Hyderabad Crime News
-
రూ. 500 అడిగినందుకు హత్య
రాజేంద్రనగర్: దౌర్జన్యంగా డబ్బులు లాక్కోవడమేగాక తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఓ వ్యక్తి దినసరి కూలీపై డ్రైనేజీ పై కప్పుతో దాడి చేసి హత్య చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మామిడి కిషోర్కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుద్వేల్ ప్రాంతానికి చెందిన సాయికుమార్(35) దినసరి కూలీగా పని చేసేవాడు. ఆదివారం అదే ప్రాంతంలో కూలీ పనులు పూర్తి చేసుకుని యజమాని వద్ద డబ్బులు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో అతను బుద్వేల్ కల్లు కంపౌండ్లో కల్లు తాగిన అనంతరం తన వద్ద ఉన్న డబ్బులను తీసి లెక్కిస్తున్నాడు. అదే సమయంలో కల్లు కంపౌండ్ నుంచి బయటికి వచ్చిన బుద్వేల్కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి సాయికుమార్ నుంచి రూ.500 బలవంతంగా లాక్కున్నాడు. దీంతో సాయికుమార్ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని శ్రీనివాస్ను కోరాడు. అయితే అతను డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతుండటంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో సాయికుమార్ శ్రీనివాస్ను తోసివేయడంతో కింద పడిన అతను పక్కనే ఉన్న డ్రైనేజీ పై కప్పు మూతను తీసి సాయికుమార్ తలపై మోదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కొన ఊపిరితో ఉన్న సాయికుమార్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నాగోలులో లిఫ్ట్ ప్రమాదం.. 8 మందికి తీవ్ర గాయాలు
హైదరాబాద్, సాక్షి: నాగోల్లోని ఓ ప్రముఖ హోటల్లో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. కిన్నెర గ్రాండ్ హోటల్లో నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్లో ఎంత మంది ఉన్నారన్నది తెలియరాలేదు. అయితే ఎనిమిది మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడ్డ వాళ్లను ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. బాధితులు హోటల్లో జరిగిన ఎంగేజ్మెంట్ పంక్షన్కి వచ్చినట్లు తెలుస్తోంది. -
ముగ్గురి ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్..
రాజేంద్రనగర్ (హైదరాబాద్): ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో దంపతుల మధ్య జరిగిన గొడవలే ఈ మరణాలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచి్చంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆనంద్ (38) ఇందిర (36) దంపతులు. వీరికి శ్రేయాన్స్ (4) ఒక్కడే కొడుకు. పాల వ్యాపారం చేసే ఆనంద్ మూడేళ్ల క్రితం నుంచి బండ్లగూడజాగీర్ సన్సిటీ ఏరియాలోని యమున అపార్ట్మెంట్స్లో ఉంటున్నాడు. ఆనంద్ ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ బెట్టింగ్ల కారణంగా దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేసి, ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. 15 రోజుల క్రితం ఇరు కుటుంబాలకు చెందిన వారితోపాటు స్నేహితులు వచ్చి ఆన్లైన్లో గేమ్స్ ఆడొద్దని, బుద్ధిగా ఉండి కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పారు. అయినా ఆనంద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మూడురోజుల క్రితం మరోసారి ఆనంద్ ఆన్లైన్ బెట్టింగ్ ఆడినట్టు సమాచారం. ఇదే విషయమై సోమవారం ఉదయం నుంచి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన సమయంలో ఇందిర తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఆనంద్ కూడా తన స్నేహితులతోపాటు బంధువులకు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సమాచారం అందించాడు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలతోపాటు బంధుమిత్రులు ఫోన్లు చేసినా, ఇద్దరూ లిఫ్ట్ చేయలేదు. దీంతో వారంతా కంగారుపడి అపార్ట్మెంట్ వచ్చి చూడగా, మృతదేహాలు కనిపించాయి. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్యను చంపి.. ఆపై ఆత్మహత్య ! ఘటనాస్థలిని పరిశీలించాక...దంపతులు మధ్య గొడవ జరిగి ఉండొచ్చని, ఆ క్రమంలోనే పెనుగులాటలో భార్య చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత కొడుకుకు క్రిమిసంహారక మందు తాగించి, ఆనంద్ కూడా అదే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. తండ్రీకొడుకు నోటి నుంచి నురగలు వస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. అయితే ఇందిర నోటి నుంచి ఎలాంటి నురుగులు రాలేదు. పోస్టుమార్టం నివేదిక తర్వాత అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఉదయం నుంచే దంపతులు గొడవ పడుతున్నట్టు వాచ్మెన్ పోలీసులు తెలిపాడు. -
Hyd: సీఐ ప్రాణాల్ని బలిగొన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్
హైదరాబాద్, సాక్షి: నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ నిండు ప్రాణం తీసింది. మరో వ్యక్తిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. ఎల్బీ నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ సీఐ మృతి చెందగా.. ఎస్సై ఒకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. కార్ యూటర్న్ చేస్తు రాంగ్ రూట్ లో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది. బైక్ పై ఉన్న ఒకరు మృతి చెందగా. మరొకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాధిక్ అలీగా గుర్తించారు. అలాగే.. గాయపడిన వ్యక్తిని నారాయణ గూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కాజా వల్లి మోహినుదిన్గా గుర్తించారు. వీళ్లిద్దరూ మలక్పేటలోని క్వార్టర్స్లో ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం ఎల్బీనగర్లో ఓ ఫంక్షన్ను వెళ్లి వస్తుండగా.. ఈ ఘోరం జరిగింది. కారుపై ‘డేంజర్’ ఛలాన్లు ఇదిలా ఉంటే.. ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కారు వినుషాశెట్టి అనే పేరుపై రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. అంతేకాదు.. కారుపై ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ ఛలాన్లు ఉండడం గమనార్హం. -
బోడుప్పల్లో ఘోరం.. స్టూడెంట్ దుర్మరణం
సాక్షి, క్రైమ్: బోడుప్పల్లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి వేగంగా కారు నడిపి ఒకరిని బలిగొన్నాడు. వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్ను ఢీ కొట్టింది. దీంతో ప్రమాదంలో బైక్పై ఉన్న యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. చనిపోయిన యువకుడి ఐడెంటిటీని.. బీటెక్ చదివే విశాల్గా గుర్తించారు పోలీసులు. విశాల్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్. పార్ట్ టైం జాబ్ కోసం ర్యాపిడో నడుపుతున్నట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
కన్నీటి ధార
నగరంలో రెండు ఉదంతాల్లో ఆరుగురి మృతి : సంతానాన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటూ.. వారే తమ లోకంగా బతుకుతున్న కన్నవారు కడుపుకోతకు ఒడిగట్టారు. చంటిపాపల కంటిరెప్పలను శాశ్వతంగా మూసేశారు. పేగు బంధాన్ని తుంచేసుకున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఆరుగురి ప్రాణాలను బలిగొన్నాయి. నగరంలో శుక్రవారం చోటుచేసున్న రెండు వేర్వేరు ఉదంతాల్లో నలుగురు చిన్నారులు సహా ఓ తల్లి, ఓ తండ్రి అసువులు బాయడం తీవ్ర విషాదాన్ని నింపింది. రహమత్ నగర్ పరిధి బోరబండలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి.. ఆ తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలు, భార్య చనిపోవడంతో ఇంటిపెద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కంటోన్మెంట్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లిలో ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి.. తాను విషం తాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు. ఒకేరోజు ఆరుగురు వ్యక్తులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. – రహమత్నగర్/కంటోన్మెంట్ ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కష్ట పడి చదివి ఉద్యోగం సాధించారు. పెద్దలు కుదిర్చిన మేనరికం పెళ్లి చేసుకుంది. సొంత మేనబావనే మనువాడింది. వారికి ఇద్దరు మగ పిల్లలు. మేనరికం కారణంగా ఒక బాబుకు బుద్ధిమాంద్యం, మరోబాబుకు అంగవైకల్యం ఏర్పడింది. తమ పిల్లల దీనస్థితి చూసి చలించిపోయేవారు. మేనరికం మూలంగా జరిగిన అనర్థం తలుచుకుంటూ దిగులు చెందేవారు. ఈ క్రమంలోనే ఇటీవల ఇంట్లో గొడవ జరగడం ఆమెను మరింత కలచి వేసింది. తాను మరణిస్తే.. తమ పిల్లలు దిక్కులేని వారవుతారని భావించి.. పిల్లలను ముందు చంపి.. ఆ తర్వాత తానూ తనువు చాలించిన విషాద ఘటన రహమత్ నగర్ పరిధిలోని బోరబండ డివిజన్ రాజ్నగర్లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.నాగర్కర్నూల్ జిల్లా పెద్దూరుకు చెందిన జ్యోతికి ఆరున్నరేళ్ల క్రితం నగరంలోని బోరబండ డివిజన్ రాజ్నగర్కు చెందిన ఆమె మేనబావ విజయ్ (కాంట్రాక్టర్)తో వివాహమైంది. కాగా.. జ్యోతి (34) బంజారాహిల్స్ ఎంబీటీనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు అర్జున్ (4), ఆదిత్య (2) ఉన్నారు. మేనరికపు వివాహం..పిల్లలకు బుద్ధిమాంద్యం.. మేనరికపు పెళ్లి కారణంగా పెద్దబ్బాయికి బుద్ధిమాంద్యం, చిన్న అబ్బాయికి అంగవైకల్యం ఏర్పడింది. వీరికి చికిత్స సైతం అందిస్తున్నారు. మేనరికం మూలంగా తమ పిల్లలు ఇలా అనారోగ్యం బారిన పడటం జ్యోతిని మానసిక క్షోభకు గురిచేసేది. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం జ్యోతితో ఆమె మామ గొడవకు దిగాడు. ఈ ఘటన ఆమెను మరింత కలచి వేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అప్పటికే ఇంట్లో ఉంచిన విషాన్ని పిల్లలకు పాలల్లో తాగించి.. తాను కిటికీకి ఉరి వేసుకుంది. అప్పటికే జ్యోతి మృతి చెందగా, ఇరుపొరుగు వారు పిల్లలను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. భార్య, ఇద్దరు కుమారులు చనిపోవడంతో జ్యోతి భర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఒకే కుటుంబంలో ముగ్గురు బలవర్మణం చెందడంతో బస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ కామల్ల రవికుమార్ పేర్కొన్నారు. స్రవంతి, శ్రావ్య మృతదేహాలు కంటోన్మెంట్ పరిధి ఓల్డ్ బోయిన్పల్లి భవాని నగర్లో ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంతాచారి అనే వ్యక్తికి భార్య అక్షయ, ఇద్దరు కుమార్తెలు స్రవంతి (8), శ్రావ్య (7) ఉన్నారు. సికింద్రాబాద్లో సిల్వర్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి భోజనాలు చేసిన తర్వాత శ్రీకాంతా చారి, భార్య కూతుళ్లతో మేడపై ఉన్న గదిలో నిద్రపోయారు. వేకువ జామున 4 గంటల సమయంలో శ్రీకాంతా చారి తన భార్య అక్షయకు సైతం నిద్రమాత్రలు కలిపిన నీళ్లు తాగించేందుకు యత్నించాడు. విషపు నీళ్లను తాగేందుకు ఆమె నిరాకరించింది. కానీ.. అప్పటికే ఆమె నోట్లోకి ఆ నీళ్లు చేరిన కారణంగా స్పృహ కోల్పోయింది. ఉదయం 5 గంటల సమయానికి ఆమెకు మెలకువ వచ్చి చూడగా భర్త, చిన్న కూతురు బెడ్పై, చిన్న కూతురు బాత్రూమ్లో విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే కింది పోర్షన్లో ఉండే అత్త, ఆడపడుచులను నిద్ర లేపి విషయం తెలిపింది. వారంతా పైకి వెళ్లి చూసే సరికే ముగ్గురూ పడిపోయి ఉన్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలికి వెళ్లి పంచనామా నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమా? సిల్వర్ వర్క్ చేస్తూ జీవనం సాగించే శ్రీకాంతా చారికి ఇటీవల బిజినెస్ సరిగా నడవడం లేదని తెలుస్తోంది. ఇదే విషయమై తరచూ బాధపడుతూ ఉండేవాడని మృతుడి భార్య, తల్లి జయమ్మ తెలిపారు. భార్యాభర్తల మధ్య కూడా ఎలాంటి వివాదాలు లేవని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు కూతుళ్లు, తండ్రి మృతదేహాలను చూసిన స్థానికులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. -
నాంపల్లి కోర్టు బిల్డింగ్పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టు భవనంపై నుంచి దూకి మహ్మద్ సలీముద్దీన్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశా. మెహదీపట్నం ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన డుసలీముద్దీన్ గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడు. నేడు(బుధవారం) కోర్టులో పేషీ ఉండటంతో నాంపల్లి కోర్టులో హాజరయ్యాడు. ఈ క్రమంలో కోర్టు భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన సలీముద్దీన్ను ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు పోలీసులు. ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ఆడుకుంటూ.. అనంత లోకాలకు.. తీవ్ర విషాదం!
హైదరాబాద్: భవనంపై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు 3వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకార.. ఖమ్మం జిల్లాకు చెందిన మూర్తమ్మ కొన్ని సంవత్సరాలుగా సూరారం రాజీవ్ గృహకల్ప 29/27వ బ్లాక్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమెకు ఒక్కగానొక్క కుమారుడు తులసీనాథ్ (13) ఉన్నాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలకు సెలవు కావడంతో తులసీనాథ్ రాజీవ్ గృహకల్ప 27వ బ్లాక్లోని భవనంపైన ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ తగాదాలతో బాలుడి తండ్రి కనకరత్నం కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. తల్లి మూర్తమ్మ టైలరింగ్ చేస్తూ కుమారుడిని పోషిస్తోంది. -
HYD: మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ డ్రగ్స్ మాఫియా కదలికలు పెరిగిపోతుండడం కలకలం రేపుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ని పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా దగ్గర డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. మొత్తం 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు. స్థానికంగా జిమ్ నిర్వహించే ట్రైనర్ నితీష్, రాహుల్తో పాటు సోహెల్ అనే ముగ్గురిని ఈ వ్యవహారానికి సంబంధించి అరెస్ట్ చేశారు అధికారులు. జిమ్ ట్రైనరే ఈ డ్రగ్స్ని అమ్ముతున్నాడని తెలుసుకున్న అధికారులు.. ఆ ఇంజెక్షన్స్ని ఎక్కడి నుంచి తెస్తున్నారు? దీని వెనక ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరు? అనే అంశాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదీ చదవండి: నగరంలో ‘బ్లాక్మెయిల్’ విలేకరుల అరెస్ట్ -
విషాదం.. మస్కిటో లిక్విడ్ తాగి ఏడాదిన్నర బాలుడు మృతి
సాక్షి, హైదరాబాద్: చందానగర్ లో విషాదం చోటుచేసుకుంది. మస్కిట్ లిక్విడ్ తాడి ఏడాదిన్నర బాలుడు మృత్యువాతపడ్డాడు. వివరాలు.. తారానగర్లో నివాసముంటున్న జుబేర్ దంపతులకు ఏడాదిన్నర వయసున్న కొడుకు జాకీర్ ఉన్నాడు. శనివారం బాలుడు ఇంట్లో ఆడుకుంటూ.. పొరపాటున అలౌట్ లిక్విడ్ తాగేశాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన తల్లిదండ్రులు బాలుడి బట్టలపై అలౌట్ లిక్విడ్ వాసన రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. -
HYD: పైసల్లేవ్.. మెట్రో స్టేషన్ నుంచి దూకేసింది!
సాక్షి, హైదరాబాద్: సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ పెద్దావిడ మంగళవారం రాత్రి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అది గమించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలిని మారెమ్మ(70)గా గుర్తించారు. ఆమె స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా మక్తల్ గ్రామంగా తేలింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే మారెమ్మ చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మార్కులు తక్కువొచ్చాయని తల్లి మందలింపు.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మార్కులు తక్కువగా వచ్చాయని తల్లి మందలించడంతో ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు..వెస్ట్బెంగాల్కు చెందిన అసిత్ కుమార్ డెరియ భార్య, పిల్లలతో కలిసి సనత్నగర్లోని రాజరాజేశ్వరీనగర్లో నివాసం ఉంటున్నారు. మాదాపూర్లో డెక్కన్ సెరాయి హోటల్లో పనిచేసే కుమార్ ఎప్పటిలాగే పనికి వెళ్లాడు. బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న కూతురు బోనాశ్రీ డెరియ (19) గురువారం ఉదయం కేఎల్ఎన్వై పార్కులో వాకింగ్కు వెళ్లి తిరిగి 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చింది. మార్కులు తక్కువగా ఎందుకు వచ్చాయని తల్లి మందలించి ఆమె కూడా వాకింగ్కు వెళ్లి పోయింది. తిరిగి తల్లి ఇంటికి రాగా లోపలి నుండి గడియ పెట్టి ఉంది. తలుపులు ఎంత సేపు తట్టినా లోపల నుండి సమాధానం రాకపోవడంతో తలుపులు తెరిచి చూడగా బోనాశ్రీ సీలింగ్ వ్యాన్కు చీరతో ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దింపి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: బయటపడ్డ వాస్తవాలు.. పేరుకే ప్రిన్సిపాల్.. పెత్తనమంతా డ్రైవర్దే -
క్షుద్ర పూజల కలకలం.. కూకట్పల్లిలో సగం కాలిపోయిన స్థితిలో మృతదేహం
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్బీకాలనీ: శ్మశాన వాటికలో సగం కాలిన స్థితిలో కనిపించిన మృతదేహం స్థానికంగా సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి ఒంటిపై డీజిల్ పోసి దహనం చేసి ఉంటారని భావిస్తున్న ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. ఆనవాళ్లు గుర్తించలేని విధంగా దగ్ధమైన మృతదేహం ఎవరిదనే సీఐ కిషన్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం హైదర్నగర్లోని అలీతలాబ్ పక్కన ఉన్న హిందూ శ్మశాన వాటికలో సగం కాలిన మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి 20 మీటర్ల దూరంలో చెప్పులు, ఓ బ్యాగ్, అందులో రగ్గు(బెడ్ షీట్) స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా బ్యాటరీ, సిమ్ కార్డు లేని ఓ సెల్ ఫోన్ను కూడా గుర్తించారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చునని అతడిని హత్య చేసి దహనం చేసి ఉండవచ్చునని అనుమాన్యం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో అదృశ్యమైన వ్యక్తుల వివరాలను ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సైబరాబాద్ క్లూస్ టీంతో పాటు పోలీస్ ప్రత్యేక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అన్నీ అనుమానాలే... శ్మశాన వాటికలో మృతదేహం లభించిన తీరు మొదలు అక్కడి ఆనవాళ్లు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహానికి కొద్ది దూరంలో బియ్యం పిండి వంటివి కనిపించడంతో క్షుద్ర పూజలు చేసి ఉండవచ్చునని అనుమానాలు వస్తున్నా పోలీసులు నిర్ధారించడం లేదు. మృతదేహాన్ని శనివారం దహనం చేసి ఉంటారని స్థానికులు పేర్కొంటుండగా పోలీసులు మాత్రం ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత దహనం చేసి ఉండవచ్చునని పేర్కొంటున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని సీఐ పేర్కొన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే కేపీహెచ్బీ పోలీస్స్టేషన్లో సంప్రదించాలని కోరారు. -
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఐతే.. ఎమ్మెల్యే కొడుకును మాత్రం జువైనల్గా పరిగణించాలని పేర్కొంది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లుగా పేర్కొంటూ కేసు నమోదు కాగా.. జువైనల్ కోర్టు తీర్పు కీలకంగా మారనుంది. ఇదీ కేసు.. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్లో మే 28 ఓ బాలికను ట్రాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు నిందితులు. అందులో ఒకరు మేజరు కాగా.. ఐదుగురు మైనర్లుగా పోలీసులు తేల్చారు. బాలికను రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో గ్యాంగ్ రేప్ చేసి.. ఆ తర్వాత సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర వదిలిపెట్టారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ప్లాన్ ప్రకారమే జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ ఘటన.. మైనర్లు ఉన్నందున పేర్లు కుదరదన్న సీపీ -
అమ్నీషియా పబ్ కేసులో నలుగురికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ సామూహిక అత్యాచార కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సుమారు 48 రోజుల తర్వాత.. అమ్నీషియా పబ్ కేసులో నలుగురు మైనర్లకు బెయిల్ మంజూరు చేసింది జువైనల్ జస్టిస్ బోర్డు. జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు మైనర్లకు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది జువైనల్ జస్టిస్ బోర్డు. ఇదిలా ఉంటే.. మైనర్ల బెయిల్ పిటిషన్లను రెండుసార్లు తిరస్కరించింది జువైనల్ బోర్డు. అయితే.. ఈసారి మాత్రం షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఒక్కో మైనర్ను రూ. 5 వేల పూచీకత్తుపై బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు కేసులో విచారణకు సహకరించాలని, హైదరాబాద్ డీపీవో ముందు ప్రతి నెల హాజరు కావాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశించింది. ఎమ్మెల్యే కొడుకు ఇంకా.. అయితే ఈ కేసులో A1గా ఉన్న సాదుద్ధీన్ మాలిక్కు మాత్రం బెయిల్ విషయంలో నిరాశే ఎదురైంది. ఇక ఈ కేసులో మరో మైనర్ అయిన ఎమ్మెల్యే కొడుక్కి ఇంకా బెయిల్ దొరకలేదు. మొదట జువెనైల్ బోర్డు బెయిల్కు నిరాకరించడంతో.. హైకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నాడు. అయితే.. అది ఇంకా పెండింగ్లో ఉండడంతో.. ఇంకా జువైనల్ హోంలోనే ఉండాల్సి వచ్చింది. -
Hyderabad: పెళ్లి రోజే విషాదం.. భర్త, కొడుకుతో బైక్పై వెళ్తుండగా
సాక్షి, హైదరాబాద్: పెళ్లి రోజు భార్యభర్తలు తమ రెండేళ్ల కుమారుడితో నగరానికి వచ్చి సంతోషంగా గడిపి ద్విచక్ర వాహనంపై తిరిగి వె ళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన మేరకు.. ఆర్సీపురం మండలం వెలిమెల గ్రామానికి చెందిన మందమోళ్ల ప్రభాకర్ (28), ప్రసన్న (25) దంపతులకు రెండేళ్ల కుమారుడు జశ్విత్ ఉన్నాడు. గురువారం పెళ్లి రోజు కావడంతో ద్విచక్ర వాహనంపై ముగ్గురూ ఫోరంమాల్కు వచ్చి సంతోషంగా గడిపారు. సాయంత్రం గ్రామానికి తిరిగి వెళ్తుండగా చందానగర్లోని కేప్రీ హోటల్ వద్ద కంటోన్మెంట్ డిపోకు చెందిన బస్సు ద్విచక్ర వాహనాన్ని వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్నపై బస్సు వెళ్లింది. ప్రభాకర్ కుడి చెయ్యిపై వెళ్లడంతో తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందగా ప్రభాకర్, జశ్విత్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రభాకర్ ఓ ప్రైవేటు పాఠశాలలో గార్డెనింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. చదవండి: Hyderabad: హైదరాబాద్లో మరో దారుణం -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: ఆరుగురిలో ఐదుగురు మైనర్లే!
-
జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ ఘటన.. కీలక వివరాలు వెల్లడించిన సీపీ
సాక్షి, హైదరాబాద్: సంచలన సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన నగర కమిషనర్.. ఈ కేసులో నిందితులు మైనర్లు కాబట్టి పేర్లు, ఇతర వివరాలు వెల్లడించడం కుదరని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ కేసును లోతుగా దర్యాప్తు చేశాం. ఆరుగురిలో ఒకరు మేజర్, ఐదుగురు మైనర్లు. కేసులో మైనర్లు ఉన్నందున పేర్లు చెప్పడం లేదు. మార్చి 28న ఈ వ్యవహారం మొదలైంది. బెంగళూరులో ఉండే ఒక స్టూడెంట్.. స్కూల్ మొదలుకాక ముందు పార్టీ చేసుకోవాలని హైదరాబాద్లో స్నేహితులతో ప్లాన్ చేశాడు. అందుకోసం అమ్నీషియా పబ్ను ఎంచుకుని.. ఏప్రిల్లో పార్టీ గురించి పోస్ట్ చేశాడు. నాన్ ఆల్కాహాలిక్, స్మోకింగ్ పార్టీ కోసం అప్లై చేసుకున్నారు. ఉస్మాన్ అలీఖాన్ అనే వ్యక్తి ద్వారా పబ్ను బుక్ చేయించారు. మే 28వ తేదీన పార్టీ గురించి సదరు స్టూడెంట్ మళ్లీ పోస్ట్ చేశాడు. మే 28వ తేదీన మధ్యాహ్నాం బాధితురాలు పబ్కు వెళ్లింది. నిందితులు.. పబ్లో ముందుగానే పథకం వేసుకున్నారు. ఆమె ఫాలో చేసి ట్రాప్ చేశారు. అదే రోజు సాయంత్రం రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో సామూహిక అత్యాచారం జరిగింది. ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర బాధితురాలిని వదిలిపెట్టారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు నమోదు చేశారు. భరోసా సెంటర్లో కౌన్సెలింగ్ తర్వాత బాధితురాలు వివరాలు చెప్పింది. ఆ తర్వాత మరికొన్ని సెక్షన్లు నమోదు చేశాం. పబ్, బేకరి వద్ద అన్ని సీసీ ఫుటేజీలను పరిశీలించాం. ఏ1 సాదుద్దీన్తో పాటు మైనర్ నిందితులు, బాధితురాలు వాహనంలో వెళ్లారు. మైనర్తో పాటు సాదుద్దీన్ బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నిందితులను బాధితురాలు గుర్తించలేకపోయింది. ఆధారాలతో సహా జూన్ 2వ తేదీన నిందితులను గుర్తించాం. జూన్ 3న సాదుద్దీన్ను అరెస్ట్ చేశాం. ఏ1 సాదుద్దీన్తో పాటు మిగతా వాళ్లపై కేసు నమోదు అయ్యింది. సాదుద్దీన్తో పాటు నలుగురిని అరెస్ట్చేశాం. మరొకరి కోసం స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశాం. దర్యాప్తు చాలా పారదర్శకంగానే జరిగిందని.. పలు కోణాల్లో దర్యాప్తు చేయడం వల్లే ఆలస్యమైందని చెప్పారు. ఇలాంటి కేసుల్లో శిక్షలూ కఠినంగానే ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. పబ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. -
సచిన్.. నాకు బతకాలని లేదు: కృతి సంభ్యాల్
సాక్షి, హైదరాబాద్: మంచి కంపెనీలో మంచి ఉద్యోగం. అయినవాళ్లను విడిచిపెట్టి.. ఊరు కానీ ఊరులో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. ఏం కష్టం వచ్చిందో ఏమో.. ఉరి వేసుకుని ప్రాణం తీసుకుంది!. గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిణి కృతి సంభ్యాల్ సూసైడ్ స్థానికంగా విషాదం నింపింది. గచ్చిబౌలిలో ఉంటూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది కృతి సంభ్యాల్. ఆమె స్వస్థలం జమ్ముకశ్మీర్. ఇద్దరిలో కలిసి ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉంటోంది కృతి. ఈ క్రమంలో రూమ్ మేట్స్ లేని టైం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు తన స్నేహితుడు సచిన్ కుమార్కు ‘నాకు బతకాలని లేదు’ ఓ మెసేజ్ పంపింది. అది చూసి అప్రమత్తమయ్యాడు సచిన్. సచిన్ హుటాహుటిన ప్లాట్కు వచ్చాడు. కానీ, అప్పటికే ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. స్థానికుల సాయంతో కృతిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. కృతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న చేపట్టారు గచ్చిబౌలి పోలీసులు. -
భర్తతో విడాకులు.. 40 ఏళ్ల వ్యక్తిని నమ్మి పంజాబ్కు వెళితే...
సాక్షి, హిమాయత్నగర్: కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచి వివాహితను వేధిస్తున్న ఓ వ్యక్తిపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు ఖైరతాబాద్కు చెందిన దంపతులు గొడవల కారణంగా కోర్టు అనుమతితో వేర్వేరుగా ఉంటున్నారు. ఒంటరిగా ఉంటున్న వివాహితకు సోషల్ మీడియా వేదికగా పంజాబ్లోని లుథియానాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నెలకు రూ. 2 లక్షల సంపాదన అని, బాగా చూసుకుంటానంటూ వివాహితను నమ్మించాడు. దీంతో వివాహిత అనుమతితో నగరానికి వచ్చిన అతగాడితో ఇద్దరూ కలసి కొంతకాలం సాన్నిహిత్యంగా తిరిగారు. ఫొటోలు, వీడియోలు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో తనకు కొన్ని అవసరాలు ఉన్నాయంటూ వివాహిత నుంచి రూ. 80 వేలు డబ్బు కూడా తీసుకున్నాడు. ఇతడిని వివాహం చేసుకోవాలనే ఆలోచనతో వివాహిత లూధియానాలోని ఇంటికి వెళ్లింది. వ్యక్తి తండ్రి బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి, తండ్రికి వస్తున్న పింఛన్తోనే కుటుంబ పోషణ నడుస్తుంది. ఒకరిని హత్య చేసి పదేళ్లు జైలులో ఉండి ఇటీవలే విడుదలై వచ్చాడని, మా వాడికి నువ్వంటే ఇష్టమని, నువ్వు పోషించుకునేట్టు అయితే ఇద్దరూ పెళ్లి చేసుకోమనే సమాధానం తల్లిదండ్రులను నుంచి వచ్చింది. దీంతో షాక్కు గురైన మహిళ అతగాడిని దూరం పెట్టింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అతగాడు ఇద్దరూ కలసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. బాధితురాలు బుధవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. -
శిల్పా చౌదరి అరెస్ట్, రిమాండ్లో కీలక విషయాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: అధిక వడ్డి ఇప్పిస్తానంటూ ముగ్గురు టాలీవుడ్ హీరోలతో పాటు నగరానికి చెందిన ప్రముఖులను మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి వ్యవహం సంచలన రేపుతోంది. ఓ మహిళ చేతిలో అంత ఈజీగా మోసపోయింది ఓ హీరోలు, సెలబ్రెటీలు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దివ్య రెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసుల శిల్ప ఆమె భర్తను శనివారం ఉదయం అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు. చదవండి: ముగ్గురు టాలీవుడ్ హీరోలకు రూ. 200 కోట్లు కుచ్చు టోపి! తాజాగా వారి రిమాండ్ రిపోర్డును విడుదల చేసిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ‘రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో శిల్ప పెద్ద మొత్తంలో డబ్బులు గుంజినట్లు సమాచారం. సైబరాబాద్ పరిధిలో అధునాతన హంగులతో శిల్ప దంపతులు రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ పేరుతో దివ్య రెడ్డి నుంచి కోటిన్నర పైగా శిల్పా వసూలు చేసింది. డబ్బులు ఇవ్వకుండా, స్థలాన్ని చూపెట్టకుండా ఇబ్బందులకు గురి చేసింది. చదవండి: బిగ్బాస్ హోస్ట్గా రమ్యకృష్ణ.. వీకెండ్ ఎపిసోడ్స్కి భారీ ప్లాన్! దీంతో డబ్బు తిరికి ఇవ్వాలని ఇంటికి వెళ్లిన దివ్యరెడ్డిని తన బౌన్సర్ల బెదిరిస్తూ ఇంటి నుంచి తరిమేసింది. ఎలాగైన తన డబ్బు ఇవ్వాలని గట్టిగా అడిగినందుకు ప్రముఖుల పేర్లు చెప్పి దివ్య రెడ్డిని బెదిరించింది. డబ్బులు ఇవ్వకుండా ఫోన్లో చాలా సార్లు చంపేస్తానంటూ శిల్ప బెదిరింపులకు పాల్పడింది. దీంతో శిల్ప నుంచి ప్రాణభయం ఉందంటూ దివ్యరెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది’ అని పోలీసులు పేర్కొన్నారు. అలాగే శిల్ప బాధితుల్లో దివ్య రెడ్డి మాత్రమే కాకుండా టాలీవుడ్ ముగ్గురు హీరోలు, నగరానికి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. -
చిన్నారి అత్యాచారం కేసు: తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
హైదరాబాద్: తెలంగాణలో కలకలం రేపిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దీని కోసం పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నాకాబందీని నిర్వహిస్తున్నారు. కాగా, దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ ఉద్యోగులను అలర్ట్ చేశారు. ఇప్పటికే బస్టాండ్, బస్సుల్లో నిందితుడి ఆనవాళ్లు ఉన్న పోస్టర్లను అతికించారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం హైదరాబాద్ను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే నిందితుడిపై పోలీసు శాఖ రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసు: పోలీసుల కీలక నిర్ణయం -
సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసు: పోలీసుల కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి అత్యాచారం కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డు అందిస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపను రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడి కోసం రాష్ట్ర పోలీసు యంత్రాంగం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో నిందితుడి ఆనవాళ్లను సైతం పోలీసులు విడుదల చేశారు. చదవండి: సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంచు మనోజ్ నిందితుడి ఎత్తు సుమారు 5.9 అడుగులు ఉంటుందని, పెద్ద జుట్టుకు రబ్బర్ బ్యాండ్ వేసుకొని తిరుగుతాడని తెలిపారు. నిందితుడి వయసు సుమారు 30 ఏళ్లు ఉంటుందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే అతని రెండు చేతులపై మౌనిక అనే టాటూ కూడా ఉంటుందని తెలిపారు. రాజు ఆచూకీ తెలిస్తే 9490616366, 9490616627 నెంబర్లకు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడు ఇంకా లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆరురోజులైన నిందితుడి ఆచూకీ దొరకకపోవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని ఎన్కౌంటర్ చేయాలని అనేకమంది డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఆరేళ్ల గిరిజన బాలికపై హత్యాచారం: పెల్లుబికిన ప్రజాగ్రహం.. -
కాపురంలో ఫోన్కాల్ చిచ్చు: వయసైన కూతుళ్లతో తల్లి అదృశ్యం
బహదూర్పురా (హైదరాబాద్): ముగ్గురు పిల్లలతో కలిసి బయటికి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన హైదరాబాద్లోని కామాటిపురా పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం... కామాటిపురా మురళీ గుమ్మాస్ ప్రాంతానికి చెందిన కిషన్ శర్మ, పూజ ఆలియాస్ రాగిణి (34) దంపతులు. వీరికి 16 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. మూడేళ్ల కిందట మలక్పేట్లో నివసించే సమయంలో ఇంటికి ఎదురుగా ఉన్న పవన్ (30)తో పూజ తరచుగా మాట్లాడేది. ఈ విషయమై భర్త కిషన్ శర్మ పవన్ను మందలించి, 8 నెలల కిందట కామాటిపురాలోని మురళీ గుమ్మాస్కు మకాం మార్చారు. అయితే పవన్ కూడా ఇటీవల తన నివాసాన్ని మురళీ గుమ్మాస్కు మార్చాడు. తరచు ఫోన్లో మాట్లాడుతుండడంతో పూజతో కిషన్ శర్మ గొడవ పడగా.. ఈ నెల 16వ తేదీన పూజ తన ముగ్గురు కూతుళ్లు కీర్తి, మోహిని ఆలియాస్ మీనా (14), గోపి (12)తో తిరుపతి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. ఇప్పటవరకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కిషన్ శర్మ కామాటిపురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు సెల్ నం. 9490616495లో సంప్రదించాలన్నారు. -
KPHB Colony: డేటింగ్ యాప్లో ప్రొఫైల్.. పెళ్లైన విషయం దాచి
సాక్షి, కేపీహెచ్బీకాలనీ: పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు యత్నించిన వైద్యుడిని కేపీహెచ్బీ పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజాంపేట రోడ్డులోని నాగార్జున హోమ్స్లో నివాసముండే ఓ యువతి గతేడాది బంబుల్ డేటింగ్ యాప్లో తన ప్రొఫైల్ ఫొటో అప్లోడ్ చేసింది. ఏఐజీ హాస్పిటల్లో న్యూరో సర్జన్గా విధులు నిర్వర్తిస్తున్న బంజారాహిల్స్ సుజాత స్టెర్లింగ్ హోమ్స్లో నివాసముండే డాక్టర్ అభిరామ్ చంద్ర గబ్బిత (32), ఆమె ఫొటోను చూసి మాటలు కలిపాడు. ఇలా ఒకరికొకరు పరిచయమై పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అభిరామ్ చంద్రకు గతంలోనే పెళ్లి జరిగిందని తెలుసుకున్న బాధితురాలు తనను మోసం చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులను ఆశ్రయించగా బుధవారం అభిరామ్ చంద్రను రిమాండ్కు తరలించారు. -
వీడు మహా కేటుగాడు.. ప్రియురాలితో సహా అజ్ఞాతంలోకి..
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో పని చేస్తూ ఆయన సిమ్కార్డు కాజేసి, బ్యాంకు ఖాతా నుంచి రూ.13 లక్షలు కాజేసిన కేటుగాడు ప్రస్తుతం నేపాల్లో ఉన్నట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. బోగస్ ఆధార్ కార్డుతో పనిలో చేరిన ఇతగాడు సదరు మాజీ అధికారి అనుమతి లేకుండా ఆయన ఇంటి చిరుమానాతో ఇంకో ఆధార్ కార్డు దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది. గతంలో మరో ప్రముఖుడి ఇంట్లోనూ ఇతడు పని చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఈ మాయగాడి వలలో పడి మోసపోయిన వారి సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ మోసగాడి అసలు పేరు ఏమిటనేది ఎవరికీ తెలియట్లేదు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా డోన్ నుంచి పొందినట్లు ఉన్న ఆధార్ కార్డును వినియోగించి ఇతగాడు ఓ కన్సల్టెన్సీ ద్వారా నగరంలో ఉద్యోగాల్లో చేరాడు. అందులో ఇతడి పేరు సురేందర్రావుగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. సురేందర్రావుకు ఉద్యోగం ఇప్పించిన కన్సల్టెన్సీలోనూ పోలీసులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే అతడు మాజీ ఐఏఎస్ ఇంట్లో సహాయకుడిగా ఉద్యోగంలో చేరడానికి ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడి వద్ద దాదాపు రెండు నెలల పాటు పని చేసినట్లు వెలుగులోకి వచ్చింది. మాజీ ఐఏఎస్ వద్ద పని చేస్తున్నప్పుడే ఆయన కొంత కాలంగా వినియోగించని సిమ్కార్డు తస్కరించిన అతగాడు తన ఫోన్లో వేసుకున్నాడు. దాని ఆధారంగా కొన్ని యూపీఐ యాప్స్ను డౌన్లోడ్ చేసుకుని యాక్టివేట్ చేసుకున్నాడు. వీటి ఆధారంగా దఫదఫాలుగా మొత్తం రూ. 13 లక్షలు కాజేశాడు. దాదాపు ఆరు నెలల పాటు ఈ మాజీ అధికారి వద్ద పని చేసిన సురేందర్రావు ఆయన ఇంటి చిరునామాతో, తన పేరిట కొత్తగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నాడు. డబ్బు కాజేసిన తర్వాత తన తల్లిదండ్రులకు కరోనా వచ్చిందంటూ చెప్పి పని మానేశాడు. అతగాడు పరారైన తర్వాతే డబ్బు పోయిన విషయం యజమాని గుర్తించారు. సురేందర్రావుగా చెప్పుకొన్న అతడు తెలుగు, హిందీ మాట్లాడే వాడని బాధిత కుటుంబం చెబుతోంది. అతడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆధార్ కార్డు ఇటీవలే పోస్టులో మాజీ అధికారి ఇంటికి వచ్చింది. ఈ విషయాన్ని వాళ్లు సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. సురేందర్ రావు కాల్ లిస్ట్ను పరిశీలించిన పోలీసులు తరచుగా బిహార్కు చెందిన తన ప్రియురాలితో మాట్లాడినట్లు గుర్తించారు. కర్నూలు, హైదరాబాద్ల్లో ఉన్న వారితో చాలా తక్కువగా సంభాషించినట్లు తేల్చారు. అతడు కన్సల్టెన్సీలో ఇచ్చిన ఆధార్ కార్డులోని చిరునామా బోగస్దిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ నేరగాడితో పాటు బిహార్కు చెందిన అతడి ప్రియురాలు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సాంకేతిక ఆధారాలను బట్టి వాళ్లు ప్రస్తుతం నేపాల్లో ఉన్నట్లు పోలీసుల భావిస్తున్నారు. ఇతగాడు గతంలో చేసిన నేరాలపై కూడా దృష్టి పెట్టిన అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. -
ఏసీబీకి అడ్డంగా దొరికిన మియాపూర్ ఎస్సై
సాక్షి, మియాపూర్: స్టేషన్ బెయిల్ మంజూరు చేయిస్తానని, మరో వ్యక్తి పేరును కేసులో లేకుండా చూస్తానని రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు మియాపూర్ సెక్టార్– 2 ఎస్ఐ యాదగిరి. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీసీపీ సూర్యనారాయణ చెప్పిన వివరాల ప్రకారం.. మియాపూర్నకు చెందిన షేక్ సలీమ్ పుమా కంపెనీకి చెందిన బ్రాండెడ్ దుస్తులను విక్రయిస్తుంటాడు. వీటితో పాటు ఈ కంపెనీ పేరు వాడుకొని నకిలీ దుస్తులు కూడా అమ్ముతున్నట్లు మియాపూర్ పీఎస్లో వారం రోజుల క్రితం సదరు కంపెనీ యజమానులు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై మియాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో షేక్ సలీమ్తో పాటు అతని దుకాణంలో పనిచేస్తున్న మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి షేక్ సలీమ్కు స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో పాటు అతని షాపులో పనిచేసే ఉద్యోగి పేరు కేసులోంచి తొలగించేందుకు మియాపూర్ సెక్టార్– 2 ఎస్ఐ యాదగిరి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఇందులో రూ.30 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ నెల 3న ఎస్ఐ యాదగిరి రూ.10 వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.20 వేలు మంగళవారం పోలీస్ స్టేషన్లో షేక్ సలీమ్ తీసుకుంటుండగా ఏసీబీ డీసీపీ సూర్యనారాయణ బృందం పట్టుకున్నారు. ఎస్ఐని అదుపులోకి తీసుకొని రూ.20 వేల నగదు స్వాదీనం చేసుకున్నారు. ఎస్ఐ యాదగిరి అక్రమ ఆస్తులపై దృష్టి సారించారు. మియాపూర్లోని వీడియో కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు అతడిని అరెస్ట్ చేశారు. -
తమ్ముడికి ఐస్క్రీం ఇప్పించి ఇంటికి వెళ్లమని చెప్పింది.. ఆమె మాత్రం!
సాక్షి, రంగారెడ్డి : తన తమ్ముడికి ఐస్క్రీం ఇప్పించుకుని వస్తానని ఇంట్లోనుంచి వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన సంఘటన నార్సింగిలో చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లలితాబాయి, రాందాస్ దంపతులు కుమార్తె స్వాతి బాయి, కుమారుడితో కలసి నార్సింగిలో నివసిస్తున్నారు. గురువారం సాయంత్రం స్వాతి బాయి(19) తన తమ్ముడికి ఐస్ క్రీం ఇప్పించుకుని వస్తానని ఇంట్లోనుంచి వెళ్లింది. అతనికి ఐస్క్రీం ఇప్పించి ఇంటికి వెళ్లమని చెప్పి కనిపించకుండా పోయింది. రాత్రి ఇంటికి రాకపోవడం, తెలిసిన వారిని వాకబు చేసినా ఫలితం లేకపోవటంతో ఆమె తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమె ఆటోలో ఎంజీబీఎస్కు వెళ్లినట్టు గుర్తించారు. తల్లి ఫిర్యాదులో ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆదిశగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: టెకీ ఘనకార్యం; పెళ్లి పేరుతో ఇంటికి రప్పించుకొని.. ఏం కష్టమొచ్చిందో.. బిడ్డను చంపి ఉరేసుకున్న తల్లి -
మహిళ నంబర్ను షేర్చాట్లో పెట్టి కాల్గర్ల్గా..
సాక్షి, హైదరాబాద్: తీసుకున్న డబ్బులు చెల్లించాలని అడిగినందుకు ఓ మహిళ ఫోన్ నంబర్ను షేర్ చాట్లో పెట్టి కాల్ గర్ల్గా చిత్రీకరించిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మగ్గుల మండలం, కలకండ గ్రామానికి చెందిన నాగిల్లా యశ్వంత్ (19) తన బంధువుల వద్ద రూ.2వేల అప్పు తీసుకున్నాడు. డబ్బులు సకాలంలో తిరిగి ఇవ్వకపోవడంతో వారు యశ్వంత్ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు అతడిని మందలించడంతో బాధితురాలిపై భర్తపై పగ పెంచుకున్నాడు. వారి పరుపు తీయాలని ఉద్దేశంతో యశ్వంత్ షేర్చాట్లో బాధితురాలి ఫోన్ నంబర్ను పెట్టాడు. దీంతో బాధితురాలికి నిత్యం ఫోన్లు రావడంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: బాలికపై లైంగిక దాడి.. కోర్టు షాకింగ్ తీర్పు! బంజారాహిల్స్: అర్ధరాత్రి 12 గంటలకు యువతి ఇంట్లోకి వెళ్లి.. -
బంజారాహిల్స్: అర్ధరాత్రి 12 గంటలకు యువతి ఇంట్లోకి వెళ్లి..
సాక్షి, బంజారాహిల్స్: ప్రేమించిన యువకుడు వేధింపులకు గురిచేయడమే కాకుండా కిడ్నాప్కు యత్నించడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... చావ వినయ్ చౌదరి అనే యువకుడు కొంత కాలం క్రితం యువతితో సహజీవనం చేశాడు. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి 12 గంటలకు వినయ్ చౌదరి అక్రమంగా బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించి ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆమె ఫోన్ను పగలగొట్టాడు. అసభ్యంగా ప్రవర్తించి వేధించాడు. బలవంతంగా ఆమెను బయటికి ఈడ్చుకొచ్చి కారులోకి తోసి కిడ్నాప్కు యత్నించగా ఆమె అరుపులకు ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల వారు బయటికు వచ్చి నిందితుడిని పట్టుకునేందుకు యత్నించి బాధితురాలిని కాపాడారు. అదే సమయంలో వినయ్ చౌదరి అక్కడి నుంచి ఉడాయించాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు వినయ్ చౌదరిపై ఐపీసీ సెక్షన్ 448, 354, 427,506 కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బాలికపై లైంగిక దాడి.. కోర్టు షాకింగ్ తీర్పు! -
గెస్ట్ హౌస్లో వ్యభిచారం.. ఇద్దరు విటులు, యువతుల అరెస్టు
సాక్షి, గోల్కొండ: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గెస్ట్ హౌస్పై గోల్కొండ పోలీసులు దాడి చేశారు. గెస్ట్హౌస్ వాచ్మెన్తో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశారు. గోల్కొండ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్ అలియాస్ మున్నాభాయ్ షేక్పేట్ ఓయూ కాలనీలో ‘ఎంఎస్పీ గెస్ట్ ఇన్’గెస్ట్ హౌజ్లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. గెస్ట్హౌజ్ను బాగా ఇంటీరియర్ డెకరేషన్ చేసి ఇంటి ముందు ఒక సెక్యూరిటీ గార్డును కూడా నియమించుకున్నాడు. కాగా ఇతర ప్రాంతాల నుంచి యువతులను తెచ్చి వ్యభిచారం నిర్వహించేవాడు. అయితే బుధవారం రాత్రి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ఇద్దరు యువతులు, ఇద్దరు విటులతో పాటు గెస్ట్హౌజ్ వాచ్మెన్ జనైనాజెమ్ ఉద్దీన్ మలిక్ను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు మున్నాభాయ్ పరారీలో ఉన్నాడు. వాచ్మెన్తో పాటు పట్టుబడ్డ వి.శ్రీను, గొలుసుల శ్రీనివాస్లను రిమాండ్కు తరలించారు. పోలీసులు వారి నుంచి రూ.4వేల నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాడు. వ్యభిచార ముఠా సభ్యులపై పీడీయాక్ట్ చైతన్యపురి: సులువుగా డబ్బు సంపాదన కోసం వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యులపై సరూర్ నగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. బత్తుల మానస, వల్లపు మల్లికార్జున్, పోకల లింగయ్యలు ఒక ముఠాగా ఏర్పడి తెలుగు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచార గృహం నడుపుతున్నారు. సమాచారం అందుకున్న సరూర్నగర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు వారం రోజుల క్రితం ఇంటిపై దాడి చేశారు. మానస, మల్లికాఖార్జులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న పోకల లింగయ్యను గురువారం అరెస్టు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: హైటెక్ సిటీ: విదేశీ యువతులతో వ్యభిచారం -
ఓయో రూమ్ తీసుకుందామనుకుంటే.. అంతలోనే!
సాక్షి, హైదరాబాద్: సిటీలోని ఉత్తర మండలానికి చెందిన ఓ వ్యక్తి ఓయో హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలని భావించాడు. ఆ సంస్థను సంప్రదించడానికి అవసరమైన నంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేసి నిండా మునిగాడు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఉమేష్ ఇటీవల కరోనా బారినపడ్డాడు. చికిత్స తీసుకున్న అతడికి నెగిటివ్ వచ్చింది. అయితే తన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా కొన్ని రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలని భావించారు. దీని కోసం తమ ప్రాంతానికి సమీపంలోని ఓయో హోటల్ రూమ్ తీసుకుందామని భావించి ఆ సంస్థ ఫోన్ నంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేయగా ఒక నంబర్ లభించింది. అది నకిలీది అని తెలియక ఉమేష్ ఆ నంబర్ను సంప్రదించగా.. ఓయో సంస్థ ప్రతినిధుల మాదిరిగా సైబర్ నేరగాళ్లు మాట్లాడారు. మీకు కావాల్సిన రూమ్ బుక్ చేసుకోవడానికి సహకరిస్తామంటూ క్విక్ సపోర్ట్ (క్యూఎస్) యాప్ను డౌన్లోడ్ చేయించారు. తర్వాత బాధితుడి ఫోన్ను హ్యాక్ చేశారు. రూమ్ బుకింగ్ కోసం తమకు రూ.10 పంపాలన్నారు. ఉమేష్ ఆ మొత్తం తన ఫోన్ నుంచి బదిలీ చేస్తుండగా అతడి యూపీఐ వివరాలను క్యూఎస్ యాప్ ద్వారా తస్కరించారు. వీటిని వినియోగించి అతడి ఖాతా నుంచి రూ.3.08 లక్షలు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకుని స్వాహా చేశారు. విషయం తెలుసుకున్న ఉమేష్ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుల ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గూగుల్ను ఆశ్రయించొద్దు ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సైబర్ నేరగాళ్లు ప్రముఖ సంస్థల కాల్ సెంటర్ల పేరుతో తమ నంబర్లను గూగుల్లో జొప్పిస్తున్నారని, ఈ విషయం తెలియక సంప్రదించిన అనేక మంది మోసపోతున్నారని పేర్కొన్నారు. ఏదైనా సంస్థకు సంబంధించిన ఫోన్, కాల్ సెంటర్ నంబర్లు అవసరమైతే నేరుగా దాని వెబ్సైట్ లేదా యాప్లనే సంప్రదించాలని సూచిస్తున్నారు. గూగుల్లో ఉన్న వాటిని గుడ్డిగా నమ్మితే నిండా మునుగుతారని హెచ్చరిస్తున్నారు. చదవండి: 128 సార్లు ఓయో హోటల్స్ బుక్ చేసుకున్న ఒకే ఒక్కడు -
దొంగోడి తిప్పలు; భక్తుడిలా గుడికి.. చెట్టుతొర్రలో ఇరుక్కుని..
సాక్షి, శంషాబాద్ రూరల్: ఆలయంలో నగదు చోరీ చేసిన ఓ మైనర్ బాలుడు.. తిరిగి ఆలయం నుంచి బయటకు వస్తూ చెట్టుతొర్రలో ఇరుక్కుపోయాడు. ఆలయ పూజారి వచ్చి గమనించి ఆ బాలుడిని పట్టుకున్నాడు. శంషాబాద్ మండలం ఇందిరానగర్ దొడ్డి ప్రాంతానికి చెందిన బాలుడు(11) సోమవారం మధ్యాహ్నం ఘాంసిమియాగూడలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రధాన ఆలయంలోకి భక్తుడిలా వచ్చాడు. కొబ్బరికాయ చేతిలో పట్టుకొని గుడిలోపలికి వెళ్లాడు. అయితే పూజలు చేస్తున్నట్లుగా నటించి ఏకంగా ఆలయం లోపల టేబుల్ ఖానాలో దాచి ఉంచిన రూ.10వేలను తస్కరించాడు. తిరిగి అదే చెట్టు తొర్రలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ అందులో ఇరుక్కుపోయాడు. అయితే, కొద్దిసేపటి తర్వాత ఆలయానికి వచ్చిన పూజారికి టేబుల్ ఖానాలోని నగదు కనిపించలేదు. దీంతో ఆయన స్థానికులతో కలిసి సీసీ పుటేజ్ను పరిశీలించగా.. బాలుడు ఆలయంలోకి వచ్చి చెట్టుతొర్రలోకి వెళ్లినట్లు గుర్తించారు. వారు అక్కడికి వెళ్లి చూడగా ఆ బాలుడు అందులోనే ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి బాలుడి నుంచి రూ.10 వేలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఈ బాలుడు సెల్పోన్ దొంగతనం సంఘటనలో నిందితుడుగా ఉన్నట్లు సీఐ ప్రకాష్రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చదువులో వెనకబడ్డానని.. బీటెక్ విద్యార్థి.. -
గచ్చిబౌలి హోటల్లో వ్యభిచారం... ఆరుగురి అరెస్టు
సాక్షి, గచ్చిబౌలి: పోలీసులు ఓ హోటల్పై దాడి చేసి వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. ఆరుగురు విటులతో పాటు ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకోగా, నిర్వాహకులు మాత్రం పరారీలో ఉన్నారు. గచ్చిబౌలి సబ్ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలో ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. యాంటీ ఉమెన్ ట్రాకింగ్ సెల్, గచ్చిబౌలి పోలీసులు బుధవారం రాత్రి సదరు హోటల్పై దాడి చేశారు. విటులు బిజ్యూపాయల్(27), దీపక్కుమార్ (25), సంగం కిషోర్దాల్(24), నితిన్జాషన్ అలియాస్ ఆరుట్ల నిఖిల్ (31), బంది నారాయణ (38), వెంకటేష్గౌడ్(58)లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ 32,510 నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్కు చెందిన ముగ్గురు, ముంబైకి చెందిన ఇద్దరు, ఢిల్లీకి చెందిన ఒక యువతిని అదుపులోకి తీసుకొని రెస్క్యూ హోంకు తరలించారు. కాగా, నిర్వాహకులు ప్రభాకర్, సంజయ్, అజయ్ పరారీలో ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పప్పులో కాలేసిన టెలీకాలర్, కట్చేస్తే న్యూడ్ వీడియో కాల్ వదినపై ముగ్గురు మరుదులు అత్యాచారం -
డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన 121 మంది
సాక్షి, నాగోలు: రాచకొండ పోలీస్ కమిషరేట్ పరిధిలో గురువారం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్లో 121 మంది పట్టుబడినట్లు ట్రాఫిక్ ఇన్చార్జి డీసీపీ జి.మనోహర్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపిన వారిలో 10 మందిని జైలుకు పంపించినట్లు ఆయన చెప్పారు. రెండోసారి పట్టుబడిన ఓ ఆటో డ్రైవర్కు పెనాల్టీతో పాటు ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశామన్నారు. మొత్తం రూ.2.32 లక్షల జరిమానా విధించినట్లు డీసీపీ మనోహర్ పేర్కొన్నారు. -
తప్పులో కాలేసిన టెలీకాలర్, కట్చేస్తే న్యూడ్ వీడియో కాల్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఓ సంస్థలో టెలీకాలర్గా పని చేస్తున్న యువతి చేసిన చిన్న పొరపాటు ఆమెకే శాపంగా మారింది. తన విధులకు సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి వేధింపులు పాలైంది. వేళగాని వేళల్లో ఫోన్లు, సందేశాలతో పాటు న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ ఇబ్బందులకు గురి చేసిన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన మేరకు.. ఉత్తర మండల పరిధిలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతి ఓ ప్రైవేట్ సంస్థలో టెలీకాలర్గా పని చేస్తోంది. వృత్తిలో భాగంగా నిత్యం అనేక మందితో సంస్థ ఫోన్ నుంచి కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అయితే టెలీకాలర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ క్లైంట్స్కు వ్యక్తిగత ఫోన్ నెంబర్లు, వివరాలు అందించకూడదనేది ప్రాథమిక సూత్రం. ఓ సందర్భంలో ఈ యువతి ఛత్రినాక ప్రాంతానికి చెందిన చంద్రవేగ్కు ఫోన్ చేసి తమ సంస్థ వ్యాపారం విషయం మాట్లాడింది. ఆ సంస్థకు కస్టమర్గా మారే విషయాన్ని తాను పరిశీలిస్తానంటూ చెప్పిన చంద్రవేగ్ కాస్త సమయం కావాలన్నాడు. సమాధానం చెప్పడం కోసం సంప్రదించడానికంటూ ఆమె వ్యక్తిగత ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ప్రైవేట్ ఉద్యోగి అయిన ఇతగాడు అప్పటి నుంచి ఆమెను రకరకాలుగా వేధించడం మొదలెట్టాడు. అర్ధరాత్రి వేళల్లో ఫోన్లు చేయడం, సందేశాలు పంపడం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో విచక్షణ కోల్పోయిన ఇతగాడు బాధితురాలికి న్యూడ్ వీడియో కాల్స్ చేయడం మొదలెట్టాడు. విసిగివేశారిన బాధితురాలు ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు చంద్రవేగ్ నిందితుడిగా గుర్తించారు. గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
వదినపై ముగ్గురు మరుదులు అత్యాచారం
సాక్షి, అమీర్పేట: భర్త సమక్షంలోనే అతని సోదరులు అత్యాచారం చేశారని ఓ మహిళ కోర్టును ఆశ్రయిందింది. వారిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఎస్ఆర్నగర్ పోలీసులను ఆదేశించడంతో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. బోరబండ ఇంద్రానగర్లో నివాసముంటున్న నర్సింహ మద్యానికి అలవాటు పడ్డాడు. భార్యను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టేవాడు. దీంతోపాటు తన సోదరులతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధించేవాడు. మరుదులైన కృష్ణ, శ్రీనివాస్, మునీందర్లు కూడా వేధించారు. 2017లో భార్యను నిర్భందించి సోదరుల చేత లైంగిక దాడికి సహకరించాడు. బాధితురాలు కోర్టును ఆశ్రయించగా మంగళవారం కేసు నమోదు చేశామన్నారు. -
ప్రిన్సిపల్పై విద్యార్థి దాడి
సాక్షి, బంజారాహిల్స్: స్కూల్ ఫీజు కట్టడానికి మరుసటి రోజు రమ్మని చెప్పిన ప్రిన్సిపాల్పై ఓ విద్యార్థి దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.12 సయ్యద్ నగర్లోని ది ఆక్స్ఫర్డ్ మిషన్ హైసూ్కల్లో స్థానికంగా నివసించే ఇలియాస్(19)అనే విద్యార్థి సోమవారం పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు వచ్చాడు. అయితే ఫీజు చెల్లించేందుకు రేపు రావాలని స్కూల్ ప్రిన్సిపల్ ఫిర్దోస్ అంజుమ్ సూచించారు. ఇప్పడే కట్టుకోవాలంటూ వాగ్వాదానికి దిగిన ఇలియాస్ కోపంతో ఊగిపోతూ ప్రిన్సిపల్ను కొట్టాడు. అప్పుడే వచ్చిన అతడి తల్లి జాఫరున్నీసాబేగం కూడా చెప్పు తీసుకొని ప్రిన్సిపల్ ముఖంపై బాదింది. బాధితుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇలియాస్తో పాటు అతడి తల్లి జాఫరున్నీసాబేగంపై ఐపీసీ సెక్షన్ 354, 324, 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నా కోరిక తీర్చు.. లేదంటే నీ భర్త, కొడుకును..
సాక్షి, బంజారాహిల్స్: తనతో స్నేహం చేయాలంటూ వివాహితను తరచూ వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై, అతడికి సహకరించిన మరో ముగ్గురిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం.1లో నివాసముంటున్న వివాహిత(36) ఓ బ్యూటీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్లో మెడికల్ హెడ్గా పనిచేస్తోంది. ఇటీవల వరప్రసాద్ అనే క్లైంట్ వెంట క్లినిక్కు వచి్చన విశ్వనాథ్ అనే వ్యక్తి ఆమె ఫోన్ నంబర్ను సేకరించి తరచూ ఫోన్లు చేస్తున్నాడు. తనతో స్నేహం చేయాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో ఫోన్ నంబర్ను బ్లాక్లిస్ట్లో పెట్టింది. అయినప్పటికీ వెంట్రుకలకు సంబంధించిన సమస్య ఉందంటూ తరచూ క్లినిక్కు వచ్చి అక్కడ పనిచేస్తున్న వారితో స్నేహం పెంచుకున్నాడు. బాధితురాలికి సంబంధించిన కుటుంబ వివరాలు, చిరునామాను తెలుసుకున్న విశ్వనాథ్ ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఓ ఫ్లాట్ను నాగరాజు అనే వ్యక్తి పేరుతో తీసుకున్నాడు. అక్కడే ఉంటూ బాధితురాలి కుమారుడికి చాక్లెట్లు, బొమ్మలు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు. తన కోరిక తీర్చకపోతే కొడుకుతో పాటు భర్తను అంతం చేస్తానంటూ బెదిరింపులు ప్రారంభించాడు. ఆమె కదలికలపై సమాచారం సేకరించేందుకు కారులో జీపీఎస్ పరికరాన్ని రహస్యంగా అమర్చాడు. ఇదిలా ఉండగా ఇటీవల అతడి వేధింపులు ఎక్కువ కావడంతో భర్తకు విషయాన్ని చెప్పింది. దీంతో అతడు నివాసముంటున్న ఫ్లాట్కు వెళ్లడంతో అక్కడి నుంచి విశ్వనాథ్ పరారయ్యాడు. కారులో తనిఖీ చేయగా జీపీ ఎస్ పరికరం దొరికింది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని మరోసారి విశ్వనాథ్ నీ భార్య జోలికి రాడంటూ సురేష్ అనేవ్యక్తి ఫోన్ చేశాడు. పులి శ్రీకాంత్ పటేల్ అనే రాజకీయ నేత కూడా ఫోన్లు చేస్తూ రాజీకుదుర్చుకుందామని లేకపోతే అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగాడు. ఈ మేరకు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులు వై.విశ్వనాథ్, సురేష్, శ్రీకాంత్ పటేల్, నాగరాజు అనే వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విషాదం: వంట చేస్తుండగా మంటలంటుకొని..
సాక్షి, చిక్కడపల్లి: వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ మంటలంటుకొని చికిత్స పొందుతూ ఓ గృహిణి మృతి చెందిన ఘటన చిక్కడపల్లి పోలీస్స్టేషన్లో పరిధిలో జరిగింది. ఎస్ఐ కోటేశ్ వివరాల ప్రకారం.. బాగ్లింగంపల్లి పాలమూరుబస్తీలో నివాసముంటున్న బి.చిట్టి (24) గురువారం రాత్రి గ్యాస్ పొయ్యి పని చేయకపోవడంతో నాలుగో అంతస్తులో ఉన్న టెర్రస్పైన కట్టెల పొయ్యిపై వంట చేయడానికి వెళ్లింది. కట్టెల పొయ్యిలో కిరోసిన్ పోసిన సమయంలో మంటలు ఎక్కువగా వచ్చి బట్టలకు అంటుకున్నాయి. కేకలు వేయడంతో అక్కడే ఉన్న గంగాధర్, సాయిలు ఆమె పై బ్లాంకెట్ కప్పి మంటలు ఆర్పేందుకు యత్నించారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కర్నాటక బళ్లారికి చెందిన చిట్టి సోదరుడు రామ్ అంజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ శివశంకర్రావు పర్యవేక్షణలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త రెండో పెళ్లి.. భార్యపై వేధింపులు.. ఆ తర్వాత
సాక్షి, కుషాయిగూడ: భార్య, పిల్లలు ఉండగానే మరో మహిళను వివాహం చేసుకున్న వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ శుక్రవారం మల్కాజిగిరి కోర్టు తీర్పు చెప్పింది. ఆయనతో పాటు వేధింపులకు పాల్పడ్డ వారికి జరిమానా, జైలు శిక్ష విధించింది. పోలీసుల సమాచారం మేరకు... కాప్రా భవానీనగర్కు చెందిన ఎల్.భవాని (గాయత్రి), ప్రేమ్కుమార్లకు 2002లో వివాహం జరిగింది. ప్రేమ్కుమార్ రైల్వే ఉద్యోగి. వీరికి ఇద్దరు సంతానం. ఇదిలా ఉండగా... ప్రేమ్కుమార్కు పనిచేసే చోట కవిత అనే వివాహితతో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యలో ప్రేమ్కుమార్ తన భార్యను వదిలించుకునేందుకు వేధింపుల పర్వానికి తెరలేపి నిత్యం వేధించసాగాడు. భర్తతోపాటు అత్త లాకావత్ లత, ఆడపడుచు లాకావత్ అర్చన సైతం భవానీని వేధింపులకు పాల్పడేవారు. ఇదిలా ఉండగా 2014 జూలై 4న ప్రేమ్కుమార్, కవితలు ఎవరికీ తెలియకుండా రెండో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలోనే ప్రేమ్కుమార్ అదృశ్యంపై కుషాయిగూడ పోలీస్స్టేషన్లో, కవిత అదృశ్యంపై మల్కాజిగిరి పోలీస్స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వివాహం అనంతరం ప్రేమ్కుమార్, కవిత కుషాయిగూడ పోలీస్ట్షన్కు వచ్చి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో 2016 మే 5న అతిగా మద్యం సేవించిన ప్రేమ్కుమార్ మొదటి భార్య లావణ్య పట్ల దురుసుగా వ్యవహరించి, బూతులు తిడుతూ చేయిచేసుకున్నాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో లావణ్య పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు రెండో వివాహం చేసుకున్న ప్రేమ్కుమార్, కవితతో పాటు వేధింపులకు పాల్పడ్డ లత, అర్చనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐఓ ఎస్ఐ నాగేశ్వర్రావు దర్యాప్తు చేసి కోర్టుకు తగిన ఆధారాలతో చార్జిషీట్ను సమర్పించారు. కేసు పూర్వాపరాలు.. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శుక్రవారం ప్రేమ్కుమార్కు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 5,500 జరిమానా, మిగతా వారికి ఏడాది జైలు శిక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని పోలీసులు తెలిపారు. -
విషాదం: ఆరు నెలల క్రితం తండ్రి, ఇప్పుడు కొడుకు..
సాక్షి, నాగోలు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేçసుకుంది. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ వాస్తుకాలనీకి చెందిన కీత నితేష్సాయి(26) మృత్తి రీత్యా వ్యాపారి. బుధవారం రాత్రి వనస్థలిపురంలో ఉన్న స్నేహితుడిని కలసి బుల్లెట్పై వాస్తుకాలనీలో ఉన్న తన ఇంటి రాత్రి 11:45గంటలకు సమయంలో వస్తున్నాడు. మార్గ మధ్యలో ఓంకార్నగర్ యూటర్న్ వద్ద మరో ద్విచక్ర వాహనం వచ్చి ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన నితేష్సాయిని చికిత్స నిమిత్తం హస్తినాపురంలోని నవీన ఆస్పత్రికి తరలించారు. రాత్రి ఒంటి గంట సమయంలో చికిత్స పొందుతూ నితేష్సాయి మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి పెద్దనాన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణలు దక్కేవి... హెల్మెంట్ లేక పోవడంతో కింద పడిన నితేష్సాయి తలకు తీవ్ర గాయలు కావడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. హెల్మెంట్ ధరించి ఉంటే నితేష్సాయి ప్రాణాలతో బయట పడేవారని పేర్కొన్నారు. ఆరు నెలల క్రితమే తండ్రి మృతి.. నితేష్సాయి తండ్రి మధుసూదన్ ఆరు నెలల క్రితం నాగోలు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అంతలోనే కుమారుడు చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
సాక్షి, ఉప్పల్: ఉప్పల్ ఏక్మినార్ మజీద్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీరు మృతి చెందాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మైబెల్లి తెలిపిన మేరకు.. కుత్బుల్లాపూర్ సుచిత్ర ప్రాంతంలో నివాసముండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీగూర శివనాగిరెడ్డి (26) ఉప్పల్ రోడ్డులోని ఎన్ఎస్ఎల్ భవనంలో మూడు సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. కార్యాలయంలో ఉన్న ల్యాప్టాప్ కోసం ఇంటి నుంచి తన ద్విచక్ర వాహానం (ఏపి 09 సిఎన్ 3009)పై గురువారం ఉదయం బయలు దేరాడు. ఉప్పల్ ఏక్ మినార్ మజీద్ వద్ద రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాన్ వేగంగా ఢీ కొనడంతో తీవ్ర గాయాల పాలైనాడు. గాయపడిన శివనాగిరెడ్డిని చికిత్స నిమిత్తం గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శివనాగిరెడ్డి భార్య తీగూర సుశ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాట పాపారాయుళ్లు: ప్రతిసారి వాళ్లే ఎలా గెలుస్తున్నారని..
సాక్షి, మేడ్చల్ రూరల్: పోలీసులంటూ పేకాట ఆడుతున్న వారిపై దాడి చేసి నగదు దోచుకెళ్లిన ముఠాను మేడ్చల్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మేడ్చల్ పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ పద్మజ వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లా ముథోల్ కు చెందిన అఖిల్ అహ్మద్ (32) మేడ్చల్ పట్టణంలోని చంద్రానగర్లో నివాసం ఉంటున్నాడు. ఇతని మిత్రులు ఇస్లాంపూర్కు చెందిన షేక్ అహ్మద్(21), షేక్ అజీమ్(25) ముగ్గురు తరచూ పేకాట ఆడేవారు. భాదితులు మణికంఠ, శ్రీహరి, సామ్సంగ్లతో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. పలుమార్లు వారితో కలిసి పేకాట ఆడారు. ఎప్పుడు పేకాట ఆడినా మణికంఠ, శ్రీహరి, సామ్సంగ్లు డబ్బు గెలుచుకునేవారు. అఖిల్ అహ్మద్, షేక్ అహ్మద్, షేక్ అజీమ్లు సుమారు రూ.7 నుంచి 8 లక్షల వరకు పోగొట్టుకున్నారు. తరుచూ డబ్బు వాళ్లే ఎలా గెలుస్తున్నారు.. ఏదో చేస్తున్నారు అంటూ వీరి నుంచి డబ్బులు ఎలాగైనా రాబట్టాలని ప్లాన్ చేసుకున్న ముగ్గురు మిత్రులు వారి స్నేహితులైన ఇస్లాంపూర్ కు చెందిన షేక్ అక్బర్(32), నిజామాబాద్కు చెందిన గణేశ్(28), షేక్ కైసర్(30) లతో కలిసి నకిలీ పోలీసులమంటూ బెదిరించి డబ్బులు దోచుకోవాలని పథకం వేసుకున్నారు. ఈ నెల 14న మేడ్చల్లోని ఆర్ఆర్ లాడ్జిలో రెండు గదులు అద్దెకు తీసుకున్నారు. ప్లాన్లో భాగంగా అఖిల్ అహ్మద్ మధ్యాహ్నం మణికంఠ, శ్రీహరి, సామ్సంగ్లకు ఫోన్ చేసి పేకాట ఆడేందుకు లాడ్జికి పిలువగా వారు సాయంత్రం వచ్చి అఖిల్ అహ్మద్,షేక్ అహ్మద్, షేక్ అజీమ్లతో కలిసి ఆరుగురు లాడ్జీలోని ఓ రూమ్లో పేకాట ఆడుతున్నారు. కొంతసేపటికి డోర్ చప్పుడు కావడంతో అఖిల్ అహ్మద్ పోలీసులు వచ్చారంటూ అరుస్తూ అక్కడ ఉన్న డబ్బులు మొత్తం తీసుకుని బాత్రూమ్లో దాక్కున్నాడు. షేక్ అహ్మద్ వెళ్లి తలుపులు తీసాడు. గణేశ్, షేక్ కైసర్లు పోలీసులమంటూ గదిలోకి చొరబడి గణేశ్ డమ్మీ గన్తో బెదిరించి డబ్బు తీసుకొని వెళ్లిపోయారు. ఆ సమయంలో షేక్ అక్బర్ ఇతరులు ఎవరూ అటు వైపు రాకుండా చూస్తూ లాడ్జ్ వారితో మాటలు కలుపుతూ పని ముగిసాక వెళ్లిపోయాడు. తరువాత అఖిల్ అహ్మద్,షేక్ అహ్మద్లు తమకు భయం అవుతుందంటూ బాదితులకు చెప్పకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి రూ.2.22లక్షల నగదు, 6 సెల్ఫోన్లు, బైక్, డమ్మీ గన్, ఫైబర్ లాఠీ లను స్వాధీనం చేసుకున్నారు. -
రూ. 23,100కే రైల్వే జాబ్!
సాక్షి, హైదరాబాద్: ఓఎల్ఎక్స్లో రైల్వే ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చి, సంప్రదించిన వారితో షైన్.కామ్లో రిజిస్టర్ చేయించి, వివిధ చార్జీల పేరుతో రూ. 23,100 వరకు వసూలు చేసి, మోసం చేసే ముఠా సూత్రధారిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాధితుడి ద్వారా నిందితుడిని కోల్కతాలో పట్టుకున్న అధికారులు పీటీ వారెంట్పై సిటీకి తీసుకువచ్చారు. జ్యుడీషియల్ రిమాండ్కు తరలించిన అనంతరం కోర్టు అనుమతితో బుధవారం సైబర్ కాప్స్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముఠా చేతిలో దేశ వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది మోసపోయారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్యే 20 మంది వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురి ఫిర్యాదులతో కేసులు నమోదు కాగా... మరో 12 మందిని గుర్తించామని, మిగిలిన ఐదుగురి కోసం ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ⇔ కోల్కతా, హుగ్లీలోని చందన్నగర్కు చెందిన హర్ష బర్దన్ మిశ్రా బీసీఏ పూర్తి చేశాడు. ఆపై కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన ఇతగాడు ప్రస్తుతం అక్కడి నరూ రోయ్పర ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ ఐటీ టెక్నాలజీ గ్రూప్ అండ్ ఏఎస్ ఇన్ఫోసాల్వ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ⇔ పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన బినిత పాల్, రిచ, అనితలను ఉద్యోగులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఐదుగురూ కలిసి ఆన్లైన్ ద్వారా దేశ వ్యాప్తంగా అనేక మందిని ఉద్యోగాల పేరుతో ఎర వేసి మోసం చేస్తున్నారు. ⇔ ఓఎల్ఎక్స్లో రైల్వేతో పాటు డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చే వీరు అందులో తమ ఫోన్ నంబర్లను పొందుపరుస్తున్నారు. వీటిని చూసి ఎవరైనా కాల్ చేస్తే.. వారి వివరాలను షైన్.కామ్ వెబ్సైట్లో నమోదు చేయాలని సూచిస్తున్నారు. ⇔ ఆ తర్వాత రెండు రోజుల్లో నిందితులు బాధితులకు ‘హెచ్ఆర్ రిచ’, ‘హెచ్ఆర్ జాస్మిన్’ పేర్లతో బల్క్ మెసేజ్లో పంపుతున్నారు. ఉద్యోగార్థుల్లో అత్యధికులు రైల్వే ఉద్యోగాలే కోరుతుండటంతో ఆ డిపార్ట్మెంట్లో సైట్ సూపరింటెండెంట్ పోస్టులకు అర్హులయ్యారంటూ చెబున్నారు. మరికొందరితో ప్యాంటరీకార్స్లో పోస్టుల పేరు చెప్తున్నారు. ⇔ నెలకు రూ.13,500 నుంచి రూ.15,500 వరకు ప్రారంభ వేతనం ఉంటుందని, ఉద్యోగస్తుడితో పాటు అతడి కుటుంబానికీ రైల్వేలో ఉచిత ప్రయాణం సహా ఇతర సౌకర్యాలు ఉంటాయంటూ నమ్మబలుకుతున్నారు. ఇలా తమ వల్లోపడిన వారి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల పేరుతో ప్రాథమికంగా రూ.1000 వసూలు చేస్తున్నారు. ⇔ ఆపై ప్రాసెసింగ్, యూనిఫాం చార్జీల పేర్లు చెప్పి రూ. 23,100 వరకు వసూలు చేస్తున్నారు. నగదు చెల్లించిన వారు ఎవరైనా ఫోన్లు చేస్తే త్వరలోనే రైల్వే హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్, నియామక ఉత్తర్వులు అందుతాయంటూ దాట వేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఎవరైనా పదేపదే కాల్స్ చేసి ఉద్యోగం విషయం ప్రశ్నిస్తే కొత్త కథ అల్లుతున్నారు. ⇔ అయితే 95 శాతం మంది రూ. 23,100 కోల్పోయిన తర్వాత వీరికి దూరంగా ఉంటున్నారు. మిగిలిన వారు మాత్రం అదనపు మొత్తం చెల్లించడానికి సిద్ధమంటుంటే... వారి నుంచి మరో రూ.6,900 వరకు వసూలు చేసి వారి నంబర్లను బ్లాక్ చేస్తున్నారు. ⇔ ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన వాళ్లల్లో అత్యధికులు పోలీసుల వరకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. నగరానికి చెందిన ముగ్గురు మాత్రం రూ.23 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లించి మోసపోయారు. వీరంతా సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ⇔ వీటిని సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ నవీన్ నేతృత్వంలోని బృందం ప్రధాన నిందితుడు హర్ష కోల్కతా సమీపంలోని డమ్డమ్లో ఉన్నట్లు గుర్తించింది. అక్కడికి వెళ్లే సరికి తన మకాం మార్చేశాడని తేలింది. అయితే అతడు ఓ వ్యక్తితో పదేపదే ఫోన్లో మాట్లాడుతున్నట్లు గుర్తించిన స్పెషల్ టీమ్ అతడిని పట్టుకుంది. విచారణ నేపథ్యంలో తాను కూడా హర్షకు రూ.30 వేలు చెల్లించి మోసపోయిన కోల్కతా వాసినంటూ చెప్పాడు. ⇔ అతగాడికి నరూ రోయ్పర ప్రాంతంలో ఓ కార్యాలయం ఉందని చెప్పి పోలీసులను తీసుకెళ్లి చూపించాడు. దీంతో హర్షను అరెస్టు చేసిన అధికారులు అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్పై సిటీకి తీసుకువచ్చారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
స్నేహితురాలితో వీడియో కాల్ మాట్లాడుతోందని..
మల్కాజిగిరి: యువతి అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్ఐ క్రిష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం... మల్కాజిగిరి భవానీనగర్కు చెందిన మేఘనాథ్ కూతురు సుమిత (20) ప్రైవేట్ ఉద్యోగి. తరచూ హబ్సిగూడలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తూవుండేది. ఆమెతో తరచూ వీడియోకాల్ మాట్లాడుతుండడంతో తల్లి మందలించింది.ఈ నెల 1 వ తేదీ ఇంటి నుంచి వెళ్లిన సుమిత తిరిగిరాలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిల్ కలెక్టర్ను బెదిరించిన కేసులో.. ఏడాది జైలు నేరేడ్మెట్: విద్యుత్ బిల్లు చెల్లించమని అడిగిన బిల్ కలెక్టర్ను కత్తితో బెదిరించిన కేసులో నిందితుడికి మల్కాజిగిరి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించినట్టు బుధవారం నేరేడ్మెట్ సీఐ నర్సింహస్వామి పేర్కొన్నారు. సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి....పోలీసుస్టేషన్ పరిధిలోని సంతోషిమానగర్లో నివాసం ఉంటున్న శంకర్రాయ్ ఇంటికి 2018 సంవత్సరం సెపె్టంబర్ 29న బిల్ కలెక్టర్ శ్రీశైలం పెండింగ్ విద్యుత్ బిల్లు వసూలు కోసం వెళ్లాడు. బిల్లు చెల్లించాలని కోరగా నిందితుడు కత్తితో బెదిరించాడు. ఈ విషయాన్ని వెంటనే బిల్ కలెక్టర్ ఏఈ రవీందర్కు సమాచారం ఇచ్చాడు. ఏఈ వచ్చి బిల్లు చెల్లించాలని లేనిపక్షంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని స్పష్టం చేయగా, నిందితుడు ఆయన్ని బెదిరించాడు. ఏఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ఛార్జిïÙటు దాఖలు చేశారు. బుధవారం తుది విచారణ పూర్తి కావడంతో నిందితుడికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని సీఐ వివరించారు. -
పని మనిషే హత్య చేసింది..
సాక్షి, జిన్నారం(పటాన్చెరు) : కళ్లల్లో కారంచల్లి ఓ వృద్ధురాలి గొంతు నులిమి హత్య చేసిన కేసును బొల్లారం పోలీసులు ఛేదించారు. పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో హత్యకు గల కారణాలను వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. బొల్లారం గ్రామంలో ఒంటరిగా నివాసం ఉంటున్న ఉస్కేబావి అంతమ్మ ఇంట్లో స్వరూప అనే మహిళ పని చేస్తుంది. అంతమ్మ ఇంట్లో ఎప్పుడూ డబ్బు, బంగారు నగలను గమనిస్తున్న స్వరూప వాటిని అపహరించాలని పన్నాగం పన్నింది. ఆదివారం రాత్రి అంతమ్మతో పాటు ఇంట్లోనే స్వరూప నిద్రించింది. అంతమ్మ నిద్రలోకి చేరుకున్న తర్వాత స్వరూప నిద్ర లేచి అంతమ్మ కళ్లల్లో కారం చల్లి గొంతు నులిమి హత్య చేసింది. ఇంట్లో ఉన్న 18 తులాల బంగారంతో పాటు రూ. 6లక్షల నగదును ఎత్తుకెళ్లింది. అంతమ్మ హత్యకు గురి కావటంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటి పరిసర ప్రాంతంలో అర్ధరాత్రి ఓ మహిళ సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. అంతమ్మ ఇంట్లో పనిచేస్తున్న స్వరూపను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. తానే హత్య చేసి నగదు, డబ్బును ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకుంది. నగదుతో పాటు బంగారంను స్వాధీనం చేసుకొని స్వరూపను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. 24 గంటల్లో హత్య కేసును ఛేదించేలా దర్యాప్తు జరిపిన సీఐ ప్రశాంత్తో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు వివరించారు. -
భర్త అడ్డుతొలగిస్తే సంతోషంగా ఉండొచ్చని..
సాక్షి, పటాన్చెరు టౌన్ : వివాహేతర సంబంధంతో వరసకు బావతో కలసి భర్తను భార్య హత్య చేయించిన ఘటన మంగళవారం అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. క్రైం సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. చత్తీస్ఘడ్ రాష్ట్రం... దురుగు జిల్లా..మరోదా గ్రామానికి చెందిన అనిల్ కుమార్ దారు (35) బతుకుదెరువు కోసం మూడు నెలల క్రితం స్నేహితుడు హరినారాయణ (అలియాస్) సంజీవుతో కలసి అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్కు వచ్చాడు. సమీపంలోని మెడికల్ డివైజ్ పార్క్ సమీపంలో సెంటరింగ్ పని చేసుకుంటూ, అక్కడే నివాసం ఉంటున్నాడు. పది రోజుల క్రితం వరసకు సడ్డకుడు నర్వోత్తంతో కలిసి మృతుడి భార్య భువనేశ్వరి అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ వచ్చింది. భువనేశ్వరి, నర్వోత్తంల మధ్య వివాహేతర సంబంధం ఉంది. భర్త అనిల్ కుమార్ను హతమారిస్తే ఇద్దరం సంతోషంగా ఉండవచ్చని మృతుడి భార్య బావ నర్వోత్తంతో చెప్పింది. దీంతో అతను అనిల్ కుమార్ను ఆదివారం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ సమీపంలో ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లి రాయితో తలపై బాది హత్య చేశాడు. ఒక్కసారిగా అనిల్కుమార్ కనిపించకుండా పోవడంతో తోటి కార్మికులు, స్నేహితుడు సంజీవు .. నర్వోత్తంని అడిగారు. ఎవరో వచ్చి బైక్పై తీసుకెళ్లారని అబద్ధం చెప్పాడు. అనంతరం కాసేపు వెతికినా అనిల్కుమార్ దొరక్కపోవడంతో మరోసారి నర్వోత్తంను గట్టిగా నిలదీశారు. అనిల్కుమార్ భార్యకు తనకు వివాహేతర సంబంధం ఉందని ఆమె చెబితేనే హత్య చేశానని చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ భీంరెడ్డి, పటాన్చెరు క్రైం సీఐ శ్రీనివాసులు, అమీన్పూర్ ఎస్ఐలు మురళి, కిష్టారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతుడి భార్య భువనేశ్వరిని, నర్వోత్తంను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి స్నేహితుడు సంజీవు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి సంతానం కలగలేదని మేనల్లుడి దారుణ హత్య? -
రెండు క్రేన్ల ఢీ: ఆపరేటర్ మృతి
సాక్షి, గచ్చిబౌలి: రోడ్డుపై రెండు క్రేన్లు వేగంగా వెళ్తున్నాయి.. ఒక క్రేన్ అదుపుతప్పి ముందు వెళుతున్న క్రేన్ను ఢీకొట్టింది. తర్వాత ఫుట్పాత్ను ఢీకొట్టి బోల్తా పడటంతో క్రేన్ ఆపరేటర్ మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సీఐ గోనె సురేష్ తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్కు చెందిన సునీల్ అలియాస్ అనిల్ యాదవ్(26) బాలానగర్ ఫిరోజ్గూడలో ఉంటూ క్రేన్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి 12 గంటలకు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని అమెజాన్లో మెటీరియల్ ఎత్తేందుకు రెండు క్రేన్లు వెళ్లాయి. రాత్రి ఒంటి గంట సమయంలో విప్రో జంక్షన్ సమీపంలో వెనుక వస్తున్న క్రేన్ న్యూట్రల్ కావడం, జంక్షన్లో రోడ్డు డౌన్గా ఉండటంతో వేగంగా దూసుకెళ్లి ముందు వెళ్తున్న క్రేన్ను ఢీకొట్టి ఫుట్పాత్ను తాకి బోల్తా కొట్టింది. ఆపరేటర్ అనిల్ యాదవ్ క్రేన్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, ముందు వెళుతున్న క్రేన్ అదుపుతప్పి ఫుట్పాత్ను ఢీకొట్టడంతో ముందు చక్రాలు ఊడిపడ్డాయి. ఆ క్రేన్పై ఉన్న ఆపరేటర్ షఫీకి అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు కాలేదు. ఫుట్పాత్ వెంట టీఎస్ఐఐసీ అధికారులు ఏర్పాటు చేసిన గ్రిల్స్, ఇనుప స్తంభాలు నేలమట్టమయ్యాయి. సోమవారం ఉదయం మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, గచ్చిబౌలి సీఐ సురేష్ , ట్రాఫిక్ సీఐ నర్సింహారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ-కామర్స్లో తెలుగుతో తెలివిగా టోకరా..
సాక్షి, హైదరాబాద్: ఈ-కామర్స్ సైట్లలో వినియోగదారుల వివరాలు సేకరిస్తారు. ప్రైజ్మనీ వచ్చిందంటారు. టాటా సఫారీ వాహనం గెలుచుకున్నారని నమ్మబలుకుతారు. ఆపై మోసాలకు తెరలేపుతారు. ఇలా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలవారితో తెలుగులో మాట్లాడి రూ.కోట్లలో మోసం చేసిన పది మంది ముఠా సభ్యులను సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అంతర్రాష్ట సైబర్ నేరాల కేసులో అయిదుగురు తెలుగువారు పట్టుబడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. టాటా సఫారీ గెలుచుకున్నారంటూ నమ్మించి రూ.95,459 వసూలు చేయడంతో గత ఏడాది సెప్టెంబర్ 1న సైబరాబాద్కు చెందిన ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ మోసం వెలుగులోకి వచ్చిందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన సైబర్క్రైమ్ ఏసీపీ బాలకృష్ణారెడ్డితో కలిసి గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పోస్టులు పంపించి.. నమ్మించి.. ⇔ బిహార్లోని నవాడా జిల్లా మిర్జాపూర్కు చెందిన తరుణ్ కుమార్ అలియాస్ అమిత్ బీసీఏ చదివాడు. కోచింగ్ సెంటర్ పెట్టి ఆర్థికంగా నష్టపోయాడు. స్నేహితులు అలోక్, తిరంజ్ల సహకారంతో ఈ-కామర్స్ సైట్లు హెర్బల్ కేర్ గ్రూప్, నాప్టాల్, షాప్క్లూజ్ల నుంచి కొనుగోలుదారుల వివరాలు సేకరించాడు. భజరంగి, కామ్లేష్ దూబె, యశ్వంత్ ఠాకూర్, సౌరవ్ పటేల్లతో కలిసి 53 బ్యాంక్ ఖాతాలు సృష్టించారు. ⇔ బిహర్ షరీఫ్లోని ప్రింటింగ్ ప్రెస్ వద్ద స్క్రాచ్ కార్డులు, అప్లికేషన్లు, బ్యాంక్ల నకిలీ స్టాంప్లు ముద్రించాడు. ఆయా సంస్థల ఎన్వెలప్ కవర్లకు బ్యాంక్ సీల్ వేసి లోపల స్క్రాచ్కార్డులు పంపి కస్టమర్లను నమ్మించేవారు. ప్రైజ్మనీ, టాటా సఫారీ గిఫ్ట్లు వచ్చాయని నకిలీ ఐడీ కార్డులు, లెటర్ హెడ్లను కొనుగోలుదారుల వాట్సాప్ నంబర్లకు పంపించేవారు. అనంతరం నగదు, కారు డెలివరీ అంటూ రిజిస్ట్రేషన్ ఫీజు, డాక్యుమెంట్ చార్జీలు, జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ తదితరాలు చెల్లించాలంటూ బురిడీ కొట్టించేవారు. రాంచీ, ఒడిశా కేంద్రాలుగా.. ⇔ 2020 ఆగస్టులో జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని కొకర్కాల్ సెంటర్, ఒడిశాలోని రూర్కెలాలో తరుణ్ కుమార్ టెలీ కాలింగ్ కార్యాలయాలు ప్రారంభించాడు. అలోక్, తిరంజల నుంచి సేకరించిన ఈ– కామర్స్ సైట్ల కొనుగోలుదారుల వివరాలను టెలీ కాలర్లకు ఇచ్చాడు. తెలుగు రాష్ట్రాల ప్రజలను మోసగించేందుకు తెలుగు భాష వచ్చిన టెలీ కాలర్లను, కర్ణాటక, తమిళనాడు ప్రజలను చీటింగ్ చేసేందుకు కన్నడ, తమిళం మాట్లాడేవారిని నియమించాడు. ⇔ రాంచీకి చెందిన కామ్లేష్ దూబే ఉపాధి కోసం 30 ఏళ్ల క్రితం మంచిర్యాలలోని బెల్లంపల్లిలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇతని స్నేహితులు యశ్వంత్కుమార్, సౌరభ్ పటేల్ పిలవడంతో రాంచీకి వెళ్లి వారితో చేతులు కలిపాడు. సైబర్ నేరాలు చేసే క్రమంలో తెలుగువాళ్లు అతిగాస్పందిస్తుండడంతో కామ్లేష్ దూబే సహకారంతో మంచిర్యాలకు చెందిన మచినెల్ల వెంకటేష్, గుర్రం రాకేష్, ప్రశంత్, రాజేందర్రెడ్డి, రాజలింగులను రాంచీకి పిలిపించుకొని టెలీకాలర్లుగా నియమించుకుని దందా సాగిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా రూ.2 కోట్ల వరకు ఈ ముఠా మోసగించింది. పదిమంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మంచిర్యాలకు చెందిన అయిదుగురు ఉన్నారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు. చదవండి: ‘భీష్మ’ డైరెక్టర్ వెంకీ కుడుములకు టోకరా.. రెండు ఉదంతాల్లో రూ.73 లక్షల మోసం -
రెండు ఉదంతాల్లో రూ.73 లక్షల మోసం
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ట్రేడింగ్ చేసే వ్యక్తితో పాటు అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ రూ.73 లక్షల మేర నష్టపోయారు. ఇన్వెస్టర్తో పాటు ఎన్ఆర్ఐ సోదరుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో వేర్వేరుగా ఫిర్యాదులు చేయడంతో రెండు కేసులు నమోదయ్యాయి. నగరానికి చెందిన ఓ మహిళ షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటారు. ఈమె వివరాలు తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు కొన్నాళ్ల క్రితం ఫోన్ చేశారు. ఓ మహిళ మాట్లాడుతూ తాను ట్రేడింగ్ వ్యాపారం చేసే ఓ సంస్థ తరఫున మాట్లాడుతున్నానంటూ మాట్లాడింది. ఏ రంగాల్లో, ఎలా ట్రేడింగ్ చేస్తే భారీ లాభాలు వస్తాయో తమకు తెలుసంటూ నమ్మబలికింది. దీనికి రెండుమూడు ఉదాహరణలు చెప్పి మరీ పూర్తిగా బుట్టలో వేసుకుంది. ఆపై ట్రేడింగ్లో అంటూ రూ.5 లక్షలను తమ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. కొన్ని రోజుల పాటు అందులో, ఇందులో ట్రేడింగ్ చేస్తున్నామని, భారీ లాభాలు వచ్చాయంటూ మాటలు చెప్పింది. ఓ రోజు కాల్ చేసిన ఆ కీలేడీ’ తమ వద్ద ఉన్న ట్రేడింగ్ ఖాతాలో ఉన్న మొత్తం రూ. 4 కోట్లకు చేరిందని చెప్పింది. అది మీకు బదిలీ చేయాలంటే కంపెనీ నిబంధనల ప్రకారం ముందుగా తమకు రావాల్సిన బ్రోకరేజ్ చెల్లించాలని షరతు పెట్టింది. ఈ పేరుతో దాదాపు రూ. 60 లక్షలు బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకుని మోసం చేసింది. ఈ మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అమెరికాలో నివసిస్తున్న పాతబస్తీకి చెందిన ఓ మహిళ పేరుతో దుండగులు ఐదు క్రెడిట్ కార్డులు తీసుకున్నారు. వీటి ద్వారా జరిపిన రూ.13 లక్షల లావాదేవీల బిల్లులు ఇక్కడుంటున్న ఆమె సోదరుడికి వచ్చా యి. పూర్వాపరాలు పరిశీలించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ప్రవాస భారతీయురాలైన ఆ మహిళ సోదరుడు, కుమార్తె పాతబస్తీలో నివసిస్తున్నారు. కొన్నేళ్లగా అమెరికాలోనే ఉండిపోయిన ఆమె పేరుతో ఇక్కడి యాక్సస్, ఐసీఐసీఐ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల నుంచి ఐదు క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి. ఈ కార్డులు, ఓటీపీలు పంపే కవర్లు నేరుగా నేరగాళ్లకే డెలివరీ అయ్యాయి. రూ.13 లక్షలకు సంబంధించిన బిల్లులు మాత్రం ఆమె సోదరుడి చిరునామాకి చేరాయి. దీంతో తన సోదరిని సంప్రదించిన ఆయన ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తెలుసుకున్నారు. దీంతో సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
ఘోర రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ముల మృతి
సాక్షి, షాద్నగర్ : సరదాగా గడిపేందుకు చేపల వేటకు బయలుదేరారు. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు సొంత అన్నదమ్ములు.. మరో వ్యక్తి స్నేహితుడు. వీరంతా హైదరాబాద్ రహమత్నగర్ హబీబ్ ఫాతీమానగర్ ఫేజ్–1 బస్తీవాసులు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ బోరబండకు చెందిన సొంత అన్నదమ్ములు జీషాన్(24), హన్నన్(22). వీరి స్నేహితులైన మలక్పేటకు చెందిన సయ్యద్ ఉబేర్(20), బంజారాహిల్స్ నివాసి హరీస్(21) ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. సెలవు రోజు సరదాగా గడపాలనుకున్నారు. తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ కర్నూలు సమీపంలోని తమ బంధువుల ఫాంహౌస్ దగ్గర చేపల వేట కోసం స్విఫ్ట్ కారులో బయలుదేరారు. షాద్నగర్ సమీపంలోని అనూస్ పరిశ్రమ ఎదురుగా జాతీయ రహదారిపై వీరి కారు అదుపు తప్పి డివైడర్ను ఎక్కి అవతలి వైపు బెంగళూరు వైపు నుంచి కారు విడిభాగాల లోడుతో నగరానికి వెళ్తున్న కంటైనర్ను ఢీకొంది. ప్రమాదంలో అన్నదమ్ములైన జీషాన్, హన్నన్తోపాటు సయ్యద్ ఉబేర్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన హరీస్ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు షాద్నగర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతులు అవివాహితులని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రూ.48 లక్షల ‘చమురు’ వదిలింది!
సాక్షి, హైదరాబాద్: విదేశాలకు ప్రత్యేకమైన ఆయిల్ ఎగుమతి చేస్తే భారీ లాభాలు వస్తాయంటూ నగర యువతికి ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.48 లక్షలు స్వాహా చేశారు. ఎట్టకేలకు మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వెస్ట్జోన్ పరిధిలోని సంజీవ్రెడ్డినగర్కు చెందిన యువతి అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి, ప్రస్తుతం గానుగ నూనె వ్యాపారం చేస్తోంది. తన విక్రయాలకు సంబంధించి ఆమె ఇండియన్ మార్ట్ వెబ్సైట్లో ప్రకటన పోస్టు చేశారు. దీనిని చూసి ఆమెకు ఫోన్ చేసిన సైబర్ నేరగాడు ఘనా దేశంలోని వెస్ట్ ఇన్విస్ట్ అనే కంపెనీలో పని చేస్తున్న జాన్సన్గా పరిచయం చేసుకున్నాడు. తమ సంస్థ నిత్యం భారత్ నుంచి భారీగా ప్రత్యేకమైన ఆయిల్స్ ఖరీదు చేస్తుందని, దాని వివరాలు తెలిసినా పెట్టుబడిలేక తానేం చేయలేకపోతున్నానని చెప్పాడు. ‘విగా గార్లిక్ లిక్విడ్’గా పిలిచే ఆ ఆయిల్ను ఢిల్లీలో తయారు చేస్తున్నారని నమ్మించాడు. వారి వద్ద ఖరీదు చేసి తమ కంపెనీకి విక్రయిస్తే భారీ లాభాలు వస్తాయని చెప్పాడు. సదరు ఢిల్లీ కంపెనీ వారికి మీ నంబర్ ఇచ్చానని, వారే సంప్రదిస్తారంటూ యువతికి చెప్పాడు. ఆ మరుసటి రోజు ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నానంటూ పరిచయం చేసుకున్న విజయ అనే మహిళ కాల్ చేసింది. ‘జాన్సన్ మీ వివరాలు పంపించాడంటూ చెప్పి తమ వద్ద విగా గార్లిక్ అయిల్ లీటర్ 6 వేల డాలర్ల (రూ.4.34 లక్షలు) రేటు ఉందని, సగం అడ్వాన్సుగా చెల్లించాలని చెప్పింది’. తొలుత రూ.4.5 లక్షలు చెల్లించిన బాధితురాలు ఓ లీటర్ ఖరీదు చేసింది. దానిని కొరియర్ ద్వారా అందుకున్న ఆమె పరీక్షలు చేయించాలంటూ జాన్సన్ చెప్పడంతో అతడు సూచించినట్లే ఢిల్లీ వెళ్లి కోపి అనే నైజీరియన్ను కలిసింది. అయితే పరీక్షలు నిర్వహించడానికి కనిష్టంగా 10 లీటర్లు ఉండాలంటూ అతడు నమ్మబలికాడు. దీంతో మరికొంత మొత్తం చెల్లించిన బాధితురాలు పది లీటర్ల ఆయిల్ ఖరీదు చేసింది. దీనిని పరీక్షించడానికి ఒడిశాకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పిన నేరగాళ్లు మరికొంత మొత్తం వసూలు చేశారు. ఇలా దఫదఫాల్లో రూ.48 లక్షలు చెల్లించిన, జీఎస్టీ తదితర బిల్లులు సైతం తీసుకున్న బాధితురాలికి అనుమా నం వచ్చింది. తన అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు ఒడిశా వెళ్లి ఆరా తీయగా మోసంగా తేలింది. అంతా ఓ ముఠాగా ఏర్పడి తన ను మోసం చేశారని గుర్తించిన ఆమె సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ బి.రమేష్ దర్యాప్తు ప్రారంభించారు. -
విషాదం: కాసేపట్లో ఇంటికి చేరతామనగా
సాక్షి, అల్వాల్: మద్యం మత్తులో ఉన్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం పొట్ట కూటి కోసం పరాయి దేశం నుంచి వచ్చిన భార్యాభర్తల ఉసురుతీసింది. రోజంతా శ్రమించిన ఆ జంట రెండు నిమిషాల్లో ఇంటికి చేరతామనగా అర్ధంతరంగా తనువు చాలించింది. హృదయ విదారకమైన ఈ ఘటన ఆదివారం రాత్రి అల్వాల్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నేపాల్లోని డాంగ్ జిల్లా పప్పారి గ్రామానికి చెందిన రూమ్లాల్ బండారి (40) మీనాదేవి బండారి (35) ఏడేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. వీరి బంధువు బలరామ్ సునార్ సైతం వీరితో కలిసే ఉంటున్నాడు. అల్వాల్ ప్రాంతంలోని దేవుని అల్వాల్ శివాలయం రోడ్డులో స్థిరపడిన ఈ ముగ్గురూ స్థానికంగా పాస్ట్ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. గత ఏడాది లాక్డౌన్లో వీరి వ్యాపారం మూతపడగా.. కొన్ని నెలలు స్వదేశానికి వెళ్లిపోయారు. ఇటీవలే తమ ఇద్దరు పిల్లల్ని తన తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టిన రూమ్లాల్ భార్య, బంధువుతో కలిసి తిరిగి అల్వాల్ వచ్చాడు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తన వ్యాపారం ముగించుకున్న ముగ్గురూ నడుచుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. దేవుని అల్వాల్ శివాలయం రోడ్డు మూల మలుపు వద్దకు వచ్చిన వీరిని వెనక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ అదుపు తప్పి వీరిపైకి దూసుకొచ్చింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కాస్త దూరంగా ఉన్న వీరి బంధువు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరతారనగా ప్రమాదం బారినడపటం, స్వదేశంలోని వీరి పిల్లలు అనాథలు కావడంతో ఇక్కడి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ టిప్పర్ను నిర్లక్ష్యంగా నడిపాడని, మలుపు వద్ద ఎదురుగా వచ్చిన ప్యాసింజర్ ఆటోను తప్పించే ప్రయత్నం చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే సడన్ బ్రేక్ వేయడం, లారీలో సగం మొరం లోడు ఉండటంతో అదుపుతప్పి ఎడమ వైపునకు పడిపోయిందని వివరిస్తున్నారు. ఫలితంగా రోడ్డు పక్కగా నడిచి వెళ్తున్న భార్యాభర్తలు మృత్యువాతపడ్డారని పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు ఈసీఐఎల్లోని అశోక్నగర్కు చెందిన టిప్పర్ డ్రైవర్ కె.నర్సింహ్మను (59) అదుపులోకి తీసుకున్నారు. ఇతడికి డ్రంక్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించగా బీఏసీ కౌంట్ 165గా వచ్చింది. వయోభారంతో ఉన్న ఇతడి డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను ఆరా తీయాలని అధికారులు నిర్ణయించారు. నర్సింహ్మను అరెస్టు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తుపాకీ గురిపెట్టి.. కత్తితో బెదిరించి స్మార్ట్ఫోన్ల స్క్రీన్లపై ఎక్కువ సేపు కరోనా! -
రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి
సాక్షి, మూసాపేట (హైదరాబాద్): రోడ్డు ప్రమాదంలో దంత విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేపీహెచ్బీ పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని గుల్బర్గలో కడపకు చెందిన రేష్మ (20) దంత కళాశాలలో చదువుతోంది. కుటుంబసభ్యులు కాశీ యాత్రకు వెళుతుండటంతో కడపకు బయలుదేరింది. మధ్యలో కేపీహెచ్బీ కాలనీ అడ్డగుట్ట కాలనీలోని ఉమెన్స్ హాస్టల్స్లో ఉన్న శ్రీజను కలవడానికి శుక్రవారం వచ్చింది. శనివారం రాత్రి శ్రీజ, మమత, అజయ్సింగ్, శ్రావణ్కుమార్లతో కలిసి మదీనాగూడలో ఉన్న జీఎస్ఎం మాల్లో సినిమా చూడటానికి వెళ్లింది. రాత్రి సినిమా ముగిసిన తరువాత రేష్మ స్కూటీపై కేపీహెచ్బీకాలనీకి వస్తున్నారు. కేపీహెచ్బీకాలనీకి వస్తుండగా మధ్యలో మెట్రో పిల్లర్ 660, 661 వద్ద పక్క నుంచి ఇంకో వాహనం వేగంగా వెళ్లింది. దీంతో రేష్మా అదుపు తప్పి కిందపడిపోయింది. వెనకే వస్తున్న లారీ ముందు టైరు ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే ఆమె మృతి చెందింది. లారీ డ్రైవర్ కృష్ణ అక్కడే లారీని వదిలేసి పారిపోయాయడు. స్కూటీ ఇచ్చినందుకు అజయ్కుమార్, లారీ డ్రైవర్ కృష్ణ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: దారుణం: యువతికి మద్యం తాగించి గ్యాంగ్ రేప్) (అధికారుల చేతివాటం.. ఓ మహిళా రైతు రూపంలో.. ) -
డబ్బు వివాదం: కుటుంబంతో కలిసి భర్త హత్య
సాక్షి, జిన్నారం(పటాన్చెరు): డబ్బుల విషయంలో వివాదంతో అయినవారే అంతమొందించిన సంఘటన బొల్లారం మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి ముళ్లపొదల్లో పడేసి కాల్చేసిన కేసును పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించడం విశేషం. వివరాలను డీఎస్పీ భీంరెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని బాలాజీనగర్లో నివసిస్తున్న విజయ్సింగ్ (42), మల్లీశ్వరి దంపతులు. 16 ఏళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. వీరికి 14ఏళ్ల కుమార్తె ఉంది. విజయ్సింగ్ తన కుమార్తె పేరుపై రూ.లక్షను బ్యాంక్లో ఫిక్స్డ్ చేశాడు. నామినీగా మల్లీశ్వరిని ఉంచాడు. నెల రోజుల క్రితం భర్తకు తెలియకుండా మల్లీశ్వరి బ్యాంక్లో ఉన్న రూ.లక్షను తెచ్చి తన తమ్ముడైన మంద కృష్ణకు అప్పుగా ఇచ్చింది. కొద్దిరోజుల తర్వాత విషయం విజయ్సింగ్కు తెలిసింది. తనకు తెలియకుండా డబ్బులు ఎందుకు ఇచ్చావని నిలదీయడంతో భార్యాభర్తల మధ్య వివాదం మొదలైంది. అప్పుగా తీసుకున్న డబ్బును త్వరగా తిరిగిచ్చేయాలని మంద కృష్ణపై విజయ్సింగ్ ఒత్తిడి పెంచాడు. డబ్బు తిరిగిచ్చే పరిస్థితి లేకపోవటంతో మందకృష్ణ అక్క మల్లీశ్వరితో కలిసి విజయ్సింగ్ను హత్య చేయాలని పన్నాగం పన్నాడు. తనను కూడా ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నాడని మల్లీశ్వరి, చెల్లెలు తలారి పద్మ, తల్లి మంద లక్ష్మితో కలిసి పథకం వేశారు. ఆదివారం రాత్రి విజయ్సింగ్కు ఎక్కువగా మద్యం తాగించారు. మత్తులోకి వెళ్లిన తర్వాత నలుగురూ కలిసి గొంతు నులిమి హత్య చేశారు. రాత్రి 12 గంటల తర్వాత హృతదేహాన్ని సైకిల్పై తీసుకెళ్లి ఓఆర్ఆర్ సర్వీస్రోడ్డు సమీపంలోని ఓ ముళ్ల పొదలో పడేసి తగులబెట్టారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి విచారణ సాగించగా వారు నేరం అంగీకరించారు. ఈ మేరకు నలుగురినీ రిమాండ్కు తరలించారు. హత్య ఉదంతం వెలుగు చేసిన కొద్ది గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ భీంరెడ్డి అభినందించారు. విలేరుల సమావేశంలో సీఐ ప్రశాంత్, ఎస్ఐలు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. -
అమ్మాయిగా ఫేక్ ప్రోఫైల్: సుమంత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అమ్మాయిలను లోబరుచుకునేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్న సుమంత్ను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... నకిలీ ఇన్స్ట్రాగ్రామ్ ప్రోఫైల్తో అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న సుమంత్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడు సుమంత్ విజయవాడకు చెందిన వాడని, హైదరాబాద్లోని మణికొండలో ఉంటూ అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పారు. రాత్రి అయ్యిందంటే ఇన్స్ట్రాగ్రామ్లో అమ్మాయిలా మారిపోయి మిగతా అమ్మాయిలతో చాటింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నాడని, ఇంటర్నెట్ నుంచి యువతుల ఫొటోలు డౌన్లోడ్ చేసుకుని వాటితో నకిలీ ప్రోఫైల్ క్రియోట్ చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: లైంగిక వేధింపులు: అతడు ఆమెగా..) ఇలా అమ్మాయి మాదిరిగా వాళ్లతో చాటింగ్ చేయడంతో అవతల వాళ్లు కూడా అమ్మాయి అనుకొని క్లోజ్గా మాట్లాడేవారన్నారు. ఈ క్రమంలో వారంతా తమ బలహినతలను నిందితుడితో చెప్పుకోవడం చేశారని, అది ఆయుధం చేసుకున్న నిందితుడు వారిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించేవాడన్నారు. అమ్మాయిల అశ్లీల ఫొటోలను నెట్నుంచి డౌన్లోడ్ చేసి అవి వారికి పంపించి బ్లాక్మెయిల్ చేస్తూ నిందితుడు సుమంత్ కామావాంఛలు తీర్చుకునేవాడని తెలిపారు. కాగా ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు అధికం అవుతున్నాయని, ఇలాంటి వారిని గుర్తించడం కష్టం అన్నారు. యువత అపరిచితులతో చాటింగ్ చేయకూడదని, చాలా జాగ్రత్తలు పాటించడం మంచిదని ఏసీపీ హెచ్చారించారు. -
మెయిల్ ఓపెన్ చేస్తే జేమ్స్ అధీనంలోకి వెళ్లడమే!
సాక్షి, గచ్చిబౌలి: నైజీరియాలో సూత్రధారి..ముంబైలోని మీరా రోడ్, పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన పాత్రధారులు కలిసి 2011 నుంచి దేశ వ్యాప్తంగా సిమ్ స్వాపింగ్ నేరాలకు పాల్పడుతున్నారు. దాదాపు అన్ని మెట్రో నగరాల్లోనూ పంజా విసిరిన ఈ ముఠాకు చెందిన ఐదుగురు నిందితుల్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. తమ పరిధిలో నమోదైన రెండు నేరాల్లో ఈ గ్యాంగ్ రూ.11 లక్షలు స్వాహా చేసినట్లు పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. వీరి నుంచి 40 నకిలీ ఆధార్ కార్డులు, రబ్బరు స్టాంపులు, సీళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సజ్జనార్ పూర్తి వివరాలు వెల్లడించారు. ⇔ ముంబయ్లోని మీరా రోడ్కు చెందిన అశి్వన్ నారాయణ్ షరేగర్ అక్కడ ఓ డాన్సింగ్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతగాడికి అనేక మంది నైజీరియన్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. వీళ్ళల్లో నేరాలు చేసే వారికి సహకరించడానికి మీరా రోడ్ వాసులు పరిచయం చేస్తుండేవాడు. ⇔ ఒకప్పుడు ముంబైలో ఉండి, ఇప్పుడు నైజీరియాలో ఉంటున్న జేమ్స్ను మీరా రోడ్కు చెందిన చంద్రకాంత్ సిద్ధాంత్ కాంబ్లేతో పరిచయం చేశాడు. వీరిద్దరితో పాటు జమీర్ అహ్మద్ మునీర్ సయీద్, షోయబ్ షేక్, ఆదిల్ హసన్ అలీ సయీద్, జునైద్ అహ్మద్ షేక్లతో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. ఇలానే పశి్చమ బెంగాల్లోనూ ఓ ముఠా పని చేస్తోంది. ⇔ జేమ్స్ అక్కడ ఉంటూనే దేశంలోని వివిధ నగరాలకు చెందిన సంస్థల ఈ-మెయిల్ ఐడీలను ఇంటర్నెట్ నుంచి సంగ్రహిస్తాడు. వాటిని ఐటీ రిటన్స్ పేరుతో ఫిషింగ్ మెయిల్స్ పంపుతాడు. వీటిని అందుకునే సంస్థలు తెరిచిన వెంటనే మాల్వేర్ వాళ్ళ కంప్యూటర్/ఫోన్లోకి ప్రవేశిస్తుంది. దీంతో అది పరోక్షంగా జేమ్స్ ఆదీనంలోకి వెళ్ళిపోతుంది. ⇔ ఆపై వాటిలో ఉన్న ఈ–మెయిల్స్ తదితరాల్లో వెతకడం ద్వారా వారి అధికారిక సెల్ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్, బ్యాంకు లావాదేవీలను తెలుసుకుంటారు. ఈ వివరాలను అతడు వాట్సాప్ ద్వారా చంద్రకాంత్కు పంపిస్తాడు. వీటి ఆధారంగా ఇతగాడు తనకు ఆయా సర్వీస్ ప్రొవైడర్ కార్యాలయాల్లో ఉన్న పరిచయాలను వినియోగించి ఆ బ్యాంకు ఖాతాలతో లింకై ఉన్న ఫోన్ ⇔ ఈ వివరాలను వినియోగించే చంద్రకాంత్ నకిలీ ఆధార్ వంటి గుర్తింపుకార్డులు తయారు చేస్తాడు. ఈ గుర్తింపు కార్డులపై పేర్లు అసలు యజమానివే ఉన్నప్పటికీ... ఫొటోలు మాత్రం జమీర్ లేదా ఆదిల్వి ఉంటాయి. వీటితో పాటు ఆయా సంస్థల పేరుతో నకిలీ లెటర్ హెడ్స్, స్టాంపులు, సీళ్ళు కూడా చంద్రకాంత్ రూపొందిస్తాడు. వీటిని ఒకప్పుడు జమీర్కు ఇచ్చి సరీ్వస్ ప్రొవైడర్లకు చెందిన స్టోర్స్కు పంపేవాడు. ⇔ గతంలో కోల్కతా ముఠాతో పాటు అతడు అరెస్టు కావడంతో ఇప్పుడు ఆ బాధ్యతల్ని జునైద్, ఆదిల్ నిర్వర్తిస్తున్నాడు. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్టోర్స్కు తిరిగే వీళ్ళు ఎక్కడో ఒక చోట నుంచి సిమ్కార్డు తీసుకుంటారు. తమ చేతికి చిక్కిన సిమ్ను చంద్రకాంత్కు అప్పగిస్తారు. ఇతడు ఈ వివరాలను జేమ్స్ వాట్సాప్ ద్వారా చేరవేస్తాడు. మరోపక్క షోయబ్ షేకర్, అష్విన్లు బోగస్ పేర్లు, వివరాలతో భారీగా బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. వీటి వివరాలనూ చంద్రకాంత్ ద్వారా జేమ్స్కు పంపిస్తారు. ⇔ తన వద్ద ఉన్న నకిలీ సిమ్కార్డుల్ని చంద్రకాంత్ తక్కువ రేటుతో కొనుగోలు చేసే ఫోన్లలో వేసుకుంటాడు. ఈ తతంగం మొత్తం అంతర్జాతీయ ముఠా కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే చేస్తోంది. ఆ రోజుల్లో రాత్రి పూట జేమ్స్ ఆ ఫోన్ నెంబర్లతో లింకై ఉన్న బ్యాంకు ఖాతాల ఇంటర్నెట్ బ్యాకింగ్లోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఖాతా నెంబర్ తదితర వివరాలతో పాటు ఫోన్ నెంబర్ తన వద్ద... సిమ్ కార్డు చంద్రకాంత్ ఫోన్లో సిద్ధంగా ఉంటుంది. నెట్ బ్యాంకింగ్లో పాస్వర్డ్ మార్చి.. ⇔ నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి జేమ్స్ దాని పాస్వర్డ్ మార్చేస్తాడు. అందుకు అవసరమైన పిన్ను తన వద్ద ఉన్న ఫోన్ నెంబర్కు అందుకునే చంద్రకాంత్ తక్షణం వాట్సాప్ ద్వారా జేమ్స్కు చేరవేస్తాడు. ఇలా పాస్వర్డ్ మార్చే అతగాడు ఆ బ్యాంకు ఖాతాను యాక్సస్ చేస్తూ అందులో ఉన్న మొత్తాన్ని రెండుమూడు దఫాల్లో చంద్రకాంత్ అందించే నకిలీ ఖాతాల్లోకి జమ చేస్తాడు. తాము తెరిచిన నకిలీ ఖాతాల్లోకి వచ్చే ఈ మొత్తాలను అషి్వన్, షోయబ్ డ్రా చేసి చంద్రకాంత్కు ఇస్తారు. ⇔ వీళ్ళు, చంద్రకాంత్ 50 శాతం కమీషన్లు తీసుకుంటూ మిగిలిన మొత్తాన్ని హవాలా లేదా బిట్కాయిన్ల ద్వారా జేమ్స్కు పంపింస్తాడు. ఈ అంతర్జాతీయ గ్యాంగ్ గత ఏడాది జూన్, అక్టోబర్ల్లో సైబరాబాద్ పరిధిలో ఉండే రెండు కంపెనీలకు చెందిన ఖాతాలను టార్గెట్ చేశారు. వాటి నుంచి రూ.11 లక్షలు ఇమ్మీడియట్ మొబైల్ పేమెంట్ సరీ్వసెస్ (ఐఎంపీఎస్) ద్వారా నకిలీ బ్యాంకు ఖాతాల్లోకి మార్చి స్వాహా చేశారు. ⇔ దాదాపు ఆరు నెలల పాటు ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలుమార్లు ముంబై వెళ్ళివచ్చారు. ఎట్టకేలకు జేమ్స్, షోయబ్ మినహా మిగిలిన వారిని అరెస్టు చేశారు. -
బంజారాహిల్స్లో దారుణం.. కూతుళ్లపై కన్న తండ్రే
సాక్షి, బంజారాహిల్స్: కన్నతండ్రి కూతురిపాలిట కామాంధుడయ్యాడు. మూడేళ్లుగా ఆమెపై లైంగికదాడికి పాల్పడుతూ ఎవరికైనా ఫిర్యాదు చేస్తే చంపేస్తానంటూ బెదిరించసాగాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరి బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12లోని బోలానగర్ ఫస్ట్లాన్సర్లో నివసించే విద్యార్థిని(18)పై ఆమె తండ్రి(42) గత కొంతకాలంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు గత డిసెంబర్ 29న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు గాలింపు చేపట్టి ఆమెను జనవరి 5న ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయావని సోదరి నిలదీయడంతో మహ్మద్ కరీం అనే వ్యక్తి తనను తీసుకెళ్లాడని.. రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పింది. అంతేగాక తండ్రి కూడా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. మూడేళ్లుగా తన సోదరిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, తనపై కూడా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఇద్దరం తండ్రి బాధితులమేనని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వివాహేతర సంబంధం: భర్త దారుణ హత్య
సాక్షి, పంజగుట్ట: ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపేసింది. సోమవారం పంజగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. బిహార్కు చెందిన లక్ష్మణ్ ఝా, ఖుష్బూ దంపతులు మక్తా, రాజ్నగర్లో నివాసముంటున్నారు. రాత్రి వేళ సెక్యూరిటీ గార్డుగా, పగలు జ్యూస్షాపు నడుపుతూ లక్ష్మణ్ జీవనం సాగిస్తున్నాడు. దీంతో న్యూరాలజీ సమస్య వచ్చింది. ఇతని జ్యూస్ సెంటర్ వద్ద లక్ష్మణ్ దూరపు బంధువు లాల్బాబు పనిచేస్తుంటాడు. లక్ష్మణ్కు మధ్యాహ్నం టిఫిన్ ఇచ్చేందుకు ఖుష్బుదేవి వస్తుండేది. ఈ సమయంలో వారి మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. లాక్డౌన్ అనంతరం లాల్బాబు మరోచోట పనిచేయడం ప్రారంభించాడు. అయినా వీరి మధ్య బంధం కొనసాగింది. దీంతో లక్ష్మణ్ను అడ్డుతొలగించుకోవాలని భావించారు. ఈ నెల 14న రాత్రి లక్ష్మణ్ పడుకున్నాక లాల్బాబు ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి లక్ష్మణ్ చేతులు కట్టేశారు. ఖుష్బుదేవి లక్ష్మణ్ ఛాతీపై కూర్చుని చున్నీ మెడకు బిగించి ఇద్దరూ కలిసి గట్టిగా నొక్కి చంపేశారు. ఉదయం లక్ష్మణ్ సోదరుడికి ఖుష్చుదేవి ఫోన్ చేసి నిద్రలోనే చనిపోయాడని చెప్పింది. మెడపై గాట్లు చూసి అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం ఇద్దరినీ రిమాండ్కు తరలించారు. -
నిమ్స్లో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, పంజగుట్ట: అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి నిమ్స్ ఆవరణలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నిమ్స్ ఆసుపత్రి మిలీనియం బ్లాక్ వెనకభాగంలో పార్కింగ్ వద్ద ఉన్న చెట్టుకు సోమవారం ఉదయం ఓ వ్యక్తి లుంగీతో ఉరివేసుకొని వేలాడుతుండటం స్థానికులు గుర్తించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పంజగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. ఆధారాలకోసం చూస్తే ఎలాంటి గుర్తింపు కార్డులు కనిపించలేదు. అతని వయస్సు సుమారు (45) ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చదవండి: పెళ్లి కావడం లేదని.. మాట్లాడితే మర్డరే ! సాక్షి, సిటీబ్యూరో: సిటీతో పాటు శివార్లలో వరుసగా దారుణాలు వెలుగు చూస్తున్నాయి. పూటకోచోట విచ్చుకత్తుల వేట చోటు చేసుకుంటుండటంతో అంతా ఉలిక్కిపడుతున్నారు. గడిచిన ఎనిమిది రోజుల్లో ఎనిమిది హత్యలు జరగడంతోపాటు కొన్ని వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల పాటు ఒకే రోజు రెండేసి చొప్పున బయటపడ్డాయి. తాజాగా ఆదివారం రాజేంద్రనగర్లో రెండు దారుణ హత్యలు బయటపడ్డాయి. కొన్ని కేసుల్లో నిందితులు చిక్కగా... మరికొన్నింటిలో గుర్తించాల్సి ఉంది. చదవండి: విద్యార్థినిపై మాజీ ఎమ్మెల్యే లైంగిక దాడి! తిన్న వాటికి డబ్బు అడిగినందుకు.. షాకబ్ అలీ కేపీహెచ్బీ ప్రాంతంలో తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తుంటాడు. ఈ నెల 4న ఇద్దరు వ్యక్తులు ద్రాక్షలు తిని, పైనాపిల్ కొన్నారు. కొన్న దానికే డబ్బు ఇచ్చి వెళ్ళిపోతుండగా... తిన్న వాటికీ డబ్బు అడిగాడు. దీంతో ఇద్దరూ కలిసి అతడిపై దాడి చేయడంతో చనిపోయాడు. అదే రోజు కూకట్పల్లిలోని చెరువులో పూల వ్యాపారి కృష్ణ మృతదేహం లభించింది. ఎక్కడో చంపేసిన దుండగులు గోనె సంచిలో కట్టి తీసుకువచ్చి చెరువులో పడేశారు. మద్యం మానమన్నందుకు... కేపీహెచ్బీ పోలీసుస్టేషన్ పరిధిలో స్రవంతితో వెంకటేశ్వర్లు ఏడాదిగా సహజీవనం చేస్తున్నాడు. ఈమెను ఐదున హత్య చేసిన వెంకటేశ్వర్లు డబ్బాలో పార్సిల్ చేసి మృతదేహం మాయం చేయాలని భావించాడు. అది సాధ్యం కాకపోవడంతో తన సొంత ఇంటిలోనే మృతదేహాన్ని వదిలి పారిపోయాడు. మద్యం తాగవద్దని పదేపదే చెప్పడంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ నెల 5న ఈ దారుణం జరిగింది. తాగేందుకు డబ్బు ఇవ్వలేదని... ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే సంతోష్ మద్యానికి బానిస అయ్యాడు. తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కారణంగా ఈ నెల 9న తన తల్లి సంగీతను దారుణంగా చంపేశాడు. ఒకే రోజు మరో రెండు... ఆదివారం నగర శివార్లలో రెండు హత్యలు వెలుగు చూశాయి. డబ్బు కోసం బెదిరిస్తుండటం, ఒకరి సోదరికి వేధిస్తుండటంతో ఇద్దరు పాత నేరగాళ్ళు తమ స్నేహితుడు రియాజ్ను హత్య చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘాతుకంలో మృతదేహాన్ని సూట్కేసులో తెచ్చి రాజేంద్రనగర్ డెయిరీ ఫామ్ వద్ద పడేశారు. ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. రాత్రి 11.45 గంటలకు మరో ఘోరం చోటు చేసుకుంది. అప్పుగా తీసుకున్న రూ.11 లక్షలు, వడ్డీ కోసం ఒత్తిడి చేస్తూ, హోటల్ తన పేరుతో రాసి ఇవ్వమని డిమాండ్ చేస్తుండటంతో ఎంఐఎం నేత ఖలీల్ను హతమార్చారు. ఇతడి వద్ద అప్పుతీసుకున్న హోటల్ యజమాని, అతడి వద్ద పని చేసే ఇద్దరితో కలిసి హత్య చేశారు. జూబ్లీహిల్స్, మియాపూర్ పోలీసుస్టేషన్ల పరిధి నుంచి అదృశ్యమైన ఇద్దరు ఈ నెల 7న శవాలుగా తేలారు. జూబ్లీహిల్స్లో పని చేసే వెంకటమ్మ గత నెల 30న బయటకు వెళ్ళింది. ఈమె మృతదేహం ఘట్కేసర్లో కాలిన స్థితిలో కనిపించింది. జనప్రియ కాలనీ నుంచి ఏటీఎంకి అంటూ వెళ్ళిన రామకృష్ణ మృతదేహం ఖైత్లాపూర్ డంపింగ్ యార్డ్లో దొరికింది. దుండగులు ఒక చెవి, కుడి చేతి రెండు వేళ్ళు కోసేశారు. చట్టం కఠినంగా మారాలి.. అందరిలో మార్పు రావాలి వర్తమాన పరిస్థితులతో పాటు సినిమా ప్రభావంతో ఇటీవల కాలంలో యువతలో యాంటీ సోషల్ పర్సనాలిటీ పెరుగుతోంది. ఈ కారణంగానే చిన్న కారణాలకు చంపేసే వరకు వెళ్తున్నారు. మరోపక్క మద్యానికి బానిసైన వాళ్ళు ఆ మత్తు కోసమూ ఘాతుకాలు చేస్తున్నారు. మత్తు, ఆస్తి కోసమూ అనుమానంతోనో తమ వాళ్ళనే అంతం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా జరిగే ఘర్షణల్లో ఎదుటి వారు చనిపోతుండటంతో అవి సాంకేతిక హత్యలుగా మారుతున్నాయి. చట్టం మరింత కఠినంగా మారడంతో పాటు ప్రతి ఒక్కరిలోనూ మార్పు వస్తేనే ఈ పరిస్థితులు మారేది. – డాక్టర్ రాజశేఖర్, మానసిక నిపుణులు -
సోఫియాను అంటూ హైదరాబాద్ వ్యక్తికి కాల్..
సాక్షి, హైదరాబాద్: గిఫ్ట్ల పేరుతో అమాయకులకు గాలం వేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం నేరేడ్మెట్లోని రాచకొండ సీపీ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. నైజీరియా, ఘనా తదితర దేశాలకు చెందిన ఎక్పాల్గడ్స్టీమ్, అడ్జల్, కిక్కి కాన్ఫిడెన్స్ దావిద్, పి. క్రోమవోయిబో, ఎజిటర్ డానియల్ కొంత కాలంగా విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చారు. ఢిల్లీలో మకాం వేసిన వీరు ‘డింగ్ టోన్’ యాప్ ద్వారా అబ్బాయిలతో అమ్మాయిలాగా, అమ్మాయితో అబ్బాయిలాగా చాటింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్కు చెందిన యువకుడికి సోఫియా అమ్మాయి పేరుతో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మీ కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్నామని మెసేజ్ పంపారు. ముంబై ఎయిర్పోర్ట్లో లాండ్ అయ్యానని, తన వద్ద 75 వేల విదేశీ కరెన్సీ, గోల్డ్ చైన్, మొబైల్ ఫోన్లు తదితర విలువైన వస్తువులు ఉన్నాయని, వాటికి సంబందించి కస్టమ్స్ ట్యాక్స్ కట్టాలని చెబుతూ బాధితుడితో డబ్బులు డిపాజిట్ చేయించుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకుని మల్కాజిగిరి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినట్లు సీపీ తెలిపారు. నిందితుల ఆటకట్టించిన రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీ యాదగిరి, అడిషనల్ క్రైమ్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ హరినాథ్లను సీపీ అభినందించారు. -
కిలాడి లేడీ అరెస్ట్: రూ 8 కోట్లకు టోకరా
సాక్షి, పంజగుట్ట: ఓ వ్యక్తిని సుమారు రూ.8 కోట్ల మేర మోసం చేసిన కేసులో మహిళను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్భవన్ రోడ్డులోని సేథీ టవర్స్కు చెందిన పి.విజయ్ ఎన్.రాజు ఇన్వెస్టర్. 2013లో అతని వద్దకు కూకట్పల్లి, వసంత్నగర్కు చెందిన శ్రీనివాస రాజు, కేపీహెచ్బీకి చెందిన సామల పద్మజ, ఆమె భర్త సామల నర్సిరెడ్డి, సోదరి విజయలక్ష్మి, సురేష్బాబులు వచ్చారు. పద్మజ తమకు గోపనపల్లిలోని సర్వేనెంబర్ 124/2 నుండి 124/5 వరకు 6.20 ఎకరాల స్థలం ఉందని, ఆ స్థలంలో విల్లాల నిర్మాణం చేపడతామని చెప్పారు. సదరు స్థలంపై బ్యాంకులో రుణం ఉందని, ఆ రుణం మీరు తీరిస్తే మీకు రెండున్నర ఎకరాల స్థలం ఇస్తామని చెప్పారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా కూడా రాసిచ్చారు. దీంతో బ్యాంకుకు సుమారు రూ.5 కోట్లు చెల్లించడమే కాకుండా, రూ.3 కోట్లు వారివద్ద ఇన్వెస్ట్ చేశాడు. వారు బ్యాంకు నుంచి కాగితాలు తీసుకున్నారు. ఆ స్థలంలో విల్లాల నిర్మా ణం చేయకపోగా ఇస్తామన్న రెండున్నర ఎకరాలు కూడా ఇవ్వకుండా మోసం చేశా రు. ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో మోసపోయానని గుర్తించి పంజగు ట్ట పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు సామల పద్మజ మిగిలిన వారిపై కేసు నమోదు చేశారు. గోవాలో ఉన్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని గోవాకు పంపి సామల పద్మజను అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
లోన్ యాప్.. కటకటాల్లోకి బెంగళూరు కీర్తి
సాక్షి, బెంగళూరు: అక్రమ మైక్రో ఫైనాన్సింగ్కు పాల్పడిన లోన్ యాప్స్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో యువతిని అరెస్టు చేశారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ఎన్యూ టెక్నాలజీస్ సంస్థ హెచ్ ఆర్ విభాగం మేనేజర్ కీర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈ సంస్థకు హెడ్గా వ్యవహరించిన సూత్రధారి నాగరాజు సోదరుడు ఈశ్వర్ను గత వారమే అరెస్టు చేశారు. అప్పటినుంచి పరారీలో ఉన్న కీర్తి కోసం గాలించిన ప్రత్యేక బృందం ఆదివారం పట్టుకోగలిగింది. ఈ ద్ఙారుణ’ యాప్స్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన, ఇండోనేషియా కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన చైనీయురాలు యాన్ యాన్ అలియాస్ జెన్నీఫర్తో ఈమె నేరుగా సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. ఆమెతో వాట్సాప్ ద్వారా తరచు సంప్రదింపులు జరిపినట్లు పేర్కొంటున్నారు. (చదవండి: లోన్ యాప్.. కటకటాల్లోకి చైనీయులు) లోన్ యాప్స్ వేధింపులకు సంబంధించి సిటీలో ఇప్పటి వరకు 28 కేసులు నమోదు కాగా... చైనీయుడితో సహా 17 మందిని అరెస్టు చేశారు. 27 బ్యాంకు ఖాతాలతో సహా వర్చువల్ ఖాతాల్లో ఉన్న రూ.100 కోట్లకు పైగా మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. ఈ లోన్ యాప్స్కు ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరుల్లో ఉన్న మరికొన్ని కంపెనీలతోనూ లింకులు ఉన్నట్లు గుర్తించారు. వాటి వ్యవహారాలను దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. వీటి ఏర్పాటులో కీలకమైన చైనీయులు వివిధ నగరాల్లో ట్రాన్స్లేటర్లను ఏర్పాటు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లు, బ్యాంకు ఖాతాల తెరవడం తదితర సందర్భాల్లో వీరి సేవల్ని వినియోగించుకున్నట్లు తెలిపారు. ఢిల్లీకి చెందిన ట్రాన్స్లేటర్ ఇంద్రజిత్ను గుర్తించిన పోలీసులు మిగిలిన ప్రాంతాల్లో ఉన్న వారి ఆచూకీ కనిపెట్టి వాంగ్మూలాలు నమోదు చేయాలని నిర్ణయించారు. వీరి ద్వారా చైనీయులు కార్యకలాపాలకు సంబంధించి కీలక సమాచారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. (చదవండి: ఇన్స్టంట్ లోన్స్తో ఈ అనర్థాలు తప్పవు) -
మలక్పేట్లో కారు బీభత్సం.. వృద్దుడిపై కేసు
సాక్షి, హైదరాబాద్: మలక్ పేట్ డీమార్ట్ ఎదురుగా కారు బీభత్సం సృష్టించింది. 72 ఏళ్ల వృద్ధుడు హోండా సిటీ కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ సమీపంలోని ఓ టీ కొట్టులోకి దూసుకెళ్లాడు. ఈ ఘటన మంగళవారం స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. దీంతో కారు డ్రైవింగ్ చేసిన వృద్ధుడు రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
బైక్ను ఢీకొట్టిన కారు; చితకబాదిన స్థానికులు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో గురువారం అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వైపు వస్తున్న కారు రహదారిపై ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా ప్రమాదానికి కారణం అయిన కారులోని వ్యక్తులను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. దాదాపు రాత్రి 12 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. చదవండి: కలెక్టర్ కారును ఢీ కొట్టిన లారీ -
ఇంటి దొంగలను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: అంతరాష్ట్ర ఇంటి దొంగలను శంషాబాద్ సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. లాక్డౌన్లో తరచూ దొంగతనాలకు పాల్పడిన పఠాన్ చాంద్ బాషా, సబేర్లను అనే ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని 20 లక్షల నగదను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరూ గుల్భార్గాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. లాక్డౌన్లో మార్చి నుంచి జూలై వరకు వీరిద్దరూ 15 నేరాలకు పైగా పాల్పడ్డారని, ఇది వరకే వీరిపై తెలంగాణలో 15 పైగా కేసులు ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నిందితులు దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు పేర్కొన్నారు. దొంగతనాలకు చాంద్ బాషా స్కేచ్ వేయగా.. దొంగలించిన సోత్తును సాబేర్ డిస్పోస్ చేసేవాడని విచారణలో నిందితులు పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో వారు తాండూరు వద్ద నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇక గుల్బర్గ హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఉండటంతో అక్కడి నుంచి ఇక్కడుకు వచ్చి దొంగతనాలకు పాల్పడేవారని, ఈ నేపథ్యంలో మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్లో తరచూ నిందితులు నేరాలకు పాల్పడినట్లు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు. -
ప్రభుత్వ ఉద్యోగ దంపతుల ఆత్మహత్య
సాక్షి, చిలకలగూడ : కుటుంబ సమస్యల కారణంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడగా, బెడ్రూంలో బలవన్మరణం పొందాడు. ఈ సంఘటన చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని బౌద్ధనగర్ డివిజన్ అంబర్నగర్లో గురువారం జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. సికింద్రాబాద్ అంబర్నగర్కు చెందిన తిరుమల వెంకటేష్ (30), దండె భార్గవి (24) భార్యాభర్తలు. 2015లో వీరికి వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె మోక్షశ్రీ, మూడు నెలల కుమారుడు అన్విక్లున్నారు. పుత్లిబౌలిలోని విద్యుత్ కార్యాలయంలో సబ్ ఇంజనీర్గా వెంకటేష్, కృష్ణజిల్లా జగ్గయ్యపేట పోస్ట్ఆఫీస్లో పోస్ట్ఉమెన్గా భార్గవి పనిచేస్తున్నారు. వెంకటేష్ తల్లి మృతి చెందడంతో తండ్రి బాలకృష్ణ మరో పెళ్లి చేసుకున్నాడు. బాలకృష్ణకు ఇద్దరు కుమార్తెలు, నలుగురు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు వెంకటేష్. తన భార్య పిల్లలతో కలిసి తండ్రి ఇంటి ఎదురుగానే మరో ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఇద్దరు నెలవారీ జీతాలను తనకే ఇవ్వాలని, కుటుంబ పోషణ భారమవుతుందని తండ్రి బాలకృష్ణ తరచూ గొడవపడేవాడు. గతనెల 31వ తేదిన వెంకటేష్ తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. తనకు ఇవ్వకుండా జల్సాలు చేస్తున్నాడని భావించిన తండ్రి డబ్బు కోసం మరింత ఒత్తిడి తెచ్చాడు. దీంతో భార్యభర్తలు తీవ్ర మానసిన వేదనకు గురయ్యారు. నేను నమ్మిన వాళ్లే నన్ను మోసం చేశారు. అమ్మా నన్ను క్షమించి, పిల్లలను బాగా చూసుకో అని భార్గవి సూసైడ్నోట్ రాసి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాత్రూంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య బలవన్మరణాన్ని చూసి తట్టుకోలేని వెంకటేష్ బెడ్రూం దూలానికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం మూడు నెలల బాబు గుక్కపట్టి ఏడుస్తున్నా ఇంటి లోపలి నుంచి ఎటువంటి అలికిడి లేకపోవడం, ఎంత కొట్టినా తలుపులు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో కిటికీ నుంచి లోపలకు వెల్లి చూడగా భార్యభర్తలు వేర్వేరుగా ఉరికి వేలాడుతు కనిపించారు. మృతుల కుటుంబసభ్యులు ఒకరినొకరు దూషించుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గోపాలపురం ఏసీపీ వెంకటరమణ, చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, సెక్టార్ ఎస్ఐ వరుణ్కాంత్రెడ్డిలు ఘటనస్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. వెంకటేష్ కుటుంబసభ్యులైన తిరుమల బాలకృష్ణ, లక్ష్మీ, రవి, సంతోష్, వజ్రమ్మ, రాణి, భాగ్యలే తన కుమార్తె, అల్లుడు ఆత్మహత్యకు కారణమని మృతురాలు భార్గవి తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు, కోడలును డబ్బులు కోసం వేధించలేదని, ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియదని మృతుడు వెంకటేష్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు. -
బాలికపై యువకుడి లైంగిక దాడి
-
బాలికపై యువకుడి అకృత్యం
సాక్షి, హైదరాబాద్: కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికతో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వివరాలు.. స్థానికంగా పలుకుబడి ఉన్న ఓ రాజకీయ నాయకుడి కుమారుడైన రోహన్ అనే యువకుడు బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి, బలవంతంగా నిద్ర మాత్రలు మింగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.(20 ఏళ్ల వ్యత్యాసం.. ప్రియుడితో కలిసి భర్తను) ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు అతడిని నిలదీయడంతో వారిపై కక్షగట్టాడు. తన అకృత్యం గురించి బయటపెడితే బాధితురాలిని చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ నేపథ్యంలో రోహన్ కారణంగా తమకు ప్రాణహాని ఉందంటూ బాధిత బాలిక కుటుబీకులు కుల్సుంపుర పోలీస్ స్టేషన్లో ఆగష్టు 12న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.(‘మహా నగరంలో మాయగాళ్లు’) -
నలుగురు పిల్లలతో తల్లి అదృశ్యం
చాంద్రాయణగుట్ట: ఇంట్లో గొడవ పడిన ఓ గృహిణి నలుగురు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్ కథనం ప్రకారం....నర్కీపూల్బాగ్కు చెందిన మహ్మద్ అక్బర్, షైనాజ్ బేగం (35) దంపతులు. వీరికి అఫ్రీన్ (13), రెహ్మత్ బేగం (11), మహ్మదా బేగం (9), మహ్మద్ రిజ్వాన్ (8) సంతానం. కాగా ఈ నెల 13న ఉదయం 10 గంటలకు షైనాజ్ బేగం అత్తతో గొడవపడింది. కొద్దిసేపటికే ఇంట్లో వారికి చెప్పకుండా తన నలుగురు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి వరకు కూడా తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వారి కోసం పలుచోట్ల గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో భర్త అక్బర్ చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆచూకీ తెలిసిన వారు చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్లో లేదా.. నం. 9490616823కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. -
‘ఆమె’ కోసం పాక్ నుంచి వచ్చి బుక్కయ్యాడు..
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, సైబర్ క్రైమ్కు పాల్పడి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ ఇంకొన్నాళ్లు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. కేసులో అభియోగపత్రం దాఖలై, విచారణ ప్రారంభమైనా... కోవిడ్ ప్రభావంతో దానికి బ్రేక్ పడింది. దీంతో మళ్లీ ట్రయల్ మొదలై, ముగిసే వరకు డిపోర్టేషన్ ప్రక్రియ ఆగాల్సి వచ్చింది. ‘ఆమె’ కోసం వచ్చి బుక్కయ్యాడు... నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. సదరు మహిళకు ఇద్ద రు కుమార్తెలు. పన్నెండేళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఆమెకు అక్కడ పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ అబ్బాస్ ఇక్రమ్తో పరిచయమైంది. తాను భారతీయుడినే అని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించిన అతగాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన సదరు మహిళ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. 2011లో ఉస్మాన్ సైతం అక్రమం మార్గంలో హైదరాబాద్కు వచ్చాడు. సైబర్ క్రైమ్కు పాల్పడి అరెస్టు... ఇక్రమ్ వచ్చిన ఆరు నెలలకు ఇతగాడు అక్రమంగా దేశంలోకి వచ్చాడని తెలుసుకున్న సదరు మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించారు. దీంతో కక్షగట్టిన ఇక్రమ్ ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు చిత్రీకరించడంతో పాటు కొందరికి ఆన్లైన్లో విక్రయించానంటూ బెదిరింపులకు దిగాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే సదరు ఫొటోలను బయటపెడతానని బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్ సందేశం పంపాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన అధికారులు 2018 జూన్లో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అబ్బాస్ పేరుతో అనేక బోగస్ ధ్రువీకరణలు పొంది పాస్పోర్ట్ తీసుకున్నాడని, అలాగే కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేశాడని బయటపడింది. ధ్రువీకరించిన పాక్ ఎంబసీ ఆఫీస్.. ఇతగాడిని అరెస్టు చేసినప్పుడు మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో టెన్త్ నుంచి డిగ్రీ (2003–08) వరకు చదివినట్లు ఉన్న సర్టిఫికెట్లతో పాటు అబ్బాస్ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్పోర్ట్, ఆధార్ సహా ఇతర గుర్తింపు కార్డులతో పాటు పాక్ పాస్పోర్ట్నకు చెందినదిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్సు ప్రతిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతడివద్ద ఉన్నవి బోగస్ పత్రాలని, వాస్తవానికి పాక్ జాతీయుడని నిర్థారించడం కోసం సైబర్ క్రైమ్ పోలీసులు విదేశీ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ద్వారా ఎంఈఏ పాక్కు లేఖ రాశారు. ఆ దేశ రాయ బార కార్యాలయం అతడు తమ జాతీయుడేనంటూ సమాధానం ఇచ్చింది. కోవిడ్తో ఆగిన ట్రయల్... దీన్ని ఆధారంగా చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇక్రమ్పై అభియోగపత్రాలు దాఖలు చేశారు. సాధారణంగా నేరం చేసిన వాళ్లను జైలుకు పంపి, నిరూపితం కాని వారిని బయటకు వదిలేస్తారు. అయితే ఇక్రమ్ కేసులో మాత్రం ఈ విధానం చిత్రంగా ఉంది. అతడు దోషిగా తేలినా, నిర్దోషిగా బయటపడినా తక్షణం ఆ దేశానికి పంపేయాల్సిందే. ఎంఈఏ నుంచి ఈ మేరకు అందిన ఉత్తర్వుల మేరకు కోర్టులో కేసు డిస్పోజ్ అయిన వెంటనే అతడిని తీసుకువెళ్లి ఢిల్లీలోని పాక్ ఎంబసీలో అప్పగించాలని యోచించారు. అయితే ఈ ఏడాది మార్చి నుంచి కోవిడ్ ప్రభావం, లాక్డౌన్ తదితరాల నేపథ్యంలో కేసు ట్రయల్ ఆగిపోయింది. ఫలింతంగా ఇక్కమ్ రిమాండ్ ఖైదీగా జైల్లోనే ఉండిపోయాడు. కోర్టులు పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభమై, కేసు విచారణ ముగిసే వరకు ఇక్రమ్ ఇక్కడ ఉండాల్సిందే. -
కలర్ ప్రిడెక్షన్.. మనీ లాండరింగ్!
సాక్షి, సిటీబ్యూరో: ఈ– కామర్స్ సంస్థల ముసుగులో భారీ బెట్టింగ్ గేమింగ్కు పాల్పడిన కలర్ ప్రిడెక్షన్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు (ఈడీ) లేఖ రాయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఈ దందాలో పెద్దయెత్తున మనీ లాండరింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. వివిధ వెబ్సైట్ల ఆధారంగా దందా చేసిన దీని నిర్వాహకులు ఈ ఏడాది ఏడున్నర నెల్లోనే రూ.1100 కోట్లు టర్నోవర్ చేయడంతో పాటు రూ.110 కోట్లను విదేశాలకు తరలించేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా నగర పోలీసులు ఈడీని కోరనున్నారు. చైనాకు చెందిన బీజింగ్ టీ పవర్ సంస్థ సౌత్ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్గా తమ జాతీయుడు యా హౌను నియమించింది. గుర్గావ్ కేంద్రంగా వ్యవహారాలు నడుపుతున్న ఇతగాడు ఢిల్లీ వాసులు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, నీరజ్ తులేలను డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరంతా కలిసి ఈ– కామర్స్ సంస్థల ముసుగులో గ్రోవింగ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సిలీ కన్సల్టింగ్ సర్వీసెస్, పాన్ యన్ టెక్నాలజీస్ సర్వీస్, లింక్యన్ టెక్నాలజీ, డాకీపే, స్పాట్పే, డైసీలింగ్ ఫైనాన్షియల్, హువాహు ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ల పేర్లతో ఆర్ఓసీలో రిజిస్టర్ చేశారు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో వివిధ ఈ– కామర్స్ వెబ్సైట్లు నడుపుతున్నాయి. వీటి ముసుగులో కలర్ ప్రిడెక్షన్ గేమ్ను వ్యవస్థీకృతంగా సాగిస్తున్నారు. ఈ గేమ్కు సంబంధించిన పేమెంట్ గేట్ వే అయిన పేటీఎం, గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో నెట్బ్యాంకింగ్ ద్వారానూ చేపట్టారు. బెట్టింగ్కు సంబంధించిన తొలుత డాకీ పే సంస్థకు వెళుతోంది. అక్కడి నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలోకి వెళ్లినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇది అంతర్జాతీయ బ్యాంకు కావడంతో ఆ ఖాతాల్లోని నగదు హాంకాంగ్, సింగపూర్ల్లోని కొన్ని ఖాతాల్లోకి మళ్లినట్లు తేల్చారు. ఇలా రూ.1100 కోట్ల టర్నోవర్లో రూ.110 కోట్లు వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. మిగిలిన మొత్తం కూడా విదేశాలకే తరలించేసి ఉంటారని సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ మార్గాల్లో ఈ నగదు బీజింగ్ టీ పవర్ సంస్థ చేరినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారాల నిగ్గు తేల్చడానికి ఈడీ రంగంలోకి దిగాల్సి ఉంది. ఈ మేరకు ఎఫ్ఐఆర్తో పాటు ఇతర పత్రాలను అందిస్తూ ఈడీకి లేఖ రాస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన నలుగురు నిందితుల్నీ కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. ఆ తర్వాతే సమగ్ర వివరాలతో ఈడీకి అధికారికంగా సమాచారం ఇవ్వనున్నారు. -
అక్రమంగా వీసా ప్రాసెసింగ్
సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి అర్హతలు, అవసరమైన అనుమతులు లేకుండా వీసా ప్రాసెసింగ్ చేస్తున్న నిందితుడిని దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇతడిపై గతంలోనూ కేసులు ఉన్నాయని, జైలుకు కూడా వెళ్లి వచ్చాడని అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి వెల్లడించారు. నగరంలోని కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన సికిందర్ గతంలో వీడియోగ్రాఫర్గా పని చేశాడు. 2012లో దుబాయ్ వెళ్లిన ఇతగాడు అక్కడ కొన్నాళ్ల పాటు పని చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి వివిధ దేశాలకు చెందిన వీసాల ప్రాసెసింగ్పై అవగాహన వచ్చింది. దీంతో నగరానికి తిరిగి వచ్చిన తర్వాత వీసా ప్రాసెసింగ్ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. 2014లో వచ్చిన సికిందర్ ఎలాంటి అర్హతలు, అనుమతులు లేకుండా ఈ దందా ప్రారంభించాడు. అనేక మందికి ఎర వేసి స్టడీ, విజిట్, బిజినెస్ వీసాలు ఇప్పించి పంపాడు. అక్రమంగా చేస్తున్న ఈ దందా నేపథ్యంలో ఇతడిపై గతంలో ఫలక్నుమా, ఆర్జీఐ ఎయిర్పోర్ట్, శంషాబాద్, కాలాపత్తర్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్టు అయిన ఇతగాడు బెయిల్పై బయటకు వచ్చాడు. అయినా తన పంథా మార్చుకోని సికిందర్ వీసా ప్రాసెసింగ్ దందా కొనసాగించాడు. అక్రమంగా వీసా ప్రాసెసింగ్ చేస్తూ ఒక్కో వీసాకు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్ఐలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థక్రుద్దీన్ తమ బృందాలతో దాడి చేసి బుధవారం అరెస్టు చేశారు. నలుగురికి చెందిన పాస్పోర్టులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును కాలాపత్తర్ పోలీసులకు అప్పగించారు. -
ఆ రెండూ దొరక్కపోవడంతో...
నగర వ్యాప్తంగా మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు, వినియోగంపై నిఘా ముమ్మరమైంది. ఓ వైపు పోలీసులు, మరో వైపు ఎక్సైజ్ అధికారులు ఎడాపెడా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్తుకు బానిసైన యువకులు ‘సేఫ్ డ్రగ్స్’ వినియోగానికి మొగ్గుచూపుతున్నారు. వీరితో పాటు ఫుట్పాత్లపై బతికే అనాథలు సైతం వీటిని వినియోగిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: మత్తు కోసం ‘సేఫ్ డ్రగ్స్’ వినియోగం అధికం అవుతున్న నేపథ్యంలో నగర పోలీసు విభాగం ఈ దందాపై కన్నేసింది. అందులో భాగంగా సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం హిమాయత్నగర్కు చెందిన జయంత్ అగర్వాల్ను అరెస్టు చేశారు. ఇతడి నుంచి 154 బాటిళ్ల దగ్గుమందు స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండూ దొరక్కపోవడంతో... మాదకద్రవ్యాలు.. ఇతరత్రా ఖరీదైన డ్రగ్స్ కొనలేని ‘మత్తు బానిసలు’ ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ‘ఆల్టర్నేటివ్ డ్రగ్స్’లో నిద్రమాత్రలు, వైట్నర్, దగ్గు మందు ప్రధానమైనవిగా మారాయి. అయితే వైద్యులు రాసిన ప్రిస్క్రెప్షన్ లేకుండా స్లీపింగ్ పిల్స్ను ఖరీదు చేయడం కష్టసాధ్యం. వైట్నర్ను ఖరీదు చేయడం తేలికే అయినా వినియోగించేప్పుడు ఇతరుల దృష్టిలో పడే అవకాశాలు ఉంటాయి. దీంతో అత్యధికంగా ప్లాట్ఫామ్స్పై నివసించే అనాథలే దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. మత్తుకు బానిసవుతున్న యువత, వైట్నర్ లభించని అనాథలు దగ్గు మందు ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీరికి ఈ మందులు మెడికల్ దుకాణాల నుంచే లభిస్తున్నాయి. దగ్గు కరోనా లక్షణాల్లో ఒకటైనా... నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎలాంటి లక్షణాలు లేని అసిమ్టమ్యాటిక్ కేసులతోపాటు ఈ వైరస్ సోకిన వారు క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించడం, లక్షణాలున్నా కోవిడ్ అని గుర్తించలేక కొన్ని మందులు వాడుతూ బయట సంచరించడం కూడా కారణాలనే వైద్యులు చెబుతున్నారు. కరోనా లక్షణాల్లో దగ్గు కూడా ఒకటి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గతంలోనే కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటికి మెడికల్ షాపుల యజమానులు నేరుగా మాత్రలు అమ్మవద్దని, అమ్మినా ఖరీదు చేసిన వారి వివరాలు వైద్య ఆరోగ్య శాఖకు తెలపాలని స్పష్టం చేసింది. అయినా కొందరు మెడికల్ షాపుల యజమానులు మత్తుకు బానిసైన వారికి దగ్గు మందు విక్రయించేస్తున్నారు. దారుస్సలాంలో అగర్వాల్స్ ఫార్మసీ నిర్వహిస్తున్న హిమాయత్నగర్కు చెందిన జయంత్ అగర్వాల్ ఈ మందుల్ని అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటూ శుక్రవారం సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్కు చిక్కాడు. శృతిమించితే తీవ్ర పరిణామాలే... అత్యధిక శాతం దగ్గు మందుల్ని డెక్స్ట్రోమెథార్ఫిన్, కోడైన్లతో తయారు చేస్తారు. కోడైన్తో కూడిన ఈ రసాయనం నియంత్రిత జాబితాలో ఉన్న మాదకద్రవ్యం. మత్తును కలిగించే దీన్ని కేవలం ఔషధాల తయారీకి మాత్రమే వినియోగిస్తుంటారు. ప్రధానంగా డెక్స్ట్రోమెథార్ఫిన్ కారణంగానే అనేక మంది దగ్గు మందులకు బానిసలు అవుతున్నారు. ఇది శృతిమించితే కిడ్నీ, కాలేయానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు విపరీతంగా పెరిగిపోతాయి. కొన్నిసార్లు మెదడుకు సంబంధించిన తీవ్రరుగ్మతలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు తమ వారి వ్యవహారశైలిపై కన్నేసి ఉంచాలని, అవసరం లేకుండా దగ్గు మందుల వాడకాన్ని నిరోధించాలని పోలీసులు కోరుతున్నారు. ఎలాంటి చీటీ లేకుండా వీటిని విక్రయిస్తున్న ఔషధ దుకాణాలపై నిఘా ముమ్మరం చేశామని, వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ఫోర్స్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
శానిటైజర్ ఘటనలో నగరవాసి హమీద్
జీడిమెట్ల: ఏపీలోని ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన కేసులో మూలాలు హైదరాబాద్ శివారులో వెలుగు చూస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు జీడిమెట్లకు చెందిన సాలె శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాస్ శానిటైజర్ను ఎలా తయారు చేయాలి అని యూట్యూబ్లో చూశాడు. అనంతరం ముడి సరుకులను జీడిమెట్ల పైప్లైన్ రోడ్డులో ఉన్న హమీద్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న పర్ఫెక్ట్ సాల్వెంట్ షాపులో నిషేధిత రసాయనం మిథైల్ క్లోరై‡డ్తో పాటు తదితర రసాయనాలను కొనుగోలు చేశాడు. అనంతరం లాభసాటిగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నకిలీ శానిటైజర్లు సరఫరా చేస్తున్నాడు. ప్రకాశం జిల్లా కురిచేడు గ్రామంలో 16 మంది తాగిన శానిటైజర్ ఇక్కడ తయారయ్యిదేనని తెలుసుకుని ఏపీ పోలీసులు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరి హస్తం ఉందో తేల్చేందుకు సన్నద్ధమయ్యారు. కాగా శ్రీనివాస్ ఇంటి వద్దనే శానిటైజర్ పరిశ్రమను నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో హమీద్ పాత్ర తేల్చేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు. -
పని చేస్తున్న ఇంటికే కన్నం..
కేపీహెచ్బీ కాలనీ: తాను పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిందో మహిళ. నగదుతో పాటు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. మంగళవారం సీఐ లక్ష్మీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం... కేపీహెచ్బీ కాలనీలోని ఇందూ ఫారŠూచ్యన్ ఫీల్డ్స్లో నివాసం ఉండే శ్రీకాంత్ రెడ్డి ఇంట్లో గుంటూరు జిల్లాకు చెందిన మాచర్ల మేరీ (40) పని చేస్తూ అక్కడే సర్వెంట్ క్వార్టర్లో ఉంటోంది. కొద్ది రోజులుగా ఓ బాలిక కూడా ఈమెతో పాటు పని చేస్తూ అదే క్వార్టర్లో ఉంటోంది. శ్రీకాంత్రెడ్డి వ్యాపారంలో వచ్చిన డబ్బును బెడ్రూంలోని కబోర్డులో దాచి పెట్టడం చూసిన వీరు పలుమార్లు కొద్ది కొద్దిగా మొత్తం రూ. 5 లక్షలు దొంగిలించారు. అంతేకాకుండా బంగారు గాజులు, రెండు బంగారు రింగులను కూడా అపహరించారు. దొంగిలించిన డబ్బుతో కొంత బంగారాన్ని కొనుగోలు చేశారు. అయితే బంగారు ఆభరణాలు పోయిన విషయమై మూడు రోజుల క్రితం శ్రీకాంత్రెడ్డి పని మనిషిని ప్రశ్నించగా తాను తీయలేదని చెప్పింది. అంతేకాకుండా సర్వెంట్ క్వార్టర్ ఖాళీ చేసి వెళ్లిపోయింది.దీంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని సోమవారం కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పనిమనిషి మేరీని విచారించగా నేరం చేసినట్టు అంగీకరించింది. ఆమె వద్ద నుంచి రూ. 1.7 లక్షల నగదు, 59 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మేరీతో పాటు పని చేసిన మరో బాలికకు జువైనల్ చట్టం కింద నోటీసులు జారీ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
డ్రగ్స్ రాకెట్లో చిరువ్యాపారులు!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో మళ్లీ డ్రగ్స్ రాకెట్ కలకలం రేపుతోంది. తాజాగా ఈ రాకెట్లో చిరువ్యాపారులు భాగస్వాములు కావడం సంచలనం సృష్టిస్తోంది. నగరంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇటీవల నిర్వహిస్తున్న వరుస దాడుల్లో ముంబై కేంద్రంగా పని చేస్తున్న బడా డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టయింది. అక్రమార్కులు నగరంలోని కొందరు చిరు వ్యాపారులు, కొందరు నైజీరియన్లు, నిరుద్యోగులకు డబ్బు ఎరవేసి డ్రగ్స్ సరఫరాలో వారి సేవలను వినియోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల బోయిన్పల్లి చెక్పోస్ట్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో టైల్స్ వ్యాపారి హనుమాన్ రామ్ కారును తనిఖీ చేయగా.. రూ.1.20 లక్షల విలువైన ఓపియం డ్రగ్ను తరలిస్తున్న వైనం వెలుగుచూసింది. రాజస్థాన్కు చెందిన ఇతను పదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి జీడిమెట్లలో టైల్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో వ్యాపారంలో నష్టాలు రావడంతో అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని ఇలా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు పోలీసుల విచారణలో ఇతను వెల్లడించడం గమనార్హం. కాగా ఇటీవల కాలంలో నగరంలో తరచు నమోదవుతున్న డ్రగ్స్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. సిటీలోతరచు డ్రగ్స్ కలకలం.. ఇటీవల నగరంలోని తార్నాక చౌరస్తాలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు రట్టుచేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1.64 లక్షల విలువ చేసే 104 గ్రాముల కొకైన్తోపాటు ఒక యమహా ఎఫ్జడ్ బైక్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందిన జడీ పాస్కల్(35),అతని గర్ల్ఫ్రెండ్ ఎబిరె మోనికా(30) తార్నాక నాగార్జుననగర్లో ఇటీవల ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరికి ముంబై కేంద్రంగా డ్రగ్స్రాకెట్ నడుపుతున్న ఎరిక్,బెన్,» బెంగళూరుకు చెందిన బనార్డ్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ జంట వారు సరఫరా చేసిన కొకైన్ ను గ్రాము రూ.8 వేలు చొప్పున నగరంలో పలువురికి విక్రయిస్తోంది. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలకు సైతం ఈ జంట మాదకద్రవ్యాలను సరఫరా చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సెలబ్రిటీలకు సరఫరాపై అనుమానాలు.. నగరంలో సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వీఐపీలు, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని నగరంలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు ఇటీవల వరుసగా పట్టుబడుతున్న డ్రగ్స్ రాకెట్ ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. ముంబై, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న బడా డ్రగ్స్ మాఫియా పలువురు నైజీరియన్లకు, చిరువ్యాపారులు, నిరుద్యోగులకు డబ్బును ఎరగా చూపి ఈ వ్యాపారంలోకి దించుతూ..నగరంలో వినియోగదారులకు డ్రగ్స్ను సరఫరా చేస్తున్నట్టు స్పష్టమౌతోంది. తాజా కేసు ఇలాంటి కోవకే చెందినది కావడం గమనార్హం. ఎక్సైజ్ పోలీసులు నగరంలో ప్రత్యేకంగా కాల్సెంటర్ ఏర్పాటుచేసి సమాచారం అందిన వెంటనే డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేయాలని సిటీజన్లు కోరుతున్నారు. -
భర్త తాగుడుకు భార్య బలి..!
ఉప్పల్: కుటుంబ కలహాలు..చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా గృహిణులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు... తమతో పాటు అభం శుభం తెలియని పసి పిల్లలను కూడా బలి తీసుకుంటున్నారు... నగరంలో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు పరిపాటిగా మారాయి. తాజాగా ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ శ్రీనివాసపురం ప్రాంతానికి చెందిన సెమన్ ప్రభాకర్, కర్నూలు జిల్లా బనగానపల్లి, టంగుటూరు ప్రాంతానికి చెందిన మేరీ మార్గెట్ (38)తో 2017లో వివాహం జరిగింది. వీరికి బ్లేస్సి అక్షిత (8 నెలల పాప) ఉంది. ప్రభాకర్ ప్రతి రోజూ మద్యం తాగి వచ్చే వాడు. భార్య ఎంత వారించినా మానేస్తానని చెప్పి మానేయడం లేదు. ఈ కారణంతోనే భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు మొదలయ్యాయి. రోజూ భర్త తాగి రావడంతో పాటు ఇతర సమస్యలతో తీవ్ర మనస్తాపానికి లోనైన మేరీ మార్గెట్, కూతురు చిన్నారి అక్షితను తీసుకొని సోమవారం తాము నివాసం ఉంటున్న భవాని రెసిడెన్సీ 4వ అంతస్తుకు వెళ్లింది. కూతురిని మొదట అక్కడి నుంచి కిందకు విసిరేసి.. ఆ తర్వాత తాను కూడా దూకేసింది. తల్లీకూతుళ్లకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఉప్పల్ సీఐ రంగస్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఇడియట్’ సినిమాలో అలీ లాగే..
సాక్షి, హైదరాబాద్: ‘ఇడియట్’ సినిమాలో కమెడియన్ అలీ దొంగలించిన బైక్లను చాకచక్యంగా ఎత్తుకెళ్తాడు. మార్గంమధ్యలో అడ్డగించిన పోలీసులు ఆ బైక్పై ఉన్న ఇసుకను మాత్రమే చూస్తారు కానీ.. బైక్ వివరాలు మాత్రం అడగరు. సరిగ్గా ఇదే తరహాలో ముగ్గురు దొంగలు ఇలాగే దొంగలించిన బైక్లను ఎత్తికెళ్లిపోదామనే పన్నాగం పన్ని పోలీసులకు చిక్కారు. ఆసీఫ్నగర్ పీఎస్ పరిధిలో ఇటీవల చోరీకి గురైన బైక్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా.. ముగ్గురు దొంగలు దొరికారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. రికవరీ చేసిన 12 ద్విచక్రవాహనాలను, ముగ్గురు నిందితులు ఎం.వెంకటేష్(22), వశీం అక్రమ అలియాస్ వసీం(27), సిరాజ్ఖాన్(28)లను సోమవారం మీడియాకు చూపించారు. కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం... దహిల్బాగ్ మహబూబ్ కాలనీకి చెందిన పాతనేరస్తుడు ఎం.వెంకటేష్ ఆసీఫ్నగర్లోని ఓ పెట్రోల్బంక్లో పని చేస్తున్నాడు. ఇతనిపై 12కు పైగా బైక్ చోరీ కేసులున్నాయి. కొద్దిరోజులు క్రితం బీదర్కు చెందిన వశీం అక్రం, సిరాజ్ ఖాన్లతో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైలుకు వెళ్లొచ్చిన వెంకటేష్.. వసీం, సిరాజ్ఖాన్లతో కలిసి బైక్ల చోరీకి పాల్పడ్డాడు. రాత్రి సమయంలో తన వద్ద ఉన్న తాళాలతో పార్క్ చేసిన ఉన్న బైక్ తాళాలను వెంకటేష్ ఓపెన్ చేయడానికి యత్నిస్తాడు. తాళం వేస్తే ఈ విషయాన్ని వసీం అక్రం, సిరాజ్ఖాన్లకు సమాచారం ఇస్తాడు. వారు వచ్చి ఆ బైక్లను వేరే ప్రాంతాల్లోని పార్కింగ్ ప్రదేశాల్లో పార్క్ చేస్తారు. నగరంలో అమ్మితే సమస్యలు వస్తాయని వేరే ప్రాంతాల్లో అమ్మేందుకు సిద్ధపడ్డారు. ఇలా పట్టేశారు... ‘ఇడియట్’ సినిమాలో అలీ ఏ విధంగా అయితే బైక్లను దొంగలించి ఆ బైక్లపై బీదర్కు ఇసుకను తరలిస్తూ.. పోలీసులకు చిక్కినట్టే.. వీరు కూడా ఇసుక బస్తాలను దొంగలించిన బైక్లపై పెట్టుకుని బీదర్ వెళ్లి అమ్మాలని పథకం వేశారు. అయితే..పోలీసులు ఫొటో అండ్ ఎనాస్మెంట్ ద్వారా వీరిని పట్టుకున్నారని కమిషనర్ తెలిపారు. వెంకటేష్పై పలు ఠాణాల్లో కేసులు వెంకటేష్ కొన్ని రోజుల పాటు మాత్రమే ఉద్యోగం చేస్తాడు. అతను సాధారంగా చేసేదంతా చోరీలే. ఇలా 2014 నుంచి చోరీలు చేస్తున్నాడు. వెంకటేష్పై మంగళ్హట్ పీఎస్లో 4 కేసులు, ఆసీఫ్నగర్ పీఎస్లో 3 కేసులు, రాయదుర్గం పీఎస్లో 2 కేసులు, లంగర్హౌస్, టప్పచబుత్ర పీఎస్ల్లో ఒక్కో కేసు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో దొంగలించిన 12 ద్విచక్ర వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. కాగా.. 12 బైక్స్లో 11 బైక్ల సమాచారం మాత్రమే ఉంది. మరో బైక్ ఎక్కడ కొట్టేసింది స్పష్టత లేదు. -
చోరీ డబ్బు ఏం చేయాలి.. ఎలా ఖర్చు పెట్టాలో ?
హిమాయత్నగర్: నమ్మకంగా పని చేస్తున్న తమను యజమాని అకారణంగా తిడుతుండటం వారిని బాధించింది.... ఈలోపే యజమాని పనిలోంచి తీసేశాడు...దీంతో యజమానిపై పగ పెంచుకున్నారు. అతడి ఆర్థిక లావాదేవీలపై కన్నేసిన ఆ ఇద్దరూ భారీ చోరీకి పాల్పడ్డారు. ఇటీవల గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారి ఇంట్లో రూ. 2.50 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితులు టోలిచౌక్కి చెందిన మహ్మద్ అఫ్సర్(24), మిర్జా అస్వాక్ బేగ్(22)తోపాటు వారికి సహకరించిన మరో ముగ్గురు రెహమాన్ బేగ్(23), మహ్మద్ అమీర్(20), సయ్యద్ ఇమ్రాన్(23)లను అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం ఏఆర్ శ్రీనివాస్ జాయింట్ సీపీ (వెస్ట్జోన్), అడిష్నల్ డీసీపీ టాస్క్ఫోర్స్ జి.చక్రవర్తిలతో కలిసి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... నిందితుల్లో మహ్మద్ అఫ్సర్ బాల్రెడ్డినగర్ టోలిచౌక్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అసదుద్దీన్ అహ్మద్ వద్ద గతంలో కారు డ్రైవర్గా పని చేశాడు. మరో నిందితుడు మీర్జా అస్వాక్ బేగ్ శామీర్పేటల్ వ్యాపారికి చెందిన ఫామ్హౌస్లో పని చేశాడు. వ్యాపారి వీరిద్దరినీ అకారణంగా దూషించేవాడు. రెండేళ్ల క్రితం ఇద్దరినీ పనిలోంచి తీసేశాడు. దీన్ని మనసులో పెట్టుకున్న ఇద్దరూ యజమానిపై కక్ష తీర్చుకొనేందుకు అతడి ఇంట్లో భారీ చోరీ చేయాలని పథకం వేశారు. మరో ముగ్గురి సాయంతో.. మహ్మద్ అఫ్సర్, మిర్జా అస్వాక్ బేగ్లు తమ పథకం అమలు చేసేందుకు ఇదే ప్రాంతానికి చెందిన రెహమాన్ బేగ్, మహ్మద్ అమీర్, సయ్యద్ ఇమ్రాన్ సాయం తీసుకున్నారు. ఇద్దరూ వ్యాపారి ఆర్థిక లావదేవీలను గమనించేవారు. ఈ ఏడాది జూలై 21న వ్యాపారి తనకు సంబంధించిన ఒక ల్యాండ్ను అమ్మగా వచ్చిన రూ. 2.5 కోట్లను ఇంట్లోని అల్మారాలో భద్రపరిచాడు. జూలై 22నశామీర్పేటలోని ఫాంహౌస్లో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న హ్మద్ అఫ్సర్, మిర్జా అస్వాక్ బేగ్లు అదే రోజు రాత్రి 2.30 గంటల సమయంలో బాల్రెడ్డినగర్లోని యజమాని ఇంట్లో చొరబడ్డారు. రెహమాన్ బేగ్, మహ్మద్ అమీర్, సయ్యద్ ఇమ్రాన్లు ఇంటి బయట మనుషుల కదలికలను గమనిస్తూ ..ఎప్పటికప్పుడు సెల్ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా సమాచారం ఇచ్చేవారు. బియ్యం సంచుల్లో నింపుకొని.. ఇంట్లోకి చొరబడి ఉడెన్ అల్మారాలో ఉన్న డబ్బును చోరీ చేసి బియ్యం సంచుల్లో నింపుకొని ఉడాయించా రు. ఆ డబ్బును మహ్మద్ అమీర్ ఇంట్లో దాచి కొద్ది కొద్దిగా పంచుకున్నారు. ఈ డబ్బుతో ఒక అవేంజర్ బైక్ను కూడా కొన్నారు. మిగతా డబ్బును కూడా ఏం చేయాలి? ఎలా ఖర్చు పెట్టాలో తెలియని అయోమయపు స్థితిలో వీరున్నట్లు సీపీ వెల్లడించారు. కేసు నమోదు... బాధిత వ్యాపారి అసదుద్దీన్ అహ్మద్ జూలై 27న తాను ల్యాండ్ అమ్మి తెచ్చిన రూ.2.5 కోట్లు ఇంట్లో ఉంచగా చోరీకి గురయ్యాయని గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు విచారణ చేపట్టిన క్రైమ్ విభాగం పోలీసులు వ్యాపారి వద్ద గతంలో పని చేసి మానేసిన వారందరినీ పిలిచి విచారించారు. మహ్మద్ అఫ్సర్, మిర్జా అస్వాక్ బేగ్లను కూడా పిలిచి విచారించగా... తామే చోరీకి పాల్పడినట్టు వెల్లడించారు. తమను పదే పదే తిట్టడమే కాకుండా అకారణంగా పనిలోంచి తీసేయడంతోనే ఈ దొంగతనం చేశామని చెప్పారని కమిషనర్ తెలిపారు. మిగతా డబ్బు ఏమైనట్లు...? యజమాని అసదుద్దీన్ మాత్రం తన వద్ద ఉన్న రూ.2.5 కోట్లు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మాత్రం ఈ ఐదుగురి నిందితుల నుంచి రూ.1.29 కోట్లు రికవరీ చేశారు. యజమాని సమక్షంలోనే అల్మారా తెరిచి వీరు చోరీ చేసిన డబ్బును అమర్చగా కరెక్ట్గా ఉన్నట్టు నిర్ధారణైంది. యజమాని ఫిర్యాదులో పేర్కొన్న మొత్తానికి, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తానికి చాలా తేడా ఉండటం పలు అనుమానాలకు దారితీస్తుంది. యజమాని అసదుద్దీన్ ఆర్థిక లావాదేవీలపై కూడా తాము విచారిస్తున్నట్లు జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. -
ఏసీబీ కేసులో ఫిర్యాదీ... సీసీఎస్ కేసులో నిందితుడు!
సాక్షి, సిటీబ్యూరో: షేక్పేట తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ నాగార్జునరెడ్డి ఏసీబీకి చిక్కడానికి, బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ ఎస్సై రవీందర్పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేయడానికి కారణమైన సయ్యద్ అబ్దుల్ ఖాలీద్ కటకటాల్లోకి చేరారు. బంజారాహిల్స్లోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడానికి ఇతగాడు ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తన స్నేహితుడిని లీగల్ అడ్వైజర్గానూ రంగంలోకి దింపినట్లు తేల్చారు. ఈ మేరకు వారిచ్చిన ఫిర్యాదు మేరకు నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు ఖాలీద్తో పాటు అశోక్రెడ్డి అనే వ్యక్తినీ అరెస్టు చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి ఆదివారం వెల్లడించారు. ఫోర్జరీ వ్యవహారం బయట పడుతుందని... బంజారాహిల్స్ రోడ్ నెం.14లో 7068 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలం ఉంది. అత్యంత ఖరీదైన ఈ çస్థలంపై సయ్యద్ అబ్దుల్ ఖాలీద్ అనే వ్యక్తి కన్నేశాడు. ఈ స్థలంలోని 4865 చదరపు గజాల స్థలానికి సంబంధించి ఖాలీద్ నకిలీ పత్రాలు సృష్టించాడు. ఆ స్థలంలో ఉన్న హెచ్చరిక బోర్డు తొ లగించిన ఇతగాడు తనకు చెందినదిగా పేర్కొంటూ మరో బోర్డు ఏర్పాటు చేశాడు. ఈ స్థలంపై న్యాయస్థానం నుంచి తనకు అనుకూలంగా ఉత్తర్వులు పొందినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. తన స్నేహితుడు అశోక్రెడ్డిని లీగల్ అడ్వైజర్గా రంగంలోకి దింపాడు. ఆ స్థలాన్ని ఖాలీద్కు అప్పగించాల్సిందిగా కోరుతూ షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో అశోక్రెడ్డి ద్వారా దరఖాస్తు చేశారు. విషయం గమనించిన తహసీల్దార్ ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ల్లో బంజారాహిల్స్ ఠాణా లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా... ఆ స్థలా న్ని మీ పరం చేస్తూ సరిహద్దులు చూపిస్తానంటూ షేక్పేట కార్యాలయం ఆర్ఐ నాగార్జున రెడ్డి.. ఖాలీద్తో ఒప్పందం చేసుకున్నాడు. దీని నిమి త్తం తనకు రూ.30 లక్షలు ఇవ్వాలని ఖాలీద్ ను కోరాడు. మరోపక్క ఇతడిపై బంజారాహిల్స్ ఠాణాలో నమోదైన కేసుల్లో అరెస్టు వంటి చర్యలు లేకుండా ఉండేందుకు ఎస్సై రవీందర్ రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. వీటిలో రూ.1.5 లక్షలు ఖాలీద్ నుంచి రవీందర్ అందుకున్నాడు. తన ఫోర్జరీ వ్యవహారం బయటపడుతోందని, దీనిపై చర్యలు ఉంటాయని భావించిన ఖాలీద్ తప్పించుకోవడానికి మార్గాలు అన్వేషించాడు. ఈ వ్యవ హారం నుంచి అధికారుల దృష్టి మళ్లించడానికి ఓ పథకం వేశాడు. ఆర్ఐ నాగార్జున రెడ్డికి రూ.15 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఆ నగదు తీసుకోవడానికి ఈ ఏడాది మార్చి 6న బంజారాహిల్స్లోని హార్లీడేవిడ్ సన్ షోరూమ్ వద్దకు రమ్మన్నాడు. ఈలోపు విషయంపై ఏసీబీ అధికారులకు ఫిర్యా దు చేశాడు. దీంతో ఆ రోజు బంజారాహిల్స్లో వలపన్నిన ఏసీబీ అధికారులు నాగార్జున రెడ్డిని ట్రాప్ చేశారు. అలాగే రవీందర్ పైనా ఖాలీద్ ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది. ఈ వ్యవహారాలతో తన కబ్జా, ఫోర్జరీ పత్రాల అంశాలు మరుగున పడిపోతాయని ఖాలీద్ భావించాడు. అయితే దీనిపై ఏసీబీ ఇన్స్పెక్టర్ షేక్ గౌస్ ఆజాద్ నగర నేర పరిశోధన విభాగంలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఏసీపీ బి.రవీందర్రెడ్డి దర్యాప్తు చేపట్టారు. ఖాలీద్, అశోక్రెడ్డిల పాత్రలపై ఆధారాలు సేకరించి ఆదివారం ఇద్దరినీ అరెస్టు చేశారు. -
పోర్నోగ్రఫీ చూసినా... కటకటాల్లోకే!
సాక్షి, సిటీబ్యూరో: అభం శుభం ఎగురని చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి, పెరగడానికి చైల్డ్ పోర్నోగ్రఫీ ఓ ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం కొనసాగుతోంది. ఇంటర్నెట్తో పాటు సోషల్ మీడియాలో సాగుతున్న చైల్డ్ పోగ్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్సీఎంఈసీ) పని చేస్తోంది. చైల్డ్ సెక్స్వల్ అబ్యూజ్డ్ మెటీరియల్ను (సీఎస్ఏఎం) కనిపెట్టడానికి ఈ సంస్థ అత్యాధునిక సాఫ్ట్వేర్స్ వినియోగిస్తోంది. వీరు గుర్తించిన వివరాల ఆధారంగానే గత వారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నగరంలోని తార్నాక ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫిరోజ్, కాచిగూడ వాసి ప్రశాంత్ కుమార్లను అరెస్టు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న కఠిన చట్టాల ప్రకారం ఇంటర్నెట్తో పాటు సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీని సెర్చ్ చేసినా, చూసినా, డౌన్లోడ్, అప్లోడ్ చేసినా... నేరమే అని సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా కేంద్రంగా ఎన్సీఎంసీ... అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఎన్సీఎంఈసీని ఏర్పాటు చేసింది. ఈ స్వచ్ఛంద సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. తప్పిపోతున్న చిన్నారులు, వారిపై జరుగుతున్న లైంగిక దాడులను నిరోధించడానికి ఈ సంస్థ పని చేస్తోంది. చిన్నారులకు సంబంధించి అశ్లీల చిత్రాలు, వీడియోలు, సాహిత్యం తదితరాలను చైల్డ్ పోర్నోగ్రఫీగా పరిగణిస్తారు. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా నిషేధించిన తర్వాత ఎన్సీఎంఈసీ కార్యకలాపాలు మరింత ముమ్మరం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 18 ఏళ్ల లోపు వయస్సున్న ప్రతి ముగ్గురు బాలికల్లో ఒకరు, ప్రతి ఐదుగురు బాలురులో ఒకరు లైంగిక దాడులకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన యునిసెఫ్ అధ్యయనంలో తేలింది. ఆన్లైన్లో చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది అత్యంత వేగంగా పెరుగుతోందని ఎన్సీఎంఈసీ గుర్తించింది. ఒక్క భారతదేశంలోనే ప్రతి 40 సెకండ్లకు ఈ తరహా వీడియో ఒకటి క్యాప్చర్ అవుతోంది. వివిధ సెర్చ్ ఇంజన్లలో జరుగుతున్న సెర్చ్ల్లో 25 శాతం చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించినవే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ఈ ఏడాది మే 2 వరకు ఇంటర్నెట్లో 25 వేల చైల్డ్ పోర్నోగ్రఫీకి చెందిన వీడియోలు, చిత్రాలు అప్లోడ్ అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్సీఎంఈసీ ఆన్లైన్, సోషల్మీడియాలో ఉన్న చైల్డ్ పోర్నోగ్రఫీపై సాంకేతిక నిఘా వేసి ఉంచుతోంది. అత్యంత పటిష్ట నిఘా... చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఇంటర్నెట్, సోషల్మీడియా వంటి సైబర్ స్పేస్లో ఉన్న అంశాలను సీఎంఏఎంగా పరిగణిస్తారు. దీన్ని గుర్తించడానికి ఎంసీఎంఈసీ ప్రత్యేక సాఫ్ట్వేర్లను రూపొందించింది. గూగుల్, యాహూ సహా ఇతర సెర్చ్ ఇంజన్లు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్ తదితర సోషల్మీడియాల్లో ఉన్న సీఎస్ఏఎంలను గుర్తించడానికి ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆయా సైబర్ స్పేస్, సోషల్మీడియాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన విషయాలను కనిపెట్టడానికి కొన్ని కీవర్డ్స్ను రూపొందించింది. ఫలితంగా ప్రపంచంలో ఎవరైనా ఆయా వేదికలపై సీఎస్ఏఎంకు సంబంధించి సెర్చ్ చేసినా, వీక్షించినా, డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా... అందులో ఉన్న ప్రత్యేక సాఫ్ట్వేర్ వెంటనే వారు వినియోగించిన ఐపీ అడ్రస్లను గుర్తిస్తుంది. ఈ వివరాలను తక్షణం ఎన్సీఎంఈకి చెందిన సర్వర్కు అందిస్తుంది. వీటిని క్రోడీకరించే అక్కడి సిబ్బంది చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వివరాలు సెర్చ్ చేసిన, చూసిన, అప్లోడ్ చేసిన, డౌన్లోడ్ చేసిన వారి వివరాలను ఆయా దేశాల నోడల్ ఏజెన్సీలకు అందిస్తారు. మన దేశానికి సంబంధించి జాతీయ స్థాయిలో హోమ్ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. దీంతో ఈ వివరాలు ఎన్సీఎంఈసీ నుంచి ఎన్సీఆర్బీకి వస్తాయి. అరెస్టులు చేసే స్థానిక పోలీసులు... ఎన్సీఎంఈసీ నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీ నిందితుల జాబితా అందుకున్న ఎన్సీఆర్బీ అధికారులు ఆ వివరాలను రాష్ట్రాల వారీగా విభజించి, ఆ సమాచారాన్ని ఆయా రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలకు పంపిస్తారు. 2019లో చైల్డ్ పోర్నోగ్రఫీ అప్లోడ్ చేసిన తెలంగాణకు చెందిన 15 మంది వివరాలను ఇటీవల ఎన్సీఆర్బీ నుంచి రాష్ట్ర సీఐడీ అధికారులకు అందగా.. వీరు ఆ నిందితుల జాబితాలను ఆయా స్థానిక పోలీసులకు పంపించారు. ఇలా ఇద్దరి వివరాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అందగా.. ఐపీ అడ్రస్ల ఆధారంగా వారిని గుర్తించారు. గతేడాది ఏప్రిల్లో ఫేస్బుక్లోకి ఓ చైల్డ్ పోర్న్ వీడియోను అప్లోడ్ చేసిన తార్నాక వాసి మహ్మద్ ఫిరోజ్, చిన్నారుల అశ్లీల చిత్రాలను ఓ సైట్లోకి అప్లోడ్ చేసిన కాచిగూడ వాసి ప్రశాంత్ కుమార్ను ఇలానే పట్టుకున్నారు. వీరిద్దరిని గురువారం అరెస్టు చేసిన విషయం విదితమే. మిగిలిన 13 మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉండటంతో ఆయా జిల్లాల పోలీసులకు ఆ సమాచారం సీఐడీ ద్వారా అందింది. వీరినీ అరెస్టు చేయడానికి సన్నాçహాలు జరుగుతున్నాయి. ఈ 15 మందీ తమ ఫోన్ల ద్వారానే ఇంటర్నెట్ను యాక్సస్ చేశారు. కఠిన చర్యలు తీసుకుంటాం ‘చైల్డ్ పోర్నోగ్రఫీని ఎవరు సెర్చ్ చేసినా చర్యలు తప్పవు. ఎన్సీఆర్బీ ద్వారా అందిన సమాచారంతో సుమోటో కేసుల్ని నమోదు చేస్తున్నాం. వీరిపై ఐటీ యాక్ట్లోని సెక్షన్ 67 (బి) ప్రకారం ఆరోపణలు రిజిస్టర్ అవుతున్నాయి. ఈ కేసులో నేరం నిరూపణ అయితే మొదటిసారి నేరం చేసిన వారికి గరిష్టంగా ఐదేళ్లు, రెండోసారి అయితే ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది. బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే దీంతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదవుతాయి. వీటిలో కోర్టు దోషులుగా నిర్థారిస్తే జీవితఖైదు వరకు పడే ఆస్కారం ఉంది. – ఎన్.మోహన్రావు, ఇన్స్పెక్టర్, సిటీ సైబర్ క్రైమ్ ఠాణా -
ఏటీఎంల కేంద్రంగా భారీ స్కామ్స్
సాక్షి, సిటీబ్యూరో: ఏటీఎం కేంద్రాలు కస్టోడియన్లకు ‘కల్పతరువులుగా’ మారుతున్నాయి. వాటిలో నింపాల్సిన నగదును చాకచక్యంగా కాజేస్తున్నారు. ఈ తరహా ఫ్రాడ్స్ తెలుగు రాష్ట్రాల్లో తరచు వెలుగుచూస్తున్నాయి. ఒక్క నగరంలోనే గతంలో రూ. 14.46 కోట్ల కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. లోయర్ ట్యాంక్బండ్లోని సీఎంఎస్లో రూ. 2.6 కోట్లు, ఆర్సీఐ సంస్థలో రూ. 9.98 కోట్లు, ట్రాన్స్ ట్రెజర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో రూ. 1.88 కోట్ల స్కామ్స్ చోటు చేసుకున్నాయి. తాజాగా బీటీఐ పేమెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో జరిగిన రూ. 1.23 కోట్ల స్కామ్ బయటపడింది. ఇలాంటి నేరాలు జరగడానికి వ్యవస్థాగతంగా ఉన్న చిన్న చిన్న లోపాలే కారణమని గుర్తించామని, వాటిని సరిదిద్దు కోవాలని కోరుతూ బ్యాంకులకు లేఖ రాస్తామని పోలీసులు గతంలో ప్రకటించారు. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రాకోపోవడం గమనార్హం. ఏపీలోనూ రెండు ఉదంతాలు... హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లోనూ ఈ తరహా నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. 2014లో నెల్లూరు కేంద్రంగా పని చేస్తే సంస్థలో రూ. 57 లక్షలు, 2015లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సంస్థ నుంచి రూ. 31 లక్షల్ని ఏటీఎం మిషన్లలో నగదు నింపే బాధ్యతలు నిర్వర్తిస్తున్న కస్టోడియన్లు కాజేశారు. ఇలా ప్రజాధనం దుండగుల పాలవుతున్నా ఆయా బ్యాంకు మాత్రం సంస్కరణలు పట్టించుకోవట్లేదని స్పష్టమవుతోంది. సీసీఎస్లో నమోదైన ‘ఆర్సీఐ’ ఫ్రాడ్లో కస్టోడియన్లతో పాటు ఏకంగా యాజమాన్యం పాత్ర సైతం వెలుగులోకి రావడంతో పోలీసులే ముక్కున వేలేసుకుటున్నారు. ఔట్సోర్సింగ్ చేతుల్లో నగదు భర్తీ... ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఏటీఎంల్లో నగదును నింపే కాంట్రాక్టును ఆయా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ కేంద్రాలుగా నడిపే ప్రైవేట్ సంస్థలకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో అప్పగిస్తున్నాయి. ఈ పని చేయడానికి ఆయా సంస్థలు అనేక మందిని ఉద్యోగులుగా నియమించుకుంది. వీరిలో కస్టోడియన్లుగా పిలిచే ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం. బ్యాంకులకు చెందిన కేంద్రాల నుంచి రూ. కోట్లును సంస్థల వాహనాల్లో తరలించే టీమ్ సభ్యులు ఆ మొత్తాన్ని ఆయా బ్యాంకుల ఏటీఎం సెంటర్లలోని మిషన్లలో డిపాజిట్ చేస్తుంటారు. ఇంతటి వ్యవహారాలతో నడిపే కీలక బాధ్యతల్ని బ్యాంకులు ఔట్సోర్సింగ్ ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నాయి. సాంకేతికతకు ఆమడదూరం... ఏ ఏటీఎం కేంద్రంలో ఎప్పుడు, ఎంత నిపారన్నది ఈ కాంట్రాక్టులు నిర్వహిస్తున్న సంస్థల్లో కస్టోడియన్లు పని చేసే ఉద్యోగులు రికార్డుల్లో రాసిందే బ్యాంకులకు ఆధారం. ఈ తరహా ఉద్యోగుల కార్యకలాపాలపై ఏమాత్రం నిఘా సైతం ఉంచట్లేదు. కస్టోడియన్తో కూడిన ఓ బృందం బ్యాంక్ నుంచి సదరు వాహనంలో ఎంత మొత్తం తీసుకుని బయలుదేరుతోంది, తిరిగి ఎంత మొత్తం తీసుకువస్తోంది అనే అంశాలు కేవలం మాన్యువల్గానే పుస్తకాల్లోనో, వీరు ఫీడ్ చేస్తే కంప్యూటర్లోనో నమోదవుతున్నాయి. ఏటీఎం సెంటర్లో ఎంత డబ్బు పెట్టారనే దానికి సైతం ఈ లెక్కలే ఆధారం. అంతే తప్ప ఓ మిషన్లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఎంత మేర డిపాజిట్ చేశారనేది లెక్కించడానికి సాంకేతికంగా ఎలాంటి మెకానిజం ఇప్పటి వరకు ఆయా సంస్థలు, బ్యాంకులు అందిపుచ్చుకోలేదు. అంతర్గత విచారణతో జాప్యం... ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపిన కస్టోడియన్లు డ్యూటీ దిగిన తరవాత ఆయా సంస్థల ఉద్యోగులు మళ్లీ వెళ్లి ఏటీఎంలను ఓపెన్ చేసినా గుర్తించే పరిజ్ఞానం బ్యాంకుల వద్ద ఉండట్లేదు. ఈ కారణంగానే ఏటీఎంల్లో అవసరమైనంతా డిపాజిట్ చేశామంటూ చెప్తున్న కస్టోడియన్లు ఏళ్ల పాటు గోల్మాల్ పాల్పడుతూ రూ. లక్షలు, రూ. కోట్లు కాజేసే వరకు సంస్థలు గుర్తించలేకపోతున్నాయి. అప్పుడప్పుడు జరిగే ఆడిటింగ్లో అసలు విషయం బయటకు వచ్చినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అంతర్గత విచారణ, చర్యల పేరుతో జాప్యం చేస్తున్నాయి. ఇవన్నీ జరిగిన తరవాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగానే అనేక అంశాల్లో దర్యాప్తు జఠిలంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. గడిచిన కొన్నేళ్లలో నమోదైన కేసుల్ని దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు అనేక సంస్థాగతమైన లోపాలను గుర్తించారు. ఆ విధానాలు మారాల్సిందే.. ‘ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే అంశాలకు సంబంధించి ఆడిటింగ్ రెగ్యులర్గా జరగట్లేదు. మరోపక్క అప్పుడప్పుడు జరిగే ఆడిటింగ్ సైతం ఎప్పుడు, ఏ రూట్లో జరుగుతుంది అనేది కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థలకు తెలిసిపోతోంది. ఈ లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉంది. నగదు నింపే కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థలకు ఆడిటింగ్ విషయం తెలియకూండా బ్యాంకులు నేరుగా జరపాలి. ఈ తనిఖీలు సైతం నిత్యం, ఆకస్మికంగా జరగాలి. అప్పుడే ‘ఏటీఎం ఫ్రాడ్స్’కు చెక్ చెప్పే ఆస్కారం ఉంటుంది. గతంలో చెప్పినా ఎవురూ పట్టించుకోలేదు. ఈసారి కీలక వివరాలన్నీ పొందుపరుస్తూ బ్యాంకులకు లేఖ రాయాలని భావిస్తున్నాం’ – పోలీసు అధికారులు -
పెళ్లి ఇష్టం లేక యువతి బలవన్మరణం
నాగోలు: పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడం ఇష్టంలేక ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, కలకొండ గ్రామానికి చెందిన పులి లింగమ్మ ఐదేళ్లుగా తన కుమారుడు కృష్ణ, కుమార్తె లక్ష్మి(27)తో కలిసి ఎల్బీనగర్, పిండి నారాయణరెడ్డి కాలనీలో నివాసముంటోంది. లక్ష్మి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. ఆమెకు పెళ్లి సంబంధం చూసేందుకు బుధవారం ఉదయం లింగమ్మ తన కుమారుడు కృష్ణతో కలిసి ఈసీఐఎల్కు వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగివచ్చేసరికి లక్ష్మి ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది. కిందకు దించి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. ఆత్మహత్యకు ముందు లక్ష్మి తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడిందని అతడు అక్కడికి చేరుకునే లోపే ఉరివేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్న కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీస్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. -
ప్లాన్ బెడిసికొట్టింది
జూబ్లీహిల్స్: వేగంగా వచ్చిన దూసుకువచ్చిన కారు ఓ యువకుడిని భీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీజేఆర్ మైనింగ్ కంపెనీకి చెందిన కాంట్రాక్టర్ రఘురాంరెడ్డి తన డ్రైవర్ విష్ణుతో కలిసి గురువారం కారులో జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 మీదుగా పంజగుట్ట వైపు వెళ్తున్నారు. కారు రెయిన్బో ఆస్పత్రి దాటగానే అదుపు తప్పి రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న యువకుడి(22)ని ఢీకొట్టి పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో సదరు యువకుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రఘురాంరెడ్డి తెలివిగా కారు సీటులో నుంచి లేచి తన డ్రైవర్ను కూర్చోబెట్టాడు. రఘురాంరెడ్డికి కూడా స్వల్ప గాయాలు కావడంతో బంజారాహిల్స్లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఈ ప్రమాదం తానే చేసినట్లు డ్రైవర్ విష్ణు పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు అతడిని తమదైన శైలిలో ప్రశ్నించడంతో ప్రమాదం తాను చేయలేదని తన యజమాని చేసినట్లు తెలిపాడు. రఘురాంరెడ్డి నిర్లక్ష్యంగా కారు నడిపినందునే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. తప్పు చేయడమే కాకుండా తప్పించుకుందామనుకున్న రఘురాంరెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక్క బైకు దొంగను పట్టుకుంటే.. 77 బైకులు
కంటోన్మెంట్: తీగలాగితే డొంకంతాకదిలింది... ఒక్క బైకు దొంగను పట్టుకుంటే మూడు కమిషనరేట్ల పరిధిలో జరిగిన77 బైకు దొంగతనాలు బయటపడ్డాయి. పోలీసుల చాకచక్యంతో బైకు దొంగలముఠా గుట్టు రట్టయింది. గత నాలుగైదు నెలల్లోనే చోరీకి గురైన ద్విచక్ర వాహనాలును స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రధాన నిందితులు మొహసీన్, అమీనుల్లా, అక్బర్ గ్యాంగ్లకు చెందిన 15 మంది దొంగలను పట్టుకుని రిమాండ్కు తరలించారు. ఈ మేరకు బుధవారం కార్ఖానా పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎలా దొరికారంటే? కార్ఖానా పోలీసు స్టేషన్ పరిధిలో టీవీఎస్ స్పోర్ట్స్ బైకు చోరీని చేధిస్తున్న క్రమంలో పోలీసులు ముషీరాబాద్కు చెందిన ఆదిల్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని విచారణలో భాగంగా మోహసిన్ అనే మరో బైకుల దొంగతో కలిసి ఆదిల్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. మోహసీన్ వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ఆరు బైకు దొంగతనాలకు పాల్పడి ఈ ఏడాది మార్చి 31 అరెస్టు అయ్యి, మే 21న జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలైన వెంటనే తన గ్యాంగులోని ఐదుగురు అనుచరులు షోయెబ్, సైఫ్, హఫీజ్, ఫైజాన్, సుభాన్లతో కలిసి మరో 15 దొంగతనాలకు పాల్పడ్డాడు. కార్ఖానా పోలీసు స్టేషన్ పరిధిలో చోరీ చేసిన వాహనాన్ని మైలార్దేవ్పల్లికి చెందిన అబ్దుల్లాకు విక్రయించినట్లు మొహసీన్ వెల్లడించాడు. కార్ఖానా పీఎస్ పరిధిలోని వాహనంతో పాటు అబ్దుల్లా నుంచి మరో నాలుగు చోరీ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఉస్మాన్ గంజ్లోని హిందుస్థాన్ పార్సిల్ సర్వీసెస్ ద్వారా నిజామాబాద్కు చెందిన అక్బర్కు ఓ చోరీ వాహనాన్ని తరలించినట్లు గుర్తించారు. ఈ మేరకు హిందుస్థాన్ పార్సిల్కు సంబంధించిన గత ఆరు నెలల రికార్డులు పరిశీలించగా అక్బర్, అస్గర్, మన్నన్ల పేరిట పలు వాహనాలను నిజాబాబాద్కు తరలించినట్లు తేలింది. పదిహేను రోజుల వ్యవధిలోనే అక్బర్కు పలు వాహనాలు అప్పగించినట్లు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించారు. మరికొందరు నిందితులు అబూద్, యాసర్ అరాఫత్ అలియాస్ అప్పూ, అబ్దుల్లా, ఫరూఖ్లను అదుపులోకి తీసుకుని విచారించగా అమీనుల్లా, మొహసీన్ గ్యాంగుల ద్వారా పలు వాహనాలను తాము కొనుగోలు చేసినట్లు చెప్పారు. మొత్తంగా 77 వాహనాలను స్వాధీనం చేసుకుని 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన వాహనాల్లో 41 వాహనాలు ఫైనాన్స్ ఎగవేతకు సంబంధించినవి ఉన్నాయి. ఖరీదైన వాహనాలే లక్ష్యం నిజామాబాద్కు చెందిన అక్బర్, అస్గర్ సోదరులు ఈ భారీ చోరీ ముఠాను నడిపిస్తున్నట్లు తేలింది. హిందూస్థాన్ పార్సిల్ సర్వీసెస్ మేనేజర్ రిజ్వాన్ సహకారంతో చోరీ వాహనాలను నిజామాబాద్కు తరలించినట్లు వెల్లడైంది. నిజామాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ వాహనాల విక్రయాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న డిమాండ్ను బట్టి ఫలానా వాహనం పంపాలంటూ వారు సూచించేవారు. ఆ మేరకే మొహసీన్, అమీనుల్లా గ్యాంగ్లకు చెందిన వ్యక్తులు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల విలువ చేసే ఎన్ఫీల్డ్, కేటీఎం వంటి ఖరీదైన ద్విచక్ర వాహనాలను చోరీ చేసే వారు. రెసిడెన్షియల్ కాలనీలు, ఖాళీ ప్రదేశాల్లో తాము గుర్తించిన వాహనాల హ్యాండిల్ లాక్లను తొలగిస్తారు. అనంతరం ఇగ్నిషన్ కేబుల్స్ను తొలగించి, డైరెక్ట్ కనెక్షన్ ద్వారా వాహనాలు స్టార్ట్ అయ్యేలా చేసి తీసుకెళ్తారు. ఇలా వాహనాలు చోరీ చేసి తీసుకొచ్చిన వారికి ప్రధాన నిందితులు గరిష్టంగా రూ.20 వేలు మాత్రమే ఇచ్చేవారు. ఇదిలా ఉండగా అక్బర్, అస్గర్ గ్యాంగుకు చెందిన వ్యక్తులు ఖరీదైన వాహనాలను ఫైనాన్స్ సంస్థల ద్వారా కొనుగోలు చేసి ఉద్దేశపూర్వకంగానే ఫైనాన్స్ ఎగ్గొట్టేవారు. అనంతరం ఆ వాహనాలను హిందుస్తాన్ పార్సిల్ సర్వీసెస్ ద్వారా నిజామాబాద్కు తరలించేవారు. అక్కడ వీటికి సంబంధించి పత్రాలు సృష్టించి విక్రయించేస్తున్నారు. నార్త్జోన్ పోలీసులకు అభినందనలు భారీ వాహనాల చోరీ గుట్టు రట్టు చేసి పెద్ద సంఖ్యలో నిందితులను అరెస్టు చేయడంలో కీలకంగా పనిచేసిన నార్త్జోన్ పోలీసులను సీపీ అంజనీకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా నార్త్జోన్ డీసీపీ సూచనలతో కార్ఖానా ఇన్స్పెక్టర్ పరవస్తు మధుకర్ స్వామి ఆధ్వర్యంలో సాగిన పూర్తిస్థాయి దర్యాప్తును ఆయన అభినందించారు. ఈ కేసులో కీలకంగా పనిచేసిన అదనపు ఇన్స్పెక్టర్లు ఎం. వెంకటేశం, నేతాజీ, జి.నరేశ్, ఎస్ఐలు ఎన్. సందీప్రెడ్డి, ఎస్ఎన్జీ అవినాశ్ బాబు, రవిపాల్, ఎం.మహేశ్, ఏ. మాధవరెడ్డి, కానిస్టేబుల్స్ శ్రీధర్, రాజశేఖర్, పురుషోత్తం, రాకేశ్, యాదగిరి, శంకర్ నాయక్, హిదయతుల్లాను సీపీ ప్రశంసించారు. -
ఉద్యోగమిస్తామని ఊబిలోకి నెట్టారు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగం కోసం ఎక్కడినుంచో నగరానికి వచ్చిన ఓ యువతికి మాయమాటలు చెప్పి రాష్ట్రాలు దాటించి వ్యభిచార ఊబిలోకి నెట్టింది ఓ జంట. భాషకాని భాష, ప్రాంతం కాని ప్రాంతంలో ధైర్యాన్ని కూడదీసుకుని పోలీసులకు సమాచారమిచ్చి ఆ వ్యభిచార ఊబి నుంచి బయటపడింది ఓ యువతి. వివరాలిలా ఉన్నాయి. అసోంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేసే ఓ యువతి కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ ప్రభావాలతో బతుకుదెరువు కోల్పోయింది. దీంతో ఉద్యోగం కోసం అసోంకు చెందిన ఓ యువతి అక్కడ్నుంచి హైదరాబాద్కు వచ్చింది. లాక్డౌన్ సడలింపుల తర్వాత వచ్చిన ఆమె ఇక్కడి ఓ లాడ్జిలో బస చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం నగరంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆమెకు గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న భార్యాభర్తలు సుమన్ ఖురేషీ, సోను ఖురేషీలతో పరిచయమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉద్యోగం దొరకడం కష్టమని చెప్పి తమతో గుజరాత్కు వస్తే అహ్మదాబాద్ నగరంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ యువతితో నమ్మబలికారు. వీరి మాటలు నమ్మిన ఆ యువతి వారితో వెళ్లేందు కు అంగీకరించింది. గత నెల మొదటి వారం లో యువతిని అహ్మదాబాద్ తీసుకువెళ్లిన సుమన్, సోనులు అక్కడి వత్వా ప్రాంతంలో ని ఓ లాడ్జిలో ఉంచి సదరు భార్యాభర్తలు తమకు పరిచయస్తుల్ని విటులుగా తీసుకొచ్చేవారు. ఆ పని చేయడానికి యువతి నిరాకరించడంతో బెదిరింపులకు దిగారు. ఆ యువతి మొబైల్ లాక్కుని స్విచ్ఛాప్ చేసేశారు. ఈ క్రమంలో గత శనివారం రాత్రి ధైర్యం చేసి తన ఫోన్ చేజిక్కించుని పోలీసులకు సమాచారమందించింది. దీంతో వత్వా పోలీసులు రంగంలోకి దిగి యువతిని రక్షించారు. బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసుకు న్నారు. బాధితురాలు అస్సామీ తప్ప మరో భాష మాట్లాడలేకపోవడంతో ఓ దుబాసీని ఏర్పాటు చేసి బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు. కాగా నిందితుల్లో ఒకరైన సోను ఖురేషీ తప్పించుకునే ప్రయత్నంలో ఖోఖ్రా ప్రాంతంలో పోలీసులకు చిక్కాడు. నిందితురాలు సుమన్ ఖురేషీ కోసం పోలీసు లు గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఓ బృందాన్ని హైదరాబాద్ పంపడానికి వత్వా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిందితులంతా కలసి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు అహ్మదాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. వత్వాలో నిందితులకు సహకరించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. -
సింగిల్ హ్యాండ్ స్నాచర్!
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా చైన్ స్నాచింగ్ కేసుల్లో కనీసం ఇద్దరు నిందితులు ఉంటుంటారు. ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ పంజా విసురుతుంటారు. ఒకరు వాహనం నడిపితే... మరొకరు వెనుక కూర్చుని టార్గెట్ చేసిన వారి మెళ్లో గొలుసులు లాగేస్తుంటారు. అయితే మహారాష్ట్రకు చెందిన అంతరాష్ట్ర నేరగాడు శంకర్రావు బిరాదర్ స్టైలే డిఫరెంట్ ఇతగాడు సింగిల్గానే సంచరిస్తూ స్నాచింగ్స్ చేయడం మొదలెట్టాడు. ఈ ఘరానా నేరగాడిని తూర్పు మండల టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి బషీర్బాగ్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. పౌల్ట్రీ ఫామ్ సోదరుడి పాలుకావడంతో... మహారాష్ట్రలోని లాథూర్ జిల్లా, ప్రకాష్నగర్కు చెందిన శంకర్రావు తన స్వస్థలంలో సోదరుడితో కలిసి పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేశాడు. కొన్నేళ్ల పాటు వీరి వ్యాపారం సజావుగానే సాగింది. వ్యాపారంలో భారీ లాభాలు వస్తుండటంతో శంకర్రావు తమ్ముడి బుద్ధి మారింది. ఆ ఫౌల్ట్రీ ఫామ్ను సొంతం చేసుకున్న అతగాడు శంకర్రావును వెళ్లగొట్టాడు. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. లాథూర్కు చెందిన రాజు అనే పాత నేరగాడితో కలిసి రంగంలోకి దిగాడు. వీరిద్దరూ 2018లో కేవలం మూడు నెలల్లోనే 47 నేరాలు చేశారు. వీటిలో 33 చైన్ స్నాచింగ్స్ కాగా... 14 బైక్ చోరీ కేసులు ఉన్నాయి. పుణే కమిషనరేట్ పరిధిలోని 20 పోలీసుస్టేషన్లలో నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను పరిశీలించిన అక్కడి పోలీసులు రాజును గుర్తించారు. దీంతో వలపన్ని అతడితో పాటు శంకర్రావును 2018 సెప్టెంబర్లో పుణేలోని హడప్సర్ పోలీసులు అరెస్టు చేశారు. అలా కాకూడదనే... పుణేలో తాను చిక్కడానికి రాజుతో జట్టు కట్టడమే కారణమని భావించిన శంకర్రావు మరోసారి అలా జరగకూడదని జైల్లో ఉండగానే నిర్ణయించుకున్నాడు. యరవాడ సెంట్రల్ జైలు నుంచి ఈ ఏడాది జనవరిలో బెయిల్పై విడుదలయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులు మిన్నకుండిపోయిన ఇతగాడు ఆపై తాను ఎవరో తెలియని హైదరాబాద్ నగరాన్ని టార్గెట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వరుసపెట్టి 20–30 స్నాచింగ్స్ చేసి స్వస్థలానికి వెళ్ళిపోవాలని పథకం వేశాడు. ఈ నెల మొదటి వారంలో నగరానికి వచ్చిన ఇతను దినసరి కూలీగా చెప్పుకుంటూ కాటేదాన్ ప్రాంతంలో ఓ చిన్న గది అద్దెకు తీసుకున్నాడు. ఈ నెల 19న లంగర్హౌస్ పరిధిలో ఓ బైక్ చోరీ చేశాడు. దానిపై తిరుగుతూ రెక్కీ చేసిన ఇతగాడు ఆదివారం రంగంలోకి దిగాడు. కాచిగూడ, ఎస్సార్నగర్ పరిధిల్లో రెండు స్నాచింగ్స్ చేశాడు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు సి.వెంకటేష్, జి.శ్రీనివాస్రెడ్డి, గోవింద్ స్వామిలతో కూడిన బృందం రంగంలోకి దిగింది. ఘటనాస్థలాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో ఫీడ్ సేకరించిన వారు దానిని ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఫలితంగా నిందితుడి గుర్తించి గురువారం పట్టుకున్నారు. ఇతడి నుంచి బైక్, 5.5 తులాల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. -
బెట్టింగ్స్ @ సైట్స్!
సాక్షి, సిటీబ్యూరో: రెండు వెబ్సైట్స్కు డిజైన్ చేసి, సబ్–ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని, ఆన్లైన్లో బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సూత్రధారి పరారీలో ఉండగా మిగిలిన ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్రావు బుధవారం వెల్లడించారు. వారి నుంచి రూ.3.15 లక్షల నగదు, సెల్ఫోన్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరేడ్మెట్, ఆర్కేపురం ప్రాంతానికి చెందిన చేతన్ దీపక్ భోగాని ఆన్లైన్లో బెట్టింగ్స్ నిర్వహించడానికి కొత్త విధానాన్ని ఆలోచించాడు. గుజరాత్కు చెందిన ఓడెవలపర్ సాయంతో (www.rkexch.com , www.fordexch.com) పేర్లతో రెండు సైట్స్ అభివృద్ధి చేశాడు. వీటిని ఆండ్రాయిడ్, ఐఓఎస్లతో పాటు కంప్యూటర్లోనూ ఓపెన్ చేసే అవకాశం ఉంది. తన దందాలో పందాలు కాసే వారు (పంటర్లు) కీలకం కావడంతో అలాంటి వారిని గుర్తిస్తూ తనకు సహకరించడానికి బోయిన్పల్లికి చెందిన రాజేష్ కుమార్, సికింద్రాబాద్కు చెందిన నగేష్లను సబ్–ఏజెంట్లుగా నియమించుకున్నాడు. వీరిద్దరూ తమ ప్రాంతాల్లో ఉన్న వారితో పాటు పరిచయస్తులైన యువతను ఆకర్షించేవారు. ఆన్లైన్లో బెట్టింగ్స్కు సిద్ధమైన వారి వివరాలు దీపక్ను అందించేవాడు. అతను పంటర్లకు కొన్ని యూజర్ ఐడీలు, పాస్వర్డ్స్ క్రియేట్ చేసి ఇచ్చేవాడు. ఆయా పంటర్లు వీటి సహకారంతో ఆ రెండు వెబ్సైట్స్లోకి ఎంటర్ అవుతారు. వీటి ద్వారా పోకర్, క్యాసినో, టీన్పట్టి, త్రీకార్డ్స్... ఇలా మొత్తం 15 రకాలైన ఆన్లైన్ గేమ్స్లోకి ఎంటర్ కావచ్చు. వాటి ఆధారంగా ఆన్లైన్లో బెట్టింగ్స్ కాయవచ్చు. ఈ సైట్స్లోకి ఎంటర్ అయిన వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పంటర్లు ఆన్లైన్ బదిలీ, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా నిర్వహించేలా దీపక్ డిజైన్ చేశాడు. ఈ లావాదేవీలపై సబ్–ఏజెంట్లకు కమీషన్ ఇస్తుండేవాడు. వీరి వద్ద 60 మంది పంటర్లు ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఈ దందా నిర్వహించేందుకుగాను వీరు బోయిన్పల్లిలోని రాజేష్కుమార్కు చెందిన ఫ్లాట్ వినియోగిస్తున్నారు. వీరి వ్యవహారంపై ఉత్తర మండల టాస్క్ఫోర్స్కు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్రెడ్డి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్ బుధవారం దాడి చేశారు. దీపక్ పరారుకాగా మిగిలిన ఇద్దరినీ పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను బోయిన్పల్లి పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సైబర్ ‘కీచకుల’ ఆటకట్టు
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్లో, నేరుగా మహిళలను పరిచయం చేసుకుని, వారి ఫొటోలు సంగ్రహించి వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మరోపక్క వివిధ సైబర్ నేరాల్లో మోసపోయిన ఐదుగురు బాధితులు సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించడంతో కేసులు నమోదయ్యాయి. మణికొండ ప్రాంతానికి చెందిన హితేందర్ సింగ్ స్థానికంగా ఫర్నిచర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒడిశా నుంచి వలస వచ్చి నగరంలో నివసిస్తున్న ఓ మహిళతో అతడికి ఆన్లైన్లో పరిచయమైంది. ఆమెను మాటలతో మాయ చేసిన హితేందర్ కొన్ని వ్యక్తిగత ఫొటోలు సంగ్రహించాడు. తన కోరిక తీర్చాలని లేకపోతే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు బుధవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారాసిగూడకు చెందిన హేమంత్ సాగర్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాడు. ఇతడి ఇంటి సమీపంలో ఉండే మహిళ కుటుంబంతో పరిచయం ఉండటంతో తరచు ఆమె ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఈ నేపథ్యంలో అదును చూసుకుని ఆమె ఫొటోలు సంగ్రహించాడు. ఆమెతో చాటింగ్ చేసిన ఇతగాడు ఆపై బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు సోషల్ మీడియాలో అతడిని బ్లాక్ చేసింది. దీంతో హేమంత్ ఆన్లైన్లో ఆమె భర్తను బెదిరించడం మొదలు పెట్టాడు. వివాహిత ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ వేధిస్తుండటంతో బాధితులు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు హేమంత్ నిందితుడిగా గుర్తించారు. అయితే ఆ సమయంలో అతను ఆస్ట్రేలియాలో ఉండటంతో వేచి చూశారు. ఇటీవల ఇండియాకు వచ్చిన ఇతగాడు బెంగళూరులో క్వారంటైన్ పూర్తి చేసుకుని నగరానికి చేరుకున్నట్లు సమాచారం అందడంతో సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అతడిని అరెస్టు చేశారు. సైబర్ నేరాలివీ.. ♦ నగరంలోని బేగంపేట, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు చెందిన ఇద్దరి క్రెడిట్ కార్డులు దుర్వినియోగం అయ్యాయి. వీటిని వినియోగించిన సైబర్ నేరగాళ్లు విదేశాల్లో రూ.1.33 లక్షలు, రూ.1.37 లక్షలు లావాదేవీలు చేశారు. ♦ క్రెడిట్కార్డు రీడిమ్ పాయింట్లు ఖాతాలో జమ చేస్తామంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు నగరవాసి నుంచి కార్డు వివరాలు, ఓటీపీ సంగ్రహించారు. వీటి ఆధారంగా రూ.47 వేలు కాజేశారు. ♦ సిటీకి చెందిన మరో యువకుడికి ఎస్కార్ట్ సర్వీసెస్ పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. వారి మాటల వల్లో పడిన ఇతగాడు తన క్రెడిట్కార్డుకు సంబంధించిన వివరాలు చెప్పడంతో సైబర్ నేరగాళ్లు రూ.70 వేలు కాజేశారు. ♦ రసూల్పుర ప్రాంతానికి చెందిన బాలరాజ్ అనే యువకుడు సెకండ్హ్యాండ్ కారు ఖరీదు చేయాలని భావించాడు. దీనికోసం ఓఎల్ఎక్స్లో సెర్చ్ చేసిన అతడు మాచర్ల నవీన్ కుమార్ పేరుతో ఉన్న సెకండ్ హ్యాండ్ ఇన్నోవా అమ్మకం యాడ్ను చూసి స్పందించాడు. అతడిని సంప్రదించగా బేరసారాల తర్వాత అడ్వాన్సు, రవాణా చార్జీల పేరుతో రూ.1.4 లక్షలు కాజేశాడు. -
ఉద్యోగాలు ఇప్పిస్తామని..
కీసర: సామాజిక మాధ్యమాల ద్వారా అందమైన యువతుల ఫొటోలు చూపుతూ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను కీసర పోలీసులు, మాల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కీసర సీఐ నరేందర్గౌడ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన వంశీరెడ్డి, విజయవాడకు చెందిన అంజలీ, చిన్నలతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను నగరానికి రప్పించి బల్కంపేటలోని ఓ ఇంట్లో నిర్భందించి, వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో సదరు యువతల ఫొటోలను పంపి విటులను ఆకర్షించేవారు. అనంతరం విటుల నుంచి ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకుని అమ్మాయిలను సరఫరా చేసేవారన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వంశీరెడ్డి నలుగురు యువతులను తీసుకొని నాగారం రాంపల్లిచౌరస్తాకు వచ్చినట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాచేతిలో బంధీలుగా ఉన్న పశ్చిమబెంగాల్కు చెందిన ముగ్గురు, విజయవాడకు చెందిన ఒక యువతిని కాపాడి పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. ముఠా నిర్వాహకురాలు అంజలి, ఆమె సహాయకుడు చిన్న పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు. రాచకొండ సీపీ మహేష్భగవత్ పర్యవేక్షణలో అడిషనల్ డిప్యూటి కమిషనర్ సురేందర్రెడ్డి, ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నవీన్కుమార్, కీసర సీఐ నరేందర్గౌడ్ , ఎస్సై శ్రీకాంత్ దాడుల్లో పాల్గొన్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
జుట్టు రాలి పోతుందనే మనస్తాపంతో..
సాక్షి, హైదరాబాద్: జుట్టు రాలిపోతుందనే బెంగతో ఓ యువకుడు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. గదిలో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 25న మేడ్చల్ జిల్లా ఉప్పల్లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. నితిన్ అనే యువకుడు స్నేహితులతో కలిసి సత్యనగర్ కాలనీలో నివసిస్తున్నాడు. క్యాటరింగ్ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. నితిన్ తన ఆదాయంలోనే కొంత తల్లిదండ్రులకు కూడా పంపి. మరికొంత డబ్బు దాచుకునేవాడు. డబ్బు దాచుకోవడానికి కారణం ఉంది. ఇటీవల నితిన్ కు జుట్టు రాలిపోతుండడంతో తీవ్ర ఆందోళనకు గుర య్యేవాడు. ఓవైపు పెళ్లి కూడా కాలేదు. దాంతో పెళ్లికి ముందే జుట్టంతా ఊడిపోతే ఎలా అని భావించి, హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం డబ్బు పొదుపు చేయడం మొదలుపెట్టాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో డబ్బు సంపాదన నిలిచిపోవడం. దానికితోడు సోదరి పెళ్లికి డబ్బు పంపాలని ఇంటి నుంచి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో, తీవ్ర మనస్తాపం చెందిన నితిన్, ఈనెల 25న స్నేహితులు గదిలో లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, పెళ్లి కాకముందే జుట్టంతా రాలిపోతోందన్న ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గంటలో 45 కార్డుల సరుకులు కొట్టేశాడు!
కుషాయిగూడ: ఓ రేషన్ షాపునకు చెందిన సుమారు 45 రేషన్ కార్డుల సరుకులను మరో రేషన్ డీలర్ ఒకే రోజు గంట వ్యవధిలో కొట్టేసి హైటెక్ మోసానికి పాల్పడ్డాడు. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఓ బాధితుడు వాయిస్ క్లిప్పింగ్ను వాట్సాప్లో షేర్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. చిన్న చర్లపల్లికి చెందిన 3302105 నంబర్ రేషన్ షాపు డీలర్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.....ఇతని షాపునకు చెందిన 45 రేషన్ కా ర్డుల నుంచి ఈ నెల 20న ఒకే రోజు గంట వ్యవధిలో మరో డీలర్ స రుకులన్నీ కొట్టేశాడు. శంకర్ ఈ విషయాన్ని పసిగట్టలేదు. పోర్టల్ సిస్టమ్లో ఎవ్వరు ఎక్కడైనా సరుకులు తీసుకోవచ్చనే భావనలో ఉన్నా డు. అయితే ఈ నెల 22 ఎస్ఓటీ పోలీసులమంటూ వచ్చిన కొందరు నీ రేషన్ షాపునకు చెందిన 45 కార్డుల నుంచి ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ రేషన్ డీలర్ సరుకులు కాజేశాడని, అసలు ఏం జరుగుతుందంటూ నిలదీశారు. దీంతో కంగుతిన్న శంకర్ తనకు ఎలాంటి సంబంధం లేదని, సరుకులు కొట్టేసిన విషయం కూడా మీ ద్వారానే తెలిసిందని చెప్పాడు. ఈ విషయంపై డీఎస్ఓ స్పందిస్తూ.. జరిగిన ఘట న తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
ఇన్స్ట్రాగామ్ ఖాతాలున్న యువతులే టార్గెట్
సాక్షి, సిటీబ్యూరో: సోషల్మీడియా యాప్ ఇన్స్ట్రాగామ్ వేదికగా యువతులు, మహిళల్ని పరిచయం చేసుకొని.. కొన్నాళ్ల పాటు స్నేహంగా ఉంటూ చాటింగ్ చేస్తాడు... ఆపై తన వద్ద కొన్ని ‘ఫొటోలు’ ఉన్నాయంటూ బెదిరింపులకు దిగుతాడు... ఓ బాధితురాలి నుంచి వీలున్నంత వసూలు చేసిన తర్వాత ఆమె స్నేహితురాళ్లనే టార్గెట్గా చేసుకుంటాడు... ఈ పంథాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో వందల మందిని మోసం చేసిన ఓ బ్లాక్మెయిలర్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై సైబర్ క్రైమ్ ఠాణా సహా నగరంలోనే ఎనిమిది కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించామని సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి గురువారం వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహ్మద్ అహ్మద్ ఆరో తరగతి వరకే చదివాడు. ఆపై తన స్వస్థలంలోనే చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇన్స్ట్రాగామ్లో ఖాతా ఉన్న ఇతగాడు దాని ద్వారానే మహిళలు, యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. వాళ్లు యాక్సప్ట్ చేసిన తర్వాత కొన్నాళ్లు స్నేహపూర్వకంగా చాటింగ్ చేస్తాడు. ఇలా వారి నమ్మకం పొందే అహ్మద్ సెల్ ఫోన్ నంబర్ తీసుకుంటాడు. ఆ తర్వాత నుంచి వాట్సాప్లో చాటింగ్, కాల్స్ చేసే ఇతగాడు ఎదుటి వారు పూర్తిగా తనను నమ్మారని నిర్థారించుకున్నాక అసలు పని ప్రారంభిస్తాడు. వారి ఇన్స్ట్రాగామ్ ఖాతా నుంచి సంగ్రహించిన ఫొటోలను వారికే షేర్ చేస్తాడు. వీటితో పాటు తన వద్ద మరికొన్ని వ్యక్తిగత ఫొటోలు ఉన్నాయంటూ బెదిరిస్తాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలంటే తాను కోరిన మొత్తం చెల్లించాలంటాడు. ఇలా టార్గెట్ చేసిన యువతి/మహిళ నుంచి అందినకాడికి తన ఖాతాల్లో డిపాజిట్ లేదా ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. ఇలా ఓ బాధితురాలి నుంచి వసూలు చేయడం పూర్తయిన తర్వాత ఆమె పేరు, ఫొటోతో ఇన్స్ట్రాగామ్లోనే నకిలీ ఖాతా సృష్టిస్తాడు. దీని ఆధారంగా ఆమె ఫ్రెండ్ లిస్ట్లోని యువతులు, మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. యాక్సప్ట్ చేసిన వారితో కొన్నాళ్లు చాటింగ్, కాల్స్ చేసి ఆపై బెదిరింపులకు దిగుతాడు. బాధితుల నుంచి డబ్బు వసూలు చేయడంతో పాటు తనతో సన్నిహితంగా ఉండాలనీ బెదిరిస్తాడు. ఇతడిపై నగరంలోని సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్తో పాటు కామాటిపుర, గోల్కొండ, నారాయణగూడ, మీర్చౌక్, ఫలక్నుమ, సంతోష్నగర్, నేరేడ్మెట్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఇతడి వల్లోపడి రూ.10 వేలు చెల్లించిన ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దీన్ని ఇన్స్పెక్టర్ బి.రమేష్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి అహ్మద్ను నిందితుడిగా గుర్తించారు. ఆదోని వెళ్లిన ప్రత్యేక బృందం గురువారం అరెస్టు చేసి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వందల మందిని ఇతగాడు ఈ పంథాలో మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ వివరాలు సేకరించడానికి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
అమ్మకు సీరియస్గా ఉంది.. డబ్బులు కట్టాలి
పంజగుట్ట: ‘‘మా అమ్మకు సీరియస్గా ఉంది ... అర్జెంటుగా ఆసుపత్రిలో డబ్బులు కట్టాలి ... నా కార్డులు పనిచేయడంలేదు.. కొద్దిగా డబ్బులు ఉంటే సర్దండి. వెంటనే ఆన్లైన్లో పేమెంట్ చేస్తా’’ అని నమ్మబలికి 13 కార్పొరేట్ ఆసుపత్రుల వద్ద పలువురి నుంచి సుమారు రెండు లక్షల వరకూ వసూలు చేసి పారిపోయిన నిందితుడ్ని పంజగుట్ట క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం పశ్బిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ తిరుపతన్న, ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, క్రైమ్ ఇన్స్పెక్టర్ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం... హనుమకొండ, వికాస్ నగర్కు చెందిన కాసిడి రాజ రోహిత్ రెడ్డి అలియాస్ రోహిత్ అలియాస్ చిన్ను(27) నిరుద్యోగి. త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మోసాలు చేస్తున్నాడు. నగరంలోని పలు కార్పొరేట్ ఆసుపత్రులను ఎంచుకుంటాడు. అక్కడ మాటువేసి తన డెబిట్, క్రెడిట్ కార్డులు పని చేయడం లేదని అమాయకులకు చెప్పి నగదు తీసుకుంటాడు. ఆన్లైన్లో పేమెంట్ చేసినట్టు నటించి తన ఫోన్లో ఉన్న ట్రాన్సక్షన్ సక్సెస్ అనే పాత మెసేజ్ను చూపించి అక్కడి నుంచి జారుకుంటాడు. ఇలా రూ.1,98,850 వరకు చీటింగ్ చేశాడు. పంజగుట్ట క్రైమ్ పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకొని రూ.30 వేల నగదు, ఓ మొబైల్ ఫోన్ స్వాధీనంచేసుకున్నారు. -
చికెన్ తిన్న తర్వాతే స్పృహ తప్పింది....
చందానగర్: అనుమానాస్పద స్థితిలో ఓ కుటుంబంలోని తల్లి, కూతురు, కొడుకు స్పృహ కోల్పోయారు. ఇంటి యజమానే చికెన్లో మత్తుమంది కలిపి ఆపై లైంగిక దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చందానగర్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన ఓ కుటుంబం కొద్ది సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చింది. శేరిలింగంపల్లిలోని సందయ్యనగర్లో బాధిత మహిళ (35), భర్త, కూతురు (15) కొడుకు (10) నివాసం ఉంటున్నారు. వీరు కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరి ఇంటి యజమాని అయిన గంగాధర్ ‡(45) మసీద్బండలో ఉంటూ టైలర్గా పని చేస్తున్నాడు. సందయ్యనగర్ లోని తన ఇంటిలోని ఒక పోర్షన్ వీరికి అద్దెకు ఇవ్వగా.. మిగతా పోర్షన్లు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల ఇంటిని యజమాని అమ్మకానికి పెట్టాడు. ఈ క్రమంలో మంగళవారం గంగాధర్ తన అసిస్టెంట్లు నగేష్ (48), గణేష్(40)తో కలిసి వచ్చాడు. చికెన్ తీసుకువచ్చి అద్దెకుంటున్న మహిళకు వండిపెట్టమని ఇచ్చారు. సదరు మహిళ చికెన్ వండి ఇవ్వగా.. వారు తిన్న తర్వాత మిగిలిన చికెన్ను ఆమెకు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 4 గంటల ఆ చికెన్ తిన్న తల్లి, కుతురు, కొడుకు సృహ కోల్పోయారు. కూలీ పనులు ముగించుకొని రాత్రి 9 గంటలకు భర్త ఇంటికి వచ్చాడు. వచ్చే సరికి భార్య, కూతురు, కొడుకు స్పృహతప్పి పడి ఉన్నారు. ఆందోళన చెందిన అతను స్థానికుల సహాయంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించగా స్పృహలోకి వచ్చారు. చికెన్ తిన్న తర్వాత తాము స్పృహ కోల్పోయామని భర్తతో మహిళ చెప్పింది. చికెన్లో మత్తు మందు కలిపి ఇచ్చి అనంతరం తల్లి, కూతరుపై లైంగిక దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బాధితులు బుధవారం చందానగర్ పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి యజమానిని, అసిస్టెంట్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితులకు పరీక్షలు చేయించామని రిపోర్ట్స్ వచ్చాకే మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డారా..? లేదా...? అన్న విషయం తెలుస్తుందని ఇన్స్పెక్టర్ తెలిపారు. తల్లీకూతుళ్లు ఉస్మానియాలో, కొడుకు నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికెన్ తిన్న తర్వాతే స్పృహ తప్పింది.... ఇంటి యజమాని గంగాధర్, నగేష్, గణేష్లు మంగళవారం సాయంత్రం వచ్చి చికెన్ వండి ఇవ్వమని ఇచ్చారని బాధిత మహిళ తెలిపింది. మిగిలిన చికెన్ ఇవ్వగా కూతురు, కొడుకుతో పాటు తాను తిన్నామని తెలిపింది. కొద్ది సేపటికే కళ్లు తిరిగి స్పృహ కోల్పోయామని ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదన్నారు. గత మూడు రోజులుగా వారు ఇక్కడికి వస్తున్నారని, వారితో గుర్తు తెలియని అమ్మాయిలు వస్తున్నారని చెప్పింది. రూ.20 వేలు ఇస్తామని పోలీసులకు చెప్పవద్దని మధ్యవర్తులచే ముగ్గురు వ్యక్తులు చెప్పించారని పేర్కొంది. -
‘దొంగతనాల’ ద్వారానే ఆ డ్రగ్స్ బయటకి..
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వైరస్ విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి యాంటీ వైరల్ డ్రగ్స్కు భారీ డిమాండ్ వచ్చింది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి అనేక ముఠాలు రంగంలోకి దిగాయి. స్థానిక గ్యాంగ్స్తో పాటు అంతరాష్ట్ర ముఠాలు వ్యవస్థీకృతంగా దందా చేస్తున్నాయి. ప్రధానంగా రెమిడెసివీర్, ఆక్టెమ్రా, ఫాబి ఫ్లూ వంటి యాంటీ వైరల్ ఔషధాలు బ్లాక్ మార్కెట్కు తరలుతున్నాయి. పరిస్థితి విషమంగా ఉన్న కోవిడ్ రోగుల చికిత్సలో వీటిని వినియోగిస్తుండటంతో గతంలో ఎన్నడూలేని విధంగా వీటి ప్రాధాన్యం పెరిగింది. ఈ గ్యాంగ్స్ రకరకాలుగా ఈ యాంటీ వైరస్ ఔషధాలను సంగ్రహిస్తున్నాయి. ప్రధానంగా ‘దొంగతనాల’ ద్వారానే ఈ డ్రగ్స్ బయటకు వస్తున్నాయని అధికారులు గుర్తించారు. నగరంలోని వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న సిబ్బంది, ఫార్మసిస్టులు ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ ఔషధాలను నేరుగా ఆస్పత్రులకే విక్రయించాల్సి ఉన్నా... అడ్డదారిలో బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈ గ్యాంగ్ రోగుల్ని ముంచుతోంది. కొందరు ఆస్పత్రి ఉద్యోగులు మెడికల్ షాపులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని కథ నడిపిస్తున్నారు. (యాంటిజెన్ పరీక్షల్లో నెగెటివ్ సీటీస్కాన్లో పాజిటివ్) సంగారెడ్డిలో ఉన్న హెటిరో, గోవా కేంద్రంగా పని చేస్తున్న సిప్లా సంస్థలు మాత్రమే ఈ యాంటీ వైరల్ ఔషధాలను తయారు చేస్తున్నాయి. హెటిరో సంస్థ తమ రెమిడెసిమీర్ ఇంజెక్షన్ను రూ.5400, సిప్లా సంస్థ తాము తయారు చేస్తున్న సిప్రెమీ ఇంజెక్షన్ను రూ. 4000కు విక్రయిస్తున్నాయి. వీటిని డిస్ట్రిబ్యూటర్ల ద్వారా కేవలం ఆస్పత్రులకు మాత్రమే అమ్మాల్సి ఉంది. అమెరికాలో తయారవుతున్న ఫాబి ఫ్లూ టాబ్లెట్స్ సైతం కోవిడ్ రోగులకు వినియోగిస్తున్నారు. ఇది ఒక్కో స్ట్రిప్ రూ. 3500కు విక్రయిస్తోంది. ఈ ఔషధాలను రోగులకు విక్రయించాలంటే భారీ తతంగమే ఉంటుంది. రోగి ఆధార్ కార్డు ప్రతి, కరోనా పాజిటివ్ రిపోర్ట్, వైద్యులు రాసిన చీటీలతో పాటు రోగి కన్సంట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ దాఖలు చేసిన తర్వాత రోగికి అసరమైన మేరకు ఈ ఔషధాలను అందిస్తున్నారు. వినియో గించగా మిగిలిన డోసుల్ని తిరిగి ఇవ్వాలనే నిబంధన ఉన్నా అమలు కాదు. కొందరు రోగులకు సగం డోసులు ఇచ్చిన తర్వాత వారు కోలుకుంటూ ఉంటారు. (ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లు సగం మనకే ) మిగిలిన డోసుల్ని ఆయా ఆస్పత్రుల్లో పని చేసే ఉద్యోగులు, ఫార్మసిస్టులు చోరీ చేస్తున్నారు. ఔషధాలు వినియోగిస్తూ, అసలు వాడకుండానే రోగులు మరణిస్తే ఆ డ్రగ్స్ను స్వాహా చేసి మెడికల్ షాపుల ద్వారా లేదా దళారుల సహకారంతో అవసరమైన రోగులకు అమ్ముతున్నారు. రూ. 5,400 ఖరీదు చేసే రెమిడెసివీర్ గరిష్టంగా రూ. 40 వేలకు, రూ. 40 వేలు ఖరీదు చేసే ఆక్టెమ్రా రూ. లక్షకు, రూ. 3500 ఖరీదు చేసే ఫాబిఫ్లూ రూ. 5 వేలకు అమ్ముతున్నారు. ఈ వ్యవహారంపై ఇటు పోలీసులతో పాటు అటు ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. టాస్క్ఫోర్స్, ఎస్ఓటీ అధికారులు ఇలాంటి గ్యాంగ్స్పై నిఘా ముమ్మరం చేశాయి. ఫలితంగా గడిచిన పది రోజుల్లో ఐదు ముఠాలు చిక్కాయి. వీరిలో అత్యధికులు దవాఖానా ఉద్యోగులు, మెడికల్ షాపుల నిర్వాహకులు, డిస్ట్రిబ్యూటర్లు ఉండటం గమనార్హం. ఇటీవల చిక్కిన ‘డ్రగ్స్’ ముఠాలివీ.. ♦ దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు గత మంగళవారం ఎనిమిది మంది సభ్యులతో కూడిన అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 35 లక్షల విలువైన యాంటీ వైరస్ ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో నలుగురు ఔషధ విక్రయ రంగంలో ఉన్న వారే. ♦ ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఇద్దరిని అరెస్టు చేసి రూ. 5.6 లక్షల విలువైన రెమిడెసిమీర్ ఇంజెక్షన్లు, ఫాబి ఫ్లూ టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అన్నదమ్ములైన ఈ ద్వయం చిలకలగూడ, రామ్గోపాల్పేటల్లో మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. ♦ పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి తొమ్మిది రెమిడెసిమీర్, ఒక సిప్రెమీ ఇంజెక్షన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడుగురిలో ఆరుగురు నగరంలోని మూడు ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వారే. ♦ ఆదివారం తూర్పు మండల టాస్క్ఫోర్స్ పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. నగరంలోని ఓ మెడికల్ షాపు, మరో దవాఖానాలో పని చేస్తున్న వీళ్లు రెమిడెసివీర్ ఇంజెక్షన్ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ♦ సోమవారం మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు రెమిడెసివీర్ ఇంజెక్షన్లు, ఫావిపిరవిర్ అనే మాత్రలను అధిక ధరలకు అమ్ముతున్న నలుగురిని అరెస్టు చేశారు. కుషాయిగూడలోని ఓ మెడికల్ షాపు కేంద్రంగా ఈ దందా సాగుతోంది. -
భార్య మృతి.. భర్త ఆత్మహత్య
పంజగుట్ట: అనుమానాస్పద స్థితిలో భార్య మరణించింది. భవనంపై నుంచి దూకి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల బంధువుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లగడపు నాగేశ్వర రావు(37), రోజా (29) దంపతులు. వీరికి అర్చక్ (9), భరత్(6) ఇద్దరు కొడుకులున్నారు. ఆరు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి బీఎస్ మక్తాలో నివాసం ఉంటున్నారు. నాగేశ్వర రావు, రోజా ఇద్దరూ కూలీ పనులకు వెళ్తుండగా పిల్లలు స్థానికంగా ఉన్న సంతోషి మాతా స్కూల్లో ఒకరు మూడవ తరగతి, మరొకరు ఒకటవ తరగతి చదువుతున్నారు. మంగళవారం తెల్లవారు జామున సుమారు 5 గంటల ప్రాంతంలో వీరు ఉండే భవనం ఐదవ అంతస్తుకు వెళ్లిన నాగేశ్వరరావు ఎలివేషన్ రేలింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమీపంలోనే రోజా తల్లిదండ్రులు ఉండటంతో వారు సమాచారం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే నాగేశ్వరరావు మృతి చెందాడు. వీరు నివాసం ఉండే మూడవ అంతస్తుకు వెళ్లిచూడగా మంచంపై రోజా మృతి చెంది ఉండగా ఇద్దరు పిల్లలు రోజాకు అటు ఒకరు, ఇటువైపు ఒకరు పడుకుని ఉన్నారు. రోజా మరణంపై అనుమానాలు రోజా మరణంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరికి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా నాగేశ్వర్రావు మేస్త్రీ పనిచేస్తుండగా, రోజా కూడా అతనితో పాటు కూలీ పనికి వెళ్లేదని, ఇద్దరూ కలిసి రోజు కనీసం రూ. 1500 వరకు సంపాదించేవారని బంధువుల ద్వారా తెలిసింది. పిల్లలను అడిగితే నాలుగు రోజులుగా తల్లిదండ్రుల మధ్య స్వల్ప ఘర్షణలు అవుతున్నట్లు అవి ఎందుకో తెలియవని చెపుతున్నట్లు తెలిసింది. కాగా రోజా బాడీపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. రోజాను చంపి భయంతో నాగేశ్వర రావు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరే కారణమేమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనాథలైన పిల్లలు... తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు. ఇద్దరు చిన్న పిల్లలకు తల్లిదండ్రులు లేరు అని తెలియక ఆడుకుంటున్నారు. పిల్లల అమ్మమ్మ వారిని పట్టుకుని ఏడుస్తున్న తీరు చూపరుల హృదయాలను కలచివేసింది. -
ఆధార్ కార్డు ఆధారంగా ఆస్పత్రికి అనుమతి..
సాక్షి, సిటీబ్యూరో: వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కిన సూడో డాక్టర్ల కేసులో అనేక కొత్త, ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం చనిపోయిన తన సోదరుడి కోరిక మీదటే ఈ ఆస్పత్రి ఏర్పాటు చేశానంటూ సుభానీ చెప్పుకొచ్చాడు. వైద్య పరంగా ఎలాంటి అర్హతలు లేని ఇతడి స్నేహితుడు ముజీబ్ ఏకంగా చిన్న పిల్లల వైద్యడి (పిడియాట్రిషన్) అవతారం ఎత్తాడు. ఈ వ్యవహారంలో అత్యంత కీలక విషయం ఏమిటంటే... కేవలం ఆధార్ కార్డు ఆధారంగా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన డీఎం అండ్ హెచ్ఓ అధికారులు వీరి ఆస్పత్రికి అనుమతి ఇచ్చేయడం. బీకాం మధ్యలో ఆపేసిన మెహదీపట్నం ప్రాంతానికి చెందిన మహ్మద్ షోయబ్ సుభానీకి ఓ సోదరుడు ఉండేవాడు. డాక్టర్ కావాలని, ఓ ఆస్పత్రి పెట్టాలని ఎంతగానే ఆశపడ్డాడు. అయితే అతడు ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతూ చనిపోయాడు. తన సోదరుడి కోరిక తీర్చాలనే ‘లక్ష్యం’తో ఉన్న సుభానీకి ముజీబ్తో పరిచయం ఏర్పడింది. హుమాయున్నగర్లోని ఎంఎం హాస్పిటల్లో మేనేజింగ్ డైరెక్టర్గా పని చేసిన అనుభవం ఇతడికి ఉందని తెలియడంతో సుభానీ తన ఆలోచన చెప్పాడు. అలా ఆస్పత్రి ఏర్పాటు చేసి నిర్వహిస్తే భారీ లాభాలు ఉంటాయంటూ తనకున్న అనుభవంతో ముజీబ్ చెప్పాడు. దీంతో ఆస్పత్రికి అవసరమైన అనుమతి పొందడంపై దృష్టి పెట్టిన ‘టెన్త్ క్లాస్’ ముబీబ్ డాక్టర్ మహ్మద్ అబ్దుల్ ముజీబ్ పేరుతో ఓ ఆధార్ కార్డు సంపాదించాడు. (‘కొవిడ్’ తీగలాగితే బయటపడ్డ సూడో డాక్టర్లు! ) దీని ఆధారంగా 2017లో డీఎం అండ్ హెచ్ఓకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇతగాడు తాను డాక్టర్ని అంటూ ఎలాంటి నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించలేదు. కేవలం డాక్టర్ అని పేరు ముందు ఉన్న ఆధార్ కార్డును పొందుపరచగా డీఎం అండ్ హెచ్ఓ అధికారులు అనుమతి ఇచ్చారంటూ ఇతగాడు పోలీసులకు చెప్పాడు. ఇలా సమీర్ పేరుతో ఆస్పత్రి ఏర్పాటు చేసిన ఈ ద్వయం వైద్యం చేయడం మొదలెట్టింది. సుభానీ చైర్మన్గా, ముజీబ్ ఎండీగా ఈ ఆస్పత్రి నిర్వహిస్తూ వచ్చారు. తన పేరు పక్కన ఎండీ అని రాసుకునే ముజీబ్ ఎవరైనా గుచ్చిగుచ్చి అడిగితే తాను మెడిసిన్లో ఎండీ చేయలేదని, కేవలం ఆస్పత్రికి ఎండీనని చెప్పుకొచ్చేవాడు. ఇలా దాదాపు నాలుగేళ్లుగా అనేక మందికి ఈ ద్వయం వైద్యం చేస్తూ వచ్చింది. కోవిడ్ మందుల బ్లాక్ మార్కెటింగ్ ముఠా చిక్కడంతో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ ఔషధాల కేసుకు సంబంధించిన పూర్వాపరాలు ప్రశ్నించడానికి ఇరువురినీ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వీరి గుట్టురట్టైంది. ఆధార్ కార్డులో పేరు ముందు డాక్టర్ అనే పదం ఎలా వచ్చిందంటూ పోలీసులు ముజీబ్ను కోరారు. తాను సుదీర్ఘ కాలంగా వివిధ ఆస్పత్రుల్లో పని చేశానని, ఈ నేపథ్యంలోనే తనని అందరూ డాక్టర్ అని పిలుస్తారని చెప్పాడు. ఆధార్ కార్డులు జారీ చేసే వారు తమ వద్దకు వచ్చినప్పుడు తాను చెప్పకుండానే వాళ్లే డాక్టర్ అని పేరు ముందు పెట్టేశారంటూ చెప్పుకొచ్చాడు. ఈ సూడో డాక్టర్లను రిమాండ్కు తరలించిన ఆసిఫ్నగర్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. త్వరలో డీఎం అండ్ హెచ్ఓ అధికారులకూ నోటీసులు జారీ చేసి ఆస్పత్రి రిజిస్ట్రేషన్పై ప్రశ్నించనున్నారని తెలిసింది. అసలు ఎలాంటి వైద్య విద్యకు సంబంధించిన డిగ్రీలు లేకుండా, వాటిని దాఖలు చేయకుండా ఆధార్ కార్డులో పేరు ముందు డాక్టర్ పదం ఆధారంగా ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతి ఎలా ఇచ్చారు? దానికి బాధ్యులు ఎవరు? ఈ వ్యవహారం వెనుక మతలబు ఏంటి? తదితర అంశాలు ఆరా తీయాలని పోలీసులు నిర్ణయించారు. -
అసలు ధర 10వేలు.. ఇచ్చే ధర 25 వేలు
ఎల్బీనగర్కు చెందిన ఓ యువకుడి తాతకు కరోనా పాజిటివ్గా తేలింది. కానీ వ్యాధి లక్షణాలు పెద్దగా లేవు. దీంతో వైద్యులు ఇంట్లోనే ఉండాలని వృద్ధుడికి సూచించారు. ఎక్కువ వయసు కావడంతో ఆక్సిజన్ పెట్టాలన్నారు. ఆక్సిజన్ సిలిండర్ కొనేందుకు వివిధ కంపెనీలకు ఫోన్ చేశారు సదరు యువకుడు. ప్రస్తుతం స్టాక్ లేదని, రెండు మూడు రోజుల్లో వస్తుందని ఓ కంపెనీ చెప్పింది. ఆ తర్వాత మాట మార్చింది. ఆర్డర్లు చాలా ఉన్నాయి. ధరలు బాగా పెరిగాయి. అత్యవసరమైతే తాము చెప్పిన ధర చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో 13 కేజీల సిలిండర్ రూ.25 వేలు చెల్లించి కొనుగోలు చేశారు. సాధారణ రోజుల్లో ఈ సిలిండర్ రూ.10 వేలకే లభిస్తుంది. కానీ.. కరోనా వేళ కాసుల దందా చేస్తున్న కొన్ని కంపెనీలు దోపిడీ చేస్తున్నాయి. నగరంలో సిలిండర్ల అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందనడానికి ఈ ఉదాహరణ ఓ మచ్చుతునక. సిలిండర్ ధర కంటే ఎక్కువగా తీసుకొని విక్రయిస్తుండటం షరామామూలుగా మారింది. కొంత మంది వ్యాపారులు వందల సంఖ్యలో సిలిండర్లు ఉన్నా స్టాక్ లేదనే సాకుతో ఎక్కువ డబ్బులు గుంజుతున్నారు. సాక్షి సిటీబ్యూరో: గ్రేటర్లో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది ముందస్తుగా వైద్య పరికరాలు కొనుగోలు చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇటు ఆక్సిజన్ సిలిండర్ కంపెనీలు అటు అక్రమ వ్యాపారులు ధరలు విపరీతంగా పెంచి విక్రయిస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ఎన్నో అక్రమాలు వెలుగు చూశాయి. నగరంలో ఎక్కువగా మెడికల్ దుకాణాలు కేంద్రంగా సిలిండర్ల అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎల్బీనర్, మలక్పేట్, నాంపల్లి, కోఠి, కూకట్పల్లి, మెహిదీపట్నం, టోలిచౌకితో పాటు పాతబస్తీలోని పలు మెడికల్ పాపుల నిర్వాహకులు లైసెన్స్ ఉన్న కంపెనీల నుంచి అక్రమంగా సిలిండర్లు కొనుగోలు చేసుకున్నారు. వీటిని నిల్వ చేసి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ‘సాక్షి’ సర్వేలో వెలుగు చూసింది. సిలిండర్ కావాలని అడిగితే ముందు లేదని చెబుతున్నారు. ఆ తర్వాత పరిచయం ఉన్న వ్యక్తి పేరు చెబితే మాత్రం సిలిండర్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. తాము చెప్పిన ధర ఇవ్వాలని లేని పక్షంలో సిలిండర్ లేదని తెగేసి చెబుతున్నారు. కరోనా వేళ కేటుగాళ్లు క్యాష్ చేసుకోవడంతో చేతివాటం కనబరుస్తున్నారు. అవసరాన్ని బట్టి.. గ్రేటర్లో కరోనా వ్యాధి విశ్వరూపం దాలుస్తుండటంతో వ్యాధి బారినపడిన వారికి ఆసుపత్రుల్లో వైద్యం సరిగా అందలేదు. దీంతో రోగులు ఇళ్ల వద్దే ఉండి వైద్యం చేయించుకుంటున్నారు. రోగం ముదరక ముందు అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చుకుంటున్నారు. రోగుల సంబంధీకులు ఇందులో భాగంగా ఆక్సిజన్ సిలిండర్లు కూడా కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు. కొందరు డాక్టర్ల సూచనల మేరకు రోగులకు ఆక్సిజన్ పెడుతున్నారు. అయితే కరోనా వ్యాధి తీవ్రతతో జనం ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో నగరంలో జోరుగా అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్ దందా సాగుతోంది. సిలిండర్ అసలు ధర కంటే రెండు మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఎంత అత్యవసరమైతే అంత ఎక్కువ ధర తీసుకుంటున్నారు. లైసెన్స్ లేకపోయినా ఫిల్లింగ్.. లైసెన్స్ లేకపోయినా సిలిండర్లు ఫిల్లింగ్ చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు జంబో, పెద్ద సిలిండర్లు కంపెనీల నుంచి తీసుకొచ్చి ఇళ్లలో, షాప్ల్లో రీఫిల్లింగ్ చేస్తున్నారు. జంబో, పెద్ద సిలిండర్ల ద్వారా పైప్లైన్స్ ఏర్పాటు చేసి ఎల్పీజీ సిలిండర్ ఫిల్లింగ్ చేసినట్లు ఆక్సిజన్ సిలిండర్లు ఫిల్ చేస్తున్నారు. 10 కేజీల సిలిండర్ రూ.500 నుంచి రూ.800 వరకు, 13 కేజీల సిలిండర్ రూ. 1000 నుంచి రూ.1200కు ఫిల్లింగ్ చేస్తున్నారు. కొంతమంది పూర్తిగా సిలిండర్ ఫిల్లింగ్ చేయడం లేదు. ఎందుకంటే కొనుగోలు చేసినప్పుడు వచ్చినంత బరువు ఉండడం లేదు. అదేవిధంగా కొత్తగా కొన్న సిలిండర్ మూడు నుంచి నాలుగు రోజులు వస్తే ఫిలింగ్ చేసిన సిలిండర్ రెండు రోజులకే అయిపోతోంది. ఫిల్లింగ్కు ఒకవైపు ఎక్కువ డబ్బులు మరోవైపు తక్కువగా ఫిలింగ్ చేస్తూ ఆపదలో ఉన్నవారిని మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. లెసెన్స్ ఉంటేనే విక్రయించాలి.. గ్రేటర్తో పాటు శివారు ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్ల ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి డ్రగ్స్ కంట్రోల్ అనుమతి తీసుకోవాలి. ఈ కంపెనీలు మాత్రమే ఆక్సిజన్ ఫిల్లింగ్తో పాటు నాణ్యమైన సిలిండర్లు తయారు చేసి విక్రయిస్తాయి. అక్రమ వ్యాపారులు కంపెనీల నుంచే సిలిండర్లు కొనుగోలు చేసి తమ వద్ద నిల్వ చేసుకొని ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. సిలిండర్ల రీఫిల్లింగ్ కంపెనీల్లోనే చేయాలి. కానీ అన్ని ప్రాంతాల్లో కంపెనీ రీఫిల్లింగ్ అందుబాటులో లేకపోవడంతో పలువురు జంబో, పెద్ద సిలిండర్ల ద్వారా ఇళ్లలో, షాప్ల్లో రీఫిల్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం తెలిసినా డ్రాగ్స్ కంట్రోల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
‘కొవిడ్’ తీగలాగితే బయటపడ్డ సూడో డాక్టర్లు!
సాక్షి, సిటీబ్యూరో: ఒకరు చదివింది ఇంటర్మీడియట్... మరొకరు పదో తరగతితో స్వస్థి చెప్పారు... అయినప్పటికీ ఇద్దరూ వైద్యుల అవతారం ఎత్తారు. ఒకరు చైర్మన్గా, మరొకరు మేనేజింగ్ డైరెక్టర్గా సమీర్ హాస్పిటల్ పేరుతో వైద్యశాల సైతం నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వీరిద్దరి వ్యవహారంపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ పి.రాధాకిషన్రావు వెల్లడించారు. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన మహ్మద్ షోయబ్ సుభానీ బీకాం రెండో సంవత్సరం చదువుతూ 2006లో స్వస్థి చెప్పాడు. 2011లో మెహదీపట్నం ప్రాంతంలో గ్లోబల్ టెక్నో స్కూల్ పేరుతో పాఠశాలను నిర్వహించాడు. అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ముజీబ్ కేవలం పదో తరగతి వరకే చదివాడు. ఆపై హుమాయున్నగర్లోని ఎంఎం హాస్పిటల్లో మేనేజింగ్ డైరెక్టర్గా పని చేశాడు. ఆసుపత్రి ఏర్పాటు చేస్తే భారీ లాభాలు ఉంటాయంటూ తనకున్న అనుభవంతో ముజీబ్ తన స్నేహితుడైన షోయబ్కు చెప్పాడు. ఇందుకు అతను అంగీకరించడంతో ఇద్దరూ కలిసి డాక్టర్ మహ్మద్ అబ్దుల్ ముజీబ్ పేరుతో ఓ ఆధార్ కార్డు సంపాదించాడు. దీని ఆధారంగా 2017లో డీఎంఅండ్ హెచ్ఓకు దరఖాస్తు చేసుకుని ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతి పొందారు. ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆధారంగా ఆసిఫ్నగర్ ప్రాంతంలో సమీర్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిలో అనేక మందికి వైద్యం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరి వ్యవహారంపై పశ్చిమ మండల టాస్క్ఫోర్స్కు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, మహ్మద్ ముజఫర్ అలీ, ఎన్.రంజిత్కుమార్ శనివారం రాత్రి దాడి చేసి నిర్వాహకులు ఇద్దరినీ అరెస్టు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుల్ని ఆసిఫ్నగర్ పోలీసులకు అప్పగించారు. ‘కరోనా మందుల’ తీగలాగితే... ఈ నకిలీ డాక్టర్ల దందా గుట్టురట్టు కావడానికి కరోనా మందుల బ్లాక్ మార్కెటింగ్ వ్యవహారమే కారణం. పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు కరోనా రోగులకు వాడే రెమిడెసిమీర్ ఇంజెక్షన్లకు బ్లాక్ మార్కెట్కు తరలించి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. పోలీసులు పట్టుకున్న ఏడుగురిలో సమీర్ ఆసుపత్రి మెడికల్ షాప్లో ఫార్మసిస్ట్గా పని చేస్తున్న మహ్మద్ ఒబేద్ ఒకడు. ఇత గాడు సమీర్ ఆసుపత్రిలో పని చేస్తున్న నేపథ్యంలో ఆసుపత్రి నిర్వాహకులకు ఈ దందాలో ప్రమేయం ఉందా? అనే కోణంలో టాస్క్ఫోర్స్ పోలీసులు అనుమానించారు. ఈ సందేశం నివృత్తి చేసుకునేందుకు ఆసుపత్రి చైర్మన్గా వ్యవహరిస్తున్న సుభానీని తమ కార్యాలయానికి పిలిపించారు. ఇతడిని విచారిస్తున్న నేపథ్యంలో తాను డాక్టర్ను కాదని, కేవలం అలా చెలామణి అవుతుంటానని, ముజీబ్ మాత్రమే డాక్టర్ అని అతగాడు చెప్పాడు. దీంతో ముజీబ్ను పిలించిన అధికారులు ప్రశ్నించారు. దీంతో ఇతడు కూడా డాక్టర్ కాదని, ఇద్దరు సూడో డాక్టర్లు కలిసి సుమీర్ ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు తేలడంతో ఇద్దరినీ అరెస్టు చేశారు. -
బంజారాహిల్స్లో భారీ చోరీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్లో శనివారం భారీ చోరీ జరిగింది. బిల్డర్ కార్యాలయంలోకి చొరబడిన దుండగుడు 100 కోట్ల విలువైన డాక్యుమెంట్లు, రివాల్వర్, 20 బుల్లెట్లను అపహరించాడు. దీంతో శ్రీ ఆదిత్య హోమ్స్ అధినేత కోటారెడ్డి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు సుధీర్రెడ్డిగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. -
అప్పటి స్నేహాన్ని ఆసరా చేసుకుని..
చైతన్యపురి: వివాహం చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి యువతిని మోసం చేసిన కేసులో సరూర్నగర్ పోలీసు లు ఓ న్యాయవాదిని అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగోజిగూడకు చెందిన బైడ్ సుభాష్ (50) నగరంలోని ఓ కళాశాలలో 2011–14లో ఎల్ఎల్బీ చదివాడు. తనతో పాటు చదివే ఓ యువ తికి స్కాలర్షిప్ రాకపోవటంతో తమవద్దే ఆశ్రయం కల్పించాడు. అప్పటి స్నేహాన్ని ఆసరా చేసుకుని 2015లో తన నివాసానికి ఆమెను పిలిపించి మత్తు మందు కలిపిన బిర్యానీ తినిపించాడు. మత్తులోకి జారుకున్న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఆమెను నగ్నంగా ఫొటోలు తీసిన అతను వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, స్నేహితులకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టాడు. అనంతరం వివాహం చేసుకుంటానని నమ్మించి 2015 నుంచి 2019 వరకు కామేశ్వరరావు కాలనీలో ఓ ఇంట్లో సహజీవనం చేశాడు. ఆమెపై మోజు తీరటంతో పెళ్లి చేసుకోనని ఇంటి నుంచి బయటకు నెట్టేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సుభాష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సుభాష్ పాత నేరస్తుడని, ఇప్పటికే అతడిపై రెండు కేసులున్నాయన్నారు. -
డ్యూటీకి అని చెప్పి మొదటి భార్య ఇంటికి..
రాంగోపాల్పేట్: చదువుకోవడానికి నగరానికి వచ్చిన ఓ యువతికి తనకు ఇంకా పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడో వ్యక్తి. తీరా ఆమె 9 నెలల గర్భవతి అయ్యాక సరిగ్గా ప్రసవానికి ముందు చెప్పా పెట్టకుండా ఉడాయించాడు. దీంతో ఆమె తెలిసిన వారి సహాయంతో ఆస్పత్రిలో పురుడు పోసుకుంది. మహంకాళి పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన ఎస్కే షబీనా (25) కొన్నేళ్ల క్రితం చదువుకునేందుకు నగరానికి వచ్చి ఈసీఐఎల్లో ఉండేది. అక్కడే ఓ స్నేహితురాలి ద్వారా నిందితుడు అవుసలి సంపత్ (29)తో పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. తనకు పెళ్లి కాలేదని ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని ఆమెతో చెప్పాడు.అతని మాటలు నమ్మి 2018 మార్చి 14న పెళ్లి చేసుకుంది. అయితే సంపత్కు అప్పటికే పెళ్లై భార్య, ఒక కుమార్తె కూడా ఉంది. మొదటి భార్య వనస్థలిపురంలో నివసిస్తోంది. పెళ్లైన తర్వాత కొద్ది నెలలుగా షబీనా, సంపత్లు ఆవులమందలో నివాసం ఉన్నారు. రెండో పెళ్లి చేసుకున్నాక తరచు రాత్రి పూట డ్యూటీకి వెళుతున్నానని చెప్పి మొదటి భార్య ఇంటికి వెళ్తూ వచ్చేవాడు. రెండో భార్య షబీనాతో కలిసి సంపత్ మే 31న ఈసీఐఎల్లో ఉండే తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకున్న విషయం చెప్పాడు. జూన్ 3న తిరిగి ఇంటికి వచ్చారు. ఆ మరుసటి రోజు మొదటి భార్య, ఆమె సోదరుడు వచ్చి ఇంటి దగ్గర గొడవ పడ్డారు. దీంతో సంపత్ వారితో పాటు వెళ్లిపోయాడు. అటు తర్వాత ఫోన్ చేయడం కానీ, తిరిగి ఇంటికి రావడం కానీ చేయలేదు.దీంతో ఆమె మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇదిలా ఉండగా... భర్త చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడంతో నిండు గర్భిణి అయిన షబీనా ఒంటరిగా బాలానగర్లో చిన్న గదిలో ఒంటరిగా ఉంటోంది. ఓ మహిళ సహాయం రాగా ఈ నెల 9న కోఠిలోని మెటర్నటీ ఆస్పత్రిలో చేరి బాబుకు జన్మనిచ్చింది. భర్త ఎప్పుడు వస్తాడా అని ఆమె ఎదురు చూస్తోంది. -
ప్రేమ పెళ్లి.. ఇంటికి వెళ్తే కులం పేరుతో
ముషీరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకొని రెండేళ్ల తర్వాత తనను దూరం పెట్టడమే కాకుండా కులం పేరుతో దూషిస్తూ ఎక్కడైనా ఫిర్యాదు చేస్తే చంపుతానని బెదిరిస్తున్నాడని రాంనగర్కు చెందిన చందా పద్మజ ఆరోపించారు. గురువారం రాంనగర్లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.... రాంనగర్కు చెందిన తాను ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పీహెచ్డీ చేశానన్నారు. హబ్సిగూడ ఐఐసీటీలో కెమిస్ట్రీలో రీసెర్చ్ స్కాలర్గా పనిచేస్తున్న చందా నాగేశ్వర్రావు ప్రేమిస్తున్నానని తన వెంటపడ్డాడని, చివరకు తాను అంగీకరించడంతో 2017 మార్చి 15న కులాంతర వివాహం చేసుకుని రాంనగర్లో కాపురం పెట్టాడన్నారు. ఆరు నెలల నుంచి ఇంటికి రాకుండా తనను దూరం పెట్టాడని, ఇదేంటని అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో... అని బెదిరిస్తున్నాడన్నారు. తన భర్త స్వగ్రామైన సూ ర్యాపేట జిల్లా, పెన్పహాడ్ మండలం, తంగెళ్లగూడెం గ్రామానికి వెళ్తే అత్త, మామలతో పాటు బంధువులు సైతం చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అలాగే దళిత వర్గానికి చెందిన తనను కులం పేరుతో దూషిస్తున్నారని ఆరోపించారు.ఫిర్యాదు చేయడానికి పెన్పహాడ్ పోలీస్స్టేషన్కు వెళ్తే అక్కడి పోలీసులు సైతం తనతో అవమానకరంగా మాట్లాడారని తెలిపారు. దీంతో తాను నివసించే ప్రాంతంలోని ముషీరాబాద్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. అక్కడి ఎస్సై తన భర్తతో ఎన్నిసార్లు మాట్లాడినా లెక్కచేయలేదని తెలిపారు. వారి సూచన మేరకు సీసీఎస్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు కౌన్సిలింగ్కు రమ్మన్నా రాలేదన్నారు. చివరకు సీసీఎస్ పోలీస్స్టేషన్లో అతనిపై కేసు నమోదైందన్నారు. దాంతోపాటు ఎస్సీ కమిషన్లో కూడా కులం పేరుతో దూషించినందుకు అత్తమామలు, భర్తపై ఫిర్యాదు చేశానన్నారు. తన భర్త తనకు కావాలని, తనకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆమె పోలీస్ అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకున్నారు. -
విద్యార్థుల గదుల్లో చొరబడి...!
నాగోలు: ల్యాప్టాప్ల చోరీకి పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని మీర్పేట పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 6.5 లక్షల విలువైన 43 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ చేశారు. శుక్రవారం ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం... జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్పూర్ మండలం, చెల్పురం గ్రామానికి చెందిన కె. రవికిరణ్ ఆలియస్ నల్వాలా రవికిరణ్ (34) ఎలక్ట్రీషియన్. ఇతను గతంలో సూర్యాపేట జిల్లా సుబేదార్ పోలీస్ స్టేషన్, హనుమకొండ, కోదాడ పోలీస్స్టేషన్ పరిధిలోని పలు ఇళ్లల్లో దొంగతనాలు చేయగా పోలీస్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత తుర్కయాంజల్, సూరజ్నగర్ కాలనీలో అద్దెకు ఉంటూ ల్యాప్టాప్లు రిపేర్ చేస్తానంటూ కాలనీలో అందరినీ నమ్మబలికాడు. ఉదయం కాలనీలో తిరుగుతూ విద్యార్థులు ఉండే గదులను ఎంపిక చేసుకొనేవాడు. వారు కాలేజీలకు వెళ్లిన తర్వాత గదుల్లో చొరబడి ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు ఎత్తుకెళ్లేవాడు. దొంగతనం చేసిన ల్యాప్టాప్లను సికింద్రాబాద్, వరంగల్, ఇతర ప్రాంతంలో అమ్మేవాడు. ఇతను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట, హయత్నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, పహాడీషరీఫ్, సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ల్యాప్టాప్లు చోరీలకు పాల్పడ్డాడు. ల్యాప్టాప్ల చోరీపై నమోదు చేసుకున్న మీర్పేట పోలీస్లు రవి కిరణ్పై ప్రత్యేక నిఘా పెట్టి శుక్రవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ. 6.5 లక్షల విలువైన 43 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇతనిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ సన్ప్రీత్సింగ్ తెలిపాడు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ ఎస్. జయరామ్, మీర్పేట సీఐ యాదయ్య, డీఐ సత్యనారాయణ, వనస్థలిపురం డీఐ జగనాథ్, ఎస్ఐలు నర్సింహతో సిబ్బంది పాల్గొన్నారు. -
పుణేలో చిక్కింది.. అబ్దుల్లా బాసిత్ అనుచరులే !
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మహారాష్ట్రలోని పుణేలో సోమవారం అరెస్టు చేసిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులూ అబ్దుల్లా బాసిత్ అనుచరులుగా తేలింది. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న బాసిత్ స్పార్ట్ ఫోన్ వినియోగిస్తూ వివిధ యాప్స్ ద్వారా అనేక మందిని ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పుణేలో చిక్కిన ఇద్దరూ ఐసిస్ అనుబంధ సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖురాసన్ ప్రావెన్సీ (ఐఎస్కేపీ) మాడ్యుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని ఎన్ఐఏ ప్రకటించింది. ఈ ఏడాది మార్చ్లో ఢిల్లీలో చిక్కిన కాశ్మీర్ జంటకు, ఇప్పుడు పుణేలో అరెస్టు అయిన ఇద్దరికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. ఎన్ఐఏ అధికారులు సోమవారం పుణేలో అరెస్టు చేసిన నబీల్ ఎస్ ఖాత్రి ఓ జిమ్ నిర్వహిస్తుండగా... ఇతడి స్నేహితురాలు సాదియా అన్వర్ షేక్ జర్నలిజం చదువుతోంది. చంద్రాయణగుట్ట పరిధిలోని హఫీజ్బాబానగర్కు చెందిన అబ్దుల్లా బాసిత్ ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. ఆన్లైన్ ద్వారా ఐసిస్కు సానుభూతిపరుడిగా మారాడు. 2014 ఆగస్టులో మరో ముగ్గురితో కలిసి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసుకోవాలని భావించాడు. దీన్ని గుర్తించిన నిఘా వర్గాలు వీరిని కోల్కతాలో పట్టుకుని సిటీకి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి విడిచిపెట్టాయి. ఈ ఉదంతంతో ఇతడిని కళాశాల యాజమాన్యం పంపించేసింది. ఆ తర్వాత హిమాయత్నగర్లోని ఓ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటీరియల్ డిజైనింగ్ కోర్సులో చేరినా తల్లిదండ్రుల ఒత్తిడితో మానేశాడు. 2015 డిసెంబర్లో ఐసిస్లో చేరేందుకు వెళ్లిపోతున్నానంటూ ఇంట్లో లేఖ రాసిపెట్టి మరో ఇద్దరితో కలిసి వెళ్లిపోయాడు. అదే నెల 28న సిట్ పోలీసులు నాగ్పూర్లో వీరిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన బాసిత్... ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటరŠూయ్వతో తన భావజాలంతో మార్పు రాలేదని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కూడా తన కార్యకలాపాలు కొనసాగించాడు. ఐసిస్కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యుల్ కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఇతడు ఢిల్లీలోని తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైల్లోనూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న బాసిత్ వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆధారంగా అనేక మందిని ఆకర్షిస్తున్నాడు. సీఏఏకు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతూ ఓ గ్రూపును తయారుచేయడం మొదలెట్టాడు. ఇలా ఇతడి వల్లో పడిన వారిలో జమ్మూకశ్మీర్కు చెందిన భార్యాభర్తలు జహన్జెబ్ సామి, హీనా బషీర్ బేగ్ కీలకంగా మారారు. ఢిల్లీలోని ఓక్లా ఏరియాలో ఉన్న ఈ జంటను ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు మార్చ్లో పట్టుకున్నారు. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే నబీల్, సాదియాల పాత్ర వెలుగులోకి వచ్చింది. వీరు కూడా వివిధ యాప్స్ ద్వారా బాసిత్ ఇస్తున్న ఆదేశాల ప్రకారం సోషల్ మీడియా ద్వారా కొందరిని ఆకర్షించి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నారు. బాసిత్, సామి, నబీల్లు దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించాలని పథక రచన చేస్తున్నారు. నకిలీ పేర్లతో సిమ్ కార్డుల సమీకరించడంతో పాటు స్థానికంగా దొరికే పదార్థాలతో బాంబుల్ని తయారు చేయడం పైనా దృష్టి పెట్టారు. బాసిత్ ద్వారానే స్ఫూర్తి పొందిన పుణేకు చెందిన నబీల్, సాదియాలు ఐసిస్కు చెందిన ఖురాసన్ మాడ్యుల్లో ఉగ్రవాదులుగా మారారు. కశ్మీరీ జంట విచారణలో వీరి వ్యవహారం పైనా ఎన్ఐఏకు సమాచారం అందింది. దీంతో సోమవారం ఇద్దరినీ అరెస్టు చేసింది. ఈ జంట నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ కాల్ డేటా విశ్లేషణ, విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా బాసిత్ను మరో సారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని ఎన్ఐఏ నిర్ణయించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బాసిత్ కార్యకలాపాలపై తెలంగాణ పోలీసు విభాగానికీ కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి. -
కోవిడ్ ‘యాంటీ వైరల్’’ బ్లాక్ మార్కెటింగ్
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ రోగుల చికిత్సకు ఉపకరించే యాంటీ వైరల్ ఔషధాలను బ్లాక్ మార్కెట్ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. మొత్తం ఎనిమిది మంది సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన అధికారులు రూ.35.5 లక్షల విలువైన ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. కరోనా వైరస్ విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి రెమిడెసివీర్, ఆక్టెమ్రా, ఫాబి ఫ్లూ వంటి యాంటీ వైరల్ ఔషధాలకు భారీగా డిమాండ్ వచ్చింది. కొవిడ్ రోగుల చికిత్సలో వీటిని వినియోగిస్తుండటంతో గతంలో ఎన్నడూలేని విధంగా వీటి ప్రాధాన్యం పెరిగింది. రెమిడెసివీర్ డ్రగ్ సంగారెడ్డిలో ఉన్న హెటిరో సంస్థలో తయారవుతోంది. అత్యవసర యాంటీ వైరల్ మందుల్ని బ్లాక్ మార్కెట్కు తరలించి, ఈ విపత్కర పరిస్థితుల్ని క్యాష్ చేసుకోవడానికి ఓ ముఠా రంగంలోకి దిగింది. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన కె.వెంకట సుబ్రహ్మణ్యం అలియాస్ ఫణి ఈ ముఠాకు సూత్రధారిగా ఉన్నాడు. ఇతగాడు శ్రీ మెడిక్యూర్ ప్రొడక్టŠస్ (ఓపీసీ) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఇతడు తన సంస్థ పేరుతో హెటిరో సంస్థ నుంచి రెమిడెసివీర్ ఇంజెక్షన్లు ఖరీదు చేస్తున్నాడు. తన వద్ద వీటిని దాచి పెట్టి తన అనుచరుడైన సంతోష్ కుమార్కు రూ.3500 లాభంతో విక్రయిస్తున్నాడు. శంకర్ ఈ ఔషధాన్ని కె.కిషోర్, మహ్మద్ షాకీర్లకు రూ.6 వేల లాభానికి అమ్ముతున్నాడు. వీరిద్దరూ రాహుల్ అనే వ్యక్తికి రూ.8 వేల లాభానికి విక్రయిస్తుండగా.. ఇతగాడు సైఫ్, ఫిర్దోష్ల ద్వారా వినియోగదారులకు రూ.15 వేల నుంచి రూ.18 వేల లాభానికి అమ్ముతున్నారు. మొత్తమ్మీద ఈ ఔషధం రోగి వద్దకు చేరేసరికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు అధిక ధరకు అమ్ముడవుతోంది. రాహుల్ ఇతర యాంటీ వైరల్ ఔషధాలను ఢిల్లీ నుంచి ఖరీదు చేస్తున్నాడు. దీన్ని గగన్ కౌరానా అనే మధ్యవర్తి ద్వారా అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. రూ.5,400 ఖరీదు చేసే రెమిడెసివీర్ గరిష్టంగా రూ.40 వేలకు, రూ.40 వేలు ఖరీదు చేసే ఆక్టెమ్రా రూ.లక్షకు, రూ.3500 ఖరీదు చేసే ఫాబిఫ్లూ రూ.5 వేలకు రూ.1200 ఖరీదు చేసే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ రూ.1800 విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ ఔషధాలను నేరుగా ఆస్పత్రులకే విక్రయించాల్సి ఉన్నా.. అడ్డదారిలో బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈ గ్యాంగ్ రోగుల్ని ముంచుతోంది. కొన్ని రోజులుగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై దక్షిణ మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థక్కుద్దీన్ తమ బృందాలతో దాడి చేశారు. ఎనిమిది మందినీ పట్టుకుని వీరి నుంచి రూ.35.5 లక్షల విలువైన ఔషధాలు, నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును చాదర్ఘాట్ పోలీసులకు అప్పగించారు. -
స్రవంతిది హత్యా.. ఆత్మహత్యా..?
చందానగర్: మహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ అహ్మద్ పాషా సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డికి చెందిన విశ్వనాథ్, పద్మజ కుమారుడు కంకణాల సంతోష్కు, శ్రీకాకుళం రాజాంకు చెందిన మోహన్రావు, విజయల రెండవ కూతురు స్రవంతి(31)లకు 2017 అక్టోబర్లో వివాహం జరిగింది. వారికి రెండు సంవత్సరాల కుమారుడు శషాంక్ ఉన్నాడు.సంతోష్ తల్లితండ్రులు 30 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. వీరు శేరిలింగంపల్లి గోపన్పల్లిలోని ముప్పా అపార్ట్మెంట్లోని 305 ప్లాట్లో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. లాక్డౌన్లో సంతోష్ తల్లి వచ్చి వీరి వద్దే ఉంటోంది. కాగా స్రవంతి భర్త సంతోష్, అత్త, మామలు తనను వేధిస్తున్నారని 2018 ఆగస్టులో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం ముడు నెలలకు వారి మధ్య రాజీ కుదిరింది. సోమవారం రాత్రి కూడా భర్త సంతోష్, అత్తతో గొడవ జరిగింది. ఈక్రమంలో అనుమానాస్పద స్థితిలో స్రవంతి మంగళవారం తెల్లవారుజామున 3.40 గంటల సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని వారు ఉంటున్న మూడవ అంతస్తు నుంచి లిఫ్ట్ ద్వారా సెల్లార్లో కిందకు వచ్చి లిఫ్ట్ డోర్ వద్ద పడిపోయింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు చూసి ఇంట్లో ఉన్న వారికి, పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి వెళ్లిన పెట్రోలింగ్ పోలీసులు వెళ్లి చూసే సరికి ఆమె ఒంటిపై దుస్తులు కాలిపోయి మృతి చెంది ఉంది. సోమవారం సాయంత్రం బయటికి వెళ్లిందని అప్పుడు వెంట పెట్రోల్ తెచ్చుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్రవంతి ఒంటికి నిప్పంటించుకొని మూడు అంతస్తుల నుంచి కిందకు రావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భర్త, అత్త వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్రవంతి బంధువులు ఫిర్యాదు చేశారు. పోలీసులు అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
మేడిపల్లి : మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసులు తెలిపిన మేరకు..మూలుగు జిల్లా వాజేడు మండలం తగుళ్లపల్లి గ్రామానికి చెందిన సూరిబాబు కుమారుడు నాగసాయిచందు (27). నగరంలోని మేడిపల్లి పరిధిలోని విహారిక కాలనీలో ఉంటూ మేడిపల్లి పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. గత పదిహేను రోజులుగా నాగసాయిచందు లీవ్లో ఉన్నాడు. గురువారం మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో పాటు పని చేసే కానిస్టేబుల్ ప్రసన్న గమనించి కిందికి దించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.పెళ్లి విషయంలో తల్లిదండ్రులకు, నాగసాయిచందుకు మధ్య వివాదం ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ఏసీబీ వలలో సీఐ, ఏఎస్ఐ
షాబాద్(చేవెళ్ల): భూతగాదా కేసులో రూ.1.2 లక్షల లంచం తీసుకుంటుండగా సీఐ, ఏఎస్ఐని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీసు స్టేషన్ ఆవరణలో గురువారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన మేరకు.. షాబాద్ మండల పరిధిలోని చిన్న సోలిపేట్కు చెందిన వెంకన్నగారి విజయ్మోహన్రెడ్డి అలియాస్ (జయరాంరెడ్డి), ఇదే గ్రామానికి చెందిన భారతమ్మ మధ్య.. కొన్నేళ్లుగా భూ వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో విజయ్మోహన్రెడ్డిపై పోలీస్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ వివాదంలో తనకు సాయం చేస్తామని సూచించిన.. షాబాద్ సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ తమకు డబ్బు ఇవ్వాలని విజయ్మోహన్రెడ్డిని డిమాండ్ చేశారు. ఇందుకోసం వీరి మధ్య రూ.1.20 లక్షలకు ఒప్పందం కుదిరింది. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం విజయ్మోహన్రెడ్డి ఏఎస్ఐ రాజేందర్తో కలిసి సీఐకి లంచం ఇచ్చేందుకు వెళ్లాడు. బయట ఏఎస్ఐకి డబ్బు ఇవ్వాల్సిందిగా సూచించడంతో పీఎస్ ఆవరణలోనే విజయ్మోహన్రెడ్డి నగదు అందించాడు. వెంటనే ఏసీబీ అధికారులు దాడిచేసి డబ్బు స్వాధీనం చేసుకుని సీఐ, ఏఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు. -
ఉద్యోగాల పేరుతో వ్యభిచారం
సాక్షి, సిటీబ్యూరో: ఉద్యోగాల పేరుతో ముంబయ్కి చెందిన మహిళలను నగరానికి తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను పట్టుకున్న పోలీసులు ఇద్దరు యువతులకు వ్యభిచారం నుంచి విముక్తి కల్పించారు. పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపినమేరకు..బిహార్ రాష్ట్రానికి చెందిన మిథిలేష్ శర్మ, రాజనీశ్ రాజన్లు గత కొన్ని సంవత్సరాలుగా రహస్యంగా హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహ్తిన్నారు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళల అక్రమ రవాణాదారులతో సంబంధాలున్న వీరు అక్కడి నుంచి అమ్మాయిలను రప్పించేవారు. ఈ విధంగానే ముంబయ్ సమీపంలోని పాల్ఘర్ జిల్లా నాలాసొపార పట్టణానికి చెందిన ఇద్దరు అమ్మాయిలకు హైదరాబాద్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ రప్పించారు. (వేశ్యావాటిక గుట్టురట్టు) ఆ తర్వాత బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపారు. యాప్రాల్లోని రిజిస్ట్రేషన్ కాలనీలో ఇండిపెండెంట్ హౌస్ను అద్దెకు తీసుకొని అసాంఘిక కార్యకలాపాలు మొదలెట్టారు. మిథేశ్ శర్మ తన సహచర నిర్వాహకుడు రాజనీశ్ రాజన్తో కలిసి రహస్యంగా కస్టమర్లను రప్పించేవాడు.అలాగే ఆయా ఇళ్లకు వచ్చే కస్టమర్లకు తగిన ఆహరంతో పాటు వారి అవసరాలను తీర్చేందుకు సుచిత్రకు చెందిన కాంబ్లీ సుఖేష్ను ఉద్యోగంలోకి తీసుకున్నారు. అయితే యథావిధిగా ఎప్పటిలాగానే మంగళవారం ఇద్దరు విటులు సాయికిరణ్, సిరాజ్లు యాప్రాల్కు వచ్చారు. ఆ అమ్మాయిలతో వీరిద్దరూ ఉన్న సమయంలో అప్పటికే విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజ్గిరి జోన్ ఎస్వోటీ పోలీసులు, జవహర్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. రాజనీశ్ రంజన్, సుఖేష్ రావణ్ కాంబ్లీ, పి.సాయికిరణ్, ఎండీ సిరాజ్లను అరెస్టు చేశారు. ఇద్దరు యువతులను సంరక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మితిలేష్ శర్మ కోసం గాలిస్తున్నారు. -
మహిళపై లైంగిక దాడి..హత్య
జియాగూడ: ఓ వ్యక్తి మద్యం మత్తులో ఓ మహిళపై లైంగిక దాడిచేసి అనంతరం హత్యచేశాడు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి ప్రాంతంలో కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన మేరకు..కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిదిలోని జియాగూడ కేశవస్వామినగర్ ప్రాంతంలో ఉంటున్న అండాలు(47)జియాగూడ మేకల మండిలో మేకలను విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. అండాలుకు భర్త రాములు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల జియాగూడ కేశవస్వామినగర్లో రెండంతస్తుల భవనం నిర్మించారు. భవన నిర్మాణం పూర్తికావడంతో మేస్త్రీ కూలీలకు తండిగా దావత్ను ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఇది కొనసాగింది. (బొమ్మల షాపులో మహిళపై దారుణం) మేస్త్రీల వెంబడి వారి స్నేహితుడు రవి కూడా దావత్కు హాజరై వీరితో ఉన్నాడు. చివరగా మిగిలిన కుటుంబ సభ్యులు అండాలు, రాములు, కుమారుడు మల్లేష్, బావతో రవికూడా ఉన్నాడు. ఇంటి మొదటి అంతస్తుపైకి పడుకోవడానికి అండాలు వెళ్లింది. గమనించిన రవి అనే వ్యక్తి డాబాపై సిగరెట్ తాగివస్తానని చెప్పి పైకి వెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో భర్త, కుమారుడు వెళ్లి చూడగా ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు గమనించారు. రవిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పరారయ్యాడు. అప్పటికే ఆండాలు మృతిచెందింది. భర్త రాములు కుల్సుంపురా పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. -
బందిపోటు ముఠాకు చెక్
సాక్షి, సిటీబ్యూరో: పుత్లిబౌలి చౌరస్తా సమీపంలో ఈ నెల 4న రాత్రి చోటు చేసుకున్న బందిపోటు దొంగతనం కేసును ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరగాళ్ళగా మారిన ముఠాలోని ఐదుగురు యువకులకు పట్టుకున్నారు. వీరి నుంచి నగదు, ద్విచక్ర వాహనాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. కోఠిలోని ఓ ఫార్మసీ దుకాణంలో పని చేస్తున్న తలాబ్కట్ట ప్రాంతానికి చెందిన సయ్యద్ ఫారూఖ్ బాష ఈ గ్యాంగ్కు సూత్రధారిగా ఉన్నాడు. తనకు వచ్చే ఆదాయంతో సంతప్తి చెందని ఫారూఖ్ తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ఫార్మసీకి ఎదురుగా ఉన్న షాపు యజమాని ప్రతి రోజూ రాత్రి దుకాణం మూసిన తర్వాత డబ్బు ఉన్న సంచితో వెళ్ళడం గమనించాడు. దీంతో అతడినే టార్గెట్గా చేసుకుని ఆ బ్యాగ్ దోచుకోవడానికి పథకం వేశాడు. దీన్ని అమలు చేయడం కోసం పురానీహవేలీకి చెందిన తన స్నేహితుడు సయ్యద్ ఫయాజ్ ఇమ్రాన్ను సంప్రదించాడు. తనకు మరో నలుగురు మనుషుల్ని సమకూర్చి పెట్టాలని, ‘పని’ పూర్తయిన తర్వాత అందరికీ వాటాలు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. దీంతో ఫయాజ్ తనకు పరిచయస్తులైన శాలిబండకు చెందిన అమీర్ఖాన్, కాలాపత్తర్ వాసి మహ్మద్ వసీం, మొఘల్పురకు చెందిన సయ్యద్ అబ్దుల్ ఖదీర్ హుస్సేన్, నాంపల్లికి చెందిన సమీర్లను ఫారూఖ్కు పరిచయం చేశాడు. దీంతో వీరంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ గ్యాంగ్లో సూత్రధారి సహా మిగిలిన వారంతా 21–26 ఏళ్ళ మధ్య వయస్కులే కావడం గమనార్హం. దోపిడీకి రంగంలోకి దిగిన ఈ గ్యాంగ్ ఈ నెల 4న తమ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంది. దీనికి పది రోజుల ముందు నుంచే తమ టార్గెట్ కదలికపై రెక్కీ నిర్వహించారు. ఈ నెల 4న రాత్రి రంగంలోకి దిగిన వీరంతా పుత్లిబౌలిలోని అమత్ బార్ వద్ద కలుసుకున్నారు. ఫైజల్ మినహా మిగిలిన వారంతా అక్కడే ఉండిపోగా.. ఇతడు మాత్రం ఫయాజ్ పని చేసే దుకాణం వద్దకు వెళ్ళాడు. అక్కడే ఉండి తమ టార్గెట్ కదలికల్ని గమనించాడు. అమీర్ ఖాన్, సమీర్లు రెండు ద్విచక్ర వాహనాలపై నిర్ధేశించిన ప్రాంతాల్లో ఎదురుచూస్తున్నారు. ఆ రాత్రి 9.05 గంటలకు డబ్బు ఉన్న సంచితో వస్తున్న టార్గెట్ను ఫయాజ్, వహీంలు పుత్లిబౌలి ‘యు’ టర్న్ వద్ద అడ్డుకుని స్క్రూడ్రైవర్తో దాడి చేశారు. ఆయన తేరుకునే లోపే రూ.3.3 లక్షలతో కూడిన బ్యాగ్ తీసుకుని ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అఫ్జల్గంజ్ ఠాణాలో కేసు నమోదైంది. దీన్ని ఛేదించడానికి ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతత్వంలోని బందం రంగంలోకి దిగింది. ఘటనాస్థలిలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు ఇతర ఆధారాలను బట్టి నిందితుల్ని గుర్తించారు. బుధవారం సమీర్ మినహా మిగిలిన ఐదుగురిని పట్టుకుని రూ.2.6 లక్షల నగదు, వాహనాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సమీర్ కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. నిందితుల్లో ఫారూఖ్పై సుల్తాన్బజార్, ఫయాజ్పై మొఘల్పుర, అమీర్ఖాన్పై శాలిబండ, వశీంపై మాదాపూర్ ఠాణాల్లో గతంలో కేసులు నమోదై ఉన్నట్లు కొత్వాల్ వెల్లడించారు. -
విదేశీ యువతులతో మంత్రి బంధువు రేవ్ పార్టీ..
జూబ్లీహిల్స్: కరోనా సమయంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి యువతీ, యువకులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ పార్టీని బంజారాహిల్స్ పోలీసులు భగ్నం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఓ హోటల్లో శనివారం రాత్రి ఎనిమిది మంది యువకులు, ఆరుగురు యువతులతో పాటు ఓ విదేశీ యువతితో కలిసి రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకులు శనివారం ఉదయం నాలుగు గదులను అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. సాయంత్రం తర్వాత కొందరు యువతులతో పాటు ఓ విదేశీ యువతి అక్కడికి వచ్చారు. (బంజారాహిల్స్లో రేవ్ పార్టీ, 8 మందిపై కేసు) అర్ధరాత్రి దాటిన తర్వాత రేవ్ పార్టీ చేసుకునేందుకు ప్రయత్నాలు చేసిన వీరు మద్యం మత్తులో చిందులేస్తున్నట్లు సమాచారం అందడంతో బంజారాహిల్స్ పోలీసులు దాడులు నిర్వహించి అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రష్యాకు చెందిన ఓ ఈవెంట్ ఆర్గనైజర్ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే రేవ్ పార్టీల నిర్వహణలో ఆరితేరిన సంతోష్రెడ్డి అనే ఓ పబ్ నిర్వాహకుడు పార్టీకి కూడా సూత్రధారి కావడం గమనార్హం. అతనే ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లోని టాట్ పబ్లో సంతోష్రెడ్డి సుమారు 30 మంది యువతులతో కలిసి రేవ్ పార్టీ ఏర్పాటు చేసి పోలీసులకు దొరికిపోయాడు. ఆరు నెలలు గడవకముందే మరోసారి పార్టీ నిర్వహిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనలో సంతోష్రెడ్డితో పాటు భానుకిరణ్, విజయ రామారావు, నగరానికి చెందిన ఓ మంత్రి బంధువు రఘువీర్రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ శనివారం రాత్రి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి దాడి చేశాం. రూమ్ నంబర్ 721లో ముగ్గురు యువకులు, నలుగురు యువతులు సోషల్ డిస్టెన్స్ లేకుండా మద్యం సేవిస్తూ పార్టీ చేసుకోవడం గమనించి వారిని అదుపులోకి తీసుకున్నాం. సంతోష్రెడ్డి పుట్టిన రోజు వేడుకలకు హాజరైనట్లు వారు తెలిపారు. వీరందరిపై లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనల చట్టం ప్రకారం ఏపిడమిక్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎక్సైజ్ చట్టాల కింద కేసులు నమోదు చేశాం. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నాం.– కళింగరావు, ఇన్స్పెక్టర్ -
గంజాయి కిలో 1500కు కొనుగోలు...
నేరేడ్మెట్: విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి సరఫరాచేస్తున్న ముఠాను ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ, అబ్దుల్లాçపుర్మెట్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఏడుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి, వారి నుంచి 81 కిలోల గంజాయి ప్యాకెట్లు, రెండు కార్లు, రూ.1.45లక్షల నగదు, 9సెల్ఫోన్లతోసహ మొత్తం రూ.30లక్షల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేష్భగవత్ కేసు వివరాలు వెల్లడించారు. రెండేళ్లుగా గంజాయి దందా... సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు నునావత్ జగన్(29), మలోత్ వినోద్(24), నునావత్ సుధాకర్(27),నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన కేతవత్ మురళి(25) గత రెండేళ్లుగా విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్కు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 2019లో తూర్పుగోదావరి జిల్లా మోత్కుగూడెం ఠాణాలో నిందితుడు మురళిపై కొత్తగూడెం జిల్లా భద్రచలం ఠాణాలో వినోద్పై, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గోల్కోండ పోలీసుస్టేషన్లో మరో నిందితుడు సుధాకర్పై కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో పోలీసులు మురళి, వినోద్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జైలులో ఒప్పందం.. రాజమండ్రి సెంట్రల్ జైలులో నిందితుడు మురళికి హైదరాబాద్లో ఉంటున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఏజెంట్ రాకేష్(27)తో పరిచయం ఏర్పడింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని హైదరాబాద్కు సరఫరా చేస్తే, రాజస్థాన్కు రవాణా చేస్తానని ఏజెంట్ మురళికి హామీ ఇవ్వడంతో ఇద్దరి మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. మురళి జైలు నుంచి విడుదలైన అనంతరం ప్రధాన నిందితుడు నునావత్ జగన్ కలిసి జైలులో జరిగిన ఒప్పందం గురించి వివరించడంతో ఇందుకు అంగీకరించాడు. ఇందుకు సూర్యాపేట జిల్లాకు చెందిన మిగతా నిందితులు వంకుడోతు సాయి(21), వంకడోతు సుధాకర్, వంకుడోతు జితేందర్(33)లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ప్రధాన నిందితుడికి చెందిన రెండు కార్లలో గంజాయిని హైదరాబాద్కు సరఫరా చేసి, రాజస్థాన్కు చెందిన ఏజెంట్కు విక్రయించాలని ప్రణాళిక వేసుకున్నారు. కిలో రూ.1500కు కొనుగోలు... విశాఖపట్నం జిల్లాలోని ధరకొండకు చెందిన గంజాయి విక్రేత రాజు(33)తో ప్రధాన నిందితుడు నునావత్ జగన్, మరో నిందితుడు మురళిలకు పాత పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో మిగతా నలుగురు ముఠా సభ్యులందరితో కలిసి వారు ఈనెల 25వ తేదీన ధరకొండకు వెళ్లి విక్రేత రాజును కలిశారు. కిలో రూ.1500 చొప్పున 81 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. హైదరాబాద్లో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఏజెంట్ రాకేష్కు కిలో రూ.8వేలకు విక్రయించాలని ముఠా నిర్ణయించుకుంది. గంజాయిని హైదరాబాద్కు తీసుకువస్తున్నట్టు ప్రధాన నిందితుడు, కీలక సూత్రధారి అయిన నిందితుడు మురళిలు ఏజెంట్ రాకేష్కు సమాచారం ఇచ్చారు. తాను అందుబాటులో ఉండలేనందున ఏజెంట్ రాకేష్ హైదరాబాద్ నగర శివారులో ముఠా నుంచి గంజాయి ప్యాకెట్లను స్వీకరించేందుకు బోయినిపల్లికి చెందిన కూలీ అనూప్కుమార్(27)తో ఒప్పందం చేసుకున్నాడు. సీట్లు, డిక్కీల్లో గంజాయి ప్యాకెట్లు... అంబర్పేట్ సమీపంలో అనూప్కుమార్ వేచి ఉన్నాడు. శుక్రవారం ఉదయం ప్రధాన నిందితుడికి చెందిన రెండు కార్ల సీట్లు, డిక్కీలలో దాచిపెట్టిన గంజాయి ప్యాకెట్లను తరలించిన ముఠా పెద్దఅంబర్పేటలో అప్పగించేందుకు వెళుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎల్బీ.నగర్ జోన్ ఎస్ఓటీ, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు ఏడుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి, గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు, ఏజెంట్ రాకేష్, గంజాయి విక్రేత రాజులు పరారీలో ఉన్నారని సీపీ వివరించారు. రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్బాబు,ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, ఎస్ఓటీ డీసీపీ సురేందర్రెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ సీఐ దేవేందర్,సీఐలు రవికుమార్,సత్యనారాయణ, ఎస్ఓటీ ఎస్ఐ అవినాష్బాబులు పాల్గొన్నారు. -
చీకటి గదిలోకి తీసుకెళ్లి సిబ్బందిపై..
కుషాయిగూడ: లెక్కల్లో తేడా జరిగిందన్న అనుమానంతో ఓ వస్త్ర షోరూం యాజమాన్యం ఇద్దరు ఉద్యోగులపై దాడికి పాల్పడింది. ఈ సంఘటన గురువారం కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బాధితులు తెలిపిన మేరకు.. ఉప్పల్కు చెందిన గౌర సంపత్ ఫ్లోర్ ఇంచార్జిగా, బానచందర్ క్యాషియర్గా కొన్ని సంవత్సరాలుగా ఉప్పల్లోని అనుటెక్స్లో షోరూంలో పనిచేస్తున్నారు. అయితే లెక్కల్లో తేడాలున్నాయని అనుమానించిన యాజమాన్యం ఈ నెల 20న ఏఎస్రావునగర్ అనుటెక్స్ షోరూంకు పిలిపించారు. బాధితులు అక్కడికి వెళ్లగానే అప్పటికే అక్కడ ఉన్న బౌన్సర్లు బాధితుల నుంచి సెల్ఫోన్లు, పర్స్లను లాక్కొని చీకటి గదిలోకి తీసుకెళ్లి డిస్కౌంట్ల పేరుతో అవినీతికి పాల్పడుతారా అంటు దాడికి పాల్పడ్డారు. కర్రలు, ఇనుపరాడ్లు, చెక్కలతో విచక్షణ రహితంగా దాడిచేశారు. బౌన్సర్లతో పాటుతా అనుటెక్స్ ఎండీలు పులవర్తి నాగేశ్వరరావు, రాజశేఖర్, రామకృష్ణారావులు దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. తమ క్రెడిట్, డెబీట్ కార్డుల నుంచి సుమారు 2.5 లక్షలు కూడా డ్రా చేసుకున్నట్లు ఆరోపించారు. అంతేకాక పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లి కేసునమోదు చేయాలని పోలీసులను కోరారన్నారు. అయితేపోలీసులు మందలించగా వెనక్కు తగ్గారన్నారు. అక్కడే వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి వెళ్లిపోయారు. తరువాత బాధితులు కుషాయిగూడ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఇన్స్పెక్టర్ మన్మోహన్ మాట్లాడుతూ.. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. బాధ్యులైన పులవర్తి నగేశ్, పులవర్తి రాజు, పులవర్తి రామకృష్ణ, పులవర్తి శ్రీనివాస్, ఉప్పల సంతోష్లపైకేసు నమోదు చేశామన్నారు. -
జూబ్లీహిల్స్ వ్యభిచార గృహంపై దాడి
జూబ్లీహిల్స్: వెల్నెస్ సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నడిపిస్తున్న నిర్వాహకురాలితో పాటు మరో ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటగిరిలో నివాసం ఉంటున్న టమటం శైలజ(33) జూబ్లీహిల్స్ రోడ్ నెబర్ 25లో అవని వెల్నెస్ సెంటర్ నిర్వహిస్తున్నది. కొంత కాలంగా లొకాంటే వెబ్సైట్లో ప్రకటనలు ఇస్తూ యువతుల ఫొటోలతో వల వేస్తూ వ్యభిచారం చేయిస్తుంది. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. దాడుల్లో ఇద్దరు విటులు రాజు రెడ్డి, అలీలు పట్టుబడ్డారు. వ్యభిచారం కోసం ఉత్తరాది నుంచి యువతులను తీసుకు వచ్చే శైలజ భర్త పరమేశ్వర్రావు పరారయ్యాడు. ఈ మేరకు నిర్వాహకురాలు శైలజపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెతో పాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
ఆత్మహత్యాయత్నం... భార్యకు వీడియో కాల్
అబిడ్స్: రైలు కిందపడి నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఓ వ్యక్తి తన భార్యకు వీడియోకాల్ చేశాడు.ఆందోళన చెందిన ఆమె వెంటనే పోలీసులకు సమాచారమందించడంతో వారు కాపాడగలిగారు. వివరాలు.. టప్పాచబుత్ర పోలీస్స్టేషన్ పరిదిలోని మార్కండేయ నగర్లో రామకృష్ణ(34) దంపతులు నివాసముంటున్నారు. గురువారం సాయంత్రం భార్య శైలజకు రామకృష్ణ లక్డీకాపూల్లోని రైల్వే ట్రాక్పై నిలబడి తాను రైలు కిందపడి చనిపోతానని కాల్ చేశాడు. ఆమె 100కు ఫోన్ చేయడంతో పోలీస్ సెట్ ద్వారా సమాచారం తెలుసుకున్న టప్పాచబుత్ర అడిషనల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు 10 నిమిషాల్లోపు లక్డీకాపూల్ నాంపల్లి రైల్వే ట్రాక్పైకి చేరుకున్నారు. రైలు వస్తుండటంతో అతనిని వెంటనే లాగి ప్రాణాలు కాపాడారు. అనంతరం దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
మేనకోడలిపై పోలీస్ లైంగికదాడి
సికింద్రాబాద్: కూతురిలాంటి మేనకోడలిపై మద్యం మత్తులో లైంగికదాడికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఇంతటిదారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రాంగోపాల్పేట్ పోలీస్స్టేషన్లో క్రైం కానిస్టేబుల్గా పనిచేస్తున్న వరదరాజ్ సుదేశ్ ఉమేశ్ (33) సిక్విలేజ్లో నివాసం ఉంటున్నాడు. ఉమేశ్ భార్య ప్రసవం కోసం సొంత ఊరికి వెళ్లింది. ఉమేశ్ ఇంటి పక్కనే అతడి సొంత అక్క కుటుంబం నివాసముంటోంది. దీంతో సోదరి ఉమేశ్కు రోజూ భోజనం పంపించేది. రెండు నెలల క్రితం ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ఇంట్లోనే ఉన్న కానిస్టేబుల్ ఉమేశ్ పీకల దాకా మద్యం తాగి ఉన్నాడు. అదే సమయంలో తన అక్క కూతురు మేనకోడలు (12) భోజనం బాక్సు తీసుకుని ఇంట్లోకి వచ్చింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఉమేశ్ మైనారిటీ తీరకి మేనకూతురిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. వెలుగు చూసిందిలా... భోజనం ఇచ్చి రావడానికి ఆ చిన్నారి తప్పించుకుంటుండటంతో తల్లికి అనుమానం వచ్చింది. ఉమేశ్ పేరు తీసినపుడల్లా కూతురు భయంతో వణికిపోతుండంతో తల్లి నిలదీసింది. దీంతో మేనమామ తనపై జరిపిన అఘాయిత్యాన్ని తల్లికి చెప్పి బోరున విలపించింది. ఎవరికి చెప్పినా ఇంట్లో అందరినీ తుపాకితో చంపేస్తానని ఉమేశ్ బెదిరించినట్టు తల్లికి వివరించింది. దీంతో బాలిక తల్లి బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్శాఖకు అవమానం ... బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకుని ఉమేశ్పై ఫోక్సో చట్టంతో కేసు నమోదు చేసి కోర్టుముందు ప్రవేశపెట్టినట్టు ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఒక పోలీస్శాఖకు చెందిన ఒక కానిస్టేబుల్ ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టడం అవమానంగా భావిస్తున్నామని సిటీపోలీస్కమిషనర్ అంజనీకుమార్ విచారం వ్యక్తం చేశారు. -
24 రోజులు...12 హత్యలు!
సాక్షి, సిటీబ్యూరో: నేరాల్లో హత్య కేసుకు పోలీసులు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇవి జరగకుండా నిరోధించడంతో పాటు జరిగిన వెంటనే స్పందిస్తూ నిందితుల్ని అరెస్టు చేస్తుంటారు. నడిరోడ్లపై జరిగే ఇలాంటి దారుణాలు శాంతిభద్రతల నిర్వహణ పైనా ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో రాజధానిలో గడిచిన 24 రోజులు (మే 31–జూన్ 23) మధ్య మొత్తం 12 హత్యలు జరగడం... అందులో తొమ్మిది నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోనే చోటు చేసుకోవడం నగరవాసి ఉలిక్కిపడేలా చేసింది. కొవిడ్ హడావుడి నేపథ్యంలో సాధారణ పోలీసింగ్ పట్టుతప్పుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ హత్యలకు కారణాలు అనేకం... రాజధానిలో చోటు చేసుకున్న ఈ 12 హత్యల్లో మూడు రౌడీషీటర్లకు సంబంధించినవి. ఆధిపత్యపోరు, వ్యక్తిగత కక్షలు, ఇతర వివాదాల్లో వీరు హతమయ్యారు. పోలీసు విభాగం ఓపక్క కౌన్సిలింగ్స్, బైండోవర్లు చేస్తున్నా.. రౌడీషీటర్ల వంటి అసాంఘికశక్తులు తమ కార్యకలాపాలు కొనసాగించడం, ఆ వివాదాల నేపథ్యంలో హత్యకు గురికావడం విమర్శలకు తావిస్తోంది. మరోపక్క మద్యం మత్తులో జరిగిన హత్యలు కూడా ఉన్నాయి. కుటుంబ కలహాలు, మద్యం తాగవద్దన్న కారణంతో భార్యల్ని హత్య చేసిన భర్తల కేసులు నగరంలో నమోదయ్యాయి. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి వివాదాలు సైతం హత్యల వరకు వెళ్ళిన ఉతందాలు నమోదయ్యాయి. నడిరోడ్డుపై నరికేస్తున్నా... ఇటీవల కాలంలో జరిగిన 12 హత్యల్లో కొన్ని నడిరోడ్డపై జరిగినవి ఉన్నాయి. వీటిలో రౌడీషీటర్తో పాటు యువకుడు హతమయ్యాయి. పట్టపగలు, నడిరోడ్డుపై ఇలాంటి దారుణాలు జరుగుతున్నా చుట్టు పక్కల ఉన్న వారు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. తమ కళ్ళ ఎదుటే ఓ వ్యక్తి ప్రాణం పాశవికంగా తీస్తుంటే అంతా కలిసి అడ్డుకోవడం మరిచి చోద్యం చూస్తున్నారు. హత్య జరిగిన తర్వాత కూడా హంతకుల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఉదంతం ఒక్కటి కూడా లేదు. ఆయా దారుణాలు జరిగిపోయిన తర్వాత 100 లేదా 108లకు ఫోన్లు చేయడం మాత్రం జరుగుతోంది. గతంలోనూ రాజధానిలో నడిరోడ్డుపై హత్యలు జరగడం, వాటిని ఎవరూ అడ్డుకోకపోవడంపై పెద్ద దుమారం రేగింది. అయినప్పటికీ సగటు నరవాసిలో మార్పు ఏమాత్రం కనిపించట్లేదు. ఇటీవలి దారుణాలివీ.. ♦ బంజారాహిల్స్ ఇందిరానగర్లో భార్య అనితను భర్త అనిల్ దారుణంగా చంపిన ఉదంతం గత నెల 31న చోటు చేసుకుంది. వీరిద్దరిదీ ప్రేమవివాహం కావడం గమనార్హం. ♦ అదే రోజు పాతబస్తీలోని బహదూర్పుర ఠాణా పరిధిలోని మీరాలం ప్రాంతంలో అలీబాగ్కు చెందిన షేక్ మహ్మద్ హత్యకు గురయ్యాడు. ♦ ఈ నెల 1న ఎస్సార్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో మద్యానికి బానిసైన భర్త సంజీవ్... తాగ వద్దన్నందుకు తన భార్య రాణిని హత్య చేశాడు. ♦ గాంధీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో బన్సీలాల్పేటకు చెందిన కృష్ణ ఈ నెల 3న హత్యకు గురయ్యాడు. ♦ మల్లేపల్లికి చెందిన రాహుల్ చంద్ అగర్వాల్ ఈ నెల 5న గోల్కొండ ఠాణా పరిధిలోని బంజరు దర్వాజ–అల్జాపూర్ రోడ్డులోని శ్మశానవాటిక వద్ద హత్యకు గురయ్యాడు. ♦ అదే రోజు రెయిన్బజార్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో మహ్మద్ ఇమ్రాన్ను అతడి సవతి సోదరులే చంపేశారు. ♦ ఈ నెల 5నే లంగర్హౌస్ పరిధిలో రౌడీషీటర్లు చందీ మహ్మద్ , అబూలను నానల్నగర్ చౌరస్తా వద్ద దారుణంగా చంపేశారు. ♦ ఈ నెల 19న బేగంబజార్ పరిధిలోని పటేల్బస్తీకి చెందిన రుబీనాబేగంను ఆమె భర్త సాబేర్ హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే దీనికి కారణం. ♦ సోమవారం శాలిబండ పోలీసుస్టేషన్ పరిధిలో రౌడీషీటర్ మహ్మద్ ఖాలేద్ తాగి గొడవ చేస్తున్నాడని సొంత మేనల్లుడు షేక్ అబ్దుల్ సులేమాన్ హత్య చేశాడు. ♦ వీటితో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్స్ పరిధిలోని రాజేంద్రనగర్, సనత్నగర్, బాలాపూర్ పోలీసుస్టేషన్ల పరిధిలో ఈ కాలంలో మూడు హత్యలు చోటు చేసుకున్నాయి. -
బాలుడిపై లైంగికదాడి.. పదేళ్ల జైలు
బహదూర్పురా: బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన ఓ రౌడీషీటర్కు న్యాయస్థానం పదేళ్లజైలు శిక్షవిధించింది. బహదూర్పురా ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ తెలిపిన మేరకు.. బహదూర్పురా పోలీస్స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ మహ్మద్ మునీరుద్దీన్ (36) 2015లో బాలుడిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టులో చార్జీషీట్ వేసి సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టగా అడిషనల్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ జడ్జి నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.4 వేల జరిమానా విధించారు. -
ఇద్దరు పిల్లలతో గృహిణి అదృశ్యం
బహదూర్పురా: కాలాపత్తర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ గృహిణి ఇద్దరు పిల్లలతోసహా అదృశ్యమైంది. ఏఎస్ఐ వెంకటరమణ తెలిపిన మేరకు.. మిశ్రీగంజ్లో ఖాజా పాషా, ఆఫ్రీన్ బేగం (21) నివాసమున్నారు. వీరికి నబియా బేగం (5), సల్మాన్ (2) సంతానం ఉన్నారు. ఈ నెల 20న సాయంత్రం 4.30 గంటలకు దుకాణంలో తినడానికి వస్తువులను కొనుగోలు చేయడానికి ఆఫ్రీన్ బేగం ఇద్దరు పిల్లలతో కలిసి బయటికి వెళ్లింది. సాయంత్రం అయినా తిరిగి ఖాజా పాషా చుట్టు పక్కల ప్రాంతాలు వెతికాడు. ఫలితం లేకుండా పోవడంతో బుధవారం పోలీ సులకు ఫిర్యాదు చేశారు. -
స్విగ్గి బాయ్.. దర్జా కోసం కారు చోరీ
కేపీహెచ్బీకాలనీ: సమాజంలో ధనవంతుడిగా కనిపించాలనే కోరికతో ఓ యువకుడు కారును దొంగిలించి దర్జాగా తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేసన్ పరిధిలో జరిగింది. సోమవారం సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన మేరకు..బిహార్ రాష్ట్రానికి చెందిన ఈర్షద్ ఆలం కుటుంబం నగరానికి వచ్చి పటాన్చెరు ప్రాంతంలో ఉంటున్నారు. ఇతని కుమారుడు అదిల్ హాసన్(23) కేపీహెచ్బీకాలనీలోని హోలిమేరి డిగ్రీ కాలేజిలో రెండవ సంవత్సరం వరకూ చదివి మానేశాడు. తరువాత స్విగ్గిలో డెలివరి బాయ్గా పనిచేస్తున్నాడు. అయితే అందరి ముందు బాగా డబ్బున్న వాడిగా కనిపించాలనే కోరికతో కారు ఉంటే అందరూ తనను బాగా డబ్బున్న వాడు అనుకుంటారని భావించాడు. ఈ నెల 19న బైక్పై నిజాంపేట చౌరస్తా వద్ద గల పిస్తా హౌస్ వద్దకు వచ్చి బైక్ను పార్కు చేశాడు. అనంతరం కార్లు నిలిపే చోటుకు వచ్చి వాలెట్ పార్కింగ్ డ్రైవర్గా నమ్మించి అక్కడకు వచ్చిన మారుతి స్విఫ్ట్ కారును సెల్లార్లో పార్కు చేస్తానంటూ కారు యజమాని వద్ద తాళాలు తీసుకున్నాడు. కానీ కారును సెల్లార్లో పార్కు చేయకుండా కారును దొంగిలించుకువెళ్ళాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోమవారం నిజాంపేట చౌరస్తా వద్ద మఫ్టీలో ఉన్న పోలీస్లు వాహనాలు తనిఖీ చేస్తుండగా అటువైపుగా కారులో వచ్చిన అదిల్ హాసన్ కారుకు చెందిన పేపర్లు చూపించకుండా తప్పించుకుపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు పట్టుకొని విచారింగా నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. -
కాళ్లు చేతులు కట్టేసి.. కవర్లో చుట్టి
పహాడీషరీఫ్: కాళ్లు, చేతులు కట్టేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఉంచిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ భాస్కర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బురాన్ఖాన్ చెరువు ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఉండడాన్ని శనివారం రాత్రి పోలీసులకు సమాచారం అందించారు. వనస్థలిపురం ఏసీపీ జయరాం, బాలాపూర్ ఇన్స్పెక్టర్ భాస్కర్, ఎస్సై నాగరాజ్లు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని కాళ్లు, చేతులు కట్టి ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఉంచారు. మృతుడి వయసు 20 ఏళ్లు ఉండవచ్చునన్నారు. మృతదేహం కుళ్లి పోయి ఉండడాన్ని బట్టి మూడు నాలుగు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించడంతో పాటు ఇతర ఠాణాల్లో నమోదైన మిస్సింగ్ కేసులపై దృష్టి సారించారు. -
ఆద్యంతం రహస్యం
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా పోలీసులు ఏ చిన్న నేరగాడిని అరెస్టు చేసినా ప్రెస్మీట్లు పెట్టి హడావుడి చేస్తారు. పది తులాల బంగారం రికవరీ అయినా ఉన్నతాధికారులే తెరమీదికి వస్తారు. అలాంటి పోలీసులు ఓ అంతరాష్ట్ర మోసగాడిని అదీ సాక్షాత్తు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) అడ్వైజర్గా చెప్పుకుని రూ.కోట్లలో దండుకున్న ఘరానా నేరగాడిని అత్యంత రహస్యంగా అరెస్టు చేశారు. ఇతడిపై కేసు నమోదు, పీటీ వారెంట్పై తీసుకురావడం, బెయిల్ పొంది బయటకు వెళ్లిపోవడం ఇలా ప్రతి అంకం రహస్యంగానే సాగడానికి కారణం అంతుచిక్కట్లేదు. ఈ విషయంలో పోలీసు విభాగానికి, కేంద్ర నిఘా వర్గాలకు మధ్య ఓ కోల్డ్వార్ జరిగినట్లు తెలిసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం పూర్వాపరాలు ఇవీ..(సైనేడ్ కిల్లర్ మోహన్ దోషి) బీహార్లో పుట్టి లక్నోలో స్థిరపడి... బీహార్కు చెందిన అతుల్ శర్మకు ఆంగ్లంపై మంచి పట్టు ఉంది. దీని ఆధారంగానే అనేక మందితో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. ప్రధానంగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్లో కనిపించే ప్రతి విషయాన్నీ నమ్మే వారినే ఎక్కువగా టార్గెట్ చేసేవాడు. తన పేరుతో సోషల్మీడియాలో వివిధ బ్లాగులు సృష్టించిన అతను ఖరగ్పూర్ ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశానని, ఆపై అమెరికాలోని మసచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఉన్నత చదువులు అభ్యసించినట్లు పేర్కొన్నాడు. ఆ దేశ రక్షణ రంగంలో ఉన్నతోద్యోగం చేసినట్లు ప్రచారం చేసుకోవడమేగాక ‘నాసా’లో సైంటిస్ట్గా సేవలు అందించినట్లు అనేక బ్లాగుల్లో రాసుకున్నాడు. అయితే గతంలో అతుల్ను అరెస్టు చేసిన ఉత్తరాదికి చెందిన పోలీసులు ఐఐటీ ఖగర్పూర్లో ఆరా తీయగా... అతను తమ విద్యార్థి కాదంటూ స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో ఇతడు బ్లాగుల్లో ‘లిఖించిన’ ఇతర అంశాలు వాస్తవ దూరమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇతగాడు లక్నోలోని హజ్రత్గంజ్ ప్రాంతంలో స్థిరపడ్డాడు. (నమ్మించి.. దోచేశాడు! ) 1998 నుంచి వరుస కేసులు... దేశ ప్రధానికి సాంకేతిక సలహాదారుగా, తన పేరు జైవర్ధన్గా పరిచయం చేసుకున్న అతుల్ శర్మ 1998లో తొలిసారి గుజరాత్కు చెందిన వ్యక్తిని మోసం చేశారు. ఐక్యరాజ్యసమితికి సంబంధించిన కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ డబ్బు వసూలు చేయడంపై అప్పట్లో కేసు నమోదు చేసిన సీబీఐ అతడిని అరెస్టు చేసింది. పీఎంఓ అడ్వైజర్, నాసా మాజీ సైంటిస్ట్గా ప్రచారం చేసుకున్న అతుల్ శర్మ 2012 నుంచి జైలుకు వెళ్లి వస్తున్నాడు. నాసా సైంటిస్ట్ను అంటూ అక్కడ ఓ మహిళను పరిచయం చేసుకున్న అతను అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో కలిసి దిగినట్లు మార్ఫింగ్ చేసిన ఫొటోలు చూపించాడు. ఆమె నుంచి రూ.20 లక్షలు తీసుకుని మోసం చేయడంతో కేసు నమోదు చేసిన ముంబైలోని ఓషివార పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. మీరట్కు చెందిన ఓ మహిళతోనూ ‘నాసా’ పేరు చెప్పి వివాహం చేసుకుని మోసం చేశాడు. విషయం తెలుసుకున్న ఆమె నిలదీయగా ఆమెపై హత్యాయత్నం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులోనూ అతుల్ సింగ్ జైలుకు వెళ్ళి వచ్చాడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని బౌబజార్ ఠాణాతో పాటు మీరట్లోనూ ఇతడిపై చీటింగ్ కేసు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పెద్దలతో పరిచయాలు.. అతుల్ శర్మకు ఢిల్లీ స్థాయిలో కొందరు పెద్దలతో పరిచయాలు ఉన్నాయి. పోలీసు అధికారులు, బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులతో స్నేహం చేసేవాడు. ఈ ముసుగులో వారి సహకారంతో కొన్ని పైరవీలు చేస్తుండటం వృత్తిగా మార్చుకున్నాడు. అయితే హఠాత్తుగా పీఎంఓ అడ్వైజర్ అవతారం ఎత్తిన అతుల్ సింగ్ ప్రధానమంత్రి స్థాయిలో పైరవీలు చేయిస్తానని ప్రచారం చేసుకునేవాడు. ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులతో పాటు రక్షణ రంగానికి చెందిన వారికీ ఎర వేశాడు. తనకు ఉన్న పరిచయాలను వినియోగించి కొందరికి పైరవీలు చేసిపెట్టినా అనేక మంది నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేశాడు. రంగంలోకి దిగిన కేంద్ర నిఘా వర్గాలు అతుల్ శర్మ వ్యవహారం బట్టబయలు చేయడంతో లక్నోలో కేసు నమోదైంది. ఆ పోలీసులు ఈ మోసగాడిని అరెస్టు చేసి విచారించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని అబిడ్స్ ప్రాంతంలోనూ ఓ వ్యాపారిని మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. 24 గంటల్లో బెయిల్.. సదరు వ్యాపారిని సంప్రదించిన కేంద్ర నిఘా వర్గాలు జాతీయ స్థాయిలో ఓ పైరవీ చేస్తానంటూ రూ.కోట్లలో తీసుకున్నట్లు తేలింది. ఆ బాధితుడి ఫిర్యాదుతో అతుల్ శర్మపై అబిడ్స్ ఠాణాలోనూ కేసు నమోదైంది. అప్పటికే అతగాడు లక్నో జైల్లో ఉన్న విషయం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు లాక్డౌన్కు ముందే పీటీ వారెంట్పై తీసుకువచ్చి అరెస్టు చేశారు. కనీసం 24 గంటల కూడా జైల్లో లేకుండానే అతడికి బెయిల్ వచ్చింది. దీనికి తోడు ఈ అంతర్రాష్ట్ర మోసగాడు చేసిన మోసం, కేసు నమోదు, పీటీ వారెంట్ జారీ, అరెస్టు, బెయిల్ పొందడం... ఇవన్నీ అత్యంత రహస్యంగా జరిగిపోయాయి. ఈ వ్యవహారాన్ని కేంద్ర నిఘా వర్గాలు తప్పుపట్టినట్లు తెలిసింది. అయితే ఎక్కడా విషయం పొక్కనీయకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. ప్రస్తుతం అతుల్ శర్మపై నమోదైన కేసు ఏ స్థితిలో ఉందో కూడా బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్నారు. దీనికి కారణం కొందరు ‘పెద్దలతో’ అతుల్ శర్మకు ఉన్న సంబంధాలే కారణమని సమాచారం. దీనిపై ఉన్నతాధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది. -
స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడి మృతి
జీడిమెట్ల: అడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్పూల్లో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ బాలరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, దంతెరపల్లి గ్రామానికి చెందిన రామిరెడ్డి కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చి అపురూపాకాలనీలో ఉంటున్నాడు. రామిరెడ్డి భార్య విజయలక్ష్మి అదే కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆఫీస్ క్లర్క్గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమారులు రంజిత్ రెడ్డి(5), రిత్విక్రెడ్డి(3). శుక్రవారం ఉదయం విజయలక్ష్మి తన చిన్న కుమారుడు రిత్విక్రెడ్డితో సహా స్కూల్కు వెళ్లింది. మధ్యాహ్నం కుమారుడికి భోజనం పెట్టేందుకు చూడగా రిత్విక్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె భర్తకు ఫోన్ చేసి సమాచారం అందించింది. ఇద్దరు కలిసి కుమారుడి కోసం గాలించినా ఆచూకీ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి పాఠశాల అవరణలోని స్విమ్మింగ్పూల్ వద్దకు వెళ్లి చూడగా రిత్విక్ నీటిపై తేలుతూ కనిపించడంతో అతడిని సమీపంలోని అస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలుడి తండ్రి రామిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. -
‘డేటింగ్ ఫ్రెండే’ దోచేసింది
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ యువకుడు డేటింగ్ యాప్స్ మోజులో పడి రూ.11.3 లక్షలు కోల్పోయాడు. అతడి ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం అతడి ప్రమేయం లేకుండానే ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని, ఆన్ చేశాక యాప్స్ అన్నీ డిలీట్ అయి ఉండటంతో అనుమానం వచ్చి ఏపీలో ఉన్న బ్యాంకు ఖాతా సరిచూడగా అందులో ఉండాల్సిన రూ.15 లక్షలకు బదులు రూ.3.7 లక్షలు మాత్రమే ఉన్నాయి. అంతు చిక్కకుండా ఉన్న ఈ కేసును సవాల్గా తీసుకున్న ఏసీపీ కేవీఎం ప్రసాద్ ప్రత్యేకంగా దర్యాప్తు చేయించారు. ఫలితంగా గురువారం నాటికి ఈ వ్యవహారంలో స్పష్టత వచ్చింది. ప్రకాశం జిల్లా, గిద్దలూరుకు చెందిన కిషోర్ ప్రస్తుతం ఎస్సార్నగర్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. అతడి తండ్రి స్వస్థలంలోనే ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం పదవీ విమరణ చేసిన ఆయనకు రూ.15 లక్షలు బెనిఫిట్స్ అందాయి. వీటిని స్థానిక ఎస్బీఐ బ్రాంచ్లో కుమారుడు కిషోర్ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఈ ఖాతాకు సంబంధించిన యూనో యాప్ను కిషోర్ తన స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని లావాదేవీలు జరిపేవాడు. ఇదిలా ఉండగా... కొన్నాళ్ల క్రితం ఇతడికి ఓ డేటింగ్ యాప్ ద్వారా అఖిల అని చెప్పుకున్న యువతి పరిచయం అయింది. వాట్సాప్, ఐఎంఒ యాప్స్ ద్వారా చాటింగ్, ఫోన్ కాల్స్ వీరిద్దరి మధ్యా సాగాయి. కిషోర్ దగ్గర ఉన్న మొత్తం కొల్లగొట్టాలనే పథకం పన్నిత అఖిల అదును చూసుకుని అతడితో ఫోన్లో ‘గూగుల్ ప్లే సర్వీసెస్’ యాప్ను డౌన్లోడ్ చేయించింది. దానిని యాక్సస్ చేయడానికి అనువైన నంబర్ను అతడి నుంచే తీసుకుని తన ఫోన్ ద్వారా లింకు ఏర్పాటు చేసుకుంది. టీమ్ వ్యూవర్ తరహాకు చెందిన ఆ యాప్ ద్వారా అఖిల తన ఫోన్ నుంచే కిఫోర్ ఫోన్ను, అందులోని యాప్స్ను యాక్సస్ చేయవచ్చు. కొన్ని రోజుల తర్వాత తనకు కొంత డబ్బు అవసరం ఉందని, కావాల్సినప్పుడు అడిగితే సహాయం చేయాలని కోరడంతో కిషోర్ అందుకు అంగీకరించాడు. ఈ నెపంతో తనను యూనో యాప్లో బెనిఫిషియరీగా జోడించేలా చేసింది. ఎప్పటి లాగానే వీరిద్దరూ బుధవారం ఉదయం చాలాసేపు చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత కిషోర్ తన ఫోన్ చార్జింగ్ పెట్టి బయటికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన సదరు అఖిల సదరు యాప్ ద్వారా కిషోర్ ఫోన్ను యాక్సస్ చేసింది. యూనో యాప్ ద్వారా గిద్దలూరులోని బ్యాంకు ఖాతాలో ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్లు రద్దు చేసి ఆ మొత్తం నుంచి రూ.11.3 లక్షలు దఫదఫాలుగా బెంగళూరులో మహేశ్వర్ పేరుతో ఉన్న ఖాతాల్లోకి నిఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా మళ్లించింది. ఆపై యూనో సహా అన్ని యాప్స్ డిలీట్ చేయడంతో పాటు ఫోన్ను ఫార్మాట్ చేసేసింది. కొద్దిసేపటి తర్వాత తన ఫోన్ను పరిశీలించిన కిషోర్ అన్ని యాప్స్ డిలీట్ కావడాన్ని గుర్తించి గిద్దలూరులోని బ్యాంకు ఖాతాను పరిశీలించాలని తండ్రిని కోరాడు. ఆ పని చేసిన ఆయన ఫిక్సిడ్ డిపాజిట్లూ గల్లంతయ్యాయని, కేవలం రూ.3.7 లక్షలు ఉన్నట్లు చెప్పాడు. దీంతో బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన సైబర్ కాప్స్ ఆ మొత్తం బెంగళూరు ఖాతా నుంచి ప్రకాశం జిల్లా కందుకూరులో ఉన్న ఖాతాలకు వెళ్లినట్లు, అక్కడే డ్రా అయినట్లు గుర్తించారు. సదరు అఖిలగా చెప్పుకున్న యువతి ఎవరనేది గుర్తిస్తే ఈ కేసులో చిక్కుముడి వీడుతుందనే ఉద్దేశంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. డేటింగ్ యాప్స్లో ద్వారా జరిగే మోసాలకు ఇదో ఉదాహరణ అని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు కోరుతున్నారు. -
తండ్రి కాదు మృగం
దుండిగల్: రక్తం పంచుకుని పుట్టిన బిడ్డపై ఓ కర్కశ తండ్రి పాశవికానికి పాల్పడ్డాడు. మానవత్వానికే మచ్చ తెచ్చిన సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశం, బాధితురాలి కథనం ప్రకారం.. సూరారం కాలనీ శివాలయనగర్కు చెందిన ఓ వ్యక్తి (35) పెయింటర్గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె (14)లు ఉన్నారు. కాగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి కుమార్తెపై ఆఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కుటుంబ సభ్యు లందరినీ హతమారుస్తానంటూ బెదిరించి లొంగ దీసుకున్నాడు. ఇటీవల లైంగిక వేధింపులు తీవ్రతరం కావడంతో బాధితురాలు బుధవారం దుండిగల్ పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న స్థానికులు అతడిపై దాడి చేసే క్రమంలో కుటుంబ సభ్యులే వత్తాసు పలకడం గమనార్హం. అయితే ప్రస్తుతం బాలిక 5 నెలల గర్భవతి. పోలీసులు నిందితుడిపై 376(2)(ఎఫ్) (ఎన్), 506, ఫోక్సో 5 (ఎల్),(6) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
పుణె కరెన్సీ కేసులో హైదరాబాద్ లింకు !
సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్రలోని పుణెలో వెలుగులోకి వచ్చిన భారీ టాయ్ కరెన్సీ కేసులో హైదరాబాద్ కోణం బయటపడింది. ఈ ముఠా టాయ్ అమెరికన్ డాలర్లను నగరం నుంచే ఖరీదు చేసినట్లు పుణె క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. దీంతో తదుపరి దర్యాప్తులో భాగంగా ఓ ప్రత్యేక బృందం మంగళవారం హైదరాబాద్కు చేరుకుంది. ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన సంస్థల్లో సిటీకి చెందినవీ ఉన్నాయా? అనే కోణంలోనూ ఆరా తీస్తోంది. పుణె పోలీసులతో పాటు మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా ఈ నెల 10న ఓ ఆపరేషన్ నిర్వహించారు. పుణెలోని విమంతల్ పోలీసుస్టేషన్ పరిధిలోని విమన్నగర్ సంజయ్ పార్క్ ఏరియాలో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆర్మీ జవాన్ షేక్ ఆలం గులాబ్ ఖాన్తో పాటు సునిల్ భద్రీనాథ్ శ్రద్ధ, రితేష్ రత్నాకర్, తుఫిల్ అహ్మద్ మహ్మద్ ఇషార్ ఖాన్, అబ్దుల్ ఘనీ రహ్మతుల్లా ఖాన్, అబ్దుల్ రెహ్మాన్ అబ్దుల్ ఘనీ ఖాన్లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.87 కోట్ల విలువైన భారత్, అమెరికా టాయ్ కరెన్సీలు స్వాధీనం చేసుకున్నారు. పుణెలోని ఆర్మీ యూనిట్లో పని చేస్తున్న గులాబ్ ఖాన్ ఈ ముఠాకు సూత్రధారు అని మిలటరీ ఇంటెలిజెన్స్కు అందిన సమాచారం మేరకు ఈ దాడి జరిగినట్లు పుణె క్రైమ్ బ్రాంచ్ ప్రకటించింది. ఈ టాయ్ కరెన్సీ కట్టలకు ముందు, వెనుక అసలు నోట్లను పొందుపరిచారు. ఇలా వివిధ డినామినేషన్స్లో ఉన్న రూ.2.09 లక్షలు కరెన్సీని వాడారు. ఈ కేసు దర్యాప్తు కోసం పుణె క్రైమ్ బ్రాంచ్ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. న్యాయస్థానం అనుమతితో నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్న క్రైమ్ బ్రాంచ్ వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే దేశవిదేశాల్లో ఉన్న అనేక సంస్థల నుంచి ఫండ్స్ ఇప్పిస్తామంటూ ట్రస్టీలను వీరు మోసం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. భారీ స్థాయిలో నల్లధనం ఉన్న దాతలు, కంపెనీలు ఆ మొత్తాలను ఫండ్గా ఇస్తాయంటూ నమ్మబలికే వారనీ సమాచారం. ఈ కరెన్సీతో వీడియోలు చిత్రీకరించే వాళ్ళు. ప్రతి వీడియోలోనూ ఆ రోజు న్యూస్ పేపర్ కనిపించేలా చేసి తాజావని నమ్మించే వారు. పుణె క్రైమ్ బ్రాంచ్ పరిశీలించిన వీడియోల్లో కొన్ని ప్రైవేట్ సంస్థలు, మల్టీ నేషనల్ కంపెనీల పేర్లు ప్రస్తావించినట్లు తెలిసింది. రెండు బృందాలుగా.. తమకు కమీషన్ కావాలంటూ డిమాండ్ చేసి ఆ మొత్తం కాజేసేవారని, ఆపై ఎలాంటి ఫండ్ ఇప్పించకుండా మోసం చేసేవాళ్ళని క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. ఈ గ్యాంగ్లోని సభ్యులు రెండు బృందాలుగా ఏర్పడి ఒకరి భారత్ కరెన్సీ, మరొకరు అమెరికన్ డాలర్లు ఫండ్స్గా ఇప్పిస్తామంటూ మోసం చేసేవారని క్రైమ్ బ్రాంచ్ తేల్చింది. గులాబ్ ఖాన్ ప్రధాన దళారీగా, మిగిలిన వారు డోనర్లుగా అవతారం ఎత్తి మోసాలకు పాల్పడేవాళ్లు. ఇలా కథలు చెప్పి, కరెన్సీ వీడియోలు చూపి ఇప్పటి వరకు 20–25 సంస్థల నుంచి అందినకాడికి దండుకున్నారని అనుమానిస్తోంది. దీనికోసం పుణేలోని సంజయ్ పార్క్ ఏరియాలో గత ఏడాది అక్టోబర్లో ఓ పాత బంగ్లాను అద్దెకు తీసుకున్నారు. ఇందులోనే ముఠాతో పాటు టాయ్ కరెన్సీ చిక్కింది. ఈ ముఠాను సోమవారం పుణే కోర్టులో హాజరుపరిచిన క్రైమ్ తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ నెల 20 వరకు కస్టడీలోకి తీసుకుంది. విచారణలో భాగంగా వీరికి ఈ టాయ్ కరెన్సీ ఎక్కడ నుంచి వచ్చిందనే అంశంపై దృష్టి పెట్టింది. ఫలితంగా ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్ నుంచి భారత్ టాయ్ కరెన్సీ, హైదరాబాద్ నుంచి అమెరికన్ టాయ్ డాలర్లు ఖరీదు చేసినట్లు తేలింది. టాయ్ డాలర్లపై ఫోకస్ రూ.4.7 కోట్ల విలువైన ఈ టాయ్ డాలర్లను ఎందుకు తయారు చేశారనే దానిపై క్రైమ్ బ్రాంచ్ దృష్టి పెట్టింది. చిన్నారులు ఆడుకోవడానికి ఇలాంటి టాయ్ కరెన్సీ విక్రయిస్తూ ఉంటారు. అయితే ఈ స్థాయిలో ముద్రించరని క్రైమ్ బ్రాంచ్ అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ ముద్రణ చేసిన వారికీ గ్యాంగ్తో సంబంధాలు ఉన్నాయా? లేక డబ్బు కోసమే ఇలా చేశారా? అనే దానిపై దృష్టి పెట్టారు. ఈ సందేహాలు నివృతి చేసుకోవడానికి ఓ ప్రత్యేక బృందం మంగళవారం సిటీకి చేరుకుంది. మరోపక్క ఈ గ్యాంగ్ లీడర్ గులాబ్ ఖాన్ తాను హైదరాబాద్కు చెందిన నిజాం నవాబు వారసుడిని అంటూ అనేక మందికి చెప్పాడని, దానికి ఆధారంగా తమ బంగ్లా అంటూ కొన్ని ఫొటోలను చూపాడని క్రైమ్ బ్రాంచ్ తేల్చింది. -
స్నాచింగ్ చేసిన మరుసటి రోజు మరో చోరీ
సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్కు పాల్పడి, మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కిన ద్వయం శక్తి మయూర్, కాలా వికాస్ విచారణలో మరో నేరం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శక్తి మయూర్ ప్రోద్బలంతో ఈ ద్వయం స్నాచింగ్ చేసిన మరుసటి రోజు మరో ఇద్దరితో కలిసి అఫ్జల్గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ బార్లో చోరీ చేసినట్లు తేలింది. మయూర్,వికాస్లను సోమవారం అరెస్టు చేసిన సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఈ విషయం గుర్తించింది. దీంతో మంగళవారం మిగిలిన ఇద్దరు నిందితుల్నీ పట్టుకుంది. వీరిని తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్గంజ్ పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ పి.రాధాకిషన్రావు తెలిపారు. ఇప్పటికే ముషీరాబాద్ పోలీసులు రిమాండ్కు తరలించిన మయూర్ను ఈ కేసులో పీటీ వారెంట్పై అరెస్టు చేయనున్నారు. జల్సాల కోసం జత కలిసి.. పురానాపూల్లోని ఎస్వీనగర్కు చెందిన శక్తి మయూర్ తారామండల్ కాంప్లెక్స్లోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. పదో తరగతి వరకు గజ్వేల్లో చదివిన ఇతగాడు ఆపై చదువుకు స్వస్తి చెప్పి సిటీకి వచ్చేశాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చెడు వ్యసనాలకు లోనయ్యాడు. స్నేహితులతో కలిసి జల్సాలు చేయడానికి అలవాటుపడ్డాడు. మద్యం, జూదం తదితర వ్యసనాలకు బానిసైన ఇతగాడికి పురానాపూల్కు చెందిన కాలా వికాస్లో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ కలిసి సంచరించడం మొదలెట్టారు. వీరికి తాము చేస్తున్న ఉద్యోగాల్లో నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదాయం వచ్చేది. వ్యసనాలకు బానిసలైన వీరికి ఆ మొత్తం సరిపోయేది కాదు. దీంతో తేలిగ్గా డబ్బు పంపాదించడానికి నేరాలు చేయాలని శక్తి మయూర్ పథకం వేశాడు. దీనికి వికాస్ కూడా అంగీకరించడంతో ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై మధ్య మండల పరిధిలోని అనేక ప్రాంతాల్లో రెక్కీ చేశారు. రెండుమూడు రోజుల పరిశీలన అనంతరం ముషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఎస్బీఐ కాలనీలో స్నాచింగ్ చేయడం అనువని గుర్తించారు. దీంతో ఈ నెల 7న తమ వాహనంపై మరోసారి అక్కడికి వెళ్లారు. వాకింగ్కు వచ్చిన పార్వతిదేవి అనే వృద్ధురాలి మెడలోంచి మూడు తులాల బంగారం గొలుసు లాక్కుపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో ముషీరాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. కేసు ఛేదించిన క్రమంలో.. కేసును ఛేదించేందుకు మధ్య మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ జావేద్ నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీనివాసులు, మహ్మద్ షానవాజ్ షరీఫ్ టి.శ్రీధర్ రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్తో పాటు సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించి మయూర్, వికాస్లను పట్టుకున్నారు. మయూర్ వ్యవహారాన్ని అధికారులు అనుమానించారు. అతడు మరికొన్ని నేరాలు చేసి ఉండవచ్చని భావించారు. ఈ కోణంలో లోతుగా ఆరా తీయగా.. మరో ముగ్గురితో కలిసి ఈ నెల 8 రాత్రి అఫ్జల్గంజ్ పరిధిలోని ఓ మూసి ఉన్న బార్లో చోరీ చేసినట్లు వెల్లడైంది. పురానాపూల్కు చెందిన కె.ఆతిష్, షాహినాయత్గంజ్కు చెందిన ఎం.కనిష్క్లతో కలిసి మయూర్, వికాష్లు చోరీలకు స్కెచ్ వేశారు. కోవిడ్ నిబంధనల్లో భాగంగా నగర వ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్లు మూసి ఉంటాయని, వాటిని టార్గెట్ చేసుకుంటే తాము చిక్కబోమని పథక రచన చేశారు. అఫ్జల్గంజ్ పరిధిలో సీబీఎస్కు సమీపంలో ఉన్న రవీంద్ర బార్ను టార్గెట్గా చేసుకున్నారు. ఈ నెల 8న తెల్లవారుజామున నలుగురూ కలిసి అక్కడకు చేరుకున్నారు. మయూర్, వికాస్లు బయట ఉండి పరిస్థితులు గమనిస్తుండగా.. మిగిలిన ఇద్దరూ కిటికీ పగల కొట్టడం ద్వారా బార్లోకి ప్రవేశించారు. ఆ బార్ మొదటి అంతస్తు నుంచి 20 మద్యం బాటిళ్లను చోరీ చేసుకువచ్చారు. వీటిలో 18 బాటిళ్లను విక్రయించిన ఈ నలుగురూ ఆ డబ్బును పంచుకుని జల్సాలు చేశారు. దీనిపై అఫ్జల్గంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోమవారం మధ్య మండల టాస్క్ఫోర్స్కు చిక్కిన మయూర్, వికాస్ల విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆతిష్, కనిష్క్లను పట్టుకున్న టాస్క్ఫోర్స్ వీరి నుంచి రూ.10 వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుంది. వీరిని తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్గంజ్ పోలీసులకు అప్పగించింది. ఇప్పటికే మయూర్, వికాస్లను ముషీరాబాద్ పోలీసులు స్నాచింగ్ కేసులో రిమాండ్ చేశారు. దీంతో అఫ్జల్గంజ్ పోలీసులు బార్ చోరీ కేసులో వీరిపై కోర్టు ద్వారా పీటీ వారెంట్ తీసుకుని అరెస్టు చేయనున్నారు. -
బెయిల్ కోసం నకిలీ డాక్యుమెంట్లు..
సాక్షి, సిటీబ్యూరో: మ్యాట్రిమోనీ మోసం కేసులో అరెస్టయి చంచల్గూడ జైలులో ఉన్న నిందితుడిని బెయిల్పై విడుదల చేసేందుకు ష్యూరిటీ సంతకం చేసి నకిలీ డాక్యుమెంట్లను సమర్పించిన మహిళా నైజీరియన్ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మ్యాట్రిమోని వెబ్సైట్ ద్వారా డాక్టర్ను పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లక్షలు కొట్టేసిన కేసులో ఈ ఏడాది మార్చి నెలలో నైజీరియన్ గిడ్డి ఇసాక్ ఓలూతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే జైలులో ఇతడికి బెయిల్ ఇచ్చేందుకు సమ్మతించిన న్యాయస్థానం ఇద్దరు ష్యూరిటీ సంతకాలు చేయాలని ఆదేశించింది. దీంతో ఒబినా బాతోలోమివూ గొడ్విన్, రొస్లైన్ అన్నా ఎక్యూరేలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాకు వెళ్లి పాస్పోర్టు కాపీలు, రెంటల్ అగ్రిమెంట్ తదితరాలు సమర్పించారు. అయితే వీరిలో ఒకరైన న్యూఢిల్లీలో ఉంటున్న రొస్లైన్ అన్నా ఎక్యూరే 2016 ఫిబ్రవరి 10న మెడికల్ వీసాపై భారత్కు వచ్చానని పోలీసులకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది. వీటిని పోలీసులు నిశితంగా పరిశీలిస్తే అనుమానం వచ్చి సంబంధిత అదికారులకు పంపిస్తే వీసా ఫోర్జరీది అని తేల్చి చెప్పారు. దీంతో ఇటు పోలీసులు, అటు కోర్టును మోసం చేసి తమ వ్యక్తిని బెయిల్పై విడుదల చేసేందుకు యత్నించిన రొస్లైన్ అన్నా ఎక్యూరేను అరెస్టు చేశారు. -
ఒకే నంబర్తో రెండు సిమ్లు..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వరుసగా వెలుగులోకి వచ్చిన సిమ్కార్డుల బ్లాక్ స్కామ్లను సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఆయా వ్యాపారులు వినియోగిస్తున్న సిమ్కార్డు సర్వీస్ ప్రొవైడర్ల నిర్లక్ష్యం ఉందని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరి సిమ్కార్డు యాక్టివ్గా ఉండగా..దాన్ని బ్లాక్ చేసే మరొరికి అదే నెంబర్తో సిమ్కార్డు జారీ చేయడంపై వివరణ ఇవ్వాలంటూ ఎయిర్టెల్ సంస్థకు సోమవారం నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువు లోపు ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి రికార్డులు సమర్పించాల్సిందిగా వాటిలో ఆదేశించారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఈ సిమ్బ్లాక్స్కామ్కు నగరానికి చెందిన ఇద్దరు వ్యాపారులు బలయ్యారు. ఒకరి ఖాతాల నుంచి రూ.38 లక్షలు, మరొకరి ఖాతాల నుంచి రూ.50 లక్షల్ని సైబర్ నేరగాళ్ళు కాజేసిన విషయం విదితమే. రెండు వారాల క్రితం సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యాపారికి చెందిన రెండు ఖాతాల నుంచి రూ.38 లక్షలు కాజేసిన ఉదంతం మరువక ముందే... గత గురువారం మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అమీర్పేట ప్రాంతానికి చెందిన ఓ బిజినెస్మ్యాన్ ఖాతా నుంచి రూ.50 లక్షలు సైబర్ నేరగాళ్ళు తమ ఖాతాల్లోకి మళ్ళించేసుకున్నారు. ఈ ఇద్దరు వ్యాపారులు తన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఖాతాలకు కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన లావాదేవీలు, వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) సహా ఇతర అలెర్ట్స్ కోసం తాము వినియోగిస్తున్న ఎయిర్టెల్ సంస్థ నెంబర్లను అనుసంధానించారు. సికింద్రాబాద్కు చెందిన వ్యాపారి ఫోన్ హఠాత్తుగా పని చేయలేదు. ఆయన తేరుకునే లోపే రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.38 లక్షలు సైబర్ నేరగాళ్ళకు చేరాయి. అమీర్పేట వ్యాపారి మాత్రం తన సిమ్కార్డు బ్లాక్ అయిన విషయం గుర్తించి తన సర్వీస్ ప్రొవైడర్ అయిన ఎయిర్టెల్ సంస్థను సంప్రదించారు. (హైదరాబాద్ ప్రజలకు ఎయిర్టెల్ శుభవార్త) మీ నెంబర్తో చెన్నైలో కొత్త సిమ్ యాక్టివేట్ అయిందని, అందుకే ఇక్కడిది బ్లాక్ అయిందంటూ ఆ సంస్థ నుంచి సమాధానం వచ్చింది. అలా ఎందుకు జరిగిందని శ్రీహర్ష ఆరా తీసినా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆయన తన బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే వాటి నుంచి రెండు దఫాల్లో రూ.50 లక్షలు మాయమైనట్లు తేలింది. ఈ రెండు నేరాలు చోటు చేసుకువడానికి వ్యాపారులు వినియోగిస్తున్న నెంబర్తోనే మరో సిమ్కార్డు జారీ కావడమే కారణమని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇలా జారీ చేయడం నిబంధనలకు విరుద్ధమని చెప్తున్న అధికారులు ఎలా జరిగిందనే దానిపై దృష్టి పెట్టారు. ఏ పత్రాల ఆధారంగా మరో సిమ్కార్డు జారీ అయింది? దానికి ప్రామాణికాలు ఏంటి? తదిరాలు తెలుసుకోవడంపై దృష్టి పెట్టారు. ఈ విషయాలు తెలిస్తేనే ఈ కేసుల దర్యాప్తు ముందుకు వెళ్ళడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చోటు చేసుకోకుండా అడ్డుకోవడానికి ఆస్కారం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి రికార్డులతో తమకు వివరణ ఇవ్వాల్సిందిగా ఎయిర్టెల్ సంస్థకు ఈ రెండు కేసుల్లోనూ వేర్వేరు నోటీసులు జారీ చేశారు. కేసుల దర్యాప్తులో భాగంగా సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఎక్కడి ఐపీ అడ్రస్ల ఆధారంగా సైబర్ నేరగాళ్ళు ఈ ఖాతాలకు యాక్సస్ చేశారనే అంశాన్నీ సాంకేతికంగా ఆరా తీస్తున్నారు. -
సిగరెట్.. చుట్టూ వందల కోట్ల వ్యాపారం
సాక్షి, సిటీబ్యూరో: సిగరెట్..చుట్టూ ఇప్పుడు రూ.వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది. విదేశాల్లో తయారైన కొన్ని బ్రాండ్లను ఢిల్లీ మీదుగా గుట్టుగా నగరానికి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ స్మగ్లింగ్ దందా లాక్డౌన్ తదనంతర పరిణామాలతో పెరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు నగర వ్యాప్తంగా నిఘా ముమ్మరం చేశారు. ఫలితంగా శనివారం నార్త్జోన్ టాస్క్ఫోర్స్కు రూ.12.6 లక్షల సరుకుతో చంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ అహ్మద్ చిక్కాడు. ఈ విదేశీ సిగరెట్ల దందాపై దృష్టి పెట్టిన పోలీసు విభాగం లోతుగా ఆరా తీస్తోంది. తయారీ మొత్తం ఆయా దేశాల్లోనే... హైదరాబాద్ నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో కొన్ని బ్రాండ్లే ఎక్కువగా ఉన్నట్లు టాస్క్ఫోర్స్ గుర్తించింది. సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్ కలిగి ఉండే డజరమ్ బ్లాక్, గుడాన్ గరమ్, మాల్బరో, డన్హిల్, ఎస్సా, విన్, ప్యారిస్ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో వస్తున్నట్లు గుర్తించింది. ఇవి తయారవుతున్నది ఇండోనేషియా, చైనా, మలేషియా,స్విడ్జర్లాండ్, సౌత్ కొరియాల్లో అయినప్పటికీ అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్కు చేరుకోవట్లేదు. దుబాయ్ మీదుగానే ఢిల్లీ, ముంబై, చెన్నైలకు చేరి అట్నుంచి సిటీకి వస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. మహ్మద్ అహ్మద్కు సైతం ఢిల్లీలోని సదర్ బజార్ నుంచి రైల్వే కార్గోలో వచ్చిన విషయం ఇప్పటికే గుర్తించారు. అధికారుల కళ్ళు గప్పేందుకు ఈ అక్రమ రవాణా సిగరెట్ల పేరుతో కాకుండా వివిధ వస్తువులంటూ జరుగుతోందని నిర్థారిస్తున్నారు. ఓసారి ఓడలు, మరోసారి విమానాలు... సిటీకి సిగరెట్ల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న నగరానికి చెందిన ఓ ముఠాపై గతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు డేగకన్ను వేశారు. ఈ గ్యాంగ్ ఓసారి విదేశీ సిగరెట్లను సముద్ర మార్గంలో కంటైనర్ల ద్వారా తీసుకువచ్చింది. పిల్లలకు వినియోగించే డైపర్లని చెప్తూ కంటైనర్ ముందు వరుసల్లో వాటినే పెట్టి, వెనుక సిగరెట్లను నింపి తీసుకువచ్చింది. మూసాపేటలో ఉన్న ఇన్ల్యాండ్ కంటైనర్ డిపోకు ఇవి చేరుకోవడంతో ఉప్పందిన డీఆర్ఐ అధికారులు దాడి చేసి రూ.7.5 కోట్ల విలువైన రెండు కంటైనర్లను పట్టుకుని నిందితుల్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత పంథా మార్చిన అదే గ్యాంగ్ ఇంజనీరింగ్ వస్తువులు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ పేరుతో విమాన మార్గంలో తీసుకువచ్చింది. శంషాబాద్లోని ఎయిర్కార్గోలో ఉండగా దాడి చేసి రూ.51 లక్షల వలువైనవి స్వాధీనం చేసుకుని ముఠాను అరెస్టు చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇలాంటి గ్యాంగ్స్ మరోసారి రెచ్చిపోతున్నట్లు టాస్క్ఫోర్స్ అనుమానిస్తోంది. ఒకటికి ఒకటిన్నర డ్యూటీ... ఆరోగ్యానికి హానికరమైన, స్థానికంగా ఉండే వ్యాపారులను నష్టాన్ని తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుల్లో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్ ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీనే రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూ టీని ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠా భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతోందని డీఆర్ఐ దర్యాప్తులో తేలింది. సిటీలో ఉన్న హోల్సేలర్లతో సంబంధాలు పెట్టుకున్న ఈ గ్యాంగ్ వారి ద్వారా మార్కెట్లోని వెదజల్లుతోంది. ఆరోగ్యానికీ చేటనే అనుమానం... ఈ రకంగా అక్రమ రవాణా ద్వారా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణంగా ‘పన్ను పోటు’తో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని టాస్క్ఫోర్స్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుల దర్యాప్తు నేపథ్యంలో క్షేత్రస్థాయిలోనూ పరిశీలన చేసి వ్యాపార లావాదేవీలను గుర్తించాలని నిర్ణయించారు. ఇలా చేయడం ద్వారా మూలాలు కనుగొనడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు. విదేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్ళిపోతున్నాయని వివరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి ఎనలేని హాని చేస్తాయిని పోలీసులుహెచ్చరిస్తున్నారు. -
ఆఫీసర్ @ ట్రూ కాలర్
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇప్పిస్తానంటూ ఎర వేసి అనేక మంది నిరుపేదల్ని నిండా ముంచిన వై.రాకేష్ యాదవ్ ‘సాంకేతిక పరిజ్ఞానాన్నీ’ వినియోగించుకున్నాడు. ట్రూ కాలర్ యాప్లో తన నెంబర్ను కలెక్టరేట్లో అధికారి అంటూ నమోదు చేసుకున్నాడు. దీని ఆధారంగానే బాధితులకు కాల్స్ చేస్తూ వారిని నమ్మించి నిండా ముంచాడు. 17 మంది నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి మోసం చేసిన రాకేష్ యాదవ్ను ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఇతడి విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉప్పుగూడలోని కందిగల్గేట్ ప్రాంతానికి చెందిన వై.రాకేష్ యాదవ్ పదో తరగతి వరకు చదివి స్థానికంగా ఎలక్ట్రీషియన్గా పని చేసేవాడు. ఇతడి తండ్రి వై.అంజయ్య రేషన్ కార్డులు ఇప్పించడానికి దళారిగా వ్యవహరించాడు. (‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు ) ఆయన ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల పని తీరుపై రాకేష్కు అవగాహన వచ్చింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు భారీగా డిమాండ్ పెరిగిందని రాకేష్ తెలుసుకున్నాడు. దీంతో తానే ఓ ప్రభుత్వ అధికారిగా చెప్పుకుంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిని గుర్తించడం మొదలెట్టాడు. ఇలా చేయడానికి ముందు తన స్మార్ట్ ఫోన్లో ట్రూ కాలర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. అందులో తన నెంబర్ను ‘ఆఫీసర్ రంగారెడ్డి కలెక్టరేట్’ అంటూ సేవ్ చేసుకున్నాడు. దీంతో ఈ నెంబర్ నుంచి ఎవరికైనా కాల్స్ చేసినప్పుడు ఆ పేరునే ట్రూ కాలర్ చూపేది. దీంతో శ్రీనివాస్గా చెప్పుకున్న రాకేష్ కలెక్టరేట్ అధికారి అని తేలిగ్గా నమ్మేవాళ్ళు. దరఖాస్తుదారులకు పూర్తి నమ్మకం కలగడానికి వారి నుంచి దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, పాస్పోర్టు ఫొటోలను సంగ్రహించేవాడు. ముందుగా డీడీ కట్టాలంటూ రూ.40 వేల వరకు అడ్వాన్సుగానూ తీసుకునేవాడు. ఆపై తన ఫోన్లో సేవ్ చేసి ఉండే ‘మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైంది. మొదటి ఇన్స్టాల్మెంట్ రూ.40 వేలు అందింది. రెండోది చెల్లించండి’ అనే ఎస్సెమ్మెస్ను బాధితులకు చూపేవాడు. దీని ఆధారంగా మిగిలిన మొత్తం కూడా తీసుకుని మోసం చేసేవాడు. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం రాకేష్ అబిడ్స్, గోషామహల్, కోఠి తదితర ప్రాంతాలకు చెందిన 17 మంది నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశాడు. ఇతడిని అరెస్టు చేసే సమయానికి బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదని అధికారులు చెప్తున్నాడు. దేవరయాంజాల్లో ఓ విల్లా అద్దెకు తీసుకుని ఉంటున్న రాకేష్ జల్సాలకు ఎక్కువగా ఖర్చులు చేశాడని వివరిస్తున్నారు. రాజకీయ నాయకుడి మాదిరిగా వైట్ అండ్ వైట్ ధరించడం, కార్లలో తిరగడం చేస్తూ డబ్బు ఖర్చు చేసినట్లు గుర్తించారు. ఇతడి గతం, తాజా వ్యవహారాలను ఆరా తీస్తున్న పోలీసులు విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
టీవీలో ప్రకటనలు చూస్తే నెలనెలా జీతం..!
సాక్షి, సిటీబ్యూరో: గుజరాత్లోని సూరత్ కేంద్రంగా పని చేసే ఓ సంస్థ కొత్త తరహా మోసానికి తెరలేపింది. తమ వద్ద డబ్బు చెల్లించి ఎల్ఈడీ టీవీ పొందాలని, అందులో వచ్చే యాడ్స్ చూస్తూ ఉంటే నెలనెలా తామే కనీస మొత్తం చెల్లిస్తూ ఉంటామని ఆన్లైన్లో ప్రచారం చేసుకుంది. దీన్ని చూసిన ముగ్గురు నగరవాసులు రూ.2.49 లక్షలు చెల్లించి మోసపోయారు. వీరి ఫిర్యాదు మేరకు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సూరత్కు చెందిన డోర్ టైజర్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఆన్లైన్లో యాడ్స్ ఇచ్చింది. అందులో తమ వద్ద రూ.83 చెల్లిస్తే అత్యాధునికమైన ఎల్ఈడీ టీవీ పంపిస్తామని నమ్మబలికింది. అంతటితో ఆగకుండా తమ వద్ద సభ్యత్వం తీసుకున్న వారికి ప్రత్యేక యాప్ ద్వారా ఆ టీవీలో కొన్ని ప్రకటనలు చూపిస్తామంటూ చెప్పింది. వీటిని క్రమం తప్పకుండా చూస్తే ప్రతి నెలా కనిష్టంగా రూ.11,500 చొప్పున చెల్లిస్తామంటూ ఎర వేసింది. ఈ ప్రకటన చూసి ఆకర్షితులైన ముగ్గురు నగరవాసులు అందులోని నెంబర్లకు సంప్రదించారు. ఒక్కోక్కరు రూ.83 వేల చొప్పున రూ.2.49 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత ఆ సంస్థ నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మరోపక్క ఈ యాడ్స్ యాడ్స్ ఓఎల్ఎక్స్లో, ఫేస్బుక్లోని మార్కెట్ ప్లేస్లో సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాల విక్రయం పేరుతో ఉన్న ప్రకటనలకు ఇద్దరు నగరవాసులు స్పందించారు. అందులో ఉన్న నెంబర్లకు సంబంధించిన వీరు బేరసారాలు పూర్తి చేశారు. ఆపై అడ్వాన్సుల పేరుతో రూ.40 వేలు, రూ.74 వేలు చెల్లించి మోసపోయారు. ఇంకో ఉదంతంలో నగరానికి చెందిన ఓ బ్యాంకు డిప్యూటీ మేనేజర్కు సైబర్ నేరగాళ్ళు ఫొన్ చేశారు. తాము ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్నారు. తక్కువ వడ్డీకి భారీ మొత్తం రుణం అంటూ ఎర వేశారు. బాధితుడు అంగీకరించడంతో ఇతడి నుంచి కొన్ని పత్రాలు సైతం వాట్సాప్ చేయించుకున్నారు. చివరకు ప్రాసెసింగ్ ఫీజు సహా ఇతర పేర్లు చెప్పి రూ.40 వేలు కాజేశారు. -
వదినపై మరిది దాడి
మీర్పేట: వదినతో గొడవపడిన మరిది ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకట్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మీర్పేట ప్రగతినగర్కు చెందిన మరక మంజులాదేవి (37) జలమండలిలో డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పని చేసేది. ఆమె భర్త విష్దేవ్లో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. కుమార్తె వరణియ తేజ, అత్త జ్యోతితో కలిసి ఉంటోంది. గురువారం ఉదయం మరిది నారదేవ్తో ఇంట్లో గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో ఆగ్రహానికి లోనైన నారదేవ్ కత్తితో మంజులాదేవిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీనిని గుర్తించిన అమె కుమార్తె సమీపంలో ఉంటున్న మంజులాదేవి సోదరికి సమాచారం అందించడంతో వారు ఆమెను చికిత్స నిమిత్తం అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అతడు.. ఆమె.. ఓ అన్న!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని మల్కాజిగిరికి చెందిన ఓ విద్యార్థి యువతిగా ‘మారాడు’.. ఆ పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచి సాఫ్ట్వేర్ ఇంజినీర్కు ఎర వేశాడు... తన ఫొటోలు అంటూ డమ్మీవి పంపించి.. బాధితుడి నుంచి ‘అసలైనవి’ సంగ్రహించాడు.. ఇవి చేజిక్కిన తర్వాత పెళ్లి ప్రస్తావనతీసుకువచ్చి బెదిరించాడు... ఆపై తన అన్న అంటూ తానే మరో పాత్రలో ప్రవేశించి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడు... చివరకు బాధితుడి నుంచి రూ.3.5 లక్షలు కాజేసి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. ఆ వివరాలు ఇవీ.. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన కె.పవన్కిరణ్ (20) నగరంలోని ఓ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆన్లైన్ జూదానికి, ఇతర విలాసాలకు అలవాటుపడిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడాలనే ఉద్దేశంలో సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడానికి పథకం వేశాడు. ఓ యువతి పేరు, ఆకర్షణీయమైన ఫొటోలు వినియోగించి ఇన్స్ట్రాగామ్లో ఖాతా తెరిచాడు. దీని ద్వారా కాచిగూడ ప్రాంతంలో నివసించే సాఫ్ట్వేర్ ఇంజినీర్కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఈ రిక్వెస్ట్ వచ్చింది సదరు యువతి నుంచే అని భావించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ యాక్సెప్ట్ చేశాడు. ఇలా కొన్నాళ్ల పాటు యువతి మాదిరే చాటింగ్స్ చేశాడు. తన ఉనికి బయటకు రాకుండా ఉండేందుకు ఎప్పుడూ, ఏ సందర్భంలోనూ వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఓ దశలో తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెబుతూ కొన్ని ‘ఫొటోలు’ పంపిస్తానంటూ యువతిగానే చెప్పాడు. దానికి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంగీకరించడంతో ఇంటర్నెట్ నుంచే డౌన్లోడ్ చేసిన కొన్ని అర్ధనగ్న ఫొటోలను తనవే అంటూ పంపించాడు. వీటిని బాధితుడు చూశాడని నిర్ధారించుకున్న తర్వాత చాటింగ్ కొనసాగించాడు. ఆపై పెళ్లి ప్రస్తావన.. చాటింగ్ గారడీ ద్వారానే బాధితుడు సైతం తనంత తానుగా అతడికి చెందిన కొన్ని అలాంటి ఫొటోలే తనకు ఇన్స్ట్రాగామ్లో పంపేలా చేసుకున్నాడు. ఆపై అసలు కథను ప్రారంభించాడు పవన్ కిరణ్. ఉద్దేశపూర్వకంగా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. నిన్నే పూర్తిగా నమ్మానని, అందుకే వ్యక్తిగత ఫొటోలను సైతం షేర్ చేశానంటూ చాటింగ్ మొదలెట్టాడు. ఈ ప్రస్తావనతో హడలిపోయన బాధితుడు ఇన్స్ట్రాగామ్లో యువతి పేరుతో ఉన్న పవన్ కిరణ్ ఖాతాను బ్లాక్ చేశాడు. దీంతో వాట్సాప్ ద్వారా రంగంలోకి దిగిన నిందితుడు తనను పెళ్లి చేసుకోమంటే బ్లాక్ చేసి మోసం చేస్తున్నావంటూ సందేశాలు పంపాడు. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే రూ.30 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగాడు. మూడో పాత్రలోకి దిగి.. ఈ విషయం తన అన్న వద్దకు వెళుతోందని, ఆయనే మాట్లాడతారంటూ సందేశం పెట్టిన పవన్ మూడో పాత్రలోకి దిగాడు. బాధితుడైన సాఫ్ట్వేర్ ఇంజినీర్కు ఫోన్లు చేయడం ప్రారంభించిన పవన్ ‘అన్న’ మాదిరిగా మాట్లాడుతూ బెదిరించాడు. తన వద్ద ఉన్న అతడి వ్యక్తిగత ఫొటోలను సైతం మచ్చుకు పంపిస్తున్నానంటూ డబ్బు డిమాండ్ చేశాడు. దీంతో రూ.3.5 లక్షలు చెల్లించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనను విడిచిపెట్టాలని ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ వదలిపెట్టని పవన్ మరికొంత మొత్తం ఇవ్వాలని పదేపదే ఫోన్లు చేశాడు. దీంతో బాధితుడు ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్రావు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నిందితుడు వినియోగించిన ఫోన్నంబర్ల ద్వారా ముందుకు వెళ్లిన దర్యాప్తు అధికారి గురువారం పవన్కిరణ్ నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
ఫోన్ హ్యాక్.. #*#4636#*#* ఇది డయల్ చేస్తే
కుత్బుల్లాపూర్: కరోనా మహమ్మారితో కలవరపడుతున్న ప్రజలను సైబర్ క్రైమ్స్ కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉద్యోగాలు కోల్పోవడం, వ్యాపారాలు కుదేలవడం వంటి పరిమాణాలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిలో కొంత మందికి వచ్చే కాల్స్తో వారి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నాయి. ఫోన్, ఈ–మెయిల్, క్యూఆర్ కోడ్స్, ఓటీపీ హ్యాక్.. ఇలా పలురకాల దారుల్లో మోసాలు జరుగుతున్నాయి. ఎంతలా అంటే 2019 సంవత్సర కాలంలో సైబర్ కేసులు మొత్తం 477 నమోదైతే 2020లో గడిచిన ఐదు నెలలో 485 కేసులు నమోదవడం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లాక్డౌన్లో ఎక్కువగా కేసులు పెరిగాయి. 2016 నుంచి ఇప్పటి వరకు నమోదైన 1,636 సైబర్ కేసుల్లో కొన్ని విచిత్రంగా ఉంటాయి. వీటిలో బాధితులు అసలు మాకు బ్యాంక్ ఓటీపీ రాలేదని, అయినా మా ఖాతాలు ఖాళీ అయ్యాయని చెప్పడం చూస్తుంటే మనం వాడే ఫోన్ని సైతం ఎలా హ్యాక్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. బ్యాంక్ ఖాతాల నుంచి సొమ్ము బదిలీ కావాలంటే ముఖ్యమైంది బ్యాంక్ వారు పంపే ‘ఓటీపీ’నే. అయితే ఈ ఓటీపీ మన ఫోన్కు రాకుండానే ఖాతా ఖాళీ అవుతుందంటే మన ఫోన్ హ్యాక్ అయ్యిందా అన్నది ఓ సారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మన ఫోన్ హ్యాక్ అయ్యిందా..? అవలేదా..? అయితే ఎలా మళ్లీ మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి..? వంటి సెక్యూరిటీ అంశాలు మీ కోసం.. ఇలా తెలుసుకోండి.. #*#4636#*#* : ఇది డయల్ చేస్తే మన ఫోన్లోని పూర్తి టెక్నికల్ వివరాలు అంటే సిగ్నల్ స్ట్రెంత్, మొబైల్ సెక్యూరిటీ, కాల్ ఫార్వడింగ్ వివరాలు, బ్యాండ్ విడ్త్, లోకల్ ఏరియా వివరాలు ఇలా మీ ఫోన్లో ఉన్న చిన్నచిన్న వివరాలు అన్ని చూపిస్తుంది. ఈ కోడ్ ద్వారా మన ఫోన్ సిమ్ సెట్టింగ్స్ కూడా మార్చుకోవచ్చు. నోట్: ఈ కోడ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒక్కో ఫోన్లో ఒక్కో మోడల్ను అనుసరించి ఫ్లాష్ మెసేజ్లు కనిపిస్తాయి. తదనుగుణంగా మనం పరిశీలించుకోవాలి. అదేవిధంగా పైకోడ్స్లో ఏవి డయల్ చేసినా ‘ఎనబల్’ అని కనిపిస్తే ఫార్వర్డింగ్లో ఉన్నట్లు లెక్క.. అయితే కాల్ ఫార్వర్డింగ్ వేన్ నాట్ రీచబల్ అని వస్తే సదరు నెంబరును సరి చూసేకుని అది మీకు సంబంధించినది అయితే అలాగే కంటిన్యూ అవ్వవచ్చు. ఇలా తెలుసుకోండి.. ♦ మన ఫోన్ నుంచి మనకు తెలియకుండా ఎవరికైనా కాల్ ఫార్వర్డ్ అవుతుండటం, ఎస్ఎంఎస్లు వెళ్తుండటం వంటి విషయాలను డయల్ ప్యాడ్ నుంచి కొన్ని కోడ్స్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ♦ #21# ఈ కోడ్ ఎంటర్ చేసి డయల్ చేస్తే మీ ఫోన్ కాల్ ఫార్వర్డ్ అవుతుందా? కాల్ డైవర్షన్ వంటివి జరుగుతున్నాయా లేదో తెలుసుకోవచ్చు. డయల్ చేసిన కొన్ని సెకన్లలో స్క్రీన్పై ఫ్లాష్ మెసేజ్ వస్తుంది. అక్కడ కనిపించే డైలాగ్ బాక్స్లో మన సమాచారం తెలుస్తుంది. ఇక్కడ ఫార్వడింగ్ అని వస్తే మీ మొబైల్ హ్యాక్ అయిపోయినట్లే. ♦ #62# ఫార్వడింగ్ అని వస్తే ఈ కోడ్ డయల్ చేయాలి. ఈ కోడ్ని రిపిటెడ్గా మూడుసార్లు చేస్తే మీ కాల్స్ లేదా ఎస్ఎంఎస్లు ఏమైనా ఫార్వడింగ్ ఆగిపోతాయి. ♦ #002# ఈ కోడ్ని డయల్ చేస్తే ఎప్పటికీ మన ఫోన్ నుంచి కాల్స్ ఫార్వర్డ్ అవ్వవు. ముఖ్యంగా సిమ్ అప్పుడప్పుడు వాడే వారు, రోమింగ్లో వేరే ఫోన్ నంబరు వాడే వారికి ఈ కోడ్ ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఏమైనా కాల్ ఫార్వడింగ్ ఉంటే అన్ని ఎరైస్ అయిపోతాయి. -
నెల రోజుల క్రితం పెళ్లి.. కొద్ది రోజులకే
తుర్కపల్లి (ఆలేరు) : వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించిన నవవధువు మృతిచెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి చెందిన బత్తుల అనూష(22)కు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడకు చెందిన జనార్దన్తో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజులకే అదనపు కట్నం తీసుకురావాలని భర్త జనార్దన్, అత్త కృష్ణ కుమారి, మామ భరత్కుమార్, ఆడపడుచు వేదవతిలు అనూషను వేధించారు. దీంతో మనస్తాపానికి గురైన అనూష అత్తగారింట్లోనే ఈ నెల 5న గుర్తు తెలియని ద్రావకం తాగి పుట్టింటికి వచ్చింది. (కాళ్ల పారాణి ఆరకముందే... ) కాసేపటికే అనూష కళ్లు తిరిగి పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రి, అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అనూష ఆరోగ్యం మెరుగు పడడంతో 6వ తేదీన వాసాలమర్రిలోని పుట్టింటికి తీసుకువచ్చారు. అదే రోజు మధ్యాహ్నం అనూషకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. వరకట్న వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి దుబ్బాల బాలమణి ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదగిరి తెలిపారు. (కొత్త జంటకు షాక్: వధువుకు కరోనా) -
లాక్డౌన్లో సెలబ్రిటీలకు డ్రగ్స్ చేరవేశారా?
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో మళ్లీ పెద్దమొత్తంలో నిషేధిత డ్రగ్స్ పట్టుబడడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నగరంలోని పంజగుట్ట, లోతుకుంట ప్రాంతాలకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతోపాటు..వారి వద్ద నుంచి 54 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకోవడంతో నగరంలో మరోసారి డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. నగరంలో సుమారు 22 మంది వీఐపీలకు నిందితులిద్దరూ డ్రగ్స్ సరఫరా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాక్డౌన్ ఎఫెక్ట్తో నగరంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరగడంతోపాటు..నిషేధిత డ్రగ్స్ను సరఫరా చేస్తున్న మాఫియా వీటి ధరలను రెండింతలు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం. కాగా గతేడాది నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టుకావడంతో పలువురు సినిమా సెలబ్రిటీలను ఆబ్కారీశాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేకంగా విచారించిన విషయం విదితమే. అయితే ఈ నెల 2న అరెస్టుచేసిన తరణ్ జ్యోతిసింగ్, అమిత్కుమార్ల వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన కొకైన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ కోవిడ్ మాస్క్లను బెంగళూరులో విక్రయిస్తామంటూ పోలీసుల వద్ద పాస్తీసుకొని అక్కడికి వెళ్లి నైజీరియాకు చెందిన మైక్ అనే వ్యక్తి వద్ద నుంచి 70 గ్రాముల కొకైన్ కొనుగోలు చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తెలిపారు. వారు అక్కడి నుంచి బయలుదేరి మే 30న హైదరాబాద్ నగరానికి చేరుకున్నారని..మార్గమధ్యంలో నిందితులిద్దరూ సుమారు 16 గ్రాముల కొకైన్ సేవించినట్లు పేర్కొన్నారు. వీరికి డ్రగ్స్ విక్రయించిన మైక్ పరారీలో ఉన్నారన్నారు. కాగా నిందితులు ప్రయాణించిన స్కోడా కారు,మొబైల్ఫోన్లను సైతం పోలీసులు సీజ్చేశారు. వీరిలో అమిత్కుమార్ అనే నిందితుడు గత 15 ఏళ్లుగా డ్రగ్స్ వాడుతున్నారని..వివిధ నిషేధిత మాదక ద్రవ్యాల కొనుగోలుచేయడంతోపాటు స్వయంగా వాటిని తీసుకునేవారని తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ఇక మరో నిందితుడు తరణ్ జ్యోత్సింగ్ ఐదేళ్లుగా డ్రగ్స్వాడుతున్నారన్నారు. ఇటీవల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేసిన తరణ్జ్యోతిసింగ్, అమిత్కుమార్ సెలబ్రిటీలకు చేరవేశారా? నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్ సంస్కృతి సభ్యసమాజాన్ని కలచివేస్తోంది. డ్రగ్స్ రాకెట్లో కీలకంగా వ్యవహరిస్తున్న నిందితులు..నగరంలోని యువతరం, సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన సెలబ్రిటీలకు, వీఐపీలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీల్లో తరచూ బయటపడుతోంది. అయితే తాజా డ్రగ్స్ రాకెట్లో ఇద్దరు మినహా ఎవరూ నిందితులు లేరని..సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆధారాలు లేవని ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు పైకి చెబుతున్నా..ఇద్దరు నిందితులు సుమారు 22 మంది వీఐపీలకు సరఫరా చేసినట్టు సమాచారం గుప్పుమంటుండటం గమనార్హం. ఈవిషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక ఆబ్కారీ శాఖ తటపటాయిస్తున్నట్లు సమాచారం. గతేడాది సినీ ప్రముఖుల డ్రగ్స్ రాకెట్గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేసినా..ఈ స్కామ్లో సూత్రధారులు, పాత్రధారులపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. రెండింతల ధరలు... అత్యంత ధరపలికే నిషేధిత మాదకద్రవ్యాలను డ్రగ్స్ మాఫియా లాక్డౌన్ ఎఫెక్ట్తో రెండింతల ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. సుమారు గ్రాముకు ఐదు వేల విలువైన డ్రగ్స్ను సుమారు పది లేదా పదిహేను వేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. తాజాగా పట్టుబడిన డ్రగ్స్ సుమారు రూ.5 లక్షల విలువ కాగా..దీన్ని సొమ్ముచేసుకున్న పక్షంలో నిందితులకు పది నుంచి రూ.15 లక్షలు కొల్లగొట్టేవారిని ఆబ్కారీపోలీసులు చెబుతున్నారు. సెలబ్రిటీలకు, వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేయలేదు ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో పట్టుబడిన నిందితుల కేసును తదుపరి విచారణ నిమిత్తం సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పజెప్పాం. తాజా డ్రగ్స్ కేసులో నిందితులు ఇద్దరు డ్రగ్స్ సేవించారు. సెలబ్రిటీలు, వీఐపీలు ఎవరికీ డ్రగ్స్ సరఫరా చేయలేదని మా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. గతేడాది నమోదైన పాత కేసుకు సంబంధించిన పాత వివరాలతో కొన్నిప్రసార మాధ్యమాలు తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాం. సెలబ్రిటీలకు, వీఐపీలకు చేరవేసినట్లు ఎలాంటిఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నాం. – ఎన్.అంజిరెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్సూపరింటెండెంట్, ఎన్ఫోర్స్మెంట్ -
రాళ్లతో కొట్టి పెట్రోల్పోసి..
బన్సీలాల్పేట్: బన్సీలాల్పేట్కు చెందిన యువకుడు అదృశ్యమై చివరకు రైల్వేట్రాక్పై శవంగా తేలాడు. అతనిని రాళ్లతో కొట్టి పెట్రోల్పోసి నిప్పంటించి అత్యంత దారుణంగా హత్యచేశారు. తెలిసిన వారి పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు.. బన్సీలాల్పేట్ ప్రాంతానికి చెందిన జె. క్రిష్ణ(22) ఈనెల 31న అదృశ్యమయ్యాడు. రైల్వేలో ఔట్ సోర్సింగ్ విభాగంలో ఇతను పనిచేస్తున్నాడు. ఇంటి నుంచి వెళ్లిన క్రిష్ణ తిరిగి రాకపొవడంతో తల్లి నాగమ్మ ఈ నెల 2న గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే ట్రాక్ పక్కన చెట్ల పొదల్లో యువకుడి శవం పడి ఉందనే సమాచారం మేరకు ఈ నెల 3పరాత్రి గాంధీనగర్, మహాంకాళి పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్లు ఎస్. శ్రీనివాస్రావు, కావేటి శ్రీనివాసులు అక్కడికి చేరుకుని సంఘటన స్ధలాన్ని పరిశీలించారు. మిస్టరీని చేదించడానికి ప్రత్యేకంగా పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. పథకం ప్రకారమే హత్య? మృతుడు క్రిష్ణకు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం ఏరుకొని గంజాయి సేవించే జులాయిలు పలువురితో పరిచయం ఉంది. ఈ బృందమే పథకం ప్రకారం మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. క్రిష్ణ స్నేహితుడు శ్రావణ్ను నిందితుల్లో కొందరు కలిసి కొట్టి బెదిరించారు. ఈ విషయాన్ని శ్రావణ్ వచ్చి క్రిష్ణతో చెప్పాడు. దాంతో క్రిష్ణ నిందితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరించి ...మీ పని చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో క్రిష్ణపై కక్ష పెంచుకున్న ఐదుగురు పథకం ప్రకారం ఈ నెల 31న క్రిష్ణను రైల్వే ట్రాక్ వద్దకు పిలిపించుకున్నారు. మద్యం మత్తులో అందరి మధ్య వాగ్వివాదం...ఘర్షణ జరిగినట్లు తెలిసింది. క్రిష్ణను రాళ్లతో కొట్టి అంతమొందించి వెంట తెచ్చుకున్న పెట్రోల్ అతనిపై పొసి నిప్పంటించి పరారైనట్లు తెలుస్తోంది. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఈ హత్య తెలిసిన వారి పే అయి ఉంటుందని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు విలేకరులతో పేర్కొన్నారు. వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. -
ప్రేమ.. పెళ్లి.. వేధింపులు!
మల్కాజిగిరి: ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.. డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఆ ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ హరీష్ తెలిపిన వివరాల ప్రకారం.. వినాయకనగర్కు చెందిన సమీనాభాను (20), నేరేడ్మెట్కు చెందిన సాయిచరణ్ ప్రేమించుకున్నారు. గత ఏడాది నవంబర్లో వివాహం చేసుకున్నారు. మూడు నెలలుగా వీరు వసంతపురి కాలనీలో నివాసముంటున్నారు. సమీనాభాను మూడు నెలల గర్భిణి. ఉద్యోగం లేకుండా ఇంటి పట్టునే ఉంటున్న సాయిచరణ్ కొన్ని రోజులుగా డబ్బుల కోసం ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. (అమ్మా.. ఇక్కడ ఉండలేకపోతున్నా! ) మంగళవారం వీరి ఇంటి పక్కన ఉండే వారు సమీనాభాను సోదరి మెహ్రాభానుకు ఫోన్ చేసి ఆమె సూసైడ్ చేసుకుందని సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకున్న సమీనాభానును కిందికి దించి సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన వైద్యుడిని పిలిపించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యుడు చెప్పారు. సాయిచరణ్ వేధింపుల కారణంగా సమీనాభాను మృతికి కారణమని ఆమె సోదరి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.(మధుర ఫలం.. చైనా విషం!) (పెళ్లి ఒకరితో.. ప్రేమ మరొకరితో) -
అమ్మా.. ఇక్కడ ఉండలేకపోతున్నా!
నిజాంపేట్: ‘తమ్ముడు, చెల్లెలు చదువుల కోసం నగరంలోని ఓ ఇంట్లో పనికి కుదిరిన యువతి మృతి చెందడం కలకలం సృష్టించింది. ఇంటి యజమాని వేధింపుల తాళలేకనే తన కూతురు చనిపోయిందని మృతురాలి తల్లి.. అలాంటిదేమీ లేదు.. ఇతర కారణాలతోనే మరణించిందని యజమాని పరస్పర విరుద్ధ ప్రకటనల మధ్య పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ప్రగతినగర్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ప్రసాద్ అనే ఫర్నిచర్ వ్యాపారి ఇంట్లో తూర్పుగోదావరి జిల్లా పోతులూరుకు చెందిన అపర్ణ (16) నాలుగేళ్లుగా పని చేస్తోంది. అపర్ణ పంపించే డబ్బుతోనే ఆమె తల్లి అర్జమ్మ కొడుకు, కూతురునూ చదివిస్తోంది. మూడు రోజల క్రితం వాచ్మన్ ఫోన్ ద్వారా అపర్ణ తన తల్లితో మాట్లాడింది. తానిక్కడ ఉండలేకపోతున్నానని వచ్చి తీసుకువెళ్లాలని కోరింది. లాక్డౌన్ కావటంతో తల్లి రావటం కుదర్లేదు. ఇదే క్రమంలో ఈ నెల 1న ఉదయం తొమ్మిది గంటల సమయంలో ప్రసాద్ ఇంట్లోనే అపస్మారక స్థితిలో పడి ఉన్న అపర్ణను తొలుత స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి కూకట్పల్లికి, అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించి అపర్ణ మరణించింది. మంగళవారం నగరానికి చేరుకున్న ఆమె తల్లి.. కూతురు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించింది. బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్మార్టం అనంతరం అపర్ణ మృతదేహాన్ని పోతులూరుకు తరలించారు. ఆ రెండో వ్యక్తి ఎవరు? అపర్ణ 2016 నుంచి ప్రసాద్ ఇంట్లో పని చేస్తున్నట్లు తల్లి ఫిర్యాదు చేశారు. అపర్ణ తన చివరి కాల్ను తల్లితో పాటు మరో వ్యక్తికి కూడా చేశారు. రెండో వ్యక్తి ఎవరూ అనేది విచారణలో తేలాల్సి ఉంది. ప్రసాద్ ఇంట్లో లభించిన మూత తీసిన పురుగుల మందు డబ్బా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మరణించిన సమయంలో నోట్లోంచి నురగ వచ్చిందని, పురుగుల మందే తాగి ఉంటుందని భావిస్తున్నారు. యజమాని వేధింపుల వల్లే కూతురు మృతి చెందినట్లు తల్లి చేసిన ఫిర్యాదు మేరకు ప్రసాద్ఫై కేసు నమోదు చేస్తినట్లు బాచుపల్లి సీఐ జగదీశ్వర్ తెలిపారు. పోస్ట్మార్టం రిపోర్ట్ ఆధారంగా ముందుకు వెళతామని ఆయన చెప్పారు. -
ఈమె.. ఆమేనా..?
సాక్షి, హైదరాబాద్: మ్యాట్రిమోని వెబ్సైట్లో పరిచయమైన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్ళిచేసుకుంటానని నమ్మించిన ఓ యువతి అతని నుంచి కోటి రూపాయలకు పైగా వసూలు చేసి బురిడీ కొట్టించింది. దీంతో బాధితుడు కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన మేరకు.. అనుపల్లవి మాగంటి పేరుతో వరుడు కావాలంటూ ఓ యువతి తెలుగు మ్యాట్రిమోని వెబ్సైట్లో పేరు నమోదు చేసుకుంది. అమెరికాలోని మేరీల్యాండ్ బల్టీమోర్ ప్రాంతంలో జన్మించినట్లుగా వివరాలను పొందుపర్చింది. తాను డాక్టర్ అని, తన తల్లిదండ్రులు కూడా డాక్టర్లేనని, తన నివాసం జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–71లో ఉందని పేర్కొంది. ఆ వివరాలను చూసిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమెతో పలుమార్లు చాటింగ్ చేశాడు.(ఫేక్ ప్రొఫైల్తో ఎన్నారైకి వల) ఈ సందర్భంగా ఆమె.. తన తండ్రి చనిపోయారని, ఆస్తులను తన పేరిట రాశారని చెప్పుకొచ్చింది. తన పెళ్లి విషయంలో వివాదం నెలకొందని, డబ్బున్న బిజినెస్మేన్ కొడుకును వివాహం చేసుకోవాలని ఒత్తిళ్లు ఉన్నాయని నమ్మబలికింది. తనకు మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్లి చేసుకోవాలని ఉందని పేర్కొంది. అయితే తన పేరిట ఉన్న ఆస్తులను న్యాయపరంగా దక్కించుకునేందుకు కొంత డబ్బు అవసరముందని, ఇందుకు సహాయం చేయాలని కోరింది. మాయ మాటలు నమ్మిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పలుమార్లు కోటి రెండు లక్షలా 18 వేల 33 రూపాయలను ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా యువతి సూచించిన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. అనంతరం ఆమె మొహం చాటేయడంతో తాను ఆన్లైన్లో చాటింగ్ చేసిన యువతి మాళవిక దేవతిగా గుర్తించడంతో పాటు తాను మోసపోయినట్లుగా భావించి కేపీహెచ్బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. () ఈమె.. ఆమేనా.. మాళవిక దేవతి పేరుతో గతంలోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను బురిడీ కొట్టించిన కేసు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైంది. ఓ ఎన్ఆర్ఐతో రూ.65 లక్షలు వసూలు చేసి మోసం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు కేసుల్లోనూ నిందితురాలు ఒక్కరేనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
కత్తితో పొడిచి భార్యను చంపిన ప్రభుత్వ ఉద్యోగి
అమీర్పేట: జీతం మొత్తం మద్యం కోసమే ఖర్చు చేస్తున్నావు.. మద్యం తాగడం మానేయి అని అన్నందుకు భార్యను అత్యంత దారుణంగా హతమార్చాడో వ్యక్తి. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ స్టేట్ టీబీ కేంద్రం ఆవరణలో ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన మేరకు.. మెదక్జిల్లా నారాయణ్ ఖేడ్కు చెందిన సంజీవ్తో ఆర్సీపురానికి చెందిన రాణి (42)కి 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంజీవ్ స్టేట్ టీబీ ట్రైనింగ్ సెంటర్లో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. క్వార్టర్ నెం.1లో వీరు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురికి వివాహమైంది. సంజీవ్కు ప్రతి నెలా సుమారు రూ.70 వేల వరకు వేతనం వస్తోంది. మద్యానికి అలవాడు పడ్డ ఆయన వచ్చిన వేతనంలో ఎక్కువ భాగం మద్యం కోసం ఖర్చు పెట్టేవాడు. స్నేహితులతో కలిసి విందులు, వినోదాలు చేసుకునేవాడు.ఈ విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కళాశాలలకు సెలవులు ఉండటంతో ఇద్దరు పిల్లలు ఆర్సీపురంలోని అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. రాత్రి ఎప్పటి లాగే మద్యంతాగి వచ్చిన భర్తతో గొడవ పడింది. దీంతో సంజీవ్ భార్యను తీవ్రంగా కొట్టాడు. కొడుకు, కూతురుకు ఫోన్ చేసి మీ నాన్న తనను కొడుతున్నాడని చెప్పింది. ఆ తరువాత సంజీవ్.. భార్యను కత్తితో ఛాతిపై పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ విషయాన్ని సోమవారం ఉదయం పిల్లలలకు ఫోన్ చేసి చెప్పాడు. వారు ఎర్రగడ్డకు రాగా తండ్రి అక్కడికి వెళ్లి వారిని తీసుకుని ఇంటికి వచ్చాడు. లోపలకు వెళ్లి చూడగా తల్లి రక్తపు మడుగులో కనిపించింది. వారు అమ్మమ్మకు ఫోన్ చేయడంతో సంజీవ్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరళించారు. -
హత్య.. ఆత్మహత్య..మధ్యలో మద్యం
మద్యం.. వారి విచక్షణను కోల్పోయేలా చేసింది.. మత్తులో ఉన్న వారు తామేం చేస్తున్నామో తెలుసుకోలేని స్థితికి వెళ్లిపోయారు.. ముందు..వెనుకా ఆలోచించలేదు.. కుటుంబం గురించి పట్టించుకోలేదు.. ఆవేశం కట్టలు తెంచుకుంది.. వారి చర్యలతో ప్రాణం గాలిలో కలిసిపోయింది. మద్యం మత్తులో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే.. మరొకరు హత్యచేశారు. నగరంలోని వేర్వేరు చోట్ల ఈ రెండు సంఘటనలు జరిగాయి. జగద్గిరిగుట్ట: పాత కక్షల నేపథ్యంలో హఫీజ్ (21) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. జగద్గిరిగుట్ట సీఐ గంగరెడ్డి తెలిపిన మేరకు.. గాజులరామారం డివిజన్ శ్రీరాంనగర్కు చెందిన అక్బర్(31) అటో డ్రైవర్. రంజాన్ పండగ అనంతరం విందు చేసుకోవాలని అదే ప్రాంతానికి చెందిన జావీద్(19) అన్నులు కలిసి మద్యం తాగుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన హఫీజ్ కారు మెకానిక్ వీరి వద్దకు వచ్చి నా సోదరుడు జావీద్తో ఎందుకు మద్యం తాగుతున్నావని అక్బర్తో గొడవకు దిగాడు. అనంతరం నలుగురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం అక్బర్ మరోసారి మద్యం కొనుగోలు చేసి తాగేందుకు వెళ్తున్నాడు. ఇది గమనించిన హఫీజ్ అక్బర్తో మరోమారు గొడవ పడటం ప్రారంభించాడు. గతంలో అక్బర్ను చంపుతానంటూ హఫీజ్ బెదిరించాడు. దీంతో తనను అంతమొందించెందుకే గొడవ పడుతున్నాడని భావించిన అక్బర్ హఫీజ్ను కిందపడేసి పక్కనే ఉన్న సిమెంటో ఇటుకతో తలపై మోదాడు. దీంతో తలకు తీవ్ర గాయమైన హాఫీజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతంరం అక్బర్ జగద్గిరిగుట్ట ఠాణాలో లొంగిపోయాడు. వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.(ఉద్యోగం పేరుతో వ్యభిచార రొంపిలోకి.. ) బ్లేడుతో చేయికోసుకొని ప్రాణం వదిలాడు దూద్బౌలి: మద్యం మత్తులో భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం హుస్సేనీఆలం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రమేశ్ కొత్వాల్ తెలిపిన మేరకు.. కాకినాడకు చెందిన సలీం (38) నగరంలోని ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నాడు.కొద్ది రోజులుగా భార్య కాకినాడ నుంచి ఫోన్ చేసి డబ్బు కోసం అడుగుతూ ఉండేది. లాక్డౌన్ నేపథ్యంలో సలీం వద్ద డబ్బులు లేకపోవడంతో భార్యతో తరచుగా గొడవ పడుతుండేవాడు. మద్యానికి బానిసైన సలీం.. ఇక డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్లో భార్యకు బెదిరించేవాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో విపరీతంగా మద్యం తాగిన సలీం ఫోన్లో భార్యతో గొడవ పడి అక్కడే ఉన్న బ్లేడ్తో ఎడమచేయిపై తీవ్రంగా గాయాలు చేసుకున్నాడు. రక్తస్రావం జరగడంతో అపస్మారకస్థితిలో చేరుకున్నాడు. బుధవారం ఉదయం 11 గంటల వరకు సలీం తలుపులు తెరవకపోవడంతో స్థానికులు తలుపులు తెరిచి చూడగా మృతి చెంది ఉన్నాడు. చార్మినార్ ఏసీపీ అంజయ్య, హుస్సేనీఆలం ఇన్స్పెక్టర్ రమేశ్ కొత్వాల్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు కాకినాడలో ఉండే భార్యకు సమాచారం అందించారు. -
ప్రియురాలి వైద్యం కోసం దోపిడీ డ్రామా
నాగోలు: ఓ కంపెనీలో కలెక్షన్ బాయ్గా పనిచేస్తున్న ఓ యువకుడు ప్రియురాలి చికిత్స కోసం కంపెనీ సొమ్మునే కాజేశాడు. రూ.8.50 లక్షలు దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. అయితే వ్యూహం బెడిసికొట్టి పోలీసులకు దొరికిపోయాడు. ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీసీపీ సన్ప్రీత్సింగ్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. సూర్యపేట జిల్లా కోదాడ, కపుగల్లుకు చెందిన తిరుపతిరెడ్డికి స్థానికంగా పేపర్ మిల్స్ కంపెనీ ఉంది. ఆయన నగరంలోని పలు పరిశ్రమలకు ముడి సరుకు, విస్తర్లు సరఫరా చేస్తుంటాడు. తిరుపతి రెడ్డి దూరపు బంధువు, అల్లుడి వరుసయ్యే మారం అచ్చిరెడ్డి(28) ఎంబీఏ పూర్తి చేయడంతో తన కంపెనీలో అకౌంటెంట్, కలెక్షన్ బాయ్గా ఉద్యోగంలో పెట్టుకున్నాడు. కస్టమర్లనుంచి పెద్ద ఎత్తున నగదు వసూలవుతుండటంతో దొంగతనం చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అచ్చిరెడ్డి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతోచికిత్స కోసం డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ నెల 25న ఐడీపీఎల్ బాలానగర్, అంబర్పేట్లో రూ. 8.50 లక్షలు వసూలు చేసుకుని ఓ బ్యాగులో పెట్టుకున్నాడు. అనంతరం గుర్రంగూడలో రాజారెడ్డి వద్ద మరో రూ. 26, 500 వసూలు చేసుకుని జేబులో పెటుకున్నాడు. ఆ డబ్బును కాజేయాలని నగదును ప్లాస్టిక్ కవర్లో పెట్టి గుర్రంగూడలోని ఓ ప్రదేశంలో దాటి పెట్టాడు. తరువాత పథకం ప్రకారం ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి దారి దోపీడీ చేసి నగదు ఎత్తుకుపోయారని యజమాని తిరుపతిరెడ్డి సమాచారం అందించాడు. దీంతో యజమాని మీర్పేట పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో పోలీసులు గుర్రంగూడ–నాదర్గుల్ రోడ్డులోని సీసీ కెమెరాలన్నింటినీ పరిశీలించారు. అచ్చిరెడ్డి చెప్పినట్లు ముగ్గురు వ్యక్తులు వెళ్లిన వాహనం ఎక్కడా కనిపించలేదు. అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా అచ్చిరెడ్డి అసలు విషయం బయట పెట్టాడు. నగదు మొత్తాన్ని కాజేయాలనే తానే ఈ డ్రామా అడినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు రూ. 8.50. 950 లక్షలు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్ చేశారు. సమావేశంలో రాచకొండ క్రైమ్ డీసీపీ యాదగిరి, క్రైమ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, వనస్థాలిపురం ఏసీపీ జయరామ్, సీసీఎస్ సీఐలు పార్థసారధి, నవీన్రెడ్డి, అశెక్కుమార్, మధుకుమార్, మీర్పేట సీఐ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆ భయమే ఆయువు తీసిందా?
రాంగోపాల్పేట్: ఓ మహిళను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో పోలీస్ కేసు అవుతుందేమోననే భయంతో ఓ యువకుడు హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళ్హాట్కు చెందిన విశాంబర్ బిర్దార్ చిన్న కుమారుడు బి.మహేష్ (26) 7 నెలలుగా సికింద్రాబాద్లోని ఓ జ్యువెలరీ షోరూమ్లో సేల్స్మన్గా పని చేస్తున్నాడు. ఈ నెల 23న సాయంత్రం విధులు ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్నాడు. బైబిల్ హౌస్ సిగ్నల్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వైపు వెళుతుండగా బోట్స్ క్లబ్ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న ఓ మహిళను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మహేష్ను గాంధీనగర్ పోలీస్ స్టేషన్కు పిలిపించిన పోలీసులు వివరాలు తీసుకుని మరుసటి రోజు తిరిగి రావాలని పంపించారు. ప్రమాదం జరిగిన సమయంలో మహేష్ మొబైల్ ఫోన్ అక్కడే పడిపోవడంతో అదే రోజు రాత్రి కిశోర్ అనే వ్యక్తి మహేష్ స్నేహితుడైన గంగా సాగర్కు ఫోన్ చేసి అక్కడ జరిగిన ప్రమాదం గురించి చెప్పాడు. మహేష్ కూడా గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్నాడు. విషయం తెలుసుకున్న మహేష్ తండ్రి మహేష్ కోసం ఉస్మానియా ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రికి వెళ్లి వాకబు చేసినా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన అదే రోజు గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. అయితే మంగళవారం ఉదయం నెక్లెస్రోడ్లోని సంజీవయ్య పార్కు సమీపంలోని హుస్సేన్ సాగర్లో మహేష్ శవమై తేలాడు. అతడి దగ్గర లభించిన ఆధారాలతో మహేష్గా పోలీసులు గుర్తించారు. తాను చేసిన ప్రమాదంతో ఏమైనా జరుగుతుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేధింపులే ఉసురు తీశాయి బన్సీలాల్పేట్: హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన మహేష్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మంగళవారం రాత్రి మృతుడి కుటుంబికులు, స్నేహితులు గాంధీనగర్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మృతుడి సోదరుడు విక్రమ్, స్నేహితులు విలేకరులతో మాట్లాడారు. మహేష్ మరణానికి పోలీసుల వేధింపులు కారణమని ఆరోపించారు. ప్రమాదం జరిగిన సమయంలో తమ సోదరుడి సెల్ను ఎవరో బలవంతంగా లాక్కుని తాను కానిస్టేబుల్ను అంటూ మాట్లాడిన తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. మహేష్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. మహేష్ మరణంపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. మాకెలాంటి సంబంధమూ లేదు.. హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న మహేష్ మరణంతో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని గాంధీనగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు స్పష్టంచేశారు. ఈ నెల 23న సాయంత్రం ఆర్పీ రోడ్డు నుంచి ట్యాంక్బండ్ వైపు వెళ్లే రహదారిలో మహేష్ తన ద్విచక్ర వాహనంపై వెళుతూ హైదర్బస్తీ ప్రాంతానికి చెందిన సుభాషిణి అనే మహిళను ఢీకొట్టాడని చెప్పారు. డయల్ 100 నుంచి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారని పేర్కొన్నారు. వాహనం ఢీకొన్న మహిళ అపస్మారక స్థితికి చేరుకోడంతో ఉస్మానియా ఆస్పత్రికి చికిత్ప కోసం తరలించి మహేష్ను పోలీసు స్టేషన్కు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. విచారణ అనంతరం మహేష్ను ఇంటికి పంపించినట్లు చెప్పారు. లాక్డౌన్ కర్ఫ్యూ నేపథ్యంలో తమ కానిస్టేబుల్ వాహనంపై ఇంటికి పంపిస్తామని చెప్పినా మహేష్ వినిపించుకోకుండా కాలినడకన వెళ్లిపోయాడని వివరించారు. మహేష్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకోడానికి తమకు ఎలాంటి సంబంధమూ లేదని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే చట్టపరంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ విషయాన్ని మహేష్ తండ్రి విశ్వంభరం, చిన్నాన్న రాజేందర్ కుటుంబ సభ్యులకు కూడా వివరించినట్లు చెప్పారు. ట్యాంక్బండ్పై జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలో మహేష్ ఈ నెల 23 రా>త్రి సుమారు 8 గంటల సమయంలో హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కనుగొన్నామని సీఐ శ్రీనివాస్రావు పేర్కొన్నారు.