మైలవరానికి 2 టీఎంసీల నీరు | mylavaram dam 2 TMC water | Sakshi
Sakshi News home page

మైలవరానికి 2 టీఎంసీల నీరు

Published Sun, Jan 5 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM

mylavaram dam  2 TMC water

కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని మైలవరం డ్యామ్‌కు అవుకు రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించింది. ఈ మేరకు  ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి. అరవిందరెడ్డి మెమో నెంబర్ 25789/డబ్ల్యుఆర్‌జి/2013 ద్వారా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
 
 మైలవరం జలాశయానికి నీటిని విడుదల చేయాలని త ద్వారా జమ్మలమడుగు నియోజకవర్గంలోని  ప్రజలకు తాగునీరు, ఆర్‌టిపిపి నీటి అవసరాలు తీర్చాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నవంబర్ 21న విన్నవించారు. ఆ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.  ప్రభుత్వం 2 టీఎంసీలు నీటి విడుదలకు ఆమోదం తెలిపింది.   ఇదే విషయమై ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో పాటు, రాష్ట్ర యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement