మేకను తప్పించబోయి మృత్యు ఒడికి.. | man dies in road accident | Sakshi
Sakshi News home page

మేకను తప్పించబోయి మృత్యు ఒడికి..

Aug 16 2016 12:06 AM | Updated on Aug 30 2018 4:07 PM

రంగసముద్రానికి చెందిన త్రియంబకేశ్వర గ్రామీ ణ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు హెచ్‌బీ మురుడప్ప(52) రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందారు.

పావగడ: రంగసముద్రానికి చెందిన త్రియంబకేశ్వర గ్రామీ ణ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు హెచ్‌బీ మురుడప్ప(52) రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందారు.  స్వాతంత్య్ర వేడుకలు ముగించుకుని సరుకులు తీసుకురావడానికి బైకులో పావగడకు వెళ్తుండగా మార్గ మధ్యంలోని శైలాపురం  వద్ద ఎదురుగా వచ్చిన మేకను తప్పించే ప్రయ త్నంలో ఈ సంఘటన జరిగిందని ఎస్‌ఐ నారాయణస్వామి తెలిపారు.  మృతుడికి భార్య మంజువాణి, కుమారుడు చేతన్‌ కుమార్, కుమార్తె అశ్విని ఉన్నారు. హెచ్‌ఎం గంగాధరప్ప, ఉపాధ్యాయులు   సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement