రాజు.. అదేరోజు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
వ్యాక్సిన్ రెండో డోసు : క్షణాల్లో విషాదం
సాక్షి, ముంబై: ఒకవైపు దేశంలో కరోనా వైరస్ అంతానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందన్న ఆందోళన దేశ ప్రజలను మరింత వణికిస్తోంది. అయినా వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలామంది ఒకింత భయపడుతున్న తరుణంలో మహారాష్ట్రలో వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకొన్న కొద్ది సేపటికే ఒక వ్యక్తి మరణించడం కలకలం రేపింది. థానే జిల్లా భివాండిలోని ఆసుపత్రిలో కోవిడ్-19 వ్యాక్సిన్ రెండవ మోతాదును ఇచ్చిన కొద్దిసేపటికే 45 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక వైద్యుడి డ్రైవర్గా పనిచేస్తున్న సుఖ్దియో కిర్దిట్ నిన్న (మంగళవారం) ఉదయం 11 గంటల సమయంలో వ్యాక్సిన్ డోస్ స్వీకరించాడు. కొద్దిసేపటి తర్వాత కళ్లు తిరుగుతున్నట్టు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మూర్ఛపోయాడు. వెంటనే అధికారులు కిర్దిట్ను సమీపంలోని ఐజీఎం ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ప్రకటించారన్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత కిర్దిట్ మరణానికి కారణం తెలుస్తుందని భివాండి నిజాంపురా మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్యం ఆఫీసర్ డాక్టర్ కేఆర్ ఖరత్ తెలిపారు. కిర్డిట్ మెడికల్ హిస్టరీ, ఇతర రికార్డులను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కాగా వ్యాక్సినేషన్ రెండో దశలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కోవిడ్-19 వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రంట్లైన్, ఆరోగ్య కార్యకర్తలకు మొదటి దశలో వ్యాక్సిన్ను అందించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తగా జనవరి 28 న కిర్దిట్ వ్యాక్సిన్ మొదటి మోతాదు తీసుకున్నారు. -
దారుణం: భార్య, పిల్లలు చూస్తుండగానే..
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భామిని మండలం లోహరజోల గ్రామంలో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. కుమారస్వామి అనే వ్యక్తి భార్య పిల్లలతో కలిసి బైక్పై పర్లాకిమిడి వెళ్తుండగా, బైక్ను అడ్డగించిన నిందితుడు.. భార్య, పిల్లులు చూస్తుండగానే కుమారస్వామిని కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపాడు. పరారైన నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదవండి: వేధింపులకు తాళలేక టిక్టాక్ స్టార్ ఆత్మహత్య -
యువకుడి ప్రాణం తీసిన ఫోన్ సిగ్నల్
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రిజిల్లా కొత్తగూడెంలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫోన్ సిగ్నల్ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన ఈసం కృష్ణ(22) తన స్మార్ట్ ఫోన్ లో త్రీజీ సిగ్నల్ సరిగా రాక పోవడంతో సిగ్నల్ కోసం పక్కనే ఉన్న గొరకలమడుగు గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఓ చింత చెట్టు కింద సిగ్నల్ రావడంతో దాని కింద నిల్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. చదవండి: జూరాలకు పోటెత్తిన వరద ఉధృతి.. అప్పటికే అక్కడ భారీ వర్షం పడుతుండటంతో అక్కడే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగుపడడంతో కృష్ణ అక్కడికక్కడే మరణించాడు. శంభునిగూడెం గ్రామంలో త్రీజీ సిగ్నల్ సరిగా రాదు. దీంతో ఆ గ్రామానికి చెందిన వారంతా సిగ్నల్ కోసం గొరకలమడుగు గ్రామానికి వెళుతుంటారు. చాలా మంది యువకులు చాటింగ్ కోసం ఎక్కువగా ఆ చెట్టు కిందకే వెళుతుంటారు. సిగ్నల్స్ కోసం వెళ్లిన కృష్ణ పిడుగుపాటుకు గురై మరణించడం స్థానికంగా విషాదాన్ని నింపింది. చదవండి: శ్రీశైలం చేరిన కృష్ణమ్మ! -
కరోనా రోగి ఆత్మహత్య : కానీ అంతలోనే
సాక్షి, పట్నా : కరోనా వైరస్ సోకిన వ్యక్తి (38) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న రోగి బీహార్లోని ప్రభుత్వ కేంద్రంలో సోమవారం సాయంత్రం ఉరి వేసుకుని చనిపోయాడు. అయితే ఆవేశం అనర్ధానికి మూలం అన్నట్టుగా.. చనిపోయిన కొద్ది క్షణాలకే అతనికి నిర్వహించిన తాజా పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో అతని బంధువుల తీరని విషాదంలో మునిగిపోయారు. కోవిడ్-19 నోడల్ అధికారి డాక్టర్ సంజీవ్ కుమార్ అందించిన సమాచారం ప్రకారం బాధిత వ్యక్తి జూన్ 15 న కరోనా అనుమానిత లక్షణాలతో పట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరాడు. అనంతరం కరోనా పాజిటివ్ రావడంతో అతనిని ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నారు. అయితే తనకు వ్యాధి నయం కాదనుకున్నాడో, ఏమో కానీ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని డాక్టర్ కుమార్ వెల్లడించారు. బీహార్లో కరోనా బారిన పడ్డ రోగి ఆత్మహత్యకు పాల్పడిన మొదటి ఘటన ఇది అని తెలిపారు. కాగా సోమవారం మరోసారి నిర్వహించిన పరీక్షల్లో వైరస్ నెగెటివ్ వచ్చిందని చెప్పారు. -
‘రోడ్డుపై మరణిస్తే చెత్త వ్యాన్లో తరలించారు’
లక్నో : రోడ్డుపై విగతజీవిగా పడిఉన్న వ్యక్తిని కరోనా వైరస్తో మరణించాడనే భయంతో మున్సిపల్ సిబ్బంది చెత్తను తరలించే వాహనంలో విసిరిపడేసిన ఘటన యూపీలోని బలరాంపూర్లో వెలుగుచూసింది. మొబైల్ ఫోన్లో ఈ అనాగరిక చర్యను కొందరు చిత్రీకరించడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. బలరాంపూర్కు చెందిన మహ్మద్ అన్వర్ (42) స్ధానిక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన క్రమంలో గేట్ వద్దే కుప్పకూలి మరణించారు. వీడియో ఫుటేజ్లో దృశ్యాల ఆధారంగా మృతదేహం కిందపడిఉండగా, పక్కనే వాటర్ బాటిల్ కనిపించింది. మృతదేహం వద్ద పోలీసులు ఉండగా, పక్కనే అంబులెన్స్ అందుబాటులో ఉన్నట్టు కనిపించింది. పోలీసుల ఎదుటనే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ముగ్గురు చెత్తను తరలించే వాహనంలోకి మృతదేహాన్ని విసిరిన ఘటన రికార్డయింది. ఈ ఘటన అమానుషమని బలరాంపూర్ పోలీస్ చీఫ్ దేవరంజన్ వర్మ పేర్కొన్నారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ చేపట్టిన అనంతరం దోషులపై కఠిన చర్యలు చేపడతామని అన్నారు. కరోనా వైరస్తో ఆ వ్యక్తి మరణించాడనే భయంతోనే మున్సిపల్ సిబ్బంది ఈ చర్యకు పాల్పడిఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. పీపీఈ కిట్స్ ధరించి మృతదేహాన్ని అంబులెన్స్లో తరలించాల్సి ఉందని అన్నారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది తీరు సరైంది కాదని తప్పుపట్టారు. దీనిపై సీనియర్ అధికారులతో విచారణ చేపట్టాలని ఆదేశించామని వెల్లడించారు. కాగా అన్వర్ మరణానికి కారణమేంటి, ఆయనకు కరోనా వైరస్ సోకిందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. చదవండి : ‘ఇలాగైతే మళ్లీ లాక్డౌన్’ -
మహమ్మారి మందు తాగి మృత్యువాత..
చెన్నై : కోవిడ్-19 వైరస్కు వ్యాక్సిన్, చికిత్సను కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో తమిళనాడులోని బయోటెక్ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి కోవిడ్-19 చికిత్స కోసం తాము కనుగొన్న దగ్గు మందు ఫార్ములాను సేవించి మృత్యువాత పడిన ఘటన వెలుగుచూసింది. కరోనా వైరస్కు మందును కనుగొనే క్రమంలో బయోటెక్ కంపెనీ జీఎంగా పనిచేసే శివనేసన్, యజమాని డాక్టర్ రాజ్కుమార్లు కోవిడ్-19 చికిత్సకు ఉపయోగించేందుకు తాము కనుగొన్న దగ్గు మందు కాంబినేషన్ ఫార్ములాను సేవించారు. ఈ ద్రావకాన్ని తాగిన వెంటనే వారిద్దరూ శ్వాససంబంధిత సమస్యలతో బాధపడగా సమీప ఆస్పత్రికి తరలించారు. శివనేసన్ కాంబినేషన్ మందును అధిక డోస్ తీసుకోవడంతో ప్రాణాలు కోల్పోగా, రాజ్కుమార్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి : ఎస్బీఐ ఉద్యోగికి కరోనా: ఆఫీసు మూసివేత -
ప్రాణాలు తీసిన డ్రంక్ అండ్ డ్రైవ్
-
చార్జింగ్లో ఉన్న మొబైల్ పేలి యువకుడి మృతి
స్మార్ట్ఫోన్ చార్జింగ్లో ఉండగా పేలిన మొబైల్ ఫోన్ ఒకయువకుడి ప్రాణాలుతీసింది. భవన నిర్మాణ కార్మికుడైన కునా ప్రధాన్ (22) తన ఫోన్కు చార్జింగ్ పెట్టి, మరో ముగ్గురు కార్మికులతో పాటు గదిలో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాలోని పారాడిప్లో ఆదివారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. పారాడిప్ పోలీస్ స్టేషన్ అధికారిక ఆర్కె సమల్ అందించిన సమాచారం ప్రకాచరం చార్జింగ్లో ఉన్న స్మార్ట్ఫోన్ ఒక్కసారిగా పేలడంతో ప్రధాన్ అక్కడిక్కడే చనిపోయాడు. సమాచారం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టంకోసం ఆసుపత్రికి తరలించారు. బాధితుడిని నాయగర్ జిల్లాలోని రాణ్పూరి ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ట్రక్ యజమానుల సంఘం చేపట్టిన పారదీప్లో ఆలయ నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. -
వార్డు సభ్యునిగా పోటీ చేసేందుకు పంతం.. వ్యక్తి మృతి
సాక్షి, తుర్కపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుల పోటీ విషయంలో తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారం గ్రామ పంచాయతీ పరిధి పెద్ద తండాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పెద్ద తండా కింద రెండు వార్డులు ఉన్నాయి. తండాకు చెందిన అజ్మీరా రవినాయక్ (28) ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి సోదరుడి కుమారుడైన శ్రీకాంత్ను రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే వార్డుపై రవినాయక్ దాయాదులైన శ్రీనివాస్ నాయక్, నరేశ్లు ఆసక్తి కనబరిచారు. దీంతో నరేశ్ తన సోదరుడి కుమారుడు మాల్నాయక్తో వార్డు సభ్యుడిగా పోటీ చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. రెండు కుటుంబాల ఆసక్తి ఒకే వార్డుపై పడటంతో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి లక్ష్మణ్ నాయక్, నరేశ్లు వారి కుటుంబ సభ్యులతో కలసి రవినాయక్ ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. రవినాయక్ తన పక్కన ఉన్న కర్రతో నరేశ్ తలపై గట్టిగా కొట్టడంతో కింద పడిపోయాడు. కాసేపటికి నరేశ్ లేచి తన ఎదురుగా ఉన్న రవినాయక్ మర్మాంగంపై గట్టిగా తన్నడంతో అతడు కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అతడిని కుటుంబ సభ్యులు, బంధువులు కలసి మాదాపూర్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. -
కొంపముంచిన దావత్
కామారెడ్డి క్రైం: అప్పటిదాకా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న ఓ యువకుడిని బావి రూపంలో మృత్యువు కబళించింది. మద్యం మత్తులో కాలు జారి బావిలో పడిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహం 20 గంటలపాటు గా లించాక లభించింది. ఈ సంఘటన కామారెడ్డిలో గురువారం కలకలం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ్గల్లీకి చెం దిన మైసరి పార్వతీ–మురళీకి ఇద్దరు సంతానం. వీరిలో పెద్దవాడు రాజేష్(26)కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో రెడిమేడ్ దుస్తుల దుకాణం పెట్టుకుని కొంత కాలం నడిపించి లాభాలు సరిగా రాకపోవడంతో ఆ వ్యాపారాన్ని వదులుకున్నాడు. మంగళ వారం రాత్రి రాజేష్, అతడి స్నేహితులు కలిసి మ ద్యం సేవించేందుకు పెద్ద చెరువు సమీపంలోకి వెళ్లారు. చెరువు కట్ట పక్కనే ఉన్న మత్తడి వద్ద వ్య వసాయ బావికి కొద్ది దూరంలో మద్యం తాగారు. సుమారు 11 గంటల ప్రాంతంలో బావి పక్కనే ఉన్న దారి గుండా తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయాడు. సమాచారం తెలుసుకు న్న రాజేష్ బంధువులు, స్నేహితు లు, స్థానికులు పె ద్ద ఎత్తున బావి వద్దకు చేరుకున్నారు. మృ తదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బావిలోతుగా ఉండి మృతదేహం లభించ లేదు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బుధవారం ఉదయం నుంచి బావిలోని నీటిని మోటార్ల ద్వారా ఖాళీ చేయించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రాజేష్ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని పట్టణ ఎస్హెచ్వో రామక్రిష్ణ తెలిపారు. -
కడచూపు దక్కింది
బతుకు దెరువు కోసం సరిహద్దులు దాటివెళ్లాడు. అక్కడే పనిచేస్తూ హఠాత్తుగా గుండెనొప్పికి గురై మృతి చెందాడు. పేదరికం కావడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తెచ్చుకోలేని పరిస్థితి ఆయన కుటుంబానిది. కడచూపైనా దక్కుతుందో లేదో అని భార్య, పిల్లలు తీవ్ర ఆవేదన చెందారు. అయితే అక్కడి యాదవుల చేయూతతో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులకు కడచూపు దక్కేలా చేశారు. కాశినాయన : జీవనోపాధి కోసం కువైట్ వెళ్లి మృతి చెందిన చలమల వెంకటేశ్వర్లు(45) కుటుంబీకులకు కడచూపు దక్కింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని నరసన్నపల్లెకు చెందిన వెంకటేశ్వర్లు బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు. మూన్నెల్ల కిందట తండ్రి మరణిస్తే స్వగ్రామానికి వచ్చి వెళ్లారు. నెల కిందట మళ్లీ వెళ్లాడు. గత మంగళవారం కుమార్తెతో ఫోన్లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. తల్లికి ఫోన్ ఇవ్వాలని కోరుతూ అక్కడే కుప్పకూలి మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖానికి గురయ్యారు. చేయూతనిచ్చిన యాదవ పెద్దలు విషయాన్ని స్థానిక వైఎస్సార్సీపీ నేత కరెంట్ రమణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి నియోజకవర్గానికి చెందిన పలువురు యాదవులను ఆ కుటుంబానికి సాయమందిచాలని కోరా రు. పలు ప్రాంతాలకు చెందిన యాదవ ప్రముఖులు దాదాపు చందాల రూపంలో రూ.లక్ష వసూలు చేశారు. పోస్టుమార్టం పూర్తి చేయించి మృతదేహాన్ని ఇండియాకు తరలించేదుకు శరవేగంగా పనులు పూర్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నానికి స్వగ్రామానికి వెంకటేశ్వర్లు మృతదేహం చేరింది. కూలి కోసం వెళ్లి మరణించిన భర్త, తండ్రిని చూసి ఆయన భార్య దుగ్గమ్మ, ఇద్దరు కుమార్తెల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. బాధిత కుటుంబానికి స్వాంతన కుటుంబానికి పెద్ద దిక్కు వెంకటేశ్వర్లు మృతితో ఆయన భార్య, కుమార్తెలు దిక్కులేని వారుగా మారారు. విషయం తెలుసుకున్న కువైట్ యాదవ సంఘం రూ.లక్ష, కువైట్ ఎన్ఆర్ఐ సంఘం రూ. 50 వేలను అందించేందుకు ముందుకు వచ్చాయి. త్వరలోనే ఈ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేస్తారని వైఎస్సార్సీపీ నాయకులు కరెంట్ రమణారెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు బద్వేలు కౌన్సిలరు గోపాలస్వామి, గోపవరం సింగిల్విండో అధ్యక్షుడు సుందరరామిరెడ్డి, జెడ్పీటీసీ వెంకటసుబ్బయ్య ఆచారి, ఎంపీపీ పెద్ద రామ య్య, నాయకులు జగన్ మోహన్రెడ్డి, నాగారెడ్డి రామసుబ్బారెడ్డి, రాజుగాళ్ల వెంకటరెడ్డి తదితరులు వెంకటేశ్వర్లు మృతదేహానికి నివాళులర్పించారు. -
ప్ర్రాణాలు తీస్తున్న క్వారీ పేలుళ్లు
-
చేతిలో సెల్ఫోన్ పేలి వ్యక్తి దుర్మరణం
-
ఇంటి పైకప్పు మరమ్మతు చేస్తుండగా..
బత్తలపల్లి: ముష్టూరు గ్రామానికి చెందిన కుమ్మర కాటమయ్య (68) ఇంట్లోనే చిల్లరకొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు రంధ్రం పడింది. కాటమయ్య శుక్రవారం మరమ్మతు చేయడానికి ఇంటిపైకెక్కాడు. విద్యుత్ ప్రసరిస్తున్న సర్వీస్వైరు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ఆయన్ని కిందకు తీసుకొచ్చి సపర్యలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతి చెందాడు. ఎస్ఐ హారున్బాషాకు సమాచారం అందించారు. మృతునికి భార్య అంజినమ్మ, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
పండుగకు ముందే పరలోకాలకు..
- వేగంగా దూసుకొచ్చి ఢీకొన్న కారు - ఎగిరి అల్లంత దూరంలో పడ్డ స్కూటరిస్టు - విధులు ముగించుకొని ఇంటికొస్తూ ప్రాణాలు కోల్పోయిన వైనం మరో రెండ్రోజుల్లో రంజాన్ పండుగ.. పిల్లలకు కొత్త బట్టలు తెద్దామంటే ఇంకా జీతం రాలేదు. కనీసం అమ్మానాన్న వద్దకెళ్లి డబ్బులు తెచ్చుకుందామని వెళ్లిన అతనికి అదే ఆఖరి ప్రయాణమవుతుందని కలలో కూడా ఊహించి ఉండడు. మృత్యువులా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో స్కూటర్పై వెళ్తున్న అతను ఎగిరి అల్లంత దూరంలో పడ్డాడు. ప్రాణాలు కోల్పోయాడు. అమ్మానాన్నకు ఒక్కగానొక్క కుమారుడు, ముగ్గురు పసిబిడ్డలకు తండ్రి అయిన అతని అకాల మృతి రెండు కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కలచివేసింది. - గార్లదిన్నె (శింగనమల) హైదరాబాద్-బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిలోని గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలోని అంబేడ్కర్ సర్కిల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్లూరుకు చెందిన అల్లిపీరా(42) దుర్మరణం చెందారు. ఆయన గుత్తిలోని రైల్వే శాఖలో డిజిల్ షెడ్లో ఉద్యోగం చేసేవారు. అనంతపురంలో కాపురముంటూ ప్రతి రోజూ గుత్తికి వెళ్లొచ్చేవారు. రెండు కుటుంబాలకు పెద్దదిక్కుగా... అటు అమ్మానాన్న కల్లూరులో ఉంటుండగా, ఇటు భార్యా, ముగ్గురు పిల్లలతో కలసి అల్లిపీరా అనంతపురంలో నివసిస్తున్నారు. ప్రతి రోజూ డ్యూటీకి వెళ్లొచ్చేవారు. రోజులాగే శుక్రవారం ఉదయం 7 గంటలకే డ్యూటీకి వెళ్లిన ఆయన సాయంత్రం విధులు ముగించుకుని బైక్లో అనంతపురం తిరుగుప్రయాణమయ్యారు. అమ్మానాన్నను చూసొద్దామనుకుని... గుత్తి-అనంతపురం మార్గంలోని కల్లూరులో ఉంటున్న అమ్మానాన్న రహమత్, మునాఫ్ను చూసొద్దామనుకున్న ఆయన ఇంటికెళ్లారు. ఆ సమయంలో తండ్రి మాత్రమే ఇంట్లో ఉండగా, తల్లి పక్కింటికి వెళ్లి ఉన్నారు. ఆమె వచ్చేలోగా బైక్కు పెట్రోల్ పోయించుకువస్తానంటూ వెళ్లిన ఆయన అంబేడ్కర్ సర్కిల్లోని కల్లూరు రోడ్డు దాటుతుండగా అనంతపురం నుంచి గుత్తి వైపునకు వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అల్లిపీరా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే వృద్ధ తల్లిదండ్రులతో పాటు భార్యా పిల్లలు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న అల్లిపీరాను చూడగానే గుండెలు పగిలేలా రోదించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. బైక్ అదుపు తప్పి... యాడికి (తాడిపత్రి రూరల్) : యాడికి మండలం బొగాలకట్ట గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు పమ్రాదంలో పుప్పాల గ్రామానికి చెందిన నరసింహులు(35) అనే రైతు మృతి చెందినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. పుప్పాల నుంచి ఆయన బైక్లో రాయలచెరువుకు బయలుదేరగా మార్గమధ్యంలో బైక్ అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందినట్లు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య తులసమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బ్యాంకులో రుణం కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని మృతుని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
కాటేసిన కరెంట్
బొమ్మనహాళ్ (రాయదుర్గం) : బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో బోయ నరసింహులు(40) అనే ప్రైవేట్ విద్యుత్ కార్మికుడు బుధవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఉదయమే బాత్రూంలోకి వెళ్లిన ఆయన ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురై కిందపడిపోయాడన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వివరించారు. మృతునికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 43-ఉడేగోళంలో మేస్త్రీ.. కణేకల్లు : మండలంలోని 43-ఉడేగోళంలో ఎర్రగుంటలోని కెనిగుంటకు చెందిన వడ్డే హనుమంతరాయుడు(26) అనే మేస్త్రీ బుధవారం విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు ఎస్ఐ యువరాజు తెలిపారు. ఎర్రిస్వామి అనే వ్యక్తి ఇంటి నిర్మాణ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య రోజా, రెండేళ్ల కూతురు ఉన్నారు. -
పిడుగుపాటుకు గొర్ల కాపరి మృతి
కళ్యాణదుర్గం రూరల్ : కళ్యాణదుర్గం రూరల్ మండలం తూర్పుకోడిపల్లి సమీపంలో పిడుగుపడి అదే గ్రామానికి చెందిన బలికొండప్ప కుమారుడు ఓబుళపతి(35) అనే గొర్ల కాపరి గురువారం మృతి చెందినట్లు రూరల్ ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. ఓబుళపతి మేత కోసం మేకలను పొలాల వద్దకు తోలుకెళ్లాడన్నారు. సాయంత్రం ఇంటికి తిరిగొస్తుండగా వర్లి వ్యవసాయ పొలాల వద్ద ఒక్కసారిగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందినట్లువవివరించారు. పరిసరాల్లో పని చేసే వారు గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా. అప్పటికే అతను చనిపోయినట్లు పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతునికి ఒక కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. -
నిండు ప్రాణం తీసిన కాల్మనీ అరాచకాలు
-
వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి
-
లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
కణేకల్లు(రాయదుర్గం) : కణేకల్లు మండలం పెనకలపాడులో గురువారం రాత్రి లారీ ఢీకొని అదే గ్రామానికి చెందిన కృష్ణమోహన్(30) మృతి చెందినట్లు ఎస్ఐ యువరాజు తెలిపారు. కృష్ణమోహన్ తన స్నేహితులతో కలసి మల్లికార్జున ఇంటి వద్ద మాట్లాడుకొంటూ నిలబడి ఉండగా లారీ విపరీతమైన వేగంతో అతనిపై దూసుకెళ్లిందన్నారు. దీంతో అతను అక్కడికక్కడే మరణించినట్లు వివరించారు. లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఘటన జరిగిందని పేర్కొన్నారు. మృతుని భార్య లలితమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
రైలు కిందపడి వ్యక్తి మృతి
గుంతకల్లు : స్థానిక రైల్వే జంక్షన్ సమీపంలోని సౌత్ కేబిన్ వద్ద డోన్కు వెళ్లే రైలు మార్గంలో(442/4 కిలోమీటర్ వద్ద) ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. మృతుని చొక్కా జేబులో లభ్యమైన రేషన్కార్డు నకలు ఆధారంగా అతడిని పట్టణంలోని బెంచికొట్టాలకు చెందిన రహంతుల్లా(50)గా గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కార్పెంటర్ పని చేసే రహంతుల్లాకు తాగుడు అలవాటు తప్ప ఎవరితోనూ గొడవలు లేవని ఆయన భార్య బేగం, కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇది ఆత్మహత్యా, ప్రమాదమా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా: యువకుడి దుర్మరణం
చిలమత్తూరు : కర్ణాటకలోని బాగేపల్లి సమీపంలోగల దేవర గుడ్డపల్లి(గడిదం) చెరువులో ట్రాక్టర్ బోల్తా పడి అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కందూరుపర్తికి చెందిన డ్రైవర్ గంగాధర్(27) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కందూరుపర్తికి చెందిన నిడిమామిడమ్మ, ఆదినారాయణప్ప కుమారుడు గంగాధర్ జేసీబీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. పని నిమిత్తం బాగేపల్లి సమీపంలోని గడిదం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ట్రాక్టర్ను డ్రైవ్ చేసుకుంటూ చెరువులో వస్తుండగా అదుపు తప్పి గుంతలో బోల్తా పడటంతో మరణించినట్లు వివరించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. బాగేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
శింగనమల : మండల పరిధిలోని గార్లదిన్నె సమీపంలో హైదరాబాద్-బెంగుళూరు హైవే రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తి కారు ఢీకొన్న ప్రమాదంలో మరణించారు. మండలంలోని రఘనాథపురం గ్రామానికి చెందిన సూర్యనారాయణరెడ్డి(45) గార్లదిన్నె సమీపంలోని హైవే రోడ్డు పక్కన హోటల్ నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో హోటల్ నుంచి అటువైపు వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా అనంతపురం నుంచి హైదరాబాద్కు వెళ్లుతున్న కారు ఢీకొంది. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. -
ప్రాణాన్ని బలిగొన్న ఓవర్టేక్
ఎదురుగా దూసుకొచ్చిన రెండు వాహనాలు దారిలేక బైక్ను రోడ్డు పక్కకు తిప్పిన యువకుడు చెట్టు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి భార్య, కుమారుడికీ గాయాలు ఆత్మకూరు : ఓవర్ టేక్ ఒక ప్రాణాన్ని బలిగొంది. మరో ఇద్దరిని గాయాలపాలు చేసింది. ఆత్మకూరు సమీపంలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. రాయదుర్గం మండలం జుంజురాంపల్లికి చెందిన ఏకాంత్కుమార్ (35) తన భార్య సుశీలమ్మ, రెండేళ్ల కుమారుడితో కలిసి డ్రామా చూసేందుకని మంగళవారం అనంతపురంలోని బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంలో వెళ్లాడు. బుధవారం తిరిగి స్వగ్రామానికి బయల్దేరాడు. ఆత్మకూరు మండల కేంద్రం సమీపానికి రాగానే ఎదురుగా రెండు వాహనాలు వచ్చాయి. ముందుకు పోవడానికి అవకాశం లేకపోవడంతో రోడ్డు పక్కకు తిప్పాడు. అంతే అదుపుతప్పి చెట్ల పొదల్లోకి ద్విచక్రవాహనం వేగంగా దూసుకెళ్లింది. తలకు బలమైన గాయం కావడంతో ఏకాంత్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న సుశీలమ్మకు తీవ్రగాయాలయ్యాయి. మధ్యలో కూర్చున్న కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశం కళ్యాణదూరం రూరల్ పరిధి కావడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
శింగనమల : లోలూరు క్రాస్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడి వివరాలు తెలియరాలేదు. 35 సంవత్సరాల వయసు కలిగిన ఈ వ్యక్తి నీలం రంగు జీన్స్ ప్యాంటు, పసుపుపచ్చగీతలు కలిగిన నీలం రంగు షర్టు ధరించాడు. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ నబీరసూల్లు ఉదయాన్నే సంఘటన స్థలానికి చేరుకున్నారు. జనం కూడా గుమిగూడారు. దీంతో కొంతమేర వాహనాలు నిలిచిపోయాయి. స్కూటర్ను ఢీకొన్న కంటైనర్ ప్రమాద ఘటనలో జనం గుమిగూడి ఉండగా ఉదయం ఏడుగంటల సమయంలో బొలెరో వాహనం ముందు ఉన్న స్కూటర్ను మైసూరు నుంచి ఉత్తరప్రదేశ్కు వెళుతున్న కంటైనర్ వాహనం ఢీకొంది. స్కూటర్లోని వ్యక్తికి, బొలెరోలో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారు ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్సచేయించుకుని వెళ్లినట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కళ్యాణదుర్గం : కొత్తూరు గ్రామానికి చెందిన గొల్ల హనుమంతరాయుడు (25) శుక్రవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు... మేకలను మేత కోసం గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ తోట వద్దకు తీసుకెళ్లాడు. చెట్టు ఎక్కి కొడవలితో లేత ఆకు కొమ్మలను నరికేందుకు ఉపక్రమించాడు. ఆ చెట్టుపై 11 కేవీ విద్యుత్ లైన్ వెళ్లింది. దీన్ని గమనించకుండా కొడవలిని పైకి ఎత్తిన సమయంలో వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడికి తొమ్మిది నెలల కిందటే వివాహమైంది. ప్రస్తుతం భార్య నాలుగు నెలల గర్భిణి. ప్రమాద విషయం తెలియడంతో భార్య, తండ్రి, సోదరుడు, సోదరి కన్నీరుమున్నీరుగా విలపించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా
కుందుర్పి : కుందుర్పి–మాయదార్లపల్లి మార్గంలో ఓ ట్రాక్టర్ శనివారం అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో శెట్టూరు మండల అనుంపల్లికి చెందిన సోమనాథ్(32) మృతి చెందగా, అదే మండలం రంగయ్యపాళ్యం చెందిన లక్ష్మణమూర్తి, తిప్పేస్వామి తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సోమనాథ్ తన ఇంటి వద్ద పశువుల పాక కోసం అవసరమైన కట్టెల కోసం అనుంపల్లి, రంగయ్యపాళెం చెందిన ఆరుగురితో కలసి కర్ణాటకలోని మరదాసనపల్లెకు వెళ్లాడు. అక్కడ కట్టెలు కొనుగోలు చేసి స్వగ్రామానికి తీసుకువస్తుండగా మార్గమధ్యంలో కుందుర్పి సమీపంలోని కుంట వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడటంతో సోమనాథ్ అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఇంజిన్ కింద ఇరుక్కుపోయిన లక్ష్మణమూర్తిని చుట్టుపక్కల వారు గమనించి అతనితో పాటు తిప్పేస్వామిని రక్షించారు. మృతుడికి భార్య, ఒక కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఏ కష్టమొచ్చిందో..
కదిరి టౌన్ : ఏ కష్టమొచ్చిందో ఏమో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తి రైలుకింద పడి ప్రాణం తీసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కదిరి రైల్వేస్టేషన్కు ఫర్లాంగు దూరంలోని బ్రిడ్జి సమీపాన ట్రాక్పై ఓ వ్యక్తి తలపెట్టి పడుకున్నాడు. ఆ మార్గంలో వచ్చిన గుంతకల్లు- తిరుపతి ప్యాసింజర్ రైలు దూసుకెళ్లడంతో ఆ వ్యక్తి తల, మొండెం వేరయ్యాయి. ఈ భయానక దృశ్యాన్ని చూసేందుకు జనం తరలివచ్చారు. అయితే మృతుడి వివరాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పింఛన్ రాలేదని ఆగిన వృద్ధుడి గుండె
-
ఇరు వర్గాల ఘర్షణ.. వ్యక్తి మృతి
భీమవరం(పశ్చిమగోదావరి): ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక గెస్ట్హౌస్ రోడ్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. చినికి చినికి గాలి వానలా మారిన వివాదం ఒకరి పై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పరిస్థితిని అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. -
సెల్ఫోన్ చార్జింగ్ పెడుతూ..
సిరిసిల్ల: సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామంలో సెల్ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఓ వ్యక్తి మృతిచెందాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గిరామన్(55) తాపీ మేస్త్రీ. స్థానిక ఐకేపీ గోడౌన్లో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం సెల్ఫోన్కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతంతో మృతిచెందాడు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఆత్మకూరు : ఆత్మకూరు సమీపంలో బుధవారం లారీ ఢీకొన్న ప్రమాదంలో మల్లికార్జున (28) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన మల్లికార్జున బీటెక్ పూర్తి చేసి అనంతపురంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే స్వగ్రామమైన తిమ్మాపురంలో ఓ శుభకార్యానికి బుధవారం తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. ఆత్మకూరు దాటగానే కళ్యాణదుర్గం నుంచి వస్తున్న లారీ వీరిని ఢీ కొంది. క్షతగాత్రులను స్థానికులు ఆటోలో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మల్లికార్జున మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
హిందూపురం అర్బన్ : పట్టణంలోని కేఎల్ రోడ్డులో 35 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్టౌన్ ఏఎస్ఐ లోకేష్ తెలిపారు. ఆదివారం సాయంత్రం రోడ్డుపై అనిశ్చతగా పడి ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులైన ఉదయ్, గంగధరప్ప సాయంతో అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు చెప్పడంతో శవాన్ని మార్చురీలో భద్రపరిచారు. అతడి సమాచారం తెలిస్తే వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని ఏఎస్ఐ తెలిపారు. -
కంచన్బాగ్లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
హైదరాబాద్: వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని కంచన్బాగ్లో ఆదివారం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది. -
ఆటోను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి
అనకాపల్లి(విశాఖపట్నం): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జాతీయరహదారిపై కొప్పాడ వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న రమణ(45) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వరికోత మిషన్లో పడి వ్యక్తి మృతి
దుగ్గొండి(వరంగల్): వరికోత మిషన్లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా దుంగ్గొండి మండలం లక్ష్మీపురంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ తాల్లపల్లి సాంబయ్య(38) వరికోత మిషన్ సమీపంలో నిల్చొని ఉన్న సమయంలో అతన్ని గుర్తించని మిషన్ డ్రైవర్ అతని పై నుంచి మిషన్ను పోనిచ్చాడు. దీంతో అందులో పడ్డ సాంబయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. -
విషాదం మిగిల్చిన మొహర్రం
అనంతపురం సెంట్రల్ : మొహర్రం విషాదం మిగల్చింది. ఊరేగింపుగా వస్తున్న పీర్లను చూస్తుండగా గోడ కూ లి ఓ బాలుడు అక్కడికక్కడే మరణించ డం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిం ది. అనంతపురంలోని బాబానగర్లో సోఫియా, మహమ్మద్ రఫీ దంపతుల కుమారుడు షబ్బీర్ అలీ(8) పాత గోడ కూలి మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మొహర్రం పురస్కరించుకుని ఆదివారం రాత్రి పానకాల పూజ నిర్వహించారు. మరోవైపు కాలనీలోకి పీర్లు ఊరేగింపుగా వచ్చాయి. వాటిని అందరూ ఆసక్తిగా తిల కిస్తున్నారు. పీర్లను చూసేందుకు వీధిలోకి వచ్చిన అలీ ఓ ఇంటిపక్కన గోడ చాటున నిలబడ్డాడు. అంతలోనే గోడ కూలి రాళ్లు, మట్టి దిబ్బల కిం ద కూరుకుపోయాడు. స్థానికులు గుమనించి వెంటనే రాళ్లను తొలగిం చారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ అలీని స్థానిక సర్వజనాస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో కుటుంబంలో కన్నీరుమున్నీరయ్యారు. మహ్మద్ రఫీకి ఇద్దరు కుమారులు. షబ్బీర్ అలీ రెండో వాడు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదివేవాడు. -
చెరువులో పడి వ్యక్తి మృతి
దౌల్తాబాద్(మెదక్ జిల్లా): దౌల్తాబాద్ మండలం రాందాస్ చెరువులో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు దౌల్తాబాద్ గ్రామానికి చెందిన చాకలి నారాయణ(45)గా గుర్తించారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాటేసిన కరెంట్
పెనుకొండ రూరల్ : పరిగి మండలం కాలువల్లిలో మంగళవారం రాత్రి విద్యుదాఘాతానికి గురై బీరప్ప(22) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి పైనున్న గవాచి మూయడానికి వెళ్లిన సమయంలో విద్యుత్ తీగలు తగిలి అతను అక్కడికక్కడే ప్రాణాలొదిలినట్లు వివరించారు. -
రైలుకింద పడి వ్యక్తి మృతి
హిందూపురం అర్బన్ : పట్టణంలోని సోమందేపల్లి మండలం మండ్లి గ్రామానికి చెందిన అశ్వర్థప్ప(48) శనివారం గుడ్డం సమీపంలో రైలు కిందపడి మతి చెందాడు. రైల్వే ఎస్ఐ ప్రభాకర్ తెలిపిన మేరకు .. మతుడి భార్య మూడేళ్ల క్రితం చనిపోయింది. ఇతని కుమారులు కూడా బెంగళూరు ఉంటున్నారు. దీంతో ఒంటరిగా ఉండలేక జీవితంపై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
లెక్చరర్ మృతిపై పోలీసులకు ఫిర్యాదు
-
రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
హిందూపురం అర్బన్ : స్థానిక గుడ్డం సమీపంలోని 102/00100 కిలోమీటర్ల వద్ద మంగళవారం రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మతి చెందినట్లు రైల్వే ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. మతుడికి సుమారు 25 ఏళ్ల వయసు ఉంటుంది. చారల టీ షర్టు, లైట్ గ్రీన్బనియన్, డార్క్ బ్రౌన్ ప్యాంట్ వేసుకుని ఉన్నాడు. రైలు కింద పడి తల, కుడి కాలు తెగి పోయాయి. శవాన్ని స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ప్రభాకర్ చెప్పారు. -
విరేచనాలతో వ్యక్తి మృతి
ఓడీ చెరువు : ఓడీ చెరువు మండలంలోని పెద్దగుట్లపల్లి గ్రామానికి చెందిన తలారి నరసింహులు(55) విరేచనాలతో బాధపడుతూ మతి చెందాడు. బంధువుల వివరాల మేరకు.. వారం నుంచి విరేచనాలతో బాధపడుతూ కదిరి, బత్తలపల్లి, అనంతపురం ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించారు. పరిస్థితి విషమంగా మారడటంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మతి చెందినట్లు వారు తెలిపారు. అతడికి భార్య ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
యా అల్లా.. ఏ క్యా హోగయా
= పనికోసం వెళ్లి కానరాని లోకాలకు.. = బస్సులోంచి జారిపడటంతో మృత్యువాత = మర్తాడులో విషాదం.. వీధినపడ్డ కుటుంబం యా అల్లా.. ఏ క్యా హోగయా అంటూ కుటుంబ సభ్యులు రోదించిన తీరు కలచివేసింది. పని కోసమని వెళ్లిన వాడిని ఇలా కానరాని లోకాలకు తీసుకుపోతివా అంటూ విలపించారు. ఇక మాకు దిక్కెవరంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. గార్లదిన్నె వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్తాడుకు చెందిన కూలీ అల్లాబకాష్ దుర్మరణం చెందాడు. అతనో దినసరి కూలీ. పనికి వెళితే గానీ పూట గడవని పరిస్థితి. తెల్లవారుజామునే పని కోసం ఆర్టీసీ బస్సులో బయల్దేరిన అతను గమ్యస్థానం చేరుకోవడానికి కొద్ది నిమిషాల ముందే ప్రమాద రూపంలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాలిలా ఉన్నాయి. మర్తాడుకు చెందిన అల్లాబకాష్(30)కు తొమ్మిదేళ్ల కిందట తాడిపత్రికి చెందిన షబానాతో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అల్లా బకాష్ టమాట గ్రేడింగ్, ఇతర కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. మంగళవారం తెల్లవారుజామున పనికోసం ఆర్టీసీ బస్సులో గార్లదిన్నెకు బయల్దేరాడు. గార్లదిన్నె రైల్వే గేట్ సమీపంలోకి రాగానే అక్కడ గేట్ వేపడింది. దీంతో డ్రైవర్ బస్సు నిలిపేందుకు స్లో చేశాడు. ఈ సమయంలో అల్లాబకాష్ కదులుతున్న బస్సు నుంచి కిందకు దిగబోయి అదుపుతప్పి కిందపడ్డాడు. వెంటనే వెనుకచక్రం అతని తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ శ్రీనివాసులు, ఆర్టీసీ డీఎం బాల చంద్ర సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంటì పెద్ద దిక్కు కోల్పోవడంతో మృతుడు భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మర్తాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు కింద వృద్ధుడి మృతి
చెన్నేకొత్తపల్లి : చెన్నేకొత్తపల్లి మండలం ఎన్ఎస్ గేట్లో గుర్తు తెలియని ఓ వద్ధుడు రైలు కింద పడి మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం 9 గంటలకు వచ్చే రైలు కింద పడి మతి చెందినట్లు వివరించారు. మతుడికి 70 ఏⶠ్ల వయస్సు ఉంటుందని, తెల్లని పంచె, అంగీ ధరించి ఉన్నాడన్నారు. హిందూపురం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. -
రెండు లారీలు ఢీ : ఒకరి మృతి
ఒంగోలు : ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మలపాడు గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీలో తరలిస్తున్న పెద్ద గ్రానైట్ రాయి రహదారికి అడ్డంగా పడడంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్రేన్ను రప్పించి... బండరాయిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పుట్టిన బిడ్డను చూసేందుకు వెళ్తూ..
కదిరి అర్బన్ : మండల పరిధిలోని అలీపూర్తండా వద్ద శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొని గాండ్లపెంట మండలం కటారుపల్లికి చెందిన రవికుమార్(27) అనే యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన మేరకు వివరాలిలాఉన్నాయి. కటారుపల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వేమయ్య, పద్మావతిల ఏకైక కుమారుడు రవికుమార్. రెండేళ్లక్రితం కటారుపల్లిక్రాస్కుచెందిన హేమవతితో వివాహం జరిగింది. రవికుమార్ బెంగళూరులో డ్రైవర్పని, భార్య నర్సు ఉద్యోగం చేసుకుంటూ జీవించేవారు. హేమవతి శనివారం ఉదయం కదిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భార్య, కూతురును చూసేందుకు ద్విచక్రవాహనంలో బెంగూళూరు నుంచి రవికుమార్ వస్తున్నాడు. వాహనం అలీపూర్తండావద్దకు రాగానే వెనుక వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీ కొంది. దీంతో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడి మరణవార్త విన్న తండ్రి ఆస్పత్రిలోనే సృహ కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాడిపత్రిలో బాలుడు.. తాడిపత్రి: తాడిపత్రిలోని కంచాని లాడ్జి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని ఏటిగడ్డపాలెంకు చెందిన బాషు కుమారుడు మహమ్మద్గౌస్(16) మరణించినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. సీబీ రోడ్డులో బైక్పై వెళ్తూ కాలినడకన వెళ్తున్న శివారెడ్డి అనే వ్యక్తిని ఢీకొని కిందపడినట్లు చెప్పారు. అదే సమయంలో వచ్చిన ట్రాక్టర్ అతని కాళ్లపై వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు.వెంటనే అనంతపురం ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు వివరించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
లేపాక్షి : వినాయక చవితి నిమజ్జనంలో అపశ్రుతి నెలకొంది. మండల కేంద్రానికి చెందిన చాకలి క్రిష్టప్ప(40) అనే వ్యక్తి వినాయక విగ్రహాల ఊరేగింపులో ఉన్నఫళంగా మృతిచెందాడు. వినాయక విగ్రహాలను తిలకిస్తూనే కింద పడిపోయాడు. వెంటనే లేపాక్షి ప్రభుత్వ ఆస్పత్రికి తీసికెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషయంపై ఎస్ఐ శ్రీధర్ను వివరణ కోరగా వినాయక విగ్రహాలను తిలకించిన తర్వాత ఇంటికి వెళ్లి చనిపోయాన్నారు. -
ఎలుగుబంటి దాడిలో వ్యక్తి మతి
చిలమత్తూరు : ఎలుగుబంటి దాడిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని వీరాపురం పంచాయతీ హుస్సేన్ పురం గ్రామం సమీపంలోని కర్ణాటక బందర్లపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు యర్రకొండ అటవీ ప్రాంతంలో కొన్ని రోజులుగా ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. కుందేళ్లు, జింకలు, అడవి పందులు తదితర జంతువుల వేట కోసం కర్ణాటకకు చెందిన కొందరు వేటగాళ్లు గత ఆదివారం అడవిలోకి వెళ్లారు. వీరిలో బందర్లపల్లి గ్రామానికి చెందిన హనుమంతప్ప, బాలమ్మ కుమారుడు బాలరాజు కూడా ఉన్నారు. వేట సమయంలో ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. కాగా మంగళవారం మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. -
రైతుకు సాయం చేయబోయి..
ధర్మవరం రూరల్ : తోటి రైతుకు సాయం చేయబోయిన యువకుడికి విద్యుత్తీగలే యమపాశాలుగా మారాయి. విద్యుత్ వైరు లాగుతున్న సమయంలో ఒక్కసారిగా హైటెన్షన్ వైరు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ధర్మవరం రూరల్ పరిధిలోని మల్లేనిపల్లిలో మంగళవారం జరిగిన ఈఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మల్లేనిపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్ర తన పొలానికి విద్యుత్ వైరును లాగడానికి అదేగ్రామానికి చెందిన రమేష్ (24), రంగా, నాగేంద్ర, తిరుపాలును సాయంగా పిలుచుకువెళ్లాడు. వైరు లాగుతున్న సమయంలో పైన ఉన్న హైటెన్షన్ వైర్లను వీరు లాగుతున్న వైరు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో వారందరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా రమేష్ మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిపారు. మిగిలిన నలుగురు క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్సలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న రమేష్ తల్లిదండ్రులు కాటమయ్య, రమణమ్మ, బంధువులు ఆస్పత్రికి చేరుకొని బోరున విలపించారు. మృతుడికి ఇంకా పెళ్లి కాలేదు. ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాకతీయ కాలువలో పడి యువకుడి మృతి
బాల్కొండ: ప్రమాదవశాత్తూ కాకతీయ కాలువలో పడి సులేమాన్ ఖాన్(19) అనే యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడు వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. బుధవారం ఉదయం మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
వరంగల్ : వరంగల్ జిల్లా మరిపెడ మండలం నీలికుర్తి స్టేజి సమీపంలో ఓ వృద్ధుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నీలికుర్తి పంచాయతీ భజనతండాకు చెందిన బానోతు హనుమ (70) గా స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని...మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి చూపులకెళ్లి పరలోకాలకు..
ధర్మవరం రూరల్ : తన కుమారుడి పెళ్లి చూపుల కోసం తన బంధువులతో కలసి రేగాటిపల్లికి వెళ్లి ద్విచక్ర వాహనంపై ఆదివారం తిరిగి వస్తుండగా వేగంగా వస్తున్న కారు డీకొని చాకలి శివరుద్ర(55) దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు, బంధువుల వివరాల మేరకు.. కణేకల్లు మండలం కలేకుర్తికి చెందిన శివరుద్ర తన కుమారుడి పెళ్లి చూపుల కోసం బంధువులతో కలసి ధర్మవరం మండలం రేగాటిపల్లికి వచ్చారు. పెళ్లి చూపుల అనంతరం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాల్లో స్వగ్రామానికి బయలు దేరారు. మార్గ మధ్యలో శీతారాంపల్లి వద్దకు రాగానే ముందుగా వస్తున్న శివరుద్ర జాతీయ రహదారిపైకి వచ్చి రోడ్డు దాటుతుండగా బెంగళూరు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొనింది. ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొనడంతో చాలా దూరం ఎగిరిపడ్డాడు. ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా వెళ్లిపోయింది. స్థానికులు మరూరు వద్ద ఉన్న టోల్ప్లాజాకు సమాచారం అందించారు. అక్కడ ఉన్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మృతుడికి భార్య లక్ష్మిదేవి, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఇన్చార్జ్ ఎస్ఐ సురేష్ ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మేకను తప్పించబోయి మృత్యు ఒడికి..
పావగడ: రంగసముద్రానికి చెందిన త్రియంబకేశ్వర గ్రామీ ణ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు హెచ్బీ మురుడప్ప(52) రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందారు. స్వాతంత్య్ర వేడుకలు ముగించుకుని సరుకులు తీసుకురావడానికి బైకులో పావగడకు వెళ్తుండగా మార్గ మధ్యంలోని శైలాపురం వద్ద ఎదురుగా వచ్చిన మేకను తప్పించే ప్రయ త్నంలో ఈ సంఘటన జరిగిందని ఎస్ఐ నారాయణస్వామి తెలిపారు. మృతుడికి భార్య మంజువాణి, కుమారుడు చేతన్ కుమార్, కుమార్తె అశ్విని ఉన్నారు. హెచ్ఎం గంగాధరప్ప, ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. -
విద్యుదాఘాతానికి వ్యక్తి బలి
ఎస్కేయూ: అనంతపురం రూరల్ మండలం పూలకుంటకు చెందిన వరికూటి సూరి(45) అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై సోమవారం మరణించినట్లు ఇటుకలపల్లి ఎస్ఐ అబ్దుల్ కరీం తెలిపారు. ఇటుకలపల్లి సమీపంలోని ద్రాక్ష తోటలో కటింగ్ చేస్తుండగా, పందిరికి విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. ఘటనలో మరో ముగ్గురు షాక్కు గురయ్యారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య సహా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
కేంద్ర మాజీ మంత్రి కారు ఢీ.. వ్యక్తి మృతి
అలపూజ: మాజీ ఎంపీ, కేంద్రమంత్రి కారు ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలుకోల్పోయాడు. కేరళలోని అలపూజలో గల థంకీ చౌరస్తాలోని బిషప్ మోర్ స్కూల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అలపూజలో ఎంపీ కేసీ వేణుగోపాల్ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతున్న మాజీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా ప్రయాణిస్తున్న కారు శశి(70) అనే వ్యక్తిని ఢీకొట్టింది. అతడిని వెంటనే చెర్తాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలుకోల్పోయాడు. శశి చెర్తాలలోని ఉన్నికాందాతిల్ నివాసానికి చెందినవాడు. మృతుడి ఇంటికి వెళ్లి మాజీ ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దురదృష్టవశాత్తు అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయని, అందుకు తీవ్ర విచారంగా ఉందని, తీవ్ర దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని కలిసేందుకు వెళుతున్నానంటూ ట్వీట్ చేశారు. Devastated - sad loss of life - unfortunate accident betw Cochin-Allepy. Arranged for hospital immediately - on way to meet bereaved family! — Jyotiraditya Scindia (@JM_Scindia) 10 August 2016 -
డెంగీ జ్వరంతో వ్యక్తి మృతి
హిందూపురం అర్బన్ : మండలంలోని మణేసముద్రం గ్రామానికి చెందిన నరసింహులు (27) డెంగీ జ్వరంతో గురువారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రోజువారీ కూలీ పనులు చేసే నరసింహులు కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో వైద్యం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించటంతో డెంగీ జ్వరం వచ్చిందని వెంటనే అనంతపురం తరలించాలని స్థానిక వైద్యులు సూచించారు. ఈ మేరకు అంబులెన్స్లో అనంతపురం తరలిస్తుండగా మార్గంమధ్యలోనే చనిపోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
ఆ దృశ్యం హృదయ విదారకం
అమరాపురం: అమరాపురం మండలం హల్కూరు గ్రామ మెయిన్ రోడ్డులో ట్రాక్టర్, బైక్ ఢీకొనడంతో యువకుడి కాలువిరిగా తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు ఆనంద్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గుడిబండ మండలం చిగతుర్పికి చెందిన గొల్ల ఆనంద్ ఆదివారం ఉదయం బైక్లో చిగతుర్పి నుంచి కర్ణాటక రాష్ట్రం ఉవ్వినహళ్లికి బయలు దేరాడు. హల్కూరు మెయిన్ రోడ్డులో వస్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో ఆనంద్ ఎడమకాలి పాదం ట్రాక్టర్ ముందు భాగంలోని కుడి చక్రం కింద పూర్తిగా కట్ అయి చిక్కుకుంది. వెంటనే 108కు సమాచారం అందించి, మడకశిర ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మెరుగైన వైద్య సేవల కోసం బెంగళూరు ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్ సూచించడంతో క్షతగాత్రుడి తండ్రి ఈరప్ప బెంగళూరుకు తీసుకెళ్లారు. సంఘటనతో ట్రాఫిక్కు గంటపాటు అంతరాయం ఏర్పడింది. ఎస్హెచ్ఓ మల్లేశ్వరప్ప, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. -
సమయానికి వైద్యం అందక.. ఉద్యోగి మృతి
-
కొట్లాటలో వ్యక్తి మృతి
గంజాయి మత్తులో కొట్టుకున్న వైనం...! చీమకుర్తి(సంతనూతలపాడు): కొట్లాట విషయంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి 11గంటలకు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చీమకుర్తిలోని మాదిగ పల్లెకు చెందిన బూదాల నాగేశ్వరరావు(32) స్థానిక ప్రభుత్వాసుపత్రి పక్కన చినరాస్తా రోడ్డులో గుడిసెల్లో నివాసం ఉంటున్న కొందరి వ్యక్తులతో గంజాయి తాగుతున్నాడు. ఈ క్రమం లో వారి మధ్యన మాటామాట పెరిగి నాగేశ్వరరావును అవతలి వారు కొట్టి చంపినట్లు మృతుడు భార్య, బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడు నాగేశ్వరరావును మేము కొట్టలేదని పాము కరిచి చని పోయాడని చినరాస్తా రోడ్డులో గుడిసెల్లో నివాసం ఉండేవారు చెబుతున్నారు. దీనిపై స్థానిక పోలీసులను వివరణ కోరగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు పంపామన్నారు. నివేదిక ప్రకారం కేసునమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే తాగేందుకు గంజాయి వీరికి ఎక్కడ నుంచి సరఫరా అవుతోంది, గంజాయి విషయంలో పోలీసులు, అధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
సమయానికి వైద్యం అందక.. ఉద్యోగి మృతి
కర్నూలు : సమయానికి వైద్యం అందక.. ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా ఆదోనిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన మృతుని బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి... ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... స్థానికంగా నివాసముంటున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి శివన్న(45) గురువారం ఉదయం వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో అదుపు తప్పి ఆటో ఆయనను ఢీ కొట్టింది. దీంతో శివన్న తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది లేకపోవడంతో.. సరైన సమయంలో వైద్యం అందక పోవడంతో శివన్న మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైందని బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆసుపత్రిపై వారు దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.