విజయవాడ: సప్త నదుల్లో గోదావరి అత్యంత మోక్షదాయకమైనదని కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. గోదావరి పుష్కరయాత్రలో భాగంగా బుధవారం ఆయన విజయవాడలోని లబ్బీపేటలో శారదాచంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానానికి వచ్చారు. ఈ సందర్భంగా 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడారు. గోదావరి గురించి వివరిస్తూ...రుగ్వేదంలో దాని గొప్పతనం కనిపిస్తుందన్నారు. పంచభూతాల్లో జలం ప్రధానమైనదని, దానికి సంబంధించి ఏ కార్యక్రమమైనా భక్తిశ్రద్ధలతో చేయాలని హితవు పలికారు. గంగానది పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేసినట్లే గోదావరి పరిరక్షణకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.