Thirumala
-
క్లాస్ డైరెక్టర్ తో జోడి కడుతున్న మాస్ మహారాజ్
-
శ్రీవారి వాకిలి.. బంగారు లోగిలి
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి అంతరాలయం స్వర్ణ శోభితమైంది. స్వామివారి భక్తులకు కనువిందు చేస్తోంది. స్వర్ణ కాంతులతో ధగధగలాడుతున్న వాకిలి నుంచి చిన వెంకన్నను దర్శించుకుంటున్న భక్తులు మంత్ర ముగ్ధులవుతున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీవారి దివ్య క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తున్నారు. శని, ఆదివారాలు, భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్షేత్రంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దాతల సహకారంతో దేవస్థానం ఇప్పటికే స్వామివారి వాకిలిని దాదాపుగా స్వర్ణ మయం చేశారు.అందులో భాగంగా జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ 2021 లో రూ.98,31,693 వ్యయంతో, 264 గ్రాముల 647 మిల్లీ గ్రాముల బంగారం, 147 కేజీల 641 గ్రాముల 700 మిల్లీ గ్రాముల రాగి రేకులతో ఆలయ ప్రధాన ముఖద్వారానికి, తలుపులకు, అంతరాలయ ద్వారానికి బంగారు తాపడం (ఎలక్ట్రో గోల్డ్ ప్లేటింగ్) చేయించారు. వీటిని అదే సంవత్సరం జనవరి 10న అప్పటి రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు.కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం, బొమ్ములూరుకు చెందిన దీపక్ నెక్స్జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం, డైరెక్టర్లు రూ.1,64,19,411తో స్వామి అంతరాలయానికి బంగారు తాపడాన్ని చేయించారు. దీన్ని ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ఈ ఏడాది అక్టోబర్ 4న ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, దాతలు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. త్వరలో స్తంభాలకు బంగారు పూత అంతరాలయం ముందు పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు ఎదురుగా ఉన్న స్తంభాలకు ఇదే తరహాలో గోల్డ్ కోటెడ్ చేయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. త్వరలో ఒక దాత సహాయంతో పనులు ప్రారంభించనున్నారని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉంటే విమాన గోపుర స్వర్ణమయ పథకం ద్వారా భక్తుల నుంచి దేవస్థానం విరాళాలను సేకరిస్తోంది. విమాన గోపురాన్ని సైతం స్వర్ణమయం చేస్తే చినవెంకన్న ఆలయాన్ని చూడడానికి రెండు కనులు చాలవనే చెప్పొచ్చు. -
June 27: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు 77,332 మంది స్వామివారిని దర్శించుకోగా, 30,540 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.38 కోట్లు సమర్పించారు.అలాగే, టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు, టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం. ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది . ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తోంది. -
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: బంగారు తిరుచ్చి ఉత్సవం (ఫొటోలు)
-
తిరుమలలో ప్రభాస్
-
టీటీడీ ఆదాయం అదుర్స్
-
టీటీడీ ఈవో ధర్మరెడ్డి సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్న భక్తులు
-
తిరుమలలో ఎలాంటి ఉగ్రవాద కదలికలు లేవు
-
తిరుమలలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం
-
తిరుమల శ్రీవారి సేవలో క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్
-
BGT 2023: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav Tirumala Visit Ahead Ind Vs Aus 3rd Test: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కుటుంబ సమేతంగా తిరుపతికి విచ్చేసిన సూర్య.. మంగళవారం స్వామి వారి దర్శనం చేసుకున్నాడు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నాడు. శ్రీవారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సూర్యను సత్కరించారు. అనంతరం సూర్యకుమార్ యాదవ్కు తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 నేపథ్యంలో టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్.. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్తో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు. తొలి టెస్టులో విఫలం అయితే, నాగ్పూర్ మ్యాచ్లో విఫలం(8 పరుగులు మాత్రమే) కావడంతో.. రెండో టెస్టులో సూర్యను పక్కనపెట్టారు. ఇదిలా ఉంటే.. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ విజృంభణతో ఢిల్లీలో జరిగిన రెండో టెస్టును కూడా రెండున్నర రోజుల్లోనే ముగించింది టీమిండియా. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. దీంతో చాలా మంది టీమిండియా ప్లేయర్లు స్వస్థలాలకు వెళ్లగా సూర్య కుటుంబంతో కలిసి ఇలా దైవ దర్శనం చేసుకోవడం విశేషం. టెస్టుల్లో అరంగేట్రం సందర్భంగా కుటుంబ సభ్యులతో సూర్య చదవండి: BGT 2023: రెండున్నర రోజుల్లోనే టెస్టు ముగిస్తే ఇంతే! అయినా.. గాయం సంగతి ఏమైంది? Ind Vs Aus: ఆసీస్తో మ్యాచ్ అంటే ఆ మజానే వేరు.. రోహిత్ సేన మాదిరి మీరు కూడా! Joe Root: 'రూట్' దారి తప్పింది.. 'నా రోల్ ఏంటో తెలుసుకోవాలి' -
టీటీడీపై ఎల్లో మీడియా అసత్య ప్రచారం
-
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
విశిష్ట దర్శనానికి వేళాయే..
-
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్బంగా సర్వం సిద్ధం
-
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్
-
దేశంలోనే ఏపీ ప్రభుత్వం అగ్రగామిగా ఉంది : సజ్జల
-
దర్గాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేక పూజలు
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇవాళ ఏపీలో పర్యటించారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆలయంలో జరిగిన సుప్రభాత సేవలో పెద్ద కుమార్తె ఐశ్వర్యతో కలిసి వచ్చారు. అనంతరం తలైవా అమీన్ పీర్ దర్గాలో కూడా ప్రార్థనలు చేశారు. ఆయనతో పాటు ఆస్కార్ అవార్డు పొందిన సంగీత స్వరకర్త ఏఆర్ రెహమాన్ కూడా దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రజనీకాంత్ ప్రత్యేక తలపాగాతో తెల్లటి కుర్తా ధరించి కనిపించారు. రజనీకాంత్ ఈ ఏడాది డిసెంబర్ 12న తన 72వ పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ అతిథి పాత్రలో లాల్ సలామ్ అనే ప్రాజెక్ట్లో కూతురితో కలిసి నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి విషు విశాల్, విక్రాంత్లు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ తన కూతురుతో కలిసి నటించడం ఇదే తొలిసారి. మరోవైపు నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో జైలర్తో రజనీకాంత్ ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్కుమార్, వసంత్ రవి, యోగి బాబు, రమ్య కృష్ణన్, వినాయకన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
వైకుంఠ ఏకాదశి సందర్బంగా టీటీడీ భారీ ఏర్పాట్లు
-
టీటీడీ కీలక నిర్ణయాలు.. బ్రేక్ దర్శన సమయంలో మార్పు
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
-
30 ఏళ్లపాటు సీఎం జగన్ పాలన కొనసాగాలని " తిరుమల TO శ్రీశైలం పాదయాత్ర "
-
వైరల్ వీడియో: తిరుమల కొండ ఎక్కుతున్న చిన్న కుక్క పిల్ల
-
తిరుమలలో అద్భుత దృశ్యాలు..
-
భక్తులకు దర్శనమిచ్చిన ఉగ్ర శ్రీనివాసుడు
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి నమిత
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
-
హైదరాబాద్ : ఈనెల 11 నుంచి 15 వ తేదీ వరకు శ్రీవారి వైభవోత్సవాలు
-
తిరుమల లో పెరిగిన భక్తుల రద్దీ
-
తిరుమలలో భక్తుల రద్దీ
-
తిరుమలలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు
-
వైరల్ వీడియో : భార్యను ఎత్తుకొని తిరుమల కొండెక్కిన భర్త
-
ఫ్యాక్ట్ చెక్ : ఏ రంగు కనిపించినా YSRCP రంగేనంటూ ఎల్లో బ్యాచ్ విష ప్రచారాలు
-
ఆనంద నిలయం అంటే... ఆ దేవదేవుడి నిలయం
-
తిరుమల శ్రీవారుని దర్శించుకున్న సీజేఐ లలిత్
-
స్వర్ణరథం పై భక్తులకు దర్శనమిస్తున్న స్వామి వారు
-
భక్తుల సర్వదర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేశాం : టీటీడీ చైర్మన్
-
తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
విశ్వకర్మ నిర్మించిన ఆలయం ఇప్పటికీ తిరుమలలో ఉందా ...?
-
తిరుమలలో గరుడ సేవకు విస్తృత ఏర్పాట్లు
-
2023 టీటీడీ క్యాలెండర్ ,డైరీ ఆవిష్కరించిన సీఎం జగన్
-
బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం
-
అలిపిరిలో ఎలక్ట్రిక్ బస్సు లను ప్రారంభించిన సీఎం జగన్
-
గంగమ్మ ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు
-
తిరుమలలో ధ్వజారోహణ కార్యక్రమం
-
రేణిగుంట నుంచి గంగమ్మ ఆలయానికి సీఎం వైఎస్ జగన్
-
తిరుమలలో జోరుగా ఉద్యానవనాల పెంపకం
-
ఘనంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
తిరుమలలో అద్భుతంగా అన్నప్రసాద వితరణ
-
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
-
తిరుమలలో సినీనటి అర్చనా గౌతమ్ వీరంగం
-
నయన్, విఘ్నేశ్ల పెళ్లి డేట్ ఫిక్స్..తిరుమలలో వివాహం!
కోలీవుడ్ లవ్బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్లు త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తమ ప్రేమ ప్రయాణానికి ముగింపు పలికి.. పెళ్లి బంధం కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.ఇప్పటికే పెళ్లి డేట్, ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. జూన్ 9న, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో నయన్, విఘ్నేశ్ల వివాహం జరగబోతున్నుట్ల తెలుస్తుంది. ఇందులో భాగంగానే పెళ్లి వేదికను బుక్ చేసుకునేందుకే నయన్, విఘ్నేశ్లు శనివారం తిరుమల వచ్చినట్లు సమాచారం. అయితే తమ పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై నయన్ కానీ, విఘ్నేశ్ కానీ ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 'నేనూ రౌడీనే' సినిమా షూటింగ్ సమయంలో నయన్కు విఘ్నేశ్తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరు కలిసి దిగిన పలు ఫొటోలను విఘ్నేశ్.. అప్పుడప్పుడు ఇన్స్టాలో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా విఘ్నేశ్ దర్శకత్వం వహించిన 'కాతు వాకుల రెండు కాదల్' చిత్రంలో నయనతార నటించిన విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. -
TTD: ఈనెల 7 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
-
తిరుమలలో చిరుత సంచారం
తిరుమల: తిరుమలలోని శ్రీకృష్ణ అతిథిగృహం వద్ద చిరుత సంచరించిన ఘటన శనివారం వెలుగుచూసింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో అతిథిగృహం సమీపంలోకి ఓ వరాహం వచ్చింది. అదే సమయంలో వరాహాన్ని వెంబడిస్తూ చిరుత చేరుకుంది. కొంతసేపు వరాహం కోసం వేచి ఉన్న చిరుత అనంతరం అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అతిథి గృహంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పటివరకు కుక్కల కోసం తిరుమలలోని నివాసప్రాంతాలు, అతిథిగృహాల వద్దకు వస్తున్న చిరుతలు ప్రస్తుతం వరాహాల కోసం రావడం గమనార్హం. -
తిరుమల శ్రీవారికి కొత్తగా నవనీత సేవ
తిరుమల : తిరుమల శ్రీవారి నైవేద్యాల కోసం ప్రతిరోజూ అవసరమయ్యే నెయ్యిని దేశవాళీ ఆవుల నుంచి సేకరించడానికి త్వరలో ‘నవనీత సేవ’ పేరుతో నూతన సేవకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు టీటీడీ సాధికార మండలి చైర్మన్, ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి వెల్లడించారు. అలాగే, శ్రీవారి ఆలయంలో నైవేద్యానికి వినియోగించే ప్రసాదాల తయారీకి రోజుకు 30 కిలోల దాకా నెయ్యి అవసరమవుతుందని.. ఇందుకోసం సుమారు 1,200 లీటర్ల పాలు కావల్సి ఉంటుందన్నారు. తిరుమల ఏడుకొండలకు సూచికగా ఏడు దేశవాళీ రకాల ఆవులతోపాటు స్థానికంగా ఉన్న మరో మూడు రకాలతో తిరుమలలో 250–300 ఆవులను సేకరించి పాల ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఈఓ చెప్పారు. ఈ కార్యక్రమానికి దేశవాళీ ఆవుపాల నుంచి తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యిని భక్తుల నుంచి కూడా విరాళంగా తీసుకుంటామని.. భక్తులు వారి శక్తి మేరకు నెయ్యి విరాళంగా ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం సాధికార మండలి సమావేశం జరిగింది. అనంతరం మండలి చైర్మన్, ఈఓ జవహర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ►శ్రీవారి నైవేద్యానికి స్వచ్ఛమైన నెయ్యి తయారీకి పలువురు భక్తులు 25 గిర్ గోవులను విరాళంగా అందించారు. ►గో సంరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారిని గోసంరక్షణ ట్రస్టులో కో–ఆప్షన్ సభ్యులుగా నియమిస్తాం. ►టీటీడీకి ఏటా అవసరమయ్యే ఏడు వేల టన్నుల శనగపప్పును గోఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన దానినే కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించాం. ►తిరుపతి ఎస్వీ పశు వైద్య విశ్వవిద్యాలయం సహకారంతో పశువుల దాణా తయారీ ప్లాంట్, పశువుల సంతానోత్పత్తికి ఆధునిక పిండ మార్పిడి విధానాలకు సంబంధించి ఎంఓయు చేసుకోవాలని నిర్ణయించాం. ►తిరుపతి ఎస్వీ గోశాలలో పంచగవ్యాలతో తయారుచేసిన అగరబత్తీలను ఆగస్టు 15 నుండి తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉంచుతాం. ►అలాగే, 4 నెలల్లోపు పంచగవ్య ఉత్పత్తులైన సబ్బు, షాంపు, ధూప్ స్టిక్స్. ఫ్లోర్ క్లీనర్ వంటి 15 రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తాం. ►టీటీడీ ముద్రణాలయంలో ఏటా రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్లు విలువయ్యే పనులు జరుగుతున్నాయి. పీపీపీ విధానంలో అధునాతన యంత్రాల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వారిని ఆహ్వానిస్తాం. ►సప్తగిరి మాసపత్రిక ఎడిటోరియల్ బోర్డును ఇటీవల నిష్ణాతులైన పండితులతో ఏర్పాటుచేశాం. త్వరలో పత్రికను సరికొత్త రూపంతో పాఠకుల ముందుకు తీసుకొస్తాం. ►తిరుమలలో విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించాం. తొలిదశలో ప్రయోగాత్మకంగా 35 విద్యుత్ కార్లను నెలకు రూ.32 వేలు చొప్పున అద్దె చెల్లించి తీసుకోవాలని నిర్ణయించాం. ఐదేళ్ల తరువాత ఈ వాహనాలు టీటీడీ సొంతమవుతాయి. ►2022 సంవత్సరానికి గాను 12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, డీలక్స్ డైరీలు 8 లక్షలు, చిన్న డైరీలు 2 లక్షలు ముద్రించేందుకు ఆమోదించాం. ►టీటీడీ పరిపాలనా భవనం, ముద్రణాలయం, రవాణా విభాగంలో సీసీటీవీల ఏర్పాటుకు రూ.2 కోట్ల టెండర్లు ఖరారు చేశాం. 22 బ్యాగేజి స్కానర్ల కొనుగోలు నిమిత్తం రూ.4.27 కోట్ల మంజూరుకు ఆమోదించాం. ►త్రిదండి రామానుజ చిన్న జీయర్స్వామివారి సూచనల మేరకు పలు ఆలయాల అభివృద్ధికి రూ.8.94 కోట్లు అందిçస్తున్నాం. పురాతన విఠలేశ్వరస్వామివారి ఆలయం రాతి కట్టడానికి రూ.6 కోట్లకు పైగా మంజూరు చేశాం. ►‘బర్డ్’ పాత భవనంలో తాత్కాలికంగా ఏర్పాటుచేస్తున్న ఎస్వీ చిన్నపిల్లల ఆసుపత్రిలో రూ.6 కోట్లతో అధునాతన ఫ్లాట్ డిటెక్టర్ క్యాథ్ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదించాం. ఈ సమావేశంలో ఏఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈఓ సదాభార్గవి, సీవీఎస్ఓ గోపినాథ్ జెట్టి, అదనపు ఎఫ్ఏ అండ్ సీఏఓ రవిప్రసాద్ పాల్గొన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
-
తిరుమలలో ప్రముఖులు..
-
తిరుపతి సర్వీసుల్లో శీఘ్రదర్శనం టికెట్లు
సాక్షి, అమరావతి: తిరుమల వెళ్లి దైవదర్శనం చేసుకునే భక్తులకు శీఘ్రదర్శనం టికెట్లను ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులో ఉంచింది. గతేడాది కోవిడ్కు ముందు ఉన్న ఈ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఫిబ్రవరి నుంచి తిరుపతికి వెళ్లే దూర ప్రాంత సర్వీసుల్లో శీఘ్రదర్శన టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. నిత్యం వెయ్యి శీఘ్రదర్శన టికెట్లను అందుబాటులో ఉంచేలా టీటీడీ అవకాశం కల్పించింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి వెళ్లే ప్రయాణికులు చార్జీలతో పాటు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్రదర్శనం టికెట్లు పొందవచ్చు. రోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టికెట్లు పొందే ప్రయాణికులకు శీఘ్రదర్శనం కల్పిస్తారు. తిరుమల బస్ స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్రదర్శనం టికెట్లు పొందిన వారికి ఆర్టీసీ సూపర్వైజర్లు సహాయం చేస్తారు. అడ్వాన్స్డ్ రిజర్వేషన్ టికెట్లు పొందే వారికి ఈ సౌకర్యం వర్తిస్తుంది. అన్ని ప్రాంతాల నుంచి తిరుపతికి 650 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి రోజూ 650 బస్సుల్ని తిరుపతికి నడుపుతోంది. ప్రతి డిపో నుంచి తిరుపతికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. బెంగళూరు, చెన్నై, కంచి, నెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు అడ్వాన్స్డ్ రిజర్వేషన్తో పాటు శీఘ్రదర్శన టికెట్లు పొందవచ్చు. తొలి రోజు ప్రారంభించిన ఈ శీఘ్రదర్శన టికెట్ల సౌకర్యాన్ని 550 మంది ప్రయాణికులు వినియోగించుకున్నారు. ఈ సౌకర్యాన్ని కల్పించడంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డిలకు ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
శ్రీవారికి కానుకగా బంగారు శఠారి
సాక్షి, తిరుమల : కలియుగ వైకుంఠదైవం వెంకేటేశ్వరస్వామికి ఓ భక్తులు బంగారు శఠారి బహుమతిగా అందించారు. చెన్నైకి చెందిన భాష్యం కన్స్ట్రక్షన్స్ సంస్థ తరపున టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కృష్ణమూర్తి వైద్యనాథన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారికి రూ.35.89 లక్షల విలువైన బంగారు శఠారిని కానుకగా సమర్పించారు. ఈ మేరకు ఈ కానుకను శ్రీవారి ఆలయంలో టీటీడీ ఏఈఓ ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కూడా పాల్గొన్నారు. శ్రీవారి ఉత్సవాల ఊరేగింపు సందర్భంలో ఈ శఠారిని వినియోగించనున్నారు. -
సజ్జల క్లారిటీ ఇచ్చారు: అంబటి
సాక్షి, తాడేపల్లి: పోలీసు భద్రత నడుమ ఆలయాలను ధ్వంసం చేయించిన చంద్రబాబు నాయుడుకు హిందుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. సంకీర్ణ ప్రభుత్వ హయాంలో విజయవాడలో గుళ్లను నాశనం చేసి, దేవుడి విగ్రహాలను మున్సిపాలిటీ చెత్తబండిలో వేసిన చరిత్ర ఆయనదని మండిపడ్డారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ముందుకు సాగుతున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంతర్వేదిలో రథం దగ్దమవడం, మరోచోట దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం కావడం దురదృష్టకరమన్న అంబటి, ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. కానీ మతం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు తమ ప్రభుత్వంపై బురదజల్లి లబ్ది పొందాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.(చదవండి: అధికారంలో లేమనే బాధతోనే ఇదంతా..) సజ్జల క్లారిటీ ఇచ్చారు.. గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడిన అంబటి రాంబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్ట ప్రకారం, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించటం పూర్వజన్మ సుకృతమని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయమన్నారు. కానీ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోందని, అసమర్థ ప్రతిపక్షం సీఎం జగన్పై అసత్యాలు ప్రచారం చేస్తూ హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇక గతంలో ఇద్దరు క్రిస్టియన్ ముఖ్యమంత్రులు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినపుడు లేని డిక్లరేషన్ను, ఇప్పుడు ఎందుకు తెరపైకి తీసుకు వచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకు పోయేకాలం వచ్చిందని, ప్రతిపక్షం మాటలు ఎవరూ నమ్మవద్దని అంబటి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ప్రధాని గురించి ఎవరు ఇలా మాట్లాడినా తప్పేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారని తెలిపారు. అదే విధంగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా తీరుపై కూడా అంబటి మండిపడ్డారు. చంద్రబాబు తాబేదార్ల పత్రికలు పిచ్చి రాతలు రాస్తూ, ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
డిక్లరేషన్ తీసేయాలని చెప్పలేదు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తిరుమల: తిరుమలలో అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని తాను అనలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అయితే కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికలు తన వ్యాఖ్యలపై వివాదం చేస్తున్నాయని ఎల్లో మీడియా తీరును విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా రోజూ వివిధ మతాలకు చెందిన, వేలాది మంది భక్తులు వస్తారని.. వారందరినీ డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని అడగలేము కదా? అని మాత్రమే తాను మాట్లాడానని స్పష్టం చేశారు. (చదవండి: ఎస్వీబీసీ ఛానెల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు) ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. గతంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి స్వామివారి దర్శనానికి వచ్చినపుడు డిక్లరేషన్ ఇవ్వలేదని మాత్రమే తాను చెప్పాననన్నారు. అందువల్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మాత్రమే చెప్పానని పేర్కొన్నారు. అంతేతప్ప తనకు వేరే ఉద్దేశం లేదని, డిక్లరేషన్ తీసేయాలని అనలేదని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి, బురదజల్లాలని చూస్తున్న ప్రతిపక్షం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైవీ సుబ్బారెడ్డి.. తిరుమలలో టీటీడీ డిక్లరేషన్ వివాదంపై శనివారం ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగతున్న సమయంలో అనవసర వివాదాలు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. (బాబు మరో జన్మెత్తినా వైవీ కుటుంబానికి సాటిరారు) వాళ్లెవరూ డిక్లరేషన్ ఇవ్వలేదు టీటీడీ చట్టంలోని రూల్ 136 ప్రకారం హిందువులు మాత్రమే దర్శనానికి అర్హులు. ఇక స్వామివారి దర్శనం చేసుకోదలచిన ఇతర మతస్తులు తాము హిందూయేతరులమని దేవస్థానం అధికారులకు చెప్పి తమంతట తామే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని రూల్ : 137లో స్పష్టంగా ఉంది. 2014లో ప్రభుత్వం జారీ చేసిన మెమో ప్రకారం ఎవరైనా గుర్తించదగిన ఆధారాలు ఉన్నవారైతే (ఉదాహరణకు ఏసయ్య, అహ్మద్, సర్దార్ సింగ్ ఇలాంటి ఇతరత్రా పేర్లు లేదా వారి శరీరం మీద ఇతర మతాలకు సంబంధించిన గుర్తులు ఉంటే) దేవస్థానం అధికారులే డిక్లరేషన్ అడుగుతారు. గతంలో అనేకమంది ఇతర మతాలకు చెందిన రాజకీయ, అధికార ప్రముఖులు స్వామివారి దర్శనానికి వచ్చిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వలేదు. అంతేకాదు సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాతే పాదయాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత తిరుపతి నుంచి కాలినడకన వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్లారు. అదే విధంగా, పార్టీ అధికారంలోకి వచ్చాక స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు తిరుమల శ్రీవారి మీద మీద అపారమైన భక్తివిశ్వాసాలు ఉన్నాయనడానికి ఇంతకంటే ఆధారాలు అవసరం లేదు. అందువల్లే ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదని చెప్పాను తప్ప డిక్లరేషన్ తీసేయాలని చెప్పలేదు’’ అని వైవీ సుబ్బారెడ్డి పునరుద్ఘాటించారు. ఈ మేరకు టీటీడీ ప్రజాసంబంధాల అధికారి పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా టీటీడీ ఆహ్వానం మేరకు, రాష్ట్ర ప్రజలందరి తరఫున ఈనెల 23న స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు వస్తున్న సీఎం జగన్ను డిక్లరేషన్ అడగాల్సిన అవసరం లేదని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా ఆయన మాటలను వక్రీకరిస్తూ, అసత్య కథనాలు ప్రచారం చేస్తోంది. -
‘తిరుపతి పార్ట్నర్కు థ్యాంక్స్’
మజిలీ, ఓ బేబీ, సూపర్ డీలక్స్ ఇలా వరుస హిట్లతో ఫుల్ జోష్లో ఉన్నారు అక్కినేని కోడలు సమంత. పెళ్లి తర్వాత విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా మరింత మెరగవుతున్నారు. అంతేకాదు సినిమా షూటింగ్ల నుంచి విరామం దొరికినపుడల్లా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విహరిస్తుంటారు. ఈ క్రమంలో తన స్నేహితురాలు రమ్యా సుబ్రమణియన్తో కలిసి సమంత గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలి నడన ఏడుకొండలు ఎక్కి శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను సమంత స్నేహితురాలు రమ్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ ప్రశాంతంగా నడిచిన తర్వాత ఈ చిరునవ్వులు. తిరుపతి దర్శనం ఎంతో అద్భుతం. 2019కి మంచి వీడ్కోలు.. అదే విధంగా 2020కి శుభారంభం. ఇందుకు వెంకటేశ్వరుడికి.. అదే విధంగా నా తిరుపతి పార్ట్నర్ సమంతకు ధన్యవాదాలు’ అని ఆమె క్యాప్షన్ జత చేశారు. కాగా యాంకర్గా కెరీర్ ఆరంభించిన రమ్య ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీ అయ్యారు. కోలీవుడ్ సూపర్స్టార్ విజయ్.. దళపతి 64 సినిమాలో కీలక పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఇక చెన్నైకి చెందిన సమంత.. రమ్య మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Smiling away after our peaceful walk , super talk and fantastic darshan at Tirupati ❤️😘. . That was a great finisher to 2019 and a super start to year 2020 ❤️🙏🏻😇🙌🏻! . Thank you Lord Venkatesa and My Tirupati partner @samantharuthprabhuoffl for always making me a part of your blessings 😘❤️. . #FriendsForLife #HappyMood #ThankfulGratefulBlessed A post shared by Ramya Subramanian (@ramyasub) on Dec 18, 2019 at 8:17pm PST -
శ్రీవారి దర్శనానికి నకిలీ సిఫారసు లేఖ ; వ్యక్తి అరెస్ట్
సాక్షి, తిరుమల : శ్రీవారి దర్శనానికి నకిలీ సిఫారసు లేఖలను పంపిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన వెంకట రత్నారెడ్డి అనే వ్యక్తి, ముంబాయిలో ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ కమిషనర్ అంటూ తిరుమల జేఈవో కార్యాలయానికి సిఫారసు లేఖలు పంపించాడు. పరిశీలించిన కార్యాలయ సిబ్బంది నకిలీ లేఖగా గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారమందించడంతో పోలీసులు రత్నారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గతంలోనూ ఇదే తరహాలో దర్శనం చేసుకున్నట్టు రత్నారెడ్డి వెల్లడించాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సిఫారసు లేఖలను జేఈవో కార్యాలయ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. -
తిరుమలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సాక్షి, తిరుమల : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎస్ఏ బోబ్డే శనివారం తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో సింఘాల్లు ఆయనకు స్వాగతం పలికారు. శనివారం రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేయనుండగా, ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. -
శ్రీవారిని దర్శించుకున్న రంగరాజన్ స్వామి
సాక్షి, తిరుమల : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వామి శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వంశపారంపర్య వ్యవస్థను తిరిగి కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొన్న నిర్ణయంపై రంగరాజన్ హర్షం వ్యక్తం చేశారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి సన్నిధి గొల్లలని కూడా వంశపారంపర్యం కొనసాగించాలని కోరారు. గత ప్రభుత్వం అవగాహనా లోపంతో అర్చకులను పదవీ విరమణ చేయించిందని, హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని పేర్కొన్నారు. తిరుమలలో ప్రస్తుతమున్న నాలుగు కుటంబాలలో ఇద్దరి చొప్పున ప్రధాన అర్చకులుగా నియమిస్తే, న్యాయపరమైన సమస్యలు కూడా ఉండవని సూచించారు. టీటీడీపై భక్తులకున్న మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించరాదని మీడియాకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడంపై స్పందిస్తూ.. తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియమా? అన్నది ముఖ్యం కాదు. విలువలతో కూడిన విద్య ముఖ్యం. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలలో వారి భాషలోనే న్యాయస్థానాలు, ప్రభుత్వ కార్యకలాపాలు నడుస్తాయని గుర్తు చేశారు. ప్రస్తుత సమాజానికి తెలుగు, ఇంగ్లీష్ రెండూ ముఖ్యమేనని అభిప్రామపడ్డారు. -
అయోధ్య తీర్పు: సుప్రీం కోర్టుకు ఆ అధికారం ఎక్కడిది?
సాక్షి, తిరుమల : అయోధ్య కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై గోవర్థన పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణం కోసం స్థలం కేటాయింపు సబబేనంటూ.. ఇతర మతాల వారికి స్థలం కేటాయించే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిదని ప్రశ్నించారు. వివాదాస్పద స్థలం ఎవరిదో చెప్పాలి గానీ, మరో స్థలం కేటాయించాలని ఎలా చెబుతారంటూ మండిపడ్డారు. ఇలా అయితే రేపు మధుర, కాశీలలో కూడా ఇలానే తీర్పు ఇచ్చి ఆయా ప్రాంతాలను మినీ పాకిస్తాన్లా మార్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రామ జన్మభూమి కమిటీలో ప్రభుత్వానికి వత్తాసు పలికేవారికి చోటు కల్పిస్తున్నారని విమర్శించారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మఠాలను పక్కన పెట్టి రవిశంకర్ లాంటి వ్యక్తులకు ప్రాధాన్యతనివ్వడం సబబు కాదని పేర్కొన్నారు. దివంగత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో 2.7 ఎకరాల స్థలాన్ని చెరిసగం పంచాలన్న ప్రతిపాదనను అందరూ అంగీకరించినా తాను వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్లిపోయిందని వెల్లడించారు. ధర్మాన్ని ధర్మాచార్యులు చెప్పాలి కానీ, ఈ మధ్య ప్రభుత్వాలు నిర్దేశిస్తున్నాయని ఎద్దేవా చేశారు. సెక్యులరిజం పేరుతో బెనారస్ యూనివర్సిటీ డీన్గా ఇతర మతస్థుడిని నియమించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు రాసిన పుస్తకాలు చదవుతున్న వారు అధికమవడంతో వేదాలు మరుగున పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా 1133 శాఖలుగా ఉన్న వేదాలు ఇప్పుడు 7 శాఖలకు పడిపోయిందని తెలిపారు. -
‘ఆ జీవో ఇచ్చింది చంద్రబాబే’
సాక్షి, తాడేపల్లి : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు హయాంలోనే హిందూ మతానికి అవమానం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, మాణిక్యాలరావు మంత్రిగా ఉన్న సమయంలోనే దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని గుర్తుచేశారు. తిరుమలలో బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచార ఉదంతంపై మల్లాది విష్ణు స్పందించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న మంచి పనులతో తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే భయంతో టీడీపీ, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో బస్సు టిక్కెట్ల మీద ప్రచారం కోసం జీవో ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ బస్ టిక్కెట్ల మీద ఇమామ్లు, హజ్యాత్ర, జెరూసలేం గురించి ప్రచారం చేయించారని.. ఇప్పటికీ అవే ఆర్టీసీలో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ విషయంతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. తమకు అన్ని మతాలు, ప్రాంతాలు, వర్గాలు సమానమని పేర్కొన్నారు. బస్సు టిక్కెట్ల వ్యవహారంపై దేవాదాయ శాఖ మంత్రి ఇప్పటికే విచారణకు ఆదేశించారని తెలిపారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ టీడీపీ ట్రాప్లో పడుతున్నారని ఎమ్మెల్యే విష్ణు విమర్శించారు. ఆవుల మరణానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ మంత్రి ఉండగా చాలా ఆవులు చనిపోయాయి.. దానికి బీజేపీ బాధ్యత వహిస్తుందా అని నిలదీశారు. చంద్రబాబు సీఎంగా, మాణిక్యాల రావు మంత్రిగా ఉండగా విజయవాడలో 50 హిందూ దేవాలయాలను కూలదోశారని ఆరోపించారు. పుష్కర మరణాలు ఎవరి కాలంలో జరిగాయో అందరికి తెలుసునని..సదావర్తి దేవుడు భూములను కాజేసిన చరిత్ర టీడీపీ నేతలదని విమర్శించారు. రాష్ట్రంలో మనుగడ కష్టమని తెలిసి... రాజకీయంగా లబ్ది పొందేందుకే బీజేపీ, టీడీపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన నవంబరు మాసం కోటా కింద మొత్తం 69,254 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసినట్లు టీటీడీ ఈఓ అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆన్లైన్ డిప్ విధానంలో 10,904 సేవా టికెట్లు విడుదల చేశామని.. ఇందులో సుప్రభాతం 7,549, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2,875 టికెట్లు ఉన్నాయని వెల్లడించారు. ఆన్లైన్ జనరల్ కేటగిరిలో 58,350 సేవా టికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 1,500, కల్యాణం 13,300, ఊంజల్సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 14,850, సహస్ర దీపాలంకార సేవ 16,800 టికెట్లు ఉన్నాయన్నారు. కాగా, ఈనెల 13, 27 తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు.. 14, 28 తేదీల్లో ఐదేళ్లలోపు చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నామన్నారు. అలాగే ప్లాస్టిక్ నివారణలో భాగంగా ఈ నెల మూడో వారం నుంచి తిరుమలలో అందరికీ జనప నార బ్యాగులను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వివరించారు. టీటీడీ ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. సామాన్య భక్తుల సౌకర్యార్థమే బ్రేక్ దర్శనాల కేటగిరీలను రద్దు చేశామని స్పష్టంచేశారు. దీనివల్ల గంట సమయం ఆదా అవుతోందని, తద్వారా దాదాపు 5 వేల మంది సామాన్య భక్తులకు అదనంగా దర్శనం చేయించేందుకు వీలవుతోందని తెలిపారు. సమావేశంలో తిరుపతి జేఈఓ బసంత్కుమార్, సీవీఎస్ఓ గోపినాథ్ జెట్టి, ఇన్చార్జి సీఈ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. 9 నుంచి ‘మనగుడి’ ఇదిలా ఉండగా.. ఈనెల 9 నుంచి 15 వరకు తెలుగు రాష్ట్రాలల్లోని ఎంపిక చేసిన ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ‘డయల్ యువర్ ఈఓ’ కార్యక్రమంలో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. 9న తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్న నేపథ్యంలో మహిళలకు సౌభాగ్యం పేరిట కుంకుమ, గాజులు, కంకణాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే తిరుమలలో 124 రోజులకు సరిపడా నీటి నిల్వలున్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత ఏడాది జూలైలో హుండీల ద్వారా శ్రీవారికి రూ.102.88కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అదే నెలలో రూ.109.60 కోట్లు వచ్చిందని ఈఓ వెల్లడించారు. -
గ్రహణం రోజున ఆ ఆలయం తెరిచే ఉంటుంది
సాక్షి, చిత్తూరు : చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. అయితే గ్రహణం రోజున శ్రీకాళహస్తి ఆలయం తెరిచే ఉంటుందని ఆలయ వేద పండితులు శివప్రసాద్ శర్మ తెలిపారు. గ్రహణకాల సమయంలో ప్రత్యేక గ్రహణకాల అభిషేకాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. మంగళవారం రాత్రి ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సంపూర్ణ కేతు చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని తెరచి ఉంచి ఉదయం మూడు గంటల నుంచి గ్రహణ కాలాభిషేకాలు, సంకల్పము, స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సాక్షి, తిరుమల : చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం శ్రీవారి ఆలయం మూసివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.08 కోట్లు అని వెల్లడించారు. గ్రహణం కారణంగా మంగళవారం రాత్రి 7 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేస్తామని.. తిరిగి బుధవాం ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరవనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సుప్రభాతం, శుద్ధి తర్వాత శ్రీవారి దర్శనం ఉంటుందని వెల్లడించారు. కాగా గ్రహణం సందర్భంగా అన్నప్రసాద కేంద్రాన్ని టీటీడీ మూసివేసింది. సాక్షి, యాదాద్రి : నేడు చంద్రగ్రహణం సందర్భంగా సాయంత్రం 6.30 నిముషాల నుంచి రేపు ఉదయం 5.30 నిమిషాల వరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ మూసివేయనున్నారు. రేపు ఉదయం 5.30 నిముషాలకు ఆలయం తెరిచి సంప్రోక్షణ అనంతరం నిత్య విధులు నిర్వహించి ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులకు దర్శనాలకు అనుమతి ఉంటుంది. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం, రేపు ఉదయం భక్తులచే జరుపబడే ఆర్జిత సేవలు రద్దు చేయనున్నారు. -
తిరుమలలో యువతిపై ఎలుగుబంటి దాడి
సాక్షి, తిరుపతి : తిరుమలలో యువతిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఆమె కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను అశ్విని ఆస్పత్రికి తరలించారు. టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి బాధితురాలిని పరామర్శించారు. కాగా గాయపడిన యువతి తెలంగాణకు చెందిన విజయలక్ష్మీగా పోలీసులు గుర్తించారు. భూగర్భ డ్యాం వద్ద స్నానం చేసి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ఆమె పేర్కొందని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోందని వెల్లడించారు. -
కాలినడకన తిరుమలకు ఎమ్మెల్యే దుద్దుకుంట
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన దుద్దుకుంట శ్రీధర్రెడ్డి కాలినడకన తిరుమలకు వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయన సతీమణి అపర్ణ, కుటుంబ సభ్యులు కలిసి తిరుమలకు మెట్ల మార్గం గుండా కాలినడకన వెళ్లినట్లు చెప్పారు. శనివారం ఉదయం స్వామి వారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమైనట్లు తెలిపారు. వేంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో అత్యధిక మెజార్టీ సాధించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. పుట్టపర్తి అభివృద్ధికి స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లు తెలియజేశారు. -
వైవీ సుబ్బారెడ్డికి ఘనస్వాగతం
సాక్షి, తిరుపతి : టీటీడీకి 50వ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్న వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆయన నేరుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని... అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయన రేపు తిరుమలలో టీటీడీ ఛైర్మన్ గా భాధ్యతలు స్వీకరించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ ఇటీవల తన పదవికి రాజీనాయా చేసిన విషయం తెలిసిందే. -
’టీటీడీలో ఆడిట్ అధికారులను నియమించాలి’
సాక్షి, తిరుపతి : టీటీడీ అక్రమాలపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు మాజీ ఎంపీ చింతా మోహన్ లేఖ రాశారు. టీటీడీలో తక్షణమే ఆడిట్ అధికారులను, ఒక ఐఆర్ఎస్ అధికారిని నియమించాలని కోరారు. టీటీడీ సభ్యులు కుప్పం నుంచి వచ్చే కూరగాయలను అధిక రేట్లకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక రైతుల నుంచే కూరగాయలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ గోల్డ్ డిపాజిట్ తరలింపుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఉందా అని ప్రశ్నించారు. తిరుమల, తిరుపతిలో వడ్డీ వ్యాపారులు ప్రజల్ని దోచుకుంటున్నారని, పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు. ఈ విషయాలు అన్ని గవర్నర్, డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ నెల 23లో టీటీడీ స్పందించకపోతే ప్రత్యేక్ష ఆందోళన చేస్తానని హెచ్చరించారు. -
తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించినా.. వైఎస్సార్ సాధించాడు
సాక్షి, తిరుమల : తెలుగు భాషకు ప్రాచీన హాదా కల్పించడాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్రం ప్రభుత్వంతో కొట్లాడి మరీ సాధించారని మాజీ ఎంపీ, ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరంమీడియాతో మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్సార్ తెలుగు భాషకు ప్రాచీన హోదా తెస్తే.. చంద్రబాబు నాయుడు ఉన్న భాషను చంపేస్తున్నాడని ఆరోపించారు. అంగన్వాడీల్లో సైతం ఇంగ్లీష్ భాషను పెట్టి తెలుగు భాషకు మనుగడ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. తెలుగు యూనివర్సిటీని సైతం ముయించేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్తోనే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. జగన్ ప్రభుత్వంలో తెలుగు భాష పరిమడిల్లాలని, గౌరవం పెరగాలని స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు. -
తిరుమలలో కిడ్నాప్ కలకలం
సాక్షి, తిరుమల : : మూడు నెలల బాలుడు కిడ్నాప్ అయిన ఘటన తిరుమలలో కలకలం రేపింది. తమిళనాడులోని ఇల్లిపురం గ్రామానికి చెందిన కైసల్య, భర్త మధిరతో కలిసి తిరుమల కొండపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. శనివారం రాత్రి తిరుమల ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర మగబిడ్డ (వీరా)ను పక్కన పడుకోబెట్టుకొని నిద్రిస్తున్నసమయంలో గుర్తుతెలియని దుండగులు అపహరించారు. వీర కనిపించకపోవడంతో మధిర, కౌసల్య ఆందోళన చెందారు. చుట్టుపక్కల గాలించినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో బాలుడి మిస్సింగ్పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
‘ఫిబ్రవరి 1లోగా ప్రభుత్వం స్పందించకుంటే బంద్ చేస్తాం’
సాక్షి, తిరుమల : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తిరుమల వాసుల చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరింది. తరతరాలుగా తిరమల కొండను నమ్ముకోని బతుకుతున్న తమను టీటీడీ ఆదుకోవడంలేదని స్థానికులు బుధవారం నుంచి ఆందోళను దిగారు. మూడు రోజులపాటు జరిగే నిరసనలోభాగంగా గురువారం టీడీడీ పరిపాలనా భవనం ఎదుట దీక్షకు దిగారు. శుక్రవారంలోగా(ఫిబ్రవరి 1) ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే షట్ డౌన్ పేరుతో బంద్ చేస్తామని హెచ్చరించారు. వీరి ఆందోళనకు వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ప్రకటించింది. తిరుమల వాసుల ప్రధాన డిమాండ్లు తిరుమల నిర్వాసితులను ఆదుకోవాలి. బాలాజీనగర్, ఆర్బీ సెంటర్లో నివసిస్తున్న స్థానికులకు మౌలిక వసతులు కల్పించాలి. టెండర్షాపులకు బాడుగలు కట్టించుకుని రెగ్యులరైజ్ చేయాలి. అర్హులైన స్థానికులకు హాకర్స్ లైసెన్స్లు కేటాయించి, ఫీజులను తగ్గించాలి. అన్ని ప్రాంతాల షాపులకు ఫిక్స్డ్ రెంట్ అమలు చేయాలి. పాపవినాశనం వ్యాపారులకు న్యాయం చేయాలి. 10 సంవత్సరాల ముందు ఇచ్చిన ట్రేడ్ లైసెన్స్లను కొనసాగించాలి. అలిపిరి టోల్గేట్లో ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలి. షాపింగ్ సెంటర్, సబ్వేలలో దుకాణాలను వ్యాపారం జరిగే ప్రాంతాలకు తరలించాలి. హోటల్స్ను ప్రైవేటు వ్యక్తులకు కాకుండా స్థానికులకు కేటాయించాలి. తిరుమలలో స్థానికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. -
ఏజెన్సీ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం
సాక్షి, తిరుమల : తిరుపతిలోని అలిపిరి వద్ద 67.9 కోట్ల రూపాయలతో 346 గదుల నిర్మాణం చేపట్టనున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. అదేవిధంగా... తిరుమలలో భద్రత పర్యవేక్షణకు రూ. 15 కోట్లతో 1050 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఏటీసీ వద్ద క్యూలైన్ నిర్మాణం కోసం రూ. 17.21 కోట్లు, తిరుమలలో స్మార్ట్ డేటా వినియోగ ఏర్పాటుకై రూ. 2.63, పలమనేరు గోశాల అభివృద్ధికి రూ. 40 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాలు శ్రీవారి ఆలయ ఆగమ సలహామండలి సభ్యులుగా అనంతశయ్య దీక్షితులను నియమించినట్లు సుధాకర్ యాదవ్ తెలిపారు. విజయనగరంలోని పార్వతిపురంలో రూ. 2.97 కోట్లతో, శ్రీకాకుళంలోని సీతంపేటలో రూ. 2.83 కోట్లతో, తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో రూ. 2.97 కోట్లతో శ్రీవారి ఆలయాలు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద రూ. 2.27 కోట్లతో కళ్యాణమండప నిర్మాణం చేపడతామన్నారు. -
తిరుమలలో కొత్త సంవత్సర వేడుకలు
-
బాలాత్రిపుర సుందరిగా దుర్గమ్మ దర్శనం
సాక్షి, అమరావతి బ్యూరో: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మల్లికార్జున మహామండపంలో ఏర్పాటు చేసిన లక్షకుంకుమార్చనలో దంపతులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న అన్నదాన భవనంలో భక్తులకు ఉచిత అన్నదాన ప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం మల్లేశ్వరస్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన శ్రీ గంగా పార్వతీ సమేత నగరోత్సవం అర్జునవీధి మీదుగా ఇంద్రకీలాద్రి వరకు కనుల పండువగా సాగింది. దసరా ఉత్సవాల్లో మూడోరోజు అమ్మవారు భక్తులకు గాయత్రీదేవిగా దర్శనం ఇస్తారు. చిన్నశేషుడిపై గోపాలుడి విహారం తిరుమల: తిరుమలేశుని బ్రహ్మోత్సవాల రెండో రోజు గురువారం ఉదయం చిన్నశేషవాహనం, రాత్రి హంసవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 7.00 నుంచి 8.00 గంటల వరకు ఊంజల్సేవ వైభవంగా జరిగింది. ఉదయం శ్రీమలయప్ప స్వామి ఐదు తలల చిన్నశేష వాహనంపై పండరీపురం శ్రీపాండురంగ స్వామి అలంకారంలో ఊరేగారు. వెలసిపోయింది! బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన చిన్నశేష వాహన సేవ పీఠానికి బంగారుపూత వెలసిపోయి కనిపించింది. పీఠానికి అమర్చిన రాగిరేకు కనిపించడంతో భక్తులు ఒకింత అసంతృప్తికి గురయ్యారు. అన్నపూర్ణగా భద్రకాళి హన్మకొండ కల్చరల్: శ్రీ భద్రకాళి దేవీ శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారిని అన్నపూర్ణా దేవీగా అలంకరించారు. గురువారం ఉదయం 4గంటలకు ఆలయ ప్రధానార్చకులు శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు నిత్యాహ్నికం, సుప్రభాత పూజలు జరిపారు. అమ్మవారి స్వపనమూర్తిని అన్నపూర్ణ అమ్మవారిగా అలంకరించి మకరవాహనంపై ఊరేగించారు. రాత్రి 9గంటలకు మహాపూజ, కుమారీ, సువాసినీ పూజలు మహానీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం జరిపిన మహాప్రసాదవితరణ కార్యక్రమంలో దేవాదాయశాఖ డీసీ నర్సింహులు పాల్గొన్నారు. శుక్రవారం అమ్మవారిని గాయత్రీగా అలంకరించనున్నారు. -
నామాల స్వామి నడయాడిన దివ్యమార్గం
శ్రీవారి మెట్టు మార్గం... శ్రీపద్మావతీ దేవి, వేంకటేశ్వరస్వామి నడయాడిన దివ్యమార్గంగా ప్రసిద్ధి చెందింది. తిరుమల క్షేత్రానికి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని చెట్లతో, పక్షుల కిలకిలారవాలతో ప్రతిధ్వనిస్తూ వింత సోయగాలతో మైమరపించే ప్రకృతి రమణీయత ఉట్టిపడే దివ్యధామంగా విరాజిల్లుతుంది ఈ మార్గం. జగత్కల్యాణ మూర్తులైన శ్రీపద్మావతీ, శ్రీనివాసులు చెట్ట్టపట్టాలేసుకుని నడిచిన ఈ శ్రీవారిమెట్టు మార్గం గుండా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ అడుగడుగు దండాలసామిని స్మరిస్తూ గోవింద నామ స్మరణతో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వెళ్తుంటారు. అయితే ఈ ప్రాంతం కొన్ని దశాబ్దాల క్రితం స్వర్ణముఖి, కల్యాణి నదుల ఉద్ధృతమైన వరదల తాకిడికి గురైంది. ఈ వరదల వల్ల ఇతర గ్రామాలతోపాటు శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరాలయం కూడా శిథిలమైంది. అప్పటి నుంచి భక్తుల రాకపోకలు సన్నగిల్లాయి. కానీ చంద్రగిరి, మంగాపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మాత్రం శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే తిరుమలకు వెళ్లి భక్తులకు అవసరమైన కూరగాయలు, పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటిని అమ్ముకునేవారు. రమణాచారి సంకల్పంతో... సాక్షాత్తు తిరుమలేశుడు నడయాడిన ఈ దివ్యమార్గాన్ని పునరుద్ధరించేందుకు నాటి టీటీడీ ఈవో కేవీ రమణాచారి సంకల్పించారు. ఆయన పట్టుదలతో సడలని దీక్షతో శ్రీవారి మెట్టు మార్గం పునరుద్ధరింపబడింది. రాళ్లురప్పలతో కూడి దుర్గమంగా తయారైన ఈ మార్గాన్ని రూ.6 కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దారు. గ్రానైటు రాళ్లతో 2,388 మెట్లను ఎండ తగలకుండా, వానకు తడవకుండా ఆ మెట్లపై చక్కని షెడ్లను నిర్మించారు. దారి వెంబడి నడిచే భక్తుల కోసం మంచినీరు, విద్యుత్తు, పారిశుద్ధ్యం, భద్రత వంటి విస్తృత సౌకర్యాలతో శ్రీవారి మెట్టు మార్గాన్ని పునర్నిర్మించారు. రూ.38 లక్షలతో మొదటి మెట్టు వద్ద శ్రీవారి పాదాల మండపం ఆలయాన్ని ప్రతిష్ఠించారు. సౌకర్యాలు పెరగడంతో శ్రీవారి మెట్టు నుంచి స్వామి దర్శనానికి వెళ్లే వారి సంఖ్య పెరిగింది. మామూలు రోజుల్లో రోజుకు 5 నుంచి 10 వేల మంది భక్తులు వెళితే, పండుగలు, సెలవులు, ఉత్సవాల సమయాల్లో 20 వేల వరకు వెళ్తుంటారు. తిరుపతి ‘శ్రీనివాసం’ నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. -
తిరుమలలో నాలుగో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
-
నా ప్రాణం పోయినా బాగుండేది: మోత్కుపల్లి
సాక్షి, తిరుమల : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న మాటలకు తన ప్రాణం పోయినా బాగుండేదని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి ఆయన కాలిబాటలో పాదయాత్రగా బయలు దేరారు. కొద్దిసేపటి తర్వాత కాలిబాటలో ఆయన స్వల్ప అస్వస్థకు గురయ్యారు. వైద్య పరీక్షల అనంతరం కోలుకున్న ఆయన పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనను అవమాన పరిచారని, ప్రజల ముందు అవహేళన చేశారని వాపోయారు. దళితులకు సేవ చేయటానికే తప్ప.. తనకు వేరే ఆలోచన లేదని మోత్కుపల్లి తెలిపారు. కానీ చంద్రబాబు కులాన్ని అడ్డుపెట్టుకుని దూషించారని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన దానికి దేవుని వద్ద తన గోడును వినిపించుకుంటానని అన్నారు. తాను ఏ పార్టీలోనూ చేరాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కాలిబాటలో అనారోగ్యానికి గురై బీపీ పెరిగి.. గుండె నొప్పిగా ఉన్న పాదయాత్ర ఆపలేదని మోత్కుపల్లి నరసింహులు తెలిపారు. -
వసతి చూపవా గోవిందా..
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు అద్దెగదుల కోసం తిప్పలు తప్పడంలేదు. గదులు కేటాయింపునకు సంబంధించిన వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవటం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక సమస్యలే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఏడుకొండలవాని దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. వచ్చే ప్రతి భక్తుడు తిరుమలలో ఓ రాత్రి నిద్రిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్ముతాడు. గదుల కోసం భక్తులు ముందుగా తిరుమలలో సీఆర్వో కార్యాలయానికి చేరుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ జనరల్ కౌంటర్లు, దేవదాయశాఖ కౌంటర్, వీఐపీ, వీవీఐపీ, బోర్డు మెంబర్ల కోసం విడివిడిగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. గదులు అవసరమైన వారు కౌంటర్ వద్ద పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గదులు ఖాళీ అవుతుంటే... వరుస క్రమంలో ఉన్న భక్తుల మొబైల్ ఫోన్లకు మెసేజ్లు వస్తుంటాయి. ఆ సమాచారం తెలుసుకుని భక్తులు సీఆర్వో కార్యాలయానికి వెళ్లి గది తాళాలు తీసుకుంటారు. గతంలో అయితే గదులు ఖాళీ అవుతుంటే క్యూలో ఉండేవారికి కేటాయించేవారు. ఇలా గంటల తరబడి భక్తులు క్యూలో నిల్చొని ఇబ్బంది పడకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చారు. మెసేజ్ రాకపోతే గది లేనట్టే.. తిరుమలలో గదుల రిజిస్ట్రేషన్ కోసం టీటీడీ 10 కౌంటర్లు ఏర్పాటు చేసింది. అందులో సిబ్బంది వారాంతపు సెలవులు, అత్యవసర సెలవులు, ఇతరత్రా కారణాలతో రోజుకి ఆరేడు కౌంటర్లు మాత్రమే పనిచేస్తుంటాయి. ఈ కౌంటర్ల వద్ద క్యూలో 200 మంది లోపు మాత్రమే నిలబడే అవకాశం ఉంది. ఒకసారి క్యూలోకి చేరుకున్న భక్తులు సుమారు ఒకటిన్నర గంట సమయం బయటే నిలబడి ఉండాలి. క్యూలో ఉన్న వారి కంటే బయట వేచి ఉన్న వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. మొదట్లో టీటీడీ నిర్ధేశించిన ప్రకారం భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని బయటకు వచ్చేస్తే... గది ఖాళీ అయినప్పుడు భక్తుడు రిజిష్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుంది. సమాచారం అందిన అరగంటలో వెళ్లి గది తీసుకోవాలి. కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో కొందరికి గది కేటాయించినా ఎటువంటి మెసేజ్ రావడంలేదు. దీంతో సీఆర్వో కార్యాలయం వద్ద డిస్ప్లే బోర్డు చూస్తూ గంటల తరబడి నిలబడుతున్నారు. మరి కొందరు.. గది కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ‘2 లేదా 3’ గంటల తరువాత కేటాయించవచ్చు అని ఉజ్జాయింపుగా రశీదుపై సమయాన్ని ముద్రించి ఇస్తారు. దీంతో భక్తులు ఇంకా సమయం ఉందని తిరుమలలోని దర్శనీయ స్థలాలు చూసి వచ్చేందుకు వెళ్తుంటారు. ఒక్కో సారి రిజిస్ట్రేషన్ అయిన అరగంటలోనే గది కేటాయిస్తుంటారు. ఆ సమాచారం భక్తులకు వెళ్లడం లేదు. గది అలాట్ అయిన అరగంటలో తీసుకోకపోతే ఆటోమేటిక్గా అది రద్దయిపోతుంది. మొబైల్కి సమాచారం రాలేదని భక్తులు తిరుమల అంతా చుట్టి సీఆర్వో కార్యాలయానికి చేరుకునే సరికి.. గది అలాట్ అయ్యిందని, అరగంటలో తీసుకోకపోవటంతో రద్దయిందని చెబుతుండటంతో భక్తులు షాక్కు గురవుతున్నారు. పర్యవేక్షణ లోపమే.. అనిల్కుమార్ సింఘాల్ ఈవోగా వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ పద్ధతి అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ఈ విధానంలో లోపాలను సరిదిద్దేవారు కరువయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భక్తులకు కేటాయించిన గదుల వివరాలపై వారికి ఎస్ఎంఎస్లు వెళ్లడం లేదని సంబంధిత అధికారులకు తెలియటం లేదని సమాచారం. కౌంటర్లు చాలక ఇబ్బంది పడుతున్న సమాచారమూ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం లేదు. అదే విధంగా కౌంటర్లలో పనిచేస్తున్న అధికారులకు సుమారు ఏడేళ్లుగా బదిలీలు లేకపోవటంతో వారు గదుల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. -
తిరుమలలో తప్పులు రాష్ట్రానికే అరిష్టం: కోన
సాక్షి, తిరుపతి : దేవాలయాలు, అర్చకులకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తిన రమణ దీక్షితులుకు మద్దతుగా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రమణ దీక్షితులు అడుగుతున్న ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పట్లేదని ప్రశ్నించారు. తిరుమలలో జరుగుతున్న తప్పుల వల్ల రాష్ట్రానికే అరిష్టమని అన్నారు. 65 ఏళ్లుకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని పునరాలోచించాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రమణదీక్షితులు లేవనెత్తిన అంశాలపై సీబీఐ విచారణ జరిపి, ఆయనను తక్షణమే ప్రధానార్చకులుగా నియమించాలని డిమాండ్ చేశారు. 65 ఏళ్లు నిండాయని ఆయనను పక్కన పెట్టడం దురదృష్టకరమని తెలిపారు. ఆయన బాధను చెప్పుకోవడానికి ఇక్కడ అవకాశం లేక పక్క రాష్ట్రానకి వెళ్లి చెప్పుకునే పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. చంద్రబాబు దేవాలయాలను నాశనం చేసిన వ్యక్తి, విజయవాడలో కూల్చిన దేవాలయాలను ఎక్కడ తిరిగి నిర్మించలేదని ఆరోపించారు. దేవతా సేవల వేళల్లో ఇష్టానుసారం మార్పులు చేయడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని శాస్త్ర వ్యతిరేక పనులే చేస్తున్నారని విమర్శించారు. మిరాశీ కుటుంబీకుడు ప్రశ్నించడం తప్పా, ఆస్తుల లెక్కలు భక్తులకు చెప్పమని కోరడం తప్పా అని ప్రశ్నించారు. 2017 డిసెంబర్లో వంటశాలను మూసివేసి తవ్వకాలు జరపడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కోర్టు తీర్పును కూడా బేఖాతరు చేస్తూ మిరాశీలను 65 ఏళ్లకే తొలగిస్తామనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రహ్మణులతో పెట్టుకుంటున్నారు జాగ్రత్త అని హెచ్చరించారు. గతంలో ఐవైఆర్ కృష్ణారావును అలానే అవమానించారు. ఇప్పుడు రమణదీక్షితులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. సన్నిధి గొల్లలకు కూడా చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. దేవాలయాలన్నింటికి ధూప దీప నైవేద్యాలుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులిచ్చి సంస్కృతి, సాంప్రదాయాలను బ్రతికించారని తెలిపారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అలానే హామీ ఇచ్చారని అన్నారు. -
18న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 18వ తేదీన విళంబినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. అదే రోజు వేకువజామున శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనుల వారికి వేర్వేరుగా తిరుమంజనం నిర్వహించి, విశేషాభరణాలతో అలంకరిస్తారు. తర్వాత ఉత్సవమూర్తులను ఘంటామండపంలో వేంచేపు చేసి, పడిప్రసాదాలు, అన్నప్రసాదాలతో నివేదిస్తారు. అనంతరం ఆస్థాన వేడుకలు నిర్వహించనున్నారు. శ్రీవారి పాదాల వద్ద ఉన్న పంచాంగాన్ని ఆస్థాన సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేయిస్తారు. తిథి, వారనక్షత్ర, నూతన సంవత్సర ఫలితాలు, లాభనష్టాలు, నవగ్రహాల గతులు, సవ్యవృద్ధి, పశువృద్ధి, 27 నక్షత్ర జాతకుల కందాయ ఫలాలు, రాజపూజ్యత అవమానాలు ఈ పంచాంగ శ్రవణంలో శ్రీవారికి వినిపిస్తారు. ఈ ఉగాది ఆస్థానం నేపథ్యంలో 18వ తేదీ నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది. 14న అన్నమయ్య 515వ వర్ధంతి ఉత్సవం.. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులవారి 515వ వర్ధంతి మహోత్సవాన్ని ఈనెల 14వ తేదీన తిరుమలలో నిర్వహించనున్నారు. ఇక్కడి నారాయణగిరి ఉద్యానవనంలో ఉత్సవమూర్తులు వేంచేపు చేసి, సాయంత్రం 6.00 గంటల నుంచి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో గోష్టిగానం నిర్వహించనున్నారు. -
విష్ణు పుష్కరిణి.. విస్తరణ
యాదగిరికొండ : తిరుమల తరహాలో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా యాదగిరికొండపై ఉన్న విష్ణు పుష్కరిణిపై వైటీడీఏ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు పుష్కరిణి విస్తరణకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.20కోట్లు కేటాయించారు. త్వరలో పనులు కూడా ప్రారంభం కానున్నాయి. భక్తుల సౌకర్యార్థం విష్ణు పుష్కరిణిని వెడల్పు చేయడంతో పాటు లోతు కూడా పెంచనున్నారు. ప్రస్తుతం పుష్కరిణి చుట్టూ సత్యనారాయణ వ్రత మండపం, ఇతర నిర్మాణ పనులు జరుగుతున్నందున ఆటంకం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పుష్కరిణిలో స్నానమాచరించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విష్ణు పుష్కరిణి ప్రాశస్త్యం స్వామి సన్నిధికి వచ్చే భక్తుల్లో యాబై శాతం కొండపై ఉన్న విష్ణు పుష్కరిణిలో పుణ్యస్నానమాచరిస్తారు. అనంతరం స్వామి, అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుష్కరిణిలోని ఓ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి గుంట ఉంది. అందులోనుం చి నిత్యం ఎడతెరిపి లేకుండా నీటిధార వస్తుంది. గతంలో చాలా పెద్ద దార వస్తుండేది. కాల క్రమేణా మరమ్మతుల నిమిత్తం పుష్కరిణిలో కాంక్రీటు వేయడం, కరువు పరిస్థితుల కారణంగా నీటి గుంట మూసుకుపోవడంతో పాటు జల దార కూడా తగ్గుముఖం పట్టింది. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే గ్ర హ, గృహ, ఈతి, రోగ బాధలు పోతాయ ని భక్తుల విశ్వాసం.అంతేకాకుండా ఈ కోనేరు నుంచి స్వామి వారికి అభిషేకానికి బందేతీర్థం తీసుకెళ్తుంటారు. అందుకే ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి వెళ్తుంటారు. తిరుమలను తలపించేలా పుష్కరిణి విస్తరణ యాదగిరికొండపై ప్రస్తుతం ఉన్న పుష్కరిణి 36 మీటర్లు వెడల్పు, 18 మీటర్ల పొడవు ఉంది. ఇందులో భక్తుల కోసం నాలుగు స్నానపు గదులు, నాలుగు కుళాయిలు మాత్రమే ఉన్నాయి. ఇవి భక్తుల అవసరాలకు సరిపోవడం లేదు. కొత్తగా రానున్న పుష్కరిణి 55మీటర్ల వెడల్పు, 31మీటర్ల పొడవుతో రానుంది. అంతేకాకుండా భక్తులు స్నానమాచరించేందుకు విడివిడిగా సుమారు 20 స్నానపు గదులు నిర్మించనున్నారు. అలాగే పురుషులు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వేర్వేరుగా గదులు, ప్రత్యేకంగా నీటి షవర్లు, విడిగా వేడినీటి షవర్లు ఏర్పాటు చేయనున్నారు. వికలాంగులు, చిన్న పిల్లలకు సైతం ప్రత్యేక గదులు రానున్నాయి. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. పుష్కరిణి మధ్యలో కల్యాణ మండపం, అందులో ప్రత్యేకంగా స్వామివారి పాదాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పాదాలపై ప్రతి భక్తుడు నీటిని పోసే విధంగా ప్రత్యేక క్యూలైన్లు రానున్నాయి. ఈ కల్యాణ మండపం చుట్టూ ప్రత్యేక గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు.వీటితో పాటు పుష్కరిణికిలోనికి వెళ్లే ముందు 11అడుగుల ఎత్తులో అందమైన కమాను, దీనిపై ఐదు అడుగుల ఎత్తున్న విష్ణుమూర్తి విగ్రహం రానుందని అదికారులు తెలిపారు. చిన్నజీయర్ స్వామి సూచనల ప్రకారం పుష్కరిణి చుట్టూ గోడకు అందమైన శిల్పాలు రానున్నాయి. పది వేల మంది స్నానమాచరించేలా.. ప్రస్తుతం ఉన్న పుష్కరిణిలో రోజూ రెండు వేల మంది మాత్రమే స్నానమారచిండానికి వీలుగా ఉంది. దీన్ని పది వేల మంది సాన్నమాచరించేందుకు వీలుగా నిర్మాణం చేయనున్నారు. ప్రధానాలయ నిర్మాణం పూర్తయ్యేలోగా పుష్కరిణి విస్తరణ పనులు పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
శబరిమలలో తిరుమల మాదిరి సౌకర్యాలు
తిరువనంతపురం: తిరుమలలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాదిరి శబరిమలలో కూడా అయ్యప్ప భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ త్వరలో తిరుమల సందర్శించి అక్కడి అభివృద్ధి ప్రాజెక్టులు, వసతుల కల్పనపై అధ్యయనం చేయనున్నట్లు దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ఈ అధ్యయనానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారన్నారు. శబరిమల ఆలయం నవంబర్-జనవరి మూడు నెలలే తెరిచి ఉంటుంది. ఈ సమయంలోనే దేశవ్యాప్తంగా లక్షలమంది భక్తులు అయ్యప్పను దర్శించుకుంటారు. మళయాళ కేలండర్ ప్రకారం ఈ సీజన్లో పూజల కోసం నెలకు ఐదు రోజులు మాత్రమే ఆలయం తెరుస్తారు. ఈ సీజన్లో జనవరి 14 మకర విళక్కు వరకు ఆలయానికి రూ.225 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇది గత ఏడాది ఇదే సీజన్లో లభించిన దానికంటే రూ.45 కోట్లు అధికమని మంత్రి వివరించారు. ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం మళ్లిస్తోందన్న ఆరోపణలను ఆయన ఖండిస్తూ ఇక్కడ భక్తుల కోసం సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కోట్లలో ఖర్చు పెడుతోందన్నారు. ఇందులో భాగంగా వివిధ అభివృద్ధి పనులు, నిర్మాణాలకు ఈ సీజన్లో రూ.38 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. సన్నిధానం పరిధిలో ప్లాస్టిక్ బాటిల్స్ను నిషేధించామని, కేరళ వాటర్ అథారిటీ ఔషధపరమైన నీటిని యాత్రికులకు అందిస్తోందని మంత్రి సురేంద్రన్ చెప్పారు. -
నేడు తిరుమలకు జగన్
సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రంలోని లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన పూర్తి భరోసా కల్పించేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఈనెల 6 నుంచి ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా జగన్మోహన్రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం శుక్రవారం రాత్రి తిరుమల వస్తున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నా యకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం దర్శనం పూర్తయ్యాక తిరిగి హైదరాబా ద్ బయలుదేరతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి వివరిం చారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత తిరుమల పర్యటనను, 6న చేపట్టే పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. -
తిరుమలలో శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన.
-
తిరుమలలో శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన
సాక్షి, తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనార్థం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శనివారం తిరుమలకు చేరుకున్నారు. సతీమణి జయంతి పుష్పకుమారి, ఇతర కుటుంబ సభ్యులు, ప్రతినిధులు మొత్తం 19 మందితో కలసి వచ్చారు. పద్మావతి అతిథిగృహాల వద్ద జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఆదివారం తొలి వేకువ 3 గంటలకు సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి పాదాలు దర్శించుకుని.. శనివారం సాయంత్రం శ్రీలంక అధ్యక్షుడు తిరుమల నారాయణగిరిలోని శ్రీవారి పాదాలను దర్శించుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు బెంగళూరు నుంచి రోడ్డుమార్గంలో తిరుమలకు వచ్చిన సందర్భంగా కర్ణాటక, చిత్తూరు, తిరుపతి అర్బన్జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
తిరుమలలో ‘డ్రోన్’ కలకలం
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం డ్రోన్ కెమెరా కలకలం రేపింది. శేషాచలంతోపాటు తిరుమలకొండ మీద ఉద్యాన వనాల అభివృద్ధి కోసం నెల రోజులుగా డ్రోన్ కెమెరాతో అధికారులు సర్వే చేస్తున్నారు. ఆగమ నిబంధనలకు విరుద్ధంగా ఆలయ నాలుగు మాడ వీధులు, సమీప ప్రాంతాలు మినహా మిగిలిన అటవీ, కాటేజీ ప్రాంతాల్లో ఈ సర్వే చేసుకునేందుకు టీటీడీ అనుమతినిచ్చింది. ఏపీ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ నేతృత్వంలో బెంగళూరుకు చెందిన జాతీయ విపత్తుల నివారణ సంస్థ (ఎన్డీఆర్ ఎఫ్) నిపుణుల బృందం ఈ సర్వే నిర్వహిస్తోంది. డ్రోన్ కెమెరాను పక్షి ఢీకొనడంతో సిగ్నల్స్ తెగిపోయి డ్రోన్ కెమెరా స్థానిక శేషాద్రినగర్లోని ఓ చెట్టుపై ఇరుక్కుంది. స్థానికుల సమాచారంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు డ్రోన్ని స్వాధీనం చేసుకున్నారు. -
అటు బ్రహ్మోత్సవం.. ఇటు దుర్గా పూజలు
సాక్షి, తిరుమల/ విజయవాడ : తిరుమలలో బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేత్రపర్వంగా స్వామివారి రథోత్సవం జరుగుతోంది. సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రి అశ్వవాహన సేవ జరగనుంది. ఈ అశ్వవాహన సేవతో వాహన సేవలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దయ్యాయి. దివ్యదర్శనంలో కూడా టోకెన్లను నిలిపేశారు. రేపు పుష్కరిణిలో స్వామివారి చక్రస్నానం జరగ నుంది. దీంతో రేపు బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఘనంగా దుర్గా పూజలు దసరా పండుగ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తులు ఫోటెత్తారు. రాజరాజేశ్వరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. దుర్గమ్మ దర్శనానికి రెండు కిలోమీటర్లు భక్తులు బారులు తీరారు. కనక దుర్గమ్మ దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక సాయంత్రం కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవం జరగనుంది. మరోపక్క, విజయవాడ దుర్గ గుడికి వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పీఎన్బీఎస్ బస్టాండ్, కుమ్మరిపాలెం వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. కాలినడక ఎక్కువ కావడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్సవాల చివరి రోజు కావడంతో వీఐపీలు, భవానీ భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. -
నేడే గరుడ వాహన సేవ
-
అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
-
బాడీవోర్న్ కెమెరాలతో నిఘా
తిరుపతి (అలిపిరి) : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ ప్రాంతాల్లో బాడీ వోర్న్ కెమెరాలతో భద్రత పర్యవేక్షిస్తున్నామని టీటీడీ సీవీఎస్ఓ ఆకె రవికృష్ణ అన్నారు. మంగళవారం తిరుమలలోని మీడియా కేంద్రంలో ఆయన మాట్లాడారు. భద్రతకు 25 కెమెరాలను తెప్పించామని, భద్రతా సిబ్బంది వీటిని చొక్కాకు తగిలించుకుని తిరుగుతూ అపరిచిత వ్యక్తులను గుర్తిస్తారని తెలిపా రు. మాడవీధులు, గ్యాలరీల్లో ఇప్పటికే పలుమార్లు తనిఖీలు నిర్వహించామన్నారు. కమాండ్ కంట్రోల్రూం నుంచి సీసీటీవీల ద్వారా భద్రత పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. గరుడసేవకు 40 మంది పోలీసు అధికారులు, 400 మంది హోంగార్డులు అదనంగా విధులు నిర్వహిస్తారన్నారు. గరుడ సేవకు ఏడు వేల వాహనాలను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామన్నారు. తరువాత వచ్చే వాహనాలను తిరుపతిలోని అలిపిరి వద్ద దేవలోక్ ప్రాంగణంలో పార్క్ చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఖాళీ పార్కింగ్ ప్రదేశాలను గుర్తించేందుకు తిరుపతి పోలీసులు బ్రహ్మోత్సవ పార్కింగ్ ట్రాకర్ యాప్ను రూపొందించారన్నారు. ఈ సమావేశంలో పీఆర్వో రవి, ఏపీఆర్వో నీలిమ పాల్గొన్నారు. -
నేడే గరుడ సేవ
సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన గరుడ వాహన సేవ ఊరేగింపు బుధవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభించనున్నారు. రెండున్నర లక్షల మంది భక్తులు తిలకిస్తారని అధికారులు అంచనా. భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటికే తిరుమలలో 2,700 మందితో భద్రతను పటిష్టం చేశారు. అదనంగా 1000 మందిని విధులకు రప్పించారు. 650 టీటీడీ సీసీ కెమెరాలతో పాటు నాలుగుమాడ వీధులు, ముఖ్య కూడళ్లలో మరో 70 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆక్టోపస్ కమాండోలను, ఏఆర్ కమాండో సిబ్బందిని మఫ్టీలో సిద్ధంగా ఉంచారు. ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమీక్ష.. టీటీడీ ఈవో అనిల్కుమార్సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్రావు, టీటీడీ సీవీఎస్వో రవికృష్ణ, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి గరుడవాహన సేవ ఏర్పాట్ల ను మంగళవారం వేర్వేరుగా సమీక్షించారు. తోపులాట, తొక్కిసలాట కు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చా రు. బుధవారం మధ్యాహ్నం నుంచే మాడ వీధుల గ్యాలరీల్లో భక్తులను అనుమతించనున్నారు. మాడ వీధుల్లో 1.80 లక్షల మంది ని అనుమతిస్తారు. మిగిలిన వారిని మాడ వీధుల వెలుపలే కట్టడి చేయనున్నారు. వీరి కోసం భారీ ఎల్సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేశా రు. వీఐపీలు, డ్యూటీ అధికారులు, మీడి యా కూడా సాయంత్రం ఆరు గంటల్లోపే వాహన మండపానికి చేరుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. రెండు ఘాట్రోడ్లలోనూ మంగళవారం అర్ధరాత్రి నుంచి ద్విచక్ర వాహనాలను అనుమతిండం లేదు. ముందు జాగ్రత్త చర్యగా తిరుపతి నుంచే ట్రాఫిక్ను మళ్లించారు. తిరుమలలో కూడా ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వాహనాలను జీఎన్సీ టోల్గేట్ వద్ద నుంచే క్రమబద్ధీకరిస్తున్నారు. తిరుమలలో 7వేల వాహనాలకు పార్కింగ్ ఉంది. ఆ సంఖ్య దాటితే తిరుపతిలోనే నిలిపివేయనున్నారు. పరిమిత సంఖ్యలోనే పాసులు, బ్యాడ్జిలు జారీ చేయాలని నిర్ణయించారు. వీవీఐపీలు, వీఐపీలకు ఒకరికి ఐదులోపే రెండు రకాల బ్యాడ్జిలు అందజేస్తారు. వీరిని వాహనం మండపం కుడివైపున గ్యాలరీల్లోకి అనుమతిస్తారు. ఎడమవైపున టీటీడీ ఉద్యోగ, పోలీసులు, మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులకు అందజేస్తారు. వీరిని ఆస్థా న మండపం కొత్త బ్రిడ్జి నుంచి అనుమతిస్తారు. ⇒ శ్రీవారి నిత్యాన్నప్రసాద సముదాయం, క్యూకాంప్లెక్స్లు, క్యూలు, నాలుగు మాడ వీధుల్లో రెండు లక్షల మందికి ఉచిత భోజన సౌకర్యం కల్పించనున్నారు. ⇒ తిరుమలలో పలు ప్రాం తాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 108 అంబులెన్స్ సర్వీసులు కూడా పనిచేస్తున్నాయి. -
సర్వభూపాల వాహనంపై సర్వజగద్రక్షకుడు
తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం కల్పవృక్షం, రాత్రి కొత్త సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు తిరు వీధుల్లో విహరించారు. నాలుగో రోజు భక్తుల సందడి పెరిగింది. గ్యాలరీలు నిండుగా కనిపించా యి. సాయంత్రం శ్రీవిల్లిపుత్తూరు నుంచి పుష్పమాలలు, చెన్నయ్ నుంచి గొడుగులు కానుకగా అందాయి. సహస్ర దీపాలంకార సేవలో స్వామి వేయి నేతి దీపాల వెలుగులో భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవల ముందు సంగీత, సాంస్కృతిక కళా బృందాల విభిన్న ప్రదర్శనలు భక్తులను కట్టిపడేశాయి. అఘోరా నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహనంపై తిరువీధుల్లో విహరించారు. చర్నాకోల్ చేతబట్టి రాజమన్నార్ రూపధారిగా భక్తులను కటాక్షించారు. వాహన సేవకు ముందుకళా బృందాల ప్రదర్శనలు భక్తులను కట్టిపడేశాయి. మధ్యాహ్నం ఆలయంలో స్నపన తిరుమంజనం కనులపండువగా జరిగింది.రాత్రి ఉభయదేవేరులతో సర్వభూపాల వాహనంపై కొలువుదీరి తిరువీధుల్లో విహరించారు. అదనపు బందోబస్తు తిరుపతి (అలిపిరి) : గరుడోత్సవానికి అదనంగా 1000 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు అనంతపురం రేంజ్ డీఐజీ జె.ప్రభాకర్ రావు వెల్లడించారు. తిరుమల రాంభగీచ విశ్రాంతి గృహాల సముదాయం ఎదుట ఏర్పాటు చేసి పోలీసు కంట్రోల్ రూంలో మంగళవారం ఆయన తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతితో కలిసి గరుడసేవ భద్రతపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ గరుడ సేవ రోజున తిరుమలలో ఎటువంటి అవాంచనీయ సంఘటన చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్, క్రైమ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు సేవలందించాలని కోరారు. గరుడ సేవ రోజు ట్రాఫిక్ సమస్య తలెత్తితే ఘాట్రోడ్లలో ప్రయాణించే వాహనాలను తిరిగి తిరుపతికి వెనక్కు పంపుతామని తెలిపారు. ♦ విస్తృత తనిఖీలు తిరుపతి అర్బన్: శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టమైన గరుడసేవను పురస్కరించుకుని మంగళవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు పటిష్ట తనిఖీలు చేపడుతున్నట్టు అలిపిరి ఏవీఎస్ఓ దాసరిదండు గంగరాజు తెలిపారు. డోర్ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లతో పాటు భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి తిరుమలకు పంపుతున్నామన్నారు. కాలిబాట మెట్ల మార్గాలు, అలిపిరి పాత చెక్పాయింట్ పరిసరాల్లో విస్తృత తనిఖీ లు చేస్తునట్లు తెలిపారు. అనామానాస్పద వ్యక్తలు, గుర్తు తెలియని లగేజీలు కనిపిస్తే టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సులు, నాలుగు చక్రాల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతామని తెలిపారు. ♦ నేడు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ ♦ 3.70 లక్షల మందికి ప్రసాదాలు సిద్ధం తిరుపతి (అలిపిరి): గరుడ సేవకు విచ్చేసే భక్తకోటికి నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు టీటీడీ అన్నదాన డిప్యూటీ ఈఓ వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు ఉదయం 8 నుంచి రాత్రి ఒంటి గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదం పంపిణీ జరుగుతుందన్నారు. 3.70 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. గ్యాలరీల్లోని భక్తులకు 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు. బిస్బెల్లా బాత్, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, ఉప్మా, కాఫీ, పాలు అందిస్తామని తెలిపారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్, సీఆర్ఓ, రాంభగీచా విశ్రాంతి గృహాల వద్ద ఉన్న ఫుడ్ కౌంటర్ల ద్వారా రోజుకు 40 వేల మందికి అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని పార్కింగ్ ప్రదేశాల్లో భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 1985లో రోజుకు 2వేల మందితో అన్నప్రసాద వితరణ ప్రారంభించి నేడు 1.5 లక్షల మందికి అన్నప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో టీటీడీ క్యాటరింగ్ అధికారి శాస్త్రి, పీఆర్వో రవి, ఏపీఆర్వో నీలిమ పాల్గొన్నారు. నేటి గరుడోత్సవానికి నిమిషానికి 4 బస్సులు ♦ 24గంటలు ఘాట్ రోడ్లలో రాకపోకలు ♦ టూవీలర్లకు నో ఏంట్రీ తిరుపతి సిటీ: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగే గరుడ సేవను పురస్కరిం చుకుని∙నిమిషానికి 4 బస్సులను నడిపేలా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. గరుడ సేవకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. బుధవారం తెల్లవారు జామున నుంచే కావాల్సినన్ని బస్సులను సిద్ధం చేశారు. గరుడ సేవను పురస్కరించుకుని తిరుమల ఘాట్ రోడ్లలో 24 గంటల పాటు బస్సులు రాకపోకలు కొనసాగించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి గురువారం తెల్లవారు జాము వరకు 525 బస్సులతో 4152 ట్రిప్పులు నడిపేలా ఆర్ఎం నిర్ణయించారు. గరుడ సేవను పురస్కరించుకుని మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచే ద్విచక్ర వాహనాలను తిరుమలకు రద్దు చేశారు. తిరుమలకు వెళ్లే ద్విచక్ర వాహనదారులు అలిపిరి, బాలాజీ లింక్ బస్ స్టేషన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్లో పెట్టాలి. అక్కడ్నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది. -
తిరుమలలో ఫలపుష్ప ప్రదర్శన
-
స్థానిక కోటాకు గోవిందా..
♦ తిరుపతి వాసులపై ప్రభుత్వానికి చిన్నచూపు ♦ శ్రీవారి దర్శన భాగ్యానికి దూరం చేసిన వైనం ♦ ప్రతినెలా మొదటి మంగళవారానికి మంగళం ♦ మూడునెలలకోసారీ దొరకని దర్శనం ♦ మహతి నుంచి తిరుమలకు బుకింగ్ కౌంటర్ ♦ స్థానికుల కోటాపై దళారుల కన్ను రోజూ ఎదురుగా సాక్షాత్కరిస్తుంది. ఏడుకొండలెక్కి దర్శించుకుందామంటే గంటల తరబడి క్యూలో వేచి ఉండాలి. తిరుమల పాదాల చెంత ఉండి కూడా స్వామి దర్శనం తిరుపతి వాసులకు కష్టమే. గతంలో పెట్టిన ‘స్థానిక’ కోటాకు ప్రభుత్వం మంగళం పాడేయడంతో వెంకన్నను దర్శించుకోవాలంటే దూర ప్రాంతాల భక్తుల్లానే నిరీక్షించాల్సిందే. పైగా తిరుపతి వాసుల కోటాపై దళారులు కన్నేసి అమ్మేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, తిరుపతి: తిరుమలేశుని దర్శన భాగ్యానికి తిరుపతి వాసులను ప్రభుత్వం దూరం చేస్తోంది. స్థానికులకున్న దర్శనం కోటాకు కోతపెట్టింది. ప్రతినెలా మొదటి మంగళవారం వీరికి కేటాయించిన శ్రీవారి దర్శనం కోటాను మూడునెలలకోసారిగా మార్చింది. ఇప్పుడు ఆ అవకాశానికి కూడా ప్రభుత్వం, టీటీడీ మంగళం పాడేందుకు రంగం సిద్దం చేస్తున్నాయని తెలిసింది. తిరుమలకు ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో స్థానికులకు దర్శనం కష్టంగా మారింది. తమ కోసం ప్రత్యేకంగా కోటా కల్పించాలని వీరంతా డిమాండ్ చేశారు. ఫలితంగా 2013 బ్రహ్మోత్సవాల అనంతరం స్థానికులకు దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి తీర్మానించింది. తిరుపతిలో నివాసం ఉండేవారికి (ఆధార్ ఆధారంగా) ప్రతినెలా మొదటి మంగళవారం ప్రత్యేకంగా దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని మహతి ఆడిటోరియంతో పాటు తిరుమలలో స్థానికుల కోసం ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశారు. టీటీడీ మొదటి మంగళవారం ఐదు సేవలకు అవసరమైన టికెట్లు ఇచ్చేవారు. మొదట్లో కొద్దిరోజులు 5వేల మంది వరకు స్థానికులు శ్రీవారిని దర్శించుకునేవారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2015 నుంచి స్థానికుల దర్శనం కోటాలో సమూల మార్పులు చేయటం ప్రారంభించారు. ప్రతినెలా మొదటి మంగళవారం భక్తుల సంఖ్యను పరి మితం చేశారు. వేల నుంచి వందలకు కుదించారు. మొదటి మంగళవారంలో 600 టికెట్లు సుప్రభాతం, నిజపాద దర్శనం, తిరుప్పావడ, సహస్రకళసాభిషేకం, అష్టదళపాదపద్మారాదన సేవ కోసం ఇచ్చేవారు. కొన్నాళ్లకు ప్రతి మూడునెలల కొకసారి అంటూ నిబంధన పెట్టారు. స్థానికుల కోటా ఎత్తివేత? ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో స్థానిక దర్శనం కోటాను ఎత్తేయడానికి టీటీడీ సిద్ధమైనట్లు ఆరోపణులు వినిపిస్తున్నాయి. మహతిలో ఉన్న కౌంటర్ను తిరుమలలోని జేఈఓ కార్యాలయానికి మార్చారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడైనా స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారా? అంటే అదీ లేదని మండిపడుతున్నారు. గతంలో కరెంట్ బుకింగ్తో పాటు ఆన్లైన్లో కూడా టికెట్లు ఇచ్చేవారని, ప్రస్తుతం అవేమీ లేకుండా చేసినట్లు చెబుతున్నారు. ప్రతి మూడునెలల కొకసారి వచ్చే మొదటి మంగళవారంలో మొక్కుబడిగా 100 లేదా 120 టికెట్లు మాత్రం స్థానికులకు ఇచ్చి మిగిలినవి కొందరు దళారులు అమ్మి సొమ్ముచేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీటీడీ అధికారులు స్థానికుల దర్శన కోటా సేవా టికెట్లను సైతం వీఐపీలకు కేటాయించి తిరుపతి వాసులకు శ్రీవారి దర్శన భాగ్యం లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం, టీటీడీ అధికారులు స్పందించి స్థానిక కోటాను కొనసాగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. -
దళారుల బస
►టీటీడీ వసతి సముదాయాల్లో దందా ►50 శాతం కరెంటు బుకింగ్లో చేతివాటం ►పట్టించుకోని టీటీడీ అధికారులు వేసవి సెలవుల రద్దీతో తిరుమల, తిరుపతిలో టీటీడీ గదులు సకాలంలో దొరక్క వందలాది మంది యాత్రికులు రోజూ అవస్థలు పడుతున్నారు. అయితే తిరుపతి వసతి సముదాయాల్లో మాత్రం కొందరు ఉద్యోగులు దళారులతో దందా నడిపిస్తున్నారు. దీంతో యాత్రికులు ఆర్థికంగా అవస్థలు ఎదుర్కొంటున్నారు. తిరుపతి అర్బన్: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే యాత్రికుల్లో సగం మందికి పైగా తిరుపతిలోని టీటీడీ వసతి సముదాయాల్లో బస చేస్తుంటారు. అయితే ఈ సముదాయాల్లో 50 శాతం గదులను ఆన్లైన్, మరో 50 శాతం గదులను కరెంటు బుకింగ్ విధానంలో కేటాయిస్తుంటారు. ఇందులో కరెంటు బుకింగ్ విధానం సముదాయాల్లోని కౌంటర్ సిబ్బందికి, దళారులకు పంట పండిస్తోంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్కు ఎదురుగా ఉన్న విష్ణునివాసం వసతి సముదాయంలో కొత్త మంచాలు, పరుపులు ఉండడంతో ఎక్కువ మంది యాత్రికులు ఇక్కడ బస చేసేందుకే ఆసక్తి చూపుతుంటారు. రైళ్లల్లో వచ్చే యాత్రికులు సరాసరి విష్ణునివాసం సముదాయంలోకి ప్రవేశిస్తుంటారు. అయితే టీటీడీ సముదాయాల్లో అమలు చేస్తున్న క్యూ పద్ధతి అవస్థలతో పడలేక దళారులను ఆశ్రయించి త్వరితగతిన గదులు పొందుతుంటారు. ముందస్తు ఒప్పందం దళారుల అవతారమెత్తే వ్యక్తులు నేరుగా టీటీడీ వసతి సముదాయాల్లోని కొందరు ఉద్యోగులు, కౌంటర్ సిబ్బందితో ముందస్తుగా చేసుకునే ఒప్పందం మేరకే యాత్రికులకు గదులను తీసి ఇస్తుంటారు. ఈ తరుణంలో యాత్రికుల నుంచి గదుల అద్దెపై సుమారు రూ.200 నుంచి రెండింతలు అదనంగా తీసుకుంటున్నారన్న విమర్శలు ఎక్కువగా వినబడుతున్నాయి. విష్ణునివాసం వసతి సముదాయంలో 204 ఏసీ గదులు, 204 నాన్ ఏసీ గదులతో పాటు 24 డార్మిటరీ హాళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రూ.300 నుంచి రూ.1300 వరకు టీటీడీ అద్దెలను నిర్ణయించింది. అయితే దళారులు యాత్రికుల హుందాతనం బట్టి రూ.500 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీటిన్నింటిపై వసతి సముదాయం అధికారులకు, విజిలెన్స్ సిబ్బందికి తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినబడుతున్నాయి. కాషన్ డిపాజిట్ పేరుతో టోకరా టీటీడీ ఆధ్వర్యంలో గదుల కేటాయింపునకు కాషన్ డిపాజిట్ విధానాన్ని కొన్ని నెలల క్రితమే రద్దు చేసింది. అయితే తిరుపతిలోని వసతి సముదాయాల్లో బస చేసే యాత్రికులకు చాలామందికి డిపాజిట్ రద్దు విషయం చెప్పకుండానే దళారులు రెండింతల అద్దెలను తీసుకుని గదులు తీసి ఇచ్చి, తప్పించుకుంటున్నారు. తీరా యాత్రికులు గదులు ఖాళీ చేసిన సమయంలో కాషన్ డిపాజిట్ కోసం వెళితే అసలు నిజాలు బయటపడి లబోదిబోమంటున్నారు. ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా ఉన్న శ్రీనివాసం వసతి సముదాయంలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమాత్రం లేదు. ఇక్కడ తోపుడు బండ్ల నిర్వాహకులు కూడా దళారుల అవతారం ఎత్తుతున్నారు. ఇక్కడ అధికారులతో సంబం«ధం లేకుండా కొందరు ఉద్యోగులు గదుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. విజిలెన్స్కు నివేదిస్తాం కరెంటు బుకింగ్ గదులను దళారులకు ఇస్తూ మా కౌంటర్ సిబ్బంది ఎవరైనా అక్రమాలకు పాల్పడితే టీటీడీ విజిలెన్స్ అధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటాం. ఆ విధంగా ఎవరైనా రూముల కేటాయింపు కోసం అధికంగా డబ్బులు డిమాండ్ చేసినా, బయట వ్యక్తులు టీటీడీలో గదులు తీసిస్తామని చెప్పినా యాత్రికులు నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలి. -
శ్రీవారికి భక్తితో..
ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ సతీసమేతంగా మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేశారు. ఆయనతో కరచాలనం చేయడానికి, ఫొటోలు దిగడానికి అభిమానులు ఆసక్తిచూపారు. – సాక్షి, తిరుమల -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో సినీ నటుడు బ్రహ్మానందం, సినీ నటి మంచు లక్ష్మి దంపతులు, గాయకులు సునీత, శ్రీకృష్ణ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూప్రసాదాలు అందజేశారు. ‘ఒక్కమాట శరణనని..’ అన్న తాళ్లపాక అన్నమాచార్యులవారి సంకీర్తనను గాయని సునీత తన మధుర స్వరంతో ఆలపించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ కీర్తన ఆలపించారు. ఎస్వీబీసీ చానల్లో ఇప్పటికే ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ 80 ఎపిసోడ్లు చేశామని, వచ్చే నెలలో రెండోదశ ప్రారంభిస్తామని చెప్పారు. ట్రెండ్కు తగ్గట్టుగా యూట్యూబ్ ద్వారా వీడియోలతో కొత్త పాటల్ని అందిస్తామన్నారు. అన్ని రకాల ప్రేక్షకులను ఆకుట్టుకునేందుకు నాణ్యతతో కూడిన సరికొత్త పాటలతో ఆల్బమ్ను యూ ట్యూబ్ ద్వారా విడుదల చేసేందుకు కృషి చేస్తానని సునీత చెప్పారు. -
తిరుమలలో భక్తుల అదృశ్యం
సాక్షి, తిరుమల : తిరుమలలో వేర్వేరు ఘటనలో ఇద్దరు భక్తులు అదృశ్యమయ్యారు. ఈ నెల 9వ తేదీన శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద మహారాష్ట్రకు చెందిన గోపాల్రావ్ (65) తప్పిపోయాడు. అలాగే, ఈ నెల 13న మాధవ నిలయం వద్ద అనంతపురం జిల్లా తనకల్లు మండలం కదిరి సమీపంలోని రెడ్డివారిపల్లికి చెందిన బి.సత్యనారాయణ (51) తప్పిపోయాడు. వారి ఆచూకీ లభించలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. -
తిరుమలలో పోలీసులపై బండబూతులు
తిరుపతి: తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బంధువులమంటూ కొందరు రెచ్చిపోయారు. పోలీసులను సైతం వారు లెక్క చేయలేదు. ఒక వ్యక్తి అయితే.. 'నేను జడ్జీ కుమారుడిని. నన్ను నడిచి వెళ్లమంటావా' అంటూ పోలీసుల మీదకుపోయి వారిపై చేయి చేసుకునేంత పని చేశారు. ఇంకా చెప్పాలంటే గుండాగిరికి దిగి అనకూడని మాటలు అన్నారు. కానిస్టేబుల్ను దుర్భాషలాడటంతోపాటు సీఐని కూడా తోసేశారు. 'నువ్వేమన్న చేయగలవా.. మేం ఎవరో తెలుసా' అంటూ సినిమా డైలాగ్లు పేల్చారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిని రికార్డు చేస్తున్న మీడియావాళ్లను కూడా ఇష్టమొచ్చినట్లు తిట్టారు. వివరాల్లోకి వెళితే.. ముక్కోటి ఏకాదశి కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. ఈ సందర్బంగా శంకుమెట్ట సర్కిల్ వద్ద ట్రాఫిక్ను పక్కకు మళ్లించారు. ఇంతలో ఓ కారులో వచ్చిన వ్యక్తులు తాము చైర్మన్ బంధువులం అని, తమను వెళ్లనివ్వాలని, జేఈని కలవాలని అడిగారు. రద్దీ ఎక్కువగా ఉన్నందున కారును పక్కు పార్కింగ్ చేసి నడిచి వెళ్లండని అన్నారు. దాంతో వారంతా ఇక దౌర్జన్యానికి దిగారు. వరప్రసాద్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్పై దుర్భాషలాడారు. అది చూసి సీఐ శ్రీనివాసులు వెళ్లగా ఆయనపైకి కూడా దూసుకెళ్లారు. అంతుచూస్తామంటూ పెచ్చరిల్లిపోయారు. ఈ సంఘటన అనంతరం మీడియాతో సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ 'ఓ నలుగురు వ్యక్తులు టీటీడీ చైర్మన్ బంధువులమంటూ వచ్చారు. పార్కింగ్ చేసి వెళ్లమన్నందుకు దుర్భాషలాడారు. మా కానిస్టేబుల్ను తిడుతుంటే నేను వెళ్లగా.. నువ్వేం చేస్తావ్ అంటూ తోసేశారు. ఈ విషయం డీఎస్పీకి చెప్పగా నేను మాట్లాడుతానులే అని చెప్పి పంపించేశారు' అని చెప్పారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ స్పందిస్తూ 'నేను జడ్జీ కొడుకును నడిచి పోవాలా అంటూ ఒకతను మీదకొచ్చాడు. నలుగురైదుగురు కొట్టబోయారు.. ఎవరు ఆపినా వారు ఆగలేదు' అని చెప్పాడు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు మూడు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. సోమవారం స్వామివారిని 82,347 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వివరించారు. -
తిరుమలలో భక్తులు రద్దీ సాధారణం
చిత్తూరు: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా, కాలినడకన వెళ్లే భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 53, 512మంది భక్తులు దర్శించుకున్నారు. -
తిరుమలలో తక్కువగానే భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం ఉదయం స్వామి దర్శనానికి సర్వదర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం తీసుకుంటోంది. మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలి నడక భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి మంగళవారం ఉదయం ఏడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతుండగా కాలినడక భక్తులకు రెండు గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం గంటలోపే లభిస్తోంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఏడుకొండలవాడి దర్శనానికి శనివారం ఉదయం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట, కాలినడక భక్తులకు ఒక గంట సమయం పడుతోంది. శుక్రవారం వెంకటేశ్వర స్వామిని 54, 045 మంది భక్తులు దర్శించుకున్నారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుపతి/శ్రీశైలం: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతానికి రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతుండగా నడకదారి భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. ఆదివారం స్వామివారిని మొత్తం 62,537మంది భక్తులు సందర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మరోపక్క, కార్తీక సోమవారం సందర్భంగా శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉచిత దర్శనానికి ఐదుగంటలు, శీఘ్ర దర్శనానికి రెండు గంటలు సమయం పడుతుంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీనివాసుడి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం, కాలిబాట భక్తులకు 3గంటల సమయం పడుతోంది. వర్షాల కారణంగా అక్కడక్కడా తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతుండటంతో దెబ్బతిన్న ఘాట్ రోడ్డును నిపుణుల బృందం పరిశీలించనుంది. దెబ్బతిన్న ఘాట్ రోడ్డుకు చేయాల్సిన మరమ్మతులు, ప్రత్యామ్నాయాలపై నివేదిక ఇవ్వనుంది. ఆకాశ గంగ, గోగర్భం డ్యామ్లు నిండటంతో నీటిని కిందికి విడుదల చేశారు. పాప వినాశనం కేపీ డ్యాం లో 90శాతం నీరు చేరింది. -
విరిగిపడుతున్న కొండచరియలు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. ప్రస్తుతం ఆరు కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం, నడకదారిన వెళ్లే భక్తులకు మూడుగంటల సమయం పట్టనుంది. మరోపక్క, కుండపోత వర్షాల కారణంగా తిరుమలలో వర్షపు నీరు వరదలా పారుతుంది. తిరుమల ఘాట్ రోడ్డులో మరోసారి కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో ఆ రోడ్డులో అధికారులు అప్రమత్తత ప్రకటించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టీటీడీ అధికారులు దగ్గరుండి ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. కొండ చరియల కారణంగా ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఓ వైపు వర్షం మరోవైపు కొండచరియల కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిపోయింది. మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి నాలుగు గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు మూడుగంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం తిరుమలలో రెండు రోజులుగా వర్షాలు పడటం కూడా ఇందుకు ఒక కారణమైంది. మరోపక్క, తిరుమల రెండో ఘాట్ లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తొమ్మిదో కిలోమీటర్ వద్ద కొండ చరియలు విరిగిపడటంతో టీటీడీ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని టీటీడీ సూచించింది. -
తిరుమల ప్రధాన అర్చకుడికి కోపమొచ్చింది
-
తిరుమల ప్రధాన అర్చకుడికి కోపమొచ్చింది
తిరుపతి: తిరుమలలో మరోసారి అర్చకులు అధికారుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సింహవాహన ఊరేగింపులో ఆలయ పేష్కర్పై ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మండిపడ్డారు. వాహనాల డ్యూటీలను ప్రధాన అర్చకులకు తెలియకుండా మారుస్తారా అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇలా చేయడం తనను అవమానించినట్లే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఒకసారి ఓ అర్చకుడికి డ్యూటీ అప్పగించి నిర్ణయం తీసుకున్నాకా ఎలా మారుస్తారని ప్రశ్నించారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఊరేగిస్తున్న ఆయా వాహనాలకు ప్రత్యేక అర్చకులకు డ్యూటీలు వేశారు. అయితే, శుక్రవారం ఊరేగించిన వాహనాలకు కూడా గతంలో విధులు నిర్వర్తించిన అర్చకులే తిరిగి కనిపించడంతో రమణ దీక్షితులు అసహనం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాగే రమణ దీక్షితులు వేసిన డ్యూటీలను పేష్కార్ అధికారులు మార్పులు చేశారు. -
తిరుమలలో భారీ వర్షం
-
వైభవంగా శ్రీవారి బహ్మోత్సవాలు
-
బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత
తిరుమల: గరుడ వాహనానికి అదనంగా 1500 మందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి అదనపు ఎస్పీ గోపీనాథ్ అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల, తిరుపతిలో రెండు డ్రోన్ కెమెరాలు టీటీడీ ఏర్పాటు చేయనుంది. గరుడ వాహనం ముందు రోజు నుతంచి తిరుమల ఘాట్ రోడ్డుపై బైక్లను నిలిపివేస్తామని గోపినాథ్ చెప్పారు. తిరుమల బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆయన ముఖ్య నిఘా అధికారి నాగేంద్ర కుమార్ సమీపక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు మొత్తం 4,500మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తిరుమల గరుడ వాహనాన్ని పిల్లలు వృద్ధులు రాకుండా చూసుకుంటే మంచిదని ఈ సందర్భంగా ఆయన సూచించారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. సర్వదర్శనానికి 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి దాదాపు పదిగంటలు పడుతోంది. కాలినడక దర్శనానికి 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉండగా.. వీరు తిరుమలేశుడిని దర్శించుకునేందుకు ఏడుగంటల సమయం పడుతుంది. వరుస సెలవులు కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ పోటెత్తుతుంది. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో తిరుమలలో భద్రత పెంచారు. -
కన్నుల పండువగా పద్మావతి పరిణయోత్సవం
తిరుమల: వైకుంఠపురంగా పిలివబడే గోవిందుని తిరుమలలో సోమవారం పద్మావతి పరిణయోత్సవం కన్నులపండువగా జరిగింది. వివిధ రకాల ఫలాలు, అబ్బురపరిచే అందాలతో కూడిన పుష్పాలు సోయగాలతో పరిణయోత్సవ వేదికను తీర్చిదిద్దారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు శ్రీవారి ఉత్సవర్లను మండపంలో కొలవుదీర్చి వైభవంగా ఉత్సవాన్ని నిర్వహించారు. టీటీడీ ఉద్యానవనంలో ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పద్మావతి పరిణయోత్సవ వేదికను శోభాయమానంగా తీరిదిద్దటం ఆనవాయితీ. గతంలో పసుపు-కుంకుమ మండపం, గాజుల మండపం, రంగురాళ్లు మండపం వంటి వివిధ నమూనలతో అలంకరించారు. అలాగే ఈ ఏడాది కూడా చెరుకు గడలు, మామిడి కాయలు- ఆకులు, కొబ్బరికాయలు, ఆపిల్, పైన్ ఆపిల్, దానిమ్మ, బత్తాయి పండ్లు, మొక్కజొన్న కుంకులు, రోజా, లిల్లీ, చామంతితో పాటు జాతుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కార్యక్రమంలో చివరిలో బాణసంచా వెలుగులు భక్తులను ఆకట్టుకున్నాయి. -
తిరుమలలో పెళ్లిళ్ల సందడి
సాక్షి,తిరుమల: తిరుమలలో బుధవారం పెళ్లిళ్ల సందడి నెలకొంది. ఇక్కడి టీటీడీ కల్యాణ వేదిక, కాటేజీలు, ప్రైవేట్ మఠాల్లో 200 పెళ్లిళ్లు దాకా జరిగాయి. మన్మథనామ సంవత్సరం వైశాఖమాసం బుధవారం రోహిణీ నక్షత్రం మిథునలగ్నం ఉదయం 10.40 గంటలకు ఈ పెళ్లిళ్లు జరిగాయి. తిరిగి అర్ధరాత్రి తర్వాత గురువారం వేకువజాము మకరలగ్నంలో 01.02 గంటలు, తెల్లవారుజామున మీనలగ్నంలో 4 గంటలకు మరో 50 వివాహాలు జరగనున్నాయి. ఈ పెళ్లిళ్లతో తిరుమలలో ఎక్కడ చూసినా కొత్త జంటల సందడి కనిపించింది. పెళ్లి తర్వాత శ్రీవారి దర్శనం కోసం కొత్త జంటలు క్యూలో వేచి ఉండడం కనిపించింది. -
జోరుగా శ్రీవారి డాలర్ల విక్రయాలు
సాక్షి, తిరుమల: అక్షయ తృతీయ సందర్భంగా మంగళవారం తిరుమలలో శ్రీవారి బంగారు, వెండి డాలర్ల అమ్మకాలు జోరుగా సాగాయి. సాయంత్రం 6 గంటల వరకు సుమారు రూ. 30 లక్షల విలువచేసే డాలర్ల అమ్మకాలు జరిగాయి. రూ. 26,020 విలువచేసే 10 గ్రాముల బంగారు డాలర్లు, రూ. 13,225ల విలవచేసే 5 గ్రాముల బంగారు డాలర్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. రూ. 5,485ల ధరతో విక్రయించే 2 గ్రాముల బంగారు డాలర్ల స్టాకు లేవు. రూ. 850ల విలువచేసే 10 గ్రాముల వెండి డాలర్లు, రూ. 475ల విలువైన 5 గ్రాముల వెండి డాలర్లూ అమ్ముడుపోయాయి. రూ. 275 ధరతో విక్రయించే 3 గ్రాముల వెండి డాలర్లు స్టాకు లేవు. అక్షయ తృతీయ రోజున శ్రీవారి బంగారు డాలర్లు కొనుగోలు చేద్దామని వస్తే తక్కువ ధరతో ఉన్న డాలర్లు అందుబాటులో తీసుకురావడంలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం చేశారని భక్తులు ధ్వజమెత్తారు. అలాగే, డాలర్ల విక్రయ కేంద్రం కూడా ఆలయం ముందు భాగం నుంచి లడ్డూ కౌంటర్ల వద్దకు మార్చడంతో అమ్మకాలు తగ్గినట్టు సమాచారం. -
శ్రీవారి సేవలో వైఎస్ జగన్
సంప్రదాయ వస్త్రాలతో దర్శనానికి.. సాక్షి, తిరుమల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి పాదాల వద్ద ఉన్న తులసి, ప్రసాదాలను జగన్కు అందజేశారు. అనంతరం ఆయన వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఆ తర్వాత నృశింహస్వామిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా, జేఈవో శ్రీనివాసరాజు పట్టువస్త్రంతో సత్కరించి లడ్డూ, ప్రసాదాలు అందజేశారు. డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ శ్రీవారి తీర్థ, అన్న ప్రసాదాలను అందజేశారు. బెల్లం పొంగలి, మిరియాల పొంగలిని వైఎస్ జగన్ స్వీకరించారు. జగన్ శ్రీవారిని దర్శించుకున్న సందర్భంలో సంప్రదాయ పట్టువస్త్రాలు ధరించారు. పట్టుపంచె, లేత తెలుపు, చారల చొక్కా ధరించి మెడలో పట్టు ఉత్తరీయం వేసుకున్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని.. ‘రాష్ర్ట ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించాను’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి అనృ్నరు. శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం వెలుపలకు వచ్చిన ఆయనను విలేకరులు ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు: చెవిరెడ్డి దేవుడి సేవలో ఉన్నవారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్పష్టం చేశారు. హిందూయేతరులు శ్రీవారిని దర్శించుకునే సమయంలో స్వామివారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉందన్న ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. ‘‘ఈ రాష్ట్రాన్ని పరిపాలించినంతకాలం వైఎస్ రాజశేఖరరెడ్డి క్రమం తప్పకుండా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తి విశ్వాసాలతో ఆయన వచ్చినన్నిసార్లు ఏ ముఖ్యమంత్రి కూడా తిరుమలకు రాలేదు. చిన్నతనం నుంచి తండ్రితోపాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేకమార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. దేవుడి సేవలో ఉన్నవారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని ఆయన వివరణ ఇచ్చారు. జగన్మోహన్రెడ్డి శ్రీవారి ఆలయంలోకి చెప్పులు వేసుకెళ్లారని గాలి ముద్దుకృష్ణమనాయుడు అబద్ధపుకూతలు కూశారని, ఇకనైనా విజ్ఞతతో వ్యవహరించాలని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. గుడిలోకి జగన్ చెప్పులు వేసుకుని వెళ్లినట్లు టీటీడీ సిబ్బంది, విజిలెన్స్ అధికారులు ఒక్కరు చెప్పినా ఏ శిక్షకైనా జగన్ సిద్ధమేనన్నారు. -
వీఐపీలకే ‘ఉత్తర’ దర్శనం
సాక్షి, తిరుమల: పర్వదినాల్లో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. అలాంటి ముక్తి వీఐపీలకే లభించేలా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి, అధికారులు వ్యవహరిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో సామాన్య భక్తుల బస, దర్శన సౌకర్యాలు ఏమాత్రం పట్టించుకోకుండా.. ఉన్నత వర్గాలకే ఎర్రతివాచీ స్వాగతం పలికేందుకు పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం నిమగ్నమైపోయింది. ఈ నెల 11వ తేదీ వైకుంఠ ఏకాదశి, 12వ తేదీ ద్వాదశిలో మాత్రమే తిరుమల ఆలయంలోని వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారం) తెరిచి భక్తులను అనుమతిస్తారు. ఈ పర్వదినాల్లో శ్రీవారిని దర్శించి, వైకుంఠ ద్వారంలో ప్రదక్షిణ చేసేందుకు వీఐపీలు పోటెత్తుతున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన సుమారు 200 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 20 మంది ఎంపీలు, 200 మందికి పైగా కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, మరో 100 దాకా న్యాయవిభాగం నుంచి వైకుం ఠ దర్శనం కోసం లేఖలు అందాయి. వీరేకాక తమ బంధు గణాలు కూడా వేల సంఖ్యలోనే తరలివస్తున్నట్టు లేఖలు అందుతున్నాయి. ఇదిలాఉంటే, ప్రముఖుల కోసం గురువారం 5 వేల గదులను బ్లాక్ చేయగా శుక్రవారం ఈ సంఖ్య ఏడు వేలకు పెరిగే అవకాశం ఉంది. వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు మంచులో బస కష్టాలు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏర్పాట్లు పూర్తి: జేఈవో శ్రీనివాసరాజు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తరలివచ్చే భక్తులకు బస, శ్రీవారి దర్శన ఏర్పాట్లు పూర్తిచేశామని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. వీఐపీ దర్శనం అర్ధరాత్రి 1.45 గంటల నుంచి ఉదయం 7 వరకు, ఆ తర్వాత సర్వదర్శనం, కాలినడక భక్తులను అనుమతిస్తామన్నారు. కాలిబాట భక్తులకు 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి దర్శన టికెట్లు ఇస్తామన్నారు. కాగా, శ్రీవారి దర్శనానికి బుధవారం ఐదు గంటల సమయం పట్టింది. ధార్మిక పరీక్షల తేదీ మార్పు తిరుపతి, న్యూస్లైన్: టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న 31వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల తేదీని ఫిబ్రవరి 2 నుంచి 8వ తేదీకి మార్పు చేసినట్లు టీటీడీ పీఆర్వో రవి తెలిపారు