తిరుమలలో కిడ్నాప్‌ కలకలం | Three Months Old Boy Kidnapped In Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కిడ్నాప్‌ కలకలం

Published Sun, Mar 17 2019 1:41 PM | Last Updated on Sun, Mar 17 2019 1:46 PM

Three Months Old Boy Kidnapped In Tirumala - Sakshi

సాక్షి, తిరుమల : : మూడు నెలల బాలుడు కిడ్నాప్‌ అయిన ఘటన తిరుమలలో కలకలం రేపింది. తమిళనాడులోని ఇల్లిపురం గ్రామానికి చెందిన కైసల్య, భర్త మధిరతో కలిసి తిరుమల కొండపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. శనివారం రాత్రి తిరుమల ఎస్‌వీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ దగ్గర మగబిడ్డ (వీరా)ను పక్కన పడుకోబెట్టుకొని నిద్రిస్తున్నసమయంలో గుర్తుతెలియని దుండగులు అపహరించారు. వీర కనిపించకపోవడంతో మధిర‌, కౌసల్య ఆందోళన చెందారు. చుట్టుపక్కల గాలించినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాలుడి మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement