Married women
-
పదేళ్లుగా భార్యను పుట్టింటికి పంపకపోవడంతో..
పెందుర్తి: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెందుర్తి మండలం చింతగట్లలో చోటుచేసుకుంది. భర్త తరచూ భౌతికదాడికి పాల్పడడంతో తీవ్ర మనస్తాపానికి గురై తనువు చాలించింది. తమ కుమార్తె మృతికి కారణమైన ఆమె భర్తను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు గ్రామంలో ఆందోళనకు దిగారు. పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. వివరాలివీ.. చింతగట్ల గ్రామానికి చెందిన గనిశెట్టి కనకరాజుకు నర్సీపట్నం మర్రివలసకు చెందిన పార్వతితో 14 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. భార్య పార్వతిని కనకరాజు నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో దాదాపు పదేళ్లుగా ఆమెను పుట్టింటికి కూడా వెళ్లనివ్వలేదు. నిత్యం ఏదో కారణంతో కొట్టేవాడు. ఈ నెల 11న కూడా పార్వతిని తీవ్రంగా కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురై కార్ ఏసీ కూలెంట్ వాటర్ తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేరి్పంచగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. బుధవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించిన తరువాత ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. తమ కుమార్తె మృతికి కారణమైన కనకరాజును తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు గ్రామానికి చేరుకుని పార్వతి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి, అంత్యక్రియలు నిర్వహించారు. కనకరాజు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. సీఐ కె.వి.సతీ‹Ùకుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది. -
అమ్మా! వద్దు.. వద్దంటున్నా..
గోదావరిఖని: ‘అమ్మా.. వద్దు వద్దు! నువ్వు ఏం జేస్తున్నవో నాకు తెలుస్తలేదు.. ఆ పని చేయొద్దమ్మా.. నాకు భయమేస్తుంది అమ్మా!’అని కూతురు వారిస్తున్నా వినకుండా ఓ వివాహిత, ఓ వ్యక్తితో వీడియోకాల్లో మాట్లాడుతూనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శనివారం ఈ ఘటన జరిగింది.పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన చొప్పరి అంజయ్య, మాధవి భార్యాభర్తలు. ఉపాధి కోసం వారు పదేళ్ల క్రితం గోదావరిఖని విఠల్నగర్కు వలస వచ్చారు. అంజయ్య సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. వీరికి ఏడేళ్ల వయసున్న రితిక అనే కూతురు ఉంది. తిలక్నగర్కు చెందిన సింగరేణి ఉద్యోగి ఎండీ యూసుఫ్ కుటుంబసభ్యులతో అంజయ్య, మాధవి కుటుంబానికి ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.ఈ క్రమంలో యూసుఫ్ తరచూ వీరి ఇంటికి వచ్చివెళ్లేవాడు. మాధవి, యూసుఫ్ ఫోన్లో కూడా మాట్లాడుకునేవారు. అంజయ్య శనివారం ఉదయం సెంట్రింగ్ పనులు చేసేందుకు గోదావరిఖని సమీపంలోని సుందిళ్ల గ్రామానికి వెళ్లాడు. ఏం జరిగిందో ఏమోకానీ.. యూసుఫ్తో వీడియోకాల్లో మాట్లాడుతూనే ఉదయం 10 గంటల సమయంలో మాధవి (30) ఉరివేసుకుంది. ఉరివేసుకుంటుండగా పక్కనే ఉన్న ఆమె కూతురు అమ్మా వద్దు వద్దు.. అని వారించినా వినలేదు. తన భార్య మరణం విషయంలో యూసుఫ్పై అనుమానంగా ఉందని మృతురాలి భర్త అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. -
వివాహిత మహిళలకు నో జాబ్..
-
ఐఫోన్ ప్లాంట్లో వివాహితలకు ‘నో జాబ్’.. రంగంలోకి దిగిన కేంద్రం
దేశంలో ఐఫోన్లు, ఇతర యాపిల్ ఉత్పత్తులు తయారు చేసే ఫాక్స్కాన్ ప్లాంటులో ఉద్యోగాలకు వివాహిత మహిళలను తిరస్కరించిందని రాయిటర్స్ ఓ సంచలన కథనం వెలువరించింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.1976 నాటి సమాన వేతన చట్టాన్ని ఉటంకిస్తూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో, ఉద్యోగ నియామకాల్లో పురుషులు, మహిళల మధ్య ఎటువంటి వివక్ష చేయరాదని చట్టం స్పష్టంగా నిర్దేశిస్తుందని పేర్కొంది. చైన్నై సమీపంలోని ఐఫోన్ ఫ్యాక్టరీలో ఈ వివక్ష కొనసాగుతోందని రాయిటర్స్ బయటపెట్టిన నేపథ్యంలో తమిళనాడు కార్మిక శాఖ నుంచి వివరణాత్మక నివేదికను కోరినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రభుత్వ ప్రకటనపై యాపిల్, ఫాక్స్కాన్ యాజమాన్యాలు వెంటనే స్పందించలేదు.రాయిటర్స్ మంగళవారం ప్రచురించిన పరిశోధనాత్మక కథనంలో ఫాక్స్కాన్ తమిళనాడులోని చెన్నై సమీపంలోని తన ప్రధాన ఐఫోన్ ప్లాంటులో ఉద్యోగాల కోసం వివాహిత మహిళలను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారని కనుగొంది. పెళ్లైన మహిళలు ఎక్కువ కుటుంబ బాధ్యతలు కలిగి ఉంటారనే కారణంతోనే వారిని క్రమపద్ధతిలో మినహాయిస్తున్నట్లు రాయిటర్స్ గుర్తించింది. రాయిటర్స్ ఇంటర్వ్యూ చేసిన ఫాక్స్కాన్ నియామక ఏజెంట్లు, హెచ్ఆర్ వర్గాలు ఇదే విషయాన్ని చెప్పారు. కుటుంబ బాధ్యతలు, గర్భం, అధిక గైర్హాజరును ఫాక్స్కాన్ ప్లాంట్లో వివాహిత మహిళలను నియమించకపోవడానికి కారణాలుగా పేర్కొన్నారు. -
భర్తను వదిలేసి రావాలన్న తల్లిదండ్రులు.. వివాహిత తీవ్ర నిర్ణయం..!
భూదాన్పోచంపల్లి: కుటుంబ కలహాలతో వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం భూదాన్పోచంపల్లి మండలంలోని జిబ్లక్పల్లి గ్రామంలో చోటు చేసుకొంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జిబ్లక్పల్లి గ్రామానికి చెందిన కొండపల్లి నర్సింహ, చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన తన మేనమామ కుమార్తె కప్పెర సంతోష(18)ను ప్రేమించి 8 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కాగా సంతోష తల్లి మల్లమ్మకు ఈ పెళ్లి ఏ మాత్రం ఇష్టం లేదు. ఇదే విషయమై సంతోష తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతుండేవారు. అంతేకాక కుమార్తె సంతోషకు తల్లి మల్లమ్మ ప్రతి రోజూ ఫోన్ చేసి భర్తను వదిలేసి వస్తే మంచి సంబంధం చూసి తిరిగి పెళ్లి చేస్తానని చెప్పేది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంతోష సోమవారం భర్త నర్సింహ బయటికి వెళ్లగా, మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్రెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
రెప్పపాటులో ముగ్గురి ప్రాణాలను కాపాడిన ట్రాక్మన్.. ఆ విషయం చెప్పకపోయుంటే!
పిఠాపురం: వరుసగా ఆడపిల్లలనే కన్నావని అత్తవారు వేధించడంతో ఓ వివాహిత తన పిల్లలతో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఇద్దరు బిడ్డలతో కలిసి, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. ట్రాక్మన్ అప్రమత్తంగా వ్యవహరించి ఆ ముగ్గురినీ కాపాడాడు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ రైల్వే స్టేషన్ సమీపాన ఆదివారం ఈ ఘటన జరిగింది. జిల్లాలోని పోతులూరుకు చెందిన శివకు, చేబ్రోలుకు చెందిన వెంకటలక్ష్మిలకు భవ్యశ్రీ, పార్థు అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహమై 11 ఏళ్లు అయినా మగ పిల్లవాడు పుట్టలేదని వెంకటలక్ష్మిని భర్త, అత్త కాసులమ్మ వేధించేవారు. విడాకులు ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చేవారు. రోజూ ఆమెను చిత్రహింసలు పెట్టేవారు. గత శుక్రవారం అదనపు కట్నం తేవాలని బాధితురాలిపై దాడి చేయగా పెద్దలు వెళ్లి తగువు తీర్చారు. తన మీదకు పెద్దలను తీసుకువస్తావా అంటూ కోపోద్రిక్తుడైన భర్త శివ ఆమెను కొట్టాడు. తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించి, దుర్గాడ రైల్వే స్టేషన్కు చేరుకుంది. కూతురే కాపాడింది... అదే సమయంలో విశాఖ– విజయవాడ సూపర్ఫాస్ట్ రైలు వస్తోంది. ట్రాక్మన్ పిమిడి వెంకటేశ్వరరావు ట్రాక్ను పరిశీలిస్తూ 655వ మైలు రాయి వద్ద తిరుగుతున్నాడు. వెంకటలక్ష్మి తన బిడ్డలతో కలిసి రైల్వే ట్రాక్పై వెళ్లడాన్ని గమనించి వారిని అడ్డుకున్నాడు. తనకు తెలిసిన వారు కొంత దూరంలో ఉన్నారని, దగ్గర దారి కావడంతో ఇలా వెళుతున్నానని వెంకటలక్ష్మి ట్రాక్మన్కు చెప్పింది. ఇంతలో అమ్మను నాన్న కొట్టాడని, అందుకే అమ్మ తమను తీసుకుని ఇలా వచ్చేసిందని వెంకటలక్ష్మి కుమార్తె భవ్యశ్రీ అతడికి చెప్పింది. దీంతో వెంకటేశ్వరరావు ఆ ముగ్గురినీ ట్రాక్పై నుంచి బయటకు తోసేసి వారి ప్రాణాలను కాపాడాడు. అప్పటికే ట్రైన్ అతి సమీపంలోకి రావడంతో రెప్పపాటులో ముగ్గురూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలికి చేరుకుని బాధితురాలిని కాకినాడ తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించి, బంధువులకు అప్పగించారు. -
ఆమె జైలుకు.. బాలుడు ఇంటికి
గుడివాడ టౌన్: ఎదురింటి బాలుడిని తీసుకొని పారిపోయిన వివాహితను పోలీసులు అరెస్టు చేశారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కృష్ణా జిల్లా గుడివాడలో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను సీఐ దుర్గారావు వెల్లడించారు. గుడివాడ గుడ్మెన్ పేటకు చెందిన వివాహిత స్వప్న(30) తన ఎదురింటిలో ఉండే బాలుడి(15)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నెల 19న ఆ బాలుడితో పరారయ్యింది. బాలుడి తండ్రి గత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వప్న, బాలుడు హైదరాబాద్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లి వారిద్దరినీ గుడివాడ తీసుకొచ్చారు. మహిళను బుధవారం గుడివాడ కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆమెకు రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. -
ఆర్కే బీచ్ లో వివాహిత గల్లంతు
-
వివాహేతర సంబంధం గుట్టురట్టు.. లాడ్జిలో గది అద్దెకు తీసుకుని..
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): వివాహితతో అక్రమ సంబంధం గుట్టురట్టు కావడం, ఆమె భర్త బెదిరించడంతో భయపడ్డ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నెలమంగల పట్టణంలో చోటుచేసుకుంది. బెంగళూరు కురుబరహళ్లి నివాసి అరుణ్ (33) నెలమంగల పట్టణంలోని ఒక లాడ్జిలో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రైవేటు కంపెనీలో కారు డ్రైవర్గా పనిచేస్తున్న అరుణ్ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్త ఆమె భర్తకు తెలియడంతో బెదిరించాడు. అంతేకాకుండా భార్యతో ఫోన్ చేయించి మన ఇద్దరి పేర్లు రాసి ఆయన ఆత్మహత్య చేసుకుంటానని చెప్పించాడు. దీంతో భయపడిపోయిన అరుణ్ నెలమంగలకు వచ్చి లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబానికి అరుణ్ ఒక్కడే జీవనాధారం కావడంతో కుటంబ సభ్యులు కన్నరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: ఏడాదిన్నర కిందట పెళ్లి.. 9 నెలల బాబు.. చిన్న గొడవకే -
ప్రియుడే కాలయముడు
అనంతపురం క్రైం: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చోటు చేసుకున్న వివాహిత కేసులో నిందితుడిని ఏడాదిన్నర తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. హతురాలికి చెందిన 2.5 తులాల తాళిబొట్టు చైన్ స్వాధీనం చేసుకున్నారు. వివరాలను స్థానిక డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. అనంతపురంలోని శ్రీనివాసనగర్కు చెందిన ఈశ్వర్కు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన రాజేశ్వరితో వివాహమైంది. పెళ్లికి ముందు రాజేశ్వరి ఆదోనికి చెందిన చౌదరి హిదాయతుల్లా అలియాస్ ఇనాయతుల్లా మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ తర్వాత హిదాయతుల్లా కొన్నాళ్ల పాటు కువైట్కు వెళ్లాడు. ఆ సమయంలోనే రాజేశ్వరికి ఈశ్వర్తో కుటుంబ పెద్దలు వివాహం జరిపించారు. కువైట్ నుంచి వచ్చిన తర్వాత రాజేశ్వరితో హిదాయతుల్లా చాలా చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలోనే రూ.2 లక్షలు రాజేశ్వరికి అప్పుగా ఇచ్చాడు. ఈ డబ్బును తిరిగి ఇవ్వాలని తరచూ అడిగినా.. రాజేశ్వరి మాట దాటవేస్తూ వస్తుండడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. 2020, ఆగస్టు 28న హిదాయతుల్లా ఆదోని నుంచి అనంతపురానికి వచ్చాడు. రాజేశ్వరిని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆర్ఎం కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లాడు. తానిచ్చిన డబ్బు తిరిగివ్వాలని గొడపడ్డాడు. తన వద్ద లేవని రాజేశ్వరి తెలపడంతో ఆమె గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం రాజేశ్వరి మెడలోని తాళిబొట్టు చైన్ తీసుకుని ఉడాయించాడు. పోలీసులు మొదట్లో మిస్సింగ్ కేసుగా, తర్వాత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన హిదాయతుల్లాగా నిర్ధారించుకున్నారు. కాగా, రాజేశ్వరిని హతమార్చిన అనంతరం భార్యాపిల్లలను ఆదోనిలోనే ఉంచి హిదాయతుల్లా నెల్లూరుకు మకాం మార్చాడు. అక్కడ ఓ పండ్ల వ్యాపారి వద్ద కూలి పనులతో జీవనం సాగించసాగాడు. శనివారం అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద తచ్చాడుతున్న నిందితుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుడి అరెస్ట్లో చొరవ చూపిన త్రీటౌన్ సీఐ కత్తి శ్రీనివాసులు, ఎస్ఐలు జయపాల్ రెడ్డి, వలిబాషు, సునీత, వెంకటేశ్వర్లు, బలరాం తదితరులను డీఎస్పీ అభినందించారు. (చదవండి: పాత కక్షలతో....ప్రాణం తీసిన స్నేహితులు) -
భార్య ‘నో’ అన్నా ఓకే: భర్తలు మారారు!
న్యూఢిల్లీ: మారిటల్ రేప్ను నేరంగా పరిగణించాల్సిన సమయం వచ్చిందంటూ దేశవ్యాప్తంగా కీలక చర్చ జరుగుతున్న నేపథ్యంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సతీమణి సంభోగానికి ఒప్పుకోకపోయినా సర్దుకుపోతామని 66 శాతం మంది పురుషులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ముఖ్యంగా మూడు కారణాల వల్ల మహిళలు తమ భర్తలతో కలయికకు అభ్యంతరం చెబుతున్నారు. భర్తకు సుఖవ్యాధులు, వేరే మహిళతో వివాహేతర సంబంధం, ఆలసట లేదా కోరిక లేకపోవడం వంటి కారణాలతో 80 శాతం స్త్రీలు శృంగారానికి నో చెబుతున్నారని సర్వేలో వెల్లడైంది. ...అయినా ఇబ్బంది పెట్టం మహిళా సాధికారతపై అధ్యాయంలోని 'భర్తతో సురక్షితమైన లైంగిక సంబంధాలను చర్చించే వైఖరులు' అనే విభాగంలోని ఈ ప్రశ్న.. లింగ సమానత్వంలో కీలకమైన ‘అంగీకార’ అంశంగా సర్వేలో నిలిచింది. 15 నుంచి 49 ఏళ్ల వయసున్న వారికి ఈ పశ్నను సంధించగా ఐదుగురిలో నలుగురు మహిళలు, పురుషులు పై కారణాలతో ఏకీభవించారు. తమకు ఇష్టం లేకపోతే ఏకాంతానికి ఒప్పుకోబోమని చెప్పిన మహిళల సంఖ్య గత సర్వేతో పోలిస్తే 12 శాతం పెరిగింది. అలాగే భార్యలను ఇబ్బంది పెట్టబోమని చెప్పిన భర్తల సంఖ్య 3 శాతం పెరిగింది. దండిస్తాం.. కుదరదు తాను కోరుకున్న సమయంలో శృంగానికి ఒప్పుకోకపోతే భార్యను దండించే హక్కు ఉందని 19 శాతం పురుషులు అభిప్రాయపడటం గమనార్హం. భర్తలకు తమను దండించే హక్కు లేదని ప్రతి ఐదుగురిలో నలుగురు మహిళలు అంటే 82 శాతం మంది కుండబద్దలు కొట్టారు. (క్లిక్: వధువు చెల్లిని పెళ్లి చేసుకున్న వరుడు... షాక్లో బంధువులు) అప్పుడు కొట్టడం కరెక్టే భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లం, పిల్లల్ని లేదా ఇంటిని పట్టించుకోకపోవడం, వాదనకు దిగడం, భర్తతో కలయికకు ఒప్పుకోకపోవడం, వంట సరిగా చేయకపోవడం, భర్త పట్ల నమ్మకంగా ఉండకపోవడం, అత్తమామల పట్ల గౌరవ మర్యాదలు ప్రదర్శించకపోవడం వంటి సందర్భాల్లో భార్యలపై తాము చేయిచేసుకుంటామని 44 శాతం మంది పురుషులు వెల్లడించారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఇదే రకమైన అభిప్రాయాన్ని పురుషులు కంటే మహిళలే ఎక్కువగా (45 శాతం) వ్యక్తం చేశారు. అయితే గత సర్వేతో పోల్చుకుంటే(52 శాతం) ఈ సంఖ్య 7 శాతం తగ్గడం ఊరటనిచ్చే అంశం. భార్యలను అదుపులో పెట్టుకోవడానికి కొడతామని చెప్పిన పురుషుల సంఖ్య గతంతో (42 శాతం) పోలిస్తే రెండు శాతం పెరగడం గమనార్హం. సర్వే ఇలా.. 2019-21 మధ్య కాలంలో రెండు దశల్లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 నిర్వహించారు. 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 జూన్ 17 నుంచి 2020 జనవరి 30 వరకు మొదటి దశ సర్వే చేశారు. 2020 జనవరి 2 నుంచి 2021 ఏప్రిల్ 30 వరకు నిర్వహించిన రెండో దశ సర్వే 11 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగింది. (చదవండి: తల్లిబిడ్డల కోసం రైల్వేశాఖ వినూత్న నిర్ణయం!) -
గత కొన్నేళ్లుగా భార్య సాగిస్తున్న నిర్వాకం.. అనారోగ్యం పాలైన భర్త!
తిరువనంతపురం: సంసారం అన్నాక చిన్నచిన్న కలహాలు సాధారణమే. కానీ ఇటీవలకాలంలో చిన్న చిన్నకలహాలే పెద్దవిగా మారి తమ జీవితాల్ని నాశనం చేసుకునే పరిస్థితికి తెచ్చుకుంటున్న ఘటనలను చూస్తున్నాం. అచ్చం అలాంటి ఘటనే కేరళలో చోటు చేసుకుంది. కొట్టాయం జిల్లాలోని పాలా పట్టణాంలో సతీష్ అతని భార్య ఆశా నివశిస్తున్నారు. 2006లో వీళ్ల వివాహం జరిగింది. సతీష్ ఒక ఐస్క్రీమ్ పరిశ్రమలో పరిచేస్తున్నాడు. 2012లో ఈ జంట పాలక్కాడ్లో సొంత ఇంటిని కూడా కొనుగోలు చేశారు. అయితే ఆశ.. చిన్ని చిన విషయాలకు భర్తతో తరుచు గొడవపడుతూ ఉండేది. గత కొన్ని రోజులుగా తాను బాగా అలిసిపోయి అనారోగ్యానికి గురవుతున్నట్లు సతీష్ గమనించాడు. దీంతో అతను వైద్యుడిని సంప్రదించాడు కూడా. అయితే షుగర్ లెవల్స్ పడిపోవడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పాడు. ఈ మేరకు సెప్టెంబర్ 2021 నుంచి ఇంటిలో ఆహారం తినడం మానేశాడు. దీంతో అతని ఆరోగ్యం క్రమంగా మెరుగవ్వడం మొదలైంది. దీంతో అతను తన స్నేహితుడితో తన భార్య ఆహారంలో ఏదైన కలుపుతుందేమోనని సందేహం వ్యక్త చేయడమే కాక తన భార్య నుంచి విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా అభ్యర్థించాడు. ఈ మేరకు సతీష్ స్నేహితుడు ఆశ వద్దకు వెళ్లి విచారించగా.. తాను ఆహారంలో కొన్ని మందులు కలుపుతున్నట్లు వెల్లడించింది. పైగా ఆ మందుల వివరాలను వాట్సాప్లో పంపించింది. అంతేకాక సతీష్ ఇంటి సీసీఫుటేజ్లో కూడా ఆశా ఏవో మందులు కలుపుతున్నట్లు రికార్డు అయ్యింది. దీంతో సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆశా తన భర్త తినే భోజనం, తాగే నీళ్లలో కూడా మందులు కలుపుతున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక ఆమెను అరెస్టు చేసి విచారించడం మొదలు పెట్టారు. (చదవండి: భర్తతో విడాకులు.. మరో వ్యక్తితో సహజీవనం.. చిన్నారి పాలకోసం ఏడుస్తోందని..) -
మిసెస్ వరల్డ్ 2022 కంటెస్టెంట్
అందాల పోటీలు పెళ్లికాని యువతులకే అనే పేరుంది. కానీ, పెళ్లయి, బిడ్డలున్నా తమ ఘనతను చాటేలా మిసెస్ ఇండియా, మిసెస్ వరల్డ్ పోటీలూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 15న అమెరికాలోని లాస్ వెగాస్లో ‘మిసెస్ వరల్డ్–2022’ వివాహిత మహిళల కోసం సరికొత్త శైలిలో జరగనుంది. 80 దేశాల నుంచి అందమైన శ్రీమతులు ఈ పోటీలో పాల్గొనబోతున్నారు. భారత దేశం నుంచి నవదీప్ కౌర్ ప్రాతినిధ్యం వహిస్తోంది. మిసెస్ ఇండియా వరల్డ్ (2020–21లో) విజేతగా నిలిచిన 38 ఏళ్ల నవదీప్ కౌర్ ఒడిశాలోని సుందర్గడ్ జిల్లా స్టీల్ హబ్లో పుట్టి పెరిగింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. స్టీల్ హబ్ నుండి మిసెస్ ఇండియా వరల్డ్గా మారే వరకు నవదీప్ ప్రయాణం వివాహిత మహిళలను చైతన్యపరిచే దిశగా కొనసాగుతోంది. వ్యక్తిత్వ వికాస కోచ్ నవదీప్ కౌర్కి పెళ్లయి ఏడేళ్లు. ఐదేళ్ల కూతురు ఉంది. ఆరేళ్లుగా పాఠశాల స్థాయి విద్యార్థులకు చదువులో శిక్షణా తరగతులు తీసుకుంటుంది. కొటక్మహీంద్రా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా కెరీర్ ప్రారంభించింది. అటు తర్వాత హెచ్ఆర్, మార్కెటింగ్ గ్రాడ్యుయేషన్ కోసం మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయడం ప్రారంభించింది. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస కోచ్గా ఎంతోమందిని ప్రభావితం చేస్తోంది. దేశం గర్వించేలా కృషి కిందటేడాది మిసెస్ ఇండియా వరల్డ్ టైటిల్ను గెలుచుకున్నప్పటి నుండే నవదీప్ మిసెస్ వరల్డ్ టైటిల్ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘నా చిన్ననాటి నుంచి ప్రపంచపటంలో మన దేశాన్ని నేను సైతం గొప్పగా చూపించాలనుకునేదాన్ని. అందుకోసం ప్రతి విభాగంలో పనిచేయడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాను’ అని తన జీవిత కల గురించి వివరిస్తుంది నవదీప్ కౌర్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లేడీస్ సర్కిల్ ఇండియా, రూర్కెలా సిటీ లేడీస్ సర్కిల్తో అనుబంధం కలిగి ఉన్న నవదీప్ కౌర్ ఈ ప్రపంచాన్ని అందరూ జీవించడానికి మెరుగైన ప్రదేశంగా మార్చలన్న ఆకాంక్షనూ వెలిబుచ్చుతుంది. మిసెస్ వరల్డ్ పోటీలలో పాల్గొనడానికి వెళ్లిన నవదీప్ కౌర్కు ఈ సందర్భంగా ఆల్ ద బెస్ట్ చెబుదాం. గ్రాండ్ ఫినాలేను భారత కాలమానప్రకారం జనవరి 16న ఉదయం 6:30 గంటలకు ఆన్లైన్ ద్వారా చూసి, తెలుసుకోవచ్చు. -
భర్త దొంగతనాలు చేస్తూ తరచుగా జైలుకు.. జీవితంపై విరక్తితో..
సాక్షి,పెద్దవూర(నల్గొండ): కుటుంబ కలహాలతో ఆదివారం రాత్రి నాగార్జునసాగర్ కొత్త వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన మహిళ మృతదేహం సోమవారం మధ్యాహ్నం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని పైలాన్కాలనీకి చెందిన రమావత్ అఖిల(25)తల్లిగారింటి వద్ద పైలాన్కాలనీలో నివాసం ఉంటోంది. భర్త దొంగతనాలు చేస్తు తరచుగా జైలుకు వెళ్తుండటం, అతని ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో పాటు ఆమె తండ్రి మరణించటం, తల్లికి భారంగా మారుతున్నానని భావించి జీవితంపై విరక్తి చెందిన అఖిల కొత్త వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు గజ ఈతగాళ్లతో అఖిల దూకిన ప్ర దేశంలో వెతికించగా మృతదేహం లభ్యం అయ్యింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సాగర్ కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి సంవత్సరంన్నర, మూడున్నరేళ్ల వయస్సున్న కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నర్సింహారావు తెలిపారు. చదవండి: జైలులో స్నేహం.. బయటకు వచ్చాక.. -
భర్తకి విడాకులిచ్చి.. కుక్కతో పెళ్లి.. తరువాత మహిళ చెప్పింది వింటే మైండ్ బ్లాక్!
కొన్ని సార్లు మన చూట్లు జరిగేవి పరిణామాలను చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. అందులో కొన్నింటిని అయితే నమ్మలేము కూడా. తాజాగా అలాంటి ఘటనే లండన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లండన్కు చెందిన అమండా రోడ్జర్స్ (47) తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత కొంతకాలం ఒంటరిగానే జీవితాన్ని గడిపింది. అయితే ఇటీవల అమండా తన పెంపుడు కుక్కతో ప్రేమలో పడింది. ఆ కుక్క పేరుషెబా. ఆమండా ఆ కుక్కని రెండు నెలల వయస్సు ఉన్నప్పటి నుంచి పెంచుతోంది. అప్పటి నుంచి షెబా తనపై ఎంతో ప్రేమని చూపిస్తోందని తెలిపింది. అందుకే మనుషులు చూపించే ప్రేమకంటే తన షెబాలోనే నిజమైన ప్రేమను చూశానని అందుకే దాన్నే భాగస్వామిగా ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకుంది అమండా. అందుకు తాను మోకాళ్లపై నిలబడి షెబాకు ప్రపోజ్ చేయగా అది తోక ఊపి తన అంగీకారం తెలిపినట్లు చెప్పింది. ఆ తర్వాత అమండా తన పెంపుడు కుక్క షెబాను 200 మంది బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అమండా ఇప్పటి వరకు షెబాతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ఆమె చుట్టు పక్కల వారికి అమండా, షెబా మధ్య ప్రేమ వింతగా అనిపించినా.. అమండా అవేమీ పట్టించుకోకుండా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నట్లు తెలపడంతో అటువంటి వారికి మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధనం చెప్పింది. చదవండి: స్క్విడ్ గేమ్ చూశాడని తుపాకులతో కాల్చి చంపి, ఆపై విద్యార్థులను.. -
బ్యూటీపార్లర్కు వెళ్లిన మహిళ అదృశ్యం
-
భూతవైద్యం చేసే మహిళతో ‘సంబంధం’.. ఇటీవల దూరం పెట్టడంతో...
సాక్షి,మిడ్జిల్( మహబూబ్ నగర్): తనను దూరంగా పెట్టిందని పథకం ప్రకారమే ఓ వివాహితను ప్రియుడే అత్యాచారానికి పాల్పడి.. ఆపై హత్య చేసి నగలు ఎత్తికెళ్లినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసు వివరాలను మంగళవారం మిడ్జిల్ పోలీస్స్టేషన్లో జడ్చర్ల రూరల్ సీఐ జములప్ప వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని మల్లాపూర్కు చెందిన లక్ష్మీదేవి (41) గత నెల 22వ తేదీ ఉదయం తన కూతురు స్వాతిని కల్వకుర్తికి చెందిన వెంకటేశ్వరాచారితో కలిసి జడ్చర్లకు తీసుకెళ్లింది. అక్కడి హాస్టల్లో కూతురిని వదిలిపెట్టి తిరిగి అదేరోజు సాయంత్రం మున్ననూర్ వద్ద దిగిపోయింది. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో మరుసటి రోజు భర్త శంకరయ్యగౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, బోయిన్పల్లి శివారులో సీతాఫలాల కోసం వెళ్లిన రవిప్రకాష్రెడ్డికి పీర్లమాన్యంగుట్టపై ఆమె మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా హత్యకు గురైన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ దొరికిన ఆమె ఫోన్కాల్ డేటా ఆధారంగా మృతురాలు గ్రామంలో భూతవైద్యం చేసేదని బయటపడింది. ఆ కోణంలో విచారణ జరపగా మల్లాపూర్కు చెందిన గంగిరెద్దుల వెంకటయ్యకు లక్ష్మీదేవితో వివాహేతర సంబంధం ఉన్నట్టు తేలింది. ఇటీవల అతడిని దూరం పెట్టడంతో ఎలాగైనా చంపేసి బంగారు నగలు తీసుకోవాలని పథకం పన్నాడు. పీర్లమాన్యంగుట్టలో బంగారు గనులు ఉన్నాయని వాటిని తీయాలని నమ్మించి అక్కడికి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారం జరిపి, పెద్ద బండరాయితో మోది చంపేసి ఒంటిపై ఉన్న ఆరు తులాల బంగారు పుస్తెలతాడు, నక్లెస్ తోపాటు తులం చైన్, మూడు గ్రాముల చెవికమ్మలు తీసుకుని పారిపోయాడు. చివరకు మంగళవారం నిందితుడిని అరె స్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును పది రోజుల్లోనే ఛేదించిన ఎస్ఐ జయప్రసాద్, ట్రెయినీ ఎస్ఐ శ్రావణ్కుమార్ను సీఐ అభినందించారు. చదవండి: ఆడుకుందామని పిలిచి ఐదేళ్ల చిన్నారిపై.. -
యువకుడితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్న భర్తని..
సాక్షి, హైదరాబాద్: అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో భర్తను చంపిన భార్యను, సహకరించిన ప్రియుడిని హబీబ్నగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాన్గార్ బస్తీకి చెందిన ఉప్పాడే రోషన్(25)కు అదే బస్తీకి చెందిన లతకు పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడ, ఒక మగ సంతానం ఉన్నారు. రోషన్ ఓ హోటల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. లతకు స్థానికుడైన కాంబ్లే యువరాజ్ పరిచయం అయ్యారు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో లతకు యువరాజ్ దగ్గరయ్యారు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు తెలినప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. దీంతో రోజూ భార్య భర్తల మధ్య ఘర్షణ జరిగేది. తమ ప్రేమకు అడ్డువస్తున్నాడనే కారణంతో భర్త రోషన్ను ఎలాగైనా అంతమొందించాలని భార్య లత నిర్ణయించుకుంది. ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం మద్యం సేవించి ఇంటికి వచ్చిన రోషన్ను భార్య లత, ప్రియుడు కాంబ్లే యువరాజ్ కలిసి కత్తితో పొడిచి చంపారు. ఈ కేసులో ఇరువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా తామే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. ఈ మేరకు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
వివాహేతర సంబంధం: నాలుగు కుటుంబాలకు నిలువనీడ లేకుండా చేసింది
సాక్షి,జయపురం: వివాహితతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే ఆరోపణపై ఓ యువకుని కుటుంబంతో పాటు వారి బంధువులపై గ్రామస్తులు దాడి చేశారు. అక్కడితో ఆగకుండా వారి ఇళ్లు, ఆస్తులు ధ్వంసం చేసి వారిని గ్రామం నుంచి బహిష్కరించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ అమానవీయ సంఘటన నవరంగపూర్ జిల్లా ఝోరిగాం సమితి అకడహిల్ గ్రామంలో చోటుచేసుకుంది. నాలుగు కుటుంబాలు గ్రామ బహిష్కరణ పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అకడహిల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామంలోని వేరే కులానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో మూడు నెలల కిందట మహిళ కుటుంబ సభ్యులు ఆ యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తాళ్లతో కట్టేసి దండించారు. అనంతరం ఓ ఇంట్లో బంధించారు. సమాచారం అందుకున్న ఉమ్మరకోట్ పోలీసులు గ్రామంలో విచారణ చేసేందుకు రాగా, వివాహితపై ఆ యువకుడు అత్యాచారం చేశాడని మహిళ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మహిళ బంధువులు అక్కడితో ఆగకుండా..యువకుని కుటుంబంతో పాటు వారి కులానికి చెందిన మరో మూడు కుటుంబాలపై దాడులకు పాల్పడ్డారు. ఇళ్లు ధ్వంసం చేశారు. వారందరినీ గ్రామం నుంచి తరిమేశారు. ప్రాణభయంతో వారంతా గ్రామం విడిచిపెట్టి సమీపంలోని బాగడియా గ్రామానికి వెళ్లి తలదాచుకుంటున్నారు. ఈ సంఘటనపై బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తి మాట్లాడుతూ..యువకుడు తప్పు చేసి ఉంటే అతిడిని శిక్షించాలి. కానీ ఆ కులస్తులందరినీ హింసించి గ్రామం నుంచి బహిష్కరించడం, వారి ఇళ్లు ధ్వంసం చేయడం, ఆస్తులు దోచుకోవడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటనపై ఉమ్మరకోట్ పోలీసు అధికారి నరేష్ కుమార్ ప్రధాన్ను సంప్రదించగా..యువకుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. గ్రామస్తులతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
అత్తింటికి వెళ్లాల్సిన నవవధువు ప్రియుడితో కలిసి..
బాపట్ల (గుంటూరు): ప్రేమించుకున్నారు... కలిసి జీవించాలి అనుకున్న నేపథ్యంలో అనుకోని విధంగా యువతికి తల్లిదండ్రులు మరొక వివాహం చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె మాజీ ప్రేమికుడితో కలసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక గ్రామంలో చోటుచేసుకుంది. బాపట్ల రూరల్ ఎస్ఐ వెంకటప్రసాద్ వివరాల ప్రకారం.. కొండుబొట్లవారిపాలేనికి చెందిన ప్రవల్లిక, శ్రీకాంత్లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే యువతి తల్లిదండ్రులు నెల రోజుల కిందట ఆమెకు మరో యువకుడితో వివాహం చేశారు. ఆషాఢమాసం కావడంతో ఆమె తల్లిదండ్రుల నివాసంలో ఉంటోంది. శ్రావణమాసం రావడంతో రెండు రోజుల్లో అత్తింటికి వెళ్లాల్సి ఉండగా సోమవారం సూర్యలంక గ్రామంలో మాజీ ప్రేమికుడితో కలసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, యువకుడి కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం అందించిన వైద్యులు, మెరుగైన వైద్యం కోసం పొన్నూరు తరలించారు. పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
పిన్నితో గొడవ.. ఆవేశంతో తలపై రోకలితో బాదిన కుమారుడు..
సాక్షి, హసన్పర్తి(వరంగల్ అర్బన్): హసన్పర్తి మండలం పెంబర్తిలో మంగళవారం రాత్రి హత్య జరిగింది. సొంత అక్క కుమారుడే రోకలితో తలపై బాదడంతో వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలు... పెంబర్తికి చెందిన కనుకయ్య సొంత అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకున్నాడు. సింగరేణిలో విధులు నిర్వర్తించిన ఆయన ఇటీవల ఉద్యోగ పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం ఆయన ఇద్దరు భార్యలు ప్రవీణ, విజయ(55)తో కలిసి పెంబర్తిలో ఉంటున్నాడు. అయితే, చిన్న భార్య విజయ ఇటీవల కనుకయ్య పేరిట నల్లబెల్లిలో ఉన్న ఆస్తిని విక్రయించి నగదు ఆమె కుమారుడికి ఇచ్చింది. దీంతో ప్రవీణ కుమారుడు వేణుగోపాల్ ఆ డబ్బులో తనకు వాటా ఇవ్వాలని కొంతకాలంగా పిన్నితో గొడవ పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదేక్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇంట్లో గొడవ జరిగింది. ఈ మేరకు ఆవేశంతో వేణుగోపాల్ ఇంట్లోని రోకలితో విజయ తలపై బాదగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రావు, ఎస్సై జితేందర్రెడ్డి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, నిందితుడు వేణుగోపాల్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
టీలో పొడి ఎక్కువైందని తిట్టిన అత్త, దీంతో కోడలు..
సాక్షి, గోల్కొండ(హైదరాబాద్): అత్త కోపగించుకుందని ఓ కోడలు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గోల్కొండ రేషంబాగ్కు చెందిన సయ్యద్ హబీబ్ భార్య బీబీ (24). ఆమె తన అత్త సతీయా బేగంతో కలిసి రేషం బాగ్లో ఉంటోంది. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అత్తా సతియా బేగం చిన్న విషయానికే కోపగించుకుంటోందని బీబీ పలుమార్లు భర్తకు తెలిపింది. ఇదిలాఉండగా సోమవారం ఉదయం సతీయా బేగంతన కోడలు బీబీకి టీ తెమ్మని చెప్పింది. దీంతో బీబీ ఇంట్లో టీ తయారు చేసి అత్తకు ఇచ్చింది. కాగా టీ లో పొడి ఎక్కువైందని సతీయా బేగం కోడలిపై విరుచుకుపడింది. కాగా అత్త చిన్న విషయానికే తనను దూషించినందుకు బీబీ మనస్తాపం చెంది తన గదిలోకి వెళ్లి చున్నీతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియగానే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాని స్వాధీనం చేసుకుని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
మరదలిని ఆరేళ్లుగా వేధిస్తున్న బావ.. దీంతో..
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని పదిర, రాచర్ల, గొల్లపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వివాహిత మహిళలను మానసికంగా వేధిస్తున్న ముగ్గురిపై ఆదివారం రాత్రి వేర్వేరుగా కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. తన సొంత అక్క భర్త వేధిస్తున్నాడని వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక వివాహిత ఫిర్యాదు మేరకు కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన చీకటి శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే చనిపోతానంటూ ఆరేళ్లుగా వేధిస్తున్నాడని, పుట్టింట్లో ఉండగా చేయి పట్టుకున్నట్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే గొల్లపల్లి గ్రామానికి చెందిన ముద్రకోళ్ల వంశీ అనే వ్యక్తి సహాయంతో కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన పూసల శేఖర్ మూడేళ్లుగా ఫోన్ చేస్తూ వేధిస్తున్నట్లు ఒక వివాహిత ఫిర్యాదు మేరకు వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
తోటి ఉద్యోగే ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. దీంతో ఆ మహిళ..
సాక్షి, పెద్దపల్లిరూరల్: తోటి ఉద్యోగే ప్రేమిస్తున్నానంటూ వెంటబడి వేధించడంతో భరించలేక పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామ వీఆర్ఏ దివ్య (33) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం నిమ్మనపల్లి గ్రామానికి చెందిన దివ్యకు సబ్బితం గ్రామానికి చెందిన శేఖర్తో వివాహమైంది. మనస్పర్ధల కారణంగా వారిద్దరూ విడిపోయి, విడాకులు పొందారు. నిమ్మనపల్లి వీఆర్ఎగా విధులు నిర్వహిస్తూ దివ్య ప్రస్తుతం పెద్దపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో డెప్యూటేషన్పై పనిచేస్తోంది. ఈ క్రమంలో కొత్తపల్లి గ్రామ వీఆర్ఏ పెర్క వెంకటేశ్ తనను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధిస్తుండడంతో మనస్తాపానికి గురై ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతురాలి సోదరుడు దిలీప్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి తల్లిదండ్రులు పోచమ్మ, నర్సయ్య సోదరులు దిలీప్, దినేశ్ ఉన్నారు. -
పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధం.. ఆపై
సాక్షి, గార్ల(మహబూబాబాద్) : వివాహేతర సంబంధం నెపంతో ఓ వ్యక్తిని పట్టపగలే హత్య చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్లలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గార్లలోని పుట్టకోట బజారుకు చెందిన గొడుగు ధనమ్మ భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం చనిపోగా కుమారుడు ఉన్నాడు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన రాయల వెంకటేశ్వర్లు(55) కారేపల్లిలోని కవిత ఇంజనీరింగ్ కళాశాల బస్సు డ్రైవర్గా పని చేస్తున్నాడు. రోజూ గార్ల నుంచి విద్యార్థులను కళాశాలకు తీసుకెళ్లి.. తిరిగి సాయంత్రం తీసుకువచ్చి గార్లలోనే బస చేసేవాడు. ఈ క్రమంలో ధనమ్మతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న ధనమ్మ తమ్ముడు చాట్ల కోటేష్, ఆమె అక్క కొడుకు గంగరబోయిన సంపత్ కలిసి పథకం ప్రకారం మధ్యాహ్నం ధనమ్మ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో ధనమ్మతో పాటు వెంకటేశ్వర్లు ఉండడంతో కోపోద్రిక్తులైన కోటేష్, సంపత్ ఫ్యాన్ స్టాండ్ రాడ్తో వెంకటేశ్వర్లును చితకబాదారు. దీంతో తలకు, చాతిపై తీవ్రగాయాలై వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన ధనమ్మకు సైతం గాయాలయ్యాయి. అనంతరం నిందితులిద్దరూ పరారయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై బాదావత్ రవి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహబూబా బాద్ నుంచి క్లూస్ టీంను రప్పించి ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు. -
పెళ్లిరోజు వేడుకలు.. అంతలోనే విషాదం!
తిరుమలగిరి (నాగార్జునసాగర్): అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని కొంపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని శ్రీరాంపల్లి గ్రామానికి చెందిన పోలోజు శ్రీనివాసచారి, కోటమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సంతానం. రెండో కుమార్తె బొడ్డుపల్లి మాధవి(26) మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి మహేష్కు ఇచ్చి వివాహం జరిపించారు. ఈమె భర్త మహేష్ హాలియాలో ట్రాక్టర్ వెల్డింగ్ షాపును కొనసాగిస్తున్నాడు. కాగా, భార్యభర్తల మధ్యతరుచు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీన వారి పెళ్లిరోజు వేడుకలను భార్యభర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారే సరికి బొడ్డుపల్లి మాధవి మృతిచెందింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి వంటిపై గాయాలు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలి తండ్రి శ్రీనివాసచారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. -
మూడో పెళ్లి.. వివాహిత అనుమానాస్పద మృతి
వైరారూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పాలడుగు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పాలడుగు గ్రామానికి చెందిన మాణిగ భాస్కర్ అలియాస్ బజార్ కోదాడ మండల ద్వారాకుంట గ్రామానికి చెందిన శైలజ (27)ను సుమారు ఐదేళ్ల క్రితం మూడో వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో నిత్యం ఘర్షణ పడుతుండేవారు. దీంతో శైలజ తరచూ పుట్టింటింకి వెళ్తుండేది. మూడు రోజుల క్రితం కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగడంతో శైలజ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతుకుతున్నారు. కాగా కొందరు రైతులు ఆదివారం పాలడుగు సమీపం నుంచి వెళ్తుండగా బావిలో నుంచి దుర్వాసన వచ్చింది. బావి వద్దకు వెళ్లి గమనించగా శైలజ మృతదేహం కనిపించింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నించగా.. వారు శనివారం మధ్యాహ్నం వరకు ఇంటికి తాళం వేసి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పెద్దపల్లి: వివాహితపై సామూహిక అత్యాచారం?
సాక్షి, పెద్దపల్లి: ఇటుక బట్టీలో పనిచేసే ఓ వివాహితపై యజమానులే అఘాయిత్యానికి ఒడిగట్టారు. గత నెల 24న పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు మానవ హక్కుల సంఘానికి (హెచ్ఆర్సీ) లేఖ రాయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెచ్ఆర్సీ నుంచి అధికారులకు అందిన లేఖ ప్రకారం.. గౌరెడ్డిపేటలోని ఎల్ఎన్సీ ఇటుక బట్టీలో పనిచేసే ఒడిశాకు చెందిన వివాహిత (22)పై ఐదుగురు యజమానులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం దంపతులపై దాడి చేశారు. తమకు ప్రాణహాని ఉందని భావించిన సదరు దంపతులు.. అక్కడి నుంచి తప్పించుకుని స్వగ్రామం వెళ్లేందుకు రామగుండం రైల్వేస్టేషన్కు వెళ్లారు. వారిని పట్టుకున్న యజమానులు మళ్లీ ఇటుక బట్టీల వద్దకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. సాక్ష్యం చెబుతారనే ఉద్దేశంతో మరో 14 మంది కూలీలను నిర్బంధించి దాడి చేశారు. అయితే.. ఈ విషయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మానవ హక్కుల సంఘానికి లేఖ రాశారు. స్పందించిన హెచ్ఆర్సీ.. విచారణ చేపట్టాలని పెద్దపల్లి ఆర్డీవో శంకర్కుమార్, ఎస్సై రాజేశ్, తహసీల్దార్ శ్రీనివాస్, సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ స్వప్నను సోమవారం ఆదేశించింది. వీరంతా ఇటుక బట్టీల వద్ద కూలీలతో మాట్లాడారు. పదిమంది కూలీలు, వారి పిల్లలకు కేంద్రంలో ఆశ్రయం కల్పించామని కేంద్రం అడ్మినిస్ట్రేటర్ స్వప్న తెలిపారు. బాధితులను దాచారా? అధికారులు విచారణకు వెళ్లిన సమయంలో బాధితురాలు, ఆమె భర్త ఇటుక బట్టీల వద్ద కనిపించలేదు. దీంతో యజమానులే వారిని దాచిపెట్టి ఉంటారని కూలీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణకు యజమానులు సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా, అత్యాచారం, కూలీల నిర్బంధంపై విచారణ జరుపుతున్నామని, త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆర్డీఓ తెలిపారు. కాగా, గతంలో సైతం ఇదే ఇటుక బట్టీలో ఓ కూలీ మృతి చెందగా తోటి కూలీలకు తెలియకుండా యాజమాన్యం దాచి పెట్టిందని పలువురు కూలీలు గుర్తు చేస్తున్నారు. -
మిస్డ్ కాల్తో ఏర్పడ్డ ప్రేమ కారణంగా..
చెన్నై, అన్నానగర్: మిస్డ్ కాల్తో ఏర్పడ్డ ప్రేమ కారణంగా ఇద్దరు పిల్లలను వదిలేసి వివాహం కాలేదని ఓ యువకుడిని మోసం చేసిన మహిళను ప్రస్తుతం ఇద్దరు భర్తలు, బంధువులు ఆమెను అంగీకరించలేదు. తమిళనాడులోని నెల్లై జిల్లా సేరన్ మహాదేవికి చెందిన కూలీ కార్మికుడికి పాళయంకోటై కృష్ణాపురానికి చెందిన బంధువు మహిళకి గత పదేళ్లకు ముందు వివాహం జరిగింది. తల్లిదండ్రులను కోల్పోయి బంధువుల పరామర్శలతో పెరుగుతూ వచ్చిన ఆ మహిళ వద్ద నగలు, నగదు వంటివి ఏమీ తీసుకోకుండా కూలీ కార్మికుడు వివాహం చేసుకున్నాడు. వీరికి 8 ఏళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ స్థితిలో ఒక్కటిన్నర సంవత్సరాల ముందు ఆ మహిళకి ఓ మిస్డ్ కాల్ వచ్చింది. కాయత్తార్కి చెందిన యువకుడితో పరిచయమై కాలక్రమేణా ప్రేమగా మారింది. ప్రేమ మత్తులో ఉన్న ఆ మహిళ ఆ యువకుడి వద్ద తనకు వివాహం జరిగి పిల్లలు ఉన్నారనే విషయాన్ని దాచిపెట్టింది. ప్రియుడిని కలవడానికి వెళ్లినప్పుడు మంగళసూత్రాన్ని తీసేసి బ్యాగులో పెట్టుకుని ఊరు తిరిగింది. 29 ఏళ్ల ఆ మహిళ 24 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకోవడానికి పథకం వేశారు. అనంతరం ఆ మహిళ గత 20వ తేదీ నాగర్కోవిల్లో ఇంటర్వ్యూ అని భర్తకు చెప్పి వెళ్లింది. తరువాత ప్రియుడితో తెన్కాశి సమీపంలో సుందరపాండియన్ పురానికి వెళ్లిన ఆ మహిళ ప్రియుడి బంధువుల ముందు 24వ తేదీ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలియని భర్త తన భార్య కనబడడం లేదని, భార్యను కనిపెట్టి ఇవ్వమని సేరన్ మహాదేవి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఫొటోని ఆ మహిళ తన ఫొన్లో స్టేటస్గా పెట్టింది. దీన్ని ఆమె బంధువులు, కుటుంబీకులుకు తెలిపిన అనంతరం వారు సేరాన్ మహాదేవి పోలీసులకు తెలిపారు. వారు కయత్తార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు జులై 1వ తేదీ ఇద్దరినీ పిలుచుకుని విచారణ చేసినప్పుడు ఆ మహిళకు ముందుగానే వివాహం జరిగి పిల్లలు ఉన్నట్లు తెలిసింది. అనంతరం ఆ యువకుడు ఆమెను అంగీకరించలేదు. సేరణ్ మహాదేవి పోలీసులు గత రెండో తేదీ సేరన మహాదేవిని పిలుచుకుని వెళ్లి వచ్చారు. దీనిపై భర్త, బంధువులకు తెలిపితే వారు కూడా ఆమెను అంగీకరించలేదు. ఆమెను ఆ రోజు రాత్రి సేరన్ మహాదేవిలో ఉన్న కరోన శిబిరంలో ఉంచారు. మరుసటి రోజు కృష్ణాపురంలో ఉన్న బంధువులకు సమాచారం తెలిపి వారి పర్యవేక్షణలో వాగ్వాదం ఏర్పడింది. ఇందులో ఆ మహిళను అంగీకరించడానికి ఎవరూ ముందుకు రాలేదు. మరలా ఆ మహిళను సేరన్ మహాదేవి శిబిరానికి పంపారు. వేరే జిల్లా నుంచి మహిళ రావడం వల్ల ఆమెకు జులై 4వ తేదీ వరకు కరోనా పరిశోధన చేశారు. శిబిరంలో ఉన్న మిగతా వారికి పరిశోధన ముగిసి రిజల్ట్ వచ్చిన స్థితిలో ఈమెకి మాత్రం రిజల్ట్ వెయిటింగ్లో ఉంది. మూడు రోజులుగా ఆ మహిళ శిబిరంలోనే ఉంది. -
అనుమానాస్పద రీతిలో వివాహిత మృతి
సాక్షి, కురబలకోట: మండలంలోని మట్లివారిపల్లె పంచాయతీ వనమరెడ్డిగారిపల్లె (పెద్దపల్లె)లో జనవరి 2వ తేదీ రాత్రి వివాహిత హత్యకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పొలంలో పూడ్చిపెట్టారు. అనంతరం ఆమె అదృశ్యమైనట్టు నాటకమాడారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు తెలిశాయి. మృతదేహాన్ని బుధవారం బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. దృశ్యం సినిమాను తలపించేలా హత్యను తప్పుదారి పట్టించేందుకు నిందితులు ఆడిన నాటకాన్ని చూసి పోలీసులు విస్తుపోయారు. రూరల్ సర్కిల్ సీఐ అశోక్కుమార్ కథనం మేరకు.. వనమరెడ్డిగారిపల్లెకు చెందిన మల్రెడ్డి (27) ఆర్టీసీ అద్దె బస్సుకు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం మదనపల్లెకు చెందిన బీటెక్ చదువుతున్న గాయత్రి (25) పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకుని ఆరు నెల ల క్రితం పెళ్లి చేసుకున్నారు. గాయత్రి కులం వేరు కావడంతో మల్ రెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లిని అంగీకరించలేదు. దీంతో అతను మదనపల్లెలో కాపురం పెట్టాడు. భార్యపై అనుమానం కలగడంతో ఇటీవల కాపురాన్ని స్వగ్రామానికి మార్చాడు. పోలీస్ స్టేషన్లో కూడా పంచాయితీ జరిగింది. వేరే కులం కావడం, ఆపై భార్యపై అనుమానం రావడంతో ఆమెను వదిలించుకోవాలని పథకం పన్నాడు. హరికథ రోజే హత్య వనమరెడ్డిగారిపల్లెకు చెందిన ఒక వ్యక్తి చనిపోవడంతో జనవరి 2వ తేదీన దివసం కార్యక్రమాల్లో భాగంగా హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశారు. గ్రామస్తులు హరికథ దగ్గరకు వెళ్లడంతో మల్రెడ్డి, అతని కుటుంబ సభ్యులు కలిసి ఊపిరి ఆడకుండా చేసి గాయత్రిని హత్య చేశారు. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా అదే రోజు రాత్రి దగ్గరలోని పొలంలో పూడ్చిపెట్టారు. శవం పూడ్చిన ఆనవాళ్లు కని్పంచకుండా ట్రాక్టర్తో దున్నించారు. తిరుపతిలో సెల్ఫోన్ తిప్పారు పోలీసుల విచారణకు దొరక్కుండా మరుసటి ఉదయమే ఆమె సెల్ ఫోన్ను మరొకరి చేతికి ఇచ్చి తిరుపతిలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో తిరిగొచ్చి ఆ తర్వాత సెల్ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. పోలీసులు మొబైల్ సిగ్నల్ను ట్రాక్ చేస్తే తిరుపతి వెళ్లినట్లు తెలుస్తుందని ఇలా చేశారు. అనుకున్నట్లుగానే మదనపల్లె రూ రల్ పోలీస్ స్టేషన్లో ఆమె అదృశ్యమైనట్లు భర్త జనవరి 6న ఫిర్యాదు చేశాడు. ఆమె సెల్ సిగ్న ల్స్ ఆ«ధారంగా చూస్తే తిరుపతి వెళ్లినట్లు వెల్లడైంది. మిస్టరీగా మారడంతో చివరకు సీటీఎం దగ్గరున్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో కీలక విషయం బయటప డింది. భార్య సెల్ఫోన్ను భర్తే మరొకరి చేతికి ఇచ్చి తిరుపతి బస్సు ఎక్కించినట్లు వెల్లడైంది. అతని కుటుంబ సభ్యులను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శవం వెలికితీత వనమరెడ్డిగారిపల్లె పొలాల్లో పూడ్చిన గాయత్రి మృతదేహాన్ని పోలీసులు బుధవారం బయటకు తీశారు. కుళ్లిన స్థితిలో ఉన్న శవానికి అక్కడే తహసీల్దార్ నీలమయ్య శవ పంచనామా చేశారు. డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. డీఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్త మల్రెడ్డి, అతని తమ్ముడు కార్తీక్ రెడ్డి (25), కుటుంబ సభ్యులు అమరనాథరెడ్డి (27), గంగల్రెడ్డి, గంగిరెడ్డి, లక్ష్మిదేవమ్మపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
వివాహితతో టీడీపీ నేతల అసభ్య ప్రవర్తన
సాక్షి, తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గంలో మహిళలపై టీడీపీ నాయకుల అకృత్యాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. యర్రబాలెంలో టీడీపీ నాయకుల అనుచరులు ఓ యువతిని ఏడిపించిన ఘటన మరువకముందే.. తాడేపల్లిలో వివాహితను టీడీపీ నాయకుడు నమ్మకంగా కారు ఎక్కించుకుని అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై శనివారం తాడేపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహానాడు ప్రాంతంలో నివాసముండే ఓ వివాహిత ప్రయివేటు పాఠశాలలో టీచర్. టీడీపీ నాయకుడు దానా వేణుగోపాల్ అలియాస్ డ్రైవర్ చిన్న మనవళ్లు కూడా అదే పాఠశాలలో చదువుతున్నారు. వారిని తీసుకెళ్లేందుకు కారులోవచ్చిన వేణుగోపాల్.. మార్గంమధ్యలో నడిచి వెళుతున్న టీచర్ను బలవంతంగా కారు ఎక్కించాడు. అనంతరం తన మనవళ్లను దించేసి.. టీచర్ను సీతానగరం రామయ్యకాలనీలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించసాగాడు. భయపడిన ఆమె.. వెంటనే భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. భర్త వెంటనే రామయ్యకాలనీకి రాగా.. వేణుగోపాల్ అక్కడ నుంచి కారును మరో టీడీపీ నాయకుడి ఇంటి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడకూ భర్త చేరుకుని తన భార్యను విడిచిపెట్టాలంటూ ప్రాధేయపడ్డాడు. మరో టీడీపీ నాయకుడు కూడా అసభ్యకరంగా మాట్లాడటంతో బెంబేలెత్తిపోయిన భర్త.. కారు వద్దకు పరుగులుతీశాడు. అంతలో భార్య కారులోంచి కిందకు దూకి భర్తతో కలిసి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృత
సాక్షి, పుత్తూరు: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన పుత్తూరులో జరిగింది. బంధువుల కథనం మేరకు.. పుత్తూరు ఆరేటమ్మ కాలనీకి చెందిన హరిప్రియకు కుమార్తె గోమతి (24) నాలుగేళ్ల కిత్రం నగరి పట్టణం రామ్నగర్ కాలనీకి చెందిన జ్ఞానశేఖర్ కుమారుడు చిరంజీవిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. చిరంజీవి పుత్తూరు మెయిన్ రోడ్డులో బాలాజీ కంప్యూటర్స్ దుకాణం నడుపుతున్నాడు. గోమతికి భర్త, అత్తమామల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో గోమతి రెండు నెలల క్రితం కుమారుడిని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. ఆదివారం మధ్యాహ్నం కుటుంబ విషయాలు చర్చించేందుకు కంప్యూటర్ దుకాణానికి రావాలని భర్త చిరంజీవి ఫోన్ ద్వారా భార్యను కోరాడు. భర్త వద్దకు వెళ్లిన గోమతి దుకాణంలో ఉరి వేసుకుంది. ¿భర్త చిరంజీవి గమనించి ఆమెను పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నా కూతురిని భర్తే పొట్టనపెట్టుకున్నాడు తన కూమార్తెను భర్త చిరంజీవి పొట్టన పెట్టుకున్నాడని తల్లి హరిప్రియ కన్నీటిపర్యంతమైంది. ఆమె విలేకరులతో మాట్లాడుతూ కుటుంబ విషయాలు చర్చిద్దామని గోమతిని ఒంటరిగా పిలిపించుకున్నాడని వాపోయింది. దుకాణంలో హత్య చేశాడని ఆరోపించింది. వరకట్నం కోసం మానసికంగా, శారీరకంగా హింసించారని చెప్పింది. ఈ మేరకు పుత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
గుంటూరు, షేర్మహ్మద్పేట అడ్డరోడ్డు (జగ్గయ్యపేట): అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిచెందింది. ఈ ఘటన అడ్డరోడ్డు సమీపంలోని మంగొల్లు రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తెలంగాణ రాష్ట్రం చిలుకూరు మండలం బుదియా తండాకు చెందిన మళావత్ విజయ (40)కు భర్తతో మూడేళ్ల క్రితం విబేధాలు రావడంతో పట్టణానికి విచ్చేసింది. శాంతినగర్లోని వినాయక విగ్రహాలు తయారీ కేంద్రంలో కొంతకాలంగా పనిచేస్తోంది. ఈ క్రమంలో తెల్లవారుజామున మంగొల్లు రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ అబ్దుల్నబీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలం వద్ద మృతురాలు అర్ధనగ్నంగా ఉండటంతో పాటు చిన్నచిన్న గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. మృతురాలు ప్రతిరోజు మద్యం తాగుతుందని ఈ ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులతో చనువుగా ఉంటుందని, మృతి వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
వివాహిత అనుమానాస్పద మృతి
కర్ణాటక, కృష్ణరాజపురం : వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన హొసకోటె తాలూకా చొక్కహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. నందగుడికి చెందిన మోనిక (24) చోక్కహళ్లి గ్రామానికి చెందిన మంజునాథ్తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. కొద్ది కాలం అంతా సజావుగానే సాగినా కొద్ది రోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం మోనిక ఇంట్లో విగతజీవిగా పడిఉండడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మోనికా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మోనికాను భర్త మంజునాథ్ హత్య చేశాడంటూ మోనిక తండ్రి సోమణ్ణ ఫిర్యాదు చేయడంతో నందగుడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కొద్దిగంటల్లో పెళ్లి.. కీచకునికి కటకటాలు
ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. ఆమెను గర్భవతిని చేసి పెళ్లి మాటెత్తేసరికి ముఖం చాటేశాడు. కొన్ని గంటల్లో మరో అమ్మాయికి తాళి కట్టడానికి సిద్ధమైన ఆ వంచకుడు బాధితురాలి ఫిర్యాదుతో కటకటాల పాలయ్యాడు. దొడ్డబళ్లాపురం: భర్తకు దూరంగా ఉంటున్న యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారం చేసి, తీరా ఆమె గర్భవతి అయ్యాక మరో యువతితో పెళ్లికి సిద్ధపడ్డ మోసగాడిని, అతడి తండ్రిని దొడ్డ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ పరిధిలోని కరేనహళ్లి నివాసులయిన రాజన్న(45)ఇతడి కుమారుడు బుల్లెట్ గౌతమ్(22)అరెస్టయిన నిందితులు. జిమ్కు వెళ్తుండగా వల బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు... పట్టణ శివారులోని జాలప్ప కళాశాల క్వార్టర్స్ వద్ద నివసిస్తున్న వివాహిత యువతి (24) భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె పట్టణంలోని కోర్టు రోడ్డులో ఉన్న బుల్లెట్ జిమ్కు సంవత్సరం నుండి ఫిట్నెస్ కోసం నిత్యం వచ్చేది. ఈ క్రమంలో జిమ్ ఓనర్ గౌతమ్ మాటలు కలిపి పరిచయం పెంచుకుని కొద్ది రోజులకు ప్రేమిస్తున్నానని చెప్పాడు.పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మబలికాడు. భర్తకు విడాకులు ఇచ్చి వస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. జిమ్లో, బెంగళూరు రోడ్డులోని ఒక అపార్ట్మెంటు గదిలో, హోటల్ రూంలలో అనేకసార్లు వద్దన్నా తనపై అత్యాచారం చేసాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లికి ససేమిరా ఆమె గత నెల గర్భందాల్చింది. విషయం గౌతమ్కు చెప్పడంతో పెళ్లికి నిరాకరించాడు. ఈ విషయం గౌతమ్ తండ్రికి చెప్పినా ఆయన పట్టించుకోలేదు. చాలదన్నట్టు గుట్టుగా ఘాటిక్షేత్రంలో తన కొడుక్కి మరో యువతితో బుధవారంనాడు వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశాడు. దీంతో యువతి తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు తండ్రీ, కొడుకును అరెస్టు చేశారు. జిమ్ పెట్టింది అందుకేనా? గౌతమ్ అమ్మాయిలను వలలో వేసుకోవడానికే వ్యాయామశాలను ప్రారంభించాడని, జిమ్లో వ్యాయామం చేయిస్తూ అమ్మాయిలను ఆకర్షిస్తాడని, ఇప్పటికే గౌతమ్ చేతిలో అనేకమంది అమ్మాయిలు మోసపోయారని సమాచారం. ఇక గౌతమ్ తండ్రి కరేనహళ్లిలో నేత కార్మికులకు రుణాలు ఇస్తూ మీటర్ వడ్డీలు వసూలు చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. -
బీచ్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం
ఆరిలోవ(విశాఖ తూర్పు): సాగర్నగర్ దరి బీచ్లో గుర్తు తెలియని ఓ వివాహిత మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాగర్నగర్ దరి జూ సాగర్ గేటు ఎదురుగా బీచ్లో సోమవారం ఓ మహిళ మృతదేహం బయటపడింది. సముద్రం లోపలకు వెళ్లేవారిని రక్షించే గార్డులు నిరంతరం బీచ్లో తిరుగుతుంటారు. ఇందులో భాగంగా సామవారం సాయంత్రం అటుగా వెళ్లిన అప్పన్న ఒడ్డుకు చేరిన మృతదేహాన్ని గమనించి వెంటనే ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్ఐ అప్పారావు సిబ్బందితో అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై æగాయాలు లేవు. సమాచారం కోసం ఆమె వద్ద ఆధారం లభించలేదు. ఆమె వయసు సుమారు 25 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. దీంతో నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. ఎక్కడైనా అదృశ్యం కేసు నమోదైతే వివరాలు సేకరించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మెడలో బంగారు పుస్తెలతాడు, కాళ్లకు మట్టిలు ఉండటంతో వివాహితగా గుర్తించారు. శరీరంపై ఎక్కడా గాయాలు లేకపోవడంతో ఆమె ప్రమాదవశాత్తు సముద్రం అలలకు కొట్టుకుపోయిందా..?, లేదంటే ఏవైనా సమస్యలుతో ఆత్మహత్యకు పాల్పడిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె వివరాలు తెలిస్తే గానీ అసలు విషయం చెప్పలేమని ఎస్ఐ అప్పారావు తెలిపారు. మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించి భద్రపరిచారు. -
పెళ్లి చేసుకోవాలని వివాహితకు వేధింపులు
బంజారాహిల్స్: తనను పెళ్ళి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి వెంటపడి వేధించడమే కాకుండా తాను పని చేస్తున్న షోరూంలో ల్యాండ్లైన్కు ఫోన్చేసి వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాంత్ ముదిరాజ్ అనే యువకుడు 15 రోజుల నుంచి తనను మానసికంగా వేధిస్తున్నాడని పెళ్ళి చేసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నాడని వివాహిత(43) పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. గతంలో కూడా శ్రీకాంత్ ముదిరాజ్ తనను ప్రేమ, పెళ్ళి పేరుతో వేధించగా కేసు పెట్టగా ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని మళ్ళీ వేధింపులకు గురిచేస్తున్నాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేస్బుక్ పరిచయం కొంప ముంచింది
సాక్షి,గుంటూరు: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తి చివరకు తన కొంప ముంచాడంటూ ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. గుంటూరులో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు వచ్చిన బాధితురాలు అర్బన్ ఏఎస్పీ వైటీ నాయుడును కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. ఫిర్యాదులో ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అదే మండలంలోని కంతేరు గ్రామానికి చెందిన బేతాల రాజేష్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. ఆరు నెలల క్రితం ఆ వివాహిత ఫేస్బుక్ అకౌంట్కు హాయ్ అని సందేశం పంపాడు. తాను క్లాస్మేట్నంటూ పరిచయం చేసుకున్నాడు. దీంతో ఆ వివాహిత అతనితో చాటింగ్ ప్రారంభించింది. అనంతరం ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా ఆమెకు ఫోన్చేసి పరిచయం పెంచుకున్నాడు. అతడు బలవంతం చేయడంతో వ్యక్తిగత ఫొటోలను వాట్సాప్లో పంపించింది. ఆ తరువాత వాటిని సాకుగా చూపుతూ.. తనతో శారీరక సంబంధానికి అంగీకరించాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. గత్యంతరం లేని స్థితిలో ఆమె అంగీకరించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మూడు నెలల క్రితం రూ.12 లక్షల నగదు, బంగారు గొలుసు తీసుకుని రాజేష్తో వెళ్లింది. మంగళగిరిలోని గుర్తు తెలియని ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న రాజేష్ ఆమెతో కాపురం పెట్టాడు. తాను బయటకు వెళ్లాల్సి వస్తే ఆమెను గదిలో ఉంచి తాళం వేసి వెళ్లేవాడు. ఈ క్రమంలో భర్తతో విడాకులు వచ్చాయని ఆమెను నమ్మించి గతేడాది డిసెంబర్లో విజయవాడలోని గుణదల ఆలయంలో వివాహం చేసుకున్నాడు. క్రమంగా డబ్బు, బంగారం మొత్తం తీసేసుకున్న రాజేష్ తరచూ వేరే యువతులతో ఫోన్లు మాట్లాడటాన్ని ఆమె గమనించింది. నిలదీస్తే చంపడమో, వ్యభిచార కూపానికి తరలించడమో చేస్తాడని భయపడింది. ఈ నెల 14న అతని చెర నుంచి తప్పించుకుని పుట్టింటికి చేరుకుని.. తనకు జరిగిన అన్యాయంపై పెద్దకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న రాజేష్ ఈనెల 21న రాత్రి వివాహిత పుట్టింటికి వెళ్లాడు. తనతో రాకుంటే ఆమె కుటుంబాన్ని హతమారుస్తానని హెచ్చరించాడు. అతడి నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించి, అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వివాహిత పోలీసులను కోరింది. -
వివాహిత అనుమానాస్పద మృతి
ప్రకాశం, మార్టూరు: మండల కేంద్రమైన మార్టూరులో ఓ వివాహిత మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక యాదవ బజారుకు చెందిన పెనుబోయిన శ్రీను, గోవిందమ్మ భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తెకు వివాహం జరిపించారు. వీరు వ్యవసాయం, గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి పిల్లలతో కలిసి నిద్రపోయిన గోవిందమ్మ (45) ఉదయం స్థానికులు గమనించేసరికి ఇంటి పక్కన ఉన్న షెడ్డులో తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికులు కిందకు దించి పరిశీలించగా ఆమె అప్పటికే మరణించినట్లు గమనించారు. మూడు రోజుల క్రితం గొర్రెలు మేపడానికి వెళ్లిన గోవిందమ్మ భర్త శ్రీనును స్థానికులు పిలిపించి పోలీసులకు సమాచారం అందించారు. తమ మధ్య గొడవలు ఏమీలేవని కొంతమేరకు ఆర్థిక ఇబ్బందులతో పాటు గత కొంతకాలం నుంచి గోవిందమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు శ్రీను చెప్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు గోవిందమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
భవనం పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్య
మియాపూర్: భవనం పైనుంచి దూకి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ వెంకటేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవడకు చెందిన నేతాజీ, వెంకట మాణెమ్మ దంపతుల కుమార్తె ఉమా వెంకట సత్యనాగరాణి (33)కి తూర్పుగోదావరి రావులపాలెం కాసూరినగర్కు చెందిన శివకుమార్తో వివాహం జరిగింది. గత కొంతకాలంగా వీరు మియాపూర్ డైమండ్ హిల్స్ –3 ఉంటున్నారు. మంగళవారం ఉదయం శివకుమార్ ఇంట్లో లేని సమయంలో ఉమ అపార్ట్మెంట్ 5వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఆమెను కేపీహెచ్బీలోని అనుపమ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నా భర్త వేధిస్తున్నాడు
నాగోలు: తన భర్త పోలీస్ ఉద్యోగంలో ఉండి పలుకుబడితో అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడంలేదని ఆరోపిస్తూ ఓ మహిళ తన ముగ్గురు కుమారులను తీసుకుని ఎల్బీనగర్లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఆమె కిరోసిన్ పోసుకుని, పిల్లలకు పోసి ఆత్మహత్యా యత్నం చేయగా అక్కడే ఉన్న పోలీసులు, మీడియా ప్రతినిధులు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా కరణ్కోట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఎస్ఐగా పనిచేస్తున్న కోలుకులపల్లి రాజయ్యతో అదే ప్రాం తానికి రేణుకాగౌడ్తో ఓ కేసు విషయంలో పరిచయం ఏర్పడింది. రాజయ్య తన భార్య చనిపోయిందని నమ్మించి 2009లో యాదాద్రిలో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కలిసి తాండూరు, పరిగి, మహబూబ్నగర్ ప్రాంతాల్లో కొంతకాలం కాపురం పెట్టారు. అతడికి నగరానికి బదిలీ కావడంతో కుటుంబ సభ్యులను తీసుకువచ్చి ఎల్బీనగర్ ప్రాంతంలోని మన్సూరాబాద్లో కాపురం పెట్టాడు. వీరికి ముగ్గురు కుమారులు రాజేష్, రాంచరణ్, నర్సింహులు ఉన్నారు. సీఐగా ప్రమోషన్ వచ్చిన అనంతరం రాజయ్య రేణుకతోపాటు పిల్లలను పట్టించుకోవడం లేదు. ఇదే విషయంపై రేణుక సరూర్నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గతంలో తనపై దాడి చేశాడని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని, సరైన న్యాయం చేయడంలేదని ప్రస్తుతం సంగారెడ్డిలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజయ్య తన పిల్లలకు అన్యాయం చేస్తున్నాడని, మరోభార్యతో వనస్థలిపురం పోలీస్స్టేషన్లో తనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయిస్తున్నారని మనస్థాపం చెందిన ఆమె సోమవారం మధ్యాహ్నం ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసు కున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్భగవత్, వనస్థలిపురం ఏసీపీని పిలిపించి విషయంపై ఆరాతీశారు. గతంలోనే వివాహం జరిగిన రాజయ్య రేణుకకు, అన్యాయం చేయడంతో పాటు ప్రస్తుతం మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు విచారించి బాధితురాలికి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. -
పిల్లలను బంధించి తల్లిపై లైంగిక దాడి..
జీవనోపాధి కోసం భర్త ఆటో నడిపేందుకు వెళ్లగా నలుగురు పిల్లలతో ఒంటరిగా ఉన్న మహిళపై కామాంధులు తెగబడ్డారు.పిల్లలను గదిలో బంధించి లైంగిక దాడి చేశారు. ఈ దుర్ఘటన శనివారం రాత్రిపహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట: జీవనోపాధి కోసం భర్త ఆటో నడిపేందుకు వెళ్లగా ఆమె పిల్లలతో కలిసి ఇంట్లో ఉంటోంది. ఒంటరిగా ఉన్న ఆమెపై కామాంధులు తెగబడ్డారు. నలుగురు పిల్లలను ఒక గదిలో బంధించి దారుణంగా లైంగిక దాడి చేశారు. ఒకరు బెదిరిస్తూ ఉండగా మరో ఇద్దరు సమాజం తలదించుకునేలా అత్యాచారం చేశారు. బంధువులే రాబందులుగా మారి కొనసాగించిన ఈ దుస్యాసన పర్వం నగర శివారులోని పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. జల్పల్లి వాదే ముస్తఫా బస్తీకి హర్యానా నుంచి షాకీర్ ఖాన్ కుటుంబం ఇటీవలే వలస వచ్చి నివాసం ఉంటుంది. షాఖీర్ఖాన్ ఆటోడ్రైవర్గా పని చేస్తుండగా....అతని భార్య (25) నలుగురు పిల్లలతో కలిసి ఇంటి వద్దే ఉంటుంది. వీరికి దగ్గరలోనే సమీప బంధువులు కూడా నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం భర్త ఆటోకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉందని గుర్తించిన బంధువులు ఆజాద్, అంజాద్లతో పాటు వారి స్నేహితుడు రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చి మంచినీరు అడిగారు. తెలిసిన వారే కావడంతో ఆమె ఇంట్లోకి వెళ్లి నీరు తెచ్చేంతలోపే బంధించారు. నలుగురు పిల్లలను మూడో వ్యక్తి పక్క గదిలో ఉంచి ఎవరికైనా చెపితే చంపేస్తామంటూ బెదిరించి కాపలగా ఉన్నాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై ఒకరి తర్వాత మరొకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. విధులు ముగించుకొని అర్ధరాత్రి వచ్చిన భర్తకు ఆమె జరిగిన ఘోరాన్ని వెల్లడించింది. దీంతో అతడు ఆదివారం పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం కొండాపూర్లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మా పరిధి కాదంటున్న పోలీసులు.. కాగా గృహిణిపై లైంగిక దాడికి జరిగిన ఇల్లు హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల సరిహద్దుగా ఉండడంతో ఇరు కమిషనరేట్ల అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిషోర్ ఝా, ఫలక్నుమా ఏసీపీ డాక్టర్ ఎం.ఎ.రషీద్, చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ జి.కోటేశ్వర్ రావులు రాగా...అటు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం ఇన్ఛార్జి ఏసీపీ యాదగిరి రెడ్డి, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ ఎం.శంకర్లు ఘటనా స్థలానికి చేరుకొని మా పరిధి కాదంటే...మా పరిధి కాదంటూ సతమతమయ్యారు. చివరకు పహాడీషరీఫ్ పోలీసులే కేసు నమోదు చేశారు. దీనిపై రెవెన్యూ అధికారుల సూచనకనుగుణంగా అవసరమైతే తామే కేసును బదిలీకి తీసుకుంటామని ఫలక్నుమా ఏసీపీ డాక్టర్ ఎం.ఎ.రషీద్ సాక్షికి తెలిపారు. -
కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య
మాలూరు: కడుపు నొప్పి తాళలేక వివాహిత మహిళ విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నఘటన తాలూకాలోని రాం పుర గ్రామంలో చోటు చేసుకుంది. మృతురాలు రాంపుర గ్రామానికి చెందిన వి సవిత. ఆమె చిత్తూరు జిల్లా మదనపల్లి తాలూకా పిల్లగుండ్ల గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి, లలితల కుమార్తె. వీరు మాలూరు తాలూకా కుడియనూరు గ్రామ పంచాయతీలోని రాంపుర గ్రామానికి చెందిన గౌరారెడ్డి కుమారుడు నరసింహారెడ్డితో ఏడాదిన్నర కింద పెళ్లి జరిపించారు. భార్యభర్తలు ఇద్దరు అన్యోన్యంగానే ఉండేవారని తెలిసింది. వీరికి యేడాది వయసున్న కొడుకు ఉన్నాడు. కడుపునొప్పితో సమస్య సవితకు తరచుగా కడుపు నొప్పి వస్తుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండేదని తెలిసింది. ఈ మధ్య సమస్య తీవ్రమైంది. దీంతో జీవితంపై విరక్తిచెంది బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. భర్త నరసింహారెడ్డి,కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం బెంగుళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స ఫలించక సవిత గురువారం మృతి చెందింది. సవిత మృతదేహాన్ని మాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం సంబంధీకులకు అప్పగించారు. -
అపార్ట్మెంట్ నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
-
ఇద్దరు వివాహితల అదృశ్యం
పెదవాల్తేరు(విశాఖ తూర్పు):ఎంవీపీ కాలనీ, వాంబేకాలనీలకు చెందిన ఇద్దరు వివాహితలు అదృశ్యమయ్యారు. ఈమేరకు ఆయా పోలీస్స్టేన్ల లో ఫిర్యాదులు అందాయి. ఎంవీపీ కాలనీ సెక్టార్ – 9 ఫిషర్మేన్కాలనీలో శ్రీకాంత్,జి.సుప్రియ (29) దంపతులు నివసిస్తున్నారు. శ్రీకాంత్ పోర్టులో ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. సుప్రియ సోమవారంసాయంత్రం ఆస్పత్రికి ఇం ట్లోంచి వెళ్లింది. అనంతరం ఇంటికి చేరకపోవడంతో బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో భర్త వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో మంగళవారం ఎంవీపీ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. సీఐ ఎన్.సన్యాసినాయుడు పర్యవేక్షణలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాదరావుకేసుదర్యాప్తుచేస్తున్నారు. వాంబేకాలనీలో మరో వివాహిత... పీఎం పాలెం(భీమిలి): ఓ వివాహిత అదృశ్యంపై పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. స్థానిక సీఐ కె.సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 5వ వార్డులోని వాంబేకాలనీలో బొడ్డు సతీష్, స్వాతి దంపతులు నివసిస్తున్నారు. ఈ నెల 4న స్వాతి(20) ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ లేకుండాపోయంది. బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో స్వాతి అత్త దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
రాలేదంటే యాసిడ్ పోసి చంపేస్తా..
సాక్షి, హైదరాబాద్: తాను చెప్పినట్లు నడుచుకోకపోయినా.. తాను రమ్మన్నప్పుడు రాకున్నా.. ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా యాసిడ్ పోసి చంపేయడమే కాకుండా మొత్తం కుటుంబాన్ని అంతు చేస్తానని వివాహితను బెదిరించిన యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమిన ల్కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫిలింనగర్లోని వినాయకనగర్ బస్తీకి చెందిన వివాహిత(28) టైలర్గా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన రాజు గత కొంతకాలంగా ఆమె షాపు వద్దకు వచ్చి వేధిపులకు పాల్పడుతున్నాడు. ఆమె వెంటపడటమేగాక, తన మాట వినకపోతే తన దగ్గరికి రాకపోతే యాసిడ్ పోసి చంపుతానని బెదిరించసాగాడు. రెండు రోజుల క్రితం ఆమె పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన రాజు ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించడమే కాకుండా తన బైక్పై ఎక్కాల్సిందిగా ఆదేశించాడు. దీన్ని గమనించిన ఆమె భర్త, తల్లి, అత్తతో పాటు స్థానికులు ఏం చేస్తున్నావని ప్రశ్నించగా తన మాట వినకపోతే మీ అందరినీ చంపేస్తానంటూ హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. -
భర్తను తరమి.. వివాహితపై సామూహిక అత్యాచారం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆలయానికి వెళ్లి వస్తున్న దంపతులను దారికాచి దాడిచేశారు. భర్తను తరిమికొట్టి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో నలుగురు అరెస్ట్ కాగా, నిందితుల్లో ఇద్దరు 17 ఏళ్ల మైనర్ బాలురు కావడం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండికి చెందిన ప్రయివేటు కంపెనీ ఉద్యోగి మూడేళ్ల కిత్రం ఒడిశా రాష్ట్రానికి చెందిన యువతి (29)ని మూడునెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమెకు అంతకు ముందే వివాహం కాగా విడాకులు తీసుకుని అతడిని రెండో వివాహం చేసుకుంది. దంపతులు బుధవారం గుమ్మిడిపూండి సమీపంలోని కుమరనాయకన్పేటలోని ఆలయానికి వెళ్లి మోటార్బైక్పై తిరిగి వస్తుండగా గోపాల్ కండ్రిగ సమీపంలో రెండు మోటార్ సైకిళ్లపై నలుగురు యువకులు అడ్డుకుని భర్తపై దాడిచేసి తరిమికొట్టారు. ఆ తరువాత భార్యకు కత్తిచూపి బెదిరించి దూరంగా మోసుకుని వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గాయపడిన భర్త సమీపంలోని గ్రామస్తులను వెంటబెట్టుకుని రావడంతో దుండగులు పారిపోయారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో గుమ్మిడిపూండి సిప్కాట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అదే ప్రాంతానికి చెందిన మోహన్, మునియస్వామి అనే ఇద్దరు యువకులతోపాటు 17 ఏళ్ల వయసుగల ఇద్దరు బాలురు నిందితులని తేలింది. ఆ నలుగురిపై ఐదు సెక్షన్లపై కేసులు పెట్టి గురువారం అరెస్ట్ చేశారు. -
ఫేస్బుక్ చాటింగ్ ప్రాణం తీసింది!
కృష్ణలంక (విజయవాడ తూర్పు) : ఫేస్బుక్ పరిచయం ఓ నిండు ప్రాణాన్ని బలికొనగా.. భార్య బిడ్డలను అనాథలను చేసింది. వివరాల్లోకి వెళితే..కృష్ణలంక మెట్లబజార్కు చెందిన లంక రామాంజనేయులుశర్మ(35) పౌరోహిత్యం చేస్తుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతనికి బాలాజీనగర్కు చెందిన ఒక వివాహితతో ఫేస్బుక్లో పరిచయం అవ్వడంతో.. చాటింగ్ చేసుకుంటూ.. ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఎలాక్ట్రానిక్ షాపు నిర్వహిస్తున్న వివాహిత భర్త సాయిశ్రీనివాస్కు తన భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో ఫోన్ను పరిశీలించి రామాంజేయులుశర్మతో చాటింగ్ చేస్తున్నట్లు నిర్ధారించుకున్నాడు. దీంతో అతను రామాంజనేయులుశర్మను ఎలాగైనా మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 15వతేదీన అతనికి ఫోన్చేసి గవర్నరుపేటలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్లోని తన షాపునకు రావాలని పిలవడంతో రామాంజేనేయులు శర్మ వెళ్లాడు. అప్పటికే అక్కడ సెల్లారులో తన ఐదుగురు స్నేహితులతో కలసి సాయిశ్రీనివాస్ ఇష్టానుసారం కొట్టసాగాడు. దీంతో చుట్టుపక్కల వారు అడ్డుకోవడంతో స్నేహితుల మధ్య చిన్న గొడవ అని చెప్పి ద్విచక్రవాహనంపై రామాంజనేయులుశర్మను ఎక్కించుకుని తేలప్రోలు పరిసరాల్లోని పంటపోలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడే వారు మద్యం సేవించి అతన్ని ఇష్టానుసారంగా కొట్టారు. వారి దెబ్బలకు స్పృహ తప్పడంతో అక్కడ నుంచి వారు ద్విచక్ర వాహనంపై అతన్ని తీసుకుని విజయవాడ వైపు వస్తుండగా.. గన్నవరం బిస్మిల్లా హోటల్ సమీపంలోకి రాగానే రామాంజనేయులుశర్మ మృతిచెందినట్లు గమనించి రోడ్డుపక్కన పడేసి 108కి ఫోన్చేసి పరారాయ్యారు. దీంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. పక్కన ఎవరూ లేకపోవడంతో 108 సిబ్బంది సైతం వెళ్లిపోయారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు ఈ నెల 16న గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఈ నెల 15వతేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త కనిపించడం లేదని భార్య స్వరూప కృష్ణలంక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గన్నవరంలో మృతిచెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం.. అదృశ్యమైన రామాంజనేయులు శర్మదేనని నిర్ధారించుకుని విచారణ చేపట్టారు. మృతుడి కాల్డేటాలో సాయిశ్రీనివాస్తో చివరిసారిగా మాట్లాడినట్లు ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్య తామే చేసినట్లు అంగీకరించాడు. హత్యకు సహకరించిన స్నేహితులు ఎన్టీఆర్, మున్నా, సాయి, ఫరూక్, సతీష్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
వివాహితలే టార్గెట్
తుమకూరు: వివాహితలను టార్గెట్గా చేసుకుని డబ్బు ఎరగా చూపి వారిని వాడుకుని మోసం చేస్తున్న యువకుడిని తిలక్ నగర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తుమకూరు నగరంలోని నజరాబాద్ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్(20) తన వద్ద ఉన్న డబ్బును ఎరగా చూపి వివాహితలను లోబరుచుకోని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారితో కొన్ని రోజులు గడిపి వదలేస్తున్నాడు. ఇలా ఇప్పటివరకు ఐదుగురు మహిళలను ఇమ్రాన్ మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఒక అంధురాలు, ఒక వికలాంగురాలు కూడా ఉన్నట్లు సమాచారం. వీరిలో కొందరిని తన స్నేహితులకు ఇచ్చి పెళ్లి చేసినట్లు తెలిసింది. బాధిత మహిళలు ఫిర్యాదు చేయడంతో నజరాబాద్ పోలీసులు అతన్ని బుధవారం అరెస్ట్ చేశారు. -
సంతానం కోసం వస్తే.. భక్తురాలితో స్వామి పరార్!
సాక్షి, చెన్నై: సంతాన కోసం పూజలు చేద్దామని వచ్చిన భక్తురాలితో స్వామీజీ పరారైన ఘటన తమిళనాడులో జరిగింది. భర్త ఫిర్యాదు చేయడంతో విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలిలా ఉన్నాయి. తంజావూరు జిల్లా తిరువైయ్యారులోని ఇటుకల బట్టీ సమీపంలో బాలమురుగన్ అలియాస్ బాలసిద్దర్ (45) అనే వ్యక్తి 2014 నుంచి స్వామీజీగా చెలామణి అవుతున్నాడు. అమావాస్య రోజుల్లో అగ్నిగుండం వేసి పూజలు చేసేవాడు. ఈ మూడేళ్ల కాలంలో క్రమేణా ఆయన వద్దకు వచ్చే భక్తులు పెరిగారు. వీరిలో 11 మంది శిష్యులుగా మారారు. కొందరు పోలీసు అధికారులు సైతం ఆయనను దర్శించుకుంటూ మఠానికి వసతి సౌకర్యాలు కల్పించేవారు. దేవుళ్ల శిలా విగ్రహాలను ప్రతిష్టించి స్వామికి సమర్పించారు. ఇదిలా ఉండగా, సంతాన లేమితో బాధపడుతున్న పల్లి అగ్రహారానికి చెందిన విజయకుమార్ అనే రైతు, ఆయన రెండో భార్య పునీత (41) తరచూ బాలసిద్ధర్ వద్దకు వచ్చేవారు. ప్రతిసారీ భర్తతో కలిసి వెళ్లే పునీత ఈనెల 21న ఒంటరిగా వెళ్లి స్వామిని దర్శించుకుంది. అయితే ఆ తరువాత ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్యను వెతుక్కుంటూ విజయకుమార్ మఠానికి రాగా.. స్వామి కూడా కనిపించలేదు. తన భార్యను స్వామి కిడ్నాప్ చేశాడంటూ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. బాలసిద్దర్ హిమాలయాలకు వెళ్లాడని, నవంబరు 2వ తేదీన మఠానికి చేరుకుంటాడని శిష్యులు పోలీసులకు చెప్పారు. పునీతతోపాటు పరారైన బాలసిద్దర్ నాగపట్నం వాసి. బీసీఏ చదివి బెంగళూరులోని ఒక ఐటీ సంస్థలో కొన్నాళ్లు పనిచేశాడు. వివాహం అనంతరం ఓ కుమారుడు పుట్టిన కొంత కాలానికి సంసార జీవితంపై విరక్తిపుట్టిందని, దేవుడు తనను పిలుస్తున్నాడంటూ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. బాలసిద్ధర్, పునీత ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
న్యాయం కావాలి
♦ పోలవరం నిర్వాసితుల వేడుకోలు ♦ మూడేళ్ల నిబంధనతో అవస్థలు ♦ వివాహిత మహిళల పేర్లు జాబితా నుంచి తొలగింపు ♦ అక్రమాలు జరిగాయని యువతుల ఆవేదన పోలవరం: కొత్త భూసేకరణ చట్టంలో ఉన్న మూడేళ్ల స్థానికత నిబంధన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులలో వివాహమైన యువతుల పాలిట శాపంగా మారింది. పుట్టినప్పటి నుంచి గ్రామంలో ఉన్నా, 2006 సర్వేలో పేర్లు నమోదు అయినా, వివాహమైన యువతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ వర్తింప చేయటం లేదు. ఇటీవల రెవెన్యూ అధికారులు ముంపు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఆర్అండ్ఆర్ అబ్ధిదారుల పేర్లు చదివి వినిపించారు. జాబితాలో లేని వారి పేర్లు నమోదు చేసుకున్నారు. కానీ గ్రామసభల సమయానికి జాబితాలో నమోదు చేసి ఉన్న వివాహిత యువతుల పేర్లు మాత్రం జాబితాల నుంచి తొలగించారు. వీరంతా ప్యాకేజ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి తరలి వచ్చారు. గ్రామసభల నాటికి మూడేళ్ల ముందు నుంచి గ్రామంలో ఉండాలనేది నిబంధన అని, వివాహమైనందున వారు గ్రామంలో ఉండరు కాబట్టి, వారి పేర్లు తొలగించామని అధికారులు చెబుతున్నారు. 2006 నుంచి ప్యాకేజ్ కోసం ఎదురు చూశామని, ఇటీవలే వివాహం చేశామని, తీరా వివాహమైనందున ఆర్అండ్ఆర్ జాబితా నుంచి తమ పిల్లల పేర్లు తొలగించారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1200 మంది 18యేళ్లు పైబడిన యువతులు ఉండగా, వీరిలో దాదాపు 200 మంది యువతులకు గత రెండు లేదా మూడేళ్లలోపు వివాహాలయ్యాయి. వీరంతా ఈ నిబంధన కారణంగా ప్యాకేజ్ నష్టపోతున్నారు. గ్రామ సభల సమయంలో తమకు ప్యాకేజ్ వస్తుందని అధికారులు చెప్పారని, ఇపుడు పేర్లు తొలగించారని వివాహిత యువతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాహమైనప్పటికీ కొందరి పేర్లు జాబితాలో ఎలా వచ్చాయని వారు ప్రశ్నిస్తున్నారు. కొందరి పేర్లు ఎలా వచ్చాయి... నాకు వివాహమైంది. గ్రామసభల్లో ప్యాకేజ్ జాబితాలో నాపేరు చదివి వినిపించారు. ఆ తరువాత అధికారులు నాపేరు జాబితా నుంచి తొలగించారు.వివాహమైనందున పేరు తొలగించామని చెబుతున్నారు. వివాహమైన కొందరి పేర్లు ప్యాకేజ్ జాబితాలో ఎలా వచ్చాయి. మూలెం రాజకుమారి, మాదాపురం, పోలవరం మండలం నాపేరు తొలగించారు... మాది పైడాకులమామిడి గ్రామం. నాకు వివాహమైంది. గ్రామసభల్లో నాపేరు చదివి వినిపించారు. ఆ తరువాత జాబితా నుంచి నాపేరు తొలగించారు. వివాహమైనందున పేరు తొలగించామని చెబుతున్నారు. ఇది అన్యాయం. ఇక్కడ పుట్టి, పెరిగిన వారికి ప్యాకేజ్ లేకుండా చేస్తున్నారు. కొవ్వాసు బుచ్చమ్మ, పైడాకులమామిడి, పోలవరం మండలం -
వివాహితపై యాసిడ్ దాడి
ఖమ్మం: వివాహితపై యాసిడ్ దాడి జరిగిన సంఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. ఈ సంఘటన కల్లూరు మండలం పెద్దకోరుకొండి గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శీలం కృష్ణకుమారి(35)కి పదిహేనేళ్ల క్రితం పెళ్లైంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో.. పుట్టింటికి వచ్చేసింది. తల్లితో కలిసి కూలి పనులు చేసుకుంటూ తన కొడుకును సాదుకుంటోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
ఒంటరి మహిళల ఆర్థిక భృతికి దరఖాస్తులు
నేటి నుంచి ప్రారంభం..13 వరకు దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ‘ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి’ పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. సోమవారం నుంచి ఈనెల 13 వరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తాజాగా షెడ్యూల్ను, మార్గదర్శకాలను జారీ చేసింది. లబ్ధిదారుల ఎంపికకు అర్హతలివే.. ► ఒంటరి మహిళల ఎంపికకు 18 ఏళ్లు నిండిన వివాహిత మహిళలు భర్త నుంచి ఏడాదికిపైగా వేరుగా ఉంటున్న వారై ఉండాలి. ► అవివాహితులైతే గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్ల వయస్సు నిండిన వారై ఉండాలి. ► దారిద్య్రరేఖకు దిగువన ఉండి, వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. ► ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సామాజిక భద్రత పథకాలు, పింఛన్ల లబ్ధిదారులై ఉండరాదు. ►దరఖాస్తుకు జత చేయాల్సిన పత్రాలు తహసీల్దార్, సంబంధిత మున్సిపల్ కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చు. జీహెచ్ఎంసీ పరిధిలోని వారు మీసేవ, ఈ సేవ కేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సమర్పించేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. దరఖాస్తుతోపాటు వయస్సు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు, ఎన్నికల గుర్తింపు కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, స్కూల్ టీసీలలో ఏదో ఒక జిరాక్స్ ప్రతిని జతపరచాలి. -
పెళ్లైనా పాత ఇంటి పేరే..
పాస్పోర్ట్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు: మోదీ ముంబై: పెళ్లైన అనంతరం మహిళలు పాస్పోర్టుల్లో తమ ఇంటి పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని, ప్రయాణ పత్రాలు పొందేందుకు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి పేరును వాడుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నిబంధనలు మారాయని... ఇక నుంచి పాస్పోర్టు పొందేందుకు మహిళలు వివాహ ధ్రువీకరణ లేక విడాకుల పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ‘ఇండియన్ మర్చంట్స్ చాంబర్స్(ఐఎంసీ)’ మహిళా విభాగాన్ని ఉద్దేశించి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ... మహిళలే లక్ష్యంగా అభివృద్ధి పథకాలు కొనసాగాలన్నదే తన అభిమతమన్నారు. ఈ సందర్భంగా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రశంసించిన మోదీ ‘అవకాశమిస్తే పురుషుల కంటే రెండడుగులు ముందే ఉంటామని మహిళలకు రుజువు చేశారు. డెయిరీ, పశు పరిశ్రమ రంగాల్లో మహిళల వాటానే అత్యధికం. మహిళా సాధికారతకు లిజ్జత్ పాపడ్, అమూల్లే చక్కని ఉదాహరణలు’ అని పేర్కొన్నారు. ముద్రా రుణాల్లో 70 శాతం మహిళలే తీసుకుంటున్నారని, మహిళల్లో ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తికి అది అద్దంపడుతుందని చెప్పారు. కాగా, బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా నేడు మోదీ నాగ్పూర్లో ఆయనకు నివాళులర్పించడంతో దీక్షా భూమి వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభిస్తారు. -
భర్తతో వివాదం.. భార్య ఆత్మహత్య
ఎడ్లపాడు(గుంటూరు): భర్తతో ఏర్పడ్డ వివాదంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడులో జరిగింది. దీనిపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సీ కాలనీకి చెందిన వాసిమళ్ల మహేంద్ర మొదటి భార్య కొన్నేళ్ల కింద చనిపోగా శౌరీలుని ఇటీవల వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లే. శౌరీలు ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణీ. అయితే మహేంద్ర మొదటి భార్యకి ఇద్దరు పిల్లలున్నారు. ఈ నేపథ్యంలోనే భార్యను గర్భం తీయించుకోవాలని కొన్ని రోజులుగా కోరుతున్నాడు. ఈ విషయమై వారి మధ్య విభేదాలు తలెత్తాయి. మంగళవారం ఇద్దరూ గొడవపడ్డారు. బుధవారం ఉదయం మహేంద్ర పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శౌరీలు ఉరి వేసుకుంది. ఇరుగుపొరుగు వారు చూసేసరికే ఆమె చనిపోయింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్య
పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధి కమలాపూర్లో కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.స్థానిక ఎస్ఐ విజయరావ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జాడు విఠల్ భార్య రేణుక(28) కుటుంబ సమస్యలతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
కోరుట్ల(కరీంనగర్ జిల్లా) కరీంనగర్ జిల్లా కోరుట్లకి చెందిన మాధురి(23) అనే వివాహిత భర్త వేధింపులు తాళలేక ఆదివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త శ్రీధర్ ప్లాస్టిక్ దుకాణం నిర్వహించేవాడు. వీరికి నాలుగు నెలల క్రితమే వివాహమైంది. వ్యసనాలకు బానిసైన భర్త తరుచూ వేధిస్తుండడంతో జీవితంపై విరక్తి చెంది మాధురి ఆత్మహత్య చేసుకుందని, తమ కుమార్తె మరణానికి అల్లుడే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యాదాద్రిలో బిడ్డతో కలిసి వివాహిత ఆత్మహత్య
-
పెళ్లయిన వాళ్లే ఉద్యోగాలు చేస్తున్నారట!
ఒకవైపు కుటుంబ బాధ్యతలు.. మరోవైపు ఉద్యోగ బాధ్యతలు రెండూ చూసుకోవడం మహిళలకు చాలా కష్టం అనుకుంటాం కదూ. కానీ, పెళ్లి కాని అమ్మాయిల కంటే పెళ్లయిన వాళ్లే ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారట. ఈ విషయం ఇటీవలే విడుదల చేసిన 2011 జనాభా లెక్కల ఆధారంగా తెలిసింది. పెళ్లి కాని వాళ్లు కేవలం 21 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తుంటే.. పెళ్లయిన వాళ్లలో మాత్రం 41 శాతం మంది ఉద్యోగాల్లో ఉన్నారట. పెళ్లికాని వాళ్లు యువతులు కావడంతో వాళ్ల తల్లిదండ్రులు ఉద్యోగాల కోసం బయటకు పంపడం లేదని నిపుణులు చెబుతున్నారు. మరికొందరు ఇంకా స్కూళ్లు లేదా కాలేజీలలో చదువుకుంటున్నారు. అలాగే.. రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నవాళ్లు తమకు పిల్లలు తక్కువ మంది ఉంటేనే మేలని భావిస్తున్నారు, అందులోనూ కనీసం ఒక కొడుకు ఉంటే బాగుంటుందని చెబుతున్నారు. దీంతో లింగ నిష్పత్తి దారుణంగా పడిపోతోంది. ఇక ఉద్యోగం చేయని మహిళల పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదట. వాళ్లు కేవలం తమ ఇంటి పనికి మాత్రమే పరిమితం అవుతున్నారని, ఉద్యోగాలు చేయని మహిళల కంటే వీళ్లు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారని తేలింది. దశాబ్దం క్రితం పిల్లలను కనగల వయసులో ఒక్కో మహిళకు సగటున 3.3 మంది పిల్లలు పుడుతుంటే, ఇప్పుడు అది 2.9కు పడిపోయింది. ఇది ఉద్యోగాలు చేసేవాళ్లకు సంబంధించినది. చేయని వాళ్లలో మాత్రం ఇది 3.1గానే ఉంది. లింగనిష్పత్తి మాత్రం రెండు వర్గాల్లోనూ బాగానే పడిపోయింది. 2001లో ఉద్యోగాలు చేసే మహిళలకు పుట్టే ప్రతి వెయ్యిమంది బాలురకు 912 మంది బాలికలుండగా, ఇప్పుడది 901కి పడిపోయింది. ఉద్యోగాలు చేయనివారి విషయంలో అది 901 నుంచి 894కి తగ్గింది. మహిళలకు గర్భంలో ఉన్నది ఆడపిల్లలని తెలిస్తే అబార్షన్లు చేయించుకోవడానికి ఆర్థిక పరిస్థితులు కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. -
ప్రియుడి ఇంటి ఎదుట వివాహిత బైఠాయింపు
దామెర(ఎల్కతుర్తి, కరీంనగర్ జిల్లా): ఓ వివాహిత తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగిన సంఘటన మండలంలోని దామెరలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఐత స్వర్ణలతకు ఎల్కతుర్తికి చెందిన ఓ వ్యక్తితో నాలుగు నెలల క్రితం వివాహమైంది. అప్పటికే ఆమె దామెరకు చెందిన పాటి ప్రవీణ్ను ప్రేమించింది. వివాహమైనా.. స్వర్ణలతతో ప్రవీణ్ వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. ఇద్దరు కలిసి ఉండగా.. స్వర్ణలత అత్తమామ గమనించి పోలీసులకు అప్పగించారు. స్వర్ణలత విడాకులు తీసుకుంటే వివాహం చేసుకుంటానని ప్రవీణ్ చెప్పడంతో పెద్దమనుషుల సమక్షంలో ఇటీవలే విడాకుల పత్రం రాయించారు. తీరా ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ బాధితురాలు ప్రవీణ్ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం జరిగేవరకు ఇక్కడే ఉంటానని తెలిపింది. అప్పటికే ప్రవీణ్ కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. ఎస్సై వెంకటరంగయ్యసూరి బాధితురాలితో మాట్లాడారు. ఫిర్యాదు చేస్తే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
విజయవాడ(వన్టౌన్): వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన వన్టౌన్ పోలీసు స్టేçÙన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువతి ఉరి వేసుకొని ఇంట్లో మృతి చెందగా భర్త కనిపించకుండా పోవటం, చుట్టుపక్కల వారు సరైన సమాచారం చెప్పలేకపోవటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. బ్రాహ్మణవీధి పాత పోస్టాఫీస్ సెంటర్లో కొండపైకి వెళ్లే మెట్ల మార్గంలో బత్తు మల్లికార్జునరావు, చంద్రకళ (20) కుటుంబం నివాసముంటుంది. అతను క్యాటరింగ్ పనులకు సప్లయర్లను అందించి వచ్చే కమీషన్పై జీవిస్తున్నాడు. ఆయనకు గతంలో ఒక వివాహమవ్వగా ఆమె నుంచి విడాకులు తీసుకొని చంద్రకళను ఏడాది కిందట వివాహం చేసుకున్నాడు. తొలి భార్య సంతానమైన కుమార్తె కూడా వీరి వద్దనే ఉంటుంది. శుక్రవారం ఉదయం మల్లికార్జునరావు నుంచి డబ్బులు తీసుకుందామని రమణ వీరి ఇంటికి వచ్చాడు. అతని కుటుంబం రెండో అంతస్తులో ఉండటంతో ఆ మెట్లు ఎక్కుతుండగా దుర్వాసన రావటంతో రమణ పోలీసులకు సమాచారమందించాడు. వన్టౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని తలుపులు పగలగొట్టి చూడగా చంద్రకళ ఉరి వేసుకొని కనిపించింది. ఇతరుల నుంచి మృతురాలి భర్త ఫోన్ నెంబర్లు తీసుకొని చేయగా స్విచాఫ్ అని వచ్చాయి. ఆరు మాసాల కిందటే వీరు ఇక్కడకు వచ్చారని, స్థానికులతో పెద్దగా కలవరంటూ చుట్టుపక్కల వారు పోలీసులకు వివరించారు. ఆదివారం భార్యాభర్తలు గొడవ పడినట్లు స్థానికులు చెప్పారు. అప్పటి నుంచి ఆయన కనపడలేదని, అతనితోపాటు కుమార్తె కూడా కనపడలేదని తెలిపారు. ఆదివారం తరువాత చంద్రకళను ఎవరూ చూడకపోవటంతో ఆ రెండు రోజుల్లోనే ఆమె ఉరి వేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో లభించిన ఆమె ఫోన్ ఇతర సమాచారం ఆధారంగా చంద్రకళ తల్లిదండ్రులు చీరాలలో ఉంటున్నట్లు గుర్తించి వారికి సమాచారమందించారు. బంధువులు, ఇతర కుటుంబ సభ్యులెవరూ అందుబాటులో లేకపోవటంతో శవాన్ని కిందకు దించలేదు. చీరాల నుంచి ఆమె బంధువులు నగరానికి వచ్చిన తరువాత మృతదేహాన్ని తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. వన్టౌన్ సీఐ వెంకటే శ్వర్లు కేసును పరిశీలిస్తున్నారు. -
అనుమానంతోనే భార్య హత్య
హత్య కేసులో నిందితుడి అరెస్ట్ కానిస్టేబుల్, మరో మహిళపై విచారణ తిరువూరు సీఐ వెల్లడి మేడూరు (గంపలగూడెం): భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు మేడూరులో ఈనెల 7వ తేదీ రాత్రి జరిగిన ఒక మహిళ హత్యకేసులో నిందితుడు భర్త నల్లగట్ల ప్రకాశరావు చెప్పాడు. గ్రామానికి చెందిన నల్లగట్ల నిర్మల (32)ను భర్త వెదురు బొంగుకర్రతో కొట్టిచంపినట్లు కేసు నమోదైంది. ఈ కేసులోమృతురాలి అన్న ఎక్కిరాల మోహన్రావు ఫిర్యాదు మేర కేసు నమోదు చేశారు. కాగా నిందితుడైన నిర్మల భర్త ప్రకాశరావును మంగళవారం గ్రామం సమీపంలోని ఎన్నెస్పీ కాల్వ సమీపంలో అరెస్ట్ చేసినట్లు సీఐ కిషోర్బాబు తెలిపారు. తన భార్య వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకొందన్న కారణంగానే క్షణికావేశంలో కర్రతో కొట్టగా చనిపోయిందని విచారణలో తెలిపినట్లు సీఐ వివరించారు. నిందితుడిని తిరువూరు కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. కేసులో మరో ఇద్దరు నిందితులైన కానిస్టేబుల్ నల్లగట్ల సురేష్, మరో మహిళ చిలకమ్మలపై విచారణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఎస్సై శివరామకృష్ణ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
చందర్లపాడు : కుటుంబ కలహాల నేపధ్యంలో ఓ వివాహిత ఆత్యహత్య చేసుకున్న ఘటన మండలంలోని కోనాయిపాలెంలో జరిగింది. సేకరించిన సమాచారం మేరకు నందిగామ పట్టణం చక్రాల బజార్కు చెందిన అల్లి లక్ష్మి(35) ఆదివారం మధ్యాహ్నం సమయంలో కోనాయిపాలెం గ్రామంలోని చెరువులోకి దిగి ఆత్మహత్య చేసుకుంది. విషయం గమనించిన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. చెరువులో నీటిలోతు ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న ఏఎస్ఐ నూతలపాటి నాగేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
కోలారు(బెంగళూరు): వరకట్నం వేధింపుల నేపథ్యంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన జిల్లాలోని శ్రీనివాసపురం తాలూకా రాయల్పాడు ఫిర్కా ఉప్పరపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు...శ్రీనివాసపురం తాలూకా ఉప్పరపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ(20)ని ఇదే తాలూకాలోని దింబాల గ్రామానికి చెందిన నవీన్కు ఇచ్చి ఏడాది క్రితం వివాహం చేశారు. నవీన్ బెంగుళూరులో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా దంపతులు జేపీ నగర్లో నివాసం ఉంటున్నారు. అయితే కట్నం తేవాలని కొంత కాలంగా నవీన్ ఆమెను వేధిస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలో వినాయక చవితి పండుగకు లక్ష్మి దింబాల గ్రామంలోని భర్త ఇంటికి వచ్చింది. తర్వాత పుట్టినింటికి వెళ్లి భర్త వేధింపులపై తల్లిదండ్రుల వద్ద గోడువెల్లబోసుకుంది. అనంతరం భర్త ఇంటికి వెళ్లింది. సెలవు కావడంతో నవీన్ కూడా గ్రామానికి చేరుకున్నాడు. బుధవారం రాత్రి నవీన్ లక్ష్మి తల్లిదండ్రులకు ఫోన్చేశాడు. మీ కుమార్తె మూర్ఛ పోయిందని, శ్రీనివాసపురం ఆస్పత్రికి తీసుకు వెళుతున్నట్లు తెలిపాడు. దీంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకోగా అక్కడ అంబులెన్స్లో లక్ష్మి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఇదిలా ఉండగా తమ కుమార్తెను భర్తే గొంతు నులిమి హత్య చేశాడని ఆరోపిస్తూ మృతదేహాన్ని నవీన్ ఇంటిముందే గొయ్యి తవ్వి ఖననం చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని లక్ష్మి పోషకులకు నచ్చజెప్పి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. లక్ష్మిని ఆమె భర్త నవీన్ హత్య చేసినట్లు పోషకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
జాడ లేని దీప్తి
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ గన్నవరం: మండలంలోని కేసరపల్లి వద్ద భర్తతో గొడవ పడుతూ ఏలూరు కాలువలో గల్లంతైన చౌటపల్లి దీప్తి కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. దీప్తి కాలువలో పడి మూడు రోజులైంది. గురువారం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ఎయిర్బోట్లతో కాలువలో ముమ్మరంగా జల్లెడ పడుతున్నారు. సిఐ అహ్మద్అలీ, ఎస్ఐ శ్రీనివాస్ల సిబ్బంది కేసరపల్లి నుండి అజ్జంపూడి వరకు కాలువ వెంట ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలించినా ఫలితం లేకపోయింది. అయితే అజ్జంపూడి వద్ద కాలువలో అడ్డుగా ఉన్న గుర్రపుడెక్క గాలింపుకు ఆటంకంగా మారింది. దీప్తి ఆచూకీపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
ఇద్దరు వివాహితలు లేచిపోయి..
జైపూర్: వాళ్లిద్దరూ మహిళలే అయినప్పటికీ, ఒకరినొకరు ఇష్టపడ్డారు. తాము కలసి ఉండేందుకు భర్తలతో పాటు కన్న బిడ్డలను కాదనుకున్నారు. ఎన్నో మలుపులు, ట్విస్ట్లతో ఉన్న ఈ కథతో ఓ సూపర్ హిట్ సినిమా తీయడానికి కావల్సిన అన్ని ఎలిమెంట్లు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.. సోనియా(27), మమత(26)లు ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్లలో నివాసముండేవారు. వీరిద్దరికి ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. అంతేకాకుండా ఆ వివాహితలకు చెరో సంతానం కూడా ఉంది. వారి భర్తలు రోజువారి పనిలో భాగంగా విధులకు వెళ్లేవారు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న వీరిద్దరూ ఒకేచోట చేరి ఎక్కువ సమయాన్ని గడిపేవారు. ఒకరిని ఒకరూ బాగా అర్థం చేసుకున్నారో లేక అభిప్రాయాలే నచ్చాయో తెలియదు కానీ వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అంతే ఇద్దరూ కలిసి వివాహం చేసుకొని దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడపాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆ ఇద్దరు వివాహితలు తమ తమ కుటుంబాలను వదిలిపెట్టి పెళ్లి చేసుకోవాలని భావించారు. మన్సరోవర్ గ్రామంలోని ఓ ఆలయంలో ఈ మహిళలు ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వాళ్లు పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లు ప్రకారం...సోనియా భర్తగా, మమతా భార్యగా వ్యవహరించారు. వారిరువురి కుటుంబాలకు దూరంగా వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. అయితే ఆరు నెలల తర్వాత మమత సోదరుడు వీరిద్దరు కలిసి నివాసం ఉంటున్న చోటును కనుగొన్నాడు. వారి దగ్గరికి వెళ్లి మీ వివాహనికి ఇరు కుటుంబాలు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాయని నమ్మించి, ఇంటికి రావాల్సిందిగా కోరాడు. వారు స్వగ్రామానికి తిరిగి రాగానే మొదటి వివాహానికి సంబంధించి ఇరువురి అత్తలు సోనియా(భర్తగా చెప్పుకునే మహిళ)ను చితకబాది, ఊరి నుంచి తరిమికొట్టారు. సోనియా వెళ్లిన తర్వాత మమతా కనిపించకుండా పోయింది. ఈ సంఘటన రాజస్థాన్లోని టోన్క్ జిల్లాలోని అమ్లీ గ్రామంలో చోటు చేసుకుంది. తన భాగస్వామి మమత జాడ కోసం సానియా అన్ని ప్రాంతాల్లో వెతుకుతూనే ఉంది. తామున్న చోటు ఎవరికీ తెలియకుండా ఉండటానికి మమత కుటుంబ సభ్యులు ఇంటిని కూడా వదిలి పోవడంతో.. తన తోడు కోసం వెతికి వెతికి నీరసించి చివరకు డిగ్గి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. స్వలింగ వివాహాలు చెల్లుతాయని, వారి విషయంలో ఎవరి అనుమతి అవసరం లేదని నిరూపించడానికి న్యాయ సహాయం కోసం కోర్టు మెట్లు కూడా సానియా ఎక్కింది. కోర్టు మమత కుటుంబ సభ్యులకు లీగల్ నోటీసులు పంపింది. మమత కోరికలు నెరవేర్చడానికి తన ఇంటిని కూడా అమ్మేసినట్టు సోనియా చెబుతోంది. మమతా ఆచూకీ గనుక దొరక్కపోతే ఆత్మహత్య చేసుకుంటానని సోనియా కన్నీటి పర్యంతమవుతోంది. -
పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చే లోపే..
బహదూర్పురా(హైదరాబాద్): భర్తతో గొడవ పడిన ఓ మహిళ నెహ్రూ జూలాజికల్ పార్కులోని మీరాలం చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బహదూర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తలాబ్కట్టా ప్రాంతానికి చెందిన మోసీనా పర్వీన్(40), అబ్దుల్ అన్నాన్ దంపతులు. కొన్ని సంవత్సరాలుగా మోసీనా పర్వీన్తో భర్త అబ్దుల్ అన్నాన్ ‘అంటిముట్టనట్లు’గా ఉంటున్నాడు. దీనిపై కాలాపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శనివారం స్టేషన్కు వచ్చింది. ఫిర్యాదును విన్న పోలీసులు భర్తతో కలిసి ఉండాలంటూ సర్ది చెబుతూ కౌన్సెలింగ్ ఇచ్చే లోపు పోలీస్స్టేషన్ నుంచి బయటికి వెళ్లి నేరుగా జూపార్కు చెరువుకు వెళ్లింది. అక్కడ చెరువులో దూకేందుకు ప్రయత్నించగా.. అక్కడే ఉన్న జూ సిబ్బంది అప్రమత్తమై పర్వీన్ను బహదూర్పురా పోలీసులకు అప్పగించారు. దీంతో పర్వీన్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
వివాహిత ఆత్మహత్య
మెదక్: కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా అవుసులపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన బాలగౌడ్కు ఆరేళ్ల క్రితం స్వాతి(23)తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం భార్య భర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అనంతరం బాలగౌడ్ బయటకు వెళ్లిన తర్వాత స్వాతి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి బంధువులు మాత్రం భర్తే చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించడానికి యత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. -
పెళ్లైన తర్వాతే ఎక్కువ చూస్తున్నారట!
పెళ్లైన మగాళ్లు శృంగార చిత్రాలు చూడడానికి అంత ఆసక్తి చూపరని తాజా అధ్యయం వెల్లడించింది. పెళ్లైన తర్వాత మగాళ్లు పోర్న్ తక్కువగా చూస్తున్నారని, మహిళలు ఎక్కువగా పోర్న్ వెబ్ సైట్లు చూస్తున్నారట. వివాహానికి ముందు, తర్వాత స్త్రీపురుషుల్లో ప్రవర్తనల్లో వచ్చిన మార్పులను అధ్యయం చేసి ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ అధ్యయనం కోసం 100 మంది వివాహితులను ఇంటర్వ్యూ చేశారు. పెళ్లికి ముందు పోర్న్ చూసేవాళ్లమని 9 శాతం, పెళ్లైన తర్వాత పోర్న్ వీక్షిస్తున్నామని 28 శాతం మంది మహిళలు వెల్లడించారు. మ్యారేజ్ కు ముందు పోర్న్ చూసే మగవాళ్లు 23 శాతం ఉండగా, పెళ్లైన తర్వాత ఈ సంఖ్య 14 శాతంగా ఉంది. లైంగిక విషయాల్లో స్త్రీపురుషుల ఆలోచనా ధోరణి భిన్నంగా ఉందనేందుకు అధ్యయన ఫలితాలు అద్దం పడుతున్నాయని సర్వేకు నేతృత్వం వహించిన ప్లానెటరీ సైంటిస్ట్ స్టీవ్ వాన్స్ పేర్కొన్నారు. -
వివాహితపై ఆర్ఎంపీ అఘాయిత్యం
మరిపెడ(వరంగల్): పవిత్ర మైన వైద్య వృత్తికి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించాడో వైద్యుడు.. వైద్యం కోసం తన వద్దకు వచ్చిన వివాహిత పై ఓ ఆర్ఎంపీ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో గురువారం రాత్రి వెలుగుచూసింది. మండలంలోని కాకరవాయి పంచాయతి తేనెకుంట తండాకు చెందిన ఓ నవ దంపతులు పిల్లలు పుట్టకపోవడంతో.. మండల కేంద్రంలోని ఆర్ఎంపీ వద్దకు వచ్చారు. బుధవారం పరీక్షలు నిర్వహించిన అతను తిరిగి గురువారం కూడా ఇద్దర్ని మరోసారి రమ్మన్నాడు. దీంతో భార్య భర్తలిద్దరు ఈ రోజు సాయంత్రం ఆస్పత్రికి వచ్చారు. వారిద్దరిని వేరు వేరు గదుల్లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పిన వైద్యుడు ఇద్దరికి మత్తు మందు ఇచ్చి ఆమె పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇది గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు వైద్యుడికి దేహ శుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పెళ్లయిన ఆర్నెల్లకే.. ప్రియుడితో ఆత్మహత్య
మంచిర్యాల: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం హజీపూర్ పోలీస్ స్టేషన్ ముందు ఓ జంట శనివారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటనలో ప్రియురాలు మృతి చెందగా, ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం కనపర్తి గ్రామానికి చెందిన సౌందర్య... ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నమ్నూరు గ్రామంలోని బంధువుల ఇంటికి తరచుగా వెలుతుండేది. ఈ క్రమంలో నమ్నూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యాదగిరి సురేష్తో ప్రేమ చిగురించింది. విషయం పెద్దలకు తెలియడంతో సౌందర్యకు ఆరు నెలల క్రితం వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. కాగా, వారం క్రితం సౌందర్య, సురేష్ కలసి అదృశ్యమయ్యారు. దీంతో సౌందర్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సురేష్పై పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. శనివారం వీరు హజీపూర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పురుగుల మందు సేవించడంతో వారిని సత్వరమే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి మార్చారు. చికిత్స పొందుతూ సౌందర్య మృతి చెందగా, సురేష్ పరిస్థితి విషమంగా ఉంది. -
కడుపు నొప్పి తాళలేక.. ఆత్మహత్య
కడుపు నొప్పి భరించలేక రాధ(32) అనే వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బి.కొత్తకోట మండలకేంద్రంలోని బీసీ కాలనీలో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో ఆదివారం హైదర్ బీ(22) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
ఏలూరు: వివాహితను ఫోన్లో వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. ఏలూరులోని పుష్పలీలానగర్కు చెందిన వివాహిత(21)కు గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరికి చెందిన రవీంద్ర అనే వ్యక్తి ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడు. ఆమె ఫోన్ ఎత్తకుండా.. భర్తకు ఇచ్చినా.. ‘నీ పెళ్లానికి ఇవ్వు దానితో మాట్లాడాలి.. అది నాది, నేను దాన్ని తీసుకెళ్తా’ అంటూ బెదిరిస్తున్నాడు. దీంతో భార్యాభర్తలు పోలీసులను ఆశ్రయించారు. -
కావలిలో దారుణం
కావలి: నెల్లూరు జిల్లా కావలిలో దారుణం జరిగింది. ఓ వివాహితపై సాహూహిక అత్యాచారానికి పాల్పడిన గుర్తుతెలియని దుండగులు ఆమెను నిలువుదోపిడి చేశారు. ఆదివారం ఉదయం కావలి టూటౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు వివరించింది. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. -
బాలిక, వివాహితపై లైంగికదాడి
నడిగూడెం ప్రేమించానంటూ వెంటబట్టాడు.. మాట్లాడుకుందామని చెప్పి బాలికను, ఆమె వదినను తోటలోకి రమ్మన్నాడు.. ఆపై తన స్నేహితుడితో కలిసి ఇద్దరిపై లైంగికదాడి చేశాడు.. ఇదీ.. నడిగూడెం మండలం బృందావనపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బృందావనపురం గ్రామానికి చెందిన జమ్మి వేణు ఇదే గ్రామానికి చెందిన 15 బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికాడు. ఆమెకు మాయమాటలు చెప్పి నెల రోజుల క్రితం తోటలోకి రమ్మన్నాడు. అనుమానంతో ఆ బాలిక తన వదినను తీసుకుని వెళ్లింది. అప్పటికే వేణు తన స్నేహితుడు గోవర్దన్తో వేచిచూస్తున్నాడు. కాగా, తోటలోకి వెళ్లిన బాలిక, సదరు వివాహితపై ఇద్దరు కలిసి లైంగికదాడి చేశారు. కాగా, పెళ్లి విషయమై బాలిక వేణును నిలదీయంతో నిరాకరించాడు. దీంతో బాధితులు బుధవార పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేణుపై నిర్భయ, గోవర్ధన్పై లైంగికదాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ బిల్లా కిరణ్కుమార్ తెలిపారు. కోదాడ రూరల్ సీఐ మధుసూదన్రెడ్డి ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
చిత్తూరు (పుంగనూరు): కుటుంబ కలహాలతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండల కేంద్రంలోని కోనేటి పాలెం వీధిలో గురువారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన గాయత్రి (26)కి, హరినాథ్ రెడ్డితో ఏడేళ్ల కిందట వివాహం అయింది. అప్పటినుంచి తరచు భర్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. తాజాగా హరి రెండో పెళ్లి చేసుకొవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన గాయత్రి బుధవారం రాత్రి ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వాటర్ ట్యాంక్లో మహిళ శవం కలకలం
హైదరాబాద్ సిటీ: ఈ నెల ప్రారంభంలో కనిపించకుండ పోయిన ఓ వివాహిత వాటర్ ట్యాంక్ లో శవమై కనిపించడం నగరంలో కలకలం సృష్టించింది. వివరాలు.. సరూర్నగర్లోని వాటర్ ట్యాంక్లో ఓ మహిళ శవం ఆదివారం బయటపడింది. ఆమె వయసు 32 నుంచి 38 మధ్య ఉండవచ్చుని భావిస్తున్నారు. మృతురాలు మెడలో మంగళసూత్రం, గోధుమ రంగు సాక్సులు, పసుపు రంగు నైటీ ధరించి ఉంది. మహిళ మరణించి మూడు లేక నాలుగు రోజులయి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఎవరైనా ఆమెను హత్య చేసి ట్యాంకులో పడవేశారా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
అయ్యో.. నవనీత
మెదక్ మండల ఎనగండ్ల గ్రామంలో సోమవారం ఉదయం ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. తమకేం పాపం తెలియదని అత్తింటివారు అంటుంటే... అత్తింటివారే తమ పిల్లను చంపేశారని నవనీత పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా నవనీత మృతితో ఏడాదిన్నర వయస్సున్న ఆమె కుమారుడు మాత్రం మాతృప్రేమకు దూరమయ్యాడు. కొల్చారం: మండల పరిధిలోని ఎనగండ్ల గ్రామంలో సోమవారం ఉదయం ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. ఈ సంఘటనకు సంబంధించి మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, మృతురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన రాములు, రామవ్వల కుమారుడు మల్లేశంతో రేగోడ్ మండలం ఖాదిరాబాద్కు చెందిన ఏసమ్మ, మల్లయ్య కూతురు నవనీత(24)కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు ఉన్నాడు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం కుటుంబ సమేతంగా వెళ్లి.. కౌడిపల్లి మండలం నల్లపోచమ్మ ఆలయం వద్ద మల్లేశం సోదరి కుమారుని పుట్టు వెంట్రుకలు తీసి, ఇంటికి చేరుకున్నారు. అదే రాత్రి కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగినట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. సోమవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో భర్త మల్లేశం గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు బయటకు వెళ్లగా.. మామ ఊరిబయట ఉన్న మేకల మంద వద్దకు వెళ్లాడు. అత్త రామవ్వ కల్లాపీ చల్లి.. పిల్లవాడికి పాలు తాగిం చి తాను కూడా మేకల వద్దకు వెళ్లింది. గంట తరువాత ఇంటికి తిరిగివచ్చిన అత్త రామవ్వకు లోపలి నుంచి కాలిన వాసన వచ్చింది. తలుపు తెరచి చూడగా పూర్తిగా కాలిన స్థితిలో నవనీత నిర్జీవంగా కనిపించింది. విషయం తెలుసుకున్న కొల్చా రం ఎస్ఐ రమేష్నాయక్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని తరలించేందుకు ప్రయత్నించా డు. అయితే నవనీతను అత్తింటివారే చంపేశారం టూ మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. తమకు న్యాయం జరిగే వరకూ కదిలేదని లేదం టూ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్ఐ రమేష్నాయక్ విషయాన్ని మెదక్ రూరల్ సీఐ రామకృష్ణకు తెలపడంతో ఆయన గ్రామానికి చేరుకుని నవనీత బంధువులకు నచ్చజెప్పారు. న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు. అనంతరం నవనీత శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించారు. -
రేపు.. 'శ్రీమతి రాజమండ్రి' పోటీ
సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పేలా 'శ్రీమతి రాజమండ్రి' పోటీలను శనివారం నాడు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారిని వివిధ రౌండ్లలో ఎంపిక చేసి, చివరి సెమీఫైనల్స్ను గురువారం నిర్వహించారు. ఇంతకుముందు కూడా మిసెస్... అంటూ పోటీలు జరిగినా, అవి ప్రధానంగా అందాల పోటీల్లాగే జరిగేవని, కానీ ఇక్కడ మాత్రం కట్టు, బొట్టు, నడత, నడక, సంప్రదాయం.. అన్నింటికీ పెద్దపీట వేస్తామని పోటీల నిర్వాహకుడు, విక్టరీ ఈవెంట్ మేకర్స్ అధినేత విక్టర్ తెలిపారు. పోటీలో పాల్గొనే ప్రతివారూ తప్పనిసరిగా చీరల్లోనే రావాలన్నారు. ఫైనల్ పోటీలు మూడు రౌండ్లలో జరుగుతాయి. తొలి రౌండులో పోటీదారులు తమను పరిచయం చేసుకుంటారు. రెండోరౌండులో వారి ప్రతిభను న్యాయ నిర్ణేతలు పరిశీలిస్తారు. మూడో రౌండులో సమాజంలో మహిళల పాత్ర గురించి, జనరల్ నాలెడ్జి మీద ప్రశ్నలుంటాయి. వారి మానసిక ప్రవర్తన, కేశ సంరక్షణ, చర్మ సౌందర్యం అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని విజేతలను నిర్ణయిస్తారు.