జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం: నిండు ప్రాణం బలి | Man dies After Falling Into a Manhole in Himayatnagar | Sakshi
Sakshi News home page

జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం: నిండు ప్రాణం బలి

Oct 5 2014 10:41 AM | Updated on Jul 11 2019 8:56 PM

జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం: నిండు ప్రాణం బలి - Sakshi

జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం: నిండు ప్రాణం బలి

జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంతో మరో నిండు ప్రాణం బలైంది.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసీ) సిబ్బంది నిర్లక్ష్యంతో మరో నిండు ప్రాణం బలైంది. మ్యాన్హోల్లో పడి సాయి అనే వ్యక్తి మృతి చెందాడు. ఆ ఘటన గత అర్థరాత్రి హిమాయత్నగర్లోని 6వ నెంబర్లో విధిలో చోటు చేసుకుంది. శనివారం ఆ వీధిలోని మ్యాన్హోల్ మూత తీసి సిబ్బంది పని చేపట్టారు.

అనంతరం ఆ మ్యాన్ హోల్కు మూత అమర్చకుండా వెళ్లిపోయారు. దీంతో గత అర్థరాత్రి ఇంటికి వెళ్తున్న సాయి ఆ మ్యాన్హోల్లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఆదివారం ఉదయం స్థానికులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వీధి నెం 6కు చేరుకుని మ్యాన్ హోల్ నుంచి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement