‘ఈ-రేషన్’తో అక్రమాలకు చెక్ | Ration cards, the aadhar integration | Sakshi
Sakshi News home page

‘ఈ-రేషన్’తో అక్రమాలకు చెక్

Published Thu, Jan 9 2014 5:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

Ration cards, the aadhar integration

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: బోగస్ రేషన్ కార్డులకు అడ్డుకట్ట వేసేందుకు పౌరసరఫరాలశాఖ రంగం సిద్ధం చేసిం ది. వాటిని నిరోధించేందుకు ఇప్పటి వరకూ శతవిధాలా ప్రయత్నించినా అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోయింది. ఆఖరి అస్త్రంగా ఈ - రేషన్‌ను తెరపైకి తెచ్చింది. ఈ విధానంతో బోగస్ కార్డులకు బ్రేక్ వేయడంతో పాటు కోట్లాది రూపాయల నిత్యావసరాలు పక్కదారి పట్టకుండా చెక్ పెట్టేందుకు సన్నద్ధమైంది. అందులో భాగంగా రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
 
 నిర్ణీత గడువులోగా ఆధార్ ప్రక్రియ పూర్తయితే ఆ తరువాత నెల నుంచి నిత్యావసరాల కేటాయింపులు ఆ శాఖ కమిషనరేట్ చేయనుంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో వాస్తవ కార్డుదారుడికి నిత్యావసరాలు పూర్తిస్థాయిలో అందనున్నాయి. జిల్లాలో 2107 చౌకధరల దుకాణాలున్నాయి. వీటి పరిధిలో 9 లక్షల 10 వేల 693 రేషన్ కార్డులున్నాయి. అందులో 8 లక్షల 563 తెల్లకార్డులు, 56 వేల 946 మూడో విడత రచ్చబండ కార్డులు, 52 వేల 152 అంత్యోదయ, అన్న యోజన కార్డులు, 1032 అన్నపూర్ణ కార్డులున్నాయి. ఈ కార్డులకు సంబంధించి ప్రతినెలా 10089.343 టన్నుల పీడీఎస్ బియ్యం, 1825.355 టన్నుల అంత్యోదయ, అన్నయోజన కార్డుల బియ్యం, 10.340 టన్నులు అన్నపూర్ణ కార్డుల బియ్యం కేటాయిస్తున్నారు. 426.329 టన్నుల పంచదార, 60.000 టన్నుల గోధుమలు, 8 లక్షల 53 వేల 52 లీటర్ల కిరోసిన్ సరఫరా చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి అమ్మహస్తం పేరుతో తొమ్మిది రకాల నిత్యావసరాలను ప్రభుత్వం అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement