కన్నుల పండువగా పద్మావతి పరిణయోత్సవం | padmavathi parinayotsavam in thirumala | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా పద్మావతి పరిణయోత్సవం

Published Tue, Apr 28 2015 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM

padmavathi parinayotsavam in thirumala

తిరుమల: వైకుంఠపురంగా పిలివబడే గోవిందుని తిరుమలలో సోమవారం పద్మావతి పరిణయోత్సవం కన్నులపండువగా జరిగింది. వివిధ రకాల ఫలాలు, అబ్బురపరిచే అందాలతో కూడిన పుష్పాలు సోయగాలతో పరిణయోత్సవ వేదికను తీర్చిదిద్దారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు శ్రీవారి ఉత్సవర్లను మండపంలో కొలవుదీర్చి వైభవంగా ఉత్సవాన్ని నిర్వహించారు.


టీటీడీ ఉద్యానవనంలో ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పద్మావతి పరిణయోత్సవ వేదికను శోభాయమానంగా తీరిదిద్దటం ఆనవాయితీ. గతంలో పసుపు-కుంకుమ మండపం, గాజుల మండపం, రంగురాళ్లు మండపం వంటి వివిధ నమూనలతో అలంకరించారు. అలాగే ఈ ఏడాది కూడా చెరుకు గడలు, మామిడి కాయలు- ఆకులు, కొబ్బరికాయలు, ఆపిల్, పైన్ ఆపిల్, దానిమ్మ, బత్తాయి పండ్లు, మొక్కజొన్న కుంకులు, రోజా, లిల్లీ, చామంతితో పాటు జాతుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కార్యక్రమంలో చివరిలో బాణసంచా వెలుగులు భక్తులను ఆకట్టుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement