భవనం పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్య | Married Women Commits Suicide in Hyderabad | Sakshi

భవనం పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్య

Apr 10 2019 8:00 AM | Updated on Apr 10 2019 8:00 AM

Married Women Commits Suicide in Hyderabad - Sakshi

సత్యనాగరాణి మృతదేహం

మియాపూర్‌: భవనం పైనుంచి దూకి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ వెంకటేష్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవడకు చెందిన నేతాజీ, వెంకట మాణెమ్మ దంపతుల కుమార్తె ఉమా వెంకట సత్యనాగరాణి (33)కి తూర్పుగోదావరి రావులపాలెం కాసూరినగర్‌కు చెందిన శివకుమార్‌తో వివాహం జరిగింది.  గత కొంతకాలంగా వీరు మియాపూర్‌ డైమండ్‌ హిల్స్‌ –3 ఉంటున్నారు. మంగళవారం ఉదయం శివకుమార్‌ ఇంట్లో లేని సమయంలో ఉమ అపార్ట్‌మెంట్‌ 5వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఆమెను కేపీహెచ్‌బీలోని అనుపమ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement