Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YSRCP President YS Jagan On Yuvatha Poru Success: Andhra pradesh1
లెక్కలేసి మరీ బాండ్లు ఇచ్చారు.. ఇప్పుడేమైంది?: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, విద్యా దీవెన, వసతి దీవెన పథ­కాలు ఇవ్వకుండా చేస్తున్న మోసాలపై వైఎస్సార్‌­సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా యువతీ యువ­కులు చేపట్టిన ‘యువత పోరు’ విజయవంతం కావడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో శాంతి­యుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై సోమవారం నరసరావుపేటలో పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.ఇంట్లో ఎంత మంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంత మందికి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు కదా.. ఇప్పుడు ఆ హామీ ఏమైందని సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్‌’లో తన ఖాతాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తమకు చేస్తున్న మోసాలు, ఎగరగొడుతూ నిర్వీర్యం చేస్తున్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు, పలు సమస్యలపై వైఎస్సార్‌­సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యా­ర్థు­లు, యువతీ యువకులు ‘యువత పోరు’ పేరిట రోడ్డెక్కి ఈ ప్రభుత్వం కళ్లు తెరిచేలా బ్రహ్మాం­డంగా నిరసన చేపట్టినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యా­ర్థులు, యువతపై సోమవారం నరసరావు­పేటలో పోలీ­సుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తు­న్నాను.మేని­ఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికీ వెళ్లి వివిధ రకాలుగా బాండ్లు పంచారు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంత మం­దికీ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేలు చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ మేరకు జూన్‌–2024 నుంచి వారి వారి ఖాతాల్లో జమ అవుతుందన్నారు. టీడీపీ అధికార గెజిట్‌ ఈనాడు పత్రికలో రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తు­న్నవారు కోటిన్నరపైనే ఉన్నా­రని రాస్తే, మీ మేనిఫెస్టో, మీరు ఇంటింటికీ పంచిన బాండ్ల ప్రకారం నెలకు రూ.3 వేలు చొప్పున ఈ ఏడాదిలో మీరు ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఒక్కరికీ ఇవ్వకపోగా, ఈ ఏడాది కూడా మళ్లీ ఎగరగొట్టే మోసానికి దిగారు.ఆరు త్రైమాసికాల ఫీజు పెండింగ్మరోవంక 2024 జనవరి–మార్చి త్రైమాసికా­నికి సంబంధించి విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అదే సంవత్సరం 2024లో చెల్లింపులు చేయాలి. ఎన్నికల కారణంగా అది నిలిచిపోయింది. అప్పటి నుంచి ఈ జూన్‌–2025 వరకు ఆరు త్రైమాసికాలుగా మొత్తంగా రూ.4,200 కోట్లు పెండింగ్‌. ఇందులో ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. వసతి దీవెన కింద ఏప్రిల్‌–2024న చెల్లించాల్సిన ఒక విడత, ఈ ఏడాది ఏప్రిల్‌–2025లో చెల్లించాల్సిన మరో విడత కలిపి రూ.2,200 కోట్లు పెండింగ్‌. మొత్తంగా రూ.6,400 కోట్లకు గాను ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరు ఇవ్వక పోవడంతో ఇవాళ విద్యార్థులు చదువులు మానుకుని, పనులకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.చంద్రబాబూ.. మీరు చేయాల్సింది చేయకుండా, ఎగరగొట్టినందుకు ప్రశ్నిస్తే నిర్దాక్షి­ణ్యంగా ఉక్కుపాదంతో అణగ­దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లంతా చేసిన తప్పేమిటి? కేవలం కలెక్టర్‌ను కలిసి డిమాండ్‌ పత్రం ఇవ్వాలను­కోవడం తప్పా? మీరు ఇస్తా­మన్న వాటి కోసం డిమాండ్‌ చేయడం తప్పా? మీ రెడ్‌బుక్‌ రాజ్యాంగ పాలనకు నిన్న నరసరావు­పేటలో జరిగిన ఘటన నిదర్శనం కాదా? రోజు­రోజుకూ మీ అబద్ధాలు, మీ మోసాలు, మీ దౌర్జ­న్యాలు మితిమీరి పోతు­న్నాయి. మీరు చేస్తున్న పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి.

Sakshi Editorial On Iran, Israel War2
విరమణ... నిజంగానా?!

ఎప్పటిలాగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బహుపాత్రాభినయంతో అందరినీ మెప్పిస్తున్నారు. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ దాడులు సాగించిన కొన్ని గంటలకే ఇరాన్‌–ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణకు అంగీకరించాయని, దాన్ని తాము స్వాగతిస్తున్నా మని మంగళవారం మధ్యాహ్నం ట్రంప్‌ ప్రకటించారు. దీనికి ఇరాన్‌ సానుకూలంగా స్పందించినా ఇజ్రాయెల్‌ మౌనం పాటించింది. ట్రంప్‌ ప్రకటించిన కాసేపటికే ఇరాన్‌ రాజధాని తెహ్రాన్‌పై అది బాంబుల వర్షం కురిపించింది. రెండు దేశాలూ పరస్పరం ‘ఎందుకో కూడా తెలియని’ విధంగా కాల్పుల విరమణ ఒడంబడికను ఉల్లంఘిస్తున్నాయని ట్రంప్‌ నిందించి తన ‘తటస్థతను’ చాటు కున్నారు! ఇంతకూ కాల్పుల విరమణ నిజమేనా? ఒక సమాచారం ప్రకారం ఖతార్‌లోని అమెరికా స్థావరంపై ఇరాన్‌ క్షిపణులు ప్రయోగించాక ట్రంప్‌ చొరవ తీసుకుని ఇరాన్‌తో మాట్లాడి కాల్పుల విరమణకు ఒప్పించమని ఖతార్‌ను కోరారు. ఖతార్‌ తీసుకొచ్చిన ప్రతిపాదనకు ఇరాన్‌ అంగీకారం తెలిపింది. ఇరాన్‌ ఈ సంగతి బాహాటంగానే చెప్పింది. కాల్పుల విరమణ గురించి ట్రంప్‌ బతిమా లుకున్నారని వెల్లడించింది. అయితే ట్రంప్‌ ప్రకటన తర్వాత కాసేపటికే దాడులకు దిగడాన్నిబట్టి ఇజ్రాయెల్‌కు ఈ పరిణామం ససేమిరా ఇష్టం లేదని బోధపడుతోంది. యుద్ధం ఆపటం సులభ మేమీ కాదు. కాల్పుల విరమణ ప్రకటనకూ, దాని ఆచరణకూ మధ్య గంటలు మాత్రమే కాదు... రోజుల వ్యవధి కొనసాగటం రివాజే. మొన్న భారత్‌–పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పంద మైనా, రష్యా–ఉక్రెయిన్‌ల కాల్పుల విరమణ అయినా ఈ సంగతే చెబుతాయి.యుద్ధానికి ముందు నెల నుంచి ట్రంప్‌ ఇరాన్‌కు రోజువారీ హెచ్చరికలు జారీచేస్తూ వచ్చారు. అణు ఒప్పందంపై మొండి పట్టుదలకు పోతే దేశం సర్వనాశనమవుతుందని బెదిరించారు. ఆఖరికి ఒకపక్క ఇరాన్‌ అమెరికాతో చర్చలు సాగిస్తుండగానే పన్నెండు రోజుల క్రితం ఇజ్రాయెల్‌ ఎలాంటి కవ్వింపూ లేకుండా ఆ దేశంపై దాడులు సాగించి ఇరాన్‌ సైనిక దళాల చీఫ్‌లు ఇద్దరినీ, అణు శాస్త్రవేత్తలతోసహా పలువురినీ హత్య చేసింది. ఇది తప్పని చెప్పాల్సిన ట్రంప్‌... ప్రతీకార దాడులకు దిగితే ఖబడ్దార్‌ అంటూ తిరిగి ఇరాన్‌నే హెచ్చరించారు. ఆఖరికి శనివారం అర్ధరాత్రి దాటాక అమెరికా తానే రంగంలోకి దిగి బంకర్‌ బస్టర్‌ బాంబులతో ఇరాన్‌లో మూడు అణు స్థావరాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇంతా అయినాక హఠాత్తుగా ట్రంప్‌ కొత్త రాగం అందుకున్నారు. ఏకపక్ష యుద్ధం ప్రారంభానికి పూర్వమే ఇరాన్‌ బలహీనతలు బయటపడ్డాయి. దశాబ్దాల ఆంక్షలతో అన్నివిధాలా దెబ్బతిన్న దేశం మెరుగ్గా ఉండగలదని ఎవరూ భావించలేరు. ఒకపక్క నేరుగా అమెరికా, ఇజ్రాయెల్‌ కుటిలత్వం తెలుస్తున్నా మిత్రులనుకున్నవారు కూడా ఖండించ టానికి సిద్ధపడకపోవటం... అండగా ఉండగలవని భావించిన రష్యా, చైనాలు ప్రకటనలకే పరిమితం కావటం, గల్ఫ్‌ దేశాలు నామమాత్రంగా ఖండించి ఊరుకోవటం ఇరాన్‌ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి ఉంటాయి. అణు ఒప్పందానికి సిద్ధపడతామని ప్రకటించి ఆ దిశగా అడుగులేస్తున్న దేశం ప్రపంచంలో ఇలా ఏకాకిగా మిగిలిపోవటం వర్తమాన విషాదం. యుద్ధం పర్యవసానంగా ఇరాన్‌లో పలు దేశాల పెట్టుబడులు దెబ్బతింటాయి. పైగా ప్రపంచానికి పెద్ద పోలీసుగా వ్యవహరిస్తూ తాము చెప్పిందే ఒప్పందమని ఒత్తిడి తెచ్చే ధోరణి రేపన్నరోజు ఎవరికైనా ముప్పే. ఇజ్రాయెల్‌ దగ్గర... ఆ మాటకొస్తే పశ్చిమాసియాలో అణుబాంబుల జాడలేకపోతే, ఇరాన్‌ మాత్రమే ఆ పని చేస్తే దాన్ని నియంత్రించటంలో హేతుబద్ధత ఉన్నదని నమ్మినా తప్పుబట్టనవసరం లేదు. కానీ అసలు అమెరికా, రష్యా మొదలుకొని ఏకపక్ష యుద్ధాలతో అందరూ తమ బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టుకుంటుండగా ఒక్క ఇరాన్‌ మాత్రమే ధూర్త దేశమని ఎందుకు భావించాలి? ఇంతకూ ట్రంప్‌ హఠాత్తు నిర్ణయం వెనకున్న కారణాలేమిటి? సైనిక స్థావరంపై దాడి చేస్తున్నా మని ఇరాన్‌ ముందస్తు సమాచారం ఇవ్వటం, అందుకు అనుగుణంగా అమెరికా తన సైనికుల్ని తరలించటంతోపాటు క్షిపణుల్ని కూల్చే ఏర్పాటు చేసుకోవటం సాధ్యమైంది. ఒకే ఒక్కటి పేలినా దానివల్ల నష్టం లేదు. అది ట్రంప్‌కు నచ్చినట్టుంది. దానికితోడు ఆయన అందలం ఎక్కటంలో కీలకపాత్ర పోషించిన ‘మాగా’ ఈ యుద్ధంపై చీలిపోయింది. గట్టి మద్దతుదారైన స్టీవ్‌ బెనన్‌ లాంటివారు సైతం ట్రంప్‌ను తప్పుబట్టారు. ఆ ఒత్తిళ్ల మాటెలావున్నా యూరప్‌ నుంచి వస్తున్న వార్తలు అమెరికాను భయపెట్టి ఉండాలి. అమెరికా తర్వాత బంగారం నిల్వల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న జర్మనీ (3,352 టన్నులు), ఇటలీ (2,452 టన్నులు) ఆ నిల్వల్లో మూడోవంతు భాగాన్ని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌లో ఉంచాయి. దాన్ని వెనక్కుతేవాలని ఆ దేశాల్లో డిమాండ్లు బయల్దేరాయి. నిల్వల విలువ 24,500 కోట్ల డాలర్ల పైమాటే. ఫెడరల్‌ రిజర్వ్‌ స్వతంత్రతను దెబ్బతీసేలా ట్రంప్‌ వ్యవహరించటం, ప్రపంచాన్ని అస్థిరపరిచే నిర్ణయాలు తీసుకోవటం తదితర కారణాల వల్ల అమెరికాలో బంగారం ఉంచటం సురక్షితం కాదని విపక్షాలు వాదిస్తున్నాయి. అది ఆచరణ రూపందాలిస్తే అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత కుంగిపోవటం ఖాయం. పైగా లండన్‌తో పాటు ప్రపంచంలోనే కీలకమైన బంగారం కేంద్రంగా వెలిగిపోతున్న న్యూయార్క్‌ కళ అడుగంటు తుంది. అందుకే ట్రంప్‌ పునరాలోచనలో పడ్డారా? లేక ముందస్తు సమాచారం ఇచ్చిన ఇరాన్‌ ‘మంచితనం’ నచ్చిందా? మొత్తానికి అగ్ని గుండం కాబోతున్న పశ్చిమాసియాలో సామరస్య గాలులు వీచటం ఆహ్వానించదగ్గది. ఇది పూర్తి స్థాయిలో సాకారం కావాలని ఆశించాలి.

Sakshi Guest Column On Indira Gandhi National Emergency3
మరోసారి ఎమర్జెన్సీ రాకూడదు!

భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ ఎమర్జెన్సీ. తన అధికారానికి ముప్పు రావ డంతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ 1975 జూన్‌ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించి స్వతంత్ర భారత చరిత్రలో చీకటి అధ్యాయా నికి తెరతీశారు. ప్రజాస్వామ్య పునరుద్ధర ణకు అనేకమంది ప్రతిపక్ష పార్టీల నాయ కులు, ప్రజాస్వామికవాదులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు గొప్ప పోరాటాన్ని నడిపారు. ఈ పోరాటంలో నేనూ భాగమయ్యాను. ఈ క్రమంలో ఏడాదికి పైగా జైలు జీవితం కూడా గడిపాను. ఎమర్జెన్సీ విధించి నేటికి (జూన్‌ 25) 50 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో నాటి నా అను భవాలు ఈ తరానికి తెలియజేయడం సముచితమని భావిస్తున్నాను.అప్పుడు నేను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ప్రచారక్‌. నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల జోన్‌లో భాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఎమర్జెన్సీ ప్రకటించిన మరునాడే ఆరెస్సెస్‌ను నిషే ధించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేపట్టేందుకు ‘లోక్‌ సంఘర్ష్‌ సమితి’ ఏర్పడింది. నేను కూడా అందులో భాగమ య్యాను. అజ్ఞాతంలోకి వెళ్లి ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రజలను జాగృతం చేయాలని, ఎమర్జెన్సీ ఎత్తివేతకు ఉద్యమాలు నిర్వహించాలని ‘లోక్‌ సంఘర్ష్‌ సమితి’ నుంచి సూచనలు అందాయి. వెంటనే నా వస్త్రధారణ మార్చాను. తెల్లని లాల్చీ, పైజమా వేసుకునే నేనుఅందుకు భిన్నంగా షర్టు, ప్యాంటు, కోటు, టై, బూట్లు ధరించాను. పేరు కూడా ధర్మేంద్రగా మార్చుకున్నాను. జుట్టు కూడా పెంచుకొని మారువేషం కట్టాను. ఎమర్జెన్సీ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేయడం, ఎమర్జెన్సీని వ్యతిరేకించి జైలులో ఉన్న నాయకుల కుటుంబాలకు సహాయం చేయడం మా పని.పత్రికలపై సెన్సార్‌ విధించడంతో ప్రజలకు ప్రభుత్వ వార్తలు తప్పితే, ఇతర ఏ రకమైన సమాచారం అందేది కాదు. మాకు అందిన రహస్య సమాచారాన్ని బులెటిన్‌ రూపంలో ప్రచురించి ప్రజలకు, కార్యకర్తలకు పంపిణీ చేసేవాళ్లం. ఒకసారి నిజామాబాద్‌ జిల్లా కామా రెడ్డి వద్ద రామేశ్వరపల్లి అనే గ్రామంలోని ఒక పెద్ద రామాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఇంజినీర్‌ వెంకట్‌ రామ్‌రెడ్డి వివాహం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు, అందరూ వ్రతంలో పాల్గొని ప్రసాదం తీసుకువెళ్లా లన్న సందేశం కార్యకర్తలకు వెళ్లింది. సుమారు 250 మంది కార్య కర్తలు, మద్దతుదారులు అక్కడకు చేరుకున్నారు. ఎలా తెలిసిందో ఏమో కానీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు దీనిని పసిగట్టారు. పైన సమావేశ మందిరంలో మారువేషంలో ఉన్న నన్ను పోలీసు అధికారి గుర్తించి, పైకి వస్తున్న విషయాన్ని గమనించాను. అప్పుడు ప్యాంటు, టీ షర్ట్‌ ధరించి మెడలో శిలువ వేసుకొని తన పేరు జాన్‌గా మార్చుకొన్న ఏబీవీపీ నాయకుడు ప్రస్తుత త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి కూడా నా వెంట ఉన్నారు. నేను,ఇంద్రసేనా రెడ్డి ఆ ఆలయం వెనుకవైపున ఉన్న ఇరవై అడుగుల ఎత్తు ఉన్న ప్రహరీ గోడ దూకి అక్కడ నుంచి తప్పించుకున్నాం. మేం పారిపోయిన కొద్దిసేపటికే పోలీసులు కొందరు కార్యకర్తలను అరెస్ట్‌ చేసి ‘దత్తాత్రేయ ఎక్కడ ఉన్నాడో చెప్పాలని’ ఒత్తిడి చేశారు.కొన్ని రోజుల తరువాత నేను, నాతో పాటు వరంగల్‌ విభాగ్‌ ప్రముఖ్‌ శ్రీధర్‌ జీ మారువేషంలో బెల్లంపల్లిలో ఒక చిన్న హోటల్‌లో భోజనం చేస్తున్నాం. సరిగ్గా అప్పుడే పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించడం మొదలు పెట్టారు. శ్రీధర్‌జీ తన పేరు శ్రీధర్‌ అని ఒప్పుకున్నారు. నేను మాత్రం ‘దత్తాత్రేయ ఎవరో నాకు తెలియదు, నేను మాత్రం కాదు’ అని నిక్కచ్చిగా చెప్పాను. శ్రీధర్‌జీని ‘మీసా’ క్రింద అరెస్ట్‌ చేసి వరంగల్‌ జైలుకి తరలించారు. మరుసటిరోజు పోలీసులు డోసు పెంచారు. చిత్రహింసలు పెడ్తామంటూ బెదిరింపులకు దిగారు. ఇంతలో ఒక పరిచయస్థుడైన నిజామాబాద్‌ సెంట్రల్‌ ఇంటెలి జెన్స్‌లో పనిచేస్తున్న మురళి అనే హెడ్‌ కాని స్టేబుల్‌ అక్కడకు వచ్చాడు. వస్తూనే, ‘నమస్తే సార్‌.. బాగు న్నారా’ అని పలుకరించాడు. అంతటితో ఆగకుండా ‘దత్తాత్రేయ గారూ’ అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. నేను అతడికి ప్రతిస్పందించడం గమనించిన పోలీస్‌ అధికారులు ‘నీ పేరు దత్తా త్రేయ కదా’ అంటూ మొత్తం మీద నన్ను ఒప్పించారు. మా కార్య కలాపాల గురించి, ఆదాయ మార్గాలు వంటి వాటి గురించి అడిగినా నేను సమాధానం చెప్పక పోవడంతో ‘మీసా’ కింద అరెస్ట్‌ చేసి హైదరా బాద్‌లోని చంచల్‌ గూడ జైలుకి తరలించారు.జైలులో ‘జన్‌సంఘ్‌’ నేతలు బంగారు లక్ష్మణ్, ఆలె నరేంద్ర... వరవరరావు, చెరబండ రాజు, ఎం.టి. ఖాన్, నాయిని నర్సింహారెడ్డి, కార్మిక నాయకులు చైతన్య, శీతల్‌ సింగ్‌ లష్కరి; ఇంకా జమాతే ఇస్లామీ, ఆనంద్‌ మార్గ్‌ సంస్థల నాయకులు ఉండేవారు. వారిలో అడ్వకేట్‌ రాజా బోస్‌ ఒకరు. మా సిద్ధాంతాలు వేరైనా మేమంతా కలిసి మెలిసి ఉండేవారం. ఇందిరా గాంధీ మమ్మల్ని ఎప్పటికీ విడు దల చేయరని, ఆమె శక్తిని సవాలు చేసే దమ్ము ఎవరికీ లేదని తోటి జైలు ఖైదీలు అంటున్న ప్పుడు రాజా బోస్‌ డ్రమ్స్‌ వాయిస్తూ... లెజెండరీ సింగర్‌ మహమ్మద్‌ రఫీ పాట ‘సవేరే వాలీ గాడీ సే చలే జాయేంగే...’ పాడుతూ మాలో కొత్త ఆశలు రేకెత్తించేవారు. కొన్ని రోజుల తరువాత మా పెద్దన్న మాణిక్‌ ప్రభు పచ్చ కామెర్లు సోకి మరణించారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడానికి నాకు ఒక ఎస్కార్ట్‌ ఇచ్చి పంపించారు. మా అమ్మ ఈశ్వరమ్మ ఉస్మాన్‌ గంజ్‌లో ఉల్లిపాయల వ్యాపారం చేసేవారు. నేను జైలులో ఉన్నప్పుడు మా అమ్మ ములాఖత్‌లో వారానికొకసారి పండ్లు తీసుకొని వచ్చి నా క్షేమ సమాచారాలు తెలుసుకోవడమే కాదు, నాకు ధైర్యవచ నాలు కూడా చెప్పేది. ఒకసారి ములాఖత్‌లో ‘నువ్వు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనను అని అండర్‌ టేకింగ్‌ ఇస్తే విడిపి స్తానని మామయ్య హామీ ఇచ్చాడ’ని చెప్పింది. దానికి ‘నువ్వు ఏమ న్నావ’ని అమ్మను అడిగాను. ‘నా కొడుకు ఏమైనా ఎవ్వరి పిల్లనైనా ఎత్తుకుపోయాడా, దొంగతనం చేశాడా? ఏం తప్పు చేశాడని అండర్‌ టేకింగ్‌ ఇవ్వాలి?’ అని గట్టిగా ప్రశ్నించానని అమ్మ వివరించింది. ములాఖత్‌ సమయంలో రికార్డు చేసుకునేందుకు అక్కడ ఉండే స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారి ఈ మాటలు విని ఎంతో ఆశ్చర్యపోయారు. మా అమ్మకు రెండు చేతులతో దండం పెట్టి మరీ మెచ్చుకున్నారు. నాకు ఎంతో స్ఫూర్తి నిచ్చిన ఈ సంఘటన జీవితాంతం గుర్తుంటుంది.జైలులో ఉన్నప్పుడు జైలర్‌ రామారావుతో నాకు మంచి సాన్ని హిత్యం ఏర్పడింది. 1977 సార్వత్రిక ఎన్నికల ఫలితాల సమాచారం వారే మాకు తెలియజేశారు. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మాకు రామారావే ఎప్పటికప్పుడు సమాచారం అందించే వారు. ఇందిర, ఆమె తనయుడు సంజయ్‌ గాంధీ ఓటమి సమా చారం కూడా వారే మా చెవిన వేశారు. ఈ విషయం తెలి సిన వెంటనే రాజా బోస్‌ ‘సవేరే వాలీ గాడీ సే చలే జాయేంగే...’ పాట అందుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తిమంతులు, వారు నియంతృత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.నాటి చీకటి రోజుల్లో తీవ్రమైన నిర్బంధం, ఆంక్షల మధ్య జరిపిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరా టాలను ఈ తరానికి తెలియజేయాల్సిన అవసరం మనపై ఉంది. మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలే తీసుకోవాలి. ఇందుకు ప్రజాస్వామ్యంలో నాలుగు మూల స్తంభాలైన శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియాను బలోపేతం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో మరో ఎమర్జెన్సీకి తావివ్వ కూడదు, మన గొప్ప ప్రజాస్వా మ్యానికి భంగం వాటిల్లనివ్వకూడదు. ఇది మన సమష్టి కర్తవ్యం.బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హరియాణా గవర్నర్‌

CM Revanth Reddy Fires On KCR4
చర్చకు రా.. తేల్చుకుందాం!: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: పదేళ్లు అధికారంలో కొనసాగి కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్‌.. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తనపై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు అసెంబ్లీలో చర్చకు రావా లని సవాల్‌ విసిరారు. ‘నేను చంద్రబాబుతో కలిసిపోయి గోదావరి– బనకచర్లకు నీళ్లిస్తున్నానని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నావు. దీనిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయమని ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో స్పీకర్‌కు లేఖ రాయి. గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత–చేవెళ్లను తరలించి లక్ష కోట్లు దోచుకున్నది ఎవరో చర్చిద్దాం..’ అని అన్నారు. కేసీఆర్‌ సూచనలతో హరీశ్‌రావు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు భరోసా కింద ప్రభుత్వం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో మంగళవారం సచివాలయం ఎదురుగా రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో రేవంత్‌ మాట్లాడారు. నీ దిక్కుమాలిన సూచన వల్లే ఈ దరిద్రం ‘చంద్రబాబును కలిసి గోదావరి నుంచి 3 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నయ్‌.. రాయలసీమకు తరలించమని 2016లో చెప్పింది నువ్వు కాదా? నువ్వు చెప్పినంకనే కదా ఉమాభారతి ఆదేశాల మేరకు చంద్రబాబు హంద్రీనీవా నుంచి 400 టీఎంసీలు తరలించడానికి 2016లో జీవో ఇచ్చిండు. 2018లో వ్యాప్కోస్‌ సంస్థను నియమించి, 400 టీఎంసీలు హంద్రీనీవా నుంచి బనకచర్లకు తరలించడానికి ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చింది నిజం కాదా? నువ్వు ఇచ్చిన దిక్కుమాలిన సూచనతోనే ఈ దరిద్రం దాపురించింది? తెలంగాణను ఎడారిగా మార్చేలా వందలాది టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు. నేను తప్పు చేసినట్టు ఒక్క ఆధారం చూపిస్తే దేనికైనా సిద్ధం. నేను మొత్తం వివరాలతో వస్తా? నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీలో చర్చకు పెట్టించే బాధ్యత శ్రీధర్‌బాబు తీసుకుంటరు. నువ్వు, నేను చర్చ చేద్దాం. నువ్వు సిద్ధంగా ఉన్నవా?..’ అని సీఎం నిలదీశారు. ఆ ప్రాజెక్టులన్నీ ఎందుకు ఆగిపోయాయి? ‘బీఆర్‌ఎస్‌ పదేళ్ల వాళ్ల పాలన ఎలా ఉందో.. 18 నెలల మా పాలన ఎలా ఉందో గ్రామాల్లో, రచ్చబండల దగ్గర రైతులు చర్చ పెట్టాలి. వ్యవసాయాన్ని పండుగ చేయాలని 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉచిత కరెంటుపై తొలి సంతకం చేశారు. రుణమాఫీ అమలు చేశారు. ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్‌ హయాంలోనే మొదలయ్యాయి. కానీ కేసీఆర్‌ కుట్రలు, కుతంత్రాలతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. కాళేశ్వరం కూలేశ్వరమై లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయినయ్‌. ప్రాజెక్టు కూలిపోయినందుకు నిన్ను చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్నది నిజం కాదా? కేసీఆర్‌ కాంట్రాక్టర్లకు రూ.2 లక్షల కోట్లు చెల్లించిండు. మరి రూ.1,000 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయింది? రూ.300 కోట్లతో పూర్తి కావాల్సిన భీమా, రూ.200 కోట్లతో పూర్తి కావాల్సిన నెట్టెంపాడు, రూ.6 వేల కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ఎందుకు ఆగిపోయాయి? దేవాదుల పూర్తి చేస్తే 4 వేల ఎకరాలు సాగయ్యేవి..ఎందుకు పూర్తి చేయలేదు? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై సీమాంధ్రులు నిర్లక్ష్యం వహించారన్న నువ్వు.. పదేళ్లలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా? ఈ దుర్మార్గానికి నువ్వు, నీ కుటుంబం కారణం కాదా? కృష్ణా జలాల్లో 68 శాతం కేటాయింపులు తెలంగాణలో, 32 శాతం కేటాయింపులు ఆంధ్రలో ఉండాలి. ఈ లెక్కన 555 టీఎంసీల వాటా తెలంగాణకు రావాలి. కానీ 290 టీఎంసీలు తెలంగాణకు తీసుకుని, 519 టీఎంసీలు ఆంధ్రకు ఇచ్చి తెలంగాణ రైతాంగానికి మరణశాసనం రాసిందే నువ్వు. అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకోం.. మేం తెలంగాణకు న్యాయం కోసం పోరాడుతున్నం. గోదావరి–బనకచర్లకు అనుమతులు ఇవ్వవద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రిని కోరాం. ప్రాజెక్టులను పడావు పెట్టి మీరు ఫాంహౌస్‌లో పడుకుంటే.. మేం వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకోం. అప్పుడంటే జానారెడ్డి నీతో ఎందుకని ఊరుకున్నాడు. ఇప్పుడు అసెంబ్లీకి రా. నీ సంగతి చెపుతా..’ అని రేవంత్‌ అన్నారు. మీకు ఫామ్‌హౌస్‌లు ఎట్లా వచ్చినయ్‌? ‘కేసీఆర్‌ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను క్యాన్సర్‌ బారిన పడేసి మాకు అప్పగించారు. కోకాపేట భూములు, ఓఆర్‌ఆర్‌ అమ్మి రైతుబంధు ఇచ్చారు. రైతుల పేరుతో అప్పులు చేసిండు.. దోపిడీ చేసిండు. తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇప్పుడేంటి? మొయినాబాద్‌లో హరీశ్‌రావుకు, జన్వాడలో కేటీఆర్‌కు, గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఫామ్‌హౌస్‌లు ఎట్లా వచ్చినయ్‌? రాష్ట్రానికి రూ.8 లక్షల కోట్ల అప్పు మిగిల్చి, పదేళ్లలో నిజాం నవాబుల కంటే ధనవంతులయ్యారు. మేం మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం. మీరు పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు చెప్పు. కాళేశ్వరం పేరుతో మీరు రూ.లక్ష కోట్లు కొల్లగొడితే.. 18 నెలల్లో లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న చరిత్ర మాది. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మా తొలి ప్రాధాన్యత రైతులే ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులుం. ఆ తర్వాత మా ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులు. ఆనాడు కేసీఆర్‌ రైతుబందు ఎగ్గొడితే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.7,625 కోట్ల నిధులు విడుదల చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం. కేసీఆర్‌ ఆనాడు వరి వద్దంటే మేం వరి పండించండి అని చెప్పాం. చివరి గింజ వరకు కొనడమే కాదు.. మద్దతు ధరతో పాటు బోనస్‌ కూడా ఇస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు మాట్లాడారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, వాకిటి శ్రీహరి, విప్‌ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

India lost the first Test5
'లీడ్స్‌' వదిలేశారు

తొలి రోజు నుంచే అసాధారణ బ్యాటింగ్‌ ప్రదర్శన... రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 835 పరుగులు... గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఐదు సెంచరీలు... బుమ్రా అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన... అన్నీ సానుకూలతలే కనిపించినా... చివరకు ఓటమి మాత్రం తప్పలేదు. తొలి టెస్టుల్లో పలు సందర్భాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌ తుది దశకు వచ్చేసరికి చేతులెత్తేసింది. గెలుపు కోసం చివరి రోజు 350 పరుగుల భారీ స్కోరు చేయాల్సిన ఇంగ్లండ్‌ మొదటి ఓవర్‌ నుంచే పరుగుల వేటలో పడింది. వ్యూహాత్మకంగా బుమ్రా బౌలింగ్‌లో సాహసం చేయని బ్యాటర్లు ఇతర బౌలర్లపై చెలరేగి జోరుగా సాగిపోయారు. తాము ఆశించిన రీతిలో ‘బజ్‌బాల్‌’ శైలిలో ఎక్కడా తగ్గకుండా 4.54 రన్‌రేట్‌తో దూసుకుపోయిన ఇంగ్లండ్‌ ఘన విజయాన్ని అందుకుంది. డకెట్‌ మెరుపు సెంచరీకి క్రాలీ అండగా నిలవగా... చివర్లో రూట్‌ కీలక అర్ధ సెంచరీతో జట్టును నడిపించాడు. తొలి టెస్టులో ఓటమి పక్షాన నిలిచిన కొత్త కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ సిరీస్‌లో మున్ముందు ఎలాంటి ఫలితాలు రాబడతాడనేది చూడాలి. లీడ్స్‌: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్‌ పరాజయంతో మొదలు పెట్టింది. హెడింగ్లీ మైదానంలో మంగళవారం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు 21/0తో ఆటను మొదలు పెట్టిన ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసింది. బెన్‌ డకెట్‌ (170 బంతుల్లో 149; 21 ఫోర్లు, 1 సిక్స్‌), జాక్‌ క్రాలీ (126 బంతుల్లో 65; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 188 పరుగులు జోడించి బలమైన పునాది వేయగా... ఆఖర్లో జో రూట్‌ (84 బంతుల్లో 53 నాటౌట్‌; 6 ఫోర్లు), జేమీ స్మిత్‌ (55 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రూట్, స్మిత్‌ ఆరో వికెట్‌కు అభేద్యంగా 71 పరుగులు జత చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ పని పట్టిన స్టార్‌ పేసర్‌ బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయగలిగినా ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఇతర బౌలర్ల పేలవ ప్రదర్శన ఇంగ్లండ్‌కు గెలుపు అవకాశాలు సృష్టించింది. ఈ విజయంతో సిరీస్‌లో ఇంగ్లండ్‌ 1–0తో ముందంజ వేసింది. సిరీస్‌లో రెండో టెస్టు జూలై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరుగుతుంది. భారీ భాగస్వామ్యం... ఇంగ్లండ్‌ ఓపెనర్లు క్రాలీ, డకెట్‌ చివరి రోజు ఆటను జాగ్రత్తగా మొదలు పెట్టారు. అయితే నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో ధాటిని పెంచారు. ఈ క్రమంలో ముందుగా 66 బంతుల్లో డకెట్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. 42 పరుగుల వద్ద క్రాలీ ఇచ్చిన కఠినమైన రిటర్న్‌ క్యాచ్‌ను అందుకోవడంలో బుమ్రా విఫలమయ్యాడు. లంచ్‌ వరకు కూడా ఇంగ్లండ్‌ ఓపెనింగ్‌ జోడీని విడదీయడంలో భారత్‌ విఫలమైంది. తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ 24 ఓవర్లలో 96 పరుగులు సాధించింది. విరామం తర్వాత 111 బంతుల్లో క్రాలీ హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరు మరింత జోరుగా ఆడారు. 97 పరుగుల వద్ద డకెట్‌ ఇచి్చన క్యాచ్‌ జైస్వాల్‌ వదిలేయడం కూడా జట్టుకు కలిసొచ్చింది. తర్వాతి ఓవర్లోనే డకెట్‌ 121 బంతుల్లో కెరీర్‌లో ఆరో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత స్వల్ప వర్షం కారణంగా దాదాపు ఇరవై నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగింది. గెలిపించిన రూట్, స్మిత్‌... వాన ఆగిన తర్వాత భారత్‌కు సానుకూల ఫలితం వచ్చింది. ఎట్టకేలకు క్రాలీని అవుట్‌ చేసి భారత్‌కు తొలి వికెట్‌ అందించిన ప్రసిద్‌... తన తర్వాతి ఓవర్లోనే ఒలీ పోప్‌ (8)ను కూడా పెవిలియన్‌ పంపించాడు. ఈ దశలో డకెట్, రూట్‌ మళ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ఇంగ్లండ్‌ వేగంగా దూసుకుపోతున్న తరుణంలో శార్దుల్‌కు బంతి అప్పగించడం భారత్‌కు మేలు చేసింది.దూకుడుగా ఆడుతున్న డకెట్‌తో పాటు హ్యారీ బ్రూక్‌ (0)ను వరుస బంతుల్లో అవుట్‌ చేసి శార్దుల్‌ ఒక్కసారిగాటీమిండియా శిబిరంలో ఉత్సాహం నింపాడు. అయితే రూట్, బెన్‌ స్టోక్స్‌ (51 బంతుల్లో 33; 4 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు 77 బంతుల్లో 49 పరుగులు జత చేశారు. అయితే జడేజా బౌలింగ్‌ పదే పదే రివర్స్‌ స్వీప్‌కు ప్రయత్నించిన స్టోక్స్‌ అదే షాట్‌ ఆడి నిష్క్రమించాడు. ఈ దశలో ఇంగ్లండ్‌ మరో 69 పరుగులు చేయాల్సి ఉండటంతో భారత బృందంలో కాస్త ఆశలు రేగాయి. అయితే అనుభవజు్ఞడైన రూట్‌ అండగా యువ కీపర్‌ స్మిత్‌ ఒత్తిడిని అధిగమించి చక్కటి షాట్లు ఆడటంతో ఇంగ్లండ్‌ గెలుపునకు చేరువైంది. భారత్‌ కొత్త బంతిని తీసుకున్నా అప్పటికే ఆలస్యమైపోయింది. జడేజా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన స్మిత్‌...అదే ఓవర్‌ చివరి బంతికి మరో సిక్స్‌ బాది మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 471; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 465; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 364; ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) రాహుల్‌ (బి) ప్రసిధ్‌ 65; డకెట్‌ (సి) (సబ్‌) నితీశ్‌ రెడ్డి (బి) శార్దుల్‌ 149; పోప్‌ (బి) ప్రసిధ్‌ 8; రూట్‌ (నాటౌట్‌) 53; బ్రూక్‌ (సి) పంత్‌ (బి) శార్దుల్‌ 0; స్టోక్స్‌ (సి) గిల్‌ (బి) జడేజా 33; స్మిత్‌ (నాటౌట్‌) 44; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (82 ఓవర్లలో 5 వికెట్లకు) 373. వికెట్ల పతనం: 1–188, 2–206, 3–253, 4–253, 5–302. బౌలింగ్‌: బుమ్రా 19–3–57–0, సిరాజ్‌ 14–1–51–0, జడేజా 24–1–104–1, ప్రసిధ్‌ 15–0–92–2, శార్దుల్‌ 10–0–51–2. 5 ఒక టెస్టులో ఐదు సెంచరీలు నమోదు చేసిన తర్వాత కూడా ఓటమి పాలైన తొలి జట్టుగా భారత్‌ నిలిచింది.2 టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ఇది రెండో అతి పెద్ద ఛేదన. 2022లో భారత్‌పైనే బర్మింగ్‌హామ్‌లో 378 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.6 హెడింగ్లీ మైదానంలో ఇంగ్లండ్‌ వరుసగా ఆరో టెస్టు గెలిచింది. ఈ ఆరు సార్లు జట్టు లక్ష్యాలను ఛేదించడం విశేషం.3 టెస్టు మ్యాచ్‌ నాలుగు ఇన్నింగ్స్‌లలోనూ 350కు పైగా స్కోర్లు నమోదు కావడం ఇది మూడోసారి మాత్రమే.1673 భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఒకే టెస్టులో నమోదైన మొత్తం పరుగులు. ఈ రెండు జట్ల మధ్య ఇదే అత్యధికం.టెస్టు మ్యాచ్‌ అద్భుతంగా సాగింది. మాకూ మంచి అవకాశాలు వచ్చాయి. అయితే క్యాచ్‌లు వదిలేయడం, లోయర్‌ ఆర్డర్‌లో ఎక్కువ పరుగులు చేయలేకపోవడం ఓటమికి కారణాలు. నాలుగో రోజు కూడా కనీసం 430 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాలని అనుకున్నాం. అయితే 25 పరుగులకే చివర్లో వరుసగా వికెట్లు పడటంతో అది సాధ్యం కాలేదు. ఈ రోజు కూడా తొలి వికెట్‌ తీసిన తర్వాత మాకు మంచి అవకాశం ఉందనిపించింది. కానీ అది జరగలేదు. తొలి సెషన్‌లో మేం బాగానే బౌలింగ్‌ చేసి వారిని నియంత్రించగలిగినా ఒక్కసారి బంతి పాతబడిన తర్వాత ఏమీ చేయలేకపోయాం. అలాంటి స్థితిలోనూ వికెట్లు తీయడం అవసరం. జడేజా చాలా బాగా బౌలింగ్‌ చేసి మంచి అవకాశాలు సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా కుప్పకూలడంపై ఇప్పటికే చర్చించాం. ఈ తప్పును మేం మున్ముందు సరిదిద్దుకోవాలి. ఇలాంటి పిచ్‌పై అవకాశాలు అంత సులువుగా రావు. వాటిని వృథా చేసుకోవద్దు. అయితే మాది యువ జట్టు. నేర్చుకునే దశలో ఉంది. మరింత మెరుగువుతాం. బుమ్రా మిగిలిన టెస్టుల్లో ఏవి ఆడతాడో ఇప్పుడే చెప్పలేం. దానికి తగినంత సమయం ఉంది. – గిల్, భారత కెప్టెన్‌

Operation Sindoor showed the world India uncompromising policy against terrorism: PM Modi6
ఉగ్రవాదంపై ఉక్కుపాదమే

న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై భారత్‌ ఉక్కుపాదం మోపుతుందని ఆపరేషన్‌ సిందూర్‌తో మరోసారి ప్రపంచానికి చాటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పాక్‌పై పోరులో మేకిన్‌ ఇండియా ఆయుధాలు సత్తా చాటాయని గుర్తు చేశారు. జాతి ప్రయోజనాల పరిరక్షణకు ఎలాంటి చర్యలకైనా తమ సర్కారు వెనకాడే సమస్యే ఉండబోదని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికవేత్త, సామాజిక సంస్కర్త నారాయణగురు, మహాత్మాగాంధీ మధ్య చరిత్రాత్మక సంభాషణకు వందేళ్లయిన సందర్భంగా సోమవారం జరిగిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.బలోపేతమైన భారత్‌ కోసం వాళ్లు కన్న కలలను నిజం చేసే దిశగా సాగుతున్నట్టు చెప్పారు. ‘‘11 ఏళ్ల క్రితం వరకూ దేశాన్ని పాలించిన వారి హయాంలో కోట్లాది ప్రజలు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొ న్నారు. మా పాలనలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 11 ఏళ్లుగా దేశం సామాజికంగా, ఆర్థికంగా అత్యంత బలోపే తమవుతూ వస్తోంది. రక్షణ రంగంలో స్వావలంబన సాధిస్తోంది. భారత్‌ తయారు చేసే ఆయుధాలు ప్రపంచమంతటా జెండా ఎగరేసే రోజులు ఎంతో దూరం లేవు’’ అని ధీమా వెలిబుచ్చారు.

25th June 1975 was indeed a black day in Independent India: Darkest Day7
ప్రజాస్వామ్యానికి సంకెళ్లు

1975. జూన్‌ 25. స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత చీకటిమయమైన అధ్యాయానికి తెర లేచిన రోజు. దేశం ఎన్నటికీ మర్చిపోలేని రోజు. అధికారాన్ని కాపాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన రోజు. ఆ నిశిరాత్రి వేళ ఆమె తీసుకున్న చీకటి నిర్ణయం ఏకంగా 21 నెలల పాలు దేశ ప్రజల పాలిట నిత్య కాళరాత్రే అయింది. ఎటుచూసినా దమనకాండ. రాజకీయ ప్రత్యర్థులు మొదలుకుని సామాన్యుల దాకా దేశవ్యాప్త నిర్బంధాలు. ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన మౌలిక హక్కులు దేవుడెరుగు, జీవించే హక్కుకే దిక్కు లేని దుస్థితి.పత్రికా స్వేచ్ఛను ఉక్కుపాదంతో తొక్కిపెట్టిన పరిస్థితి! సర్వం సహా అధికారమంతా ఇందిర చిన్న కుమారుడు సంజయ్‌గాంధీ రూపంలో ఓ రాజ్యాంగేతర శక్తి చేతుల్లో కేంద్రీకృతం! అసలే దుందుడుకుతనానికి మారుపేరు. ఆపై బాధ్యతల్లేని అధికారం. దాని అండతో, సన్నిహిత కోటరీ చెప్పినట్టల్లా ఆడుతూ ఆయన పాల్పడ్డ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అనుమానం వచ్చిన వారల్లా జైలుపాలే. చివరికి జనాభాను తగ్గించే చర్యల పేరిట కంటబడ్డ వారికల్లా బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసిపారేయడం సంజయ్‌ నియంతృత్వ పోకడలకు పరాకాష్టగా నిలిచింది.మొత్తంగా దేశమే ఓ జైలుగా మారి 21 నెలల పాటు అక్షరాలా హాహాకారాలు చేసింది. అయితే అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే అయింది. ఎమర్జెన్సీ ఎత్తివేత అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరను ఓడించి, నియంత పోకడలు పోయేవారికి ప్రజలు మర్చిపోలేని పాఠం నేర్పారు. అలాంటి ఎమర్జెన్సీ చీకటి అధ్యాయానికి తెర లేచి నేటికి సరిగ్గా 50 ఏళ్లు. ఈ సందర్భంగా, అందుకు దారి తీసిన పరిస్థితులు, ఎమర్జెన్సీ అకృత్యాలు, దాని పరిణామాలు తదితరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.....అలా మొదలైందినిజానికి ఎమర్జెన్సీ నాటికి దేశమంతటా నానారకాలుగా అస్థిరత రాజ్యమేలుతోంది. ఇందిరకు వ్యతిరేకంగా లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ తదితరుల సారథ్యంలో విపక్షాలు సంఘటితమవుతూ వస్తున్నాయి. అయితే ఎమర్జెన్సీకి పూర్వ రంగాన్ని సిద్ధం చేసింది మాత్రం ఇందిర ఎన్నికను రద్దు చేస్తూ అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జగ్‌మోహన్‌లాల్‌ సిన్హా వెలువరించిన చరిత్రాత్మక తీర్పే. 1971 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి ఇందిరపై తలపడి ఓడిన సోషలిస్టు పార్టీ అభ్యర్థి రాజ్‌ నారాయణ్‌ ఆమె ఎన్నికను సవాలు చేస్తూ కోర్టుకెక్కారు. ఇందిర ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందిర ఎన్నికల ఏజెంటు యశ్‌పాల్‌ కపూర్‌ ప్రభుత్వోద్యోగిగా ఉంటూనే ఆమె కోసం పని చేశారని పేర్కొన్నారు.ఈ కేసును కొద్దిరోజులకు అంతా మరచిపోయినా బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధం తాలూకు ఆర్థిక భారం కారణంగా నాలుగేళ్లుగా జనంలో రగులుతున్న అసంతృప్తి ఇందిర సర్కారుపై ఆగ్రహంగా మారుతున్న సందర్భమది. మూడేళ్ల పాటు ఇందిర సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలు నానాటికీ బలం పుంజుకోసాగాయి. అలాంటి సమయంలో ఎంపీగా ఇందిర ఎన్నికను కొట్టేస్తూ జస్టిస్‌ సిన్హా 1975 జూన్‌ 12న అనూహ్యంగా సంచలన తీర్పు వెలువరించారు. అంతేగాక ఆమె ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా వేశారు! దానిపై ఇందిర సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం లేకపోయింది. ఆమెను ప్రధానిగా కొనసాగనిచ్చినా, పార్లమెంటులో ఓటు హక్కులకు మాత్రం కత్తెర వేస్తూ జూన్‌ 24న సుప్రీం తీర్పునిచ్చింది.ఇది విపక్షాలకు అతి పెద్ద ఆయుధంగా అందివచ్చింది. జేపీ ఇచ్చిన సంపూర్ణ క్రాంతి (సంపూర్ణ విప్లవ) నినాదం అప్పటికే దేశమంతటా కార్చిచ్చులా వ్యాపిస్తోంది. చూస్తుండగానే దేశమంతటా, ముఖ్యంగా ఉత్తరాదిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటసాగాయి. సుప్రీం తీర్పు వచ్చిన మర్నాడు జూన్‌ 25న విపక్షాలన్నీ ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో భారీ స్థాయిలో నిర్వహించిన సంపూర్ణ విప్లవ ర్యాలీ సర్కారు పునాదులనే కదిలించింది.పౌరులు సహాయ నిరాకరణ చేయాలని, పోలీసులు, సైనిక బలగాలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాకుండా అంతరాత్మ ప్రబోధానుసారం నడచుకోవాలని జేపీ ఇచ్చిన పిలుపు కేంద్రం గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. పరిస్థితులు చేయి దాటుతున్నాయని భావించిన ఇందిర సన్నిహితులతో సంప్రదించి ఓ నిర్ణయానికి వచ్చారు. ‘అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉన్నందున దేశమంతటా ఎమర్జెన్సీ విధించా’లంటూ ఆ అర్ధరాత్రే రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌కు సిఫార్సు చేయడం, క్షణాల మీద ఆయన ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి.ఏం జరిగింది?⇒ ఎమర్జెన్సీ కారణంగా వాక్‌ స్వాతంత్య్రంతో పాటు ప్రజల రాజ్యాంగపరమైన హక్కులన్నీ రద్దయ్యాయి. ⇒ మీడియాపై కనీవినీ ఎరగని రీతిలో పూర్తిస్థాయి ఆంక్షలు కొనసాగాయి. ⇒ అనుమానం వస్తే చాలు, ఎంతటివారినైనా ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవడం పరిపాటిగా మారింది. ⇒ జేపీతో పాటు అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే ఆడ్వాణీ, మధు దండావతే, నానాజీ దేశ్‌ముఖ్, ప్రకాశ్‌సింగ్‌ బాదల్, కరుణానిధి, జార్జి ఫెర్నాండెజ్, ప్రకాశ్‌ కారత్‌ తదితర విపక్ష నేతలందరినీ నిర్బంధించి జైలుపాలు చేశారు.⇒ డిఫెన్స్‌ ఆఫ్‌ ఇండియా రూల్స్, మెయింటెనెన్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ (మీసా) వంటి చట్టాలతో ఎవరినైనా కటకటాల్లోకి నెట్టారు. ⇒ ఈ నిర్బంధాలకు గుర్తుగా ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆ సమయంలో పుట్టిన తన కూతురికి మీసా భారతి అని పేరు పెట్టుకోవడం విశేషం! ⇒ న్యాయవ్యవస్థ హక్కులకు కూడా కోత పడింది. విపక్ష నేతలను అరెస్టు చేయాలంటూ జారీ చేసే కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యాయస్థానాలు సమీక్షించకుండా వాటి అధికారాలకు కత్తెర వేశారు. ⇒ జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకంటూ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. ⇒ సుందరీకరణ పేరుతో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోని మురికివాడలన్నింటినీ అధికారులు నేలమట్టం చేసి లక్షలాది మందికి నిలువ నీడ లేకుండా చేశారు.చివరికేమైంది? ⇒ ఎమర్జెన్సీ ఎత్తేశాక 1977 జనవరి 20న లోక్‌సభను రద్దు చేశారు. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తొలిసారి ఓటమి పాలైంది. ⇒ ఇందిరతో పాటు ఆమె తనయుడు సంజయ్‌ కూడా ఓటమి చవిచూశారు. ⇒ మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా మార్చి 24న జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ⇒ లుకలుకలతో కొద్దికాలానికే కుప్పకూలినా, కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోయింది. ⇒ ఎమర్జెన్సీ ఆందోళనల్లోంచే ఫెర్నాండెజ్, కారత్‌ వంటి కొత్త తరం నాయకులు ఎదిగి వచ్చారు.మీడియాకూ చుక్కలే ⇒ ఎమర్జెన్సీ కాలంలో మీడియాపై ఇందిర సర్కారు, ముఖ్యంగా ఆమె తనయుడు సంజయ్‌ గాంధీ అక్షరాలా ఉక్కుపాదం మోపారు! అందుకోసం ప్రివెన్షన్‌ ఆఫ్‌ పబ్లికేషన్‌ ఆఫ్‌ అబ్జెక్షనబుల్‌ మ్యాటర్‌ పేరుతో చట్టమే తెచ్చారు. ⇒ మాట విననందుకు 200 మందికి పైగా జర్నలిస్టులను అరెస్టు చేశారు. వారిపై పన్నుల ఎగవేత వంటి పలు అభియోగాలు మోపారు. ⇒ జేపీ ఉద్యమానికి కవరేజీ ఇచ్చినందుకు కుల్‌దీప్‌ నయ్యర్, కె.ఆర్‌.మల్కానీ వంటి జర్నలిస్టులను జైలుపాలు చేశారు. ⇒ మాట వినని పత్రికలకు న్యూస్‌ ప్రింట్‌ అందకుండా చేశారు. ⇒ చివరికి గాంధీ స్వయంగా స్థాపించిన నవజీవన్‌ ప్రెస్‌ తాలూకు ప్రింటింగ్‌ యంత్రాలన్నింటినీ జప్తు చేశారు. ⇒ ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (పీటీఐ), యునైటెడ్‌ న్యూస్‌ ఆఫ్‌ ఇండియా (యూఎన్‌ఐ), హిందూస్తాన్‌ సమాచార్, సమాచార్‌ భారతి వంటి వార్తా సంస్థలను ‘సమాచార్‌’ పేరిట బలవంతంగా విలీనం చేసిపారేశారు. ⇒ వార్తా పత్రికలపై నియంత్రణ కోసం ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోలో ఒక ఐపీఎస్‌ అధికారిని ప్రత్యేకంగా నియమించారు. ప్రతి వార్తనూ అక్షరాక్షరం క్షుణ్నంగా చదివి సరేనన్న మీదటే ప్రింటుకు వెళ్లేది. ⇒ ఇన్ని చేసినా కలానికి మాత్రం సంకెళ్లు వేయలేకపోయారు. నియంతృత్వాన్ని నిరసిస్తూ మీడియా గళం విప్పింది. ⇒ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఖాళీ ఎడిటోరియల్‌ ప్రచురించింది.సినిమాలకూ చీకటి రోజులే!⇒ బాలీవుడ్‌తో పాటు దేశ సినీ పరిశ్రమకు కూడా ఎమర్జెన్సీ చీకటి కాలంగానే మిగిలిపోయింది.⇒ సంజయ్‌గాందీని ప్రస్తుతించేందుకు నిరాకరించారని బాలీవుడ్‌ స్టార్‌ దేవానంద్‌ సినిమాలను దూరదర్శన్‌లో నిషేధించారు.⇒ ప్రభుత్వ 20 సూత్రాల పథకాన్ని పొగిడేందుకు ఏర్పాటు చేసిన గాన విభావరిలో పాల్గొనేందుకు ససేమిరా అన్న గాయక దిగ్గజం కిశోర్‌కుమార్‌ గొంతు ఆలిండియా రేడియోలో విని్పంచకుండా, ఆయన పాటలు దూరదర్శన్‌లో కన్పించకుండా చేశారు.⇒ ఇందిరను పోలిన పాత్రలో సుచిత్రసేన్‌ జీవించిన ‘ఆం«దీ’, నియంతృత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరిన ‘కిస్సా కుర్సీ కా’ వంటి సినిమాలను నిషేధించారు. ఇందిర నియంతృత్వాన్ని సినీ పరిశ్రమ ఎదిరించింది. దేవానంద్‌ ఏకంగా నేషనల్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పేరిట కొత్త పార్టీయే పెట్టారు.⇒ శత్రుఘ్న సిన్హా, ప్రాణ్, డానీ డెంగ్జోంగ్పా వంటి బాలీవుడ్‌ దిగ్గజాలు పొలిటికల్‌ స్టార్‌ బ్రిగేడ్‌ పేరిట జనతా పార్టీకి మద్దతిచ్చారు. ⇒ విప్లవ ఇతివృత్తంతో పట్టాభిరామారెడ్డి దర్శకత్వం వహించిన కన్నడ సినిమా చండ మారుతను నిషేధించడమే గాక అందులో నటించిన ఆయన భార్య స్నేహలతారెడ్డిని కటకటాల్లోకి నెట్టారు. ఏడాదికి పైగా తీవ్ర నిర్బంధంలో గడిపిన ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పెరోల్‌పై బయటికొచ్చిన ఐదు రోజులకే కన్నుమూశారు.హోం మంత్రికే తెలియదు! దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం మర్నాటిదాకా సాక్షాత్తూ నాటి కేంద్ర హోం మంత్రి ఓం మెహతాకే తెలియదు! ఉదయం పత్రికల్లో చదివి విస్తుపోవాల్సి వచ్చింది. తర్వాత కాసేపటికే కేంద్ర కేబినెట్‌ను సమావేశపరిచిన ఇందిర, ఎమర్జెన్సీ విధింపు గురించి సహచర మంత్రులకు తీరిగ్గా వెల్లడించారు. అనంతరం ఆలిండియా రేడియోలో జాతినుద్దేశించి ప్రసంగించారు. తన సర్కారుకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో లోతైన కుట్ర జరుగుతున్నందున తనకు మరో దారి లేకపోయిందని చెప్పుకొచ్చారు.ఇది ప్రజాస్వామ్యానికి ఇందిర పాతర వేసిన రోజు – ఎమర్జెన్సీ నిర్ణయంపై లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Sakshi Guest Column On Indira Gandhi National Emergency By Vundavalli8
ఆ ‘చీకటి’ కోణానికి మరోవైపు...

1975 జూన్‌ 25న భారతదేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. ఈ సంవ త్సరానికి యాభై ఏళ్ళు పూర్తయ్యింది! నిజానికి 1962 నుండి 1968 వరకూ మన దేశంలో ఎమర్జెన్సీ విధించబడిన విషయం మనకెవ్వరికీ తెలీదు. చైనా యుద్ధం వల్ల ఆనాటి ప్రెసిడెంట్‌ సర్వే పల్లి రాధాకృష్ణన్‌ దేశంలో ఆత్యయిక పరిస్థితిని విధించారు. అలాగే 1971 నుండి ’77 వరకూ బంగ్లాదేశ్‌ యుద్ధ సమయంలో వి.వి. గిరి ఆత్యయిక స్థితి విధించారు. అంటే ఇందిరాగాంధీ మొట్ట మొదటిసారి ప్రమాణస్వీకారం చేసిన 1966లోనూ, రెండవ సారి ప్రధానైన 1971లోనూ మనదేశం అత్యవసర పరిస్థితు ల్లోనే ఉంది. అయితే ప్రజల మీద ఆ పరిస్థితి ప్రభావం లేదు.1975లో మొదటిసారి అంతర్గత ఎమర్జెన్సీ విధించ బడింది. అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఇందిరా గాంధీ మీద ఆ ‘మచ్చ’ ఇప్పటికీ తొలగిపోలేదు. అయితే 1975 నాటి పరిస్థితులు, రాజకీయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామని ఈ చిన్న ప్రయత్నం.పాలనకు అవరోధాలు1966 జనవరి 24న ఇందిరాగాంధీ భారత ప్రధాని అయ్యారు. సోషలిస్టు భావాలున్న ఇందిరకు, కేపిటలిస్ట్‌ భావ జాలాన్ని బలపరిచే మొరార్జీ దేశాయ్‌ వంటి నాయకుల నుంచి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే వచ్చాయి.1962లో నెహ్రూ నాయకత్వంలో 361 సీట్లు గెలిచిన కాంగ్రెస్, 1967లో ఇందిర నాయకత్వంలో 243 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏదైనా సంపూర్ణ చికిత్స చేస్తే గానీ కాంగ్రెస్‌ నిలబడే అవకాశాలు కన్పించటం లేదు. ఆ సమయంలో ప్రధాని ఇందిర తన తండ్రి నెహ్రూ సంకల్పించి, అమలు చేయలేకపోయిన ‘ఆవడి’ కాంగ్రెస్‌ తీర్మానాలను దులిపి బయటకు తీసింది. ఉప ప్రధాని మొరార్జీ చేతుల్లో ఉన్న ఆర్థిక శాఖను తనే తీసేసుకుంది (ఫలితంగా మొరార్జీ ఉప ప్రధాని పదవికి రాజీనామా చేసేశారు).వెంటనే బ్యాంకుల జాతీయీకరణను ప్రకటించింది ఇందిరాగాంధీ. 1969 జూలై 15 నాటికి రూ. 50 కోట్లు మించి డిపాజిట్లున్న 14 బ్యాంకులను ప్రభుత్వపరం చేస్తూ ఆర్డినెన్స్‌ జారీ అయింది. ‘దారిద్య్రాన్ని తొలగిద్దాం’ (గరీబీ హఠావో) నినాదంతో సొంత ఎజెండాను అమలుచేయటం ప్రారంభించింది. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఇందిర తెచ్చిన ‘బ్యాంకుల జాతీయీకరణ’ ఆర్డినెన్సును సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజభరణాలు (ప్రివీ పర్సులు) రద్దు చేస్తూ ఇందిర తీసుకున్న నిర్ణయాన్ని లోక్‌సభ ఆమోదించినా... రాజ్య సభలో పాస్‌ కాలేదు. మరోపక్క దేశాన్ని మిలిటరీ స్వాధీనం చేసుకుంటుందన్న పుకార్లు బలంగా వ్యాపించాయి. ఇక, 1974లో గుజరాత్‌లోని ఒక ఇంజినీరింగ్‌ కాలేజీలో హాస్టల్‌ మెస్‌ ఛార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన విద్యార్థుల ఆందోళన... అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి చిమన్‌భాయ్‌ పటేల్‌ (కాంగ్రెస్‌) వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం చెందింది. పైకి ఈ ఉద్యమం చిమన్‌భాయ్‌ పటేల్‌కు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు కనిపించినప్పటికీ, వాస్తవంగా ఇది ఇందిరా గాంధీ వ్యతిరేక ఉద్యమమే!సాక్షాత్తూ జయప్రకాశ్‌ నారాయణ్‌ రంగంలోకి దిగడంతో, దాని విలువ విపరీతంగా పెరిగింది. ఏనాడూ ఏ పదవీ ఆశించని ఈ గాంధేయ విప్లవకారుడు... గుజరాత్‌ ఉద్యమంలోకి రావటంతో ఇందిరకు కష్టాలు ప్రారంభమయ్యాయి.సరిగ్గా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవు తున్న 1975 జూన్‌ 12 నాడే... ఇందిర శిబిరంలో మరో బాంబు పేలింది. రాయబరేలీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పిచ్చింది. జయప్రకాశ్‌ నారాయణ్, మొరార్జీ వంటి అగ్ర నాయకులు ఇందిర వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో జయ ప్రకాశ్‌ నారాయణ్‌ మాట్లాడారు. అర్హత కోల్పోయిన ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వులను పాటించవద్దని మిలిటరీ, పోలీసులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు కాలేజీలకు వెళ్ళడం మానేసి, మరో స్వాతంత్య్ర పోరాటంలోకి దూకాలన్నారు.రాజ్యాంగానికి లోబడే...1975 జూన్‌ 25 అర్ధరాత్రి, ఆర్టికల్‌ 352(1) అనుసరించి భారత రాష్ట్రపతి ‘ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌’ దేశంలో అత్యవసర పరిస్థితి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతికి ఇందిర అత్యవసర స్థితిని సిఫార్సు చేసిన ఉత్తరంలోనే క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోకుండానే ఈ సిఫార్సు చేస్తున్నాననీ, ఆ విధంగా చేయడం కూడా బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం రూల్‌–12కి లోబడే చేస్తున్నాననీ ఆమె పేర్కొన్నారు. రేపు తెల్లవారగానే క్యాబినెట్‌ మీటింగ్‌ పెడ్తున్నానని కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. ఆ విధంగా రాజ్యాంగానికి లోబడే అత్యవసర స్థితి ప్రకటించబడింది.ఎమర్జెన్సీ ప్రకటించిన నెల రోజుల్లోపే... అంటే 1975 జూలై 23న లోక్‌సభ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఆమోదించింది.రెండు రోజుల చర్చ తర్వాత 336 మంది అనుకూలంగానూ, 59 మంది వ్యతిరేకంగానూ ఓటు చేశారు.ఇప్పటికీ అదొక చీకటి రాజ్యమనీ, ఆమె ఒక నియంత అనీ, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందనీ, ఆమె వ్యతిరేకులు అంటూనే ఉంటారు. రాజ్యాంగంలోంచే ఆర్టికల్‌ 352 తీయ బడిందనీ, ఆ అధికరణం ప్రకారం ఎమర్జెన్సీ ప్రకటించటం రాజ్యాంగ విరుద్ధమెలా అవుతుందనీ నాలాంటి వాళ్ళకనిపించినా... కాంగ్రెస్‌ పార్టీయే ‘సారీ’ చెప్పాక అది తప్పే అయి వుంటుంది అనుకుని... ఇక మాట్లాడలేదు!యశపాల్‌ కపూర్‌ అనే ‘ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ’ తన రాజీనామాను ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాకు జనవరి 13న పంపించాడు. 1971 జనవరి 25న ప్రెసిడెంట్‌ ఆమోద ముద్ర పడింది. ఆ ఉత్తర్వుల్లోనే జనవరి 14 నుంచి అతను ఉద్యోగంలో లేడని స్పష్టంగా ఉంది (విత్‌ రెట్రాస్పెక్టివ్‌ ఎఫెక్ట్‌). అయినా 25కి ముందే ఆయన ఇందిర తరఫున పార్టీ మీటింగుల్లో పాల్గొన్నాడని ప్రధాని పదవి రద్దయిపోయింది. సుప్రీంకోర్టులో జస్టిస్‌ కృష్ణయ్యర్‌ వంటి జడ్జి ‘స్టే’ ఇచ్చినా ‘‘లెక్క చేయం... నువ్వు రాజీనామా చేయాల్సిందే’’ అనటం అంత పెద్ద నాయకుల స్థాయికి తగుతుందా? సరే... ఎమర్జెన్సీ ఎత్తేయటం, ఎన్నికలకు పిలుపు నివ్వటం, ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీ పార్టీ ఓడిపోవటం... నిశ్శబ్దంగా అధికార మార్పిడి జరిగిపోవటం... ఈ చర్యలు కూడా ఆవిడ నియంతృత్వంలో భాగమేనా? దేశమంతా చీకటి పాలనకు వ్యతిరేకంగా ఓటువేస్తే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న మన రాష్ట్రంలో ఇందిర 42 సీట్లకు 41 సీట్లు ఎలా గెలిచింది! మనకి చీకటంటే అంత ఇష్టమా? అలాగే తమిళనాడు, కేరళ... దక్షిణ భారతంపై ఆ చీకటి ప్రభావం ఎందుకు చూపలేదు?ఎమర్జెన్సీని దేశప్రజలు అధిక శాతం వ్యతిరేకించారు. కానీ ఎమర్జెన్సీ విధించకుండా 1975 జూన్‌ 26 తర్వాత... కనీసం ఒక్కరోజైనా ఆమె పరిపాలించగలిగేదా? ఇందిరకు ఉన్న ప్రత్యామ్నాయాలు పరిమితం. ఒకటి: రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకోవడం, రెండు: పార్లమెంటును రద్దుచేసి వెంటనే ఎన్నికలకు పోవడం.ఇప్పటివరకూ ప్రధానమంత్రుల్ని దింపేయటం, ప్రధాన మంత్రులను చేయటం పార్లమెంటులో జరిగింది గానీ... రోడ్ల మీద ధర్నాలు, ఊరేగింపుల వల్ల జరిగితే ఇక పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది?1952 నుంచి ఇప్పటి వరకూ ఏ ఎన్నికల్లోనూ ఏ పార్టీ కూడా 50% ఓట్లు సంపాదించి గెలవలేదు. 1984లో ఇందిర హత్యానంతరం 404 లోక్‌సభ సీట్లు గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్‌కు పోలైన ఓట్లు 50% లేవు. అలాంటిది, ఒక ‘స్టే’ చెయ్యబడ్డ, పూర్తిగా టెక్నికల్‌ అయిన కోర్టు తీర్పును అడ్డు పెట్టుకొని ప్రధాని గద్దె దిగాలంటే... ఎలాంటి దృష్టాంతం (ప్రిసిడెంట్‌) ఏర్పడుతుంది? స్వతంత్ర, జన్‌సంఘ్‌ వంటి క్యాపిటలిస్టు పార్టీలు సోషలిస్టు ఇందిరను ఎలాగైనా దింపె య్యాలి అనుకున్నప్పుడు... లొంగిపోవాలా? తిరగబడాలా?ఇందిరా గాంధీ తిరగబడింది. పర్యవసానంగా ఎన్నికల్లో ఓడిపోయింది. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన వారందరూ కలిసి రెండు ఏళ్ళలో ఏం పరిపాలన చేశారో కూడా దేశం చూసింది. ‘ఇందిరా కో బులావో, దేశ్‌ కో బచావో’ (ఇందిరను పిలవండి, దేశాన్ని కాపాడండి) అంటూ 1980లో మళ్ళీ ఆమెనే పిలిచి ప్రధాన మంత్రిని చేశారు.(ఇప్పటికీ 352 ఆర్టికల్‌ చిన్న సవరణతో అలాగే ఉంది. అంతర్గత అలజడులు (ఇంటర్నల్‌ డిస్టర్బెన్స్‌)కు బదులుగా సాయుధ తిరుగుబాటు (ఆర్మ్‌›్డ రెబెలియన్‌) అని సవరించడం గమనార్హం!)ఉండవల్లి అరుణ కుమార్‌ వ్యాసకర్త లోక్‌సభ మాజీ సభ్యుడు(కాంగ్రెస్‌)

Iran-Israel ceasefire takes hold as Trump applies pressure9
ఆగిన దాడులు!

టెహ్రాన్‌/టెల్‌ అవీవ్‌/వాషింగ్టన్‌/జెరూసలేం: యుద్ధజ్వాలలతో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. పట్టపగ్గాల్లేని ప్రతీకారాలతో రణాగ్ని రాజేసిన ఇజ్రాయెల్, ఇరాన్‌ శాంతించాయి. ఇజ్రాయెల్‌కు దన్నుగా ఇరాన్‌పై బంకర్‌ బాంబుల వర్షం కురిపించిన అమెరికా, ఆ తర్వాత తీరిగ్గా శాంతిమంత్రం జపించింది. తన కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇరు దేశాలూ అంగీకరించాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం తెల్లవారుజామున ప్రకటించారు. కానీ అప్పటినుంచి రోజంతా పలు నాటకీయ పరిణామాలు జరిగాయి.ఇరాన్, ఇజ్రాయెల్‌ దాడుల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. దాంతో ట్రంప్‌ తీవ్ర అసహనం వెలిబుచ్చారు. ఒక దశలో ఇజ్రాయెల్‌పై కన్నెర్రజేశారు. తర్వాత ఎట్టకేలకు ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో 12 రోజులుగా సాగుతున్న పోరుకు ప్రస్తుతానికి తెర పడింది. ఈ పరిణామాన్ని భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ స్వాగతించాయి. అయితే కాల్పుల విరమణ షరతులేమిటి, ఇరు దేశాలు వాటిలో ఎన్నింటికి, ఏ మేరకు అంగీకరించాయి వంటివన్నీ ప్రస్తుతానికైతే జవాబుల్లేని ప్రశ్నలే! ట్రంప్‌ తిట్ల వర్షం సంపూర్ణ కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, ఇరాన్‌ అంగీకరించాయంటూ మంగళవారం తెల్లవారుజామున ట్రంప్‌ తన సామాజిక మాధ్యమం‘ట్రూత్‌ సోషల్‌’లో పోస్టు చేశారు. ‘‘కాల్పుల విరమణ మరో ఆరు గంటల తర్వాత నెమ్మదిగా అమల్లోకి వస్తుంది. ఇరు దేశాలూ సైనిక చర్యల నుంచి వెనుదిరుగుతాయి. రెండు దేశాలను అభినందిస్తున్నా. ఈ యుద్ధం కొనసాగితే పశ్చిమాసియా భస్మీపటలం అవుతుంది. అంతదాకా పోనివ్వను. కాల్పుల విరమణతో ప్రపంచం, పశ్చిమాసియా శాంతిని గెల్చుకున్నాయి’’ అని చెప్పుకొచ్చారు. విరమణ వెనుక ఖతార్‌ ప్రధాని షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌రహీమ్‌ అల్‌ థానీ కృషి కూడా ఉందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కానీ ట్రంప్‌ ప్రకటన తర్వాత కూడా ఇజ్రాయెల్, ఇరాన్‌ పరస్పర దాడులు కొనసాగాయి.తమకు ఎలాంటి విరమణ ప్రతిపాదనా రాలేదని ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌ తొలుత ప్రకటించింది. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్‌లోని బీర్‌òÙబా సిటీపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో నలుగురు చనిపోయారు. అనంతరం ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తాము దాడులు చేశామన్న ఆరోపణలను తోసిపుచ్చారు. అయితే, తొలుత దాడులు చేసింది ఇజ్రాయెలేనని గుర్తు చేశారు. వాళ్లే ముందుగా దాడులు ఆపితే తామూ ఆపుతామని ప్రకటించారు. తర్వాత దక్షిణ, ఉత్తర ఇరాన్‌ ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ దాడుల్లో పలువురు చనిపోయారు. టెహ్రాన్‌ సమీపంలోని రాడార్‌ వ్యవస్థలపైనా ఇజ్రాయెల్‌ క్షిపణులు, బాంబులతో దాడులు చేసింది.మళ్లీ ఉల్లంఘనకు పాల్పడితే దీటుగా బదులిస్తామని హెచ్చరించింది. అయినా ఇరాన్‌ దాడులను ఉధృతం చేయడంతో మరోసారి ప్రతిదాడులకు దిగింది. ఈ పరిణామాలపై ట్రంప్‌ మండిపడ్డారు. రెండు దేశాలూ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డాయంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో వాటినుద్దేశించి పలు బూతు మాటలు కూడా ప్రయోగించారు. ‘‘బాంబులేయడం ఆపండి. మీ పైలట్లను వెంటనే వెనక్కి పిలిపించండి’’ అంటూ ఇజ్రాయెల్‌కు అలి్టమేటమిచ్చారు. యుద్దం మొదలయ్యాక ఇజ్రాయెల్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేయడం ఇదే తొలిసారి. ‘‘ఇరాన్‌ ఇక ఎప్పటికీ అణ్వస్త్రదేశంగా అవతరించబోదు. అణుబాంబును తయారు చేయబోదు’’ అంటూ ట్రంప్‌ ప్రకటించారు. అయితే ఇరాన్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాత్రం అమెరికాకు లేదని స్పష్టం చేశారు.తర్వాత ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూతో ఫోన్‌లో మాట్లాడారు. దాంతో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు నెతన్యాహూ ప్రకటించారు. అయితే ఆ తర్వాత కూడా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో బాంబుల మోతలు విని్పంచినట్టు తెలుస్తోంది. యుద్దం మొదలైననాటి నుంచి ఇరాన్‌లో 974 మంది చనిపోయారని, 3,458 మందికిపైగా గాయపడ్డారని వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే హ్యూమ్‌ రైట్స్‌ యాక్టివిస్ట్స్‌ సంస్థ ప్రకటించింది. తమ దేశంలో 28 మంది చనిపోయారని, 1,000 మందికిపైగా గాయపడ్డారని ఇజ్రయెల్‌ పేర్కొంది. కొద్దిరోజులుగా మూసేసిన తన గగనతలాన్ని మంగళవారం సాయంత్రం తిరిగి తెరిచింది. పశ్చిమాసియా దేశాలకు విమాన సరీ్వసులను బుధవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది.పరిష్కారానికి తోడ్పడతాంఇరాన్‌–ఇజ్రాయెల్‌ నడుమ ఘర్షణలను తగ్గించడంలో తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధమని భారత్‌ ప్రకటించింది. ‘‘యుద్ధం ఏ సమస్యలకూ పరిష్కారం కాదు. చర్చలే ఏకైక మార్గం. ముందనుంచీ ఇదే భారత్‌ వైఖరి’’ అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొందిమరో శాస్త్రవేత్త మృతిఅణు కార్యక్రమంలో ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ అణు కార్యక్రమానికి అత్యంత కీలకమైన శాస్త్రవేత్త మొహమ్మద్‌ రెజా సెదీఘీ సాబర్‌ను ఇజ్రాయెల్‌ హతమార్చింది. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ఇరాన్‌లోని ఆస్తనీయే అష్రాఫీయేలో తల్లిదండ్రుల ఇంట్లో ఉన్న ఆయనపై దాడి చేసింది. జూన్‌ 13న జరిగిన దాడి నుంచి రెజా తప్పించుకున్నా ఆయన 17 ఏళ్ల కుమారుడు చనిపోయాడు. రెజాపై అమెరికా గతంలోనే ఆంక్షలు విధించింది. ఆయన మృతితో తాజా పోరులో భాగంగా ఇజ్రాయెల్‌ హతమార్చిన ఇరాన్‌ అణుశాస్త్రవేత్తల సంఖ్య ఏకంగా 14కు పెరిగింది.

Sensex ends 158 points higher and Nifty settles above 2500010
సీజ్‌ఫైర్‌ ఉల్లంఘన.. స్వల్ప లాభాలతో సరి

ముంబై: ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడటంతో దేశీయ స్టాక్‌ సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. మంగళవారం ఇంట్రాడేలో 1,121 పాయింట్లు బలపడిన సెన్సెక్స్‌ ఆఖరికి 158 పాయింట్ల స్వల్ప లాభంతో 82,055 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 72 పాయింట్లు పెరిగి 25,044 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, క్రూడాయిల్‌ ధరలు దిగిరావడంతో ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి.ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటనతో ప్రథమార్థంలో కొనుగోళ్ల జోరు కనిపించింది ఒక దశలో సెన్సెక్స్‌ 1,121 పాయింట్లు ర్యాలీ చేసి 83,018 వద్ద, నిఫ్టీ 346 పాయింట్లు దూసుకెళ్లి 25,318 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి. అయితే ఇరాన్‌ సీజ్‌ఫైర్‌ ఒప్పందాన్ని అతిక్రమిస్తూ క్షిపణులతో దాడులు చేస్తూందంటూ ఇజ్రాయెల్‌ ఆరోపణలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో సూచీల ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఆసియా, యూరప్‌ మార్కెట్లు – 2–3% లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ⇒ రంగాల వారీగా బీఎస్‌ఈ ఇండెక్సుల్లో సర్వీసెస్‌ 2%, టెలికమ్యూనికేషన్, మెటల్, ఫైనాన్షియల్‌ సర్విసెస్, బ్యాంకెక్స్‌ ఇండెక్సులు ఒకశాతం పెరిగాయి. మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 0.75%, 0.50 శాతం చొప్పున లాభపడ్డాయి.సూచీలకు అదానీ షేర్ల దన్ను...అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు రాణించి సూచీల పతనాన్ని అడ్డుకున్నాయి. వివిధ వ్యాపారాలపై వచ్చే అయిదేళ్లలో 15–20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లు చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ప్రకటనతో అదానీ గ్రూప్‌ షేర్లకు డిమాండ్‌ లభించింది. అంబుజా సిమెంట్స్‌ 4%, సంఘీ ఇండస్ట్రీస్, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 3%, అదానీ పోర్ట్స్‌ 2.60%, ఏసీసీ, అదానీ ఎనర్జీ 2% లాభపడ్డాయి.⇒ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరలు దిగిరావడంతో ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీలు, ఏవియేషన్, పెయింట్స్, అడెషివ్స్‌ షేర్లకు కలిసొచ్చింది. హెచ్‌పీసీఎల్‌ 3%, ఐఓసీ, బీపీసీఎల్‌ 2% లాభపడ్డాయి. ఇండిగో ఏవియేషన్‌ 2.5%, స్పైస్‌జెట్‌ 2.15% పెరిగాయి. కన్సాయ్‌ నెరోలాక్‌ పెయింట్స్, షాలీమార్‌ పెయింట్స్‌ 2% లాభపడ్డాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement