తిరుమలలో యువతిపై ఎలుగుబంటి దాడి | Woman Attacked By Bear In Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో యువతిపై ఎలుగుబంటి దాడి

Published Mon, Jul 15 2019 6:20 PM | Last Updated on Mon, Jul 15 2019 7:17 PM

Woman Attacked By Bear In Tirumala - Sakshi

సాక్షి, తిరుపతి : తిరుమలలో యువతిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఆమె కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను అశ్విని ఆస్పత్రికి తరలించారు. టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి బాధితురాలిని పరామర్శించారు. కాగా గాయపడిన యువతి తెలంగాణకు చెందిన  విజయలక్ష్మీగా పోలీసులు గుర్తించారు.  భూగర్భ డ్యాం వద్ద స్నానం చేసి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ఆమె పేర్కొందని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోందని వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement