ప్రధాన వార్తలు

‘బనకచర్ల’ అసాధ్యం!
సాక్షి, అమరావతి: ‘‘పోలవరం జలాశయంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వతో ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. దీనివల్ల పోలవరం ఆయకట్టుకు నీళ్లందించడమే సాధ్యం కాదు. పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు (పీబీఎల్పీ)కు నీరివ్వడం అసాధ్యం’’ అని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తెగేసి చెప్పింది. ఈ మేరకు పీపీఏ డైరెక్టర్ మన్నూజీ ఉపాధ్యాయ కేంద్ర జల్శక్తి శాఖకు లేఖ రాశారు. 45.72 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వచేసేలా పోలవరాన్ని పూర్తి చేశాకే పీబీఎల్పీపై ఏదైనా ఆలోచన చేయవచ్చునని స్పష్టం చేశారు. పీబీఎల్పీకి సంబంధించి డీపీఆర్ రూపకల్పనకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ మే 22న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు ప్రాథమిక నివేదిక (పీఎఫ్ఆర్)ను సమర్పించారు. సీడబ్ల్యూసీ... ఈ ప్రాథమిక నివేదికపై పీపీఏ అభిప్రాయం కోరింది. దీనిని సమగ్రంగా అధ్యయనం చేసిన పీపీఏ తన అభిప్రాయాన్ని తెలిపింది. పోలవరం జలాశయంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా... ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లుగా గత ఏడాది ఆగస్టు 28న కేంద్రం ఆమోదించిందని, మిగిలిన పనులకు రూ.12,157.53 కోట్లకు మించి ఇచ్చేది లేదని తేల్చిచెప్పిందని పేర్కొంది. దీని ప్రకారమే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని లేఖలో వివరించింది. పీబీఎల్పీ... పోలవరంలో భాగం కాదని, ఈ నేపథ్యంలో పోలవరం నుంచి అదనంగా నీటి తరలింపుపై కేంద్రం సమగ్రంగా అధ్యయనం చేయాలని పీపీఏ పేర్కొంది. అందుబాటులో ఉన్న జలాలు, అంతర్రాష్ట్ర వివాదాలు, ట్రిబ్యునల్ అవార్డులను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. పీబీఎల్పీలో తాడిపూడి ఎత్తిపోతల కాలువను ఉపయోగించుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోందనికానీ, పోలవరం పూర్తయ్యాక ఈ ఎత్తిపోతల ఆయకట్టు కూడా పోలవరంలో భాగం అవుతుందని తెలిపింది. పోలవరం కుడి కాలువ, డిస్ట్రిబ్యూటరీలపై అధ్యయనం చేయాలని సూచించింది. 1980 ఏప్రిల్ 2న అంతర్రాష్ట్ర గోదావరి జలాల ఒప్పందం ఆధారంగా పోలవరం నిర్వహణ షెడ్యూల్ను రూపొందించారని, పోలవరం నుంచి పీబీఎల్పీ ద్వారా 200 టీఎంసీలను మళ్లించే క్రమంలో నాటి షెడ్యూల్ను పునఃపరిశీలించాలని తేల్చిచెప్పింది. పోలవరం కుడి కాలువ ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్)కు తరలించేలా పీబీఎల్పీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. 80 లక్షల మందికి తాగు, 7.41 లక్షల ఎకరాలకు సాగు నీరు, నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ కింద 22.58 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు... పారిశ్రామిక అవసరాల కోసం 20 టీఎంసీలను సరఫరా చేస్తామని చెబుతోంది. ఈ ప్రాజెక్టుకు రూ.81,900 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది.కేవలం కమీషన్ల కోసమే బాబు సర్కారు బనకచర్ల రాగం...!రాష్ట్ర ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును కేవలం కమీషన్ల కోసమే చేపడుతున్నట్లు స్పష్టం అవుతోందని సాగునీటి రంగ నిపుణులు, విమర్శకులు పేర్కొంటున్నారు. గోదావరి ప్రధాన ఉపనది ఇంద్రావతిపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రెండు ప్రాజెక్టులు నిర్మిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రూ.45 వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన వీటికి కేంద్రం ఆమోదం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రకటించారని చెబుతున్నారు. అంతేగాక సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం ఏటా గోదావరికి వచ్చే వరదలో ఇంద్రావతి నుంచి వచ్చి కలిసే వరద 22.93 శాతం ఉంటుందని వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి ఏపీకి నీరు చేరేది ఎప్పుడు? అని ప్రశ్నిస్తున్నారు. ఈ కీలక విషయాలపై మాట్లాడకుండా బాబు సర్కారు హడావుడి చేస్తోందని విమర్శిస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై మౌనంగా ఉండి బనకచర్ల చేపట్టడమా? అని నిలదీస్తున్నారు. నీళ్లు రాని సంగతి తెలుస్తున్నా.. ఎర్త్ వర్క్ చేసి కమీషన్లు కొట్టేసే ఎత్తుగడతో పోలవరం–బనకచర్ల చేపట్టారని ఆరోపిస్తున్నారు.జనవరిలోనే ‘సాక్షి’ కథనం.. అక్షర సత్యంపీబీఎల్పీకి ఆర్థిక సాయం కోరుతూ కేంద్ర జల్ శక్తి శాఖకు చంద్రబాబు ప్రభుత్వం జనవరి 24న ప్రతిపాదనలు పంపింది. అప్పుడే ‘‘పోలవరానికి ఉరేసి.. బనకచర్లకు గోదారెలా?’’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. చంద్రబాబు సర్కారు నిర్వాకాన్ని సాక్ష్యాధారాలతో ఎత్తిచూపింది. ఇప్పుడు పీపీఏ డైరెక్టర్ మన్నూజీ ఉపాధ్యాయ కూడా ‘సాక్షి’ కథనం అక్షర సత్యమని నిరూపించేలా కేంద్ర జల్ శక్తి శాఖకు లేఖ రాయడం గమనార్హం.జీవనాడికి ఉరేసి ఊపిరి తీయడం వల్లే..పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా నిర్మించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతిచ్చింది. ఆ మేరకు గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 55 మీటర్ల ఎత్తుతో స్పిల్వేను 2021 జూన్ 11 నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ, గతేడాది ఆగస్టు 28న 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వతో పోలవరం పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీనిని ఆ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి, టీడీపీకి చెందిన రామ్మోహన్నాయుడు వ్యతిరేకించలేదు. అంటే... పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్న మాట. పోలవరం రిజర్వాయర్ను బ్యారేజ్గా మార్చేందన్నది కూడా స్పష్టమవుతోంది. పోలవరం కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. ఈ స్థాయిలో 115.4 టీఎంసీలనే నిల్వ చేయొచ్చు. కుడి కాలువకు 35.5 మీటర్ల నుంచి 40.23 మీటర్ల వరకు నీటిని తరలించవచ్చు. 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. కుడి కాలువ కింద 3 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికే సరిపోవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 42 మీటర్ల ఎత్తు నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా బనకచర్లకు గోదావరి జలాలను తరలించడం ఎలా సాధ్యమన్నది రాష్ట్ర ప్రభుత్వానికే తెలియాలి. పోలవరంలో నీటి నిల్వ ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించి, జీవనాడికి ఉరేసి ఊపిరి తీయడం వల్లే పీబీఎల్పీకి శాపంగా మారిందని సాగు నీటి రంగ నిపుణులు అంటున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ జనవరి 24న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. పీబీఎల్పీకే కాదు... పోలవరంలో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు నీళ్లందించడమూ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు పీబీఎల్పీని రాయలసీమకు గోదావరి జలాలు అందించాలన్న చిత్తశుద్ధితో కాదు.. కేవలం కమీషన్ల కోసమే చేపట్టారని పీపీఏ లేఖతో బట్టబయలైంది.

‘రష్యాతో వాణిజ్యం చేస్తారా?’: భారత్కు ‘నాటో’ చీఫ్ వార్నింగ్
న్యూఢిల్లీ: రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తూ, అక్కడి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే తాము 100 శాతం ద్వితీయ ఆంక్షలు విధిస్తామని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) చీఫ్ మార్క్ రుట్టే.. భారత్, చైనా, బ్రెజిల్ నేతలకు హెచ్చరిక జారీ చేశారు. దీనికితోడు శాంతి చర్చలలో పాల్గొనేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.రష్యాను ఆర్థికంగా ఒంటరి చేయాలనే అమెరికా ఒత్తిడి మేరకు ‘నాటో’ చీఫ్ ఈ ప్రకటన చేశారు. ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేసి, శాంతి చర్చలకు రావాలని కోరారు. మరోవైపు రష్యాకు సహాయం చేస్తున్న దేశాలపై 500% వరకు సుంకాల బిల్లును అమెరికా సెనేటర్లు వెనక్కి తీసుకున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. దీంతో ఆంక్షలు విధిస్తే, భారత్పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి.బ్రెజిల్, చైనా, భారత్లు ఇకపై రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే భారీ ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు. ఉక్రెయిన్కు నూతన ఆయుధాలు సమకూర్చడంతో పాటు, రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై కఠినమైన సుంకాలు విధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన దరిమిలా మార్క్ రుట్టే ఈ విధంగా వ్యాఖ్యానించారు. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు.. ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తూ, వారి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తూ ఉంటే వారిపై 100 శాతం ద్వితీయ ఆంక్షలు విధిస్తానని మార్క్ రుట్టే హెచ్చరించారు. మాస్కోతో శాంతి చర్చలు అత్యంత ప్రధానమైనవిగా పరిగణించాలని మార్క్ రుట్టే కోరారు.ప్రస్తుతం, చైనా, భారత్, టర్కీలు రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసే దేశాలలో టాప్లో ఉన్నాయని పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఒకవేళ అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధిస్తే, ఈ దేశాలు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ చర్య ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగిస్తుంది. అలాగే ఇప్పటికే అస్థిరంగా ఉన్న ఇంధన ధరలు మరింత భారం అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

‘అనవసర ప్రయాణాలొద్దు’.. ఇరాన్లోని భారతీయులకు హెచ్చరిక
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ జూన్ 13న ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను మొదలుపెట్టి, ఇరాన్కు చెందిన సైనిక, అణు సౌకర్యాలపై బాంబు దాడి చేయడంతో ప్రారంభమైన ప్రాంతీయ ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో ఇరాన్లోని భారత పౌరులు అనవసర ప్రయాణాలను మానుకోవాలని కోరింది.గత కొన్ని వారాలుగా ఇరాన్లో పెరుగుతున్న భద్రతా సమస్యల మధ్య ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం ఈ ప్రకటన చేసింది. ‘గత కొన్ని వారాలుగా నెలకొన్న భద్రతా సంబంధిత పరిణామాల దృష్ట్యా, ఇరాన్లో అనవసరమైన ప్రయాణాలు చేపట్టే ముందు ఇక్కడి పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించాలని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’లో సూచించింది. ఇరాన్లో ఇప్పటికే ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాలు, ఫెర్రీలను వినియోగించుకోవచ్చని తెలిపింది. pic.twitter.com/boZI4hAVin— India in Iran (@India_in_Iran) July 15, 2025ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించి ఇరాన్పై దాడులకు తెగబడిన దరిమిలా ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణి, డ్రోన్ దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. జూన్ 24న ఇజ్రాయెల్ తన దురాక్రమణను ఏకపక్షంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో 12 రోజుల ఈ యుద్ధం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఆర్సీబీ ప్లేయర్కు జాక్పాట్.. వేలంలో అత్యధిక ధర
నిన్న (జులై 15) జరిగిన మహారాజా ట్రోఫీ కేఎస్సీఏ టీ20 టోర్నీ 2025 ఎడిషన్ వేలంలో ఆర్సీబీ ఆటగాడు దేవ్దత్ పడిక్కల్ జాక్పాట్ కొట్టాడు. ఈ వేలంలో పడిక్కల్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. పడిక్కల్ను హుబ్లీ టైగర్స్ రూ. 13.20 లక్షలకు సొంతం చేసుకుంది. పడిక్కల్ తర్వాత ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లుగా సన్రైజర్స్ హిట్టర్ అభినవ్ మనోహర్ (12.20 లక్షలు), కేకేఆర్ వెటరన్ మనీశ్ పాండే (12.20 లక్షలు), విధ్వత్ కావేరప్ప (10.80 లక్షలు), విద్యాధర్ పాటిల్ (8.40 లక్షలు) నిలిచారు.ఈ వేలంలో రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్కు నిరాశ ఎదురైంది. అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. గత సీజన్లో సమిత్ మైసూర్ వారియర్స్కు ఆడాడు. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో కరుణ్ నాయర్ (6.8 లక్షలు), ప్రసిద్ద్ కృష్ణ (2 లక్షలు), మయాంక్ అగర్వాల్ (14 లక్షలు) లాంటి టీమిండియా స్టార్లు ఉన్నారు.మహారాజా ట్రోఫీ 2025 ఎడిషన్ ఆగస్ట్ 11 నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మొదలుకానుంది. ఈ లీగ్లో మొత్తం 6 ఫ్రాంచైజీలు (మైసూర్ వారియర్స్, హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, శివమొగ్గ లయన్స్, మంగళూరు డ్రాగన్స్, మరియు గుల్బర్గా మిస్టిక్స్) పాల్గొంటాయి. ప్రతి ఫ్రాంచైజీ 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసుకుంది.జట్ల వివరాలు..శివమొగ్గ లయన్స్కౌశిక్ వి, హార్దిక్ రాజ్, అవినాష్ బి, నిహాల్ ఉల్లాల్, విధ్వత్ కావేరప్ప, అనిరుధ జోషి, అనీశ్వర్ గౌతమ్, ధృవ్ ప్రభాకర్, సంజయ్ సి, ఆనంద్ దొడ్డమణి, సాహిల్ శర్మ, భరత్ ధురి, దీపక్ దేవాడిగ, రోహిత్ కుమార్ కె, తుషార్ సింగ్, దర్శన్ ఎంబి. మరిబసవ గౌడ, శిరీష్ బాల్గార్మైసూర్ వారియర్స్కరుణ్ నాయర్, కార్తీక్ CA, ప్రసిద్ధ్ కృష్ణ, కార్తీక్ SU, మనీష్ పాండే, గౌతమ్ K, యశోవర్ధన్ పరంతప్, వెంకటేష్ M, హర్షిల్ ధర్మాని, లంకేష్ KS, కుమార్ LR, గౌతమ్ మిశ్రా, శిఖర్ శెట్టి, సుమిత్ కుమార్, ధనుష్ గౌడ, కుశాల్ M వాధ్వాని, శరత్ శ్రీనివాస్, షమంత్మంగళూరు డ్రాగన్స్అభిలాష్ శెట్టి, మక్నీల్ నోరోన్హా, లోచన్ ఎస్ గౌడ, పరాస్ గుర్బాక్స్ ఆర్య, శరత్ బిఆర్, రోని మోర్, శ్రేయాస్ గోపాల్, మేలు క్రాంతి కుమార్, సచిన్ షిండే, అనీష్ కెవి, తిప్పా రెడ్డి, ఆదిత్య నాయర్, ఆదర్శ్ ప్రజ్వల్, అభిషేక్ ప్రభాకర్, శివరాజ్ ఎస్, పల్లవ్ కుమార్ దాస్హుబ్లీ టైగర్స్కెసి కరియప్ప, శ్రీజిత్ కెఎల్, కార్తికేయ కెపి, మాన్వత్ కుమార్ ఎల్, అభినవ్ మనోహర్, దేవదత్ పడిక్కల్, మహ్మద్ తాహా, విజయరాజ్ బి, ప్రఖర్ చతుర్వేది, సంకల్ప్ ఎస్ఎస్, సమర్థ్ నాగరాజ్, రక్షిత్ ఎస్, నితిన్ ఎస్ నాగరాజా, యష్ రాజ్ పుంజా, రితేష్ ఎల్ భత్కల్, శ్రీషా ఆచార్, నాథన్ మెల్లో, నిశిచిత్ పాయ్గుల్బర్గా మిస్టిక్స్వైషాక్ విజయ్కుమార్, లువ్నిత్ సిసోడియా, ప్రవీణ్ దూబే, స్మరణ్ ఆర్, సిద్ధత్ కెవి, మోనిష్ రెడ్డి, హర్ష వర్ధన్ ఖుబా, పృథ్వీరాజ్, లవిష్ కౌశల్, శీతల్ కుమార్, జాస్పర్ ఇజె, మోహిత్ బిఎ, ఫైజాన్ రైజ్, సౌరబ్ ఎమ్ ముత్తూర్, ఎస్జె నికిన్ జోస్, ప్రజ్వల్ పవన్, యూనిస్ అలీ బేగ్, లిఖిత్ బన్నూర్బెంగళూరు బ్లాస్టర్స్మయాంక్ అగర్వాల్, శుభాంగ్ హెగ్డే, నవీన్ MG, సూరజ్ అహుజా, A రోహన్ పాటిల్, చేతన్ LR, మొహ్సిన్ ఖాన్, విద్యాధర్ పాటిల్, సిద్ధార్థ్ అఖిల్, మాధవ్ ప్రకాష్ బజాజ్, రోహన్ నవీన్, కృతిక్ కృష్ణ, అద్విత్ ఎం శెట్టి, భువన్ మోహన్ రాజు, రోహన్ ఎం రాజు, నిరంజన్ నాయక్, ప్రతీక్ జైన్, ఇషాన్ ఎస్

మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ మృతి కేసు.. ఎన్ఆర్ఐ అరెస్ట్
ఛండీగఢ్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భారత దిగ్గజ మారథాన్ అథ్లెట్ ఫౌజా సింగ్ కేసులో ఎన్ఆర్ఐ అమృత్పాల్ సింగ్ ధిల్లాన్(30)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ప్రమాదం జరిగిన సమయంలో వాహనం నడిపిన అమృత్పాల్ సింగ్ను కర్తార్పుర్లో మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే అతడు కెనడా నుంచి భారత్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతడు నడిపిన ఫార్చ్యూనర్ ఎస్యూవీని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరికాసేపట్లో అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అనంతరం రిమాండ్కు తరలించనున్నారు.ఇదిలా ఉండగా.. పంజాబ్లోని జలంధర్ సమీపంలోని బియాస్ పిండ్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 114 ఏళ్ల ఫౌజా సింగ్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా, గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో ఫౌజాసింగ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.ప్రపంచంలోనే కురువృద్ధ అథ్లెట్గా పేరుగాంచిన ఈ పంజాబ్ పుత్తర్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. వందేళ్ల వయసును ఏమాత్రం లెక్కచేయకుండా యువకులకు సవాలు విసురుతూ ప్రపంచ వ్యాప్తంగా వివిధ మారథాన్లలో బరిలోకి దిగి సత్తాచాటారు. ఫౌజా సింగ్ మృతి పట్ల పలు ప్రపంచ దేశాలు తమ దిగ్భ్రాంతి ప్రకటించాయి. 1911 ఏప్రిల్ 1న జన్మించిన ఫౌజాసింగ్ 89 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్ కెరీర్ మొదలుపెట్టారు. 1993లో ఇంగ్లండ్కు వెళ్లిన ఈ దిగ్గజ అథ్లెట్.. ‘టర్బన్ టోర్నడో’ అంటూ అందరి మనన్నలు పొందారు. 2011లో జరిగిన టొరంటో మారథాన్లో 100 ఏళ్ల వయసులో 8 గంటల 11 నిమిషాల్లో రేసు పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు. ఐదేళ్ల పసిప్రాయం వరకు నడవని ఆయన.. తన 14 ఏళ్ల అథ్లెటిక్స్ కెరీర్లో తొమ్మిది మారథాన్ రేసుల్లో పోటీపడటం విశేషం.The world's oldest marathon runner, Fauja Singh, has died at the age of 114. He was involved in a hit-and-run near Jalandhar, India.Singh began running at 89 and ran nine full marathons - and was one of the 2012 London Olympic torchbearers. pic.twitter.com/kvevQ84FaD— Channel 4 News (@Channel4News) July 15, 2025తన కుటుంబసభ్యుల మరణాల నుంచి తేరుకునేందుకు పరుగును ఎంచుకున్న ఫౌజాసింగ్ను 2015లో బ్రిటిష్ ఎంపైర్ మెడల్ వరించింది. 2012లో జరిగిన హాంకాంగ్ మారథాన్.. ఆయన చివరి అంతర్జాతీయ రేసుగా నిలిచింది. పంజాబ్లో డ్రగ్స్ నియంత్రణకు అక్కడి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఈ దిగ్గజ అథ్లెట్ కీలకంగా వ్యవహరించారు. కనీసం నడిచే వీలు లేని వయసులో కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలిచిన ఫౌజాసింగ్ అకాల మృతి అందరినీ కలిచివేసింది.

నటుడు 'రవితేజ' కుటుంబంలో విషాదం
ప్రముఖ టాలీవుడ్ హీరో రవితేజ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (90) వయస్సు, దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. తన తండ్రి నేర్పిన పాఠాల ద్వారా కష్టాలను ఎలా ఎదుర్కొవాలో తెలుసుకున్నానని గతంలో రవితేజ తెలిపారు. మంగళవారం రాత్రి హైదరాబాద్లోని రవితేజ నివాసంలో రాజగోపాల్ తుదిశ్వాస విడిచారు. నేడు మధ్యహ్నం 3 గంటల తర్వాత ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయనకు ముగ్గురు కుమారులు. వారిలో రవితేజ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు భరత్ 2017లో కారు ప్రమాదంలో కన్నుమూశారు, మరో కుమారుడు రఘు కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నారు.తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన రాజగోపాల్ ఫార్మసిస్ట్గా పనిచేశారు. తన ఉద్యోగం కారణంగా ఎక్కువ భాగం ఉత్తర భారతదేశంలోనే ఆయన గడిపాడు. దీంతో రవితేజ పాఠశాల విద్య 'జైపూర్ , ఢిల్లీ , ముంబై భోపాల్'లలో జరిగింది. అందువల్ల రవితేజ చిన్నప్పటి నుంచి వివిధ యాసలు, సంస్కృతులు నేర్చుకున్నాడు. ఇది ఆయన నటనకు ప్రత్యేకతను తీసుకొచ్చిందని పరిశ్రమలో పలువురు చెబుతారు.సంతాపం తెలిపిన చిరంజీవిహీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మృతికి మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. సోదరుడు రవి తేజ తండ్రి మరణవార్త విని చాలా బాధపడ్డానని ఆయన అన్నారు. రవితేజను ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్లో కలిశానని గుర్తుచేసుకున్నారు. ఈ కష్ట సమయంలో రవితేజ కుటుంబానికి భగవంతుడు అండగా ఉంటాడని, హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నట్లు చిరు పేర్కొన్నారు. రాజగోపాల్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చిరంజీవి తెలిపారు.

పవన్ కళ్యాణ్కు అంతా తెలుసు
సాక్షి, అమరావతి: ‘మా వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారు. ఆ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్కు చెప్పాం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన పట్టించుకోలేదు. ఆయన వెంటనే బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే డ్రైవర్ శ్రీనివాస్ హత్య వరకు వ్యవహారం దారి తీసేది కాదు’ అని జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు దంపతులు విస్పష్టంగా వెల్లడించారు. డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో వారిద్దరినీ చెన్నై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు అక్కడి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు. తమ వ్యక్తిగత వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం పవన్ కల్యాణ్కు ముందే తెలుసని వారు కుండబద్ధలు కొట్టడం గమనార్హం. తమ పార్టీ మహిళా నేతను వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసినా ఆయన పట్టించుకోలేదని వారు వాపోయారు. చెన్నై పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు తమ వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి.గొడవ చేయొద్దు.. సర్దుబాటు చేస్తానన్నారు‘టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి మా బెడ్రూమ్లో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డు చేయించారు. మా డ్రైవర్ శ్రీనివాస్ను ప్రలోభపెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు. అనంతరం ఆ వీడియోలను డ్రైవర్ శ్రీనివాస్ రూ.30 లక్షలకు ఎమ్మెల్యే సుధీర్కు విక్రయించారు. వాటితో ఆయన తన వర్గీయుల ద్వారా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయించారు. ఈ విషయం తెలియగానే శ్రీనివాస్ను పని నుంచి తొలగించాం. వ్యక్తిగత వీడియోలతో మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో వెంటనే మా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాం. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీరే ఇదంతా చేయిస్తున్నారని వివరించాం. ఆ విషయాన్ని ఎవరికీ చెప్దొద్దు.. టీడీపీ వారితో గొడవ పడొద్దని ఆయన మాతో చెప్పారు. ‘నేను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సుధీర్తో మాట్లాడతాను. విషయాన్ని సర్దుబాటు చేస్తాను. మీరు పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు. ప్రభుత్వానికి, రెండు పార్టీలకు ఇబ్బంది కలుగుతుంది’ అని పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ అధినేత అలా హామీ ఇవ్వడంతో ఆయన మాటలు విశ్వసించాం. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సుధీర్తో ఏం మాట్లాడారో మాకు తెలీదు. కానీ ఎమ్మెల్యే సుధీర్ తన వర్గీయులతో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులు కొనసాగించారు. అంటే పవన్ కల్యాణ్ మా ఆవేదనను పట్టించుకోలేదని స్పష్టమైంది.పూర్తి వివరాలు తెలుసుకునేందుకే శ్రీనివాస్ను పిలిపించాం టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు బ్లాక్ మెయిలింగ్ కొనసాగిస్తునే ఉన్నారు. దాంతో శ్రీనివాస్ను పిలిపించి గట్టిగా నిలదీశాం. ఎందుకు ఇంత పని చేశావని ప్రశ్నించాం. తనకు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రూ.30 లక్షలు ఇచ్చి ఆ వీడియోలు తీసుకున్నారని అతను తెలిపాడు. అందులో రూ.20 లక్షలు ఖర్చు చేసేశానని, తన వద్ద ఇక రూ.10 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. దాంతో తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి. ఆ ఘర్షణలోనే శ్రీనివాస్ హతమయ్యాడు.పవన్ స్పందించి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదువ్యక్తిగత వీడియోలతో తమను బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయాన్ని చెప్పగానే పవన్ కల్యాణ్ బాధ్యతాయుతంగా స్పందిస్తారని ఆశించాం. పార్టీలో ఓ మహిళా నేత ఆవేదనను అర్థం చేసుకుంటారని, న్యాయం చేస్తారని అనుకున్నాం. కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సమస్యనే పట్టించుకోకపోవడం తీవ్ర ఆవేదన కలిగించింది. పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి, టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ను కట్టడి చేసి ఉండే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు. మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నప్పుడు అడ్డుకోకుండా ఉన్నా బాగుండేది. దాంతో పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేవారేమో. అటు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ బ్లాక్మెయిలింగ్.. మరోవైపు మా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్టించుకోకపోవడం.. దీంతో ఏం చేయాలో మాకు తోచలేదు. దాంతో డ్రైవర్ శ్రీనివాస్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాం. ఆ తర్వాత మాటా మాటా పెరిగి పరిస్థితి చేయిదాటిపోయింది. అతను హతమయ్యాడు. బ్లాక్ మెయిలింగ్ బాధితులమైన మేము హత్య కేసులో చిక్కుకున్నాం. మా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ తన పంతం నెగ్గించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన నియోజకవర్గ ఇన్చార్జికే ఇంతటి దుస్థితి ఏర్పడితే.. ఇక జనసేన పార్టీ సామాన్య కార్యకర్తల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అర్థమవుతోంది’ అని వారు పేర్కొన్నారు.

నిమిష ఉరిశిక్ష ఆపింది నేనే.. హౌతీ, యెమెన్ ప్రభుత్వ పెద్దలతో కేఏ పాల్
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్లో ఉరిశిక్ష పడకుండా తానే ఆపినట్టు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను యెమెన్, హూతీ దేశాల ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి, వారిని ఒప్పించినట్టు పాల్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో నిమిషను కాపడటంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్బంగా కేఏ పాల్.. మూడు రోజులు రాత్రింభవళ్లు కష్టపడి కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్లో ఉరిశిక్ష పడకుండా ఆపాను. నిమిషాను రక్షించడంలో ఎనిమిది సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం విఫలమైంది. మోదీ గవర్నమెంట్ సన సిటీలో ప్రభుత్వం లేదన్నారని, ఏం చేయలేమని చేతులెత్తేశారు. కానీ అది అబద్ధం. హూతీ సిటీలో ప్రభుత్వం ఉంది. మోస్ట్ పాపులర్ ముస్లీం లీడర్ సెమీ ఆరియన్ షేక్ అహ్మద్ ఎంతో సాయం చేశారు.Dr. K.A Paul with Yamen leadership One of the 5 key meetings . Both sides the Houthi leaders and Government leaders have finally considering to help Indian Nurse Nimisha Priya released . The victim Talal Mahdi’s family also considering to pardon Priya the indian Nurse in Sanaa… pic.twitter.com/LSE4jH0i4M— Dr KA Paul (@KAPaulOfficial) July 14, 2025మూడు రోజులుగా కష్టపడి హూతీ, యెమెన్ ప్రభుత్వ పెద్దలను కలిశాను. వారు సాయం చేశారు. నిమిషకు ఉరిశిక్ష వాయిదా వేయకుండా ఆమె చంపిన కుటుంబానికి మిలియన్ డాలర్లు ఇస్తామని హామీ ఇచ్చానని అన్నారు. అవి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా.. తనను ఇవ్వమంటారా అని ప్రశ్నించారు. వారం రోజుల్లోనే ఆ డబ్బులు ఇవ్వాలని అన్నారు. ఉరిశిక్ష కేవలం వాయిదా పడిందని.. తాను మళ్లీ యెమన్ లీడర్లను కలుస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆయన వల్లే ఉరి శిక్ష ఆగిపోయిందా అని మాట్లాడుకుంటున్నారు.

‘1,500 ఎకరాల్లో అమరావతి రైల్వేస్టేషన్ నిర్మాణమా?’
సాక్షి, అమరావతి: అమరావతిలో రైల్వేస్టేషన్ను భారతదేశంలోనే అతి గొప్ప రైల్వేస్టేషన్గా 1,500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని రైతు నేత, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. ఒక టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషనా? ఎక్కడైనా చూశామా? అని ప్రశ్నించారు. ‘అత్యంత పురాతనమైన చెన్నై రైల్వేస్టేషన్ ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుసా?.. కేవలం 13 ఎకరాలు, అదే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుసా?.. 16 ఎకరాలు, బెజవాడ రైల్వేస్టేషన్ విస్తీర్ణం ఎంతో తెలుసా?.. కేవలం 8 ఎకరాల్లో ఉంది. అసలు 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ నిర్మిస్తామని చెబుతుంటే వీళ్లను ఏమనాలని వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. అదే మాట ఎవరైనా మామూలోడు మాట్లాడితే.. ఇలాంటి మాటలు మాట్లాడిన వాడ్ని చెప్పుతీసి కొట్టాలని అంటాం. కానీ బాధ్యత కలిగిన మంత్రి మాట్లాడినప్పుడు మనం ఏమనగలం? అది పిచ్చివాడు మాట్లాడినట్టుగా అనుకోవాలే తప్ప అంతకు మించి వేరే భాష ఏం మాట్లాడగలం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మాస్కోను కొట్టగలవా?
వాషింగ్టన్: దీటైన అస్త్రశస్త్రాలు అందిస్తే మాస్కోను కొట్టగలవా? రష్యాపై భీకరంగా దాడిచేయగలవా? అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూటి ప్రశ్న వేశారు. జూలై నాలుగో తేదీన జెలెన్స్కీకి ఫోన్చేసిన మాట్లాడిన సందర్భంగా ట్రంప్, వొలదిమిర్ జెలెన్స్కీల మధ్య జరిగిన సంభాషణ తాలూకు విశేషాలను తాజాగా అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్పై క్షిపణుల వర్షం కురిపిస్తూ తీవ్ర నష్టం చేకూరుస్తున్న రష్యాకు సైతం అదే స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం కల్గించాలని జెలెన్స్కీకి ట్రంప్ సూచించినట్లు తెలుస్తోంది.ఇరునేతల సంభాషణ వివరాలను కొన్ని అత్యున్నత వర్గాలు వెల్లడించాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘‘ చూడు వొలదిమిర్.. నువ్వు రష్యా రాజధాని మాస్కో నగరంపై క్షిపణులతో దాడి చేయగలవా?’’ అని ట్రంప్ ప్రశ్నించగా.. ‘‘ తప్పకుండా. మీరు సరైన మిస్సైళ్లు ఇస్తే దాడి చేసి చూపిస్తా’’ అని జెలెన్స్కీ హామీ ఇచ్చారు. ‘‘ మీకు కావాల్సిన సుదీర్ఘ శ్రేణి క్షిపణులను అందిస్తాం. రష్యాలోని సెయింట్పీటర్స్బర్గ్ను ధ్వంసంచేయగలరా?’’ అని ట్రంప్ ప్రశ్నించగా.. ‘‘ ఆ స్థాయిలో దాడికి సరిపడా ఆయుధాలు సమకూరిస్తే తప్పకుండా దాడిచేస్తాం’’ అని జెలెన్స్కీ మాటిచ్చారు. ‘‘ దాడుల్లో రక్తమోడుతూ ఉక్రెయిన్వాసులు పడుతున్న బాధను రష్యన్లు అనుభవించాలి. మీ దాడులతో వాళ్లకూ నొప్పి తెలిసిరావాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఉక్రెయిన్తో సయోధ్య కుదుర్చుకోవాలని, లేదంటే 50 రోజుల్లోపు సుంకాల సుత్తితో మోదుతానని రష్యాను ట్రంప్ హెచ్చరించిన మరుసటి రోజే ఈ సంభాషణల అంశం తెరమీదకు రావడం గమనార్హం. శాంతి ఒప్పందం చేసుకోండని ఎంతమొత్తుకున్నా రష్యా వినిపించుకోవట్లేదని, సహనం నశించి ట్రంప్ ఇలా జెలెన్స్కీని దాడులు చేయగలవా? అని ప్రశ్నించారని తెలుస్తోంది. అయితే సంభాషణల వార్తపై అటూ శ్వేతసౌధంగానీ, ఇటు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయంగానీ స్పందించలేదు.నాటో కూటమి ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టేతో కలిసి శ్వేతసౌధంలో ట్రంప్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ పుతిన్ అంత సులభంగా లొంగే మనిషి కాడు. మన నేతలనే మభ్యపెట్టాడు. క్లింటన్ మొదలు జార్జ్ బుష్, ఒబామా, బైడెన్దాకా అమెరికా అధ్యక్షులను తన మాటలతో మభ్యపెట్టాడు. నేను వాళ్లలాగా ఫూల్ను కాబోను. బిలియన్ల డాలర్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్కు సరఫరా చేస్తా. నాటో సభ్యదేశాలు ఆర్డర్ ఇచ్చిన 17 గగనతల రక్షణ వ్యవస్థ మిస్సైల్ లాంఛర్లన్నీ ఉక్రెయిన్కు పంపిస్తాం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
బహిరంగంగా బరితెగించారు!
జేసీ డైరెక్షన్లో తాడిపత్రి ఖాకీల చిల్లర డ్రామా
Stock Market Updates: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
సినిమా టికెట్ ధర రూ. 200 దాటొద్దు.. ప్రభుత్వ కీలక నిర్ణయం
అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులు
తిరస్కారాలే.. విజయానికి మెట్లుగా..
బిష్ణోయ్ గ్యాంగ్కు టెర్రర్ ట్యాగ్?.. కెనడాలో పెరుగుతున్న ఒత్తిడి
హైబ్రీడ్ డ్యాన్స్ స్టైల్ ..! వేరెలెవెల్..
వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. భారత్ ఎవరితో ఆడనుందంటే..?
నిమిష ఉరిశిక్ష ఆపింది నేనే.. హౌతీ, యెమెన్ ప్రభుత్వ పెద్దలతో కేఏ పాల్
ఫ్రెండ్స్తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అప్పుడే..!'
లారెన్స్ను కలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. 'తాగుబోతులకు సాయం చేయనన్నారు'
పిల్లల ముందే అసభ్యంగా ప్రవర్తించేసరికి..
42 ఏళ్ల లారీడ్రైవర్తో డిగ్రీ విద్యార్థిని వివాహేతర సంబంధం..!
సెకెండ్ ఇన్నింగ్స్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ అదే తరహా విధ్వంసం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ధనలాభం
నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్ కదా జగనూ..!
రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక గంట మ్యూజిక్ వినండి చాలు!
కాపురంలో చిచ్చుపెట్టిన రీల్స్ చిన్నది!
వైద్యుల కాపురంలో ‘బుట్టబొమ్మ’ చిచ్చు
ఓడినా గర్వంగా ఉంది.. అదే మా కొంపముంచింది: టీమిండియా కెప్టెన్
విమానాలే కూలుతున్నాయ్! ఆఫ్ట్రాల్ గోడ కూలితే ఇంత రాద్ధాంతం ఏంటని అంటున్నాడ్సార్!!
ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్
సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లు
ఇప్పుడు మీరు అర్జంటుగా బంగ్గాదేశ్, నేపాల్ మయన్మార్ భాషలు నేర్చు కోవాల్సిందేనా సార్!
జీతాల పెంపుపై టీసీఎస్ సీఎఫ్వో కీలక ప్రకటన
ఇదేం పద్ధతి?.. ఎవరి కోసం ఇదంతా?!: గావస్కర్ ఫైర్
ఈ రాశి వారు వ్యాపారాలు విస్తరిస్తారు.. ఆకస్మిక ధనలాభం
అన్నా లేరా.. నాకు దిక్కెవరు రా?
బహిరంగంగా బరితెగించారు!
జేసీ డైరెక్షన్లో తాడిపత్రి ఖాకీల చిల్లర డ్రామా
Stock Market Updates: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
సినిమా టికెట్ ధర రూ. 200 దాటొద్దు.. ప్రభుత్వ కీలక నిర్ణయం
అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులు
తిరస్కారాలే.. విజయానికి మెట్లుగా..
బిష్ణోయ్ గ్యాంగ్కు టెర్రర్ ట్యాగ్?.. కెనడాలో పెరుగుతున్న ఒత్తిడి
హైబ్రీడ్ డ్యాన్స్ స్టైల్ ..! వేరెలెవెల్..
వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. భారత్ ఎవరితో ఆడనుందంటే..?
నిమిష ఉరిశిక్ష ఆపింది నేనే.. హౌతీ, యెమెన్ ప్రభుత్వ పెద్దలతో కేఏ పాల్
ఫ్రెండ్స్తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అప్పుడే..!'
లారెన్స్ను కలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. 'తాగుబోతులకు సాయం చేయనన్నారు'
పిల్లల ముందే అసభ్యంగా ప్రవర్తించేసరికి..
42 ఏళ్ల లారీడ్రైవర్తో డిగ్రీ విద్యార్థిని వివాహేతర సంబంధం..!
సెకెండ్ ఇన్నింగ్స్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ అదే తరహా విధ్వంసం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ధనలాభం
నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్ కదా జగనూ..!
రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక గంట మ్యూజిక్ వినండి చాలు!
కాపురంలో చిచ్చుపెట్టిన రీల్స్ చిన్నది!
వైద్యుల కాపురంలో ‘బుట్టబొమ్మ’ చిచ్చు
ఓడినా గర్వంగా ఉంది.. అదే మా కొంపముంచింది: టీమిండియా కెప్టెన్
విమానాలే కూలుతున్నాయ్! ఆఫ్ట్రాల్ గోడ కూలితే ఇంత రాద్ధాంతం ఏంటని అంటున్నాడ్సార్!!
ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్
సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లు
ఇప్పుడు మీరు అర్జంటుగా బంగ్గాదేశ్, నేపాల్ మయన్మార్ భాషలు నేర్చు కోవాల్సిందేనా సార్!
జీతాల పెంపుపై టీసీఎస్ సీఎఫ్వో కీలక ప్రకటన
ఇదేం పద్ధతి?.. ఎవరి కోసం ఇదంతా?!: గావస్కర్ ఫైర్
ఈ రాశి వారు వ్యాపారాలు విస్తరిస్తారు.. ఆకస్మిక ధనలాభం
అన్నా లేరా.. నాకు దిక్కెవరు రా?
సినిమా

΄పౌరాణికంలో...
హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్లది హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’ (2018) ఘన విజయం సాధించింది. వీరి కాంబోలో మరో సినిమా ΄పౌరాణికం నేపథ్యంలో రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్ మెంట్స్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ మూవీ తాజా అప్డేట్స్ గురించి సూర్యదేవర నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘త్రివిక్రమ్గారు మా బ్యానర్లో తొలిసారి ΄పౌరాణికం నేపథ్యంలో తీయనున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని ప్రకటించడానికి భారీ స్థాయిలో ప్లాన్ చేశాం.నందమూరి తారక రామారావుగారిని రాముడిగా, కృష్ణుడిగా చూసిన నాకు ఎన్టీఆర్ని దేవుడిగా చూపించబోతున్నామనే ఆనందం ఉంది. అయితే ఇటీవల బాలీవుడ్ నుంచి వచ్చిన ‘రామాయణ’(రణ్బీర్ కపూర్) చిత్రం గ్లింమ్స్ వచ్చాక దేశమంతా ఆ సినిమా గురించి మాట్లాడుకుంది. దీంతో మేం చేయబోయే చిత్రం గురించి ‘రామాయణ’ కి మించి మాట్లాడుకోవాలనే ఆలోచనతో కాస్త సమయం తీసుకుని ప్రకటిద్దామని ఆగాం. ప్రస్తుతం మా చిత్రం ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. 2026 సెకండ్ హాఫ్ నుంచి ఎన్టీఆర్, త్రివిక్రమ్గార్ల చిత్రం షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని తెలిపారు.

ఆస్పత్రిలో పంచాయత్ వెబ్ సిరీస్ నటుడు.. జీవితం చాలా చిన్నదంటూ పోస్ట్!
పంచాయత్ వెబ్ సిరీస్తో ఫేమ్ తెచ్చుకున్న నటుడు ఆసిఫ్ ఖాన్ ఆస్పత్రిలో చేరారు. గుండె పోటు రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జీవితం చాలా చిన్నది అంటూ ఆస్పత్రి పైకప్పు ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.‘మీర్జాపూర్ వెబ్సిరీస్తో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చిన ఆసిఫ్ ఖాన్ మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత పంచాయత్, పాతాళ్ లోక్ వంటి వెబ్ సిరీస్ల్లోనూ కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా రెడీ, టాయిలెట్, అగ్నిపథ్, పాగ్లైట్, కాకుడా హిందీ సినిమాల్లో నటించారు. అయితే ఆసిఫ్ ఖాన్ రెండు రోజుల క్రితం అయితే గుండెపోటుతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం బాగానే ఉన్నారని.. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడని తెలుస్తోంది.ఆసిఫ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఆస్పత్రి పైకప్పు ఫోటోను షేర్ చేస్తూ.. "గత 36 గంటలుగా దీన్ని చూసిన తర్వాత జీవితం చిన్నది. ఏ రోజును తేలికగా తీసుకోకండి, ప్రతిదీ ఒక్క క్షణంలో మారవచ్చు., మీ దగ్గర ఉన్నదాని పట్ల కృతజ్ఞతతో ఉండండి. మీకు ఎవరు ఎక్కువ ముఖ్యమైనవారో గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ వారిని గౌరవించండి. జీవితం ఒక బహుమతి' అని రాసుకొచ్చారు. కాగా.. పంచాయత్' వెబ్ సిరీస్లో ఆసిఫ్ ఖాన్.. గణేష్ పాత్రను పోషించాడు.

విడాకుల తర్వాత కొత్త ప్రయాణం.. మళ్లీ పెళ్లి చేసుకోని తారలు వీళ్లే!
బాలీవుడ్ నటీనటులకు ప్రేమ, పెళ్లి, విడాకులు సర్వసాధారణం అనే టాక్ బయట ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎంతో మంది స్టార్స్ కొన్నాళ్లకే విడిపోయారు. పలువురు విడాకులు తీసుకొని మరోపెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని గడుపుతున్నారు. అయితే రూపాయికి ఇంకో వైపు ఉన్నట్లుగా.. బాలీవుడ్ తారల్లో మరో కోణం కూడా ఉంది. విడాకులు తీసుకున్న తర్వాత..మరో పెళ్లి చేసుకొని తారలు కూడా ఉన్నారు. పెళ్లి బంధానికి స్వస్తి చెప్పి.. సింగిల్గానే ఉంటూ కెరీర్పై దృష్టిసారించిన కొంతమంది బాలీవుడ్ స్టార్స్పై ఓ లుక్కేద్దాం. మనీషా కొయిరాలామనీషా కొయిరాలా, 1990లలో తన అందం, నటనతో బాలీవుడ్ను ఓ ఊపు ఊపిన నటి. 'దిల్ సే', 'ఒకే ఒక్కడు' వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఆమె, 2010లో నేపాలీ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్ను వివాహం చేసుకుంది. అయితే, వివాహం జరిగిన ఆరు నెలలకే వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దీంతో 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మనీషా మరో పెళ్లి చేసుకోకుకండా ఒంటరిగానే ఉంటుంది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో కొనసాగుతూ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. పూజా భట్పూజా భట్, 'దిల్ హై కి మాంతా నహీ', 'సడక్' వంటి చిత్రాలతో పాపులర్ అయిన నటి మరియు నిర్మాత. ఆమె 2003లో వ్యాపారవేత్త మనీష్ మఖీజాను వివాహం చేసుకుంది, కానీ 2014లో వారు విడిపోయారు. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకోకుండా.. ఒంటరిగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె సినిమా నిర్మాణం, దర్శకత్వంలో బిజీగా ఉన్నారు. చిత్రాంగద సింగ్చిత్రాంగద సింగ్, 'హజారోం ఖ్వాహిషే ఐసీ', 'దేశీ బాయ్జ్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి. ఆమె 2001లో గోల్ఫర్ జ్యోతి రంధావాను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, 2013లో వారు విడిపోయారు, 2014లో విడాకులు ఖరారయ్యాయి. చిత్రాంగద తన కెరీర్పై దృష్టి సారించి, సినిమాల్లో నటిస్తూ, సింగిల్ మదర్గా తన కుమారుడిని పెంచుతోంది. ప్రస్తుతం వరకు ఆమె మళ్లీ వివాహం చేసుకోలేదు, తన వృత్తి, కుటుంబంపై దృష్టి పెట్టింది.కరిష్మా కపూర్'రాజా హిందుస్థానీ', 'దిల్ తో పాగల్ హై' వంటి చిత్రాలతో 90లలో స్టార్డమ్ సంపాదింకున్న నటి కరిష్మా కపూర్. ఆమె 2003లో వ్యాపారవేత్త సంజయ్ కపూర్ను వివాహం చేసుకుంది, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, వైవాహిక సమస్యల కారణంగా 2014లో విడిపోయి, 2016లో విడాకులు తీసుకుంది. కరిష్మా ప్రస్తుతం సినిమా నిర్మాణంలో నిమగ్నమై, తన పిల్లల సంరక్షణపై దృష్టి సారిస్తూ సింగిల్గా జీవిస్తోంది. ఆమె మళ్లీ వివాహం చేసుకోలేదు.రేఖాబాలీవుడ్ దిగ్గజ నటి రేఖా, తన అద్భుతమైన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఆమె 1990లో వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్ను వివాహం చేసుకుంది, కానీ ఈ వివాహం కేవలం ఒక సంవత్సరం మాత్రమే కొనసాగింది. ముఖేష్ 1991లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ తర్వాత రేఖ మళ్లీ వివాహం చేసుకోలేదు. వీరితో పాటు పలువురు బాలీవుడ్ తారలు విడాకుల తర్వాత ఒంటరి జీవితాన్నే గడుపుతున్నారు.

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్లో కోట శ్రీనివాసరావు మరణించగా.. ఆ తర్వాత మరో సీనియర్ నటి సరోజా దేవి కూడా కన్నుమూశారు. ఇవాళ మరో ప్రముఖ నటుడు మృతి చెందారు. బాలీవుడ్ నిర్మాత అయిన ధీరజ్ కుమార్ ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా.. కోలుకోలేక తుదిశ్వాస విడిచారు.కాగా.. ధీరజ్ కుమార్ 1965లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆయన తన కెరీర్లో సినిమాలతో పాటు సీరియల్స్లోనూ నటించారు. 1970- 1984 మధ్య దాదాపు 21 పంజాబీ చిత్రాలలో నటించాడు. 'ఓం నమః శివాయ్' వంటి ఆధ్యాత్మిక, పౌరాణిక కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన క్రియేటివ్ ఐ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. అంతేకాకుండా 'స్వామి', 'హీరా పన్నా' 'రాతోన్ కా రాజా' వంటి లాంటి హిందీ చిత్రాలలో కూడా నటించాడు. ఆ తర్వాత రోటీ కపడా ఔర్ మకాన్ (1974), సర్గం (1979), క్రాంతి (1981) వంటి చిత్రాలలో సహాయక పాత్రలు పోషించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా సినిమాల్లో ధీరజ్ కుమార్ కొనసాగారు. ధీరజ్ కుమార్ మరణ వార్తను ధృవీకరించిన ఆయన కుటుంబం.. అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రార్థనలకు కృతజ్ఞతలు తెలిపింది. రేపు ఉదయం 10 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఇంటివద్దకు తరలించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు విలే పార్లే వెస్ట్లోని పవన్ హన్స్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

రెండు రోజులముందుగానే...'క్రికెట్... రైట్ రైట్'...
లాస్ ఏంజెలిస్: మరో మూడేళ్ల తర్వాత జరగనున్న లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ షెడ్యూల్ విడుదలైంది. 2028 జూలై 14 నుంచి 30 వరకు ఈ విశ్వక్రీడల సంరంభం కొనసాగనుంది. అయితే సంప్రదాయానికి భిన్నంగా ఈ ఏడాది పలు క్రీడాంశాల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకకు ముందే ఆరంభమయ్యే క్రీడాంశాల సంఖ్య పెరగగా... విశ్వక్రీడల చివర్లో నిర్వహించే అథ్లెటిక్స్ను ఈ సారి ముందే జరపనున్నారు. మొత్తం 351 మెడల్ ఈవెంట్స్ జరగనున్న ఈ విశ్వక్రీడల షెడ్యూల్లోని కొన్ని విశేషాలు... » 2028 జూలై 14న లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుక జరగనుండగా... అంతకు రెండు రోజుల ముందే పలు క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. 1932, 1984 ఒలింపిక్స్ క్రీడలకు వేదికగా నిలిచిన లాస్ ఏంజెలిస్లోని విఖ్యాత ఎల్ఏ మెమోరియల్ కొలోజియంతోపాటు ఇంగ్లెవుడ్లోని స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ముగింపు వేడుకలకు ఎల్ఏ మెమోరియల్ కొలోజియం వేదికగా నిలుస్తుంది. » బాస్కెట్బాల్, క్రికెట్, హాకీ, హ్యాండ్బాల్, రగ్బీ సెవెన్స్, ఫుట్బాల్, వాటర్ పోలో వంటి ఈవెంట్లలో పోటీలు ముందే మొదలవనున్నాయి. » 1920 ఒలింపిక్స్ తర్వాత... విశ్వక్రీడల ప్రారంభ వేడుకకు ముందు ఇన్ని క్రీడాంశాల్లో పోటీలు మొదలు కావడం ఇదే తొలిసారి. 2024 పారిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ, హ్యాండ్బాల్, రగ్బీ సెవెన్స్, ఫుట్బాల్ పోటీలు మాత్రమే ముందు ప్రారంభించారు. » ప్రధాన క్రీడా వేదిక లాస్ ఏంజెలిస్కు 50 కిలోమీటర్ల దూరంలోని పొమెనాలో క్రికెట్ పోటీలు జరగనుండగా... జూలై 12న ప్రారంభం కానున్న ఈ పోటీలు 29న ముగియనున్నాయి. జూలై 20, 29న మెడల్ మ్యాచ్లు నిర్వహిస్తారు. » టి20 ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీలో... పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు పాల్గొననున్నాయి. 1900 ఒలింపిక్స్లో చివరిసారి క్రికెట్ పోటీలు నిర్వహించగా... సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి ప్రవేశ పెట్టారు. » అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) క్రికెట్తో పాటు బేస్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రాస్, స్క్వాష్ వంటి పలు క్రీడాంశాలను లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో చేర్చేందుకు అనుమతి ఇచ్చింది. » ఆరంభ వేడుక తదుపరి రోజు అంటే జూలై 15న ట్రయాథ్లాన్లో తొలి మెడల్ ఈవెంట్ జరగనుంది. » ఒలింపిక్స్లో స్విమ్మింగ్ పోటీలు ముగిసిన తర్వాత అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం పరిపాటి కాగా... ఈసారి మొదట అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించి చివరి వారంలో స్విమ్మింగ్ ఈవెంట్లు జరపనున్నారు. » 2028 జూలై 30న ఒలింపిక్స్ ముగింపు వేడుకలు నిర్వహించనుండగా... చివరగా స్విమ్మింగ్ పోటీలు జరుగుతాయి.

ఇక వన్డే సిరీస్ లక్ష్యంగా...
సౌతాంప్టన్: పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్లో పాల్గొనేందుకు వచ్చిన భారత మహిళల జట్టు మొదటి మిషన్ను విజయవంతంగా పూర్తిచేసింది. ఐదు టి20ల సిరీస్ను 3–2తో కైవసం చేసుకుంది. ఇప్పుడు రెండో మిషన్ కోసం శ్రమించేందుకు సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు ఇక్కడ తొలి వన్డే జరుగుతుంది. పొట్టి సిరీస్ ఇచ్చిన విజయోత్సాహంతో హర్మన్ప్రీత్ బృందం ఆత్మవిశ్వాసంతో ఉండగా... సొంతగడ్డపై సిరీస్ను కోల్పోయామన్న కసితో ఇంగ్లండ్ ఉంది. ఈ నేపథ్యంలో వరుసగా వన్డే సిరీస్నూ కోల్పోయేందుకు ఏమాత్రం సిద్ధంగా లేని ఆతిథ్య జట్టు తొలి మ్యాచ్ నుంచి పట్టుబిగించాలని భావిస్తోంది. జోరు మీదున్న టీమిండియా ఇక్కడ తాజా టి20 సిరీస్లోనే కాదు... ఇటీవల శ్రీలంక గడ్డపై జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్లోనూ భారత్ విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికా, శ్రీలంకలను మట్టికరిపించింది. ఇప్పుడు ఇంగ్లండ్తో ద్వైపాక్షిక సిరీస్లోనూ గెలిచి వన్డే ప్రపంచకప్కు ముందు పూర్తిస్థాయి సన్నద్ధతను చాటాలని హర్మన్ప్రీత్ బృందం ఆశిస్తోంది. షఫాలీ వర్మ స్థానంలో యువ ఓపెనర్ ప్రతీక రావల్, స్మృతి మంధాన భారత ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. ముక్కోణపు సిరీస్లో చెలరేగిన ప్రతీక, ఇక్కడ టి20 సిరీస్లో అదరగొట్టిన మంధాన వన్డేల్లో శుభారంభమిస్తే... జెమీమా, హర్మన్ప్రీత్, హర్లీన్, రిచా ఘోష్ మిడిలార్డర్ను చక్కబెట్టేస్తారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే తెలుగుతేజం స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి మ్యాచ్ మ్యాచ్కి పురోగతి సాధిస్తోంది. ఇంగ్లండ్లాంటి పిచ్లపై స్పిన్ మ్యాజిక్తో ప్రత్యర్థుల్ని కట్టిపడేయడం భారత జట్టుకు అదనపు బలం కానుంది. అనుభవజ్ఞులైన దీప్తి శర్మ, అరుంధతి రెడ్డిలతో కూడిన బౌలింగ్ దళం ఓవరాల్ పటిష్టంగా ఉంది. ఇక ఆతిథ్య జట్టు విషయానికొస్తే రెగ్యులర్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ అందుబాటులోకి రావడం జట్టుకు కాస్త లాభించే అంశం. అయితే 20 ఓవర్లనే సరిగ్గా ఎదుర్కోలేకపోయిన బాధ్యతలేని బ్యాటింగ్ దళంతో 50 ఓవర్ల వన్డేలో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, ప్రతీక, హర్లీన్, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణి, అమన్జోత్, అరుంధతి. ఇంగ్లండ్: నాట్ సీవర్ బ్రంట్ (కెప్టెన్), సోఫియా, టామీ బ్యూమోంట్, సోఫీ ఎకిల్స్టోన్, లారెన్ బెల్, బౌచియర్, క్యాప్సీ, కేట్ క్రాస్, చార్లీ డీన్, అమీ జోన్స్, లారెన్ ఫిలెర్.76 భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 76 వన్డేలు జరిగాయి. 34 మ్యాచ్ల్లో భారత్, 40 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. మరో రెండు మ్యాచ్ల్లో ఫలితం రాలేదు.35 ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్తో భారత జట్టు ఆడిన మ్యాచ్లు. ఇందులో 9 మ్యాచ్ల్లో భారత్ నెగ్గగా... 24 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించాయి. రెండు మ్యాచ్ల్లో ఫలితం రాలేదు.

మళ్లీ టాప్–10లోకి షఫాలీ వర్మ
దుబాయ్: భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్లో తిరిగి టాప్–10లోకి దూసుకొచ్చింది. ఇంగ్లండ్తో సిరీస్లో 176 పరుగులతో మెరిసిన షఫాలీ... ఐసీసీ మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో నాలుగు స్థానాలు ఎగబాకి 655 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్కు చేరింది. ఫామ్లో లేని కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరమైన షఫాలీ పునరాగమనంలో ఇంగ్లండ్పై 158.56 స్ట్రయిక్రేట్తో ఆకట్టుకుంది. దాని ఫలితంగానే ర్యాంకింగ్స్లో ముందంజ వేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి స్మృతి మంధాన (767 పాయింట్లు) మూడో ర్యాంక్లో కొనసాగుతోంది. బెత్ మూనీ (794 పాయింట్లు; ఆ్రస్టేలియా), హీలీ మాథ్యూస్ (774 పాయింట్లు; వెస్టిండీస్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ రెండు స్థానాలు కోల్పోయి 14వ ర్యాంక్కు పరిమితం కాగా... కెపె్టన్ హర్మన్ప్రీత్ సింగ్ 15వ స్థానంలో కొనసాగుతోంది. బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ దీప్తి శర్మ (732 పాయిట్లు) ఒక స్థానం కోల్పోయి 3వ ర్యాంక్లో ఉండగా... రాధా యాదవ్ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 15వ ర్యాంక్కు చేరింది. పాకిస్తాన్ బౌలర్ సాదియా ఇక్బాల్ అగ్రస్థానంలో ఉంది. హైదరాబాదీ బౌలర్ అరుంధతి రెడ్డి నాలుగు స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్లో నిలిచింది.

రుతపర్ణ–శ్వేతపర్ణ జోడీ ఓటమి
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు శుభారంభం లభించలేదు. టోర్నీ తొలి రోజు మహిళల డబుల్స్ విభాగంలో ‘పాండా సిస్టర్స్’ జోడీ రుతపర్ణ–శ్వేతపర్ణ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. కొకోనా ఇషికావా–మైకో కవాజోయి (జపాన్) ద్వయంతో జరిగిన మ్యాచ్లో ఒడిశాకు చెందిన రుతపర్ణ–శ్వేతపర్ణ 13–21, 7–21తో ఓడిపోయింది. 32 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రెండు గేముల్లో ఆరంభ దశలో రుతపర్ణ–శ్వేతపర్ణ ఆకట్టుకున్నా... ఆ తర్వాత తడబడ్డారు. నేడు జరిగే మ్యాచ్ల్లో మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో దక్షిణ కొరియా ప్లేయర్, ప్రపంచ 14వ ర్యాంకర్ సిమ్ జు యున్తో పీవీ సింధు... ప్రపంచ 7వ ర్యాంకర్ పోర్న్పవీ చోచువోంగ్ (థాయ్లాండ్)తో ఉన్నతి హుడా; రక్షిత శ్రీతో అనుపమ పోటీపడతారు. మరోవైపు పురుషుల సింగిల్స్లో తొలి రౌండ్లో చైనా ప్లేయర్ వాంగ్ జెంగ్ జింగ్తో లక్ష్య సేన్ ఆడతాడు. పురుషుల డబుల్స్లో భారత్ నుంచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; హరిహరన్–రూబన్ కుమార్ జోడీలు పోటీపడుతున్నాయి. తొలి రౌండ్లో కాంగ్ మిన్ హియుక్–కి డాంగ్ జు (దక్షిణ కొరియా)లతో సాతి్వక్–చిరాగ్; కిమ్ వన్ హో–సియో సెంగ్ జే (దక్షిణ కొరియా)లతో హరిహరన్–రూబన్ తలపడతారు.
బిజినెస్

ఓలా ఎలక్ట్రిక్, టాటా టెక్నాలజీస్ త్రైమాసిక ఫలితాలు
ద్విచక్ర ఈవీల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. త్రైమాసికవారీగా ఏప్రిల్–జూన్(క్యూ1)లో మొత్తం ఆదాయం 36 శాతం ఎగసి రూ. 828 కోట్లను తాకింది. గతేడాది(2024–25) చివరి త్రైమాసికం(జననవరి–మార్చి)లో కేవలం రూ. 611 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ కాలంలో 33 శాతం వృద్ధితో 68,192 వాహనాలను డెలివరీ చేసింది. గత క్యూ4లో 51,375 యూనిట్లను డెలివరీ చేసింది. ఆటో బిజినెస్ జూన్లో సానుకూల నిర్వహణ లాభం(ఇబిటా)స్థాయికి చేరినట్లు కంపెనీ తెలియజేసింది. ఇందుకు బలపడిన స్థూల మార్జిన్లు దోహదపడినట్లు వెల్లడించింది.ప్రాజెక్ట్ లక్ష్యనిర్వహణ సామర్థ్యాలను భారీగా మెరుగుపరచినట్లు పేర్కొంది. దీంతో నెలవారీ ఆటో నిర్వహణ వ్యయాలు రూ. 178 కోట్ల నుంచి రూ. 105 కోట్లకు తగ్గినట్లు వివరించింది. కన్సాలిడేటెడ్ నిర్వహణ వ్యయాలు ప్రస్తుతం నెలకు రూ. 150 కోట్లు చొప్పున నమోదవుతున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది 3,25,000–3,75,000 వాహనాలు విక్రయించగలమని అంచనా వేసింది. తద్వారా రూ. 4,200–4,700 కోట్ల ఆదాయం సాధించనున్నట్లు అభిప్రాయపడింది. రెండో త్రైమాసికం(జులై–సెపె్టంబర్) నుంచి సానుకూల ఇబిటాను కొనసాగించే వీలున్నట్లు తెలియజేసింది. కొత్తగా విడుదల చేసిన జెన్ 3 స్కూటర్లు క్యూ1 విక్రయాలలో 80 శాతం వాటా ఆక్రమించినట్లు వెల్లడించింది. రోడ్స్టెర్ ఎక్స్ మోటార్సైకిళ్లు దేశవ్యాప్తంగా 200 స్టోర్లలో అందుబాటులోకిరాగా.. రానున్న పండుగల సీజన్లో అమ్మకాలు పుంజుకోనున్నట్లు ఆశిస్తోంది.టాటా టెక్నాలజీస్ లాభం ప్లస్క్యూ1లో రూ. 170 కోట్లుసాఫ్ట్వేర్ సేవల కంపెనీ టాటా టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం పుంజుకుని రూ.170 కోట్లను అధిగమించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.162 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా నీరసించి రూ.1,244 కోట్లకు పరిమితమైంది. గత క్యూ1లో రూ.1,269 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,072 కోట్ల నుంచి రూ. 1,080 కోట్లకు నామమాత్రంగా పెరిగాయి. క్యూ1ను అప్రమత్తంగా ప్రారంభించినప్పటికీ క్లయింట్లు కంపెనీపట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సీఈవో, ఎండీ వారెన్ హారిస్ పేర్కొన్నారు. వెరసి దీర్ఘకాలిక కట్టుబాట్లయిన ప్రొడక్ట్ ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ను కొనసాగించనున్నట్లు తెలియజేశారు. దీంతో ఆరు వ్యూహాత్మక డీల్స్ కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ప్రొడక్ట్ ఇంజినీరింగ్, ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్, పీఎల్ఎమ్ సేవలకు వోల్వో కార్స్ వ్యూహాత్మక సరఫరాదారుగా ఎంపిక చేసుకున్నట్లు పేర్కొన్నారు.

మొన్న రూ.800 కోట్లు.. ఇప్పుడు రూ.1,600 కోట్లు
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్(ఏజీఐ)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(ఎంఎస్ఎల్)లో పని చేసేందుకు మెటా కళ్లు చెదిరిపోయే ప్యాకేజీలను ప్రకటిస్తోంది. యాపిల్, ఓపెన్ఏఐ, గూగుల్ డీప్మైండ్, ఆంత్రోపిక్..వంటి ప్రముఖ సంస్థలకు చెందిన ప్రపంచంలోని టాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకులను ఆకర్షించడమే లక్ష్యంగా రూ.800 కోట్ల నుంచి రూ.1,600 కోట్ల పరిహార ప్యాకేజీలను అందిస్తోంది.ఇటీవల మెటాలో చేరిన యాపిల్కు చెందిన రుమింగ్ పాంగ్కు రూ.1,600 కోట్లు (సుమారు 200 మిలియన్ డాలర్లు) పరిహార ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మెటా మాజీ ఓపెన్ఏఐ పరిశోధకుడు త్రపిత్ బన్సాల్కు రూ.800 కోట్లు (100 మిలియన్ డాలర్లు) ఆఫర్ చేసినట్లు తెలిసింది. కంపెనీ ‘ఓ-సిరీస్’ మోడళ్లను సృష్టించడంలో బన్సాల్ ప్రముఖ పాత్ర పోషించారు. మెటా ఈ ప్యాకేజీలను ధ్రువీకరించనప్పటికీ వేతనం, పరిహార బోనస్లు, స్టాక్ గ్రాంట్లు కలిపి కొన్ని కంపెనీల సీఈఓలు సంపాదించే వేతనంతో సమానంగా, అంతకుమించి ఉన్నాయని తెలుస్తుంది.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టేలా 5 జాగ్రత్తలుగూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా కీలక ప్రచారం ప్రారంభించినట్లు ఇటీవల కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు ఎంత ప్యాకేజీ చెల్లించేందుకైనా వెనుకాడడం లేదని సమాచారం.

పీఎస్యూ టెల్కోలకు లైన్ క్లియర్
పీఎస్యూ టెలికం దిగ్గజాలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఐటీఐలకు మద్దతుగా అత్యున్నత కమిటీ మార్గదర్శకాలకు తెరతీసింది. దీంతో వేలం లేకుండానే ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలకు మిగులు భూమి, భవనాలను బదిలీ చేసేందుకు వీలు చిక్కనుంది. గత నెలలో సమావేశమైన సెక్రటరీల కమిటీ ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.టెలికం పీఎస్యూ సంస్థల ఆస్తులను సొంతం చేసుకోవాలనుకునే ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలు సంబంధిత అనుమతులతోపాటు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ను దాఖలు చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా క్లెయిమ్ను రిజిస్టర్ చేసుకునేందుకు ఆస్తుల సంకేత విలువలో 2 శాతం సొమ్మును డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఆయా ఆస్తుల మానిటైజేషన్కు సంబంధిత వెబ్సైట్లో నోటిఫికేషన్ వెలువడిన 90 రోజుల్లోగా వీటిని పూర్తి చేయవలసి ఉంటుంది. ఇదీ చదవండి: విదేశీ విస్తరణలో హీరో మోటోకార్ప్ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు తొలి ప్రాధాన్యతా హక్కును వినియోగించుకునే వీలుంటుంది. అయితే నోటిఫికేషన్ వెలువడిన 90 రోజుల తదుపరి ఇతర ప్రయివేట్ రంగ కంపెనీలకు ఆస్తులను విక్రయించే వెసులుబాటును బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఐటీఐ పొందుతాయి.

విదేశీ విస్తరణలో హీరో మోటోకార్ప్
ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) ద్వితీయార్థంలో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ మార్కెట్లలోకి అడుగు పెట్టే ప్రణాళికల్లో ఉంది. 2024–25 వార్షిక నివేదికలో షేర్హోల్డర్లను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కంపెనీ చైర్మన్ పవన్ ముంజాల్ ఈ విషయాలు తెలిపారు.హీరో ఫర్ స్టార్టప్స్ తదితర సొంత వేదికల ద్వారా కొత్త తరం ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. కొత్త ఉత్పత్తులు, సేవలపై పరిశోధనలు సాగించేందుకు, వాటిని అభివృద్ధి చేసేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దక్షిణాసియా నుంచి లాటిన్ అమెరికా వరకు అంతర్జాతీయ మార్కెట్లలో 2024–25లో 43 శాతం వార్షిక వృద్ధి సాధించినట్లు ముంజాల్ వివరించారు. రిటైల్లో వ్యూహాత్మక విస్తరణతో ఎలక్ట్రిక్ స్కూటర్ విడా అమ్మకాలు 200 శాతం పెరిగాయని చెప్పారు.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టేలా 5 జాగ్రత్తలుఇక లిస్టెడ్ కంపెనీ ఏథర్ ఎనర్జీతో భాగస్వామ్యం కట్టడమనేది దేశీయంగా ఈవీ చార్జింగ్ నెట్వర్క్ను, ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు దోహదపడినట్లు పేర్కొన్నారు. అటు అమెరికన్ సంస్థ జీరో మోటర్సైకిల్స్తో భాగస్వామ్యం ద్వారా సరికొత్త ప్రీమియం మోటర్సైకిల్ వస్తోందని చెప్పారు. యూలర్ మోటర్స్లో రూ.510 కోట్ల పెట్టుబడి పెట్టడమనేది అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ త్రీ–వీలర్ సెగ్మెంట్లో తమ కార్యకలాపాల విస్తరణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఫ్యామిలీ

చిత్రం చెప్పేకథ : రైతే కాడెద్దు, బెంబేలెత్తించిన పైపు నీరు
బెంబేలెత్తించిన పైపు నీరు: స్థానిక జయదేవ భవన్ పరిసరాల్లో నీటి పైపు చిట్లడంతో భయానక పరిస్థితి చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ఈ పరిస్థితి నెలకొంది. నగర వ్యాప్తంగా తాగు నీరు సరఫరా చేసే ప్రధాన అనుసంధాన పైపు కావడంతో నీటి ఒత్తిడి అత్యధికంగా ఉంటుంది. ఈ పైపు చిల్లుబడి సుమారు 50 అడుగుల ఎత్తుకు నీరు చిమ్మడంతో చేరువలో 30 అడుగుల ఎత్తున 30 కేవీ విద్యుత్ సరఫరా అనుసంధాన వ్యవస్థని అధిగమించి నీరు నింగికి ఎగసింది. – భువనేశ్వర్ చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లుకాడెద్దులు లేకున్నా.. ఉన్న పొలం పోయింది. కాడెద్దులు దూరమయ్యాయి. అప్పులు బతుకు మీదకు వచ్చాయి. కానీ ఆయనకు తెలిసింది ఒక్కటే. వ్యవసాయం. భూమి ఉన్నా లేకపోయినా, కాడెద్దుల సాయం ఉన్నా లేకున్నా.. ఆయన చేయగలిగింది ఒక్కటే వ్యవసాయం. జయపూర్ పట్టణ సమీపంలో బంకబిజ గ్రామ వద్ద రోడ్డు పక్కన పొలంలో ఎద్దుల సాయం లేకుండా దుక్కి దున్నుతున్న ఇతని పేరు రామ పరిజ. సాగు తప్ప ఇంకేమీ తెలియని ఈ మనిషి సొంత పొలం పోయాక కొంత పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. ట్రాక్టర్ అద్దె కట్టలేక ఇలా దున్నే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. – కొరాపుట్ ఇదీ చదవండి: Tipeshwar అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి!

శ్రావణం: ఈశ్వరాభిషేకం
భువనేశ్వర్: శివ భక్తులకు శ్రావణ మాసం అత్యంత పవిత్ర ప్రదం. ఈ నెల పొడవునా ప్రతి సోమవారం ఇష్ట ఆరాధ్య దైవం మహా దేవుడు శివునికి పవిత్ర జలంతో అభిషేకించి తరించేందుకు దీక్ష బూనుతారు. తొలి శ్రావణ సోమవారం పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రాలు శివ దీక్ష భక్తులతో కిటకిటలాడాయి. కఠోర నియమ నిష్టలతో ఒక చోటులోని నదీ జలం సేకరించి వేరొక చోట పూజలందుకుంటున్న మహా దేవునికి అభిషేకిస్తారు. నదీ తీరంలో శుచిగా స్నానం ఆచరించి దీక్ష వస్త్ర ధారణతో తీరంలో లాంచనంగా పూజాదులు నిర్వహించి పవిత్ర నదీ జలంతో నింపిన కలశాల్ని కావడికి అమర్చి పాద యాత్ర ప్రారంభిస్తారు. ఈ దీక్షకుల్ని కావడి ధారులు (కౌడియా)గా పేర్కొంటారు. పాద యాత్ర ఆద్యంతాలు దీక్ష నియమ నిబంధనల్ని కఠోరంగా అవలంభిస్తారు. సోమవారం శైవ క్షేత్రం చేరేలా యాత్ర కొనసాగిస్తారు. భోలా శంకరుని కటాక్షం కోసం బోల్ భం నిరంతర శివ నామ నినాదంతో ముందుకు సాగుతారు. బోల్ భం దీక్షకుల ఆగమనం పరిసరాల్ని శివ మయం చేస్తాయి. శైవక్షేత్రాలు ప్రత్యేకంగా అలంకరించుకుని వీరికి స్వాగతం పలుకుతాయి. దారి పొడవునా కావడిధారి పాదచారులకు ఎటువంటి అసౌకర్యం అవాంతరం కాకుండా పోలీసు, రవాణా తదితర అనుబంధ వర్గాలు అంకిత భావంతో చేయూతనిస్తాయి. దవళేశ్వరునికి పవిత్ర జలంతో అభిషేకిస్తున్న భక్తులు పలు స్వచ్చంధ సేవక వర్గాలు దారి పొడవునా దీక్షకు అనుగుణంగా వీరి కోసం ఏర్పాట్లు చేసి ఆదరిస్తారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి శైవ క్షేత్రాలు విద్యుద్దీపాలు, పచ్చని తోరణాలు, సుగంధిత పూల మాలల అలంకరణతో కనులు మిరమిట్లు గొలిపేలా ముస్తాబవుతాయి. ఆయా క్షేత్రాల్లో బోల్ భం దీక్షకులు సులభంగా మహా దేవునికి అభిషేకించేందుకు తాత్కాలిక బారికేడ్ల గుండా వరుస క్రమంలో దర్శన సౌకర్యం వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించి దేవస్థానం యంత్రాంగం సహకరిస్తారు. ఏకామ్ర క్షేత్రంలో లింగ రాజు, అఠొగొడొ ధవళేశ్వరుని దేవస్థానం, రాజ్గంగ్పూర్లోని ఘోఘరేశ్వర్, ఢెంకనాల్ కపిలేశ్వర్ మరెన్నో ప్రముఖ శైవ క్షేత్రాలు బోల్ భం దీక్షకుల ఆగమనంతో శ్రావణ శోభతో కళకళలాడుతున్నాయి. ఈ సందర్భంగా మహా నది, ఉప నదులు, బ్రాహ్మణి, వైతరణి, కువాఖాయి తదితర పవిత్ర నదుల నుంచి సేకరించిన జలాన్ని కావడి భారంతో నిష్టతో సంకల్పం మేరకు శైవ క్షేత్రం చేరుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో మహా శివునికి అభిషేకిస్తారు. ఈ దీక్షలో ఆబాల గోపాలం అత్యంత అంకిత భక్తి భావంతో పాల్గొంటారు. శివాలయంలో భక్తులు భారీగా గుమిగూడారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది భక్తులు, కౌడిలు బ్రహ్మణి నది, వేదవ్యాస్ శైవ పీఠం నుంచి నీటిని తీసుకువచ్చి ఘోఘరేశ్వర్ శివాలయానికి నీటిని సరఫరా చేశారు. View this post on Instagram A post shared by Sudarsan pattnaik (@sudarsansand) పూరీ సాగర తీరంలో శ్రావణ సోమవారం పురస్కరించుకుని మహా దేవుని ఆశీస్సులు కోరుతూ ఆవిష్కరించిన సైకత మహా శివుడు, బొడొ సింగారం అలంకరణలో కటక్ అఠొగొడొ ధవళేశ్వరుని దర్శనం

రామావతార పరమార్థం : సరస్వతీ దేవి ప్రేరణతోనే కేకైయి వైరం
సాధారణంగా లోకంలో... రామాయణంలోని మంథర కపట స్వభావం గలది అనీ, భరతుని కంటే కూడా రామునిపై ఎక్కువ పుత్ర ప్రేమను చూపించే కైకేయి మనసును విరిచి, రాముడిని వనవాసానికి పంపేటట్లు చేసిందనీ ఆమె పాత్ర స్వభావం గురించి ఒక విశ్లేషణ ఉంది. కానీ, అధ్యాత్మ రామాయణంలో, రామావతార పరమార్థం నెరవేరటానికి సరస్వతీ దేవి ప్రేరణతో ఆమె అలా వైరభావం ప్రదర్శించినట్లు తెలుస్తున్నది.రామ పట్టాభిషేక వార్త విని, కౌసల్యా దేవి ఈ శుభకార్యం నిర్విఘ్నంగా జరగాలని లక్ష్మీదేవిని పూజించింది, దుర్గాదేవిని పూజించింది. అయినా ఆమె మనసులోకించిత్ వ్యాకులత ఉందిట. జరగబోయేది ముందుగానే సూచనగా తెలుస్తున్నది ఆమెకు. అప్పుడు దేవలోకంలో దేవతలంతా కలిసి, వాగ్దేవి సరస్వతిని ప్రేరేపించారు: ‘నీవు భూలోకంలో అయోధ్యా నగరానికి వెళ్లు. రామ రాజ్యాభిషేకానికి విఘ్నం కలగజేయటానికి యత్నించు. ముందు మంథర మనసులో ప్రవేశించి, ఆమెలో వ్యతిరేక భావం కలిగించు. తర్వాత కైకేయిలో ప్రవేశించి ఆ విధంగానే చెయ్యి. రామ రాజ్యాభిషేకం ఆగిపోతే గానీ, రామావతార పరమార్థం నెరవేరదు,’ అని చెప్పారు. సరస్వతి దేవి సరేనని బయలుదేరింది. అయోధ్యా నగరం చేరి మంథర మనసులో ప్రవేశించింది.కైకేయితో మంథర ‘నీకు గొప్ప ఉపద్రవం రాబోతోంది. రేపు రామునికి పట్టాభిషేకం జరగబోతోంది’ అంది. కైకేయిసంతోషంతో దివ్యమైన మణి నూపురాన్ని మంథరకు బహు మతిగా ఇచ్చింది. సరస్వతీ దేవి ప్రేరణతో మంథర... కైకేయి మనసు బాధ పడేట్లు, రామ పట్టాభిషేకం జరిగితే కౌసల్యకు దాసిలా ఉంటావని చెపుతుంది. ఆ మాటల ప్రభావంతో కైకేయి మనసులో మార్పు వచ్చి, కోప గృహంలో చేరింది. తర్వాత రాముడు అరణ్యవాసానికి వెళ్లడం, సీతాపహరణం, రావణ సంహారం... ఇలా ఎన్నో ఘట్టాల్లో రాముడు తాను నిర్వర్తించా ల్సిన సకల కార్యాలను నిర్వర్తించాడు.– డా.చెంగల్వ రామలక్ష్మి

సోషల్ ట్రెండ్స్..! జంతుప్రేమికులు ఇష్టపడేలా..
మొన్న గిబ్లీ ఆర్ట్.. నిన్న బేబీ పాడ్కాస్ట్.. నేడు ‘యానిమల్ వ్లాగ్’, అవెంజర్స్, హల్క్ విడియోస్.. ఇలా సోషల్ మీడియాలో రోజుకో వింత ట్రెండ్ అవుతోంది.. సామాజిక మాధ్యమాల్లో ఏఐ హవా కొనసాగుతుంది. ఒక్కో నెల ఒక్కో ఏఐ స్పెషల్స్తో నెటిజన్లు సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏఐ ట్రెండింగ్ యుగం కొనసాగుతోంది. ఐదు నెలల క్రితం గిబ్లీ ఆర్ట్తో సోషల్మీడియా హోరెత్తింది. ఎటుచూసినా గిబ్లీ ఆర్ట్ ఫొటోలతో నెటిజన్లు, ప్రజలు సందడి చేశారు. రెండు నెలల క్రితం బేబీ పాడ్కాస్ట్, బేబీ ఏఐ వీడియోలు వైరల్ అయ్యాయి. నేడు యానిమల్ వ్లాగ్, అవెంజర్ హల్క్ వీడియోస్ నెటిజన్లను అలరిస్తున్నాయి. ఏఐతో ట్రావెలర్స్, ఫ్రెండ్స్ ట్రావెలింగ్తో చేసే వ్లాగ్ వీడియోస్ మంకీ, చింపాజీలు చేసేలా చేసి నెటిజన్లను నవ్విస్తున్నారు. సోషల్ మీడియాలోని ఇన్స్టా, ఫేస్బుక్లతో పాటు అన్ని యాప్లలో యానిమల్ వ్లాగ్, అవెంజర్, హల్క్ వీడియోలు దర్శనమిస్తున్నాయి. అవెంజర్, హల్క్ తెలంగాణకు వస్తే, ఒక అవ్వ చేతి మనవడిగా సరదా సరదా సంభాషణల వీడియోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ఛాట్జీపీటీ యానిమల్ వ్లాగ్, అవెంజర్ హల్క్ వీడియోస్ చేస్తున్నారు. ఇక జంతుప్రేమికులైతే ఇలాంటి వాటిని ఇష్టపడుతున్నారు. మరికొందరు ముందడుగేసి యానిమల్ వ్లాగ్గా మార్చేస్తున్నారు. (చదవండి: చిట్టి చేతుల్లో స్క్రీన్.. అంతటా అదే సీన్..)
ఫొటోలు
అంతర్జాతీయం

ఆర్కిటిక్పై నియంత్రణకు పోటీ
భూమి ఎగువ భాగమైన ఉత్తర ధ్రువంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అర్కిటిక్పై నియంత్రణ కోసం గ్రీన్లాండ్ను స్వా«దీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయతి్నస్తున్నారు. మరోవైపు రష్యా ఆర్కిటిక్లోని తన సైనిక స్థావరాలను ఆధునీకరిస్తోంది. ఇంకోవైపు చైనా ఐస్ బ్రేకర్లు అక్కడ సరికొత్త మార్గాలు తెరుస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతమైన అర్కిటిక్ కోసం పెద్ద దేశాల మధ్య ముదురుతున్న ఈపోటీ ప్రపంచ భద్రతకే పెను ముప్పుగా మారుతోంది. ఆర్కిటిక్పై పట్టు కోసం అగ్రరాజ్యాల మధ్య ఈ పోటీ ఎందుకో అర్థం కావాలంటే ఆ ప్రాంతాన్ని భూగోళం పై నుంచి చూసి అర్థం చేసుకోవాలి. ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభంలో గ్రీన్ల్యాండ్æకు ఉత్తరాన ఉన్న మారుమూల ప్రాంతంలో థూలే అనే ప్రదేశంలో అమెరికా ఒక ముఖ్యమైన స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినా ఆ ప్రదేశ ప్రాముఖ్యత తగ్గలేదు. గ్రీన్లాండ్ ఇప్పటికీ డెన్మార్క్లో భాగంగా అ«దీనంలోనే ఉంది. దాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని అమెరికా ఎప్పటినుంచో యోచిస్తోంది. ట్రంప్ రెండోసారి గద్దెనెక్కాక ఈ ప్రయత్నాలు మరింత వేగవంతం చేశారు. అమెరికా రక్షణకోసం గోల్డెన్ డోమ్ వ్యవస్థను ఇటీవలే అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించారు. ఇలాంటి వ్యవస్థకు ముందస్తు హెచ్చరిక సైట్లు చాలా ముఖ్యమైనవి. అలా రక్షణ, దాడి రెండింటికీ పనిచేసే స్థావరంగా గ్రీన్లాండ్ను అమెరికా చూస్తోంది. ఇది చాలాకాలంగా రష్యాకు ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ఏదైనా ముందడుగు వేస్తే అత్యంత ప్రభావితమయ్యేది రష్యానే. రష్యా భూభాగంలో ఐదో వంతు ఆర్కిటిక్లో ఉంది. ఇక ఆ దేశ తీరప్రాంతంలో సగానికి పైగా ఆర్కిటిక్ వెంబడే ఉంది. అందుకే అర్కిటిక్లో రష్యా కొన్నేళ్లుగా ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెడుతోంది. నాగూర్స్కోయ్ వంటి ౖతన వైమానిక స్థావరాలను యుద్ధ ప్రాతిపదికన ఆధునీకరిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచే నిర్వహిస్తున్న ఆ స్థావరాలను భారీ విమానాలను కూడా ఆపరేట్ చేయగలిగేలా తీర్చిదిద్దుతోంది. రష్యా అణు జలాంతర్గామి దళంలో ఎక్కువ భాగం కోలా ద్వీపకల్పంలో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యరి్థపై దాడికి వీలుగా వాటిని ఆర్కిటిక్లో మంచు కింద నిలిపి ఉంచుతుంది. ఇటు అమెరికా, అటు రష్యా చేస్తున్న ఈ ప్రయత్నాలు నాటో కూటమిలోని యూరప్ దేశాలను భయపెడుతున్నాయి. దాంతో ఈ ఉద్రిక్తతలను తగ్గించడంపై నార్వే దృష్టి పెటింది. ఆర్కిటిక్లో మరో కీలక ప్రాంతం స్వాల్బార్డ్ దీవులు. వాటిని నార్వే నియంత్రిస్తుంది. అయినా రష్యాతో సహా అనేక దేశాలు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. గ్రీన్లాండ్, ఐస్లాండ్ మధ్య ఖాళీ ప్రదేశం కూడా కీలకమే. అట్లాంటిక్ను చేరుకోవడానికి రష్యన్ ఉత్తరాది నౌకాదళం ఈ జలాలను దాటాల్సి ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ యు–బోట్లను ఎదుర్కోవడానికి గ్రీన్లాండ్లో అమెరికా సైనిక స్థావరాన్ని స్థాపించడానికి ఈ జల సంధే కారణం. రేసులోకి బ్రిటన్ ఇటీవలి కాలంలో బ్రిటన్ కూడా ఆర్కిటిక్పై దృష్టి పెట్టింది. విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ మే చివరలో ఆర్కిటిక్ను సందర్శించారు. అక్కడ శత్రు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి ఐస్లాండ్తో కలిసి ఉమ్మడి పథకాన్ని ప్రకటించారు. రష్యన్ జలాంతర్గాములు, పడవలను ఆచూకీ కనిపెట్టడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. కానీ జలాంతర్గాములు, సముద్ర గస్తీ, వైమానిక ముందస్తు హెచ్చరిక విమానాలు బ్రిటన్ లేని నేపథ్యంలో ఈ యత్నాలేవీ ఫలించేలా లేవు. ఇక ఆర్కిటిక్కు చాలా దూరంలో ఉన్న చైనా, తనను తాను ఆ ప్రాంతానికి అతి సమీప దేశంగా చెప్పుకుంటోంది. ఇటీవలి కాలంలో అక్కడ దూకుడు పెంచింది. అక్కడ మంచు విపరీతంగా కరగడం వల్ల ఉత్తరాది అంతటా కొత్త వాణిజ్య మార్గం ఏర్పడుతుండటం చైనాకు బాగా కలిసొస్తోంది. సూయజ్ కాల్వతో పోలిస్తే ఈ మార్గం దానికి బాగా అనుకూలం. అక్కడ విద్యుత్తు ప్రొజెక్ట్ ఏర్పాటుకూ చైనా ప్రయతి్నస్తోంది. అక్కడ ఐస్బ్రేకర్ల సముదాయాన్ని వేగంగా విస్తరిస్తోంది. మైనింగ్ సంస్థలు, విద్యా పరిశోధనల మాటున ఆర్కిటిక్లో చైనా గూఢచారులు బిజీగా గడుపుతున్నారు. ఇవన్నీ అమెరికా, రష్యాల్లో ఆందోళన పెంచుతున్నాయి. డేంజర్ బెల్స్ ఇలా ఆర్కిటిక్పై పట్టు కోసం ఏ దేశానికి ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలు ఆక్కడ విపరీతమైన వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. 2040 నాటికి వేసవిలో ఈ ప్రాంతంలో మంచు ఆనవాలే ఉండకపోవచ్చని ఒక అధ్యయనం ఇప్పటికే హెచ్చరించింది. ఇలా మంచు కరగడం వల్ల్ల ఖనిజాలు, చేపలు, ఇతర సముద్ర సంపద కోసం పోటీ పెరుగుతుంది. మరోవైపు షిప్పింగ్కు దారులు పెరుగుతాయి. ఈ ఆర్థిక పోటీ పెద్ద దేశాల మధ్య మరిన్ని తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయవచ్చు. రష్యా ఆర్థిక ఉత్పత్తిలో దాదాపు పదోవంతు ఆర్కిటిక్ సహజ వనరుల నుంచే వస్తుంది. అక్కడ మంచు విపరీతంగా కరుగుతుండటం రష్యా భద్రతను డోలాయమానంలో పడేస్తోంది.– సాక్షి, నేషనల్ డెస్క్

నీ రాక కోసం.. శుభాంశు ఆగమనం నేడే
వాషింగ్టన్: అంతరిక్షంలో భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ శుభాంశు శుక్లా నింగి నుంచి సగర్వంగా నేలకు తిరిగొస్తున్నాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్న శుభాంశు.. మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి అక్కడ రెండున్నర వారాలకు పైగా గడిపిన విషయం తెలిసిందే. స్పేస్ఎక్స్ డ్రాగన్ ‘గ్రేస్’ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4.45 గంటలకు శుభాంశు బృందాన్ని తీసుకుని భూమికి తిరుగు ప్రయాణమైంది. 22 గంటల 15 నిమిషాలకు పైగా ప్రయాణించిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు అమెరికాలోని కాలిఫోరి్నయా తీర సమీపంలో పసిఫిక్ మహాసముద్ర జలాల్లో దిగనుంది. ఆ వెంటనే వారికి వైద్యపరీక్షలు నిర్వహించి క్వారంటైన్కు తరలిస్తారు. అంతరిక్షంలోని సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల నుంచి నుంచి భూ వాతావరణానికి అలవాటు పడేదాకా శుభాంశు బృందాన్ని వారం రోజుల పాటు ఏకాంతంలో ఉంచుతారు. వైద్య పరీక్షలు తదితరాలు నిర్వహించిన అనంతరం వారు బయటి ప్రపంచంలోకి అడుగు పెడతారు. ఈ నేపథ్యంలో శుభాంశు రాక కోసం దేశమంతా నిలువెల్లా కనులు చేసుకుని ఆనందోత్సాహాలతో ఉత్కంఠగా వేచిచూస్తోంది. తిరిగొచ్చేది ఇలా... నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన యాగ్జియం–4 మిషన్లో భాగంగా భారత వ్యోమగామి, వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశుతో పాటు పెగ్గీ వాట్సన్ (అమెరికా), స్లావోజ్ ఉజ్నాన్స్కీ విస్నియెవ్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) జూన్ 25న ఐఎస్ఎస్కు బయల్దేరడం తెలిసిందే. దాదాపు 28 గంటల ప్రయాణం అనంతరం వారు 26న విజయవంతంగా ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు. అక్కడ 18 రోజులు (443 గంటలు) గడిపారు. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేశారు. → సోమవారం సాయంత్రం షెడ్యూల్ కంటే 10 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 4.45 గంటలకు శుభాంశు బృందం తిరుగు ప్రయాణం మొదలైంది. → అంతకు రెండు గంటల ముందు వారు ఐఎస్ఎస్ నుంచి ఒకరి తర్వాత ఒకరుగా డ్రాగన్ వ్యోమనౌకలోకి ప్రవేశించారు. నలుగురూ స్పేస్ సూట్లు ధరించాక వ్యోమనౌకను ఐఎస్ఎస్తో అనుసంధానించే హాచ్ను మధ్యాహ్నం 2.37కు విజయవంతంగా మూసేశారు. → తర్వాత ప్రయాణానికి తుది సన్నాహాలు దాదాపు రెండు గంటల పాటు సాగాయి. అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించే క్షణాల్లో విపరీతమైన రాపిడికి పుట్టుకొచ్చే 1,600 డిగ్రీ సెల్సియస్ వేడిని తట్టుకునేందుకు స్పేస్క్రాఫ్ట్కు బిగించిన హీట్ షీల్డ్ను సరిచూడటం వంటివి పూర్తయ్యాక డ్రాగన్ ముందు భాగాన్ని ఐఎస్ఎస్ నుంచి విడదీశారు. → అనంతరం సాయంత్రం 4.45కు వ్యోమనౌక భూమికి పయనమైంది. → భూమికి దాదాపు 350 కి.మీ. ఎత్తులో ఉండగా సర్వీస్ మాడ్యూల్ నుంచి డ్రాగన్ విడిపోయింది. → భూమి చుట్టూ పలుమార్లు చక్కర్లు కొడుతూ ప్రయాణ దిశ తదితరాలను సరిచేసుకున్న అనంతరం నిర్ధారిత ప్రాంతంలో అది భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. → క్రమంలో ముందుగా దాని ముందు భాగాన్ని మూసేస్తారు. హీట్షీల్డ్ కిందకు ఉండేలా క్యాప్సూల్ను సరిచేస్తారు. → విపరీతమైన వేగంతో దూసుకొచ్చే డ్రాగన్ను నెమ్మదింపజేసేందుకు భూమికి సుమారు 5.7 కి.మీ. ఎత్తున రెండు రెండు ప్యారాచూట్లు తెరుచుకుంటాయి. అనంతరం 1.8 కి.మీ. ఎత్తున మరో నాలుగు ప్యారాచూట్లు విచ్చుకుంటాయి. → క్యాప్సూల్ వాతావరణంలోకి పునఃప్రవేశించే క్రమంలో పుట్టుకొచ్చే అత్యంత ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా ప్యారాచూట్లను అత్యంత దృఢంగా ఉండే నైలాన్, కెవ్లర్లతో తయారు చేస్తారు. → మధ్యాహ్నం 3.01 గంటలకు క్యాప్సూల్ పసిఫిక్ జలాల్లో దిగుతుంది. → అప్పటికే అక్కడ సిద్ధంగా ఉండే స్పెషల్ రికవరీ షిప్ వెంటనే డ్రాగన్ క్యాప్సూల్ను చేరుకుంటుంది. → దాన్ని షిప్లోకి చేర్చిన అనంతరం శుభాంశుతో పాటు మిగతా ముగ్గురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అందులోంచి బయటికి వస్తారు. → అనంతరం షిప్ మీదే వారందరికీ తొలి దఫా పలురకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. → అనంతరం వారిని హెలికాప్టర్లో ముందుగా తీరానికి, అనంతరం నాసా కార్యాలయంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తారు.ఐఎస్ఎస్ నుంచి ఘనంగా వీడ్కోలు ఐఎస్ఎస్లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు, కరచాలనాలు ముగిసిన అనంతరం వాతావరణం ఉద్వేగపూరితంగా మారింది. 18 రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరేసుకున్నారు. ముఖ్యంగా శుభాంశు రుచి చూపిన క్యారెట్, పెసరపప్పు హల్వాను ఎన్నటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు. ఫ్లోటింగ్ వాటర్ బబుల్ ఐఎస్ఎస్లో 60కి పైగా ప్రయోగాలు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో 18 రోజులు గడిపింది. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేపట్టింది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. మానవ జీర్ణవ్యవస్థ ఖగోళంలో ఎలా పని చేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియోను ఆయన రూపొందించారు. దాంతోపాటు నలుగురు వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతులపైనా ప్రయోగాలు చేసి చూసింది. ఆ క్రమంలో ఫ్లోటింగ్ వాటర్ బబుల్ తయారు చేసి అందులో గడిపింది. అది అద్భుతమైన అనుభవమని శుభాంశు గుర్తు చేసుకున్నారు. ‘‘ఐఎస్ఎస్లో ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదించా. ముఖ్యంగా కిటికీ పక్కన కూచుని కిందకు చూడటాన్ని. బహుశా నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అది’’ అని చెప్పారు. అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు.76 లక్షల మైళ్లు..288 భూ ప్రదక్షిణలు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో గడిపిన 18 రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా 76 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది. ఆ క్రమంలో 288 సార్లు భూప్రదక్షిణలు చేసింది. నవభారత శకమిది శుభాంశు భావోద్వేగం భూమికి తిరుగు ప్రయాణమయ్యే ముందు శుభాంశు ఐఎస్ఎస్లో వీడ్కోలు ప్రసంగం చేశారు. 41 ఏళ్ల ముందు రాకేశ్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలు పెట్టిన క్షణాలను, అక్కడినుంచి భారత్ కని్పంచిన తీరును వరి్ణంచిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘మా తిరుగు ప్రయాణం సందర్భంగా ఈ రోజు ఆకాశం నుంచి భారత్ ఎలా కని్పస్తుందో చూడాలని మా బృందమంతా ఉత్సాహపడుతోంది. నేటి భారత్ ఘనమైన ఆకాంక్షల భారత్. నిర్భయ భారత్. సగర్వంగా తలెత్తుకుని సాగుతున్న భారత్. అందుకే నేడు కూడా నా దేశం మిగతా ప్రపంచమంతటి కంటే మిన్నగా (సారే జహా సే అచ్ఛా) కనిపిస్తోందని చెప్పగలను’’ అంటూ నాడు రాకేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలను శుభాంశు పునరుద్ఘాటించారు. అక్కడి సహచరులపై శుభాంశు ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని జూన్ 25న ఫాల్కన్–9 రాకెట్ ద్వారా అంతరిక్షానికి పయనమయ్యే క్షణాల్లో నేనస్సలు ఊహించలేదు! ఇదంతా ఇదుగో, ఇక్కడ నా వెనక నుంచున్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది. ఈ యాత్రను మా నలుగురికీ అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది వీళ్లే. అంకితభావంతో కూడిన ఇలాంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పని చేయడం నిజంగా మరచి పోలేని అనుభూతి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. కలుద్దాం! అతి త్వరలో భూమిపై కలుద్దాం – ఐఎస్ఎస్ నుంచిబయల్దేరే ముందు శుభాంశు శుభాంశూ... సుస్వాగతం ‘‘యాగ్జియం–4 స్పేస్ మిషన్ను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగొస్తున్న శుభాంశుకు హార్దిక స్వాగతం. ఆయన రాక కోసం దేశమంతా ఎనలేని ఆనందోత్సాహాలతో, అత్యంత ఉత్సుకతతో ఎదురుచూస్తోంది. – కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్

పుతిన్.. నీకు 50 రోజుల సమయం ఇస్తున్నా: ట్రంప్
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మరో అడుగు ముందుకేశారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్కు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు 50 రోజుల సమయం ఇస్తున్నా, ఆ లోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. ‘ పుతిన్ చర్యలు చాలా నిరాశను కల్గిస్తున్నాయి. యుద్ధంపై 50 రోజుల్లో డీల్కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్లు చవిచూస్తుంది. ఆ టారిఫ్లు కూడా వంద శాతం దాటే ఉంటాయి. రష్యా యొక్క మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి.- ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాం’ అని ట్రంప్ స్పష్టం చేశారు. వైట్ హౌస్లో నాటో చీఫ్ మార్క్ రూట్ను కలిసిన నేపథ్యంలో ట్రంప్ కాస్త ఘాటుగా స్పందించారు ఇదీ చదవండి:ట్రంప్- పుతిన్ బ్రొమాన్స్ ముగిసిందా?

ట్రంప్-పుతిన్ బ్రొమాన్స్ ముగిసిందా?
డొనాల్డ్ ట్రంప్.. రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తన ఆధిపత్యాన్ని ప్రతీ చోట చూపించాలనే అనుకుంటున్నారు. ప్రపంచ దేశాల ముందు తాము అగ్రరాజ్యాధినేతలమనే ‘కటింగ్’ కాస్త ఎక్కువగానే ఉంది. తమది అగ్రరాజ్యం.. తాను అగ్రజున్ని అనే ఫీలింగ్ ఆయనలో ఎక్కువగా ఉంది.తాను ఏది చెబితే అది శాసనం అన్న చందంగా తయారైంది ట్రంప్ పరిస్థితి. ఈ క్రమంలోనే తనకు ఆప్తులు, అత్యంత సన్నిహితులు అనే వారిని కూడా వదులుకుంటున్నారు. ఇటీవల తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఎలాన్ మస్క్తో వైరం తెచ్చుకున్నారు. ‘బిగ్ బ్యూటీఫుల్’ బిల్ విషయంలో మస్క్ నో చెప్పారని ట్రంప్ విరుచుకుపడ్డారు. మస్క్ను బహిరంగంగానే చెడామడా తిట్టిపోశారు. మస్క్ దక్షిణాఫ్రికా( మస్క్ జన్మస్థలం) వెళ్లిపోవాలనుకుంటున్నారా? అనే వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దానిలో భాగంగానే మస్క్ నుంచి ‘కొత్త పార్టీ’ అంటూ ఓ ప్రకటన కూడా వెలువడింది. ఫలితంగా మస్క్తో ట్రంప్ సంబంధాలు దాదాపు తెగిపోయాయనే చెప్పొచ్చు.ఆ తర్వాత పుతిన్తో కూడా ట్రంప్కు మంచి సాన్నిహిత్యమే ఉంది. దీనిలో భాగంగానే ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని క్షణాల్లో ఆపేస్తానని ప్రకటించేశారు ట్రంప్. తాను ఆఫీస్లో కూర్చొనే 24 గంటల్లో ఇరుదేశాల యుద్ధాన్ని ముగిస్తానని చెప్పిన ట్రంప్.. ఆపై ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్ స్కీతో చర్చలు కూడా జరిపారు. స్వయంగా జెలెన్ స్కీని వైట్హౌస్కు పిలిపించి మరీ చర్చించారు ట్రంప్. ఇక్కడ ట్రంప్ వ్యవహారాలి శైలిపై వైట్హౌస్ వేదికగానే మీడియా ముందే జెలెన్ స్కీ రెచ్చిపోయి మాట్లాడారు. ఇక్కడే ట్రంప్ పరువు సగం పోయింది. ‘యుద్ధం ఆపాలనుకుంటే రష్యాకు ముందు చెప్పండి.. వార్ ప్రారంభించిది పుతిన్’ అంటూ జెలెన్ స్కీ ఘాటుగా స్పందించారు. ఇలా అమెరికా అధ్యక్షుడి ముందు మరొక దేశాధినేత ఇంత ఘాటుగా మాట్లాడటంతో జెలెన్ స్కీ హీరో అయిపోయాడు. ఇక్కడ ట్రంప్ పాత్రకు అసలు అర్థం లేకుండా పోయింది. పుతిన్తో కటీఫ్..?ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాన్ని పుతిన్ సీరియస్గా పట్టించుకోవడం లేదు. ట్రంప్ ఫోన్ చేసి చెప్పినప్పుడు ఓకే అంటున్న పుతిన్.. అపై గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్పై యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నాడు. ట్రంప్ మధ్యవర్తిత్వం తర్వాత ఉక్రెయిన్-రష్యాల యుద్ధం మరింత ఉగ్రరూపం దాచ్చిందనే చెప్పాలి. దాంతో పుతిన్తో ట్రంప్ బ్రొమాన్స్ ముగిసిపోయినట్లే కనబడుతోంది. వందల కొద్దీ డ్రోన్స్, మిసెల్స్తో ఉక్రెయిన్పై దాడికి దిగుతున్నారు పుతిన్. దాంతో ట్రంప్లో అసహనం ఎక్కువైపోతోంది. ‘పుతిన్ అంతే.. మారడు.. చంపుతూనే ఉంటాడు’ అనే వ్యాఖ్య కూడా చేశారు ట్రంప్. ఈ క్రమంలోనే పుతిన్పై నోరు పారేసకున్నారు. వాషింగ్టన్ మీడియా వేదికగా పుతిన్పై రెచ్చిపోయి మాట్లాడారు. పుతిన్ మంచి వ్యక్తి అనుకున్నా.. కానీ ఇప్పుడు అర్థం పర్థం లేకుండా వ్యవహరిస్తున్నారు అంటూ ట్రంప్ ధ్వజమెత్తారు. ఉక్రెయిన్కు ‘యుద్ధ సాయం’ హామీరష్యాతో సాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్కు అండగా ఉంటామని కొన్ని రోజుల క్రితం ట్రంప్ పేర్కొన్నారు. తమ రక్షణ వ్యవస్థలోని ప్రధాన వనరులను అవసరమైతే కీవ్కు పంపిస్తామనే హామీ కూడా ఇచ్చారు. ఇదంతా పుతిన్పై తీవ్ర కోపం లోలోలన రగిలిపోతున్న ట్రంప్ చెప్పిన మాటలు. అంటే పరోక్షంగా రష్యాపై తాము యుద్ధానికి దిగుతామనే హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. ఇది పుతిన్తో ట్రంప్కు చెడిపోయిందనడానికి మరింత బలం చేకూర్చింది.ట్రంప్ యూ టర్న్..ఉక్రెయిన్కు యుద్ధం విషయంలో అండగా ఉంటామని ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ట్రంప్ యూ టర్న్ తీసుకున్నారు. ఉక్రెయిన్కు నూతన ఆయుధాలు సమకూర్చేందుకు అమెరికా ‘జీరో డాలర్లు’ ఖర్చు చేస్తుందని, అందుకు అయ్యే ఆర్థిక భారాన్ని యూరోపియన్ యూనియన్(ఈయూ) మోయాల్సి ఉంటుందన్నారు. ఉక్రెయిన్కు రాబోయే కాలంలో పంపించే ఆయుధాల బిల్లును అమెరికా భరించబోదని, ఆ ఆర్థిక బాధ్యత ఇప్పుడు యూరోపియన్ యూనియన్పైనే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇది ఉక్రెయిన్కు పిడుగులాంటి భారం. రష్యాతో యుద్ధంలో అమెరికాపైనే ఎక్కువ ఆధారపడుతున్న ఉక్రెయిన్.. ట్రంప్ యూ టర్న్తో ఒక్కసారిగా కంగుతింది. ఇక్కడ ఆయుధాల్ని అమ్ముకోవడమే తమ పని అనే విషయం ట్రంప్ వైఖరితో మరోసారి వెల్లడైంది. ఇక్కడ ఉక్రెయిన్కు యుద్ధం విషయంలో ట్రంప్ యూ టర్న్ తీసుకోకుండా ఆర్థిక భారాన్ని యూరోపియన్ యూనియన్ దేశాలపైకి నెట్టారు. అంటే యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్ యుద్ధానికి అవసరమయ్యే ఆర్థిక భారాన్ని మోస్తే తాను ఆయుధాల్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ట్రంప్ వైఖరిపై ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటనా చేయని పుతిన్.. ఏం జరుగుతుందో చూద్దాం అనే ధోరణితోనే ఉన్నారు.
జాతీయం

బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం ఇదే..
మీరేప్పుడైనా బెంగళూరు వెళ్లారా? అబ్బో చాలాసార్లు వెళ్లాం.. చాలా చూశాం అంటారా? ఎన్నిసార్లు చూసినా మారనిది ఏంటని అక్కడికి వెళ్లొచ్చిన వారిని లేదా అక్కడే ఉంటున్న వారిని అడిగితే వచ్చే సమాధానం ఒకటే. అదే ట్రాఫిక్ సమస్య. దీని కారణంగా రోజులో ఎక్కువ సమయం రోడ్లపైనే గడపాల్సి వస్తుందని బెంగళూరు నగర వాసులు తరచుగా వాపోతుంటారు. ట్రాఫిక్ సమస్య కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను సోషల్ మీడియా వేదికగా ఏకరువు పెడుతుంటారు. ఒక్క బెంగళూరే కాదు దేశంలోని ప్రధాన మహా నగరాలన్ని ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్నాయి.సింగపూర్ మోడల్తో చెక్ఇండియా ఐటీ రాజధానిగా వెలుగొందున్న బెంగళూరు (Bengaluru) మహా నగరాన్ని చాలా కాలంగా ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. అయితే దీనికో పరిష్కారం ఉందంటున్నారు సాఫ్ట్వేర్ కంపెనీ 'జోహో కార్పొరేషన్' సీఈఓ శ్రీధర్ వెంబు. బెంగళూరులో ప్రతిపాదిత భారీ టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎక్స్లో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. సింగపూర్ అమలు చేస్తున్న ప్రజా రవాణా నమూనాతో భారత నగరాల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చని ఆయన అంటున్నారు. ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధించి, పబ్లిస్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు."ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో సింగపూర్ ఒకటి. అత్యంత నివాసయోగ్యమైన నగరంగానూ పేరొందిన సింగపూర్.. ప్రజా రవాణాపై ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రైవేటు వాహనాలపై నియంత్రణను పక్కాగా అమలు చేస్తోంది. కొత్తగా కారు కొనుగోలు చేసే వారు కచ్చితంగా సర్టిఫికెట్ ఆఫ్ ఎన్టైటిల్మెంట్ (COE) కలిగివుండాలి. ఈ సర్టిఫికెట్ ధర లక్ష సింగపూర్ డాలర్ల కంటే ఎక్కువ. ఇది కారు ధర కంటే అధికం. భారతీయ నగరాలు సింగపూర్ కంటే చాలా ఎక్కువ జనసాంద్రత కలిగి ఉన్నాయి. మన నగరాలను నివాసయోగ్యంగా మార్చడానికి విస్తృతమైన ప్రజా రవాణాను నిర్మించాలి. అది సాధ్యమే" అని ఎక్స్లో శ్రీధర్ వెంబు ((Sridhar Vembu) పోస్ట్ చేశారు. అయితే బెంగళూరులో ప్రతిపాదిత భారీ టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు గురించి ఆయన నేరుగా ప్రస్తావించలేదు. కానీ బెంగళూరు లాంటి అత్యధిక జనసంద్రత కలిగిన నగరాల్లో బలమైన, సమ్మిళిత ప్రజా రవాణా అవసరాన్ని నొక్కి చెప్పారు.స్పందించిన ఎంపీ తేజస్వి సూర్య శ్రీధర్ అభిప్రాయంతో బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya) ఏకీభవించారు. రూ. 18,500 కోట్ల వ్యయంతో బెంగళూరులో ప్రతిపాదిత టన్నల్ రోడ్డు నిర్మాణాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ భారీ ప్రాజెక్ట్ వల్ల సామాన్యులకు ఒరిగేదేం లేదని, ప్రైవేట్ కార్లు కలిగి ఉన్న టాప్ 10% నివాసితులకు మాత్రమే ప్రయోజనం ఉంటుందని విమర్శించారు. దీనికి బదులుగా బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ), మెట్రో రైళ్ల విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ సూర్య సూచించారు. 'బెంగళూరులో 2031 నాటికి 16,580 BMTC బస్సులు అవసరం. కానీ మన దగ్గర కేవలం 6,800 మాత్రమే ఉన్నాయి. 2031 నాటికి 317 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైళ్లు నడవాలి. ప్రస్తుతం 78 కి.మీ. వరకే మెట్రో సేవలు పరిమితమయ్యాయ'ని తెలిపారు. 20కి పైగా నిలిచిపోయిన ఫ్లైఓవర్లతో పాటు నగరంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.చదవండి: కోటి ఖర్చు పెడతా... ట్రాఫిక్ సమస్యను తీర్చేద్దాం!నెటిజన్ల రియాక్షన్ప్రభుత్వ రవాణా వ్యవస్థను మెరుగుపరిస్తే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని శ్రీధర్ వెంబు వెలిబుచ్చిన అభిప్రాయంపై ఎక్స్లో నెటిజనులు స్పందించారు. ప్రజా రవాణా వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే.. ప్రజలు సహజంగానే ప్రైవేట్ వాహనాలకు దూరంగా ఉంటారని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మౌలిక సదుపాయాలంటే విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్ల మాత్రమే కాదని.. సంపన్నుల నుంచి సామాన్యూల వరకు ప్రయాణించేలా ప్రపంచ స్థాయి ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవాలని మరొకరు సూచించారు. నివాస ప్రాంతాల నుంచి వాణిజ్య సముదాయాలకు ప్రజా రవాణాను అనుసంధానిస్తూ నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మరో నెటిజన్ అన్నారు. బెంగళూరు వంటి మహా నగరాల్లో కొత్తగా మౌలిక సదుపాయాలను కల్పించడం సులభమా, లేదా ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగైనదిగా అప్గ్రేడ్ (Upgrade) చేయడం సులభమా? అన్నది.. చూడాలని మరొకరు సూచించారు. I want to add that Singapore, one of the most advanced economies in the world and one of the most livable cities, relies extensively on public transport. Singapore also limits the number of private cars through the mechanism of open market trading of Certificate of Entitlement… https://t.co/ob7WjOiybJ— Sridhar Vembu (@svembu) July 15, 2025

రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు
ఢిల్లీ: భారత్ జోడోయాత్రలో నమోదైన కేసులో భాగంగా ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. భారత్ జోడోయాత్రలో ఇండియన్ ఆర్మీని కించపరిచే విధంగా రాహుల్ వ్యాఖ్యలు చేశారనే పరువు నష్టం కేసులో ఆయనక లక్నో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిలోభాగంగా రూ. 20 వేల పూచీకత్తు, రెండు బాండ్లు సమర్పించారు రాహుల్ గాంధీ న్యాయవాదులు. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది కోర్టు.2022, డిసెంబర్ 16వ తేదీన భారత్ జోడో యాత్రలో భాగంగా భారత్ ఆర్మీ సైనికుల్ని రాహుల్ కించ పరిచారంటూ పరువు నష్టం కేసు దాఖలైంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంక్ శ్రీవాస్తవ తరఫను వివేక్ తివారీ అనే న్యాయవాది రాహల్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఇండియన్ ఆర్మీని రాహల్ కించపరిచారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో భారత సైనికులను చైనా ఆర్మీ కొడుతున్నా భారత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ జోడోయాత్రలో ప్రశ్నించారు. ఎల్వోసీ వెంబడి చైనా చర్యలకు భారత్ ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని నిలదీశారు. ఈ వ్యాఖ్యలపైనే రాహుల్పై కేసు నమోదైంది. భారత్ ఆర్మీని కించపరిచారంటూ పరువు నష్టం కేసు దాఖలైంది. అదే సమయంలో దేశంలోని పలు చోట్ల రాహుల్ గాంధీపై ప్రత్యర్థి పార్టీలు రాజకీయ పిటిషన్లు దాఖలు చేశాయి. మరొకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీకి ఈ జనవరిలో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు స్టే విధించింది. 2019లో లోక్సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్లోని చైబాసా పట్టణంలో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన హంతకుడు అని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకుడు నవీన్ ఝా 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిమిష కేసు: భారతీయల పాలిట లైఫ్లైన్.. బ్లడ్మనీ!
కేరళ నర్సు నిమిషా ప్రియను రక్షించేందుకు చివరి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇండియా గ్రాండ్ ముఫ్తీ.. కేరళ ముస్లిం మతపెద్ద కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ చొరవతో మరణశిక్ష అయితే వాయిదా పడింది. క్షమాభిక్ష కోసం యెమెన్లో ఇంకా రాయబారం నడుస్తోంది. బాధిత కుటుంబం గనుక బ్లడ్మనీకి అంగీకరించి క్షమాభిక్ష ప్రసాదిస్తేనే నిమిష మరణశిక్ష తప్పుతుంది. ఈ క్రమంలో బ్లడ్మనీ(క్షమాధనం) తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2008లో తన కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిన నిమిష.. కొన్నాళ్లకు సొంతంగా క్లినిక్ ఓపెన్ చేసింది. అయితే 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీతో ఆమెకు పొరపచ్చాలు వచ్చాయి. తన పాస్పోర్టును దగ్గర ఉంచుకుని తనను వేధిస్తున్నాడంటూ నిమిష ఆరోపణలకు దిగింది. ఈ క్రమంలో మత్తుమందు ఇవ్వడంతో తలాల్ మరణించాడు. ఈ కేసులో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం.. యెమెన్లోని సనా సెంట్రల్ జైలులో బుధవారం మధ్యాహ్నాం 12 గంటల ప్రాంతంలో నిమిషా ప్రియకు శిక్ష అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈలోపు చర్చలకు తొలిసారి తలాల్ కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో శిక్ష వాయిదా పడింది. మరి బ్లడ్మనీకి ఆ కుటుంబం అంగీకరిస్తుందా?.. అసలు బ్లడ్ మనీతో మరణశిక్ష నుంచి ఇంతకు ముందు ఎవరైనా బయటపడ్డారా?. వర్కవుట్ కాని సందర్భాలు ఏమైనా ఉన్నాయా?క్షమాధనం అంటే.. హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఇది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది.నిమిష కేసులో తలాల్ అబ్దో మహ్దీ కుటుంబానికి $1 మిలియన్ రక్తపరిహారం(మన కరెన్సీలో 8 కోట్లకు పైనే) ప్రతిపాదించింది నిమిష తల్లి ప్రేమ కుమారి. అయితే బ్లడ్మనీ తమ గౌరవానికి భంగం కలిగించే అంశమంటూ గతంలో వాళ్లు తిరస్కరించారు. యెమెన్ అనేది హౌతీ నియంత్రణలో ఉన్న దేశం. ఈ కారణంగానే భారత ప్రభుత్వ జోక్యం కష్టంగా మారింది. క్షమాభిక్ష కోసం మత పెద్దలు, Save Nimisha Priya Action Council ప్రయత్నాలు మమ్మరంగా కొనసాగుతున్నాయి. రూ.8.6 కోట్లు తీసుకునేందుకు యెమెన్లోని బాధిత కుటుంబాన్ని ఒప్పిస్తే నిమిష ప్రియకు ఊరట దక్కనుంది.వీరంతా ‘బ్లడ్ మనీ’తో బయటపడినవారే..!నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. ఆ కుటుంబం బ్లడ్మనీకి అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. షరియా చట్టాల ప్రకారం.. ప్రస్తుతం ఈ విధానం యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్థాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో అమల్లో ఉంది. 👉2008లో.. సహోద్యోగిని చంపిన కేసులో జస్బీర్ సింగ్ సౌదీ అరేబియా జైలు నుంచి రూ.30 లక్షల బ్లడ్మనీ చెల్లించడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు. 2005లోశ్రీలంక పౌరుడ్ని చంపిన కేసులో సులేమాన్తో పాటు మరో ఎనిమిది మందికి సౌదీ అరేబియాలోనే మరణశిక్ష పడింది. అయితే రూ. 40 లక్షల బ్లన్మనీతో వీళ్లంతా క్షేమంగా బయటపడ్డారు👉2012లో.. షార్జాలో పాకిస్తానీని మూకహత్య చేసిన కేసులో 17 మంది భారతీయులకు మరణశిక్ష పడింది. బ్లడ్మనీ కింద రూ.16 కోట్లు సేకరించి బాధిత కుటుంబానికి ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ సాయం కూడా ఉంది. 👉2013లో.. కర్ణాటకకు చెందిన ట్రక్కు డ్రైవర్ సలీమ్ భాషాకు 2006లో సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది. రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణానికి కారణమైనందుకు గానూ ఈ శిక్ష విధించారు. అయితే ఈ కేసులో అప్పటి సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా ముందుకొచ్చి సాయం చేశారు. స్వయంగా ఆయనే దాదాపు రూ.1.5 కోట్ల బ్లడ్మనీ బాధిత కుటుంబాలకు చెల్లించడంతో సలీమ్ శిక్ష నుంచి బయటపడ్డాడు.👉2014లో.. సౌదీలో కారుతో ఓ చిన్నారిని ఢీ కొట్టిన కేసులో రవీంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి మరణశిక్ష పడింది. అయితే భారత దౌత్య కార్యాలయం సహకారంతో బ్లడ్మనీ చెల్లించి ఆయన శిక్ష నుంచి తప్పించుకున్నారు.👉2014లో బ్లడ్మనీ ఆధారంగానే ముగ్గురు భారతీయులను విడుదల చేసింది సౌదీ. మృతుడి కుటుంబానికి రూ.1.12 కోట్లు చెల్లించడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు.👉బంగ్లాదేశీ కార్మికుడి హత్య కేసులో కేరళకు చెందిన ఏఎస్ శంకరనారాయణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మరణశిక్ష పడింది. ఈ కేసులో ‘బ్లడ్ మనీ’ కింద 2 లక్షల దిర్హామ్లు (భారత కరెన్సీలో ప్రస్తుతం దాదాపు రూ.47లక్షలు) చెల్లిస్తే క్షమిస్తామని బాధిత కుటుంబం తెలిపింది. దాతల సాయంతో ఆ మొత్తాన్ని చెల్లించడంతో ఎనిమిదేళ్ల తర్వాత 2017లో శంకరనారాయణ యూఏఈ జైలు నుంచి విడుదలయ్యాడు.👉2017లోనే.. ఓ పాక్ పౌరుడ్ని హత్య చేసిన కేసులో 10 మంది పంజాబ్ పౌరులకు సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది. అయితే బాధిత కుటుంబానికి ₹24 లక్షల (200,000 దిర్హామ్స్) బ్లడ్మనీ చెల్లించడంతో క్షమాభిక్ష లభించింది. ఆపై వారు భారత్కు తిరిగొచ్చారు. భారత రాయబార కార్యాలయం, పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధులు, సామాజిక సంస్థలు కలిసి బ్లడ్మనీ సేకరణ చేపట్టారు.👉2017లో తెలంగాణకు చెందిన లింబాద్రి కూడా సౌదీ అరేబియాలో బ్లడ్ మనీతోనే మరణశిక్షను తప్పించుకున్నాడు. ఆ కేసులో సౌదీకి చెందిన ఓ దాత.. లింబాద్రి తరఫున రూ.1.8 కోట్లు బాధిత కుటుంబానికి పరిహారంగా ఇచ్చారు. దీంతో ఆయన శిక్ష నుంచి బయటపడి స్వదేశానికి తిరిగొచ్చారు.👉2024లో.. అబ్దుల్ రహీమ్ కేసు విస్తృతంగా చర్చనీయాంశమైంది. కేరళ కోజికోడ్కు చెందిన అబ్దుల్ రహీమ్ సౌదీ అరేబియాకు హౌజ్ డ్రైవర్గా వెళ్లారు. అక్కడ తన యజమాని ఇంట దివ్యాంగుడైన అనాస్ అల్ షహ్రీ బాధ్యతలు కూడా చూసుకునేవాడు. ఈ క్రమంలో.. ఓ రోజు ప్రమాదవశాత్తూ మరణించాడు. 2018లో సౌదీ కోర్టు హత్య ఆరోపణలపై రహీమ్కు మరణశిక్ష విధించింది. 2022లో అక్కడి సుప్రీం కోర్టు కూడా శిక్షను సమర్థించింది. ఈ క్రమంలో బ్లడ్మనీ తెర మీదకు వచ్చింది. బాధిత కుటుంబం ₹34 కోట్లు (15 మిలియన్ సౌదీ రియాల్స్) బ్లడ్మనీ తీసుకుంటే క్షమించేందుకు సిద్ధమని తెలిపింది. ఆరు నెలల్లో మొత్తం చెల్లించేలా 2023 అక్టోబర్ 16న ఒప్పందం కుదిరింది. SAVEABDULRAHIM' యాప్ ద్వారా క్రౌడ్ఫండింగ్ ద్వారా మొత్తం సేకరించారు. అలా.. 2024 జూలై 2న రియాద్ క్రిమినల్ కోర్టు ఆదేశాలతో శిక్ష రద్దు అయ్యింది. బ్లడ్మనీ చెక్కును బాధిత కుటుంబానికి అప్పగించారు. అయితే.. ఈ ఏడాదిలోనే రహీమ్ విడుదల కావాల్సి ఉంది. ఈ ఘటన.. మానవత్వం, భారతీయుల ఐక్యత, న్యాయం కోసం పోరాటం చూపిన ఉదాహరణగా నిలిచింది.👉2019లో.. అర్జునన్ అతిముత్తు, తమిళనాడులోని తంజావూరు జిల్లా, అతివెట్టి గ్రామంకు చెందిన వ్యక్తి. ఆయన 2013లో కువైట్లో తన రూమ్మేట్ అబ్దుల్ వాజిద్ (మలప్పురం, కేరళ)ను హత్య చేసిన కేసులో మరణశిక్షకు గురయ్యారు. 2016లో శిక్ష ఖరారు అయ్యింది. అయితే బ్లడ్మనీ ఒప్పందం కింద.. బాధిత కుటుంబం ₹30 లక్షలు తీసుకుని క్షమాభిక్ష ఇచ్చేందుకు అంగీకరించింది. ఆపై కువైట్ ప్రభుత్వం మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. అప్పటి కోటక్కల్ MLA అబిద్ హుస్సేన్, యూత్ లీగ్ నేతలు కలిసి క్రౌడ్ఫండింగ్ ద్వారా మొత్తం సేకరించారు.కాగా.. ఈ బ్లడ్ మనీతో భారతీయులకు కూడా పరిహారం దక్కిన సందర్భం ఉంది. 2019 దుబాయ్లో జరిగిన బస్సు ప్రమాదంలో భారత్కు చెందిన మహ్మద్ మీర్జా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్.. బ్లడ్ మనీ కింద మీర్జా కుటుంబానికి 5 మిలియన్ల దిర్హామ్లు (భారత కరెన్సీలో అప్పటికి దాదాపు రూ.11కోట్లు) చెల్లించాడు.బ్లడ్మనీ తప్పించలేకపోయింది!సౌదీ పౌరుడ్ని హత్య చేసిన కేఏసులో ధరమ్పాల్ సింగ్(2020)ను రక్షించేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బ్లడ్మనీని బాధిత కుటంబం తిరస్కరించడంతో మరణశిక్ష అమలు చేశారు.తన యాజమానిని హత్య చేసిన కేసులో కే మాధవన్కు సౌదీలో మరణశిక్ష పడింది. అయితే కుటంబం బ్లడ్మనీని సేకరించడంలో విఫలమైంది. దీంతో 2004లో మరణశిక్ష అమలు చేశారు.సహోద్యోగిని హత్య చేసిన కేసులో.. షంసుద్దీన్కి మరణశిక్ష పడింది. అయితే బ్లడ్మనీని బాధిత కుటుంబం తిరస్కరించడంతో ఉరిశిక్ష అమలైంది.పెండింగ్లో..ఓ దాడి కేసులో యూఏఈలో యూనస్ అనే భారతీయడికి మరణశిక్షపడింది. ఫ్యామిలీ బ్లడ్మనీ సేకరించడంలో ఇబ్బంది పడుతోంది. అయితే శిక్ష ఇంకా అమలు కాలేదు.నిమిష ప్రియ కేసులో.. గతేడాది నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్ వెళ్లారు. తనకున్న పరిచయాల ఆధారంగా బ్లడ్మనీ ఇచ్చి, తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రియ కుటుంబం ఒక మిలియన్ డాలర్ల (రూ.8.6 కోట్లు)ను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ, ఇందుకు అవతలి వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు చర్చల వేళ.. శిక్ష తప్పుతుందో..? లేదో అనే ఉత్కంఠ నెలకొంది.

“నేను నిన్ను విడిచి ఉండలేను.. నేను నీ దగ్గరకు వస్తున్నాను’
ధర్మపురి సమీపంలో తన భర్త మరణ బాధను తట్టుకోలేక ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ధర్మపురి జిల్లాలోని కడ్తూర్ సమీపంలోని తలనాథం గ్రామానికి చెందిన తీతు కుమారుడు దీపమలై (26) ఇంజనీర్. పుట్టిరెట్టిపట్టికి చెందిన గీత (21) ల్యాబ్ టెక్నీషియన్. వీరిద్దరూ వేర్వేరు వర్గాలకు చెందినవారు. వారు పాఠశాల రోజుల నుంచి స్నేహితులు, చివరికి ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ వ్యవహారం వారి ఇద్దరి తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. వ్యతిరేకత కారణంగా, వారు ఒక సంవత్సరం క్రితం వారి ఇళ్ల నుంచి బయటకు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం తర్వాత కొన్ని నెలలుగా దీపమలై అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందినప్పటికీ అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. తాను చనిపోతానని భావించి, తన ప్రేమ భార్య నుంచి విడిపోయి, ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి జీవించమని చెప్పాడు. దీని కారణంగా గీత రెండు నెలల క్రితం తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఇంతలో ఆరోగ్యం క్షీణించిన దీపమలై గత 29వ తేదీన మరణించాడు. తన భర్త మరణం తర్వాత గీత మానసిక వేదనకు గురైంది. ఈ పరిస్థితిలో గీత ఇన్ స్ట్రాగామ్లో “నేను నిన్ను విడిచి ఉండలేను. నేను నీ దగ్గరకు వస్తున్నాను’ అంటూ ఓ పోస్ట్ చేసి, ఇంట్లోని ఎలుకల మందు తాగి మరణించింది. కడత్తూర్ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీని తరువాత, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు దీపమలై మృతదేహాన్ని ఖననం చేసిన ప్రదేశానికి సమీపంలోనే అతని గీత మృతదేహాన్ని కూడా ఖననం చేశారు.
ఎన్ఆర్ఐ

దుబాయ్లో ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి
ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఈనెల 8న దుబాయ్లోని కరామా పార్క్లో ఘనంగా నిర్వహించారు. యుఏఈ వైయస్సార్సీపీ టీమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సయ్యద్ అక్రమ్, అరుణ్ చరవర్థి, ప్రేం, యండ్రా సేను, షేక్ అబ్దుల్లా కీలకంగా వ్యవహరించారు. వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పణతో కార్యక్రమాన్నిప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి మహానేత సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా కార్మికులకు అన్నదానం చేశారు. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్సార్ సేవా తత్వాన్ని గౌరవంగా స్మరించుకున్నారు.ఈ సందర్భంగా సయ్యద్ అక్రమ్, అరుణ్ చరవర్థి మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ సామాజిక న్యాయం, సంక్షేమాన్ని సమన్వయం చేసిన అజరామర నాయకుడని కొనియాడారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చిన నాయకుని సేవలను సేవా కార్యక్రమాల ద్వారా గుర్తుచేసుకోవడం గర్వకారణమని అన్నారు.ప్రధాన, గౌరవ అతిథులు డాక్టర్ ఖాజా అబ్దుల్ ముత్తలిబ్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & ప్రైవేట్ అడ్వైజర్ — H.H. శైఖా సలామా తహ్మూన్ అల్ నాహ్యాన్ కార్యాలయం – యుఏఇ), నజీరుద్దీన్ మహమ్మద్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, Spread Kindness) హాజరయ్యారు. పి. రావు, అబ్దుల్ ఫహీమ్, షోయబ్, అబ్దుల్ రఫీక్, షామ్, ఘానీ, సిరాజ్, షేక్ సమీర్, రవి, పిల్లి రవి, కె. ప్రసాద్, జో బాబు, కిషోర్, బాబ్జీ, ప్రభాకర్, చిట్టి బాబు, నరేశ్, మహిళా సభ్యులు.. శాంతి, రాణి, ప్రభావతి, చిన్ని, విజయ, మేరీ, రాజేశ్వరి, సునీత, వనిత, కమల, భారతీ తదితరులు పాల్గొన్నారు.డాక్టర్ వైఎస్సార్ సేవా విలువలు, ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలన్న సంకల్పంతో.. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా కొనసాగిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.వైఎస్సార్ వల్లే ఎదిగా..డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో లబ్ధి పొంది దుబాయ్లో స్థిరపడిన షేక్ సమీర్ ఈ సందర్భంగా తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ''ఫీజు రీయింబర్స్మెంట్ వల్లే నేను ఇంజినీరింగ్ చదవగలిగాను. ఈ విద్యార్హత ఆధారంగా ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్జెమినీ, డెలాయిట్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేశాను. ఆరోగ్యం, టెక్నాలజీని కలిపే వినూత్న ఆలోచనతో ఏఐ ఆర్కిటెక్ట్, Fit Techies LLC అనే సంస్థను స్థాపించి నడుపుతున్నాను. ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఫిట్నెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి బోధిస్తున్నా. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నా జీవితాన్ని మార్చింది. నేను విద్యార్థి నుంచి మార్గదర్శకుడిగా మారిన ప్రయాణానికి ఇది మూలకారణం” అన్నారు సమీర్.

ఘనంగా ముగిసిన నాట్స్ 8వ తెలుగు సంబరాలు
ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో 8వ నాట్స్ తెలుగు సంబరాలు వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సంభరాల్లో వేలాదిమంది తరలి వచ్చారు.....వేదిక ప్రాంగణం తెలుగువాళ్ళతో క్రిక్కిరిసిపోయింది. మహాసభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, ఈ తెలుగు సంబరాలు విజయవంతానికి కృషి చేశారు.అంతే కాక సంబరాల కమిటీ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, చైర్, కో చైర్, టీం మెంబర్లు, విజయవంతానికి కృషి చేశారు. ఈ తెలుగు సంబరాల్లో నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, అల్లు అర్జున్, శ్రీలీల తో పాటు అలనాటి నటీమణులు జయసుధ, మీనా సందడి చేసారు...థమన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసారు సంబరాలకు వచ్చిన వారిని ఉర్రుతలూగించారు...తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేల నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా ఈ తెలుగు సంభరాలు అంభరాన్ని అంటాయి...నాట్స్ తెలుగు సంబరాల కోసం సైనికుల్లా పని చేసిన ప్రతి ఒక్కరికి... హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు నాట్స్ కమిటీ కన్వీనర్ పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ......ఈ వేడుకలకు వచ్చిన అతిధులకు, కమ్యూనిటీకి, కళాకారులకు, సహకరించిన వలంటీర్లు అందరికీ నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ ధన్యవాదాలుతెలియజేశారు...ఇది మన తెలుగు సంబరం జరుపుకుందాం కలిసి అందరం అనే నినాదం ప్రారంభమైన ఈ సంభరాల్లో 20 వేల మందికి పైగా హాజరయ్యారు...నాట్స్ కన్వీనర్ పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, సెక్రెటరీ మల్లాది శ్రీనివాస్చక్కని ప్రణాళిక, సమన్వయంతో తమ సత్తా చాటారు..సంబరాలే కాక సామాజిక బాద్యత గా హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి నాట్స్ 85లక్షల విరాళం అందజేసింది. ఈ విరాళాన్ని ఆస్పత్రి చైర్మన్, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు.. నాట్స్ లీడర్ షిప్ అందజేశారు. నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.. అనేక సాంస్కృతిక సామాజిక సేవ కార్యక్రమాలు సైతం విజయవంతంగా నిర్వహించారు..

శ్రీ సాంస్కృతిక కళాసారథి 5వ వార్షికోత్సవం, గురుపూర్ణిమ శుభాకాంక్షలు
గురుపూర్ణిమ నాడు ప్రారంభమైన శ్రీ సాంస్కృతిక కళాసారథి ఈ రోజు తన 5వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, ప్రేక్షకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. గత ఐదేళ్లయేటట తాము చేపట్టిన ప్రతి అడుగులో, మీరు అందించిన ఆదరణ, ఆశీర్వాదాలు, ప్రోత్సాహం తమకు బలాన్నిచ్చాయని పేర్కొంది. ‘‘ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి, మాకు తోడుగా నిలిచిన సభ్యులకు,మార్గనిర్దేశం చేసిన మేధావులకు, మన ఆహ్వానాన్ని స్వీకరించి అలంకరించిన అతిథులకు, తమ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులకు, స్పందించిన ప్రేక్షకులకు, సమయానుకూలంగా విరాళాలు అందించిన దాతలకు, ఆశీర్వచనాలు, అభినందనలు తెలియజేసిన మిత్రులకు, మా కార్యనిర్వాహక వర్గం తరఫున శిరస్సువంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.’’అని ప్రకటనలో వెల్లడించింది. ఎనలేని సంపదలాంటి ఈ సహకారం ఇక ముందు కూడా కొనసాగాలని అభిలషించింది.అదే శక్తితో, భవిష్యత్తులో మరిన్ని నాణ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చింది. అలాగే ఇప్పటివరకూ మా సంస్థ నిర్వహించిన ముఖ్యమైన కార్యక్రమాల సంగ్రహాన్ని వీడియో రూపంలో తీసుకొచ్చింది.

8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా
టంపా: ఫ్లోరిడా: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గణపతి పూజలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అమెరికా తెలుగు సంబరాలను బాలకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా అమెరికా తెలుగు సంబరాలను నిర్వహిస్తున్నందుకు నాట్స్ సంబరాల కమిటీని ఆయన అభినందించారు. అమెరికాలో తెలుగు వారి కోసం నాట్స్ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. తెలుగు భాష పరిరక్షణలో నాట్స్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఇప్పటివరకు మూడు సార్లు నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పాలు పంచుకున్నానన్నారు.హంసవింశతి పుస్తకం ఆవిష్కరణ18వ శతాబ్ధంలో ప్రముఖ తెలుగు కవి అయ్యలరాజు నారాయణ రచించిన హంసవింశతి కావ్యాన్ని తనికెళ్ల భరణి నేటి తరం కోసం ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చారు. సంబరాల వేదికపై నందమూరి బాలకృష్ణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగు భాష మాధుర్యాన్ని ఎందరో కవులు తమ రచనల్లో ప్రతిబింబించారని బాలకృష్ణ అన్నారు. భావితరాలకు తెలుగు మాధుర్యాన్ని అందించేందుకు నేటి తరం వారు తెలుగులో మాట్లాడాలని, తెలుగు రచనలను పిల్లలకు పరిచయం చేయాలన్నారు.పద్యం, అవధానం తెలుగు భాషకే సొంతమైన అమూల్యమైన ఆభరణాలని ప్రముఖ రచయిత, నటులు తనికెళ్ల భరణి అన్నారు.. తెలుగు భాషా మాధుర్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని భరణి పేర్కొన్నారు. తెలుగులో ఎన్సైక్లోపీడియా లాంటి పుస్తకం హంసవింశతి అని తెలిపారు.. దీనిని ప్రతి తెలుగువాడు చదవితే మన చరిత్రలో మనకు తెలియని సరికొత్త విషయాలు తెలుస్తాయని భరణి అన్నారు. 8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, ఏపీటీఎస్ చైర్మన్ మోహనకృష్ణ మన్నవతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
క్రైమ్

కళ్లలో కారం చల్లి కాల్చి చంపారు
సాక్షి, హైదరాబాద్/మలక్పేట: సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేతావత్ చందు రాథోడ్ అలియాస్ చందు నాయక్ (50) దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ మలక్పేట పోలీసుస్టేషన్ పరిధిలోని శాలివాహననగర్ పార్కులో వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా దుండగుల కాల్పుల్లో చనిపోయారు. కళ్లలో కారం చల్లిన నిందితులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఆయన శరీరంలోకి మూడు తూటాలు దూసుకుపోయాయి. ఈ హత్యలో నలుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు.. పరోక్షంగా సహకరించిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు. మూడేళ్ల క్రితం ఎల్బీనగర్ ఠాణాలో నమోదైన హత్య కేసులో చందు నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీకారం, భూ వివాదాలతోపాటు వివాహేతర సంబంధం కోణాన్ని పరిగణనలోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, హతుడి కుటుంబీకులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వసూళ్లు అడ్డుకోవడంతో వివాదాలు నాగర్కర్నూల్ జిల్లా నర్సాయిపల్లికి చెందిన చందు.. భార్య నారీబాయి, కుమారుడు సిద్ధు, కుమార్తె సింధులతో కలిసి దిల్సుఖ్నగర్ సమీపంలోని విద్యుత్నగర్లో ఉంటున్నారు. ప్రస్తుతం సిద్ధు కెనడాలో ఎంటెక్ చదువుతుండగా... సింధు గ్రూప్స్కు సన్నద్ధమవుతోంది. చందు విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐలో, కారి్మక నాయకుడిగా సీఐటీయూలో పని చేశారు. ఎల్బీనగర్ ఏరియా సీపీఎం నాయకుడిగా నాగోల్ శ్రీ సాయినగర్లోని స్థలాల్లో పేదలతో గుడిసెలు వేయించారు. 2010లో సీపీఐలో చేరి భూపోరాటం చేసి పట్టాలు ఇప్పించారు. సీపీఐ (ఎంఎల్) నాయకుడు రాజేష్ తో కొన్నాళ్లుగా చందుకు విభేదాలున్నాయి. కుంట్లూర్ రావినారాయణరెడ్డి నగర్లోని మూడెకరాల భూమిలో గుడిసెలు వేసుకున్న వారి నుంచి రాజేష్ తదితరులు డబ్బులు వసూలు చేస్తుండటాన్ని చందు అడ్డుకున్నారు. దీంతో రాజేష్ , సుధాకర్, మున్నా, రాయుడుతో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వాకింగ్ చేసిన పార్కు బయటే... రాజేశ్తోపాటు మరికొందరు సోమవారం రాత్రి కారులో చందు ఇంటి సమీపంలో సంచరించడాన్ని నారీబాయి గమనించి చందును హెచ్చరించారు. మంగళవారం ఉదయం భార్య, కుమార్తెతో కలిసి చందు శాలివాహననగర్ పార్కులో వాకింగ్ చేశారు. 7.30 గంటల ప్రాంతంలో బయటకు రాగా.. అక్కడే కారులో రాజేష్ కనిపించడంతో నారీబాయి హెచ్చరించారు. ‘నాకేం కాదు. ఏం భయం లేదు. మీరు ఇంటికి వెళ్లండి’అంటూ భార్య, కుమార్తెను పంపేశాడు. పార్కు వెస్ట్ గేట్ నుంచి కుడి వైపు రోడ్డులో కారు వద్దకు వెళ్తుండగా అందులోంచి దిగిన ఇద్దరు చందు కళ్లలో కారం కొట్టారు. అప్రమత్తమైన ఆయన తప్పించుకోవడానికి వెనక్కు పరిగెత్తగా.. పార్కు గేటు వద్ద ఉన్న ఇసుకలో కాలు జారి పడిపోయారు. సమీపంలోకి వచ్చిన ఇద్దరు పిస్టల్తో అతని ఛాతీ, పొట్ట భాగాల్లో కాల్చారు. రక్తం మడుగులో ఉన్న అతడిని కాలుతో వెనక్కు తిప్పి తలపై మరో రౌండ్ కాల్చి కారులో పారిపోయారు. సెల్ఫ్ డ్రైవింగ్ కారు అద్దెకు తీసుకుని... ఘటనాస్థలి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దుండగులు స్విఫ్ట్ (టీఎస్ 08 హెచ్డబ్ల్యూ 0875) కారులో వచి్చనట్లు గుర్తించారు. ఇది పీర్జాదిగూడకు చెందిన ఓ మహిళ పేరుతో రిజిస్టరై ఉంది. ఆమె దీన్ని కొత్తపేట కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఏజెన్సీకి కాంట్రాక్టుకు ఇచ్చారు. సోమవారం ఆన్లైన్లో ఆ కారును బుక్ చేసుకున్న ఏడుకొండలు అనే వ్యక్తి తీసుకుని వెళ్లారు.అతడితోపాటు రాజేష్ , ప్రశాంత్, మరొకరు ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏడుకొండలు కారు తీసుకెళ్లి అద్దెకు ఇచ్చిన సంస్థకు అప్పగించి పారిపోయారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలిలో మూడు ఖాళీ క్యాట్రిడ్జ్లు, రెండు పేలని తూటాలను స్వాధీనం చేసుకుంది. పేలింది నాటు తుపాకీ అని, తూటాలు 7.65 ఎంఎం క్యాలిబర్కు చెందినవిగా తేల్చారు. భానుచందర్ హత్య కేసులో నిందితుడు... చందు 2022లో జరిగిన రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి పదిర భానుచందర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. భూ వివాదాల నేపథ్యంలో నాగోలుకు చెందిన భాను చందర్ను, మన్సూరాబాద్కు చెందిన సీపీఐ నాయకుడు కందుల సుధాకర్, చందు తదితరులు ఆ ఏడాది ఏప్రిల్ 16న కిడ్నాప్ చేశారు. యాదాద్రి జిల్లా తిరుమలగిరి వద్ద అతడిని హత్య చేసి మృతదేహాన్ని ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ సమీపంలో పడేశారు. ఈ కేసులో పోలీసులు చందుతోపాటు మిగిలిన నిందితులను అరెస్టు చేశారు. రంగంలోకి పది ప్రత్యేక బృందాలు హత్య విషయం తెలిసిన వెంటనే సౌత్ఈస్ట్ డీసీపీ ఎస్.చైతన్యకుమార్, అదనపు డీసీపీ కె.శ్రీకాంత్, టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు ఘటనాస్థలికి వచ్చారు. సీపీఐ నాయకులు అజీజ్పాషా, ఈటీ నర్సింహా, ఛాయాదేవి తదితరులు ఘటనాస్థలికి తరలివచ్చారు. చందు భార్య, కుమార్తె మృతదేహం వద్ద కన్నీరు మున్నీరయ్యారు. ఏడాదిన్నర నుంచి చందుకు ప్రాణహాని ఉందని రాజేష్ తదితరులే చంపారని ఆమె ఆరోపించారు. చందు మృతితో నాగర్కర్నూల్ జిల్లాలోని స్వగ్రామం నర్సాయిపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. చందు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. నిందితులను పట్టుకోవడానికి పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చైతన్య కుమార్ చెప్పారు. మలక్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో పాలుపంచుకున్నట్లు అనుమానిస్తున్న నలుగురిని పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెంటల్ ఏజెన్సీ నుంచి నిందితులు వాడిన కారును స్వా«దీనం చేసుకున్నారు.

చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
సాక్షి, యాదాద్రి : భర్త వేధింపులతో విసిగిపోయిన ఆమె.. తన సోదరుడు, ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసింది. కారుతో ఢీకొట్టి చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి.. చివరకు పోలీసులకు దొరికిపోయారు. మంగళవారం భువనగిరి డీసీపీ ఆకాంష్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(36)కి ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన పొట్టెపాక మహేశ్ సోదరి స్వాతితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. స్వామి భువనగిరిలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేసేవాడు. భార్య స్వాతి భువనగిరి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉద్యోగం చేసే క్రమంలో తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గుంటిపల్లి సాయికుమార్తో పరిచయం ఏర్పడింది. గొడవలు ఇలా.. స్వాతి సోదరుడు మహేశ్కు ఇద్దరు భార్యలు. తన బావ తన భార్యతోనే వి వాహేతర సంబంధం పె ట్టుకున్నాడని మహేశ్ స్వామిపై కోపం పెంచుకున్నాడు. ఈ విషయాన్ని స్వాతితో చెప్పగా, ఆమె భర్తను నిలదీసింది. దీంతో స్వాతిని స్వామి వేధించడం మెదలు పెట్టాడు. ఇదిలావుంటే.. గత సంవత్సరం ఫిబ్రవరిలో స్వాతి మోత్కూరుకు వెళ్లి సాయికుమార్ను కలిసి తన భర్త వేధింపులను సాయికుమార్కు వివరించింది. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. అక్క వివాహేతర సంబంధానికి మహేశ్ కూడా సహకరించాడు. తమను వేధిస్తున్న స్వామిపై ఎలాగైనా పగతీర్చుకోవాలని స్వాతి, మహేశ్ నిర్ణయించుకున్నారు. కారు అద్దెకు తీసుకుని.. ఈనెల 13న స్వామి భువనగిరికి పనిమీద వస్తున్న విషయాన్ని స్వాతి.. సాయికుమార్, మహేశ్లకు చెప్పింది. దీంతో వారు స్వామి కదలికలపై నిఘా పెట్టారు. స్వామిని హత్య చేసేందుకు సాయికుమార్, తన స్నేహితుడు చీమల రామలింగస్వామి సహాయంతో భువనగిరిలో కారును అద్దెకు తీసుకున్నారు. స్వామి భువనగిరిలో పని ముగించుకుని రాత్రి వేళ స్నేహితుడు వీరబాబుతో కలిసి బైక్పై బయలుదేరాడు. రాత్రి 11.15 గంటల సమయంలో సాయికుమార్ కాటేపల్లి శివారులో కారుతో వారి బైక్ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకుపోయాడు. ఘటనలో స్వామి అక్కడికక్కడే మృతిచెందగా వీరబాబుకు గాయాలయ్యాయి. అయితే కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకుపోయి ముందుకు కదలకుండా ఆగిపోయింది. స్వామి మృతి విషయం సాయికుమార్ ద్వారా తెలుసుకున్న మహేశ్ ద్విచక్ర వాహనం తీసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. సాయికుమార్, రామలింగస్వామిని బైక్పై ఎక్కించుకుని వచ్చి భువనగిరి రైల్వే స్టేషన్ వద్ద వదిలేశాడు. కారుతో.. కదిలిన డొంక రోడ్డు పక్కన ఆగిపోయిన కారును చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. కారు నంబర్ ఆధారంగా జరిపిన విచారణలో.. సాయికుమార్ సెల్ప్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నాడని తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని సెల్ఫోన్లో స్వాతి ఫోన్ నంబర్ కన్పించడంతో స్వాతిని విచారించగా మొత్తం విషయం వెలుగులోకి వచి్చంది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. మరో నిందితుడు చీమల రామలింగస్వామి పరారీలో ఉన్నాడు. వైద్యురాలిది ఆత్మహత్యే‘బుట్టబొమ్మ’ను వదల్లేనని భార్యతో చెప్పిన డాక్టర్ సృజన్క్షణికావేశానికిలోనై ఉరివేసుకున్న డాక్టర్ ప్రత్యూషసృజన్, బానోతు శ్రుతితో పాటు అత్తామామల అరెస్ట్ హసన్పర్తి: ‘ఇన్స్టా రీల్స్ అమ్మాయి బుట్టబొమ్మతో ప్రేమాయణం కొనసాగిస్తా ...ఏం చేసుకుంటావో చేసుకో’అన్న భర్త మాటలతో క్షణికావేశానికి లోనైన వైద్యురాలు ప్రత్యూష ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. ఆదివారం డాక్టర్ ప్రత్యూష అనుమానాస్పదంగా మృతి చెందినట్లు నమోదైన కేసులో విచారించిన పోలీసులు మంగళవారం ఆమె భర్త డాక్టర్ అల్లాడి సృజన్, అత్తమామలు పుణ్యవతి–మధుసూదన్తోపాటు ఇన్స్టా రీల్స్గర్ల్ బానోతు శ్రుతిలను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. హసన్పర్తి పోలీస్స్టేషన్లో కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి ఆవివరాలు వెల్లడించారు. మట్టెవాడకు చెందిన తంజాపూరి పద్మావతి కూతురు డాక్టర్ ప్రత్యూషకు (35), ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్కు చెందిన డాక్టర్ అల్లాడి సృజన్కు 2017లో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు హసన్çపర్తిలోని కాకతీయ వెంటెజ్లో ఓ విల్లా కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వీరితోపాటు సృజన్ తల్లిదండ్రులు పుణ్యవతి–మధుసూదన్లు కూడా ఇక్కడే ఉంటున్నారు. బానోతు శ్రుతితో కుటుంబంలో చిచ్చు.. ఏడాది క్రితం బుట్టబొమ్మ–17 ఇన్స్ర్ట్రాగాం ఐడీ పేరుతో రీల్స్ చేసే అమ్మాయి బానోతు శ్రుతితో డాక్టర్ సృజన్ దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తన భార్యకు విడాకులు ఇస్తానని బెదిరించాడు. మరో వైపు శ్రుతి కూడా ఫోన్ ద్వారా ప్రత్యూషను వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది. ఆది వారం కూడా ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. శ్రుతిని వదిలేది లేదని సృజన్ చెప్పడంతో ప్రత్యూష పైఅంతస్తుకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. కాగా గొడవ విషయంలో సృజన్ తల్లిదండ్రులు కూడా కొడుకుకే మద్దతు పలికారని ఏసీపీ పేర్కొన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.తరగతి గదిలో ఉరేసుకుని విద్యార్థి ని ఆత్మహత్య!సూర్యాపేట జిల్లా నడిగూడెం కేజీబీవీలో ఘటన నడిగూడెం: పదోతరగతి చదువుతున్న విద్యార్థిని తరగతి గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగింది. స్థానిక ఎస్ఐ గంధమళ్ల అజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ నిమ్మ వెంకటేశ్వర్లు, వసుంధర దంపతులకు కుమార్తె తనూషా మహాలక్ష్మి (14), ఇద్దరు కుమారులు సంతానం. తనూషా మహాలక్ష్మి నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి చదువుతోంది. ఈనెల 4వ తేదీన వ్యక్తిగత కారణాలతో బాలిక ఇంటికి వెళ్లింది. తిరిగి 6వ తేదీన పాఠశాలకు వచ్చింది. ఆదివారం తనూషాను చూసేందుకు ఆమె తల్లి పాఠశాల వద్దకు వచ్చి భోజనం పెట్టి వెళ్లింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తండ్రి వెంకటేశ్వర్లు కూడా కుమార్తెను చూసి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున తనూషా పాఠశాలలోని తన తరగతి గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం ఐదు గంటల సమయంలో తనూషా స్నేహితురాలు తమ తరగతి గదిలోకి వెళ్లగా.. అప్పటికే తనూషా ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది. రాత్రి విధుల్లో ఉన్న హిందీ ఉపాధ్యాయురాలు సునీత పాఠశాల ప్రత్యేకాధికారి వెంకటరమణకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనతో విద్యాలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, పాఠశాలను సూర్యాపేట జిల్లా విద్యాధికారి అశోక్, తహసీల్దార్ వి.సరిత, జీసీడీఓ తీగల పూలాన్, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

“నేను నిన్ను విడిచి ఉండలేను.. నేను నీ దగ్గరకు వస్తున్నాను’
ధర్మపురి సమీపంలో తన భర్త మరణ బాధను తట్టుకోలేక ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ధర్మపురి జిల్లాలోని కడ్తూర్ సమీపంలోని తలనాథం గ్రామానికి చెందిన తీతు కుమారుడు దీపమలై (26) ఇంజనీర్. పుట్టిరెట్టిపట్టికి చెందిన గీత (21) ల్యాబ్ టెక్నీషియన్. వీరిద్దరూ వేర్వేరు వర్గాలకు చెందినవారు. వారు పాఠశాల రోజుల నుంచి స్నేహితులు, చివరికి ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ వ్యవహారం వారి ఇద్దరి తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. వ్యతిరేకత కారణంగా, వారు ఒక సంవత్సరం క్రితం వారి ఇళ్ల నుంచి బయటకు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం తర్వాత కొన్ని నెలలుగా దీపమలై అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందినప్పటికీ అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. తాను చనిపోతానని భావించి, తన ప్రేమ భార్య నుంచి విడిపోయి, ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి జీవించమని చెప్పాడు. దీని కారణంగా గీత రెండు నెలల క్రితం తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఇంతలో ఆరోగ్యం క్షీణించిన దీపమలై గత 29వ తేదీన మరణించాడు. తన భర్త మరణం తర్వాత గీత మానసిక వేదనకు గురైంది. ఈ పరిస్థితిలో గీత ఇన్ స్ట్రాగామ్లో “నేను నిన్ను విడిచి ఉండలేను. నేను నీ దగ్గరకు వస్తున్నాను’ అంటూ ఓ పోస్ట్ చేసి, ఇంట్లోని ఎలుకల మందు తాగి మరణించింది. కడత్తూర్ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీని తరువాత, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు దీపమలై మృతదేహాన్ని ఖననం చేసిన ప్రదేశానికి సమీపంలోనే అతని గీత మృతదేహాన్ని కూడా ఖననం చేశారు.

నవవధువు చికెన్ తినలేదనే మనస్తాపంతో..
తమిళనాడు: వెల్లకోవిల్ సమీపంలో భార్య చికెన్ తినడానికి నిరాకరించిందని నవవరుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాలు.. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలూకాలోని సక్కోట్టై ప్రాంతానికి చెందిన మణికంఠన్ (29 ). ఇతను ఫర్నిచర్ దుకాణంలో పనిచేసేటప్పుడు, అతనితో కలిసి పనిచేసే సుబలక్ష్మి (25)తో ప్రేమలో పడ్డాడు. నెల రోజుల క్రితం తల్లిదండ్రులను ధిక్కరించి, వారిద్దరూ చెన్నైలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలు ఈ వివాహాన్ని వ్యతిరేకించడంతో, వారు తిరుప్పూర్ జిల్లా వెల్ల కోవిల్ పుత్తూరులోని సుబలక్ష్మి సోదరి మేనక ఇంట్లో నివసించారు. ఈ స్థితిలో, మేనక, ఆమె భర్త ఆలయ ప్రత్యేక కార్యక్రమానికి తిరుచ్చికి వెళ్లారు. ఆదివారం ఇంట్లో ఉన్న మణికంఠన్ దుకాణం నుంచి చికెన్ కొని తన భార్యను తినమని అడిగాడు. తన సోదరి గుడికి వెళ్లినందున ఇంట్లో చికెన్ తినడానికి ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. దీనితో ఆగ్రహించిన మణికంఠన్ తన ఇంటి బయట ఉన్న ఇనుప కడ్డీకి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అతన్ని రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు మణికంఠన్ మృతి చెందినట్లు ప్రకటించాడు.