యువకుడిని హత్యచేసి పెట్రోల్పోసి నిప్పంటించారు | Murder in Vanastalipuram | Sakshi
Sakshi News home page

యువకుడిని హత్యచేసి పెట్రోల్పోసి నిప్పంటించారు

Published Thu, Nov 21 2013 9:12 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

Murder in Vanastalipuram

హైదరాబాద్: వనస్థలిపురం గణేష్ నగర్లో  గుర్తు తెలియని వ్యక్తులు ఒక యువకుడిని హత్య చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు.  సగానికిపై కాలిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువకుడు ఎవరనేది ఇంకా గుర్తించలేదు. హంతకులు ఎవరనేది కూడా తెలియదు.

ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.  ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఈ యువకుడిని ఎవరైనా హత్య చేయించి ఉంటారేమోనన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలు స్థానికులు ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement