కడుపు నొప్పి భరించలేక రాధ(32) అనే వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బి.కొత్తకోట మండలకేంద్రంలోని బీసీ కాలనీలో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కడుపు నొప్పి తాళలేక.. ఆత్మహత్య
Published Sun, Nov 8 2015 4:58 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement