Civil Supplies Department
-
వెంటనే కొత్త రేషన్కార్డులు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్కార్డులు ఇవ్వాల్సిందేనని, ఈ మేరకు కొత్త రేషన్కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలసి రేషన్కార్డుల జారీ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. కొత్త రేషన్కార్డుల కోసం ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, రేషన్కార్డుల్లో కొత్తగా పేర్ల చేర్పు, తొలగింపు కోసం వచ్చిన విజ్ఞప్తులపై ఆరా తీశారు. ప్రజాపాలన అర్జీలు, కులగణనతోపాటు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు, మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మళ్లీ దరఖాస్తులు అవసరం లేదు..: ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశం ఇచ్చినా.. మీసేవ కేంద్రాల వద్ద రేషన్ దరఖాస్తుల కోసం రద్దీ ఎందుకు ఉంటోందని సీఎం ఆరా తీశారు. అయితే దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్లీ చేస్తున్నాయని, అందుకే రద్దీ ఉంటోందని అధికారులు వివరణ ఇచ్చారు. వెంటనే కార్డులు జారీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ఆలస్యం చేయకుండా కొత్త రేషన్కార్డులు జారీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే కార్డుల కోసం దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో వెంటనే షురూ.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఆ కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ మొదలుపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. కోడ్ ముగిసిన తర్వాత అన్ని జిల్లాల్లో కొత్త కార్డులు ఇవ్వాలని సూచించారు. కొత్త కార్డులకు సంబంధించి పౌర సరఫరాల విభాగం తయారు చేసిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
హమాలీల సమ్మెతో పేదలకు ప‘రేషన్’!
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరంలో రేషన్ బియ్యం కోసం పేదలు పడిగాపులు పడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇప్పటివరకు చాలా జిల్లాల్లో రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా కాలేదు. స్టేజ్–1 గోడౌన్ల నుంచి జిల్లాల్లోని మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు బియ్యం వచ్చినప్పటికీ ఎంఎల్ఎస్ పాయింట్లలో ఈ నెల ఒకటో తేదీ నుంచి హమాలీలు సమ్మె చేస్తున్న కారణంగా చాలా చోట్ల బియ్యం గ్రామాలకు చేరడం లేదు. రెండేళ్లకోసారి పెంచాల్సిన హమాలీ రేట్లను గడువు దాటి ఏడాదైనా పెంచకపోవడంతోపాటు ఇటీవల ఇచ్చిన హామీని కూడా పౌరసరఫరాల శాఖ కమిషనర్ పట్టించుకోకపోవడంతో సమ్మెలోకి వెళ్లినట్లు హమాలీలు చెబుతున్నారు. రేట్లు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని హమాలీలు తెగేసి చెబుతున్నారు. సమ్మె ఫలితంగా నాలుగు రోజులుగా చాలా గ్రామాల్లో రేషన్ దుకాణాలు తెరుచుకోవడంలేదు. ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించడం లేదు. హమాలీలు సమ్మె నోటీసు ఇచ్చినా.. రాష్ట్రంలోని ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేస్తున్న హమాలీల రేట్లను రెండేళ్లకోసారి పెంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా 2022 వరకు రేట్ల పెంపు ప్రక్రియ కొనసాగింది. ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చే బియ్యాన్ని దించడానికి, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు తరలించడానికి హమాలీలకు క్వింటాలుకు రూ. 26 లెక్కన కూలి చెల్లిస్తున్నారు. ఈ రేట్లను 2024లో సవరించాల్సి ఉండగా ప్రభుత్వం మారడంతో కాలయాపన జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు గతేడాది అక్టోబర్ 4న పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ వద్ద జరిగిన సమావేశంలో కూలి రేట్లను రూ. 26 నుంచి రూ. 29కి పెంచేందుకు ఒప్పందం కుదిరింది. అయితే అందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కాకపోవడంతో డిసెంబర్ 18న హమాలీలు పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నెలాఖరులోగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కాకుంటే జనవరి 1 నుంచి సమ్మెలోకి వెళ్తామని నోటీసు కూడా ఇచ్చారు. అలాగే గతేడాది డిసెంబర్ 28న మరోసారి నోటీసు పంపారు. అయినప్పటికీ రేట్ల పెంపు ఉత్తర్వులు కొత్త ఏడాదిలోనూ విడుదల కాకపోవడంతో ఒకటో తేదీ నుంచి సమ్మెకు దిగినట్లు హమాలీ సంఘం (ఏఐటీయూసీ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. మునీశ్వర్, ఎస్. బాలరాజ్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి మినహా... రాష్ట్రంలో 187 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా సుమారు 3,600 మంది హమాలీలు పనిచేస్తున్నారు. వారంతా ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, బీఆర్ఎస్కేయూ సంఘాల్లో సభ్యులుగా ఉండగా ఏఐటీయూసీ అనుబంధ హమాలీ సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్కేయూ మినహా అన్ని సంఘాలు సమ్మెకు మద్దతిస్తున్నట్లు హమాలీ సంఘం నాయకులు చెప్పారు. రాష్ట్రంలో 17,335 దుకాణాలు ఉండగా అందులో శనివారం 9,319 దుకాణాలనే తెరిచారు. అంటే దాదాపు సగం దుకాణాలు ఇప్పటికీ తెరవలేదు. తెరిచిన చోట కూడా కోటా పూర్తిస్థాయిలో బియ్యం రాలేదని సమాచారం. -
చిన్న మిల్లులకు పెద్ద కష్టం
సాక్షి, భీమవరం: చిన్న మిల్లుకు పెద్ద కష్టమొచ్చిoది. ధాన్యం సేకరణ లక్ష్యం తగ్గిపోగా.. మిల్లింగ్ సామర్థ్యం మేరకు కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కేటాయింపులు చేస్తుండటం చిన్నమిల్లుల మనుగడపై ప్రభావం చూపనుంది. 5 టన్నులలోపు సామర్థ్యం గల చిన్న మిల్లులకు కొద్దిరోజులకు సరిపడా ధాన్యం మాత్రమే వస్తుండటంతో వాటిని మర ఆడిన తర్వాత మిల్లులు మూసుకోవాల్సిందేనన్న ఆందోళనలో చిన్న మిల్లర్లు ఉన్నారు. ఉదాహరణకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్వారపూడి సమీపంలోని చిన్న రైస్మిల్లుకు పాత అచీవ్మెంట్ ఆధారంగా గతంలో 45 నుంచి 50 ఏసీకే (ఎక్నాలెడ్జ్మెంట్)ల ధాన్యం వచ్చేది. ఇది దాదాపు మూడు నెలల పాటు మిల్లు తిరిగేందుకు సరిపోయేది. ఇప్పుడు ధాన్యం సేకరణ లక్ష్యం తగ్గడంతో సుమారు 35 ఏసీకేల వరకు రావాలి. కానీ.. సామర్థ్యం ఆధారంగా ఇవ్వడంతో కేవలం 12 ఏసీకే ధాన్యం మాత్రమే వచ్చింది. ఇది నెల రోజుల మిల్లింగ్కు మాత్రమే సరిపోతుంది. తర్వాత రబీ ధాన్యం వచ్చే వరకు మిల్లును మూసుకోవాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక రైస్మిల్లుకు గత ర్యాండమైజ్ పద్ధతిలో 40 ఏసీకే (ఒక ఏసీకే దాదాపు 290 క్వింటాళ్లకు సమానం)లకు పైగా ధాన్యం వచ్చేది. ఈసారి ప్రైవేట్ వ్యాపారం చేసే మిల్లులకు సీఎంఆర్ ఇవ్వడం, ప్రస్తుత ధాన్యం సేకరణలో దళారుల జోక్యానికి అవకాశం కలగడంతో తమకు నచి్చన మిల్లులకు వారు ధాన్యాన్ని చేరవేస్తున్నారు. ఈ జిల్లాలో 10 ఏసీకేల ధాన్యం సేకరణ కష్టంగా మారి మిల్లు ఎంతకాలం నడుస్తుందో చెప్పలేని పరిస్థితి. గోదావరి జిల్లాల్లో 780 వరకు రైస్మిల్లులుఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రైస్మిల్లింగ్ పరిశ్రమ విస్తరించి ఉంది. ఈ రెండు జిల్లాల్లో 780 వరకు రైస్మిల్లులు ఉండగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఆకివీడు తదితర చోట్ల 360 వరకు రైస్మిల్లులు ఉన్నాయి. రెండు జిల్లాల్లో గంటకు 5 టన్నుల నుంచి 10 టన్నులకు పైగా మిల్లింగ్ సామర్థ్యం కలిగిన పెద్ద మిల్లులు 40 శాతం ఉండగా, మిగిలినవన్నీ 5 టన్నులలోపు సామర్థ్యం గల చిన్న మిల్లులే. సాధారణంగా పెద్ద మిల్లులు ప్రైవేట్ మార్కెట్కి, ఎగుమతులకు ప్రాధాన్యమిస్తే.. చిన్న మిల్లులు ఎక్కువగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)పై ఆధారపడతాయి. రైతుల నుంచి సివిల్ సప్లైస్ శాఖ సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లులకు అప్పగిస్తుంది. క్వింటాల్ ధాన్యానికి 67 కేజీల బియ్యాన్ని తిరిగి అప్పగించాలి. అందుకోసం కమీషన్ రూపంలో వారికి వచ్చేది కేవలం రూ.10 మాత్రమే. మిల్లింగ్ చేసేటప్పుడు వచ్చే తవుడు, నూకలు, చిట్టు తదితర ఉప ఉత్పత్తులకు రైస్ బ్రాన్ ఆయిల్, ఆల్కహాల్, ఇథనాల్ తయారీలో డిమాండ్ ఉండటంతో సీఎంఆర్ చేస్తుంటాయి.గతంలో పాత అచీవ్మెంట్ల ఆధారంగా...తూర్పుగోదావరిలో మిల్లింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్, ప్రైవేట్ మార్కెట్ చేస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మిల్లులు ప్రైవేట్ వ్యాపారం తక్కువగా చేస్తుంటాయి. సీఎంఆర్ చేయడంలో ఈ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రైవేట్ వ్యాపారం చేసే, డ్రయర్లు, లేటెస్ట్ టెక్నాలజీ లేని మిల్లులకు సీఎంఆర్ కేటాయింపులు చేయకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ వాటి మనుగడ దృష్ట్యా గతంలో కొన్ని సడలింపులు ఇచ్చేవారు. సీజన్లో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని బట్టి పాత అచీవ్మెంట్ల మేరకు సీఎంఆర్ కేటాయింపులు జరిగేవి. దీనివల్ల సక్రమంగా సీఎంఆర్ చేసే చిన్న మిల్లులకు కేటాయింపులకు ఇబ్బంది ఉండేది కాదు. సేకరణ లక్ష్యాన్ని తగ్గించడంతో చిన్న మిల్లులకు చిక్కులుగత ఖరీఫ్తో పోలిస్తే ఈ సీజన్లో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని తగ్గించేశారు. దీనికితోడు మిల్లింగ్ కెపాసిటీ మేరకు సీఎంఆర్ కేటాయింపులు చేయడం చిన్న మిల్లులకు చిక్కులు తెచ్చిపెట్టింది. ప్రైవేట్ వ్యాపారం చేసే మిల్లులకు సీఎంఆర్కు అవకాశం ఇవ్వడంతో చిన్న మిల్లులకు కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం ధాన్యం సేకరణలో దళారుల జోక్యం మరింత సమస్యగా తయారైంది. గత ప్రభుత్వం ధాన్యం సేకరణలో ఏ దశలోనూ దళారుల జోక్యానికి ఆస్కారం లేకుండా రైతుకు పూర్తి మద్దతు ధర అందేలా కట్టుదిట్టం చేసింది. రైతు ఆర్బీకే/సొసైటీకి ధాన్యం శాంపిల్ తీసుకువెళితే.. మిగిలిన పనంతా అక్కడి సిబ్బంది చూసుకునేవారు. ధాన్యం ఆన్లైన్ చేయగానే ఏ మిల్లుకు వెళ్లాలో కంప్యూటర్ సూచించేది. నూతన విధానంలో అడుగడుగునా దళారుల జోక్యం పెచ్చుమీరింది. కమీషన్ ఏజెంట్లు తమకు నచ్చిన పెద్ద మిల్లర్లతో మాట్లాడుకుని ధాన్యాన్ని అక్కడికే తరలిస్తున్నారు. దీంతో చిన్న మిల్లులకు ధాన్యం సేకరణ కష్టంగా తయారైంది. నెల రోజులు తిరిగితే గొప్ప ఏటా సీజన్లో చిన్న మిల్లులకు 40 నుంచి 50 ఏసీకేల వరకు ధాన్యం సేకరణ జరిగితే ఇప్పుడు అధిక శాతం 10 నుంచి 15 ఏసీకేలలోపే ఉన్నాయి. దీంతో వాటి సామర్థ్యం మేరకు నెల నుంచి నెలన్నర రోజులు మాత్రమే మర ఆడేందుకు వస్తాయని, తర్వాత రబీ ధాన్యం మార్కెట్లోకి వచ్చే వరకు మిల్లులు మూసేయాల్సిందేనని చిన్న మిల్లర్లు అంటున్నారు. మిల్లు తిరిగినా తిరగకపోయినా వాటి చిన్న, పెద్ద మిల్లుల కెపాసిటీని బట్టి సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు, అద్దెలు, నిర్వహణ రూపంలో నెలకు రూ.2.50 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ మేరకు నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఒక్కో చిన్నమిల్లులో గుమాస్తా, డ్రైవర్, జట్టు కార్మికులు 10 నుంచి 12 మంది వరకు పనిచేస్తుంటారు. మిల్లు మూతపడితే వారంతా ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది. -
ధాన్యం దళారీగా సర్కారు
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వం ధాన్యం దళారీగా మారింది. రైతులకు, మిల్లర్లకు మధ్య మధ్యవర్తిత్వం నడుపుతోంది. మిల్లర్లు చెప్పిన ధరకు ధాన్యం ఇచ్చేయాలంటూ రైతులపై ఒత్తిడి తీసుకొస్తోంది. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ పూర్తిస్థాయిలో కనీస మద్దతు ధర దక్కడంలేదు. చరిత్రలో ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్థితులు చూడలేదు’.. అంటూ అన్నదాతలు మండిపడుతున్నారు. తేమశాతంతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. గడిచిన రెండ్రోజులుగా మండల తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్బీకేలు, రైతుక్షేత్రాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశుల ఎదుట నిరసనలు వ్యక్తంచేసిన రైతులు బుధవారం విజయవాడలోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వివిధ మండలాల రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు, వివిధ రైతు సంఘాల నేతలు మాట్లాడారు. వారు ఏమన్నారంటే..మంత్రి చిటికలేసినా ధాన్యం కదల్లేదు..కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి, రోడ్లపై ఉన్న ధాన్యాన్ని సాయంత్రానికి కల్లా కాటావేసి మిల్లులకు తరలించాలని నాలుగు రోజుల క్రితం అధికారులకు చిటకలేసి మరీ చెప్పారు. రోజులు గడుస్తున్నా గింజ ధాన్యం కూడా కాటా వేయలేదు. మంత్రులు, ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో పట్టించుకోవడంలేదు. వాళ్లు పర్యటించిన చోట కూడా ధాన్యం కాటా వేయడం కానీ, మిల్లులకు తోలడంగానీ జరగడంలేదు. మారుమూల గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు ‘మద్దతు’ దక్కడంలేదు..తేమ శాతం ఎంతున్నా కొంటామంటున్నారు. ఆ తర్వాత 17 శాతం దాటితే ఐదు కేజీల కోత వేసి మిగిలిన ధాన్యాన్ని కొంటామన్నారు. పూర్తిస్థాయి మద్దతు ధర కల్పించాల్సిన ప్రభుత్వమే తరుగు మినహాయించి కొంటామని చెప్పడం దారుణం. తుపాను, వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేమ శాతం 20 నుంచి 24 శాతం వస్తోంది. రెండు శాతమో, ఐదు శాతమో కట్ చేసి మిగిలిన ధాన్యానికి మద్దతు ధర ప్రకారం లెక్కిస్తే 75 కేజీల బస్తాకు రూ.1,670 చొప్పున ఇవ్వాలి. కానీ, రూ.1,470–1,500కు మించి ఇవ్వడంలేదు. పైగా.. ధాన్యం బాగోలేదంటూ మిల్లర్లు పేచీ పెడుతున్నారు. కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఎంటీయూ 1,262, 1,318 వంటి ఫైన్ వెరైటీ ధాన్యానికి కూడా మద్దతు లభించని దుస్థితి ఏర్పడింది.రైతులకు–మిల్లర్లకు మధ్య బ్రోకర్లుగా మారారు..నిజానికి.. రైతుసేవా కేంద్రాల్లో తేమ శాతాన్ని పరీక్షించాలి. అక్కడ నిర్ధారించే దానినే ప్రామాణికంగా తీసుకుని ధరను నిర్ణయించి అదే ధరకు కొనుగోలు చేయాలి. కానీ, ఎక్కడా ఆ పరిస్థితిలేదు. ఆర్ఎస్కేలకు వెళ్తుంటే తేమ శాతం కూడా చూడడంలేదు. ఏ మిల్లుకు వెళ్తారని అడిగి అక్కడకు పంపించేస్తున్నారు. మిల్లు వాళ్లు ఏ ధర నిర్ణయిస్తారో ఆ ధరకు అమ్ముకోండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇది రైతాంగాన్ని మిల్లర్లు దోచుకునేందుకు ఉపయోగపడే పద్ధతే తప్ప రైతులకు మేలుచేసే విధానం కాదు. ఇక వాట్సప్లో ‘హాయ్’ అని మెసేజ్ పెడితే చాలు క్షణాల్లో మీ ధాన్యం కొనేస్తామంటున్నారు. కానీ, ఆచరణలో ఇదెక్కడా అమలుకు నోచుకోవడంలేదు.ఒక్క ప్రైవేటు వ్యాపారిపైనైనా కేసు పెట్టారా?ఇక ప్రైవేటు వ్యాపారులు కొనే ధాన్యాన్ని ప్రభుత్వం ఎందుకు కొనడంలేదో అర్థం కావడంలేదు. తక్కువ ధరకు కొనే వ్యాపారస్తులపై కేసులు పెడతామని చెప్పారుగానీ.. రాష్ట్రంలో ఒక్క ధాన్యం వ్యాపారిపైనైనా కేసు పెట్టారా? ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు తక్కువ రేటుకు ధాన్యం కొంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పోనీ ప్రభుత్వమైనా కొంటుందా అంటే అదీలేదు. గతేడాది కోసిన ధాన్యాన్ని కోసినట్లుగానే తీసుకెళ్లారు.. ప్రతీ రైతుకూ మద్దతు ధర లభించింది. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితిలేదు. ధర్నాలో ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు టీవీ లక్ష్మణస్వామి, కృష్ణాజిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కే. శివనాగేంద్ర, పంచకర్ల రంగారావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పీవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.ఇలా అయితే ఎండ్రిన్ తాగి చావాలి..ఏడెకరాల్లో వరి వేశాం. పంట కోసి 15 రోజులైంది. తేమ 17 శాతం ఉంది. 20 శాతమైనా తీసుకుంటామన్నారు. కానీ తీసుకోలేదు. బేరగాళ్లు వచ్చి 75 కేజీల బస్తాకు రూ.1,450 ఇస్తామన్నారు. మా రైతు రూ.1,740 చొప్పున లెక్కగట్టి కౌలు ఇవ్వాలంటున్నారు. ఇలా అయితే మా చేతి డబ్బులు పెట్టుకోవాలి. పైగా పంటను కాపాడుకునేందుకు పరదాలకు రోజుకు రూ.2వేలు ఖర్చవుతోంది. డబ్బులు కట్టలేక చచ్చిపోతున్నాం. ఇలా అయితే ఎండ్రిన్ తాగి చావడం తప్ప వేరే దారిలేదు.– పొద్దుటూరు ప్రసాద్, గొడవర్రు. కంకిపాడు మండలం, కృష్ణాజిల్లాఇలా అయితే కౌలు రైతులు బతికేదెలా?నేను మూడెకరాల్లో వరి వేశాను. గతేడాదితో పోలిస్తే ఎకరాకు ఐదు బస్తాలు తగ్గింది. తేమ శాతం తక్కువగానే ఉన్నప్పటికీ ఈ రకం ధాన్యాన్ని కొనడంలేదు. ఆర్బీకేల్లోనే 20–25 శాతం ఉంటే 1,450 ఇస్తామంటున్నారు.బయట వాళ్లు కొనడం లేదు. పంటను కాపాడుకునేందుకు పరదాల కోసం రోజుకు ఎకరాకు రూ.300–500 చొప్పున చెల్లిస్తున్నాం. ఇలా అయితే కౌలురైతులు బతికేదెలా? కోసూరి శివనాగేంద్ర, గడ్డిపాడు, పమిడిముక్కల మండలం, కృష్ణాజిల్లాగతేడాది మద్దతు ధర వచ్చింది..ఎనిమిది ఎకరాల్లో వరికోసి 10 రోజులైంది. తేమ 15.5 శాతం ఉంది. మిల్లుకు పంపిస్తామన్నారు. కానీ ఎవరూ రాలేదు. మళ్లీ వెళ్లి అడిగితే మిల్లు దగ్గరకు వెళ్లండి అంటున్నారు. బేరగాళ్లు రూ.1,400 ఇస్తామంటున్నారు. అధికారులు పట్టించుకోవడంలేదు. గతేడాది కోసిన వెంటనే 75 కేజీల బస్తాకు రూ.1,630కు కొన్నారు. ఈ ఏడాది కొనేవాడులేడు. 10 రోజులుగా రోడ్డుపైనే ధాన్యం ఉంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – గెద్దా నరేంద్ర, గొడవర్రు, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లానష్టానికి తోలాల్సి వస్తోంది..ఐదెకరాల్లో వరివేసా. ఎకరాకు 30 బస్తాలొచ్చింది. గొడవర్రు ఆర్ఎస్కు తీసుకెళ్తే 15.4% తేమ వచ్చింది. రేటు చెప్పలేదు. 90 బస్తాలు మిల్లుకు తోలారు. అక్కడ 75 కేజీల బస్తాకు రూ.1,600 కు మించి ఇవ్వమని తెగేసి చెప్పారు. ఆర్ఎస్కే సిబ్బందికి చెబితే పట్టించుకోలేదు. చేసేది లేక బస్తాకు రూ.130 చొప్పున నష్టానికి మిల్లుకు తోలాల్సి వచ్చింది.– గెడ్డం రాజా, గొడవర్రు, కృష్ణాజిల్లా -
Telangana: మిల్లర్లపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైస్ మిల్లర్లపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. పైసా పెట్టుబడి లేకుండా ఏటా కోట్ల రూపాయలు సంపాదిస్తూ కూడా, సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్) చేసేందుకు వెనుకాడుతున్నారంటూ.. మిల్లులపై కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం పెట్టే నిబంధనల మేరకు ప్రతి రైస్ మిల్లు పనిచేయాలని.. లేకుంటే మిల్లు సీజ్ చేయడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేసింది. ప్రతి మిల్లు సామర్థ్యంలో 50 శాతం మేరకు ధాన్యం అప్పగించి, తప్పనిసరిగా మిల్లింగ్ చేసేలా నిబంధన పెట్టింది. బ్యాంకు గ్యారంటీ ఇవ్వలేమంటూ తప్పించుకునే పరిస్థితి లేకుండా చర్యలు చేపట్టింది. కోట్ల రూపాయల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిపడ్డ డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ చట్టం కింద జప్తు చేయాలని నిర్ణయించింది. ఆయా మిల్లుల ఆస్తులను ఇతరుల పేర్లపైకి బదలాయించే అవకాశం లేకుండా ముందు జాగ్రత్తగా రిజి్రస్టేషన్ శాఖను అప్రమత్తం చేసింది. మిల్లర్ల ఇష్టారాజ్యానికి చెక్! రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడి, మిల్లింగ్ సదుపాయాల కొరతను ఆసరాగా చేసుకొని.. మిల్లర్లు కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మిల్లింగ్ కెపాసిటీతో సంబంధం లేకుండా సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయింపులు, ఏళ్లకేళ్లు గడిచినా బియ్యాన్ని అప్పగించకపోవడం, మిల్లు ల్లో ధాన్యం లేకపోవడం.. వంటి అవకతవకలతో పౌర సరఫరాల సంస్థ తీవ్ర నష్టాలను చవిచూసింది. దీనితో 2014–15లో రూ.4,747 కోట్లుగా ఉన్న సంస్థ అప్పులు.. 2023–24 నాటికి రూ.58,623 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు, మిల్లర్ల మాయాజాలంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొన్ని మార్గదర్శకాలను రూపొందించి... ఖరీఫ్ సీజన్ నుంచే నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టింది. కచ్చితంగా మిల్లింగ్ చేసేలా.. మిల్లులు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగించకుండా మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకోవడం, ఏళ్లకేళ్లు బకాయిలు అలానే ఉండటం వంటి సమస్యలకు చెక్ పెట్టేలా.. ప్రభుత్వం ధాన్యానికి బ్యాంకు గ్యారంటీ నిబంధన తెచ్చింది. ఈ నిబంధన వల్ల కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) చేయలేమంటూ మొండికేస్తున్న మిల్లర్లను దారికి తెచ్చేలా చర్యలు చేపట్టింది. ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్కు సంబంధించి... 2015, 2016లలో విడుదలైన 18, 36 జీవోలు, వాటికి సవరణ చేస్తూ 2023 అక్టోబర్లో జారీ చేసిన జీవో నంబర్ 25ను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలోని ప్రతి రైస్ మిల్లు దాని కెపాసిటీలో కనీసం 50శాతం మేర ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని సీఎంఆర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మిల్లు లైసెన్స్ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దీనితో కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని దించుకోమని మిల్లర్లు మొండికేసే పరిస్థితి తప్పనుంది. 2,054 మిల్లులు ‘గ్యారంటీ’కి రెడీ రాష్ట్రంలోని సుమారు 3,500 మిల్లులకుగాను.. 2,054 రైస్మిల్లులు బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చి ధాన్యాన్ని తీసుకునేందుకు అంగీకరించాయి. ఇందులో 1,274 రా రైస్ (ముడి బియ్యం) మిల్లులు కాగా.. 780 బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) మిల్లులు. ఇప్పటివరకు 1,669 మిల్లులు (992 రా రైస్, 677 బాయిల్డ్ మిల్స్) బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని అండర్ టేకింగ్ ఇచ్చాయి. అండర్ టేకింగ్ ఇచ్చిన మిల్లుల సామర్థ్యం 57.76 లక్షల మెట్రిక్ టన్నులు. డీఫాల్టర్ల విషయంలో ప్రత్యేక చర్యలు మూడు విడతల కన్నా ఎక్కువగా సీఎంఆర్ ఇవ్వకుండా ఎగవేసిన మిల్లర్లను డీఫాల్టర్లుగా గుర్తించి ధాన్యం కేటాయించకూడదని, లేదా షరతులతో కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 1,777 డీఫాల్టర్లను గుర్తించగా.. అందులో 362 మంది మిల్లర్లు కొన్నేళ్లుగా వరుసగా సీఎంఆర్ ఎగవేస్తూ వస్తున్నారు. వారికి ఈ ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయించడం లేదు. మిగతావారు మొత్తం బకాయి మొత్తం బియ్యాన్ని, అపరాధ రుసుముతో సహా అప్పగించి... దీనితోపాటు కొత్తగా ఇచ్చే ధాన్యానికి సంబంధించి 25 శాతం బ్యాంకు గ్యారంటీ ఇస్తే ధాన్యం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి ఎగవేతదారులుగా గుర్తించిన 362 మంది మిల్లర్లలో.. కేవలం 10 మంది మిల్లర్లే ఏకంగా రూ.605 కోట్ల విలువైన 1.67 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. వీరిలో ఆరుగురు సూర్యాపేట జిల్లావారుకాగా, ఇద్దరు కరీంనగర్ వారు నాగర్కర్నూల్, నిజామాబాద్ల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ రికవరీ యాక్టు ద్వారా వారి ఆస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరిస్తున్నారు. వారు ఆస్తులు అమ్ముకోకుండా, వేరేవారి పేరిట బదిలీ చేయకుండా రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ తీసుకునే ధాన్యం కేటాయింపులురైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసి... కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు మూడు నుంచి ఆరు నెలల్లోగా ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి... వచ్చిన బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ఇలా ధాన్యం తీసుకున్న చాలా మిల్లులు ఏడాదిన్నర, రెండేళ్లయినా బియ్యం తిరిగివ్వని పరిస్థితి. 2022–23 రబీ సీజన్లో మిల్లులకు కేటాయించిన 65 లక్షల టన్నుల ధాన్యంలో... సుమారు 30 లక్షల టన్నులను మిల్లింగ్ చేసి, బియ్యాన్ని మార్కెట్లో అమ్మేసుకున్నారు. అందులో 25 లక్షల టన్నుల మేర రికవరీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు పిలిచినా ఫలితం లేకుండా పోయింది. ఆ బకాయిల విలువ రూ.7 వేల కోట్లుగా లెక్కగట్టగా.. ఇప్పటివరకు రూ.3 వేల కోట్ల వరకు మాత్రమే రికవరీ అయ్యాయి. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం కేటాయించే ధాన్యానికి సంబంధించి మిల్లర్ల నుంచి కొంత మేర బ్యాంకు గ్యారంటీలు తీసుకుంటోంది. మిల్లులకు వాటికి సామర్థ్యానికి తగిన మేరకే ధాన్యాన్ని కేటాయిస్తోంది. -
రాశులకొద్దీ ధాన్యం.. కొనేవారేరీ?
సాక్షి, హైదరాబాద్: పలు జిల్లాల్లో ఈసారి పంట దిగుబడి పెరగడంతో ధాన్యం రాశులతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. అయితే ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన రైతులకు మాత్రం నిరాశే ఎదురవుతోంది. మంత్రి ఉత్తమ్ ప్రతిరోజూ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నా, క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. కొనుగోలు కేంద్రాలు తెరిచినా, కాంటా వేయడం లేదు. దీంతో రైతులకు పడిగాపులు తప్పడం లేదు. నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో పండిన మేలురకం సన్న ధాన్యాన్ని ఇప్పటికే బహిరంగ మార్కెట్లో రైతులు విక్రయించారు. క్వింటాల్కు రూ.500 బోనస్ వచ్చే సన్న ధాన్యాన్ని, ఎక్కువగా సాగయ్యే దొడ్డు ధాన్యాన్ని విక్రయించేందుకు వీలుగా రాష్ట్రంలో 7,572 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు 4,600 కేంద్రాలను తెరిచినా, అందులో సగం కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోళ్లు సాగడం లేదు. బ్యాంకు గ్యారంటీలు ఇచ్చిన మిల్లర్లకే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ధాన్యం కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నాలుగు రోజుల క్రితం వరకు మిల్లర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు నయానో, భయానో మిల్లర్లను ఒప్పించి 15 రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని రాతపూర్వకంగా ‘అండర్టేకింగ్’తీసుకుంటూ మిల్లులకు ధాన్యం కేటాయిస్తున్నారు. దీంతో చాలా జిల్లాల్లో సోమవారం నుంచి కొనుగోళ్ల ప్రక్రియ కొంత మెరుగైంది. అయినా, అనేక జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు కుప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి. బ్యాంక్ గ్యారంటీలిస్తేనే... ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ , నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్న ఈ డిఫాల్ట్ రైస్మిల్లర్ల నుంచి అండర్ టేకింగ్ తీసుకుంటూ బ్యాంక్ గార్యంటీలు, సెక్యూరిటీ డిపాజిట్లు ఇస్తామని కాగితాలు రాయించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క మిల్లర్ అవి ఇవ్వలేదని తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: ఈ జిల్లాలో 615 ధాన్యం కొనుగోలు కేంద్రాలుండగా, 404 సన్నరకాలకు 211 దొడ్డు రకాల కొనుగోళ్లకు కేటాయించారు. వీటిల్లో కేవలం 121 కేంద్రాల్లో సన్న రకం, 86 కేంద్రాల్లో దొడ్డు రకం కొనుగోళ్లు సాగుతున్నాయి. మంగళవారం నాటికి 18,320 టన్నుల సన్నరకం, 11,334 టన్నుల దొడ్డురకం ధాన్యం సేకరించారు. బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని 190 మంది రైస్మిల్లర్లు అండర్ టేకింగ్ ఇచ్చారు. – కామారెడ్డి జిల్లాలో 423 కేంద్రాలకుగాను 150 కేంద్రాల్లో కొనుగోలు మొదలయ్యాయి. ఇందులో సన్నారకాలకు 63 కేంద్రాలే తెరిచారు. కేవలం 4,250 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా : ఉమ్మడి వరంగల్లో ఆయా జిల్లాల వారీగా చూస్తే..వరంగల్లో 203 కేంద్రాలకుగాను 24 కేంద్రాలే తెరుచుకోగా, అక్కడ కొనుగోళ్లు జరుగుతున్నాయి. హనుమకొండలో మొత్తంగా 149 కేంద్రాలు, జనగామలో మొత్తంగా 180, ములుగులో మొత్తంగా 178 కేంద్రాలు తెరుచుకున్నాయి. మహబూబాబాద్లో 234 కేంద్రాలకుగాను 59, భూపాలపల్లిలో 189గాను 79 కేంద్రాలే మొదలయ్యాయి. – జనగామ జిల్లాలో 33,336 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి 30 రా రైస్, బాయిల్డ్ రైస్మిల్లులకు సరఫరా చేశారు. మరో 19 రైస్మిల్లులకు ధాన్యం తరలించేందుకు 10 శాతం గ్యారంటీపై చర్చలు జరుగుతున్నాయి. – జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోళ్లు మొదలు కాలేదు. హనుమకొండ జిల్లాలో ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు మొదలయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లాలో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్న 145 మిల్లులకు సోమవారం ధాన్యం కేటాయింపులు షురూ చేశారు. 345 కేంద్రాలను ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నా, సగం కేంద్రాల్లో కూడా కొనుగోళ్లు సక్రమంగా సాగడం లేదు. మంగళవారం వరకు జిల్లాలో కేవలం 15 వేల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు జరిగాయి. అయితే ఇంతవరకు సన్నాల కొనుగోళ్లు మొదలే కాలేదు. – సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు కొనుగోళ్లను ప్రారంభించలేదు. కేవలం కేంద్రాలను మాత్రమే ప్రారంభించి కాంటాలను మరిచారు. గ్యారంటీ ఇచ్చిన 15 మిల్లులకు ధాన్యం కేటాయించారు. – యాదాద్రి జిల్లాలో అఫిడవిట్లు ఇచ్చిన 50 మిల్లులకు ధాన్యం అలాట్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా : మెదక్ జిల్లాలో 490 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సన్నధాన్యం కొనుగోలుకు కేవలం 91 కేంద్రాలే కేటాయించారు. ఈ జిల్లాలోని 104 మిల్లుల్లో 60 మిల్లులు డిఫాల్ట్ జాబితాలో ఉండగా, 54 మిల్లులకే ధాన్యం కేటాయించాలని నిర్ణయించారు. వీరిలోనూ 30 మంది మిల్లర్లు మాత్రమే అండర్ టేకింగ్ ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. – సిద్దిపేట జిల్లాలో 417 కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటి వరకు 348 కేంద్రాలను ప్రారంభించారు. బ్యాంక్ గ్యారంటీ ఇస్తామని అండర్ టేకింగ్ ఇచ్చిన 25 మిల్లులకు ధాన్యం కేటాయించారు. – సంగారెడ్డి జిల్లాలో 183 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, ఇప్పుటి వరకు కనీసం 50 సెంటర్లలో కూడా సేకరణ షురూ కాలేదు. – ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కోతలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. కాంటా ఎప్పుడేస్తరో తెల్వదు నా పేరు చందు మల్లయ్య, నాది వరంగల్ జిల్లా రాయపర్తి. 8 ఎకరాల్లో వరి సాగుచేశా. అందులో పండిన వడ్లను రాగన్నగూడెం కొనుగోలు కేంద్రంలో పోశా. ఇప్పటివరకు కొనుగోళ్లు మొదలుకాలేదు. 15 రోజుల నుంచి కాంటా కోసం రైతులం ఎదురుచూస్తున్నం. పరదాలు అద్దెకు తెచ్చి వడ్లు పోశాం. కేంద్రం ఎప్పుడు తెరుస్తారో, కాంటా ఎప్పుడేస్తరో తెల్వదు. సాయంత్రం అయితే వర్షం ఎప్పుడు పడుతుందోనని భయంతో ఆకాశం వైపు చూస్తున్నాం. – చందు మల్లయ్యతేమ పేరుతో కొనడం లేదు నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చి పది రోజులువుతోంది. అధికారులు తేమ పేరుతో వడ్లు కొనడం లేదు. పది రోజులుగా కేంద్రం వద్దే పడిగాపులు కాస్తున్నాం. వానొస్తే వడ్లు తడిసి ఇంకా నష్టపోయే ప్రమాదముంది. – మూఢావత్ శంకర్, డిండి మిల్లుల కేటాయింపు జరగాలి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెంటనే రైస్ మిల్లులు కేటాయించాలి. కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు పెరిగిపోతున్నాయి. కాంటాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. – లలిత, కొనుగోలు కేంద్రం నిర్వాహకురాలు, సింగారెడ్డి పాలెం,(సూర్యాపేట జిల్లా) -
సన్నబియ్యానికి ‘నూకలు’ చెల్లినట్టే!
సాక్షి, హైదరాబాద్: సన్నబియ్యంలో నూకల పేరిట మిల్లర్లు భారీ స్కెచ్ వేశారు. 100 కిలోల సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు వస్తాయని కొత్తరాగం ఎత్తుకున్నారు. నిబంధనల ప్రకారం ఖరీఫ్లో 100 కిలోల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం లెక్కన ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ఈసారి కొనుగోలు కేంద్రాలకు సన్న ధాన్యం (సన్నాలు) భారీ ఎత్తున వస్తాయని భావిస్తున్న మిల్లర్లు మిల్లింగ్లో చేతివాటం చూపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు రబీలో వచ్చే ధాన్యాన్ని రా రైస్గా మిల్లింగ్ చేస్తే నూకల శాతం పెరుగుతుందని చెబుతూ వచ్చిన మిల్లర్లు.. ఈసారి సన్న ధాన్యానికి కూడా ఇదే వంక పెడుతున్నారు. గతంలో ఎన్నడూ ఖరీఫ్ ధాన్యం ఔటర్న్పై ఒక్కమాట కూడా మాట్లాడని మిల్లర్లు ఎకాఎకిన 9 కిలోల బియ్యానికి టెండర్ పెడుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సన్నబియ్యం ధర కిలోకు రూ. 50 చొప్పున లెక్క వేసుకున్నా... 9 కిలోలకు రూ. 450 అవుతుంది. క్వింటాల్ సన్న ధాన్యానికి రైతుకు ప్రభుత్వం రూ. 500 బోనస్గా ఇవ్వాలని భావిస్తుంటే... మిల్లింగ్ పేరు మీద క్వింటాల్ ధాన్యానికి రూ. 450 విలువైన బియ్యాన్ని ఎగవేసే పన్నాగంలో మిల్లర్లు ఉన్నట్లు అర్థమవుతోంది. 9 కిలోల బియ్యానికి బదులు నూకలు ఇస్తామనడం పట్ల పౌరసరఫరాల శాఖ అధికారులే విస్తుపోతున్నారు. బ్యాంక్ గ్యారంటీలపైనా తకరారు! ఖరీఫ్ సీజన్లో మిల్లర్లకు ధాన్యం కేటాయింపులో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగానే బ్యాంకు గ్యారంటీలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలలో పొందుపరిచారు కూడా. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించాల్సి ఉండగా, ముసాయిదాతోనే నిలిపివేసి, మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. రైస్మిల్లు కెపాసిటీకి అనుగుణంగా కేటాయించిన ధాన్యం విలువలో 25 శాతం మేర బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. మిల్లును లీజుకు తీసుకుంటే.. కేటాయించిన ధాన్యం విలువలో 50 శాతం మేర లీజుదారుడు చెల్లించాలి. అయితే ఈ బ్యాంక్ గ్యారంటీ నిబంధనలను మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం అనేది తమకు తలకు మించిన భారమని, మిల్లింగ్ చార్జీలు కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని, ఏపీ వంటి రాష్ట్రాల్లో క్వింటాల్కు రూ.100 చెల్లిస్తుంటే మనరాష్ట్రంలో కేవలం రూ. 10 మాత్రమే ఇస్తున్నారని మిల్లర్లు చెబుతున్నారు. అది కూడా చాలా కాలంగా ఇవ్వడం లేదని వారి ఆరోపణ. ఈ నేపథ్యంలో బ్యాంకు గ్యారంటీలను ఎత్తివేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక సీజన్లో సీఎంఆర్ ఇవ్వకుండా డిఫాల్ట్ అయిన మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకొని ధాన్యం కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంటే ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లర్లు తాము ఇవ్వాల్సిన బియ్యాన్ని అప్పగించడంతోపాటు అదనంగా 25 శాతం జరిమానా మొత్తానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తే వారికి ధాన్యం కేటాయిస్తారు. ఇలా ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లులు రాష్ట్రంలో 791 ఉన్నట్టు పౌరసరఫరాల సంస్థ తేల్చింది. రెండు, అంతకంటే ఎక్కువ సీజన్లలో డిఫాల్ట్ అయిన మిల్లులకు ఈసారి ధాన్యం కేటాయించమని మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో తేల్చిచెప్పారు. 386 మిల్లులను డిఫాల్ట్ మిల్లులుగా తేల్చడం గమనార్హం. మొత్తానికి బ్యాంకు గ్యారంటీల అంశం కూడా అటకెక్కినట్టేనని పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
సబ్సిడీలపై ఇవ్వడం ముఖ్యం కాదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసర వస్తువులను సబ్సిడీపై ఇవ్వడం ముఖ్యం కాదని.. దాని వల్ల ప్రయోజనం ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. ధరలు పెరగకుండా నియంత్రించడమే మేలు అని అన్నారు. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. ‘నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన తర్వాత.. వాటిని తగ్గించే ప్రయత్నం చేయడం, సబ్సిడీలో అందించడం వల్ల ప్రయోజనం ఉండదు.దాని కంటే 3 శాఖలు నిరంతర పర్యవేక్షణ ద్వారా ధరలు పెరగకుండా ముందే చర్యలు తీసుకోవాలి. ధరల భారం ప్రజలపై పడకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా చర్యలు తీసుకోవాలి. డిమాండ్–సప్లై మధ్య వ్యత్యాసానికి గల కారణాలను విశ్లేíÙంచి తగు చర్యలు చేపట్టాలి. విజిలెన్స్ డిపార్ట్మెంట్ క్రియాశీలకంగా పనిచేయాలి. బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఏపీలో పామాయిల్, కూరగాయలు, పప్పుల వంటి ఉత్పత్తులు పెంచేందుకు ప్రణాళిక అమలు చేయాలి. పెద్ద ఎత్తున గిడ్డంగులను అందుబాటులోకి తేస్తే రైతులకు న్యాయం చేయవచ్చు’ అని అన్నారు. -
ఖరీఫ్ నుంచే కొత్త నిబంధనలు
సాక్షి, హైదరాబాద్, : మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా దారి మళ్లించడం, నాణ్యమైన బియ్యం విక్రయించి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖను మోసం చేయడం వంటి చర్యలకు పాల్పడకుండా మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.ఈ మేరకు రూపొందించిన మార్గదర్శకాలకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసింది. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. సోమవారం మంత్రి ఉత్తమ్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన సమావేశంలో ఈ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు తెలిసింది. కెపాసిటీకి అనుగుణంగా కేటాయింపులు రైస్మిల్లులు తమకు కేటాయించిన ధాన్యాన్ని ఏడాదిన్నర వరకు కూడా మిల్లింగ్ పూర్తి చేయకుండా తమ వద్దే నిల్వ ఉంచుకుంటున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. తద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడం, ఎఫ్సీఐ రీయింబర్స్మెంట్ ఇవ్వడంలో ఆలస్యం చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మిల్లులు సీఎంఆర్ కోసం ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో 16 గంటలు పనిచేయాలని మార్గదర్శకాల్లో పొందుపరిచారు. ముడి బియ్యం ఇచ్చే రా రైస్ మిల్లులకు వడ్లు కేటాయిస్తే 8 గంటల చొప్పున రెండు షిఫ్టుల్లో రోజుకు 16 గంటలు మిల్లింగ్ చేసి 75 రోజుల్లో కేటాయించిన ధాన్యంలో 67శాతం రా రైస్ ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లుల కెపాసిటీకి అనుగు ణంగా ధాన్యం కేటాయించనున్నారు. 25 శాతం బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరిమిల్లింగ్ కోసం ధాన్యం తీసుకునే మిల్లర్లు ధాన్యం విలువకు అనుగుణంగా బ్యాంక్ గ్యారంటీ తప్ప నిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అను గుణంగా నిబంధనలు సవరించారు. కేటాయించిన ధాన్యం మిల్లింగ్ కెపాసిటీని బట్టి మిల్లింగ్కు వచ్చే 15 రోజుల ముందే 25 శాతం బ్యాంక్ గ్యారంటీని సమర్పించాల్సి ఉంటుంది. లీజు మిల్లుదారుడైతే కేటాయించిన ధాన్యంలో 50 శాతం బ్యాంక్ గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుంది. లీజు తీసుకున్న మిల్లులో గతంలో ఓనర్ సీఎంఆర్ డెలివరీ పెండింగ్ లేనట్టు డీఎంల నుంచి నోడ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతే మిల్లులకు కేటాయింపులు ఉంటాయి. రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలులో ఉన్న మిల్లర్లకు సైతం ధాన్యం కేటాయింపులు ఉండవని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.డిఫాల్టర్లపై ఉక్కుపాదంగతంలో అక్రమాలకు పాల్పడినట్టు తేలిన మిల్లర్లకు, ఫేక్ ట్రక్ షీట్లు సృష్టించి కేసుల్లో ఇరుకున్న వారికి, 6 ఏ ఈసీ యాక్ట్, క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్న వారికి ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కేటాయించకూడదని, వీరికి ఈ సీజన్తోపాటు వచ్చే రెండు సీజన్ల వరకు వడ్లు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. డిఫాల్ట్ అయిన మిల్లర్లు బకాయి పడ్డ సీఎంఆర్ను అప్పగించి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకుంటేనే కొత్తగా ధాన్యం కేటాయించనున్నారు. మిల్లర్లు లీజు డీడ్ ఇవ్వడంతోపాటు కేటాయించిన ధాన్యానికి బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి కానుంది. కలెక్టర్ల పర్యవేక్షణ...జిల్లాల వారీగా రైస్మిల్లుల్లో సాగే సీఎంఆర్పై కలెక్టర్లకే బాధ్యతలు అప్పగించనున్నా రు. ధాన్యం కొనుగోళ్ల నుంచి మిల్లింగ్ వరకు వారే కీలకం. బాయిల్డ్ రైస్మిల్లర్లు ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు డిసెంబర్ 31లోగా ఎఫ్ఆర్కే బ్లెండింగ్, సోర్టెక్స్ మెషీన్లు ఇన్స్టాల్ చేసుకు నేలా ఆయా జిల్లాల కలెక్టర్ చర్యలు తీసు కొని, వారికే ధాన్యం కేటాయించాల్సి ఉంటుంది. జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి అర్హత ఉన్న మేరకే ధాన్యం కేటాయించాలి. మిల్లు లను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేటాయించిన ధాన్యం దారిమళ్లినా, ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రైవేట్గా విక్రయించినా క్రిమినల్ చర్యలు తప్పనిసరి. -
రేషన్ కార్డులకు సన్న బియ్యం ఎలా?
సాక్షి, హైదరాబాద్: రేషన్కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పౌరసరఫరాల శాఖ గోడౌన్లలో సన్నబియ్యం నిల్వలు 50 వేల మెట్రిక్ టన్నులు కూడా లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి అవసరమయ్యే సన్న బియ్యాన్ని ఎలా సేకరించాలనే విషయమై సంస్థ తర్జన భర్జన పడుతోంది. ఖరీఫ్ పంట అక్టోబర్ నుంచి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఎంత మేరకు ధాన్యం వస్తుందనే విషయంలో స్పష్టత లేదు. వచి్చన సన్నాలను మరాడించి సన్న బియ్యంగా జనవరి నుంచి రేషన్ దుకాణాలకు పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. 24 ఎల్ఎంటీల బియ్యం అవసరం రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో రేషన్కార్డులు 89.96 లక్షలున్నాయి. ఈ కార్డుల లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు నెలకు 1.80 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) బియ్యం అవసరం. అంటే ఏడాదికి 21.60 ఎల్ఎంటీల సన్నబియ్యం కావాలి. ఇవికాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంక్షేమ హాస్టళ్లకు, మధ్యాహ్న భోజన పథకానికి కలిపి ఏటా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి. అంటే ఏటా సన్నబియ్యం 24 ఎల్ఎంటీలు అవసరమవుతుంది. ఇందుకోసం 36 ఎల్ఎంటీల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాల్సి ఉంటుంది. విద్యార్థులకు గత ప్రభుత్వ హయాం నుంచే సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నారు. ఈ ఏడాది సన్నబియ్యం కొరత ఏర్పడటంతో గత మే నెలలో 2.2 ఎల్ఎంటీ సన్న బియ్యం కొనుగోలు కోసం టెండర్లను ఆహా్వనించిన ప్రభుత్వం తరువాత వెనకడుగు వేసింది. ఖరీఫ్లో వచ్చే సన్న ధాన్యం 5 ఎల్ఎంటీ లోపే.. రాష్ట్రంలో సగటున ఏటా కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని పౌరసరఫరాల శాఖ సేకరిస్తుంది. ఇందులో ఖరీఫ్లో మాత్రమే రైతులు సన్నాలను పండిస్తున్నారు. ఈ సీజన్లో పౌరసరఫరాల శాఖ 50 నుంచి 60 ఎల్ఎంటీల ధాన్యం మాత్రమే సేకరించగలుగుతోంది. ఇందులో 5 ఎల్ఎంటీలే సన్నాలు ఉంటున్నాయి. రైతులు ఈ సీజన్లో సన్నాలను పండించినప్పటికీ, తమ అవసరాలకు నిల్వ చేసుకుంటుండటంతో మార్కెట్కు రావట్లేదు. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, నారాయణపేట జిల్లాల్లో పండే మేలు రకం సన్న ధాన్యం నేరుగా మిల్లులకు వెళ్లడం లేదంటే బియ్యంగా మార్చి విక్రయించడం జరుగుతోంది. రబీలో వచ్చే మరో 70 ఎల్ఎంటీల ధాన్యంలో సన్నాలు నిల్. రాష్ట్ర వాతావరణం రీత్యా రబీలో సన్న ధాన్యం పండిస్తే, నూకల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది దీర్ఘకాల పంట పంట కావడంతో రైతులు దొడ్డు ధాన్యాన్నే పండిస్తున్నారు. ఈ ఖరీఫ్సీజన్పై సర్కార్ ఆశరూ.500 బోనస్ ప్రకటనతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సన్నాలను రైతులు అధికంగా పండించినట్లు ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.2,320 ఉండగా, ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తే ఆ మొత్తం రూ. 2,820 అవుతుంది. కాగా 30 రకాలను రూ. 500 బోనస్ ఇచ్చే ఫైన్ వెరైటీలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫైన్ వెరైటీల్లో అధిక డిమాండ్ ఉన్న హెచ్ఎంటీ, సోనా మసూరి, జైశ్రీరాం వంటి రకాలు అధిక ధరలకు అమ్ముడుపోయినా, మిగతా వెరైటీలకు డిమాండ్ లేకపోవడంతో అవి మార్కెట్కు వస్తాయని భావిస్తోంది. అక్టోబర్ చివరి నుంచి ధాన్యం సేకరణ చేపట్టి, సన్నాలను వెంటవెంటనే మిల్లింగ్ చేస్తే జనవరి నాటికి రేషన్ దుకాణాలకు పంపవచ్చని ఓ అధికారి చెప్పారు. -
బీఆర్ఎస్ వాకౌట్
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో సన్న బియ్యం కొనుగోళ్లలో రూ.1,100 కోట్ల స్కాం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోళ్లలో జరిగిన కుంభకోణంపై సభాసంఘాన్ని నియమించా లన్న తమ డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించనందున, ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి తమ పార్టీ సభ్యు లతో కలిసి మంగళవారం రాత్రి శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి తెలియకుండా సివిల్ సప్లయ్స్ శాఖలో చాలా జరుగుతున్నాయని ఆరోపించారు.రేషన్ కార్డులు, రైతులకు పంటలకు సంబంధించిన బోనస్ విషయంలో తమ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమా ధానం చెప్పకుండా బుల్డోజ్ చేస్తోందంటూ మండిపడ్డారు. ప్రతిపక్షం ఏం చెప్పినా ప్రభుత్వానికి రుచించటం లేదని దుయ్యబట్టారు. దీనిలో మంత్రి హస్తం లేకపోయినా పెద్దల హస్తం ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం సమాధానం ఇస్తున్న తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ కుంభకోణంపై హౌజ్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేస్తున్నామని చెప్పారు. అంతకుముందు సభా సంఘాన్ని నియమించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు వెల్లో బైఠాయించి చప్పట్లు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో కలి్పంచుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సన్న బియ్యం కొనలేదు: ఉత్తమ్కుమార్రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పందిస్తూ.. సన్నబియ్యం ఒక్క గింజకూడా కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. తన శాఖలో ఏమి జరిగినా అందుకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని, ఏదీ జరగకుండానే జరిగినట్లు ఆరోపించడం తగదని చెప్పారు. మీ హయాంలో రబీలో సేకరించిన ధాన్యం మిల్లుల్లో లేదన్నారు. అప్పట్లో ప్రభుత్వం ధాన్యం విక్రయానికి టెండర్లు పిలిస్తే క్వింటాల్కు రూ. 1700 మాత్రమేనని, కానీ తమ ప్రభుత్వం వచ్చాక దొడ్డు బియ్యానికి రూ.2007, సన్నధాన్యానికి రూ.2400 ఇచి్చనట్లు గుర్తు చేశారు. పారిపోయారు: శ్రీధర్బాబు పౌరసరఫరాల పద్దుపై విపక్ష సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పూర్తిగా సమాధానం ఇచ్చినా కూడా వారు సభ నుంచి పారిపోయారని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు ఎద్దేవా చేశారు. వారి హయాంలో అన్ని అవకతవకలేనని దుయ్యబట్టారు. పదేళ్లలో ఒక్క రైతుకైనా పంట నష్టపరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు. సభనా..? బస్టాండా..?: భట్టి విక్రమార్క ‘ఇది సభనా? బస్టాండా? సభలో వెల్లోకి వచ్చి చప్పట్లు కొట్టడం ఏంటి..? వీరు మంత్రులుగా పనిచేశారు.. ఇదేం పద్ధతి? పదేళ్లు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఒక్క రోజైనా మేము ఇలా సభామర్యాదలను అగౌరవపరిచేలా చేశామా? వెల్లోకి వచ్చి చప్పట్లు కొట్టడం, ప్లకార్డులు ప్రదర్శించడం సబబు కాదు. సభాసంప్రదాయాలను మంట కలిపేలా వ్యవహరించడం సరికాదు. ప్రజలు ఇప్పటికే వారికి (బీఆర్ఎస్) బుద్ధి చెప్పారు. బుద్ధి తెచ్చుకొని వారిని సీట్లలోకి వెళ్లి కూర్చోమనండి అధ్యక్షా..! సభాసంప్రదాయాలు పాటించే వారే ఈ సభలో ఉండాలి’ అంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బ్లాక్లిస్టులో మిల్లులు.. రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సెక్యూరిటీ డిపాజిట్ కానీ, బ్యాంక్ గ్యారంటీ కానీ లేకుండానే వేల కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించే విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం ఇచ్చేటప్పుడే మిల్లర్ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలని, సకాలంలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అప్పగించక పోవడంతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించే మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తాజాగా చర్చనీయాంశమైన 2022–23 రబీ సీజన్లోని 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) ధాన్యాన్ని సీఎంఆర్ చేయని, తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంట్రాక్టు సంస్థలకు ధాన్యం అప్పగించని మిల్లులపై కొరడా ఝుళిపించనుంది. మిల్లర్ల విషయంలో ఉదాసీనత గత కొన్నేళ్లుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మిల్లర్ల విషయంలో అవలంభించిన ఉదాసీన వైఖరి ఇప్పుడు సర్కార్కు ఇబ్బందికరంగా మారింది. మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకున్న 2022–23 రబీ (యాసంగి) సీజన్కు సంబంధించిన 35 ఎల్ఎంటీల ధాన్యం రికవరీ బాధ్యతలను.. ప్రభుత్వం టెండర్ల ద్వారా నాలుగు సంస్థలకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే 3 నెలలు గడిచినా 35 ఎల్ఎంటీల్లో 2 ఎల్ఎంటీల ధాన్యాన్ని కూడా రికవరీ చేయలేదు. దీంతో విపక్షాలు ఈ ధాన్యం రికవరీ టెండర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2022–23 యాసంగి సీజన్లో మిల్లుల్లో నిల్వ చేసినట్లుగా చెపుతున్న ధాన్యాన్ని 4 కాంట్రాక్టు సంస్థలకు అప్పగించకపోతే.. వాటిని డిఫాల్ట్ మిల్లులుగా పేర్కొంటూ బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. 2022–23 యాసంగి ధాన్యంపైనే రచ్చ ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్ధతు ధరకు కొని..సీఎంఆర్ కోసం మిల్లులకు పంపడం జరుగుతుంది. ఖరీఫ్ ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి సీఎంఆర్ కింద అప్పగించే మిల్లర్లు, రబీ ధాన్యాన్ని మాత్రం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం)గా ఎఫ్సీఐకి ఇవ్వడం గత కొన్నేళ్లుగా జరుగుతోంది. రాష్ట్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రబీ ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకలుగా విరిగిపోతాయి. ఈ నేపథ్యంలో 2021లో కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి బాయిల్డ్ రైస్ను సీఎంఆర్గా తీసుకునేది లేదని స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపుల తర్వాత ప్రతి ఏటా 10 నుంచి 15 ఎల్ఎంటీల బియ్యాన్ని మాత్రమే బాయిల్డ్ రైస్గా తీసుకునేందుకు ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో 2020– 2021, 2021–2022లలో మిల్లర్లు రబీ ధాన్యాన్ని కూడా ముడిబియ్యంగా మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి అప్పగించారు. కాగా 2022–23 రబీ సీజన్లో 65 ఎల్ఎంటీల ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం యధావిధిగా మిల్లులకు అప్పగించింది. అయితే మిల్లర్లు ప్రభుత్వం వెసులుబాటు ఇచి్చన విధంగా సుమారు 20 ఎల్ఎంటీల ధాన్యాన్ని మాత్రమే బాయిల్డ్ రైస్గా మిల్లింగ్ చేసి, మిగతా ధాన్యాన్ని మిల్లులు, గోడౌన్లకు పరిమితం చేశారు. అప్పటి ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ, తాము యాసంగి బియ్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ అప్పగించలేమని మిల్లర్లు తెగేసి చెప్పారు. దీంతో పౌరసరఫరాల శాఖ మిల్లుల్లోని ధాన్యాన్ని వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు టెండర్లు ఆహ్వానించగా ఏడు సంస్థలు క్వింటాల్ ధాన్యాన్ని సగటున రూ.1,860 చొప్పున కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి. ధర తక్కువగా రావడంతో ఆ బిడ్లను రద్దు చేసిన అధికారులు మళ్లీ టెండర్లను పిలిచారు. ఈసారి 10 వేల టన్నుల కెపాసిటీ గల మిల్లర్లంతా టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు మార్చారు. అంటే ఏ మిల్లులో ఉన్న ధాన్యం ఆ మిల్లరే కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించారు. అయితే అప్పటికే ఎన్నికల కోడ్ రావడంతో ఈ టెండర్లు ఆగిపోయాయి. కొత్త టెండర్లు.. స్కామ్ ఆరోపణలు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రాగానే మిల్లుల్లో ఉన్న 2022–23 రబీ ధాన్యాన్ని విక్రయించడంపై దృష్టి పెట్టింది. కానీ ఈ ధాన్యాన్ని ఇంతవరకు ఎందుకు మిల్లింగ్ చేయలేకపోయారనే అంశంపై శ్రద్ధ పెట్టలేదు. ఎప్పటిలాగానే మిల్లర్లకు భారం కాకుండా నిబంధనలను మార్చి మిల్లుల్లో ఉన్నట్టు చెబుతున్న 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు కొత్తగా టెండర్లు పిలిచారు. ఆరు సంస్థలు ధాన్యం కొనుగోలుకు ముందుకు రాగా, మూడు నెలల క్రితం నాలుగు సంస్థలను ఎంపిక చేశారు. క్వింటాలు ధాన్యానికి సగటున రూ.2,007 రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేలా ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 90 రోజుల్లోగా అంటే ఈనెల 23వ తేదీ లోగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి రూ.7 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. కానీ ఈ 4 సంస్థలు కలిపి ఇప్పటివరకు 2 ఎల్ఎంటీల ధాన్యాన్ని కూడా సేకరించలేదని ప్రభుత్వమే చెబుతోంది. ఈ లోపు విపక్షాలు ఈ తతంగాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వంపై ఆరోపణా్రస్తాలు సంధించడం మొదలు పెట్టాయి. మిల్లుల వద్ద ధాన్యానికి బదులు క్వింటాలుకు రూ.2,223 చొప్పున కాంట్రాక్టు సంస్థలు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. మొత్తంగా రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, ఈ ధాన్యం వేలం ప్రక్రియపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లోనే నిరుటి 35 ఎల్ఎంటీల రబీ ధాన్యం విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. 4 సంస్థలకు మరో 3 నెలల గడువు ఇవ్వడంతో పాటు అప్పటికి ధాన్యం అప్పగించని మిల్లర్లను డిఫాల్టర్లుగా గుర్తించి బ్లాక్లిస్టులో పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. మిల్లర్లలో జవాబుదారీతనం పెంచేలా.. మిల్లర్లలో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ఇకపై వారివద్ద సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ధాన్యం అప్పగించేటప్పుడే సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు. ఈ విధానాన్ని అమలు చేస్తే మిల్లర్లలో జవాబుదారీతనం పెరగడంతో పాటు ధాన్యం కొనుగోళ్ల కోసం చేసే అప్పులు కూడా కొంతవరకు తగ్గుతాయని భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 3,500 పైగా రైస్ మిల్లులు ఉండగా, ఒక్కో మిల్లర్ నుంచి రూ.కోటి చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ తీసుకున్నా రూ.3,500 కోట్లకు పైగా జమయ్యే అవకాశం ఉంది. ఏపీలో 100% సెక్యూరిటీ డిపాజిట్ ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాలు సెక్యూరిటీ డిపాజిట్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. దీనివల్ల మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ అప్పగించకుంటే సెక్యూరిటీ డిపాజిట్ను జప్తు చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. ఏపీలో వంద శాతం సెక్యూరిటీ డిపాజిట్ అమల్లో ఉంది. అంటే మిల్లర్లు రూ.కోటి కడితే అంతే విలువైన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం ప్రభుత్వం అప్పగిస్తుందన్నమాట. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో 1:3 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటున్నారు. అంటే మిల్లర్లు రూ.కోటి చెల్లిస్తే రూ.3 కోట్ల విలువైన ధాన్యాన్ని వారికి ఇస్తారు. -
‘పౌర సరఫరా’లో రూ.1,000 కోట్ల స్కాం!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. మిల్లుల్లో నిల్వ ఉన్న 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం సేకరణ పేరుతో రూ.700 కోట్ల నుంచి రూ.750 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం కోసం 2.20 ఎల్ఎంటీల సన్న బియ్యం కొనుగోలు పేరిట మరో రూ.300 కోట్లు..మొత్తం రూ.1,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో బి–టాక్స్, యు–ట్యాక్స్, ఆర్ఆర్– ట్యాక్స్ రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పార్టీ నేతలు శంభీపూర్ రాజు, పెద్ది సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. 4 కంపెనీలకే టెండర్లు వచ్చేలా చేశారు.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022–23 యాసంగిలో రైతుల నుంచి సేకరించి మిల్లర్ల దగ్గర నిల్వ ఉంచిన 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు మూడు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ల కహానీకి తెరలేపింది. అధికారంలోకి వచ్చి 50 రోజులైనా కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25న కమిటీ వేసి, మార్గదర్శకాలు జారీ చేశారు. క్వింటాలుకు రూ.2,100 చొప్పున కొనుగోలు చేయానికి రైస్ మిల్లర్లు ముందుకు వచ్చినప్పటికీ తిరస్కరించి గ్లోబల్ టెండర్లు పిలిచారు. ప్రత్యేక నిబంధనలతో కేవలం 4 కంపెనీలకే టెండర్లు వచ్చేలా చేశారు. కేంద్రీయ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ కంపెనీ, నాకాఫ్ అనే నాలుగు సంస్థలు బిడ్లను దక్కించుకున్నాయి. గురుకులాల్లో కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత సరిగ్గా పనిచేయనందుకు కేంద్రీయ భండార్ అనే సంస్థను 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థ కోసం నిబంధనలు సడలించింది..’అని కేటీఆర్ విమర్శించారు. టెండర్ మొత్తానికంటే అదనంగా వసూళ్లు ‘మిల్లర్లు క్వింటాలు రూ.2,100కు కొంటామన్నప్పటికీ సగటున రూ.200 తగ్గించి రూ.1,885– రూ.2,007 మధ్య ఆ 4 సంస్థలు కొనేలా ఒప్పందం చేశారు. టెండర్ మార్గదర్శకాల ప్రకారం 90 రోజుల్లో 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని తీసుకుని ప్రభుత్వానికి రూ.7,500 కోట్లు చెల్లించాలి. మిల్లర్లతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకూడదు. కానీ మిల్లర్లతో ఆయా సంస్థలు నేరుగా ఆర్థిక లావాదేవీలు చేస్తూ మనీలాండరింగ్కు పాల్పడ్డాయి. గోదాముల్లోని ధాన్యాన్ని తీసుకుపోకుండా రైస్ మిల్లర్లపై బెదిరింపులకు పాల్పడ్డాయి. టెండర్లు వేసిన మొత్తానికి కాకుండా అదనంగా చెల్లించాలంటూ రాష్ట్రంలోని 4 వేల మంది రైస్ మిల్లర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ‘సీఎం పేషీకి ఖర్చయ్యింది.. ఢిల్లీకి పోవాలి.. పార్లమెంటు ఎన్నికలు’అంటూ క్వింటాలుకు రూ.150 నుంచి రూ.236 అదనంగా చెల్లించి తీరాలని ఒత్తిడి చేస్తున్నారు. క్వింటాలుకు రూ.236 ఎక్కువగా ఇస్తే ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు క్లియరెన్స్ ఇస్తామంటూ బంపరాఫర్ కూడా ఇచ్చారు. ఈ మేరకు జలసౌధలో అనధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దాదాపు 35 ఎల్ఎంటీలకు గాను కింటాలుకు రూ.200 చొప్పున రూ.700 కోట్ల అదనపు డబ్బు మనీలాండరింగ్ ద్వారా మిల్లర్ల దగ్గర వసూలు చేస్తున్నారు. మరోవైపు ధాన్యం లిఫ్ట్ చేసేందుకు గడువు ఈ నెల 23తో అయిపోయింది. ఇప్పటికీ 20 శాతం కూడా లిఫ్ట్ చేయలేదు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి.. బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. కానీ తమకు రావాల్సిన రూ.700 కోట్లు మొత్తం వాళ్ల చేతికి రాలేదు కాబట్టి ఈ డెడ్లైన్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు..’అని కేటీఆర్ ఆరోపించారు. సన్న బియ్యం పేరిట మరో స్కాం ‘రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకానికి 2.20 ఎల్ఎంటీల సన్న బియ్యం కావాలి. వీటి కోసం కూడా పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ పిలిచింది. ఇందులో కూడా అవే నాలుగు కంపెనీలు పాల్గొన్నాయి. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధర కిలో రూ.42–45 ఉంది. కానీ బహిరంగ మార్కెట్, మిల్లర్లను పక్కనబెట్టి టెండర్ల పిలిచారు. కిలోకు రూ.15 అదనంగా అంటే రూ.57కు టెండర్ ఖరారు చేశారు. 2.20 ఎల్ఎంటీలకు కిలోకు అదనంగా రూ.15 చొప్పున రూ.300 కోట్ల స్కామ్ జరిగింది. ఇలా మొత్తంగా రూ.1,000–1,100 కోట్ల స్కామ్ జరిగింది..’అపి కేటీఆర్ వివరించారు. ‘మా ప్రభుత్వం హయాంలో కొనుగోలు చేసిన దాంట్లో 1.6 ఎల్ఎంటీల సన్న ధాన్యం ఉంది. దాన్ని మిల్లింగ్ చేసి విద్యాశాఖకు ఇస్తే.. కేవలం 60 వేల టన్నులే కొనాల్సి వచ్చేది. కానీ 1.6 ఎల్ఎంటీల సన్న ధాన్యం కిలో రూ.22.59 పైసలకు అమ్మేశారు..’అని విమర్శించారు. -
దండిగా ధాన్యం.. నిండుగా నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం రైతులకు బాసటగా నిలుస్తోంది. ధాన్యం కొనుగోలులో సంపూర్ణ మద్దతు ధర అందించడంతో పాటు.. దేశంలోనే తొలిసారిగా రైతులకు గన్నీ, హమాలీ, రవాణా (జీఎల్టి) చార్జీల కింద టన్నుకు రూ.2523 అదనంగా చెల్లిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఖరీఫ్ 2023–24లో 4.97లక్షల మంది రైతుల నుంచి రూ.6,538 కోట్ల విలువైన 29.91లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. వీటిల్లో 4.36లక్షల మంది రైతులకు రూ.5700 కోట్ల మద్దతు ధర చెల్లించింది. మిగిలిన 61 వేల మంది రైతులకు రూ.838 కోట్లు అందించేందుకు వీలుగా నిధులను సమీకరించింది. ఆర్బీకేల్లో షెడ్యూల్ చేసిన వివరాల ప్రకారం వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో మద్దతు ధర మొత్తాన్ని జమ చేయనుంది. తద్వారా ఖరీఫ్ కొనుగోళ్లలో సంపూర్ణ చెల్లింపులను చేయనుంది. ఇక రబీ సేకరణకు సమాయత్తం ఖరీఫ్ ధాన్యం సేకరణ పూర్తవడంతో ఏప్రిల్ మొదటి వారం నుంచి రబీ కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ సమాయత్తం అవుతోంది. రబీ సీజన్లో 25లక్షల టన్నులకుపైగా ధాన్యం వస్తుందని అంచనా వేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా గోనె సంచులు, హమాలీలు, రవాణా సదుపాయాలను కల్పించేలా క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. గోదావరి జిల్లాల్లో రబీలో సాగు చేసే జయరకం (దుడ్డు బియ్యం)ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు సేకరించనుంది. గతేడాది జయ రకం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించగా కేవలం 90వేల టన్నులు మాత్రమే వచ్చి ంది. ఈసారి 3లక్షల టన్నులు సేకరించేలా ప్రణాళిక రూపొందించింది. అయితే జయరకం ధాన్యాన్ని ప్రభుత్వం స్వయంగా మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండటం రైతులకు లాభసాటిగా మారింది. ఈ రకం ధాన్యం వినియోగం స్థానికంగా చాలా తక్కువ. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో దుడ్డు బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో గతంలో ప్రైవేటు వ్యాపారులు ఇచ్చి న రేటు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వ జోక్యంతో ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి దుడ్డు బియ్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 37.68 లక్షల మంది రైతులకు మద్దతు టీడీపీ ఐదేళ్లలో కేవలం 17.94లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. కానీ, సీఎం జగన్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. అంటే టీడీపీ హయాంలో కంటే 20లక్షల మంది రైతులకు అదనంగా సీఎం జగన్ ప్రభుత్వం మద్దతు ధర అందించింది. మొబైల్ బృందాలతో పరిశీలన.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. దళారీ, మిల్లర్ల వ్యవస్థకు చెక్పెడుతూ ఆర్బీకేల కేంద్రంగా ఈ–క్రాప్ డేటా ఆధారంగా ధాన్యం సేకరణ చేసి వాస్తవ రైతుకు సంపూర్ణ మద్దతు ధరను అందిచే పటిష్ట వ్యవస్థను తీసుకొచ్చారు. క్షేత్ర స్థాయికి ఆర్బీకే అసిస్టెంట్ వెళ్లి నాణ్యతను పరిశీలించడం, ఆన్లైన్లో ధాన్యం రైతు వివరాలు నమోదు, ట్రక్ షీట్ జనరేట్, చివరికి ధాన్యం తరలించాల్సిన మిల్లును కూడా ఆటోమేటిగ్గా ఎంపిక చేసే సాంకేతిక విధానాన్ని తీసుకొచ్చారు. లోడు పక్కదారి పట్టకుండా రవాణా వాహనాలకు జీపీఎస్ను సైతం అమర్చారు. మిల్లుల్లో ధాన్యం నాణ్యత సమస్యలను రైతులతో సంబంధం లేకుండా పరిష్కరించేందుకు కస్టోడియన్ అధికారులను నియమించారు. ప్రస్తుతం ఎన్నికల సమయం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే మండలానికి ఒక ప్రత్యేక మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేసి ధాన్యం రైతుల సమస్యలను పరిష్కరించేలా దృష్టి సారించారు. ప్రభుత్వ కాల్సెంటర్కు వచ్చిన ఫిర్యాదులతో పాటు స్థానికంగా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు. దిగుబడిలో 60 శాతం కొనుగోలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా బీపీటీ, నెల్లూరు, స్వర్ణ రకాలను పండిస్తున్నారు. వీటికి జాతీయ, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంటుంది. ఇవి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కాకుండా బయటకు వెళ్లిపోతాయి. మిగిలిన రకాల ధాన్యా న్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఇలా.. ఏపీలో ధాన్యం దిగుబడుల్లో రైతుల అవసరాలకు నిల్వ చేసిన తర్వాత 60 శాతం పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. బాబు హయాంలో బకాయిలే! గతంలో రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, మిల్లర్లకు దోచిపెట్టేవారు. పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యక్షంగా రైతులు నష్టపోయేవారు. పైగా అప్పటి ఎన్నికల ముందు రైతులకు చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల ధాన్యం డబ్బులను చంద్రబాబు ప్రచార పథకాలకు మళ్లించడంతో సమయానికి డబ్బులు అందక రైతులు అల్లాడిపోయారు. చివరికి చంద్రబాబు దిగిపోతూ ఇంకా రూ.960 కోట్లు బకాయిలు పెట్టారు. వీటిని కూడా సీఎం జగన్ ప్రభుత్వమే చెల్లించింది. -
కంది రైతుకు ‘మద్దతు’కు మించి ధర
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా కందులు కొనుగోలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. అదీ.. మద్దతు ధరకు మించి.. మార్కెట్ రేటుతో సమానంగా చెల్లిస్తోంది. దీంతో కంది రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యాన ఈ సీజన్లో దాదాపు 20వేల టన్నుల కందులు సేకరించనుంది. ఇప్పటికే అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభించింది.కేంద్రం క్వింటా కందుల మద్దతు ధర రూ.7 వేలుగా ప్రకటించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మార్కెట్లో ఉన్న రేటుకే రూ. 9,500 నుంచి రూ.10 వేలు చెల్లించి కొంటోంది. రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. రైతుకు ఈ ఖర్చులూ మిగులు ఇప్పటివరకు రైతులు కందులను మార్కెట్కు తీసుకువెళ్లి విక్రయించాల్సి వచ్చేది. ఇందుకోసం గోనె సంచులు, హమాలీలు, రవాణాకు (జీఎల్టీ) పెద్ద మొత్తంలో రైతుకు ఖర్చయ్యేది. రైతుకు ఈ బాధలన్నీ తప్పిస్తూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే గ్రామాల్లోనే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తోంది. గోనె సంచులు, రవాణా, హమాలీ సౌకర్యాలను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. దీంతో రైతుకు వ్యయప్రయాసలు తగ్గిపోయాయి. ఒకవేళ రైతులే సొంతంగా జీఎల్టీని సమకూర్చుకుంటే టన్నుకు రూ.746 అదనంగా వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. పొలం నుంచి పీడీఎస్లోకి ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు రూ.140కిపైగా ఉంది. పౌర సరఫరాల శాఖ రేషన్ లబ్దిదారులకు సబ్సిడీపై కిలో రూ.67కే అందిస్తోంది. కిలో రూ.170కిపైగా ఉన్నప్పుడు కూడా ఇదే ధరకు ఇచ్ఛింది. ఇటీవల మార్కెట్లో కందిపప్పుకు డిమాండ్ పెరగడంతో భారీగా వెచ్చించి కొనాల్సిన పరిస్థితి. జాతీయ స్థాయి నోడల్ ఏజెన్సీ అయిన హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ (హాకా) వద్ద కూడా నిల్వలు లేకపోవడంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నేరుగా రైతుల నుంచే కొని, ప్రాసెసింగ్, మిల్లింగ్ చేసి రేషన్ లబ్దిదారులకు ఇచ్చేందుకు పౌరసరఫరాల సంస్థ చర్యలు చేపట్టింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 2,500 టన్నులు కందులు సేకరించింది. ఇందులో 600 టన్నులకు పైగా కందిపప్పును ప్రాసెసింగ్, మిల్లింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేస్తోంది. ఊర్లోనే కొన్నారు.. మూడు రోజుల్లో డబ్బు జమ చేశారు నా పేరు చేజాల పెద్దరాజు. అనంతపురం జిల్లా ఉరవకొండ. కొంత సొంత భూమి, మరికొంత కౌలుకు తీసుకుని 27 ఎకరాల్లో కంది సాగు చేశాను. గతంలో పంట కోత పూర్తయిన తర్వాత బళ్లారి, రాయచూర్ మార్కెట్కు తీసుకెళ్లి అమ్మేవాళ్లం. ఈ మార్కెట్లు మా ప్రాంతం నుంచి 50 నుంచి 120 కిలో మీటర్లకు పైగా దూరం ఉండటంతో రవాణాకు ఎక్కువ ఖర్చయ్యేది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వమే మా ఊర్లో ఆర్బీకేలో కొనుగోలు కేంద్రం పెట్టింది. క్వింటాకు రూ.9,370 చొప్పున చెల్లించింది. సుమారు 80 క్వింటాళ్లు విక్రయించా. మూడు రోజుల్లోనే నాకు రూ.7 లక్షలకుపైగా నగదు జమైంది. ప్రభుత్వమే రవాణా, గోనె సంచులు సమకూర్చింది. ఒకప్పుడు మేము ఎంతో కష్టపడి మార్కెట్ వరకు తీసుకెళ్తే వచ్చే ధర ఇప్పుడు అధికారులు మా దగ్గరకే వచ్చి మరీ కొని, డబ్బులు జమ చేయడం సంతోషంగా ఉంది. నిరంతరం సరఫరా చేసేలా ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి మద్దతు ధరకు మించి ధర ఇచ్చి కందులు కొనడం ఇదే ప్రథమం. దీనివ్లల రైతుకు, రేషన్ లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుంది. స్థానికంగా పండించిన పంటను స్థానిక అవసరాలకు వినియోగిస్తే సమయం, అదనపు భారం తగ్గుతాయి. బయట మార్కెట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. నిరంతరాయంగా వినియోగదారులకు పంపిణీ చేయొచ్చు. – హెచ్.అరుణ్కుమార్, ఎక్స్అఫీషియో సెక్రటరీ, ఏపీ పౌరసరఫరాల శాఖ మార్కెట్ రేటు ప్రకారమే.. ఈ సీజన్లో 20వేల టన్నులకు పైగా కందుల సేకరణపై దృష్టిపెట్టాం. పంట దిగుబడి ఎక్కువగా వచ్చే ప్రకాశం, పల్నాడు ప్రాంతాల్లో కొనుగోళ్లు వేగంగా ఉన్నాయి. ఈ–క్రాప్ ప్రామాణికంగా వాస్తవ రైతులకు మార్కెట్ రేటు ప్రకారం ధర ఇస్తున్నాం. జీఎల్టీ సైతం వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. – జి.వీరపాండియన్, ఎండీ, ఏపీ పౌరసరఫరాల సంస్థ -
200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, రూ.500కు సిలిండర్ షురూ.. 'పథకాలు ఆగవు'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా ఎన్నికల సమయంలో అభయహస్తం కింద ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించవద్దని అన్నారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ, దుబారా ఖర్చులు తగ్గించుకుని సంక్షేమ పథకాలను ఆర్థిక వెసులు బాటు మేరకు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సచివాలయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తదితరులతో కలిసి సీఎం ప్రారంభించిన అనంతరం రేవంత్ మాట్లాడారు. సంక్షేమ పథకాలు ఆపం ‘డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నాం. తెలంగాణ ఇచ్చిన విధంగానే, 2023 సెపె్టంబర్ 17న సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. ఈ ఆరు గ్యారంటీల వల్లే అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. అందువల్ల ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగతో మహిళల జీవితాలు దుర్భరంగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం దీపం పథకం తెచ్చింది. అప్పుడు రూ.400 ఉన్న సిలిండర్ను మోదీ ప్రధాని అయ్యాక రూ.1200కు పెంచారు. అలా ధర పెరిగిన సిలిండర్పై రాయితీ ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. కానీ ఎన్నికల సందర్భంగా మేం ఈ హామీ ఇచ్చాం. ఆ మేరకు లక్ష మంది మహిళల సమక్షంలో ఈ పథకాన్ని ప్రారంభించాలనుకున్నాం. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అడ్డు రావడంతో సచివాలయంలోనే ప్రారంభిస్తున్నాం. ఇతర సంక్షేమ పథకాలు కూడా అపం. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికే రోల్మోడల్గా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు: భట్టి ‘గత ప్రభుత్వానికి అధికారం అప్పగించే సమయానికి తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉంది. కానీ గత పదేళ్లలో అప్పుల కుప్పగా మార్చారు. ఉద్యోగులకు వేతనాలు కూడా అప్పులు తెచ్చి చెల్లించేవారు. ప్రస్తుతం ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారని దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. కాంగ్రెస్ హమీలు అమలు సాధ్యం కానివంటూ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది. కానీ మేం హామీలన్నీ కచ్చితంగా అమలు చేసి చూపిస్తాం. అర్హత ఉన్న వారందరికీ మార్చిలో వచ్చే విద్యుత్ బిల్లు జీరో (200 యూనిట్లలోపు వినియోగిస్తే) బిల్లుగా వస్తుంది. ఇందులో ఎలాంటి ఆంక్షలూ లేవు. అయితే వారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. అర్హత ఉండి దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తాం..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెల్ల రేషన్కార్డు ఉన్నవారందరికీ రూ.500 కే సిలిండర్: ఉత్తమ్ ‘ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని, తెల్లరేషన్ కార్డు ఉన్నవారందరికీ రూ.500 సిలిండర్ అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ఆయిల్ కంపెనీలకు ముందస్తుగా డబ్బు చెల్లిస్తామని, వారు ఆ తర్వాత లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తారని తెలిపారు. మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా ఒక్కో సిలిండర్ను రూ.500కు ఇస్తామని వివరించారు. త్వరలోనే కేవలం రూ.500 చెల్లిస్తే.. గ్యాస్ సిలిండర్ అందించేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్బాబు, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఎల్పీజీ కనెక్షన్ యాక్టివ్గా ఉండాలి రూ.500కే సిలిండర్ పొందాలంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. తెల్ల రేషన్కార్డు ఉండాలి. మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా రూ.500కు సిలిండర్లు అందజేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారి పేరిట ఎల్పీజీ కనెక్షన్ యాక్టివ్గా (కనెక్షన్ వినియోగంలో ఉండాలి) ఉండాలి. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక సర్వీస్ కనెక్షన్కే వర్తింపు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందడానికి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. తెల్ల రేషన్కార్డు కలిగి, ఆధార్కార్డు విద్యుత్ సర్వీసు కనెక్షన్తో అనుసంధానమై ఉండాలి. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికి జీరో బిల్లు వస్తుంది. రేషన్కార్డులోని యజమాని పేరు ఉన్న విధంగా ఈ పథకం కోసం విద్యుత్ సర్వీసు కనెక్షన్ పేరును డిస్కమ్లు మార్చవు. అలాంటి సర్వీసు ఉన్న వారికి యథావిధిగా బిల్లులు వస్తాయి. ఈ పథకం కింద విద్యుత్ను వాణిజ్య అవసరాలకు వాడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు. గృహజ్యోతి పథకం పొందడానికి అన్ని అర్హతలున్నా.. ప్రస్తుత పద్ధతిలోనే విద్యుత్ బిల్లు వస్తే..ఎంపీడీవో/మునిసిపల్ కార్యాలయాన్ని సందర్శించి తెల్ల రేషన్కార్డు, విద్యుత్ కనెక్షన్ సర్వీసు నంబర్ (యూనిక్ సర్వీస్ కనెక్షన్)తో అనుసంధానమైన ఆధార్ కార్డును జోడించి దరఖాస్తు ఇవ్వాలి. వినియోగదారులు ఎంపీడీవో/మునిసిపల్ కార్యాలయం లేదా ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తు అక్నాలెడ్జ్మెంట్ను చూపిస్తే చాలు..వారి దగ్గర నుంచి బిల్లును బలవంతంగా వసూలు చేయడం జరగదు. ఈ మేరకు ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ధాన్యం దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లుల్లో ఏడాది కాలంగా నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. ఆ ధాన్యాన్ని తక్కువ ధరకు పొందడం ద్వారా సర్కారు ఖజానాకు రూ. వందల కోట్ల నష్టం కలిగించేలా వ్యాపారులు, మిల్లర్లు చక్రం తిప్పుతున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ కనుసన్నల్లో సిండికేట్ అయి తమ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని 12 లాట్లుగా విభజించి బిడ్లు ఆహ్వానించగా క్వింటాల్ ధాన్యం సగటున రూ. 1,950కన్నా తక్కువ మొత్తానికి దక్కించుకునేలా 27 బిడ్లు మాత్రమే దాఖలు కావడం వ్యాపారుల కుమ్మక్కును స్పష్టం చేస్తోంది. కాగా, ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం బిడ్డర్లకు ధాన్యాన్ని అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే జరిగితే ఇప్పటికే అప్పుల్లో ఉన్న పౌరసరఫరాల సంస్థకు దాదాపు రూ. 1,500 కోట్లకుపైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ వేలం ప్రక్రియకు పౌరసరఫరాల శాఖలోని కొందరు అధికారులతోపాటు ఇతర ఉన్నతాధికారులు సహకారాన్ని అందించారనే ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. యాసంగిలో 66.84 ఎల్ఎంటీల సేకరణ రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ చేయించి ఎఫ్సీఐకి అప్పగించడం... ఎఫ్సీఐ నుంచి ధాన్యం సొమ్మును రీయింబర్స్ చేసుకోవడం అనే ప్రక్రియ గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల సంస్థ అప్పులు చేయడం... ఎఫ్సీఐ నుంచి డబ్బు తీసుకొని ఆ అప్పులు తిరిగి చెల్లించడం ఈ ప్రక్రియలో భాగమే. ఈ క్రమంలోనే 2022–23 రబీ (యాసంగి) సీజన్కు సంబంధించి సుమారు 7 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 66.84 ఎల్ఎంటీల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కనీస మద్దతు ధర కింద రూ. 13,760 కోట్లకుపైగా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేసింది. సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించింది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా..లెక్క చూపకుండా.. యాసంగి సీజన్లో క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 67 కిలోల ముడి బియ్యం (రా రైస్) ఎఫ్సీఐకి మిల్లర్లు అప్పగించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా మిల్లింగ్ చేస్తే బియ్యం విరిగి నిర్ణీత లెక్క ప్రకారం 67 కిలోల బియ్యం రావని, అందువల్ల బాయిల్డ్ రైస్గా అయితేనే మిల్లింగ్ చేస్తామని మిల్లర్లు తేల్చిచెప్పారు. యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాటు మేరకు సుమారు 12 ఎల్ఎంటీల వరకు బాయిల్డ్ రైస్గా ఎఫ్సీఐకి ఇచ్చారు. మిగతా ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్లు లెక్కలు చూపారు. అయితే నిల్వ ఉన్న ధాన్యంలో మేలు రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ కింద ఇవ్వకుండా ఎక్కడికక్కడ బియ్యాన్ని మిల్లర్లు విక్రయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. సర్కార్ లెక్కల ప్రకారం ప్రస్తుతం మిల్లుల్లో కనీసం 50 ఎల్ఎంటీల ధాన్యమైనా నిల్వ ఉండాలి. కానీ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో టాస్్కఫోర్స్, విజిలెన్స్ జరిపిన తనిఖీల్లో ఈ మొత్తంలో ధాన్యం కాగితాల మీదే తప్ప భౌతికంగా లేకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తప్పిన వేలం మిల్లర్లు నిల్వ ఉంచిన ధాన్యాన్ని వేలం వేయాలని గత ఆగస్టులోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ మేరకు 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచగా 54 బిడ్లు దాఖలయ్యాయి. అప్పట్లో క్వింటాల్కు కనిష్టంగా రూ. 1,618, గరిష్టంగా రూ. 1,732, సగటున రూ. 1,670 ధర పలికింది. అయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ క్వింటాల్కు రూ. 2,060 కాగా రవాణా ఖర్చులు, నిల్వ వల్ల రుణాలపై పెరిగిన వడ్డీ కలిపి క్వింటాల్ ధాన్యానికి రూ. 2,300 వరకు అవుతుందని అప్పటి పౌరసరఫరాల కమిషనర్ అంచనా వేశారు. వేలంలో వచ్చే ధరతో పోల్చుకుంటే నష్టం వస్తుందనే కారణంతో ఆ టెండర్లను రద్దు చేశారు. నిబంధనలు మార్చి మరోసారి అక్టోబర్లో టెండర్లను ఆహ్వానించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ టెండర్లను నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఇతర అధికారులతో చర్చించి మరోసారి ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జనవరి 25న ఐదుగురు ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచి ఇటీవల ఫైనాన్షియల్ బిడ్లను తెరిచారు. బిడ్ల కనిష్ట ధర రూ. 1,920గా ఉన్నట్లు తెలిసింది. చక్రం తిప్పిన మాజీ సహకార సంస్థ చైర్మన్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించినప్పటికీ వేలంలో రాష్ట్రంలో పలుకుబడిగల మిల్లర్లు, కొందరు వ్యాపారులే పాల్గొన్నట్టు తెలిసింది. హైదరాబాద్లోని ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ వేలం ప్రక్రియలో చక్రం తిప్పినట్టుగా పౌరసరఫరాల శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పలుకుబడి గల ఆయన కొత్త ప్రభుత్వంలోనూ తనదైన రీతిలో సిండికేట్ నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. క్వింటాల్ ధాన్యం రూ. 2 వేలలోపే ఉండేలా బిడ్డర్లతో రింగ్ అయినట్లు సమాచారం. వాస్తవానికి మిల్లుల్లో ఎంత యాసంగి ధాన్యం ఉందో కూడా సరిగ్గా తెలియదు. ఈ పరిస్థితుల్లోనే గత ప్రభుత్వం 25 ఎల్ఎంటీల ధాన్యం వేలం వేసేందుకు ప్రయత్నించింది. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం 35 ఎల్ఎంటీలు విక్రయించేందుకు సిద్ధమైంది. విజిలెన్స్, టాస్్కఫోర్స్ తనిఖీల నేపథ్యంలో వీలైనంత తక్కువ ధరకు ధాన్యాన్ని దక్కించుకొని ప్రభుత్వానికి ఆ మేరకు డబ్బు చెల్లించడం ద్వారా గండం గట్కెక్కాలనే ధోరణిలో మిల్లర్లు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్వింటాల్ ధాన్యం రూ. 2,300 వరకు పలికే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయగా ఇప్పటి మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకుంటే..వేలం ప్రక్రియలో ముందుకెళ్లడం వల్ల సర్కారు ఖజానాకు రూ. 1,500 కోట్లకుపైగానే నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా టెండర్లపై ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. -
1 నుంచి రేషన్ లబ్దిదారులకు రాగిపిండి పంపిణీ
సాక్షి, అమరావతి: వచ్చే నెల 1 నుంచి రేషన్ లబ్దిదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రాగిపిండిని పంపిణీ చేయనుంది. తద్వారా ప్రభుత్వం పౌష్టికాహార భద్రతకు పెద్దపీట వేయనుంది. ముందు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బలవర్థక ఆహారంగా రాగి పిండిని సరఫరా చేయాలని నిర్ణయించింది. మార్చి 1 నుంచి కిలో ప్యాకెట్ల రూపంలో దీన్ని అందించనుంది. బహిరంగ మార్కెట్లో కిలో రాగిపిండి రూ.40పైనే పలుకుతుండగా ప్రభుత్వం లబ్దిదారులకు కిలో రూ.11కే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. తొలుత శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, రాయలసీమలోని వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఒక్కో కార్డుకు ప్రస్తుతం ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు/జొన్నలను అందజేస్తోంది. ఈ క్రమంలోనే కార్డుదారులు వాటిని మిల్లింగ్ చేసుకుని వినియోగించుకుంటున్నారు. ఇకపై లబ్దిదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా.. పౌరసరఫరాల శాఖ చరిత్రలో తొలిసారిగా రాగిపిండి పంపిణీకి శ్రీకారం చుడుతోంది. నేరుగా రైతుల నుంచే కొనుగోలు రేషన్ లబ్ధిదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడంలో భాగంగా స్థానిక రైతులకు సంపూర్ణ మద్దతు కల్పిస్తూ పౌరసరఫరాల సంస్థ రాగులు, జొన్నల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ శాఖ ద్వారా రైతులను చిరుధాన్యాల సాగువైపు తీసుకెళ్తోంది. ఇందులో భాగంగానే రాయితీపై చిరుధాన్యాల విత్తనాలను అందిస్తోంది. కొర్రల కొనుగోలుకు సైతం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ మద్దతు ధరల జాబితాలో చేర్పించింది. కొర్రలు కోతలకు వచ్చే సమయంలో వాటిని రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పుడు శ్రీసత్యసాయి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రాగులు, అనంతపురం, నంద్యాల, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో జొన్నల కొనుగోలును చేపడుతోంది. ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్ ప్రామాణికంగా వ్యవసాయ క్షేత్రం నుంచే పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ రైతుకు బాసటగా నిలుస్తోంది. వాటిని ప్రాసెసింగ్ చేసి తిరిగిన స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పంపిణీ చేస్తోంది. దీంతోపాటు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ద్వారా ఇతర రాష్రా్టల నుంచి రాగులును దిగుమతి చేసుకుంటోంది. ఈ ఖరీఫ్లో ఇప్పటివరకు రాగులు, జొన్నలు కలిపి సుమారు 6,500 టన్నులకుపైగా సేకరించింది. మరో 20 వేల టన్నుల జొన్నలు.. నంద్యాల జిల్లాలో జొన్నలు మంచి దిగుబడులు వచ్చాయి. రైతుల నుంచి డిమాండ్ ఉండటంతో అదనంగా జొన్నల కొనుగోలుకు పౌరసరఫరాల సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీని ప్రకా రం మరో 20వేల టన్నుల వరకు జొన్నలను సేకరించనుంది. ఇందులో రాష్ట్ర అవసరాలకు పోనూ మిగిలిన వాటిని ఎఫ్సీఐకి అందించనుంది. తద్వారా రాష్ట్ర రైతులకు పూర్తి మద్దతు ధర దక్కేలా చర్యలు చేపడుతోంది. గోధుమ పిండికి డిమాండ్.. పీడీఎస్లో అందిస్తున్న ఫోర్టిఫైడ్ గోధుమ పిండికి మంచి డిమాండ్ ఉంది. ప్రతి నెలా 2,500 టన్నుల నుంచి 5 వేల టన్నుల వరకు వినియోగం ఉంటోంది. ఇదే గోధుమ పిండిని కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరుతో కిలో రూ.27.50కు ఇస్తుంటే.. రాష్ట్రంలో కిలో రూ.16కే అందిస్తున్నారు. మార్కెట్ రేటు కంటే తక్కువకే నాణ్యమైన గోధుమపిండి లభిస్తుండటంతో కార్డుదారులు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పౌష్టికాహారం అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యం.. పీడీఎస్లో పౌష్టికాహారం అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. అందుకే నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యంతో పాటు రాగులు, జొన్నలు, ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని సరఫరా చేస్తున్నాం. రాగులుకు వినియోగదారుల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే వాటిని మిల్లింగ్ చేసుకుని వాడుకునేందుకు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. అందుకే రాగిపిండిని ఇవ్వాలని నిర్ణయించాం. కిలో ప్యాకెట్ల రూపంలో రూ.11కే మార్చి నుంచి అందుబాటులోకి తెస్తున్నాం. రాగులను ప్రాసెసింగ్ చేసి.. పిండి ఆడించి, ప్యాకింగ్, రవాణా చేసేందుకయ్యే ఖర్చులను మాత్రమే రేటుగా నిర్ధారించాం. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్ కటకట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలకు చుక్కలు చూపించింది. ప్రధానంగా హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లోని బంకులకు వాహనాలు పోటెత్తడం, ప్రధాన రహదారుల పక్కన కూడా బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మధ్యాహ్నానికల్లా చాలావరకు బంకులు మూతపడటం, తెరిచి ఉన్న బంకులను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఫోర్ వీలర్లు చుట్టు ముట్టడంతో ఒక దశలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పలుచోట్ల బంకుల సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సాయంత్రానికి పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. బంకుల వద్ద ట్రాఫిక్ స్తంభన ప్రభావం ప్రధాన కూడళ్లు, రహదారులపై పడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్తో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. పనుల మీద బయటకొచ్చిన వారు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక పెట్రోల్, డీజిల్ అయిపోయిన వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో.. వాస్తవానికి రెండురోజుల క్రితమే వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఫలితంగా ప్రెటోల్ బంకులకు సరఫరా నిలిచిపోయింది. ఇక బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు పూర్తి స్థాయిలో సమ్మెకు దిగనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు పోటెత్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం వేలాదిగా వాహనాలు బారులు తీరాయి. సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుందో అన్న ఆందోళనతో ఎక్కువమంది ట్యాంకులు ఫుల్ చేయించడం కన్పించింది. కొందరు నిబంధనలకు విరుద్ధంగా పెద్దపెద్ద క్యాన్లలో ఆయిల్ నింపుకొని తీసుకెళ్లారు. దీంతో మధ్యాహ్నానికల్లా చాలా వరకు బంకుల్లో నిల్వలు ఖాళీ అయ్యాయి. ఆయా బంకుల యాజమానులు బంకులు మూసేసి నో స్టాక్ బోర్డులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,500 పెట్రోల్ బంకులు ఉండగా 3 వేల వరకు బంకులు మూతపడటంతో సాయంత్రానికి పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమయ్యింది. హైదరాబాద్ నగరంలోని పెట్రోల్ బంకులన్నింటిలో నిల్వలు ఖాళీ అయ్యాయి. తాత్కాలికంగా సమ్మె విరమణ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నిల్వలు ఖాళీ కావడంతో డీలర్ల సొంత ట్యాంకర్లను రంగంలోకి దింపారు. వారు ఆందోళన విరమించి ఇంధన సరఫరాకు సిద్ధమయ్యారు. మరోవైపు సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రాష్ట్ర పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు నిరసనగా డ్రైవర్లు సోమవారం నుంచి ఆయిల్ టాంకర్స్ నిలిపివేసి ఆకస్మిక సమ్మెలోకి వెళ్ళారని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల అసోసియేషన్లు కూడా సమ్మె విరమించే అవకాశాలు ఉండటం, చమురు సంస్ధల డిపోల వద్దకు డీలర్ల ట్యాంకర్లు లోడింగ్కు చేరుకోవడంతో బుధవారం ఆయిల్ సరఫరాకు అంతరాయం ఉండబోదని డీలర్ల వర్గాలు ప్రకటించాయి. ఇంధన సరఫరాలో కొరత ఉండదు: పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఇంధన ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ మంగళవారం పౌరసరఫరాల భవన్లో బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమ్మె చేస్తున్న ట్యాంకర్ల డ్రైవర్లతో చర్చించాలని, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్కు కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా చూడాలన్నారు. ఆయిల్ కంపెనీలకు, డ్రైవర్లకు తాము పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే విధుల్లో చేరాలని ట్యాంకర్ల డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని, ప్రజలు ఆందోళనకు గురికావద్దని కమిషనర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అప్పా జంక్షన్ వద్ద ఎస్ఐకి గాయాలు! రాజేంద్రనగర్: బండ్లగూడ అప్పా జంక్షన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం రాత్రి సిబ్బందికి వాహనదారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెట్రోల్ కోసం వచ్చిన సందర్భంగా వాగ్వావాదం జరగడంతో పరస్పరం దాడి చేసుకున్నట్టు సమాచారం. ఈ పెట్రోల్ బంకును పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా.. విధుల్లో ఉన్న ఒక ఎస్ఐ ర్యాంకు అధికారితో పాటు సిబ్బందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు చెప్పారు. -
AP: వలంటీర్లకు ప్రతినెలా అదనంగా రూ.750
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రతి నెలా గౌరవ వేతనంగా చెల్లిస్తున్న రూ.5,000కు అదనంగా మరో రూ.750ను ప్రోత్సాహకంగా చెల్లించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లు క్రియాశీలకంగా పాల్గొంటున్నందుకు ఈ ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్టు తెలిపింది. ప్రతి నెలా రూ.750 మొత్తాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా వేరేగా వలంటీర్లకు అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్కుమార్ కొద్ది రోజుల క్రితం గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ టీఎస్ చేతన్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతోపాటు జాయింట్ కలెక్టర్లు, జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇన్చార్జిలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎల్డీవోలు, ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 13న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకుఇంటింటికీ æరేషన్ పంపిణీలో వలంటీర్లను మరింత భాగస్వాములను చేయనున్నారు. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ వలంటీర్లకు కొన్ని ప్రత్యేక విధులను నిర్ధారించింది. వీటిని కూడా రాష్ట్రవ్యాప్తంగా అధికారులకు తెలియజేశారు. కాగా వలంటీర్లకు రూ.750 అదనపు ప్రోత్సాహకాన్ని ఎప్పటి నుంచో వర్తింపజేస్తామో వేరేగా ఆదేశాలు జారీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఇంటింటికీ రేషన్ పంపిణీలో వలంటీర్లకు ప్రత్యేక విధులు.. వలంటీర్లు తమ క్లస్టర్ (గ్రామీణ ప్రాంతాల్లో 50 ఇళ్ల పరిధి, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్ల పరిధి)లో ఇంటింటికీ రేషన్ పంపిణీలో పూర్తి అనుసంధానకర్తలుగా వ్యవహరించాల్సి ఉంటుంది. లబ్ధిదారులు ప్రతినెలా ప్రభుత్వం అందజేసే రేషన్ సరుకులను తీసుకునేలా విస్తృత ప్రచారం చేయాలి. రేషన్ వాహనాలు ఇంటింటికీ పంపిణీకి వచ్చే సమయాన్ని ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు తెలియజేయాలి. పంపిణీ జరిగే సమయంలో వలంటీర్లు కూడా ఉండాలి. రేషన్ సరుకులు తీసుకునే క్రమంలో లబ్ధిదారులు వేలిముద్రలు వేయడం తదితర అంశాల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అక్కడికక్కడే వాటి పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. తమ పరిధిలో రేషన్ పంపిణీలో ఏవైనా లోపాలు, అవకతవకలు జరిగినట్టు గుర్తిస్తే.. ఆ వివరాలను వెంటనే సంబంధిత వీఆర్వో లేదా డిప్యూటీ తహసీల్దార్లకు తెలియజేయాల్సి ఉంటుంది. -
28 నుంచి రేషన్ దరఖాస్తుల స్వీకరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు చాలా ఏళ్లుగా ఎదురు చూ స్తున్న కొత్త ఆహార భద్రత కార్డుల (రేషన్ కార్డులు) జారీకి ప్రభుత్వం సన్నద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు దరఖాస్తుల నమూనా లను ప్రభుత్వం ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. మీ–సేవ కార్యాలయాల ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు గ్రామ, బస్తీ సభలను నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే రేషన్కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానానికి సంబంధించి విధివిధానాలు ఆదివారం జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశం తరువాత వెలువడే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు జారీ చేసిన రేషన్కార్డుల వివరాలను అడిగి తెలుసుకు న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత మొదలైన తెలుపు, గులాబీ కార్డుల జారీ ప్రక్రియ భారీ ఎత్తున సాగింది. ఈ లెక్కన రాష్ట్రంలో తెలుపు, గులాబీ కార్డు లు తెలంగాణ ఏర్పాటయ్యే నాటికే 83 లక్షలకు పైగా జారీ అయ్యాయి. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత జాతీయ స్థాయిలో జరిగిన మార్పుల వల్ల తెలుపు, గులాబీ కార్డుల స్థానంలో ఆహారభద్రత కార్డులు మంజూరు అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం పదేళ్లలో కొత్తగా 6.50 లక్షల కార్డులు మంజూరు చేసింది. ఇవి కాకుండా 11 లక్షలకు పైగా రేషన్ కార్డుల దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ పథకాలకు కార్డు తప్పనిసరి కావడంతో... రేషన్ బియ్యం కన్నా రాష్ట్ర ప్రభుత్వం అందించే పలు పథకాలకు ఆహార భద్రత కార్డు తప్పనిసరిగా మారింది. ఆరోగ్యశ్రీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, పేదల గృహ నిర్మాణం వంటి అనేక పథకాలకు ఆహార భద్రత కార్డు తప్పనిసరైంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన నేపథ్యంలో పేద, మధ్య తరగతి వర్గాలకు రేషన్కార్డుల అవసరం తప్పనిసరైంది. గతంలో తొమ్మిది లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉంటే 2021లో చివరిసారిగా 3 లక్షల కార్డులు జారీ చేశారు. కొత్త రేషన్కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పిల్లలు, కుటుంబసభ్యుల పేర్లు మార్పులు , చేర్పులు చేయడం వంటి ప్రక్రియ కూడా కొన్నేళ్లుగా నిలిపివేయడంతో ఈసారి డిమాండ్ పెరిగింది. కొత్త కార్డుల ప్రక్రియకు సంబంధించి విధి విధానాలు వస్తే అర్హులైన వారంతా దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. కొత్త దరఖాస్తుదారులు ఆధార్, అడ్రస్ ప్రూఫ్తో పాటు గ్యాస్ కనెక్షన్ వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత వర్గాల వారికి కార్డులు జారీ చేయకుండా నిబంధనలు విధించనున్నారు. అదే సమయంలో ఇప్పటికే కార్డులు పొందిన వారిలో అనర్హులను గుర్తించే ప్రక్రియ కూడా చేపట్టే అవకాశం ఉన్నట్లు ఓ పౌరసరఫరాల శాఖ అధికారి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కార్డుల వివరాలు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడున్న కార్డుల సంఖ్య : 90,14,263 ఇందులో జాతీయ ఆహారభద్రత చట్టం (ఎన్ ఎఫ్ ఎస్) కింద జారీ చేసిన కార్డులు : 54,48,170 రాష్ట్ర ఆహారభద్రత కార్డులు : 35,66,093 ఈ కార్డుల లబ్ధిదారులు : 2,83,39,478 -
8 వేల టన్నుల కందిపప్పు సిద్ధం
సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రైస్ కార్డుదారులందరికీ సబ్సిడీపై కందిపప్పు సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని జనవరిలో ఎనిమిదివేల టన్నుల కందిపప్పు నిల్వలను సిద్ధం చేస్తోంది. ఈ నెల 23వ తేదీలోగా మండలస్థాయి నిల్వ కేంద్రాలకు (ఎంఎల్ఎస్ పాయింట్లకు) సరుకు తరలించనుంది. ప్రస్తుత నెలలో 46.64 లక్షల మందికి సుమారు 4,604 టన్నుల కందిపప్పును కిలో రూ.67కే అందించింది. గిరిజన ప్రాంతాల్లోని జీసీసీల ద్వారా కూడా సబ్సిడీపై కందిపప్పు విక్రయాలు సాగించేలా ప్రోత్సహించనుంది. ఏడాదిగా మార్కెట్లో కందిపప్పు ధరలు పెరుగుతూ వచ్చాయి. మహారాష్ట్రలో భారీవర్షాలకు కందిపంట పూర్తిగా దెబ్బతినడంతో ఒక్కసారిగా కందిపప్పునకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లోకి కొత్తపంట వస్తుండటంతో రేటు నెమ్మదిగా దిగొస్తోంది. ఒకప్పుడు మార్కెట్లో కిలో కందిపప్పు రూ.115 ఉన్నప్పుడు సబ్సిడీపై రూ.67కే అందించిన ప్రభుత్వం.. ఆ తర్వాత రేటు రూ.160–170కి పెరిగినా సబ్సిడీని తగ్గించలేదు. మధ్యలో మూడు, నాలుగునెలలు మార్కెట్లో లోటు ఉండటంతో పీడీఎస్లో కందిపప్పు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇకపై నిరంతరాయంగా పంపిణీ చేసేలా పౌరసరఫరాలశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. గోధుమపిండికి డిమాండ్ పీడీఎస్ లబ్దిదారులకు వీలైనన్ని ఎక్కువ పౌష్టికాహార పదార్థాల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్టు కింద పట్టణ ప్రాంతాల్లో ఫోరి్టఫైడ్ (విటమిన్లతో కూడిన) గోధుమపిండిని పరిచయం చేసింది. ప్రజల నుంచి స్పందన బాగుండటంతో నెమ్మదిగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం నెలకు మూడువేల టన్నుల గోధుమపిండి సరఫరా చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారత్ ఆటా పేరుతో కిలో రూ.27.50కు ఇస్తుంటే.. ఏపీలో మాత్రం కిలో రూ.16కే అందిస్తుండటం గమనార్హం. లబ్ధిదారులకు దీన్ని మరింత తక్కువ రేటుకు ఇచ్చేలా పౌరసరఫరాలశాఖ కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పంపనుంది. రైస్ కార్డుదారుల ఇష్టం మేరకు కిలో బియ్యానికి బదులు కిలో గోధుమపిండి ఇవ్వనుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బియ్యం పరిమాణాన్ని తగ్గించుకుని దానికి బదులు గోధుమలను సరఫరా చేస్తుంది. వాటిని ప్రాసెసింగ్ చేసి ఫోరి్టఫైడ్ అనంతరం ప్యాకింగ్, రవాణాకు అయ్యే ఖర్చులను లెక్కించి పౌరసరఫరాలశాఖ ధర నిర్ణయించనుంది. ఈ విధంగా కిలో రూ.11–12కే గోధుమపిండి ఇవ్వొచ్చని భావిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు మాత్రమే నెలకు 1,800 టన్నుల గోధుమలను కేంద్రం అందిస్తోంది. మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పంపిణీ చేస్తోంది. ఫిబ్రవరి నుంచి మొత్తం కార్డుదారులకు గోధుమపిండిని అందుబాటులో ఉంచేలా కసరత్తు చేస్తోంది. వీటితోపాటు పంచదార, రాయలసీమలో చిరుధాన్యాల పంపిణీకి అవసరమైన నిల్వలను తరలిస్తోంది. నెలాఖరులోగా కందుల సేకరణ పౌరసరఫరాలసంస్థ ద్వారా స్థానిక రైతుల నుంచి మద్దతు ధరకు కందులు సేకరించడంతోపాటు వాటిని ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేసి తిరిగి పీడీఎస్లోకి ప్రవేశపెట్టేలా పౌరసరఫరాలశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ నెలాఖరులోగా ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనుంది. అవసరమైతే మార్కెట్ రేటును చెల్లించైనా రైతుల నుంచి 35 వేల టన్నులకుపైగా కందులను సేకరించాలని నిర్ణయించింది. ధాన్యం మాదిరిగానే రవాణా, కూలీ, గోతాల ఖర్చులను సైతం రైతులకు ఇవ్వనుంది. కందులు సేకరించిన వారంలోగా రైతుల ఖాతాల్లో మద్దతు ధరను జమచేయనుంది. నాణ్యతలో రాజీలేకుండా ఇప్పటివరకు పీడీఎస్లో పంపిణీ చేస్తున్న కందిపప్పు బయట ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నదే. తొలిసారిగా ఏపీలో పండిన పంటను రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి మర ఆడించి ప్రత్యేక ప్యాకింగ్లో రైస్ కార్డుదారులకు ఇవ్వాలని నిర్ణయించాం. తద్వారా అక్కడక్కడ కందిపప్పు నాణ్యతపై వస్తున్న విమర్శలను అధిగమించవచ్చు. ఏపీ అవసరాలకు తగినంత నిల్వలను ఇక్కడే సేకరిస్తాం. పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని ఇకపై జాప్యం లేని పంపిణీకి చర్యలు చేపడుతున్నాం. ఆర్బీకేలోని క్షేత్రస్థాయి సిబ్బంది, జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాలసంస్థ సిబ్బంది సమన్వయంతో రైతులకు అవగాహన కల్పించి కందులు కొనుగోలు చేస్తా – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌరసరఫరాలశాఖ -
వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు కందిపప్పు పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల (నవంబర్) నుంచి క్రమం తప్పకుండా లబ్దిదారులకు కిలో చొప్పున అందించనుంది. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ 10 వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా)కు ఆర్డర్ ఇచ్చింది. అయితే హాకా వద్ద కూడా తగినంత నిల్వలు లేకపోవడంతో 7,200 టన్నుల సరఫరాకు అంగీకరించింది. ఇందులో భాగంగా తొలి దశలో 3,660 టన్నులు, రెండో దశలో 3,540 టన్నులు అందించనుంది. ఇప్పటికిప్పుడు అంటే వచ్చే నెల అవసరాలకు గాను 2,300 టన్నుల సరఫరాకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయంగా పప్పుధాన్యాల కొరతతో రేట్లు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా పంట ఉత్పత్తులు బహిరంగ మార్కెట్కు వెళ్లిపోవడంతో భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)వద్ద కూడా నిల్వలు కరువయ్యాయి. ఫలితంగా కందిపప్పు పంపిణీకి అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈ నెలాఖరుకు సరుకు తరలింపు ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకు ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హాకా నుంచి మద్దతు ధర ప్రాతిపదికనే కందులు సేకరించినప్పటికీ.. వాటికి అదనంగా ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు అవ్వనున్నాయి. ఈ మొత్తంలో రూ.67కు మాత్రమే కిలో కందిపప్పును ప్రభుత్వం లబ్దిదారులకు ఇవ్వనుంది. అంటే దాదాపు సబ్సిడీ రూపేణా ప్రభుత్వం రూ.70పైగానే భరిస్తున్నట్టు సమాచారం. ఈ నెలాఖరు నాటికి చౌక ధరల దుకాణాల వద్దకు అందుబాటులో ఉన్న నిల్వల ప్రకారం సరుకును తరలించనుంది. డిసెంబర్, జనవరిల్లో పూర్తి స్థాయిలో కార్డుదారులకు సబ్సిడీ కందిపప్పును ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మార్కెట్ రేటుకే కందుల కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు వీలుగా 50 వేల టన్నుల కందిపప్పును కేటాయించాలని కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేసింది. తొలుత కర్ణాటకలోని బఫర్ స్టాక్ నుంచి 9,764 టన్నులు కందులు కేటాయించగా వాటిలో నాణ్యత లోపించింది. ఆ తర్వాత రెండుసార్లు జూన్, సెపె్టంబర్ల్లో కేటాయింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కానీ, కేంద్రం నుంచి స్పందన రాలేదు. మండల స్టాక్ సెంటర్ (ఎంఎల్ఎస్)ల్లోని స్టాక్ మొత్తాన్ని పంపిణీకి విడుదల చేయడంతో నిల్వలు నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం హాకా నుంచి కందిపప్పును తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు నెలలకు హాకా సరఫరా చేసే కందిపప్పును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించనుంది. భవిష్యత్తులో అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు జనవరి నుంచి పౌరసరఫరాల సంస్థ ద్వారా నేరుగా రైతుల నుంచి మార్కెట్ ధరకు ప్రభుత్వం కందులు సేకరించనుంది. తొలుత ఈ ఖరీఫ్లో 30 వేల టన్నులు సేకరించాలనే యోచనలో ఉన్నారు. వాటిని స్వయంగా మరాడించి ప్యాకింగ్ చేయించి సబ్సిడీపై కార్డుదారులకు అందించేలా ప్రణాళిక రూపొందించారు. బాబుగారి ‘పప్పు’ డ్రామా అంతర్జాతీయంగా మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి డిమాండ్, సప్లై ఆధారంగా నిత్యావసరాల రేట్లు మారుతుంటాయి. చంద్రబాబు హయాంలో రేట్లు ఎంత పెరిగినా ఇచ్చే సబ్సిడీ మాత్రం పెరిగేది కాదు. పైగా ఆయన పాలన చేపట్టిన తర్వాత సెపె్టంబర్ 2014–జూలై 2015 వరకు కందిపప్పు ఊసే లేదు. ఆగస్టు 2015 నుంచి ఫిబ్రవరి 2017 వరకు కార్డుకు కిలో చొప్పున రూ.50 నుంచి రూ.120 మధ్యన రేట్లు పెంచి విక్రయించారు. 2015 డిసెంబర్లో ఏకంగా రూ.90కి పెంచారు. 2016 జూలై నుంచి 2017 ఫిబ్రవరి మధ్య రూ.120 చేశారు. 2018లో కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలో రూ.63 ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.23 రాయితీ ఇచ్చింది. చివరి ఏడాది మాత్రం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు కిలోల కందిపప్పు డ్రామా ఆడారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మొత్తం పంపిణీ చేసింది కేవలం 93 వేల టన్నులు మాత్రమే. ఇందు కోసం రూ.1605 కోట్లు ఖర్చు చేసింది. కానీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 3.15 లక్షల టన్నుల కందిపప్పు పంపిణీకి రూ.3,084 కోట్లు ఖర్చు చేసింది. కరోనా సమయంలో నిత్యావసరాలను పూర్తి ఉచితంగా అందించింది. కార్డుదారులకు నిరంతరాయంగా పంపిణీ చేసేలా చర్యలు కార్డుదారులకు ప్రతి నెలా నిరంతరాయంగా కందిపప్పు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాం. హాకా ద్వారా కందిపప్పును సేకరిస్తున్నాం. ఇప్పటికే నాణ్యత ప్రమాణాలను పరిశీలించాం. ఈ నెలాఖరు నాటికి ఎఫ్పీ దుకాణాలకు సరుకు చేర్చేలా ఆదేశాలు జారీ చేశాం. డిసెంబర్, జనవరిల్లో వంద శాతం కార్డులకు పంపిణీ చేస్తాం. ఈ ఖరీఫ్లో రైతుల నుంచి కందులు కొనుగోలు చేయనున్నాం. ఇప్పటికే అన్ని జిల్లాల్లోని కలెక్టర్లకు కందుల కొనుగోలుపై ప్రచారం కల్పించాలని ఆదేశించాం. మన రైతుల నుంచి మార్కెట్ ధరకు కందులు కొనుగోలు చేసి వాటిని రాష్ట్ర వినియోగానికి వాడుకుంటే.. రైతులకు, లబ్దిదారులకు ఎంతో మేలు జరుగుతుంది. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
గల్ఫ్.. ప‘రేషన్’
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో పనిచేసే వలసకార్మికులు ఇప్పుడు పరేషాన్లో పడ్డారు. రేషన్కార్డుల్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరు ఈ–కేవైసీ పూర్తి చేయించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ సూచించిన విషయం తెలిసిందే. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రంపై రేషన్ వినియోగదారులు వేలిముద్ర వేసి తమ ధృవీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలోని వినియోగదారులు ఏ ప్రాంతంలో ఉన్నాసరే సొంతూరుకు వెళ్లకుండానే ఈకేవైసీ పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు. పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు మాత్రం స్వరాష్ట్రానికి వచ్చి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ–కేవైసీ ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. అయితే దీనికి నిర్ణీత గడువు తేదీని మాత్రం ప్రభుత్వం నిర్ణయించలేదు. వీలైనంత త్వరగా రేషన్కార్డుల్లో పేర్లు ఉన్నవారితో ఈకేవైసీ పూర్తి చేయించాలని అధికారులు రేషన్డీలర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులు వేర్వేరు చోట్ల ఈకేవైసీ పూర్తి చేయించుకోవడానికి అవకాశముంది. ఈ విధానంతో పట్టణాలకు ఉన్నత చదువులకు వెళ్లినవారు, ఉపాధి పొందుతున్న వారు తాము ఉంటున్న పరిసరాల్లోనే ఈకేవైసీ పూర్తి చేయించుకోవచ్చు. కానీ గల్ఫ్తోపాటు ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో వారి ఈకేవైసీ ఎలా అనే సంశయం నెలకొంది. పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం ఈకేవైసీ చేయించుకోని వారి పేర్లు రేషన్కార్డుల నుంచి తొలగించే ప్రమాదముంది. విదేశాలకు వెళ్లినవారు సంవత్సరాల తరబడి స్వదేశానికి దూరంగానే ఉంటున్నారు. వారు వచ్చిన తర్వాతైనా ఈకేవైసీ చేయించుకోవచ్చా? అనే విషయంపై స్పష్టత లేకపోవడమే ఈ గందరగోళానికి కారణం. స్థానికంగా నివాసం ఉండనందుకు రేషన్బియ్యం కోటా తమకు దక్కకపోయినా ఇబ్బంది లేదని, రేషన్కార్డుల నుంచి పేర్లు తొలగించవద్దని అని వలస కార్మికులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమపథకం అమలు చేసినా రేషన్కార్డు ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇలాంటి తరుణంలో తాము ఉపాధి కోసం సొంతూరిని విడచి వేరే ప్రాంతానికి వెళ్లామని, రేషన్కార్డుల నుంచి పేర్లు తొలగిస్తే ఎలా అని వలస కార్మికులు ప్రశి్నస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణవాసుల సంఖ్య 15లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈకేవైసీ నిబంధనతో వలస కార్మికులు అధిక సంఖ్యలో నష్టపోయే ప్రమాదం ఉంది. వలస కార్మికుల అంశంపై తమకు ఎలాంటి స్పష్టత లేదని నిజామాబాద్ పౌరసరఫరాలశాఖ అధికారి చంద్రప్రకాశ్ ‘సాక్షి’తో చెప్పారు. ఈకేవైసీ గడువు మూడు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందన్నారు. పేర్లు తొలగించకుండా స్టార్మార్క్ చేయాలి ఈకేవైసీ పూర్తి చేయని వలస కార్మికుల పేర్లు రేషన్కార్డుల నుంచి తొలగించకుండా స్టార్మార్క్ చేయాలి. వారు సొంతూరికి వచి్చన తర్వాత ఈకేవైసీ అవకాశం కల్పించాలి. వలస కార్మికుల పేర్లు రేషన్కార్డుల నుంచి తొలగిస్తే వారు ఏ ప్రభుత్వ పథకానికి అర్హులు కాకుండా పోతారు. ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. – మంద భీంరెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు -
బడా, లోకల్ మిల్లింగ్ కంపెనీలు కొనేలా!
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ టెండర్ల ద్వారా రాష్ట్రంలోని రైస్మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం వేయాలని నిర్ణయించిన పౌరసరఫరాల శాఖ బిడ్డింగ్ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. ఈ–వేలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి బడా కంపెనీలతో పాటు రాష్ట్రంలోని మిల్లింగ్ కంపెనీలు పాల్గొనేలా సరళమైన విధానాలను టెండర్ నిబంధనల్లో చేర్చారు. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలానికి టెండర్ రాష్ట్రంలోని 2వేలకు పైగా రైస్మిల్లుల్లో నిల్వ ఉన్న సుమారు 70 ఎల్ఎంటీ ధాన్యం నుంచి తొలి విడతగా 25 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గత నెల 19వ తేదీన విధి విధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆసక్తి గల సంస్థలు, వ్యాపారులు దరఖాస్తులు చేసుకోవడంతో ప్రి బిడ్డింగ్ సమావేశాలను సంస్థ నిర్వహించింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం విధించిన నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నిబంధనల ద్వారా స్థానిక వ్యాపారులు, మిల్లర్లకు అవకాశం దక్కదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే విడతలో 4లక్షల లేదా 5 లక్షల మెట్రిక్ టన్నుల లాట్లలో ధాన్యం వేలం వేయడం వల్ల బడా కంపెనీలే తప్ప రాష్ట్రంలోని మిల్లర్లు గాని, మిల్లర్ల సిండికేట్ గానీ కొనుగోలు చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం నిబంధనల్లో పలు మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రతీ లాట్ను ఒక లక్ష టన్నులుగా మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని తొలి విడత 25 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు వేలం వేయాలని తొలుత నిర్ణయించగా... దాన్ని పూర్తిగా కేవలం 6 లాట్స్లో «వేలం వేయాలని టెండర్ నోటిఫికేషన్లో పొందుపరిచారు.. ఇందులో ఐదు లాట్స్లో 4లక్షల టన్నుల చొప్పున ఉండగా ఒక లాట్లో ఐదు లక్షల టన్నుల ధాన్యం ఉంది. ప్రి బిడ్ మీటింగ్ అనంతరం ఇందులో మార్పులు చేశారు. ప్రతీ లాట్ను ఒక లక్ష టన్నులుగా నిర్ణయించారు. అంటే 25 లాట్స్లో ధాన్యం వేలం వేయనున్నారు. లక్ష టన్నుల కెపాసిటీ ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రతి కంపెనీ ఈ వేలంలో పాల్గొనేలా నిబంధనలు మార్చారు. వార్షిక టర్నోవర్లోనూ భారీ మార్పులు తొలుత ప్రకటించిన టెండర్ నిబందనల ప్రకారం టెండర్లలో పాల్గొనే కంపెనీకి గడిచిన మూడేళ్లలో ప్రతిఏటా రూ.వెయ్యి కోట్ల వార్షిక టర్నోవర్తో పాటు రూ.100 కోట్ల నెట్వర్త్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అయితే రూ. 1000 కోట్ల టర్నోవర్ ఉన్న బియ్యం కొనుగోలు కంపెనీలు దేశంలో అతి తక్కువగా ఉంటాయన్న వాదనల మేరకు ప్రి బిడ్డింగ్ సమావేశంలో ఈ నిబంధనలు కూడా మార్చారు. రూ. 1,000 కోట్ల టర్నోవర్ను రూ.100 కోట్లకు, నెట్వర్త్ విలువ ను రూ.100 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు తగ్గించారు. ఇక వేలం తర్వాత ధాన్యం తీసుకెళ్లాల్సిన గడువును 30 రోజుల నుంచి 45 రోజులకు పెంచారు. నిబంధనల్లో మార్పులు చేయడంతో దరఖాస్తు, వేలం తేదీల్లోనూ మార్పులు చేశారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దీంతో ఈ నెల 11న జరగాల్సిన వేలం ప్రక్రియను 16వ తేదీకి వాయిదా వేశారు. నిబంధనల్లో మార్పుతో స్థానిక వ్యాపారులు, మిల్లర్లు టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం లభించనుంది. నిబంధనల సడలింపుతో ఎక్కువ మంది బిడ్డింగ్లో పాల్గొనే అవకాశం ఏర్పడింది. -
ధాన్యం రవాణాకూ జీపీఎస్
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యం పక్కదారులు పడుతున్నట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిఘా చర్యలపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు బియ్యం రవాణా వాహనాలకే పరిమితమైన జీపీఎస్ ట్రాకింగ్ విధానాన్ని ధాన్యం రవాణా విషయంలోనూ పాటించాలని నిర్దేశించింది. రైతుల నుంచి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం నిర్దేశించిన ‘మినిమం త్రెషోల్డ్ పారామీటర్స్ – ఎంటీపీస్’లో భాగంగా ధాన్యం రవాణా వాహనాలన్నింటినీ జీపీఎస్తో అనుసంధానించాలని నిర్ణయించారు. ఈ వానాకాలం సీజన్లో వచ్చే పంట నుంచే ఈ విధానం అమలు చేసేందుకు విధివిధానాలను కేంద్రం తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు పంపింది. దీంతో ధాన్యం వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను అమర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ ఇప్పటికే ఈ అంశంపై అధికారులతో చర్చించారు. మిల్లులకు తీసుకెళ్లే వాహనాలన్నింటికీ... రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి ధాన్యం సేకరణ జరుగుతుంది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చాక తూకం వేసి రైస్మిల్లులకు పంపిస్తారు. ఈ ధాన్యం రైస్మిల్లులకు వెళ్లాక మిల్లింగ్ అయి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రూపంలో ఎఫ్సీఐ గోదాములకు తరలుతుంది. ఈ క్రమంలో తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో మిల్లులకు ఎంత ధాన్యం వస్తోంది? మిల్లుల నుంచి బియ్యం రూపంలో గోదాములకు ఎంత పరిమాణంలో తిరిగి వెళ్తోందనే అంశంపై నిఘా కోసం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్లే ప్రతి వాహనాన్ని జీపీఎస్తో అనుసంధానించాలని ఆదేశించింది. రాష్ట్రంలో ప్రతి సీజన్లో సుమారు 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఒక్కో కేంద్రం నుంచి మిల్లుల లభ్యతను బట్టి పక్క జిల్లాలకు, దూర ప్రాంతాలకు కూడా పంపుతున్నారు. సాధ్యాసాధ్యాలపై మల్లగుల్లాలు.. బియ్యం లారీలు గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు... అక్కడి నుంచి పౌరసరఫరాల దుకాణాలకు చేరేందుకు 2016లోనే జీపీఎస్ ట్రాకింగ్ విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్గా సీవీ ఆనంద్ ఉన్న కాలంలో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ఇప్పటికీ సక్రమంగా అమలు కావట్లేదు. దీన్ని పర్యవేక్షించే యంత్రాంగం కూడా లేదు. బియ్యం లారీల కోసం కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించి ప్రతినెలా బియ్యం పంపిణీ జరుపుతుండగా దీన్నే తూతూమంత్రంగా అమలు చేస్తున్న పౌరసరఫరాల సంస్థ... ధాన్యం సేకరణలో జీపీఎస్ ట్రాకింగ్ చేయడం కష్టమేనని చెబుతోంది. ఎందుకంటే ప్రతి సీజన్లో రెండు నెలలపాటు సాగే ధాన్యం రవాణాకు అందుబాటులో ఉన్న అన్ని లారీలతోపాటు గ్రామాల్లో ఎక్కువగా ట్రాక్టర్లను వినియోగిస్తారు. రాష్ట్రంలోని 130కిపైగా ఉన్న సెక్టార్ల నుంచి సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వచ్చే ధాన్యాన్ని సేకరించి మిల్లులకు పంపేటప్పుడు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేయడం సాధ్యం కాదని అధికారులు తేల్చినట్లు సమాచారం. అయితే కేంద్రం ఈ విషయంలో కఠినంగా ఉండటంతో వానాకాలం సీజన్ నుంచే ఎలా అమలు చేయాలనే దానిపై ఈ నెల 21న ఢిల్లీలో జరిగే కార్యదర్శుల సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. -
కొత్తగా 1.63 లక్షల రైస్ కార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా బియ్యం కార్డుల మంజూరు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ప్రభుత్వం ఏటా రెండు సార్లు జూన్, డిసెంబర్లో అర్హులకు కొత్త కార్డులు అందజేస్తోంది. ఇప్పటివరకు 1,63,333 కొత్త రైస్ కార్డులకు ఆమోదం లభించగా తహసీల్దార్ల డిజిటల్ సంతకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తయిన వెంటనే కార్డులను ముద్రించి వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. జగనన్న సురక్షలో బియ్యం కార్డుల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఈ దఫాలోనే కార్డులు అందించనున్నారు. దీనికి ఈ నెల 31వతేదీ వరకు అవకాశం కల్పించిన నేపథ్యంలో కొత్తగా జారీ చేసే బియ్యం కార్డుల సంఖ్య మరింత పెరగనుంది. కొత్తగా 3,81,061 మందికి లబ్ధి రాష్ట్రంలో ఇప్పటివరకు 1.46 కోట్ల కార్డులకుగాను 4.25 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. కొత్త కార్డుల మంజూరు ద్వారా అదనంగా 3,81,061 మందికి ప్రతి నెలా పీడీఎస్ ద్వారా లబ్ధి చేకూరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. నాణ్యమైన (సార్టెక్స్)బియ్యాన్ని ఇంటివద్దకే అందించడంతో ప్రతి నెలా రేషన్ తీసుకువారి సంఖ్య పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం ఇచ్చినా దాన్ని తినేవారు తక్కువగా ఉండేవారు. పేదలకు ఇచ్చే బియ్యం ముక్కిపోవటం, పురుగులు పట్టడం, రాళ్లు, నూకలు ఎక్కువగా ఉండటంతో పాటు గింజ రంగు మారిపోయేది. బియ్యాన్ని లబ్ధిదారులు శుభ్రం చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడిస్తున్న నాణ్యమైన సార్టెక్స్ బియ్యం పేదల ఆకలి తీరుస్తోంది. కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నాణ్యమైన రేషన్ బియ్యమే ఎంతో మంది పేదలను ఆదుకుంది. బియ్యం సార్టెక్స్ కోసం కిలోకు రూపాయి చొప్పున నెలకు రూ.20 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. పీడీఎస్ వ్యవస్థ బలోపేతం.. టీడీపీ హయాంలో రేషన్ సబ్సిడీపై రూ.13 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చూపినా పేదలకు ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడు నాలుగేళ్లలో ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతమైంది. 100.13 లక్షల టన్నుల నాణ్యమైన బియ్యం, 2.99 లక్షల టన్నుల కందిపప్పు, 2.34 లక్షల టన్నుల పంచదారను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇందుకు సుమారు రూ.23,680 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. పంచదార, కందిపప్పుపై గతంతో పోలిస్తే మూడు రెట్లకు పైగా సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. వీటికి తోడు 18 జిల్లాల్లో నాణ్యమైన బలవర్థక బియ్యాన్ని (ఫోర్టిఫైడ్) అందిస్తోంది. ఏప్రిల్ నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాగి, జొన్నలు, అన్ని మున్సిపాల్టీల్లో గోధుమ పిండి పంపిణీని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం కేవలం జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కార్డులకు మాత్రమే రేషన్ ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం నాన్–ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు సైతం రేషన్ సరఫరా చేస్తూ పేదలకు అండగా నిలుస్తోంది. ఉచితంగా కిలో రూ.40 విలువైన బియ్యం ఒకవేళ రేషన్ తీసుకోకుంటే కార్డు రద్దు అవుతుందనే ఆందోళనతో కొందరు ప్రతి నెలా సరుకులు తీసుకుని దళారులకు విక్రయిస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేక వీడియో సందేశం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 50 లక్షల మంది కార్డుదారుల వాట్సాప్ నంబర్లకు వీడియో సందేశాలను చేరవేసింది. ఎండీయూ వాహనాల ద్వారా కూడా ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం కిలోకు రూ.40 చొప్పున ఖర్చు చేస్తూ పేదలకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఇంత ఖరీదైన బియ్యాన్ని వృథా చేయకుండా ప్రజలు భోజనంగానే కాకుండా దోశలు, ఇడ్లీలు, మురుకులు, స్వీట్లు లాంటి చిరుతిళ్ల తయారీకి కూడా వినియోగించవచ్చని సూచిస్తోంది. కార్డు రద్దు చేయడం లేదు.. రేషన్ తీసుకోకుంటే ఎక్కడా కార్డును రద్దు చేయడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార రేషన్ను ప్రజలు తక్కువగా చూడొద్దు. కొన్ని చోట్ల మధ్యవర్తులకు తక్కువ రేటుకు రేషన్ బియ్యన్ని విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. రేషన్ బియ్యం విక్రయాలు, అక్రమ రవాణాను పూర్తిగా అరికడతాం. కొత్త కార్డు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా జూన్, డిసెంబర్లో అర్హులకు కార్డులు మంజూరు చేస్తున్నాం. తాజాగా జగనన్న సురక్ష దరఖాస్తులను పరిశీలించి వారికి కూడా కార్డులు ఇస్తున్నాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
తక్కువ ధరకే నిత్యావసరాల పంపిణీ
సాక్షి, అమరావతి: ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం, కందిపప్పును మార్కెట్ ధరల కంటే తక్కువ రేట్లకు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు నెలలుగా బియ్యం, కందిపప్పు ధరల్లో పెరుగుదల నమోదైందని, ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో టోకు వ్యాపారులు, వాణిజ్య మండలి ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వ్యాపారులు, మిల్లర్లు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తక్కువ రేట్లకు నిత్యావసరాలు విక్రయించేందుకు ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేయగా సానుకూల స్పందన లభించిందని పేర్కొన్నారు. మరోవైపు ధరల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వ్యాపారులు తమ వద్ద ఉన్న సరుకు నిల్వలను భారత ప్రభుత్వ వెబ్ సైట్ http://fcain foweb.nic.in/psp లో నమోదు చేయాలని సూచించినట్టు తెలిపారు. ధరల జాబితా ప్రదర్శించడంతో పాటు వినియోగదారులకు బిల్లులు ఇవ్వాలన్నారు. కొంత మంది వ్యాపారులు జీఎస్టీ మినహాయింపు కోసం 24, 26 కిలోల పరిమాణంలో వస్తువులను ప్యాకింగ్ చేసి విక్రస్తున్నారని, వినియోగదారుల నుంచి పన్నుతో కలిపి ధరను వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిమాండ్కు తగ్గ ఉత్పత్తి, సరుకు నిల్వలు లేకపోవడం, స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి సరుకులను కొనుగోలు చేయడంతో ధరలు పెరిగినట్టు తెలిపారు. ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో ఉత్పత్తి తగ్గిపోవడంతో కందుల దిగుమతులు మందగించాయన్నారు. బీపీటీ, సోనా మసూరి వంటి నాణ్యమైన రకాల బియ్యాన్ని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర వ్యాపారులు కొనుగోలు చేయడం కూడా ఒక ప్రధాన కారణంగా అరుణ్కుమార్ పేర్కొన్నారు. -
కొర్రలకు ‘మద్దతు’ ఇవ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొర్రల సాగును ప్రోత్సహించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రైతులకు భరోసా కల్పించేలా కొర్రలను మద్దతు ధర పంటల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటివరకు చిరుధాన్యాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తోంది. అయితే అనంతపురం, కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఎక్కువగా కొర్రలను సాగు చేస్తున్నారు. మంచి దిగుబడులు రావడం, మార్కెట్లో డిమాండ్ ఉండటంతో రైతుకు లాభసాటిగా మారింది. మరోవైపు ప్రభుత్వం కూడా సాంప్రదాయ పంటల నుంచి చిరుధాన్యాల సాగువైపు రైతులను నడిపించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పౌరసరఫరాల శాఖ కాన్ఫరెన్స్లో.. కొర్రలను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో ఏపీ పౌరసరఫరాల సంస్థ సమగ్ర వివరాలతో కొర్రలకు మద్దతు ధర కోసం ప్రతిపాదనలు పంపే పనిలో నిమగ్నమైంది. పీడీఎస్ ద్వారా పంపిణీకి చర్యలు.. రాష్ట్రంలోని 1.47 కోట్ల రైస్ కార్డుదారులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. రెండు నెలల నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 13 జిల్లాల్లో రాగులు, జొన్నలను పంపిణీ చేస్తున్నారు. కార్డుదారుల ఐచ్చికం మేరకు 2 కేజీల బియ్యం బదులు వీటిని అందిస్తుండగా.. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో రాగులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో పీడీఎస్లో జొన్నల కంటే రాగులకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే 8 వేల టన్నులకు పైగా రాగులను పంపిణీ చేశారు. తాజాగా కొర్రలను కూడా పీడీఎస్ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానికంగా రైతుల నుంచే కొనుగోలు చేసి తిరిగి ప్రజలకు సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. గ్రామాల్లో సర్వే.. మరోవైపు రాష్ట్రంలోని అన్ని మునిసిపాల్టీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నారు. కార్డుకు కిలో చొప్పున రూ.16కు ప్రత్యేక ప్యాకింగ్లో దీనిని అందిస్తున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో గోధుమ పిండి వినియోగం తక్కువ ఉండటంతో.. కొత్తగా సర్వే చేపట్టి వచి్చన ఫీడ్బ్యాక్ ప్రకారం పంపిణీకి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే బియ్యం బదులుగా కూడా గోధుమ పిండిని తీసుకునే వెసులుబాటు కల్పించి.. ఇప్పుడిచ్చే ధర కంటే తక్కువకే సరఫరా చేసే యోచనలో పౌరసరఫరాల శాఖ ఉంది. పౌష్టికాహారం తప్పనిసరి ఆరోగ్య రక్షణ దృష్ట్యా ప్రతి ఒక్కరూ బలవర్థక ఆహారం తీసుకోవాల్సిన అవసరముంది. అందుకే పేదలకు పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే నిత్యావసరాల్లో చిరుధాన్యాలను అందిస్తున్నాం. ఇప్పటివరకు రాగులు, జొన్నలు ఇచ్చాం. ఇకపై కొర్రలను కూడా పంపిణీ చేసే ఆలోచన చేస్తున్నాం. దీని ద్వారా రైతులకు, వినియోగదారులకు లాభం కలుగుతుంది. ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని గ్రామీణ ప్రాంతాల్లోని కార్డుదారులు కూడా కోరుకుంటే అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
మిల్లర్ల బకాయిలు రూ. 2,072 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి రూ. వేల కోట్లలో బకాయి పడ్డారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ఇచ్చిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి ఇవ్వకుండా సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారు. దీంతో 2019 యాసంగి నుంచి 2022 యాసంగి వరకు పౌరసరఫరాల సంస్థకు రూ. 2,072 కోట్ల విలువైన 5.83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిపడ్డారు. ఈ మొత్తం బియ్యాన్ని లేదా అందుకు సమానమైన నగదును 25 శాతం జరిమానాతో డిఫాల్ట్ అయిన మిల్లుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి హోదాలో కమిషనర్ అనిల్ కుమార్ ఇప్పటివరకు నాలుగు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు ఆయా మిల్లులకు రికవరీ నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ బియ్యం విలువే రూ. 1,630 కోట్లు 2021–22 యాసంగికి సంబంధించి 2,37,310 మెట్రిక్ టన్నుల బియాన్ని ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉండగా ఈ గడువు గత మే నెలాఖరుతో ముగిసింది. దీంతో ఈ బియ్యాన్ని 25 శాతం పెనాల్టితో రికవరీ చేయాలని లేదంటే బియ్యం విలువ రూ. 842.09 కోట్లను 25 శాతం పెనాల్టితో వసూలు చేయాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే గత నెల 23న 2021–22 వానాకాలానికి సంబంధించిన 2.22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 25 శాతం పెనాల్టితో 494 మిల్లుల నుంచి రికవరీ చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ బియ్యం విలువ రూ. 787.67 కోట్లు. ఈ రెండు సీజన్లలోనే రూ. 1,630 కోట్ల వరకు రావాల్సి ఉంది. 2019 యాసంగి బకాయి 48,762 మెట్రిక్ టన్నులు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2019 యాసంగి సీజన్కు సంబంధించి 118 మిల్లుల నుంచి సీఎంఆర్ కింద లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చిలోనే పెనాల్టీతో 125 శాతం రికవరీ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈ మిల్లులు గడువులోగా బియ్యం ఇవ్వకపోవడంతో నెలకోసారి గడువును పెంచుతూ వచ్చారు. ఎట్టకేలకు ఈ నెలలో 14 మిల్లులు 125 శాతం బియ్యం రికవరీ చేశాయి. మరో 89 మిల్లులు 100 శాతం రికవరీ కింద సర్కారుకు సీఎంఆర్ అప్పగించాయి. ఇంకా 15 మిల్లులు ఎలాంటి రికవరీ చేయలేదు. దీంతో ఇంకా 48,762 మెట్రిక్ టన్నుల బియ్యం ఆయా మిల్లుల నుంచి రావాల్సి ఉంది. ఇప్పటికీ ఈ మిల్లులకు పెండింగ్ సీఎంఆర్ రికవరీ చేసుకొనే అవకాశం ఇస్తూ ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 2020–21 సంవత్సరం యాసంగికి సంబంధించి మరో 73 మిల్లుల నుంచి 75,878 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా ఈ మొత్తాన్ని కూడా పెనాల్టితో 125 శాతం రికవరీ చేయాలని సైతం ఈ నెల 19నే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు సంవత్సరాలకు సంబంధించిన బియ్యం 1.25 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈ బియ్యం విలువనే రూ. 442 కోట్లు. 25 శాతం నగదు... 100 శాతం బియ్యం రికవరీ డిఫాల్ట్ మిల్లర్ల నుంచి 125 శాతం బియ్యాన్ని రికవరీ చేసే ప్రక్రియలో ముందుగా 25 శాతం బియ్యాన్ని లేదా అందుకు సమానమైన మొత్తాన్ని పెనాల్టీ రూపంలో ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తేనే తరువాత సీజన్కు మళ్లీ సీఎంఆర్ ఇచ్చేందుకు వీలు కలుగుతుంది. అయితే 25 శాతం పెనాల్టిలో ఐదు శాతమే ఇప్పటికిప్పుడు ఇవ్వడం, మిగతా పెనాల్టీ మొత్తాన్ని 4 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉండటంతో మిల్లర్లు ఇదే అదనుగా వ్యాపారాన్ని య«థేచ్ఛగా సాగిస్తున్నారనే విమర్శలున్నాయి. -
బియ్యం ఇవ్వలేం!
సాక్షి, హైదరాబాద్: దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని ఓవైపు పాలకులు చెబుతుంటే.. మరోవైపు పక్క రాష్ట్రాలు తమ అవసరార్ధం కొనుగోలు చేస్తామన్న బియ్యం కూడా అందించలేక అధికార యంత్రాంగం సతమతమవుతోంది. కర్ణాటకలో ఎన్నికల హామీ అయిన ‘అన్న భాగ్య పథకం’కింద రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి అదనంగా 5 కిలోలు ఇచ్చేందుకు ఆ రాష్ట్రంలో బియ్యం అందుబాటులో లేవు. అలాగే తమిళనాడుకు కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఇచ్చేందుకు బియ్యం అవసరమయ్యాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాల పౌరసరఫరాల సంస్థలూ తెలంగాణను సంప్రదించాయి. దీంతో పౌరసరఫరాల సంస్థ గోడౌన్లలో మూలుగుతున్న బియ్యం ని ల్వలను, మిల్లులు బకాయి పడిన లక్షల టన్నుల బియ్యా న్ని సేకరించి ఈ రెండు రాష్ట్రాలకు పంపించాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్.. సంస్థ ఎండీ, కమిషనర్ అనిల్కుమార్కు సూచించారు. అయితే బియ్యం పంపడం సాధ్యం కాదంటూ కమిషనర్ చేతులెత్తేసినట్లు సమాచారం. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన పౌరసరఫరాల సంస్థ సమీక్ష సమావేశంలోనూ ఆయ న ఈ విషయం స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో మంత్రులు గంగుల, హరీశ్రావు, సీఎస్ సమావేశమై దీనిపై చర్చించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. 33 లక్షల మెట్రిక్ టన్నులు కావాలన్న రెండు రాష్ట్రాలు: కర్ణాటకకు నెలకు 2.18 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) బియ్యం అవసరం ఉందంటూ ఆ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల సంస్థ ఎండీ ఈ నెల 3న అనిల్కుమార్కు లేఖ రాశారు. ఈ లెక్కన సంవత్సరానికి 27 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం. అలాగే తమిళనాడు నుంచి కూడా ఈ నెల 23న ఒక లేఖ అందింది. రాష్ట్ర పీడీఎస్ అవసరాల కోసం 4 ఎల్ఎంటీల బాయిల్డ్ రైస్, 2 ఎల్ఎంటీల ముడి బియ్యం అవసరం అని ఆ రాష్ట్రం కోరింది. రాష్ట్ర మిల్లర్ల నిర్వాకంతోనే వెనకడుగు? తెలంగాణలో ఏటా సగటున కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్కు వస్తోంది. ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే వచ్చే 67 శాతం బియ్యం లెక్కన ఏటా సుమారు కోటి మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుంది. ఇందులో ఎఫ్సీఐకి 50 ఎల్ఎంటీ అప్పగించినా, మరో 50 ఎల్ఎంటీ వరకు స్టేట్ పూల్ కింద రాష్ట్రం వద్దనే ఉంటుంది. అయితే మిల్లర్లు నాణ్యమైన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడం, రోజుకు కనీసం 8 నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల మేర కూడా ఎఫ్సీఐకి అప్పగించకపోవడం వంటి కారణాలతో ఒక సీజన్ ధాన్యం సీఎంఆర్గా ఎఫ్సీఐ గోడౌన్లకు చేరుకునేందుకు 18 నెలల వరకు పడుతోంది. ఈ పరిస్థితుల్లో మిల్లర్ల మీద నమ్మకంతో పక్క రాష్ట్రాలకు విక్రయించే ఒప్పందాలు చేసుకుంటే ఇబ్బందులు తప్పవని కమిషనర్ భావిస్తున్నట్లు సమాచారం. మిల్లర్లు 2021–22 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 4.5 ఎల్ఎంటీ బియ్యం ఇవ్వాల్సి ఉంది. 2019–20, 21 బాపతు బియ్యం 1.25 ఎల్ఎంటీలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ బియ్యాన్ని 25 శాతం అదనపు జరిమానాతో వసూలు చేసినా, అది పౌరసరఫరాల సంస్థ ద్వారా పీడీఎస్కు తరలుతుంది. ఈ నేపథ్యంలో ఎఫ్సీఐకి ఇచ్చే బియ్యంలో కోత పెట్టడం ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు అవకాశాలున్నాయని కొందరు అధికారులు చెబుతున్నారు. అలాగే మిల్లర్లపై ఒత్తిడి పెంచి ఏ సీజన్ బియ్యం ఆ సీజన్లో మిల్లింగ్ చేయిస్తే పక్క రాష్ట్రాలకు విక్రయించడం కష్టం కాదని ఓ రిటైర్డ్ అధికారి వ్యాఖ్యానించారు. బియ్యానికి బదులు డబ్బులు అన్న భాగ్య పథకంపై కర్ణాటక నిర్ణయం బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చి న హామీల్లో ఒకటైన అన్న భాగ్య పథకం అమలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పథకం ప్రకారం దారిద్య్ర రేఖకి దిగువన ఉన్న కుటుంబాలకు అయిదు కేజీలు అదనంగా బియ్యం ఇవ్వాల్సి ఉంది.జూలై 1 నుంచి ఈ పథకం అమలు చేయాల్సి ఉండగా బియ్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తడంతో బియ్యానికి బదులుగా డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన కర్ణాటక రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేజీ బియ్యానికి రూ.34 చొప్పున 5 కేజీలకయ్యే ధర మొత్తం వారి ఖాతాల్లో వేయనున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక ఆహార, పౌర సరఫరా శాఖ మంత్రి కె.హెచ్. మునియప్ప విలేకరులకు వెల్లడించారు.‘‘రాష్ట్ర అవసరాలకు సరిపడా బియ్యాన్ని ఇవ్వడానికి ఏ సంస్థ ముందుకు రాలేదు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం కేజీ బియ్యం ధర రూ.34. అవసరమైన బియ్యం ప్రభుత్వం సేకరించే వరకు అర్హులైన లబ్దిదారులందరికీ బియ్యానికి బదులుగా డబ్బులు ఇస్తాం’’ అని వివరించారు. ఒక కార్డులో ఒకే వ్యక్తి ఉంటే రూ.170, ఇద్దరు ఉంటే రూ.340, ఒకవేళ అయిదుగురు సభ్యులుంటే వారి ఖాతాలో రూ.850 వేస్తామని మంత్రి వివరించారు. -
27 మిల్లులు రూ.2వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిల్లింగ్ సమస్యను పరిష్కరించేందుకు సర్కారీ రైస్ మిల్లుల నిర్మాణం ఈ సంవత్సరంలోనే ప్రారంభం కానుంది. సోమవారం సీఎం కేసీఆర్ పౌరసరఫరాల శాఖకు సంబంధించి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చే ఏడాదికల్లా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారానే జిల్లాకో మిల్లును ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల్లో ప్రతి జిల్లాకూ ఒకటి చొప్పున 27 మిల్లును ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం సుమా రు రూ. 2వేల కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. గంటకు 60 నుంచి 120 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మరాడించే కెపాసిటీతో ఈ మిల్లులను ఏర్పాటు కానున్నాయి. ప్రైవేటు మిల్లులపై భారాన్ని తగ్గించడంతో పాటు మిల్లర్లపై బాధ్యతను పెంచేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పెరిగిన ధాన్యం దిగుబడికి అనుగుణంగా... రాష్ట్రంలో ధాన్యం దిగుబడి అనూహ్యంగా పెరిగింది. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి 3 కోట్ల టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో మిల్లింగ్ ప్రధాన సమస్యగా మారింది. రైతుల నుంచి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి, బియ్యం(సీఎంఆర్)గా మార్చి ఎఫ్సీఐకి అప్పగించాలి. ఎఫ్సీఐ సెంట్రల్ పూల్ కింద బియ్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తుంది. ఈ క్రమంలో ఎక్కడ ఆలస్యమైనా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావలసిన డబ్బులు ఆగిపోతాయి. గత మూడేళ్లుగా ప్రతి ఏటా సకాలంలో మిల్లింగ్ ప్రక్రియ పూర్తికాక కేంద్రం నుంచి సహకారం అందక రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. గత యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇప్పటికి కూడా మిల్లర్లు మర పట్టించి ఇవ్వలేని పరిస్థితి. రాష్ట్రంలో 1,773 మిల్లులు... రాష్ట్రంలో ప్రస్తుతం 1,773 మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్ జరుగుతోంది. ఇందులో రా మిల్లులు 859 కాగా, బాయిల్డ్ మిల్లులు 914. ఒక్కో మిల్లులో ప్రస్తుతం గంటకు 8 నుంచి 10 మెట్రిక్ టన్నుల ధాన్యం చొప్పున ప్రతి రోజు రెండు షిఫ్టుల్లో 100 నుంచి 150 మెట్రిక్ టన్నుల వరకు మిల్లింగ్ కెపాసిటీ మాత్రమే ఉంది. అంటే రాష్ట్రంలోని అన్ని మిల్లుల్లో పూర్తిస్థాయిలో మిల్లింగ్ జరిగితే రోజుకు లక్ష నుంచి 2 లక్షల టన్నులకు పైగా ధాన్యం మిల్లింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే మిల్లర్లు తమ ప్రైవేటు దందాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో సర్కారుకు ఇచ్చే సీఎంఆర్ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గంటకు 60 నుంచి 120 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరాడించే భారీ మిల్లులను పౌరసరఫరాల సంస్థ ద్వారా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం గమనార్హం. మిల్లులతో పాటు బియ్యం ఆధారిత పరిశ్రమలను కూడా అక్కడే ఉండేలా ప్రణాళికలు తయారు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సీఎం ఆదేశించారు. సీఎం సూచన మేరకు నిర్మాణాలు: మంత్రి గంగుల సీఎం సూచన మేరకు ప్రభుత్వమే పౌరసరఫరాల సంస్థ ద్వారా రైస్ మిల్లులను నిర్మించాలని నిర్ణయించింది. గంటకు 60 నుంచి 120 టన్నుల కెపాసిటీ గల మిల్లులను తీసుకొస్తాం. వచ్చే ఏడాది కల్లా నిర్మాణాలు పూర్తి చేయాలనేది ఆలోచన. మిల్లులతో పాటు బియ్యం ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను కూడా కార్పొరేషన్ ద్వారా నిర్వహించే ఆలోచనలో ఉన్నాం. -
డిఫాల్టర్లకు పెనాల్టీ
సాక్షి, హైదరాబాద్: నిర్ణీత గడువులోగా ఎఫ్సీఐకి కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఇవ్వని రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా విదిల్చింది. 2021–22 వానా కాలం సీఎంఆర్ గడువు పలు వాయిదాల తరువాత ఏప్రిల్ 31తో ముగిసింది. అయినా రాష్ట్రంలోని 494 రైస్ మిల్లులు బియ్యం అప్పగించలేదు. వీటినుంచి 2.22 ఎల్ఎంటీ బియ్యం ఎఫ్సీఐకి చేరాల్సి ఉంది. ఈ బియ్యం రికవరీకి గడువు కోరినా ఎఫ్సీఐ అంగీకరించలేదు. దీంతో ఎఫ్సీఐ నుంచి సుమారు రూ. 700 కోట్లు రాలేదు. ఇప్పుడు మిల్లర్ల నుంచి బియ్యాన్ని రికవరీ చేసినా, నిబంధనల మేరకు ఎఫ్సీఐకి పంపకుండా రాష్ట్ర అవసరాలకే (స్టేట్ పూల్) వినియోగించుకోవాలి. దీంతో పౌర సరఫరాల శాఖ నష్ట నివారణకు చర్యలు చేపట్టింది. 494 రైస్ మిల్లులను డిఫాల్టర్లుగా ప్రకటించి, వారి నుంచి 25 శాతం పెనాల్టీతో 125 శాతం సీఎంఆర్ను రికవరీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హోదాలో పౌరసరఫరాల సంస్థ కమిషనర్ వి.అనిల్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 25 శాతం నగదు.. 100 శాతం బియ్యం.. డిఫాల్టర్ల నుంచి 125 శాతం బియ్యాన్ని రికవరీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మిల్లర్ల గుండెల్లో పిడుగు పడినట్లయింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ విలువ రూ. 700 కోట్లు అనుకుంటే... రూ. 175 కోట్లు(25 శాతం) పెనాల్టీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం వెంటనే చెల్లించాలి. అప్పుడే మిల్లర్ నుంచి బియ్యం రికవరీ ప్రారంభమ వుతుంది. మిల్లర్లు ఇప్పటికే బియ్యాన్ని విక్రయించినట్లు ఆరోపణల నేపథ్యంలో రికవరీకి రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసి స్టేట్పూల్కు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. వంద శాతం రికవరీయే కష్టమవుతుంది కాబట్టి, 25 శాతం బియ్యాన్ని నగదు రూపంలో వసూలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పౌరసరఫరాల శాఖ, సంస్థ డీఎంలు, డీఎస్ఓలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. పెనాల్టీ నుంచి 5వ వంతు మిల్లర్ల నుంచి వసూలు చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. ఓ వైపు సీఎంఆర్.. మరోవైపు ధాన్యం అన్లోడింగ్.. ఇప్పుడు డిఫాల్ట్ మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఓవైపు సీఎంఆర్ అప్పగించేందుకు మిల్లులు నడుపుతూ ప్రస్తుత యాసంగి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకొనే విషయంలో సర్కార్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి. ధాన్యానికి కొర్రీలు పెడుతూ ప్రతి 40 కిలోల బస్తాపై 3 నుంచి 5 కిలోల అదనపు ధాన్యాన్ని రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
తడిసినా కొంటాం
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఒక్క గింజ కూడా పోకుండా వీలైనంత త్వరగా సేకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భరోసా ఇచ్చారు. మామూలు ధాన్యం ధరనే తడిసిన ధాన్యానికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రైతన్నల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుంటోందని, ఆపత్కాలంలో వారి దుఃఖాన్ని, కష్టాన్ని పంచుకునేందుకు మరోసారి సిద్ధమైందని చెప్పారు. రైతుల కష్టాల్లో భాగస్వామ్యం కావడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, అన్నదాతలు ఏమాత్రం ఆందోళన చెందవద్దని కోరారు. యాసంగి ధాన్యంతో పాటు అకాల వర్షాల్లో తడిసిన ధాన్యం సేకరణపై మంగళవారం ఆయన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ జరుగుతోందని, అయితే అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ధాన్యం సేకరణ త్వరలోనే పూర్తి చేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. వరి కోతలు వాయిదా వేసుకోవాలి.. మరో మూడు, నాలుగురోజులు వానలు కొనసాగనున్నాయని, అప్పటిదాకా వరి కోతలను వాయిదా వేసుకోవాలని కేసీఆర్ రైతులకు సూచించారు. పంట కోతలకు వెళ్లకుండా సంయమనం పాటించాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని కోరారు. ‘రైతుల కోసం చిత్తశుద్ధి, దృఢ సంకల్పంతో కార్యాచరణ అమలు చేస్తున్నది ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఊహించని అకాల వర్షాలు ఎడతెరిపి లేకుండా కొనసాగుతుండడం బాధాకరం. ప్రకృతి వైపరీత్యానికి ఎవరం ఏమీ చేయలేం. కానీ మనకేం సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండలేదు. పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలను అందిస్తూ ఇప్పటికే ఆదుకుంటోంది. రాష్ట్ర ఖజానాకు ఎంత భారమైనా వెనుకంజ వేయకుండా రైతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది..’ అని సీఎం స్పష్టం చేశారు. ఇక మార్చిలోనే వరి కోతలు.. గతానికి భిన్నంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలను గుణపాఠంగా తీసుకుని భవిష్యత్తులో యాసంగి వరి కోతలు మార్చిలోపే జరిపేందుకు ఎలాంటి విధానాలను అవలంభించాలో శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని వ్యవసాయ శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ దిశగా రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఏటా మార్చిలోగా వరి కోతలు పూర్తయ్యేలా ముందస్తుగానే పంట నాటుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. మార్చి తర్వాత అకాల వర్షాలకు అవకాశాలున్నందున ఆ లోపే కోతలు పూర్తి చేసుకోవడం మంచిదన్నారు. ఏప్రిల్, మే వచ్చేదాకా పంట నూర్పకుంటే ఎండలు పెరిగి ధాన్యంలో నూక శాతం కూడా పెరిగిపోతుందని పేర్కొన్నారు. రైతులకు అవగాహన కల్పించాలి ఎరువుల వినియోగంపై కూడా రైతులకు అవగాహన కల్పించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు, మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో తలెత్తే మార్పులపై ఎప్పటికప్పుడు రైతాంగానికి అర్థమయ్యే రీతిలో కరపత్రాలు, పోస్టర్లు, వాణిజ్య ప్రకటనలు తదితర ప్రచార మార్గాల ద్వారా అవగాహన, చైతన్యం కల్పించాలని సూచించారు. ఏఈఓలు నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు తగు సూచనలందించాలని ఆదేశించారు. రైతు వేదికల్లో వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని స్పష్టం చేశారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. ఈ దిశగా పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం ఆదేశించారు. -
Telangana: కల్లాల్లో కన్నీళ్లు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలతో కోతకు వచ్చిన వరి పొలంలోనే నేలరాలింది. కోసి పెట్టిన ధాన్యం నీట మునిగింది. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు వరదకు కొట్టుకుపోయాయి. 4.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసినా.. ఒక్క వరి పంటే ఐదు లక్షల ఎకరాలకుపైగా దెబ్బతిన్నట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తోంది. కొన్నిచోట్ల ఎకరా పొలంలో కనీసం క్వింటాల్ ధాన్యం కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఒక్క వరి మాత్రమే కాదు.. మామిడి, నువ్వులు, మిరప, మొక్కజొన్న, టమాటా వంటి ఇతర పంటలు కూడా వడగళ్ల బీభత్సానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. వడగళ్లు, ఈదురుగాలుల కారణంగా సంగారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట తదతర జిల్లాల్లో మామిడి భారీగా నేలరాలింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో పంట నష్టం అత్యధికంగా.. ఖమ్మం, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లో కాస్త తక్కువగా ఉంది. ఈదురుగాలులు, వడగళ్లతో అధిక నష్టం వేసవిలో అకాల వర్షాలు మామూలే అయినా.. ఈసారి తీవ్రమైన ఈదురుగాలులు, వడగళ్లతో ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తుండటం తీవ్ర నష్టానికి కారణం అవుతోందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల ఎకరానికి క్వింటాల్ వడ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని.. వరికోత కోసం తెచ్చే హార్వెస్టర్ అద్దెకు సరిపడా ధాన్యం కూడా వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు. పొలాలను కౌలుకు తీసుకొని వరిసాగు చేసిన రైతులకు మరింత దెబ్బపడింది. కౌలు, పెట్టుబడి కలిపి ఒక్కో ఎకరాకు 20వేలకుపైనే నష్టపోతున్నామని, ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు. తడిసిన ధాన్యం ముందుగా వరి సాగు చేసిన నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, నల్లగొండతోపాటు వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి తదతర జిల్లాల్లో కోతలు మొదలయ్యాయి. 2వేలకుపైగా కేంద్రాలను ఏర్పాటు చేసినా ఇంకా కొనుగోళ్లు మొదలుపెట్టలేదు. రైతులు తెచ్చిన పంటను కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోశారు. అకాల వర్షాలతో అంతా తడిసిపోయింది. పలుచోట్ల కొట్టుకుపోయింది. మొత్తంగా 5 లక్షల టన్నుల ధాన్యం తడిసినట్టు పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకృతి బీభత్సం నేపథ్యంలో వరి దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉందని.. కోటి టన్నుల సేకరణ అంచనా వేసుకున్నా, అందులో సగమైనా వస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఏడెకరాల్లో నష్టపోతే అర ఎకరమే రాశారు నేను ఏడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. గత నెలలో కురిసిన వానలకు పంట పూర్తిగా నేలవాలింది. అయినా అధికారులు అర ఎకరమే నష్టం జరిగినట్లు రాశారు. మిగిలిన కాసింత పంటనూ వ్యాపారులు తక్కువ ధరకే అడుగుతున్నారు. నష్టమెలా పూడ్చుకోవాలో తెలియడం లేదు. – వరి మేకల నాగయ్య, రైతు, సువర్ణాపురం, ముదిగొండ మండలం రాళ్లవాన ముంచింది మూడెకరాల్లో వరి వేసిన. తెల్లారి కోద్దామనుకుంటే.. రాత్రి మాయదారి రాళ్లవాన నిండా ముంచింది. గింజలన్నీ మట్టిలో కలిసిపోయాయి. సర్కారు ఆదుకోవాలి. లేకుంటే కుటుంబం రోడ్డుపడుతుంది. – గుగులోతు నీల, మహిళా రైతు, ఆంధ్ర తండా, జనగామ జిల్లా పావు మందమే వడ్లు మిగిలాయి ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేసిన. వడగళ్ల వానతో పంటంతా నేలవాలి గింజలు రాలిపోయాయి. పావు మందమే వడ్లు మిగిలాయి. మిషిన్ పెట్టి కోయిస్తే గడ్డి మాత్రమే మిగులుతుంది. – రైతు ఆవుల మహేందర్, గర్రెపల్లి, సుల్తానాబాద్ పంట నష్టం అంచనాలివీ.. ఉమ్మడి కరీంనగర్లో.. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో లక్ష ఎకరాలకుపైగా వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో వరి పంటే 80 వేల ఎకరాల్లో నష్టపోయింది. ఒక్క జగిత్యాల జిల్లాలోనే 50వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 60వేల మంది రైతులపై వర్షం ప్రత్యక్ష ప్రభావం చూపినట్టు అంచనా. మెదక్ ఉమ్మడి జిల్లాలో.. సిద్దిపేటలో పంట నష్టం అధికంగా ఉంది. ఈ జిల్లాలో 86,203 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఇందులో 79,350 ఎకరాల్లో వరికి నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మెదక్లో 13,632 ఎకరాల్లో వరి, 342 ఎకరాల్లో మామిడి దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లా పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో లక్షన్నర టన్నుల ధాన్యం తడిసినట్లు అనధికారిక అంచనా. సంగారెడ్డి జిల్లాలో నష్టం తక్కువగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్లో.. కామారెడ్డి జిల్లాలో 22 వేల మంది రైతులకు సంబంధించిన పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొత్తంగా 32 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో వరి, మొక్కజొన్న, నువ్వు, పొద్దుతిరుగుడు, పసుపు, ఉద్యాన పంటలకు 600 ఎకరాల్లో నష్టం జరిగింది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు తడిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో లక్షన్నర ఎకరాల వరకు వివిధ పంటలు నష్టపోయినట్టు సమాచారం. అయితే 75,603 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఇందులో 58 వేల ఎకరాల్లో వరి, 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 7,603 ఎకరాల్లో ఇతర పంటలు ఉన్నట్టు పేర్కొన్నారు. జనగామలో వరి బాగా దెబ్బతింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో.. మంచిర్యాల జిల్లాలో 2,379 ఎకరాల్లో వరి, 309 ఎకరాల్లో మామిడి.. ఆదిలాబాద్ జిల్లాలో 2వేల ఎకరాల్లో జొన్న పంటలకు నష్టం జరిగినట్టు అంచనా వేశారు. ఆసిఫాబాద్లో 3,419 ఎకరాల మేర పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో.. సూర్యాపేట జిల్లాలో 25వేల ఎకరాలకుపైగా వరికి నష్టం వాటిల్లగా, సుమారు 1,000 ఎకరాల్లో మామిడి తోటలు నాశనమయ్యాయి. యాదాద్రి జిల్లాలో 11వేల ఎకరాల్లో వరి దెబ్బతిన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం జిల్లాలో వరి 8,169 ఎకరాల్లో, మొక్కజొన్న 1751 ఎకరాల్లో నష్టపోయినట్టు కలెక్టర్కు వ్యవసాయ శాఖ నివేదించింది. -
మే నుంచి చిరుధాన్యాల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం కార్డుదారులకు పూర్తిస్థాయిలో నిత్యావసరాలను అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ఆయా పంట ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2023ను మిల్లెట్ ఇయర్గా ప్రకటించిన నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి రాయలసీమ జిల్లాల్లో చిరుధాన్యాల (జొన్నలు, రాగులు) పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి జొన్న ఉత్పత్తులను సేకరించగా.. కర్ణాటక ప్రభుత్వం నుంచి ఎఫ్సీఐ ద్వారా రాగులు కొనుగోలు చేయనుంది. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేలా.. పేదలకు పీడీఎస్ కింద పౌష్టికాహార ఉత్పత్తులను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో ఖరీఫ్ నుంచి చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు మిల్లెట్లు పండించేలా అవగాహన కల్పించనున్నారు. చిరుధాన్యాల ఉత్పత్తులను స్థానికంగానే రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి పీడీఎస్లో పంపిణీ చేయనున్నారు. ఫలితంగా రైతులకు మార్కెట్లో పక్కా ధర భరోసా దక్కనుంది. వచ్చే ఖరీఫ్లో కందుల కొనుగోలు రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి సుమారు 4లక్షల టన్నుల వరకు కందుల దిగుబడి నమోదవుతోంది. ఈ క్రమంలోనే పీడీఎస్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఖరీఫ్లో నేరుగా రైతుల నుంచి కందులు సేకరించేలా పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 1.45 కోట్ల రైస్ కార్డులు ఉండగా.. ఇందులో ప్రతి నెలా సగటున 5,500 టన్నుల కందిపప్పు అవసరం అవుతున్నది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో కందిపప్పు సాధారణ రకం రూ.120–రూ.125, ఫైన్ వెరైటీ రూ.130 వరకు పలుకుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం సబ్సిడీపై కిలో కందిపప్పును రూ.67కే అందిస్తోంది. ఫలితంగా ఏప్రిల్లో ఏకంగా 7,100 టన్నుల కందిపప్పును వినియోగదారులకు సరఫరా చేసింది. బియ్యం బదులు గోధుమ పిండి కేంద్ర ప్రభుత్వం పీడీఎస్ కింద నెలకు 1,800 టన్నులు మాత్రమే గోధుమ ఉత్పత్తులను రాష్ట్రానికి కేటాయిస్తుండగా.. వాటిని తొలి ప్రాధాన్యత కింద వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారు. కిలో రూ.16 చొప్పున కార్డుకు గరిష్టంగా రెండు కిలోలు సరఫరా చేస్తున్నారు. అయితే గోధుమను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు వినియోగదారుల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇక్కడ ప్రతినెలా ఇచ్చే రేషన్లో కేజీ బియ్యం బదులు ఉచితంగా గోధుమ పిండి ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. స్థానిక అవసరాలకు అనుగుణంగా.. రాష్ట్రంలో ప్రజా పంపిణీకి అవసరమైన నిత్యావసరాల ఉత్పత్తులను స్థానికంగా రైతుల నుంచి కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఫలితంగా రైతులకు మద్దతు ధర భరోసా దక్కడంతో పాటు.. కేంద్ర ప్రభుత్వం సరుకు ఇచ్చే వరకు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
ఒక్క గింజా వదలం.. నయా పైసా పోనియ్యం
సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో ఒక్క గింజను వదులుకోబోమని, ఒక్క రూపాయిని కూడా ఊరికే పోనివ్వ మని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ధాన్యం అమ్ముకునే మిల్లర్లను, రేషన్ బియ్యం పక్కదారి పట్టడాన్ని గుర్తించి సమాచారం అందించిన పౌరులకు సైతం రివార్డులు అందజేయడంతోపాటు వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామన్నారు. శుక్రవారం పౌర సరఫరాల శాఖ, సంస్థల అధికారులతో హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట, నల్గగొండ, వనపర్తి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోనే అధికంగా మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, సీఎంఆర్ అప్పగింతలో కూడా ఈ జిల్లాల్లో డిఫాల్టర్లు అధికంగా ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో పటిష్టమైన టాస్క్ఫోర్స్ను తక్షణమే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ రిటైర్డ్ పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులతో కట్టుదిట్టమైన టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆరు రెట్లు ధాన్యం దిగుబడి.. రెండు రెట్లు మాత్రమే పెరిగిన మిల్లింగ్ కెపాసిటీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ అభివృద్ధికి చేసిన కృషితో 24 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 141 లక్షల మెట్రిక్ టన్నులకు ధాన్యం సేకరణ పెరిగిందని మంత్రి కమలాకర్ తెలిపారు. ఆరింతలుగా పెరిగిన ఈ ధాన్యం సేకరణకు అనుగుణంగా మిల్లింగ్ కెపాసిటీ పెరగలేదని, కేవలం గతానికి ఇప్పటికి 2 రెట్లు మాత్రమే పెరిగిందన్నారు. అందువల్ల మిల్లర్లకు అదనంగా ధాన్యం కేటాయింపులు చేయడం జరుగుతుందని, ఇదే అదనుగా కొన్ని చోట్ల మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులతోపాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రయోగించి 125 శాతం నగదు రికవరీ చేస్తా మని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల నుంచి 90 శాతం రికవరీ చేశామని, మిగతా పది శాతం సైతం రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రెండు లారీ ల బియ్యం మిల్లుకు అక్రమంగా తరలిస్తుండగా, విజిలెన్స్ బృందాలు పసిగట్టి పట్టుకున్నాయని చెప్పారు. పెద్దపల్లితో పాటు సూర్యాపేట, ఇతర జిల్లాల్లో జరిగిన బియ్యం అక్రమాలపై కూడా కేసులు బుక్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ధాన్యం నిల్వ కోసం ఇంటర్మీడియట్ గోదాంలు ఈ యాసంగిలో ఇంటరీ్మడియట్ గోదాములను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి గంగుల తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో ఖాళీగా ఉన్న మిల్లింగ్ కెపాసిటీని వాడుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ డిఫాల్టర్లకు, అక్రమ మిల్లర్లకు ఈసారి ఒక్క గింజను కూడా కేటాయించబోమని చెప్పారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి గంగులను కలిసిన గెల్లు శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమితులైన హుజూరాబాద్ నియో జకవర్గం బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 15న ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా ఆయన్ను కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ను అభినంస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని, సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని గంగుల సూచించారు. -
కస్టమ్ మిల్లింగ్పై స్పెషల్ ఫోకస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాను పూర్తిగా అరికట్టేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)పై పటిష్ట నిఘాను ఏర్పాటు చేసింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించి వాటిని బియ్యంగా మార్చే ప్రక్రియలోకి పీడీఎస్ బియ్యం వచ్చి చేరకుండా జాగ్రత్త పడుతోంది. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీఎంఆర్ మిల్లుల విద్యుత్ వినియోగం, కస్టమ్ మిల్లింగ్ జరిగిన బియ్యం పరిమాణాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తోంది. ఇందులో భాగంగానే 8 జిల్లాల్లో సుమారు 46 మిల్లుల్లో సీఎంఆర్ బియ్యం పరిమాణం కంటే విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉండటాన్ని గుర్తించింది. తక్కువ విద్యుత్ వాడి ఎక్కువ మొత్తంలో మిల్లింగ్ చేయడం ఎలా సాధ్యమైందన్న అంశంపై ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా ఆయా మిల్లులను వెంటనే తనిఖీ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లను ఆదేశించింది. తగ్గిన అక్రమ రవాణా మరోవైపు విజిలెన్స్ బృందాలతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుండటంతో చాలావరకు రేషన్ బియ్యం అక్రమ రవాణా తగ్గింది. దీనికి తోడు 6ఏ కేసులను త్వరగా విచారించి పట్టుబడ్డ బియ్యాన్ని తిరిగి బహిరంగ వేలం ద్వారా మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇందుకు ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్, డీసీఎస్వో, పౌర సరఫరాల శాఖ ఏఎం, మార్కెటింగ్ శాఖ ఏడీలతో ప్రత్యేక కమిటీలను నియమించింది. వీరు సంబంధిత తహసీల్దార్ ఆధ్వర్యంలో బియ్యం నాణ్యత, రకాన్ని బట్టి అప్సెట్ ధరను నిర్ణయించి బహిరంగ వేలానికి వెళ్తున్నారు. అక్రమ రవాణాలో దొరికిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు బయటకు పంపించేలా ప్రతి నెలలో రెండు సార్లు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. సాధారణంగా రేషన్ దుకాణంలో రికార్డులకు మించి స్టాక్ ఉంటే దానిని సీజ్ చేసి కేసు నమోదు చేస్తారు. ఇటువంటి నిల్వలకు మోక్షం కలి్పంచి పీడీఎస్ ధరకే ప్రజా పంపిణీలోకి తీసుకొస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా ప్రైవేట్ గోడౌన్లు, దుకాణాలు, లారీల్లో స్వా«దీనం చేసుకున్న బియ్యాన్ని మాత్రం బహిరంగ వేలానికి పెడుతున్నారు. నిల్వలతో సమస్య అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్న అధికారులు కేసులు నమోదు చేసి ఎక్కడికక్కడ ఎంఎల్ఎస్ పాయింట్లలో సరుకును నిల్వ చేస్తున్నారు. అయితే, కేసుల విచారణ జాప్యంతో నిల్వలు పేరుకుపోయి బియ్యం ముక్కిపోవడం, రంగు మారడం, పురుగులు పట్టి ప్రజా వినియోగానికి పనికిరావట్లేదు. వీటి ప్రభావం ఎంఎల్ఎస్ పాయింట్లలోని తాజా సరుకులపైనా పడుతోంది. ఒక్కోసారి ఈ నిల్వలు సాధారణ పీడీఎస్లో కలిసిపోతుండటంతో సరైన లెక్కలు ఉండట్లేదు. వీటిని అరికట్టేందుకు జిల్లాల్లో ఒకట్రెండు ఎంఎల్ఎస్ పాయింట్లను గుర్తించి వాటిలో మాత్రమే అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ చౌక బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసుల్లో సరుకు విలువ రూ.50 లక్షలకు పైబడి ఉంటే కలెక్టర్, రూ.50 లక్షలు లోపు ఉంటే జాయింట్ కలెక్టర్ విచారించనున్నారు. కోర్టు పరిధిలో ఉన్న కేసులు మినహా మిగిలిన వాటిని జిల్లా స్థాయిలో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు. సీఎంఆర్పై ప్రత్యేక దృష్టి పౌరసరఫరాల శాఖలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మిల్లుల కరెంటు వాడకం, వారిచ్చిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం పరిమాణాన్ని పోల్చి చూస్తున్నాం. కొన్ని మిల్లుల్లో సీఎంఆర్ చేసి ఇచ్చిన బియ్యానికి, వాడిన కరెంట్కు పొంతన లేదు. తక్కువ కరెంట్తో ఎక్కువ బియ్యం సీఎంఆర్ చేసినట్టు చూపిస్తున్నారు. దీనిపై ఆయా జిల్లాల జేసీలను తనిఖీ చేయాలని ఆదేశించాం. వారిచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటాం. – హెచ్.అరుణ్కుమార్, పౌరసఫరాల శాఖ కమిషనర్ వేగంగా కేసులను డిస్పోజ్ చేస్తున్నాం రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన బియ్యం అందిస్తుండటంతో చాలా వరకు రేషన్ అక్రమ రవాణా తగ్గింది. దీనితో పాటు ఇప్పటివరకు నమోదైన 6ఏ కేసులను కూడా త్వరగా విచారించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాం. కొన్నేళ్లుగా విచారణకు నోచుకోని కేసులు, భారీగా పేరుకుపోయిన నిల్వలను క్లియర్ చేస్తున్నాం. సరైన పత్రాలు లేకుండా తరలిస్తూ పట్టబడ్డ బియ్యానికి బహిరంగ వేలం నిర్వహించి ప్రజా వినియోగంలోకి తీసుకొస్తున్నాం. – విజయ సునీత, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ -
ఎండీయూ ఆపరేటర్లకూ వాహనమిత్ర
సాక్షి, అమరావతి: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ రేషన్ సరఫరా చేస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(ఎండీయూ) ఆపరేటర్లకు బీమా ప్రీమియాన్ని ఈ ఏడాది నుంచి వాహన మిత్ర పథకంలో భాగంగా చెల్లించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తమకు వచ్చే వేతనం నుంచి ఎండీయూ వాహనాల ప్రీమియాన్ని ఏటా బ్యాంకులు జమ చేసుకోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎండీయూ ఆపరేటర్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుకు విన్నవించారు. ఇదే విషయాన్ని మంత్రి కారుమూరి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే సీఎం సానుకూలంగా స్పందించారు. బీమా ప్రీమియం చెల్లింపును వాహనమిత్ర పథకం కిందకు చేర్చి 2021 నుంచి అమలు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఈ ఏడాది జూలైలో సొంతంగా ఆటో, ట్యాక్సీలు నిర్వహించుకునే వారికి చెల్లించే వాహనమిత్ర పథకంతో.. ఎండీయూ ఆపరేటర్లకూ ప్రీమియం మొత్తం రూ.9 కోట్లు ప్రభుత్వం నేరుగా చెల్లించనుందని మంత్రి కారుమూరి శనివారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. -
పేదలందరికీ అన్నం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ప్రతి ఆరు నెలలకోసారి నూతన బియ్యం కార్డుల మంజూరుకు శ్రీకారం చుట్టింది. తొలి అర్ధ సంవత్సరం జూన్లో, చివరి అర్ధ సంవత్సరం డిసెంబర్లో.. అప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కొత్త కార్డులను అందిస్తోంది. తాజాగా 26 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 70,807 రైస్ కార్డులను మంజూరు చేసింది. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి వీటిని పంపిణీ చేయనుంది. ఈ మేరకు కార్డుల ముద్రణను దాదాపు పూర్తి చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 1.39 కోట్ల కార్డులు మాత్రమే ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కార్డుల సంఖ్యను 1,45,43,996కు పెంచింది. వీటి కింద 4.24 కోట్ల మందికి 2.31 టన్నుల బియ్యాన్ని ప్రతి నెలా పంపిణీ చేస్తోంది. ఇప్పుడు కొత్తగా ఇచ్చేవాటితో కలిపితే మొత్తం కార్డుల సంఖ్య 1,46,14,803 అవుతుంది. అదనంగా 1.66 లక్షల మందికి ప్రతి నెలా 8.30 లక్షల టన్నుల రేషన్ను పంపిణీ చేయనుంది. ఇందుకుగాను ప్రభుత్వంపై నెలకు రూ.3.40 కోట్ల భారం పడుతుంది. ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ పంపిణీతో పాటు, దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన(సార్టెక్స్) బియ్యం ఇస్తోంది. అందువల్ల ప్రతి నెలా 90 శాతానికి పైగా ప్రజలు రేషన్ తీసుకుంటున్నారు. ఆరు దశల ధ్రువీకరణ ముఖ్యం రాష్ట్రంలో బియ్యం కార్డుల మంజూరులో ప్రభుత్వం ఆరు దశల ధ్రువీకరణ(సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్) విధానాన్ని అవలంబిస్తోంది. ఇందులో అర్హులైతేనే కొత్త కార్డులిస్తోంది. ఈ క్రమంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో వెసులుబాటు కల్పించాం. వీటిపై వచ్చే దరఖాస్తులను సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పునఃపరిశీలన జరిపి అర్హులని తేలితే.. ఆ మేరకు సరిచేసి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. – హెచ్.అరుణ్కుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ -
Andhra Pradesh: రైతుకు సంపూర్ణ ‘మద్దతు’
దళారుల దోపిడీ నుంచి విముక్తి గతంలో ధాన్యం అమ్ముకోవాలంటే ఇబ్బంది పడేవాడిని. ఆర్బీకేల ద్వారా కల్లాల్లోనే ధాన్యం కొనుగోలు చేసి రైతుల ప్రమేయం లేకుండా మిల్లుకు పంపడం ఆనందంగా ఉంది. నేను రూ.3.75 లక్షల విలువైన 245 బస్తాల ధాన్యం ఆర్బీకే ద్వారా విక్రయించాను. కొందరు రైతులు బయటి వ్యక్తులకు అమ్మి బస్తాకు రూ.300 నష్టపోయారు. ఇప్పుడు బాధ పడుతున్నారు. ప్రతి ఆర్బీకేలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో సకాలంలో పంటను అమ్ముకోగలుగుతున్నాం. – సత్తి జగదీశ్వరరెడ్డి, రైతు, కృష్ణంపాలెం, తూర్పుగోదావరి జిల్లా పూర్తి మద్దతు ధర దక్కింది ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ ధాన్యం సేకరణ విధానంతో రైతుగా నాకు ఎంతో మేలు జరిగింది. నేను తొలిసారి పూర్తి మద్దతు ధర పొందాను. గతంలో ఎప్పుడూ బస్తాకు రూ.100– 200 తక్కువకు అమ్ముకునేవాడిని. ఈ సారి 3.5 ఎకరాల్లో పంట సాగు చేస్తే 95 క్వింటాళ్ల పంటను ఆర్బీకేలో విక్రయించాను. రూ.1.96 లక్షలు వచ్చింది.ఐదు రోజులు తిరక్కుండానే నా ఖాతాలో నగదు జమైంది. హమాలీ, ట్రాన్స్పోర్టు ఖర్చులు కూడా ప్రభుత్వం ఇచ్చింది. వచ్చే పంటకు ముందుగానే డబ్బులు చేతిలోకి వచ్చాయి. గతంలో ఇంత వ్యవస్థ లేదు. ఎవరూ పట్టించుకునేవారు కాదు. అందుకే దళారులకు అమ్ముకునే వాళ్లం. – డి.సాయి ప్రసాద్, రైతు, కొత్తపేట, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో రైతులకు దక్కాల్సిన మద్దతు ధరను కాజేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం రైతు ఒక్క గింజ కూడా నష్టపోకుండా కాపు కాస్తోంది. రైతు కల్లంలో ధాన్యం ఆరబోసిన దగ్గర నుంచి మిల్లుకు తరలించేంత వరకు ప్రభుత్వమే అన్నీతానై అండగా నిలుస్తోంది. ధాన్యం సేకరణలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు రైతు చెంతకే మద్దతు ధరను తీసుకెళ్లాయి. సాగుదారుల్లో ఎక్కువగా ఉండే చిన్న, సన్నకారు రైతులకు మరింత మేలు చేస్తూ గోనె సంచుల వినియోగ చార్జీల నుంచి హమాలీల కూలి, రవాణా ఖర్చుల వరకు ప్రభుత్వమే భరిస్తోంది. వీటి కింద ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు రూ.14.80 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసి వారికి ఖర్చుల భారాన్ని తగ్గించింది. 35 లక్షల టన్నుల సేకరణ అంచనా ఈ ఖరీఫ్లో 85.58 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశారు. ఈ మొత్తం దిగుబడిలో రైతులు తమ కుటుంబ, విత్తన అవసరాల కోసం 20–30 శాతం వరకు ధాన్యాన్ని నిల్వ చేసుకుంటారు. మిగిలిన 70 శాతం మార్కెట్కు వస్తుంది. ఇందులో 20–30 శాతం వరకు ఫైన్ వెరైటీలు (సన్నరకాలు) ఉంటాయి. వీటికి బహిరంగ మార్కెట్లో మంచి రేటు దొరుకుతుంది. మిగిలిన 40–50 శాతం సాధారణ రకాలను ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. ఈ క్రమంలోనే 3,216 ఆర్బీకేల ద్వారా 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ అంచనాగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 1.93 లక్షల మంది రైతుల నుంచి రూ.2,303 కోట్ల విలువైన 10.91 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇందులో 83 వేల మంది రైతులకు 21 రోజుల్లోపే రూ.752 కోట్లు చెల్లింపు చేసింది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణాలోనూ 75 శాతం వరకు ధాన్యం సేకరణ పూర్తయింది. ఇప్పుడిప్పుడే శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరులో కోతలు, నూర్పిడులు వేగం పుంజుకున్నాయి. గతంలో కంటే మిన్నగా.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 18 లక్షల మంది రైతుల నుంచి రూ.43 వేల కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ప్రస్తుత ప్రభుత్వం మూడున్నరేళ్లలోనే 26.63 లక్షల మంది రైతుల నుంచి రూ.50,825 కోట్ల విలువైన 2.71 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇక్కడ గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం మద్దతు ధర పొందుతున్న రైతులు అధికంగా ఉండటం విశేషం. ప్రభుత్వ పారదర్శక విధానాలు, మిల్లర్లు, దళారుల దోపిడీకి పూర్తిగా అడ్డుకట్ట వేయడంతో రైతులు సంతోషంగా మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. మిల్లర్ల ప్రమేయానికి స్వస్తి ఇన్నేళ్ల ధాన్యం సేకరణ చరిత్రలో ప్రభుత్వం తొలిసారిగా మిల్లర్ల ప్రమేయానికి స్వస్తి పలికింది. ఆర్బీకే సిబ్బంది ఆధ్వర్యంలో ధాన్యం తూకం వేసి, ఎఫ్టీవో (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) జనరేట్ చేసిన తర్వాత మద్దతు ధర ఒక్క రూపాయి కూడా తగ్గకుండా జమయ్యేలా చర్యలు చేపడుతోంది. మిల్లుకు చేరిన ధాన్యంపై మిల్లరు అభ్యంతరం వ్యక్తం చేస్తే పరిష్కరించేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఫలితంగా ఆర్బీకే ఫైనల్ చేసిన తేమ శాతానికి, బరువుకు మిల్లరు కట్టుబడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చి రైతులకు పూర్తి మద్దతు ధరను అందిస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు, కృష్ణాలోనూ కొన్ని చోట్ల మిలర్లు రైతులను నేరుగా పిలిపించి తేమ శాతం పేరుతో ధాన్యం కోత పెట్టే ప్రయత్నం చేయడంతో పౌర సరఫరాల సంస్థ అధికారులు వారిని కస్టమ్ మిల్లింగ్ రైస్ నుంచి బ్లాక్ లిస్టులో పెడతామని గట్టిగా హెచ్చరించారు. ధాన్యం సేకరణతో పాటు రైతులకు పూర్తి మద్దతు కల్పనను ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకున్న నేపథ్యంలో జిల్లాల్లో కలెక్టర్లు, జేసీలు సైతం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. చాలా వరకు ధాన్యం కోతలు యంత్రాలపై చేస్తుండటంతో పంట వేగంగా బయటకు వస్తోంది. తేమ శాతం నిర్దిష్ట ప్రమాణం 17 కంటే ఎక్కువగా ఉంటే రెండు, మూడు రోజులు ఆరబెట్టాక ఆర్బీకే సిబ్బంది ధాన్యాన్ని మిల్లుకు తరలించి రైతులకు మేలు చేసేలా పని చేస్తున్నారు. 2014–15లో అప్పటి ప్రభుత్వం రెండు సీజన్లలో కలిపి 1.18 లక్షల మంది రైతుల నుంచి 40.62 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఇందు కోసం రూ.5,583 కోట్లు చెల్లింపులు చేసింది. ఇక్కడ సగటున ఒక్కో రైతు నుంచి సేకరించిన ధాన్యం 34.42 టన్నులు. చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉన్న రాష్ట్రంలో ఒక్కో రైతు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయడం ఎలా సాధ్యం? అంటే ఇక్కడ దళారులే రైతుల పేరిట ప్రభుత్వానికి ధాన్యం విక్రయించి మద్దతు ధరను కొట్టేశారన్నది సుస్పష్టం. 2015–16లోనూ అంతే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో రైతుల పేరుతో దోపిడీ గతంలో పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరణ జరిపేది. రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, కొందరు మిల్లర్లకు దోచిపెట్టేవారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని బస్తాకు (75 కేజీల) మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యేక్షంగా రైతులు నష్టపోయేవారు. తేమ శాతం పేరుతో ఇష్టమొచ్చినట్టు కోత పెట్టేవారు. ఇలా రైతుల నుంచి దళారులు కొన్న ధాన్యం తిరిగి ప్రభుత్వం దగ్గరకు వచ్చేది. మద్దతు ధరను రైతుల పేరుతో దళారులు బొక్కేసేవారు. మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ధాన్యం సేకరణలో మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే బ్లాక్ లిస్టులో పెడుతున్నాం. క్షేత్ర స్థాయిలో కలెక్టర్లు, జేసీలు కూడా ధాన్యం సేకరణను పర్యవేక్షిస్తున్నారు. మిల్లరు దగ్గర తేమ శాతంలో తేడా వచ్చే అవకాశం లేదు. ఆర్బీకే ఫైనల్ చేసిందే మిల్లరు తీసుకోవాలి. – వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ రైతులు మిల్లర్ల దగ్గరకు వెళ్లొద్దు రైతులు ఆర్బీకేల్లో ధాన్యం విక్రయించిన తర్వాత మిల్లరు దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏమైనా సమస్యలు వస్తే ఆర్బీకే సిబ్బంది, కస్టోడియన్ అధికారి చూసుకుంటారు. రైతులకు ఎఫ్టీవో జనరేట్ అయిన తర్వాత అందులో చూపించిన మొత్తం ఎట్టి పరిస్థితుల్లో రైతు ఖాతాలో జమవుతుంది. నిబంధనల ప్రకారం ధాన్యం ఉంటే ఎక్కడా ఒక్క రూపాయి కూడా మద్దతు ధర తగ్గనివ్వం. – హెచ్.అరుణ్ కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ -
స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. సివిల్ సప్లయ్ చైర్మన్గా సర్దార్
సాక్షి, కరీంనగర్: ఉద్యమ నాయకుడు సర్దార్ రవీందర్సింగ్ను అదృష్టం వరించింది. స్టూడెంట్ లీడర్గా రాజకీయ అరంగ్రేటం చేసిన రవీందర్సింగ్ మాస్లీడర్గా, న్యాయవాదిగా, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా, ఐదుసార్లు కౌన్సిలర్గా, కార్పొరేటర్గా ఎన్నికవ్వడమే కాకుండా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్గా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా రవీందర్సింగ్ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేయడంతో అదృష్టమంటే రవీందర్సింగ్దే అంటూ చెప్పుకోవచ్చు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ కరీంనగర్లో రవీందర్ సింగ్ కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కొద్దిసేపటిలోనే రాష్ట్రస్థాయి చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదిస్తూ నిర్ణయాలన్ని ఒకేరోజు కావడం అనూహ్యంగా జరిగాయి. సివిల్ సప్లయ్ చైర్మన్గా సర్దార్ కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్ను రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం జీవో ఆర్టీ 2313 నెంబర్ ద్వారా రవీందర్సింగ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ జీవో విడుదల చేశారు. కరీంనగర్లో రవీందర్సింగ్ కూతురు వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులను ఆశీర్వదించారు. సీఎం వివాహ వేడుక నుంచి వెళ్లిపోయిన కొద్ది సేపటిలోనే ఉత్తర్వులు వెలువడడంతో రవీందర్సింగ్ కూతురి పెళ్లికి సీఎం గిఫ్ట్ ఇచ్చారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. స్టూడెంట్ లీడర్గా.. మాస్ లీడర్గా.. రవీందర్సింగ్ విద్యార్థి దశలోనే 1984లో ఎస్సారార్ డిగ్రీ కళాశాలకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలంటే మక్కువ. ఎల్ఎల్బీ పూర్తి చేసి న్యాయవాద వృత్తిని చేపట్టి కొద్ది కాలంలోనే రాజకీయ అరంగ్రేటం చేశారు. కరీంనగర్ మున్సిపాల్టీలో 1995లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించి కౌన్సిలర్గా బాధ్యతలు స్వీకరించారు. 2001లో బీజేపీ నుంచి కౌన్సిలర్గా ఎన్నికై ఆ పార్టీ ఫ్లోర్లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. 2005లో జరిగిన ఎన్నికల్లో మరోసారి బీజేపీ నుంచి కార్పొరేటర్గా ఎన్నికవ్వడంతోపాటు బీజేపీ నగర అధ్యక్షుడిగా 2006 వరకు పనిచేశారు. 2006లో సీఎం కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. కేసీఆర్ పిలుపును అందుకొని బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సమక్షంలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా ఉంటూ టీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చే పిలుపునందుకొని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తూ కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా మారారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం కరీంనగర్ నగరంలో ఉధృతంగా నడిపించడంతో కేసీఆర్కు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. కరీంనగర్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల కోసం తీవ్రంగా పనిచేయడంతో కేసీఆర్ అనేక సందర్భంలో రవీందర్ సింగ్ను ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న సర్దార్ రవీందర్ సింగ్కు ఎమ్మెల్సీ అవకాశం ఖాయమంటూ ఒక దశలో ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్సీ అవకాశం అందినట్లే అంది అందకుండా పోయింది. రాష్ట్రస్థాయి పథకాలు అమలు.. టిఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా, మేయర్గా పనిచేసిన కాలంలో సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్ నగరంలో ఒక్క రూపాయి మేయర్గా ప్రసిద్ధి పొందారు. ఒక్క రూపాయికే నల్లా కలెక్షన్ ఇవ్వడం, ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేయడం, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. మేయర్గా ఉంటూనే కరీంనగర్ నగరంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్, ప్రైవేట్ టీచర్, క్రీడా, కార్మిక సంఘాలకు, సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతూ మాస్ లీడర్గా, మేయర్గా మన్ననలు పొందారు. -
మరింత సమర్ధంగా ఇంటింటికీ బియ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. ఇంటింటికీ రేషన్ అందించే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ (ఎండీయూ వాహనాలు) క్రమం తప్పకుండా లబ్ధిదారుల ప్రాంతాలకు వెళ్లేలా పక్కాగా పర్యవేక్షించనుంది. ఇందులో భాగంగా రూట్ మ్యాపింగ్, జీపీఎస్ ట్రాకింగ్ వంటి సాంకేతిక సేవలను వినియోగించనుంది. ఎండీయూ పరిధిలోని లబ్ధిదారులు తమ ఇళ్ల నుంచి ఎక్కువ దూరం వెళ్లకుండా సమీపంలోకే వాహనం వచ్చేలా అధికారులు ప్రత్యేక పాయింట్లను గుర్తిస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా ఐదారు ఇళ్లకు ఒకచోట ప్రతి నెలా ఎండీయూలో రేషన్ అందించేలా సాంకేతిక వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. వాహనాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా బియ్యం లబ్ధిదారులకు అందుతుంది. తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద వచ్చె నెలలో మండలానికి ఒక ఎండీయూ పరిధిలో దీనిని అమలు చేస్తారు. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వ విప్లవాత్మక చర్యలతో పెరిగిన రేషన్ పంపిణీ శాతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రతి నెలా రేషన్ తీసుకునేవారి శాతం గణనీయంగా పెరిగింది. లబ్ధిదారులకు నాణ్యమైన (సార్టెక్స్) బియ్యం ఇవ్వడంతో పాటు 9,260 ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే తీసుకెళ్లి అందించడం మంచి ఫలితాలను ఇస్తోంది. ప్రతి నెలా 1.45 కోట్ల కార్డుదారులకు 2.30 లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతుంది. గతంలో నెలకు 80 నుంచి 85 శాతం మాత్రమే రేషన్ పంపిణీ జరిగితే.. ఇప్పుడు 90 శాతానికి చేరుకొంది. మరోవైపు అనివార్య కారణాలతో ఎండీయూ వాహనదారులు ఎవరైనా తప్పుకుంటే వారి స్థానాన్ని భర్తీ చేసేంత వరకు గరిష్టంగా మూడు నెలల పాటు ఇన్చార్జి ఎండీయూకు (వేరే ఎండీయూ వాహనదారుడు పని చేస్తే) బాధ్యతలు అప్పగిస్తోంది. వీరికి నెలకు రూ.18,000 చొప్పున అదనంగా అందిస్తూ ఎక్కడా రేషన్ పంపిణీలో జాప్యం జరగకుండా చర్యలు చేపడుతోంది. 2 నుంచి 3 నెలలు నిల్వ చేసిన తర్వాతే రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసిన వెంటనే పీడీఎస్లోకి తీసుకురావడంతో సమస్యలు వస్తున్నాయి. కొత్త బియ్యం వండితే అన్నం బాగోలేదని, ముద్దగా అవుతుందనే ఫిర్యాదులున్నాయి. దీనిని అధిగమించేందుకు కస్టమ్ మిల్లింగ్ అనంతరం 2 నుంచి 3 నెలలు బఫర్ గోడౌన్లలో నిల్వ ఉంచిన తర్వాతే పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యం
సాక్షి, అమరావతి: వినియోగదారుల హక్కుల పరిరక్షణ, సత్వర న్యాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టాన్ని సవరించినట్లు పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు.సచివాలయంలో గురువారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి తొలి సమావేశం జరిగింది. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సవరించిన చట్టం ప్రకారం కొనుగోలుదారులు వస్తువులు ఎక్కడ కొన్నప్పటికీ వారి నివాస ప్రాంతం నుంచి ఆన్లైన్లో, స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో, లేదా వినియోగదారుల సేవ కేంద్రంలోని 1967, 18004250082 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేసు విచారణకు హాజరు కావొచ్చని చెప్పారు. వినియోగదారులు దోపిడీకి గురికాకుండా గత పది నెలల్లో విస్తృతంగా తనిఖీలు చేసి 1,748 కేసులు నమోదు చేశామన్నారు. పాత వాటితో కలిపి మొత్తం 2,139 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. పెట్రోల్ బంకులపై 97 కేసులు, ఎరువుల దుకాణాలపై 350 కేసులు, విశాఖపట్నం, విజయవాడలోని షాషింగ్ మాల్స్పై 175 కేసులు నమోదు చేశామన్నారు. త్వరలో బంగారు నగల దుకాణాల్లో కూడా తనిఖీలు చేస్తామన్నారు. ఆహార పదార్థాల కల్తీని అరికట్టేందుకు 15 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని, వీటిలో ఆరు ఫిబ్రవరికి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. విశాఖలోని ల్యాబ్ను ఆధునీకరిస్తామని, విజయవాడ, తిరుపతిలో కూడా ల్యాబ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఉక్రోషంతో చంద్రబాబు దుర్భాషలు భవిష్యత్తులో రాజకీయ జీవితం ఉండదని చంద్రబాబునాయుడు ఉక్రోషంతో దుర్భాషలకు దిగుతున్నారని మంత్రి విమర్శించారు. ప్రజలు పట్టించుకోవట్లేదని, ఇక ఇంటికి వెళ్లాల్సిందేనని అర్థమైన చంద్రబాబు చివరి ఎన్నికలని, అసెంబ్లీకి పంపాలని వేడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. క్షేత్ర స్థాయిలో టీడీపీకి నాయకత్వమే లేదన్నారు. ప్రభుత్వ పథకాలు అందుతుండటంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలను వారి కుటుంబ సభ్యులే తిడుతున్నారన్నారు. ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం రైతుల నుంచి ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. నూతన ఆన్లైన్ విధానం ద్వారా రైతులకు, మిల్లర్లకు సంబంధం లేకుండా ఒక్కపైసా కూడా నష్టపోకుండా మద్దతు ధర కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎఫ్టీవో వచ్చిన 21 రోజుల్లోగా నగదు జమ చేసేలా ఆదేశించామన్నారు. ఇప్పటికే 2.30 లక్షల టన్నుల ధాన్యాన్ని కొని, రూ.160 కోట్లకు పైగా చెల్లించామన్నారు. ఇందులో ధాన్యం అమ్మిన మరుసటిరోజే నగదు జమయిన∙ రైతులు కూడా ఉన్నట్లు వివరించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. -
రేషన్ పంపిణీలో నిర్లక్ష్యం వద్దు
సాక్షి, అమరావతి: రేషన్ పంపిణీలో నిర్లక్ష్యం వహించొద్దని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన మంగళగిరిలో చౌక దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎంజీకేఏవై కింద ఉచిత బియ్యం పంపిణీని పరిశీలించారు. ప్రతి దుకాణం వద్ద తప్పనిసరిగా ఉచిత బియ్యం లబ్ధిదారుల జాబితా ప్రదర్శించాలని ఆదేశించారు. సమీపంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎండీయూ వాహన సేవలు, బియ్యం నాణ్యతపై అభిప్రాయాణలను సేకరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. నాణ్యమైన (సార్టెక్స్) బియ్యాన్ని వాహనాల్లో ఇంటి వద్దకే అందించడం ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో రేషన్ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. చాలా మంది పేదలు ప్రభుత్వం ఇస్తున్న రూపాయికే కిలో బియ్యంతో కడుపు నింపుకుంటున్నట్టు చెప్పారన్నారు. -
సజావుగా ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: ధాన్యం సేకరణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ధాన్యం సేకరణలో ఈసారి నుంచి సరికొత్త విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ విషయంలో అక్కడక్కడా తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి 21 రోజుల్లోనే నగదు చెల్లిస్తున్నామని చెప్పారు. కనీస మద్దతు ధరతో పాటు గోనె సంచుల డబ్బులు, హమాలీ చార్జీలు నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తే క్రిమినల్ చర్యలు ఈ క్రాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులు తమ పంటను నేరుగా ఆర్బీకేల వద్దకు తీసుకుని రావాలని మంత్రి కారుమూరి సూచించారు. రైస్ మిల్లర్ల వద్దకు వెళ్లవద్దని చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో మిల్లర్ల జోక్యం తగదని.. ఈ మేరకు ఇప్పటికే వారికి ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిని బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. ఆర్బీకేల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మాత్రమే మిల్లింగ్ చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్బీకేల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఆర్బీకేల సంఖ్యను పెంచాలన్నారు. గత ముఖ్యమంత్రుల కన్నా సీఎం జగన్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. రైతుల ముసుగులో కొందరు ధాన్యం సేకరణ విషయంలో రాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండ్యన్, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పౌరసరఫరాల శాఖ అధికారుల నివాసాల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ఒంగోలు: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పౌరసరఫరాల శాఖలో రూ.29.87 కోట్ల అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులు, ఉద్యోగుల నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు నిర్వహించింది. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ పి.పద్మ, అసిస్టెంట్ మేనేజర్లు సీహెచ్.చల్లా జయశంకర్, ఎంవీవీడీ శర్మ, రికార్డ్ అసిస్టెంట్ పి.అరుణ కుమారి, డేటా ఎంట్రీ ఆపరేటర్ శివ కుమార్లకు విజయవాడ, ఒంగోలు, నెల్లూరుల్లో ఉన్న నివాసాల్లో ఏసీబీ బృందాలు బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగించాయి. ఆ అధికారుల ఆస్తుల పత్రాలు, బంగారు, వెండి ఆభరణాలతోపాటు ఇతర విలువైన వస్తువులను ఏసీబీ జప్తు చేసింది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కార్యాలయంలో ఈ ఏడాది మొదట్లో ఇంటర్నెల్ ఆడిట్ నిర్వహించగా అవినీతి వ్యవహారం బయటపడింది. 2020–21, 2021–22లకు సంబంధించి రూ.29.87 కోట్ల నిధులు దారి మళ్లినట్లు గుర్తించారు. దాంతో పి.పద్మ, చల్లా జయశంకర్, ఎంవీవీడీ శర్మ, టి.అరుణ కుమారి, శివ కుమార్లతోపాటు కాంట్రాక్టర్ చేజెర్ల దయాకర్, ప్రైవేటు వ్యక్తులు ఎం.రాడమ్మ, సూరి పవన్, చీపురుపల్లి రాజు, చేజెర్ల కామాక్షి, గరికిపాటి ప్రశాంతిలపై నెల్లూరులోని విద్యాధరపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అనంతరం ఆ కేసును ఏసీబీకి బదిలీ చేశారు. దీంతో వారిపై ఈ నెల 6న కేసు నమోదు చేసిన ఏసీబీ..బుధవారం అధికారులు, ఉద్యోగుల నివాసాల్లో సోదాలు నిర్వహించింది. సోదాలు పూర్తి అయిన తరువాత ఆధారాలను బట్టి తదుపరి చర్యలు తీసుకోనుంది. -
19 నుంచి ఉచిత బియ్యం పంపిణీ
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద మూడునెలల పాటు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఆహార భద్రత కార్డుదారులు రేషన్ దుకాణాల వద్ద ప్రతినెల 19వ తేదీ నుంచి 28వ తేదీలోగా బియ్యాన్ని తీసుకోవాలని సూచించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అవసరమైన నిల్వలను కేటాయించిందని, దీన్లో కొంత నాన్ సార్టెక్స్, మరికొంత నాన్ సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం ఉన్నాయని తెలిపారు. నవంబర్లో ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న నిల్వల ఆధారంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, మన్యం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు నాన్ సార్టెక్స్, మిలిగిన 16 జిల్లాలకు నాన్ సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. 2.68 కోట్ల మంది ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారుల జాబితాను చౌకదుకాణాలు, సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. ఒక్కో వ్యక్తికి ఐదుకిలోల వంతున బియ్యం ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ పోషణ ధ్యేయంగా ఏడు జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, వచ్చే ఏప్రిల్ నాటికి అన్ని జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. ఇందులో ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12 సమృద్ధిగా ఉంటాయని, వీటివల్ల రక్తహీతన తగ్గి, గర్భస్థ శిశువుకు మేలు జరగడంతోపాటు నాడీవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని వివరించారు. ఫోర్టిఫైడ్ బియ్యం తేలికగా ఉండి నీటిలో తేలడంతో కొంతమంది ప్లాస్టిక్ బియ్యంగా అపోహపడుతున్నారని పేర్కొన్నారు. రేషన్ అక్రమ రవాణాకు ఆస్కారం లేదు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిపారు. 9,260 ఎండీయూ వాహనాల ద్వారా లబ్ధిదారుల వేలిముద్రలతో ఇంటివద్దకే బియ్యాన్ని సరఫరా చేస్తుండటంతో బియ్యం బయట మార్కెట్కు తరలించే ఆస్కారం లేదని పేర్కొన్నారు. ఎల్లో మీడియా పనిగట్టుకుని విషప్రచారం చేయడం సరికాదని హితవుపలికారు. చౌకదుకాణాలు, ఎండీయూ వాహనాలను నిత్యం ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. విజిలెన్సు కమిటీలను నియమించి ప్రజాపంపిణీలో లోపాలు, అక్రమాలు లేకుండా నిఘావ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఫిర్యాదుల కోసం 1902 టోల్ ఫ్రీ నంబర్ను ఎండీయూ వాహనంపై ముద్రించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మూడేళ్లలో పక్కదారిపట్టిన 31,073 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్చేసి సెక్షన్ 6ఏ ప్రకారం 6,979 కేసులతోపాటు 1,603 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. రైస్మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ పట్టుబడితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్చేసే అనుమతిని రద్దుచేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల స్టాక్ పాయింట్లో ఇటీవల కొన్ని అవకతవకలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రాథమిక విచారణ అనంతరం స్టాక్ పాయింట్ ఇన్చార్జిని సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. -
కేరళకు ఆంధ్రా ధాన్యం
సాక్షి, అమరావతి/ తణుకు అర్బన్: రాష్ట్రంలో పండించే జయ రకం ధాన్యం (ఎంటీయూ 3626 బొండాలు), బియ్యాన్ని తమకు సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వంతో కేరళ ఒప్పందం చేసుకుంది. కేరళ పర్యటనలో భాగంగా మంగళవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్, ఏపీ డీడీసీఎఫ్ ఎండీ బాబు.ఏ సమక్షంలో రెండు రాష్ట్రాల అధికారులు ఎంవోయూ చేసుకున్నారు. ఏపీలో పండించే జయ బొండాలకు కేరళలో మంచి డిమాండ్ ఉంది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్ తమకు జయ బొండాలతోపాటు పలురకాల నిత్యావసరాలు తమకు సరఫరా చేయాలని కోరారు. ఏపీ మంత్రితో పాటు అధికారుల బృందాన్ని కేరళ పర్యటనకు ఆహ్వానించారు. కేరళ మంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... జయ రకం ధాన్యంతోపాటు ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు వంటి నిత్యావసరాలను కూడా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి, అధికారుల బృందం కేరళ పర్యటనకు వెళ్లగా... ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు ప్రత్యేక భేటీలో సుదీర్ఘంగా చర్చించి పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో జయ బొండాలు పండించే రైతులకు మద్దతు ధర లభించడంతోపాటు పెద్ద ఎత్తున మేలు జరుగనుంది. ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా సరఫరా చేసే నిత్యావసరాలను కేరళ పౌరసరఫరాల సంస్థ మావెల్లి స్టోర్స్ ద్వారా మార్క్ఫెడ్ బ్రాండ్తోనే వినియోగదారులకు అందించనుంది. ఈ సందర్భంగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కేరళ మంత్రి అనిల్తో కలిసి మావెల్లి స్టోర్స్ను సందర్శించి, అక్కడి వినియోగదారులకు నిత్యావసరాల సరఫరాను పరిశీలించారు. -
ఇంటింటికీ గిరిజన ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేషన్ దుకాణాలు, రేషన్ పంపిణీ వాహనాల (ఎండీయూ) ద్వారా గిరిజన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. నవంబర్ 1వ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్టు కింద విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లో ప్రారంభించనుంది. తొలి దశలో 290 రేషన్ వాహనాలు, 570 రేషన్ దుకాణాల్లో అమలు చేయనున్నారు. గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ కల్పించడంతోపాటు ఎమ్మార్పీ కంటే తక్కువ రేట్లకే వినియోగదారులకు అందించనున్నారు. ఎండీయూలకు ఆర్థిక బలం చేకూర్చేలా.. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థలో 9,260 ఎండీయూ వాహనాలు సేవలందిస్తున్నాయి. రేషన్ డోర్ డెలివరీ నిమిత్తం ఎండీయూ ఆపరేటర్లకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.18 వేల రెమ్యునరేషన్ ఇస్తోంది. వారికి మరింత ఆర్థిక బలం చేకూర్చేందుకు ప్రభుత్వరంగ సంస్థలైన గిరిజన, ఆయిల్ ఫెడ్, మార్క్ఫెడ్ ఉత్పత్తులను విక్రయించుకునే వెసులుబాటు కల్పించింది. ఆయా సంస్థల నుంచి సబ్సిడీపై సరుకులను తీసుకునే ఆపరేటర్లు వాటిని ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు ప్రజలకు విక్రయించాల్సి ఉంటుంది. ప్రతినెలా పీడీఎస్ బియ్యం పంపిణీలో జాప్యం లేకుండా విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టింది. వినియోగదారులకు తెలిసేలా వస్తువుల ధరల పట్టికను ప్రదర్శించనున్నారు. విక్రయించే ఉత్పత్తులు.. గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా తేనె, అరకు కాఫీ పొడి, వైశాఖి కాఫీ పొడి, త్రిఫల చూర్ణం, నన్నారి షర్బత్, ఆయుర్వేద సబ్బులు, చింతపండు, కుంకుడుకాయ పొడి, షికాకాయ పొడి, కారంపొడి, పసుపు, కుంకుమతోపాటు ఆయిల్ఫెడ్ నుంచి పామాయిల్, సన్ఫ్లవర్, రైస్బ్రాన్, వేరుశనగ నూనెలను అందుబాటులో ఉంచనున్నారు. గిరిజనులకు మేలు చేసేలా.. గిరిజనులకు మేలు చేసేలా ఎండీయూ వాహనాల ద్వారా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం. తొలుత విశాఖ, తిరుపతి జిల్లాల్లో స్పందనను బట్టి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం. రేషన్ లబ్ధిదారులే కాకుండా ప్రజలందరూ ఈ ఉత్పత్తులను కొనుక్కోవచ్చు. బియ్యం ఇచ్చే సమయంలో వినియోగదారులపై ఎటువంటి ఒత్తిడి చేయకుండా విక్రయాలు చేసుకోవాలని ఎండీయూలకు సూచించాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ -
కేరళ బృందం మిర్చి యార్డు సందర్శన
కొరిటెపాడు(గుంటూరు): కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బృందం గుంటూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంగళవారం సందర్శించింది. బృందంలోని సభ్యులు కమిషనర్ డాక్టర్ డి.సజిత్బాబు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంజీబ్కుమార్ పట్జోషి, కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రైవేటు సెక్రటరీ ప్రదీప్కుమార్ యార్డును సందర్శించిన వారిలో ఉన్నారు. వారికి గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి, మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి సాదర స్వాగతం పలికారు. మిర్చి యార్డులోని మిర్చి కమీషన్ షాపులను కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు పరిశీలించారు. యార్డు పనితీరు తదితర అంశాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం ఛాంబర్లో కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏసురత్నం మాట్లాడుతూ.. ప్రపంచంలోని సుమారు 15 దేశాలకు గుంటూరు నుంచి మిర్చి ఎగుమతి చేస్తున్నామన్నారు. కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం, అనంతవరప్పాడు గ్రామంలో మిర్చి పంట సాగును బృందం పరిశీలించింది. ఆర్డీవో ప్రభాకరరెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి పద్మశ్రీ, ఉద్యానశాఖ అధికారి ఎన్.సుజాత తదితరులు పాల్గొన్నారు. -
కేరళకు ఆంధ్రా ధాన్యం
సాక్షి, అమరావతి: కేరళ ప్రజలు తమ ఆహారంలో ఎంతో ఇష్టంగా తినే ఎంటీయూ–3626 జయ రకం ధాన్యం (బోండాలు), బియ్యం కొనుగోలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. విజయవాడలోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం కేరళ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్తో కూడిన కేరళ ఉన్నతాధికారుల బృందం మంత్రి కారుమూరితో భేటీ అయింది. తమకు కావాల్సిన సరుకుల సరఫరా సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అనంతరం మంత్రి కారుమూరి మాట్లాడుతూ లక్ష టన్నుల ధాన్యం, 60 వేల టన్నుల బియ్యం కావాలని కేరళ ప్రభుత్వం అడగటం శుభపరిణామమని పేర్కొన్నారు. నెలకు 550 టన్నుల ఎండుమిర్చి, కంది, పెసర, మినుములు సైతం సరఫరా చేయాలని కోరిందని తెలిపారు. ఈ నెల 21న మరోసారి సమావేశమై ధరలు నిర్ణయిస్తామన్నారు. ధరలు రైతులకు లాభదాయకంగా ఉంటే ఈ నెల 27న కేరళలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటాయని వివరించారు. పౌర సరఫరాల కమిషనర్ అరుణ్కుమార్, డైరెక్టర్ విజయ సునీత, ఏపీ ఎస్సీఎస్సీఎల్ ఎండీ వీరపాండియన్, సహకార సంఘాల కమిషనర్ ఎ.బాబు పాల్గొన్నారు. టీడీపీ హయాంలో రూ.30 కోట్లు కొట్టేశారు టీడీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో పౌర సరఫాల శాఖ నిధులు రూ. 30 కోట్లు కొల్లగొట్టారని మంత్రి కారుమూరి చెప్పారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రాథమికంగా ఐదుగురి తప్పు తేలడంతో వారిని సస్పెండ్ చేసినట్టు చెప్పారు. నిందితుల ఆస్తులను అటాచ్ చేశామని, మొత్తం వసూలు చేస్తామన్నారు. తప్పుడు పత్రాలతో చెరువులు, కాలువలు, తోటలను వరి పొలాలుగా చూపి ఈ–క్రాపింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇకపై ధాన్యం నగదుతో పాటే రవాణా చార్జీలనూ రైతుల అకౌంట్లో వేస్తామన్నారు. -
ధాన్యం సేకరణకు చురుగ్గా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ ధాన్యం సేకరణకు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చురుగ్గా ఏర్పాట్లుచేస్తోంది. ఇందుకు నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం వరికి మద్దతు ధరను క్వింటాకు రూ.100 పెంచింది. దీంతో క్వింటా ఏ–గ్రేడ్ రకం రూ.2,060, సాధారణ రకం రూ.2,040కు చేరింది. వరి సాగైన విస్తీర్ణం, దిగుబడి అంచనా ప్రకారం 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని భావిస్తున్నారు. ఈసారి కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం 10,300 మంది వలంటీర్ల సేవలను వినియోగించుకోనుంది. వీరికి కొనుగోళ్ల సమయంలో నెలకు రూ.1,500 ప్రోత్సాహకం అందించనున్నారు. 3,423 ఆర్బీకే క్లస్టర్లలో ధాన్యం సేకరణ ఈ ఖరీఫ్లో 3,423 ఆర్బీకే క్లస్టర్ల ద్వారా ధాన్యం సేకరణకు పౌర సరఫరాల సంస్థ సమాయత్తమవుతోంది. ధాన్యం సేకరణ సామర్థ్యాన్ని బట్టి రెండు, మూడు ఆర్బీకేలను కలిపి ఒక క్లస్టర్గా గుర్తిస్తోంది. ఇందులో రెండువేల టన్నులకు పైగా సేకరణ ఉండే క్లస్టర్లను ఏ, 1,000–2,000లోపు ఉంటే బీ.. 1,000లోపు ఉంటే సీ కేటగిరీలుగా విభజించింది. అవకతవకలకు ఆస్కారం లేకుండా వెబ్ల్యాండ్, కౌలు రైతులకు ఇచ్చే పంటసాగు హక్కు పత్రాల (సీసీఆర్సీ కార్డులు) ఆధారంగా పక్కాగా 100 శాతం ఈ–క్రాప్ నమోదును పూర్తిచేశారు. వచ్చే 16 నుంచి ఈ–క్రాప్ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. వాటిల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే సవరిస్తారు. ఇక పంట ఉత్పత్తులను తరలించేందుకు అవసరమైన గోనె సంచులు, హమాలీలు, రవాణా సౌకర్యాలను ప్రభుత్వమే అందిస్తోంది. రైతులే స్వయంగా గోనె సంచులు ఏర్పాటుచేసుకుంటే క్వింటాకు రూ.12.66 ఇవ్వనున్నారు. సొంతంగా ధాన్యాన్ని తరలించే వెసులుబాటునూ కల్పించారు. ఇందుకైన రవాణా, హమాలీ ఖర్చులు మొత్తాన్ని ధాన్యం విక్రయించిన సొమ్ముతో కలిపి 21 రోజుల్లో రైతు ఖాతాలో జమచేస్తారు. ఆర్బీకే నుంచి మిల్లుకు చేరే ధాన్యం తూకంలో వ్యత్యాసం, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా మిల్లు వద్ద్ద ఒక కస్టోడియన్ అధికారిని కూడా నియమించారు. దళారులు, మిల్లర్ల అక్రమాలకు చెక్ అలాగే, ధాన్యం సేకరణలో దళారులు, మిల్లర్ల పాత్రను పూర్తిగా తొలగించేలా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇప్పటివరకు ఆయా ఆర్బీకేలకు మిల్లులను మ్యాపింగ్ చేసేవారు. దీంతో కొనుగోలు చేసిన ధాన్యం ఏ మిల్లుకు వెళ్తుందో ముందుగానే తెలిసిపోయేది. ఈ క్రమంలో కొందరు దళారులు, మిల్లర్లు అక్రమాలకు పాల్పడేవారు. దీనిని అధిగమించేందుకు మిల్లులను జోన్లుగా విభజించారు. చివరి నిమిషంలో మాత్రమే ధాన్యాన్ని ఏ మిల్లుకు తరలించాలో చెప్పేలా ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టారు. పారదర్శకంగా కొనుగోళ్లు ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెస్తోంది. రైతులకు వంద శాతం మద్దతు ధరను అందించేలా పారదర్శక విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నాం. గోనె సంచులు, హమాలీలు, రవాణా వాహనాలను ముందుగా ఏర్పాటుచేయాలని జేసీలకు సూచించాం. ఒకవేళ రైతులే వాటిని ఏర్పాటుచేసుకుంటే ఖర్చులను వారి ఖాతాల్లో జమచేస్తాం. – హెచ్. అరుణ్కుమార్, కమిషనర్, ఏపీ పౌరసరఫరాల శాఖ మిల్లుల వద్ద కస్టోడియన్ అధికారులు ఆర్బీకేల్లో సజావుగా ధాన్యం విక్రయించినప్పటికీ మిల్లర్ల కొర్రీలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, తూకంలో వ్యత్యాసం పేరుతో రైతుల మద్దతు ధరకు కోత పెడుతున్నారు. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం మిల్లుల వద్ద ఒక కస్టోడియన్ అధికారిని సైతం నియమించింది. అవకతవకలకు తావులేకుండా ధాన్యం సేకరణలో ప్రతి ప్రక్రియను ఫొటోతీసి అప్లోడ్ చేస్తారు. – వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ -
పొరసరఫరాల శాఖపై సీఎం రివ్యూ
-
ఇంటి దొంగలు కాజేస్తున్నారు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతీ నెలా లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందిస్తున్నాయి. అయితే పౌరసరఫరాల శాఖలో కొందరు ఇంటి దొంగలు ఆ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ, రూ.కోట్ల సొమ్ము కాజేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతినెలా రేషన్ లబ్ధిదారులకు ఉచిత బియ్యం పంపిణీ కోసం సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) కింద మిల్లర్లు ఇచ్చిన బియ్యాన్ని ఎఫ్సీఐ, పౌరసరఫరా శాఖ ప్రధాన గోదాముల్లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి మండల స్థాయి గోదాం (ఎంఎల్ఎస్) పాయింట్లు, అటు నుంచి రేషన్షాపులకు బియ్యం సరఫరా అవుతుంది. ఈ రెండు దశల్లో బియ్యం రవాణాకు కాంట్రాక్టర్లు ఉంటారు. చాలా చోట్ల ప్రభుత్వానికి సొంత గోదాములు లేక అద్దెకు తీసుకుంటోంది. కొన్ని చోట్ల ప్రైవేటు, సహకార శాఖ, గిడ్డంగుల సంస్థ, వ్యవసాయ మార్కెట్, జీసీసీ గోదాములను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో 170 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా, రేషన్ షాపులకు 2.95 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. మొదట ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోలు చొప్పున బియ్యం ఇవ్వగా, కరోనా తర్వాత లబ్ధిదారులకు పది కిలోల చొప్పున ఇవ్వడంతో ఆ కోటా పెరిగింది. ఈ నేపథ్యంలో స్టాక్ పెరగడం, ఉచిత బియ్యం కావడంతో క్షేత్రస్థాయిలో అక్రమాలు పెరిగాయి. ఆన్లైన్, తనిఖీలు ఉన్నా.. ప్రతీ ఎంఎల్ఎస్ పాయింట్లలో నెల నెలా బియ్యం నిల్వలపై ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి. జిల్లాల్లో స్థానిక అదనపు కలెక్టర్ (రెవెన్యూ), పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆర్డీవో, ఎమ్మార్వో లు ఈ పాయింట్లను తనిఖీలు చేయాలి. కానీ ఇది చాలా చోట్ల జరగడం లేదు. పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పుడు మాత్రం తేడాలు బయటపడుతున్నాయి. చాలా చోట్ల ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు నేరుగా కొంతమంది రేషన్ డీలర్లు, రైస్మిల్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ అక్కడి నుంచి బియ్యం పక్క దారి పట్టిస్తున్నారు. మిల్లులకు రీ సైక్లింగ్కు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు ఉన్నతాధికారుల అండదండలతోనే హమాలీ, రవాణా చార్జిలు, గన్నీ సంచుల్లోనూ అవకతకవలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. కొన్ని చోట్ల ఎంఎల్ఎస్ పాయింట్లలోనే బఫర్ స్టాక్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రైస్ మిల్లు నుంచి బియ్యం రాకున్నా వచ్చినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి ఆసిఫాబాద్లో రూ.3 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. ఇందులో ఉన్నతాధికారుల నుంచి సైతం పరోక్షంగా సహాయ, సహకారాలు అందుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. మరోవైపు నెలా వారీ కోటా బియ్యంలో క్వింటా, అరక్వింటా తక్కువగా వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. అయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు మాత్రం సాహసం చేయడం లేదు. ఇలా అక్రమంగా దారిమళ్లించిన బియ్యాన్ని తమకు నమ్మకం ఉన్న డీలర్లకు కోటాకన్నా ఎక్కువగా పంపిస్తూ.. వారి ద్వారా బయట అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల గుర్తించిన అక్రమాలు.. ►ఆసిఫాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో 8,339 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టింది. గత కొంతకాలంగా గోదాంకు బియ్యం రాకున్నా వచ్చినట్లు నమోదు చేస్తూ భారీగా అవకతకలకు పాల్పడ్డారు. వీటి విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. అక్కడి ఇన్చార్జి, డీఎస్వో సైతం సస్పెండ్ అయ్యారు. ఇంకా విచారణ జరుగుతోంది. ►మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఎంఎల్ఎస్ పాయింట్లో 218.25 క్వింటాళ్ల బియ్యం తక్కువగా వచ్చింది. గోదాం ఇన్చార్జిపై విచారణ జరుగుతోంది. ►మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్లో 650 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టింది. దీంతో ఇన్చార్జిని సస్పెండ్ చేసి, బియ్యాన్ని రికవరీ చేశారు. -
పాఠశాలలకు నేరుగా బియ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే నాణ్యమైన (సార్టెక్స్) బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్ డెలివరీ చేస్తుండగా.. ఈ నెల నుంచి ఐసీడీఎస్ (అంగన్వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని నేరుగా రవాణా చేయనుంది. తద్వారా ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ఆదాయం సమకూర్చనుంది. ఇప్పటివరకు అంగన్వాడీలు రేషన్ దుకాణం నుంచి, స్కూళ్లు, హాస్టళ్ల యాజమాన్యాలు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి వ్యయప్రయాసలతో బియ్యం తెచ్చుకునేవారు. ఒకరోజు ప్రత్యేకంగా బియ్యం కోసం కేటాయించాల్సి వచ్చేది. పైగా రవాణా, ఎగుమతులు, దిగుమతుల విషయంలో ఇబ్బందులు పడేవారు. వీటన్నింటికి పరిష్కారంగా ప్రభుత్వమే రేషన్ను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఫైన్ క్వాలిటీ ధాన్యం సేకరణ రాష్ట్రంలో అంగన్వాడీలు, స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థుల భోజనానికి ఏడాదికి 2.54 లక్షల టన్నుల బియ్యం అవసరం. ఇప్పటివరకు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు సార్టెక్స్ బియ్యాన్ని (సాధారణ రకాలు) ఫోర్టిఫై చేసి ఆహారంగా అందిస్తోంది. వచ్చే జనవరి నుంచి ఫైన్ క్వాలిటీ (స్థానిక రకాలు, సన్న రకాలు) బియ్యాన్ని కూడా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2022–23 ధాన్యం సేకరణలో మార్పులు తీసుకొస్తోంది. విద్యార్థులకు మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అవసరమైన ఫైన్ క్వాలిటీ ధాన్యాన్ని ఏడాదికి 4 లక్షల నుంచి 5 లక్షల టన్నుల మేర రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయనుంది. తద్వారా విద్యార్థులకు, రైతులకు మేలు జరగనుంది. దీనికితోడు అప్పుడే పండిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం ద్వారా వచ్చే బియ్యంతో వండే అన్నం ముద్దగా ఉంటుందనే ఫిర్యాదులను పరిష్కరించేలా.. సేకరణకు, మిల్లింగ్కు మధ్య రెండు నుంచి మూడునెలల వ్యవధి ఉండేలా చర్యలు చేపడుతోంది. ఏప్రిల్ నుంచి ఫోర్టిఫైడ్ రైస్ ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు జిల్లాలతో పాటు ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లకు మాత్రమే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఆహారంగా తీసుకున్న వారిలో రక్తహీనత శాతం తగ్గినట్టు ఆరోగ్య సర్వేలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు మొత్తం ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రజలకు అవగాహన కల్పించేలా అంగన్వాడీలు, స్కూల్ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ అంటే.. మంచి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు బియ్యానికి అదనంగా చేర్చడాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అంటారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్–బి12 వంటి కీలక సూక్ష్మపోషకాలను బియ్యంలో అదనంగా చేరుస్తారు. విటమిన్ టాబ్లెట్ కంటే పవర్ఫుల్ ప్రభుత్వం అందించే ఫోర్టిఫైడ్ రైస్ విటమిన్ టాబ్లెట్ కంటే ఎంతో పవర్ఫుల్. అందుకే రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. దీంతోపాటు విద్యార్థులకు మంచి ఆహారం అందించేలా ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని పంపిణీ చేయనున్నాం. రాష్ట్రంలో 9,260 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, హాస్టళ్లకు విస్తరిస్తున్నాం. – అరుణ్కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
మరో 8 ఎల్ఎంటీలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం నుంచి మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ రైస్ (పౌష్టికాహార ఉప్పుడు బియ్యం)ను సెంట్రల్ పూల్కు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి గురువారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్కు లేఖ రాశారు. కేంద్రం గతంలో సెంట్రల్ పూల్ కింద తీసుకునేందుకు అంగీకరించిన 6.05 ఎల్ఎంటీల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్కు ఇది అదనం. దీంతో పాటు తడిసిన యాసంగి ధాన్యానికి సంబంధించి 3 ఎల్ఎంటీల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు 2 రోజుల కిందట కేంద్రం అంగీకరించింది. అంటే ఈ యాసంగి సీజన్ కు సంబంధించి మొత్తం 17.05 ఎల్ఎంటీల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి సేకరించనుందన్న మాట. రాష్ట్ర రైతులు ఇబ్బంది పడకూడదనే సేకరణ తెలంగాణ నుంచి మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది: మంత్రి గంగుల ‘యాసంగి ధాన్యం మిల్లింగ్ విషయంలో సమస్యను కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లాం. దీంతో కేంద్రం స్పందించింది. 8 ఎల్ఎంటీల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది.’ మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం: బండి సంజయ్ ‘రాష్ట్రం నుంచి 8 ఎల్ఎంటీల ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ రైస్ సేక రించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. రైతులు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ప్రధానికి, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్కు కృతజ్ఞతలు.’ -
100 శాతం ‘మద్దతు’
సాక్షి, అమరావతి: ఖరీఫ్ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. కనీస మద్దతు ధర కంటే ఒక్క పైసా కూడా తగ్గకుండా కొనుగోళ్లు చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్రకు స్వస్తి పలకాలన్నారు. వే బ్రిడ్జిలను క్రమంగా దశలవారీగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల పరిధిలోకి తేవడంతోపాటు గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగులను ధాన్యం కొనుగోళ్లలో భాగస్వాములను చేసి ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖలపై ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాణ్యత పరీక్షలు.. అన్నదాతలకు మేలు చేసేలా ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం క్వాలిటీ, క్వాంటిటీ టెస్టింగ్ చేయాలి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ఎంఎస్పీకి సంబంధించి అన్నదాతలకు అవగాహన కల్పించాలి. ఇందుకోసం విస్తృతంగా కరపత్రాల ముద్రణ చేపట్టి పోస్టర్లు, హోర్డింగ్లను ఏర్పాటు చేయాలి. ధాన్యం కొనుగోళ్లలో మోసాలు, అక్రమాలను నివారించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. నమన్వయంతో సమర్థంగా.. రైతులకు అండగా నిలుస్తూ ఆర్బీకేలు పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు.. మత్స్య, పశుసంవర్థక, ఉచిత విద్యుత్, సీహెచ్జీల నిర్వహణ ఇలా అన్నీ చేస్తున్నాం. వీటిని మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలంటే సంబంధిత శాఖల మధ్య (లైన్ డిపార్ట్మెంట్స్) చక్కటి సమన్వయం అవసరం. ముఖ్యంగా వ్యవసాయ, మత్స్య, రెవెన్యూ, పౌరసరఫరాలు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ తదితర శాఖల మధ్య సమన్వయం సమర్థంగా ఉండాలి. ఈ ప్రక్రియలో సజావుగా ముందుకు సాగేలా పటిష్ట మార్గదర్శకాలు, ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలి. భూసార పరీక్ష కార్డులు విచక్షణా రహితంగా ఎరువులు, పురుగు మందులు, రసాయనాలు వాడకుండా నివారించడంపై అధికారులు దృష్టి పెట్టాలి. ఖరీఫ్, రబీ సీజన్లు ముగిసిన తరువాత దాదాపు రెండు నెలలు పంట విరామం ఉంటుంది. ఆ సమయంలో భూసార పరీక్షలన్నీ నిర్వహించి వాటి ఫలితాల ప్రకారం ఆ భూమికి ఎలాంటి పోషకాలు, ఎరువులు వాడాలో సూచించాలి. ప్రతి రైతుకూ తన సాగు భూమికి సంబంధించిన భూసార పరీక్ష కార్డులను క్రమం తప్పకుండా అందించే కార్యక్రమాన్ని రూపొందించాలి. ఎంత మోతాదులో ఎరువులు, పురుగు మందులు వాడాలో çస్పష్టమైన అవగాహన కల్పించాలి. డాక్టర్లా ఆర్బీకేలు ఒక మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు డాక్టర్ ఎలా సేవలందిస్తారో పంటల సాగులో ఆర్బీకేలు కూడా అదే విధంగా రైతన్నలకు ఉపయోగపడాలి. ఆర్బీకేలు ఒక రకంగా పొలం డాక్టర్ల మాదిరిగా పనిచేయాలి. వైద్యారోగ్యశాఖలో ఫ్యామిలీ డాక్టర్ విధానం తరహాలో క్రమం తప్పకుండా గ్రామాల్లో ఆర్బీకేలు రైతులకు సలహాలు, సూచనలు అందచేయాలి. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వ్యవసాయ శాఖ కమిషనర్ సి.హరికిరణ్, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, పౌరసరఫరాల కార్పొరేషన్ వీసీ, ఎండీ వీరపాండ్యన్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
ఆ బాధ్యత మనదే.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..
సాక్షి, తాడేపల్లి: వ్యవసాయ, పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ నేపథ్యంలో ఇ-క్రాపింగ్, ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు అంశాలపై సీఎం సమీక్షించారు. ఖరీఫ్ ప్రారంభం అవుతోందని.. రైతు పండించిన పంటను కచ్చితంగా ఇ-క్రాపింగ్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. చదవండి: ఆ రెండు వేల కోసం విమర్శిస్తున్నారు: సీఎం జగన్ ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే... ♦ఈ డేటా ఆధారంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఇతరత్రా ఏ కష్టం వచ్చినా రైతును ఆదుకునేందుకు వీలు ఉంటుంది ♦ఇ-క్రాప్ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలి ♦ఇ-క్రాప్ చేసిన తర్వాత డిజిటల్ రశీదుతోపాటు, ఫిజికల్ రశీదుకూడా ఇవ్వాలని గతంలో నేను స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను ♦డిజిటల్ రశీదును నేరుగా రైతు సెల్ఫోన్కు పంపాలి ♦ఒకవేళ తనకు నష్టం వస్తే.. ఆ రశీదు ఆధారంగా రైతులు ప్రశ్నించగలిగే హక్కు వారికి వస్తుంది ♦దీనికి సంబంధించిన ఎస్ఓపీని బలోపేతం చేయాలి ♦వీఆర్వో, సర్వే అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్ల జాయింట్ అజమాయిషీ బాధ్యతను అప్పగించాలి ♦ఆ గ్రామంలో సాగుచేస్తున్న భూములు, సంబంధిత రైతుల వివరాలతో కూడిన మాస్టర్ రిజిస్టర్ను వీరికి అందుబాటులో ఉంచాలి ♦జియో ట్యాగింగ్, ఫొటో గ్రాఫ్స్ ఇ–క్రాప్లో లోడ్ చేయాలి ♦జూన్ 15 నుంచి ఇ– క్రాపింగ్ మొదలుపెట్టి, ఆగస్టు చివరినాటి పూర్తిచేయాలి ♦సెప్టెంబరు మొదటివారంలో సామాజిక తనిఖీచేపట్టాలి ♦జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలి ♦ఉన్నతాధికారుల స్థాయిలో ప్రతి 15 రోజులకోసారి ఇ–క్రాపింగ్పై సమీక్ష, పర్యవేక్షణ చేయాలి ♦మండలస్థాయి, జిల్లా స్థాయిల్లో అధికారులు ఇ–క్రాపింగ్ జరుగుతున్న తీరును తనిఖీచేయాలి ♦ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర తీసివేయాలి ♦ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు జరగాలి ♦ధాన్యం విక్రయం కోసం రైతులు మిల్లర్ల దగ్గరకు వెళ్లే పరిస్థితులు ఉండకూడదు ♦ధాన్యం కొనుగోలు బాధ్యత పౌర సరఫరాల శాఖదే ♦ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వారికి డబ్బు చెల్లించే బాధ్యత కూడా పౌరసరఫరాల శాఖదే ♦రైతు నుంచి కొనుగోలు చేసిన తర్వాత... ఆ ధాన్యాన్ని వేరే వే-బ్రిడ్జి వద్ద తూకం వేయించి రశీదును రైతుకు ఇవ్వాలి ♦దీనివల్ల రైతుకు ఎంఎస్పీ లభిస్తుంది ♦రావాల్సిన ఎంఎస్పీలో ఒక్క రూపాయికూడా తగ్గకుండా రైతుకు రావాలి ♦పాలకులుగా, అధికారులుగా మనం గొంతులేని వారిపక్షాన నిలవాలి ♦వారి పక్షం నుంచి మనం ఆలోచన చేయాలి ♦రైతుల విషయంలో కూడా అంతే ♦వారి పంటలకు అందే ధర విషయంలో రైతుల పక్షాన మనం నిలవాలి ♦కొనుగోలు చేయడమే కాదు, ఎంఎస్పీ కూడా కల్పించాల్సిన బాధ్యత మనది: అధికారులకు స్పష్టం చేసిన సీఎం జగన్ సమీక్షా సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్యకార్యదర్శి వై మధుసూధన్ రెడ్డి, సివిల్ సఫ్లైస్ కమిషనర్ ఎం గిరిజాశంకర్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సి హరి కిరణ్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ప్రభుత్వ ఔట్లెట్లలో లక్ష లీటర్ల నూనె విక్రయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వంట నూనెల ధరలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రైతుబజార్లు, మున్సిపల్ మార్కెట్లలో విజయ బ్రాండ్ ఔట్లెట్ల పేరుతో చేపట్టిన విక్రయాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఔట్లెట్లలో 1,01,165 లీటర్ల వంట నూనెను విక్రయించడం విశేషం. ఇందులో రైతుబజార్లలో 70,580 లీటర్లు, మున్సిపల్ మార్కెట్లలో 30,585 లీటర్ల అమ్మకాలు జరిగాయి. మరోవైపు డిమాండ్కు అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్లు, 2వేల జనాభాపైడిన పంచాయతీల్లోనూ స్వయం సహాయక సంఘాల ద్వారా విజయ నూనె విక్రయానికి సన్నాహాలు చేస్తున్నారు. విస్తృతంగా తనిఖీ.. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వంట నూనెల ధరలు భారీగా పెరగడంతో పాటు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి డిమాండ్ను సొమ్ము చేసుకోకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఇప్పటి వరకు తనిఖీల్లో నిత్యావసరాల చట్టం ప్రకారం (6ఏ) 76 కేసులు నమోదు చేసి 22.59 లక్షల లీటర్ల నూనెను సీజ్ చేసింది. వీటిల్లో కేసులు పరిష్కరించిన వాటిని మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు మిగిలిన వాటిని ప్రభుత్వ నూనె కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. మరోవైపు మార్కెట్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా సన్ఫ్లవర్ స్థానంలో సోయాబీన్, రైస్బ్రాన్ నూనె అమ్మకాలను చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రైవేటు ఔట్లెట్లలో ప్రభుత్వ ధరలకే.. అంతర్జాతీయంగా నూనెల ధరల సెగ నుంచి సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది. ఆయిల్ రిఫైనరీస్, ఉత్పత్తి, సరఫరాదారులు, చాంబర్ ఆఫ్ కామర్స్తో సమావేశాలు నిర్వహించి తక్కువ ధరలకు నూనెలు విక్రయించేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే వంట నూనెల ధరలు చాలా వరకు అదుపులోకి రావడంతో పాటు ఎక్కడా కూడా కృత్రిమ కొరత తలెత్తలేదు. హోల్సేల్ విక్రేతల సాయంతో 256 రిటైల్ ఔట్లెట్స్ ద్వారా సుమారు 11.20లక్షల లీటర్ల వంట నూనెను ఎమ్మార్పీ కంటే తక్కువ రేట్లకే అందించడం గమనార్హం. విజయ ఆయిల్స్కు మంచి ఆదరణ వంట నూనెల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం విజయ ఆయిల్ పేరుతో విక్రయాలు చేపట్టింది. మార్కెట్ ధరలతో పోలిస్తే విజయ ఆయిల్స్ ధరలు తక్కువగా ఉండడంతో మంచి ఆదరణ లభిస్తోంది. విక్రయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిల్వలను సిద్ధం చేసుకుంటున్నాం. – చవల బాబురావు, ఏపీ ఆయిల్ఫెడ్ ఎండీ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తాం.. ఇటీవల అంతర్జాతీయ పరిణామాలు వంట నూనెల ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ క్రమంలో మన దగ్గర నిల్వలను సక్రమంగా వినియోగించుకుంటూనే విదేశాల నుంచి దిగుమతయ్యే నూనెల స్థానంలో ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తున్నాం. ఎప్పటికప్పుడు మార్కెట్ ధరలను సమీక్షిస్తూ అవసరానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం – గిరిజా శంకర్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ -
కొంత ఫోర్టిఫైడ్ రైస్ తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఈ యాసంగి సీజన్కు సంబంధించి కేంద్రం కోరిన విధంగా సీఎమ్మార్ కింద ముడిబియ్యంతో పాటు కొంత మేర బాయిల్డ్ ఫోర్టిఫైడ్ బియ్యం (పోషకాలు కలిపిన బలవర్ధక ఉప్పుడు బియ్యం) తీసుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కోరింది. కేంద్రం ఎంత కావాలంటే అంత ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపింది. దీనిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్, అధికారులు మంగళవారం ఢిల్లీ వెళ్లి ఎఫ్సీఐ, కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. ఈ అంశాన్ని అధికారులు పరిశీలిస్తామన్నారని, స్పష్టమైన హామీ లభించలేదని సమాచారం. కాగా గత యాసంగికి సంబంధించిన సీఎంఆర్ గడువు పొడిగింపును మరో నెల పొడిగించాలన్న విజ్ఞప్తికీ కేంద్రం నుంచి స్పష్టమైన హామీ దక్కలేదని తెలిసింది. గత యాసంగి సీజన్లో 5 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ను ఎఫ్సీఐ రాష్ట్రం నుంచి తీసుకుంది. ధాన్యం కొనుగోలుకు మార్గదర్శకాలు ఈ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు పౌరసర ఫరాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. రైతు లంతా ఒకేసారి రాకుండా టోకెన్లు జారీ చేయాలని, డీఫాల్ట్ మిల్లర్లకు ఈ సీజన్లో ధాన్యం కేటాయిం చొద్దని నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మిల్లుల్లో తనిఖీలు వాయిదా ఈ నెల 28 నుంచి మిల్లుల్లో చేపట్టాల్సిన తనిఖీలను ఎఫ్సీఐ వాయిదా వేసింది. తనిఖీల వల్ల సీఎంఆర్కు ఆటంకం కలుగుతుందని పౌరసరఫరాల కమిషనర్ ఎఫ్సీఐకి లేఖ రాయగా తాత్కాలికంగా వాయిదా వేసింది. మే మొదటి వారంలో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. -
వంట నూనెల విక్రయాలకు 150 కియోస్కులు
సాక్షి, అమరావతి: మునిసిపల్ మార్కెట్లు, సూపర్ బజార్లలో ప్రభుత్వ ఔట్లెట్ల ద్వారా వంట నూనెల విక్రయాలను పెంచనున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వంట నూనెల ధరల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం నియమించిన రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సోమవారం భేటీ అయిందన్నారు. ఏపీ ఆయిల్ఫెడ్ ద్వారా 111 మునిసిపాలిటీలు, 34 కార్పొరేషన్లలో వంట నూనెల విక్రయాలకు 150 కియోస్క్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. స్వయం సహాయక బృందాల ద్వారా ఆయిల్ఫెడ్ ఉత్పత్తులను విక్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో గడిచిన రెండు వారాల్లో వంట నూనెల ధరలు స్థిరంగా ఉన్నాయన్నారు. సన్ఫ్లవర్ నూనె లీటర్ రూ.191, వేరుశనగ నూనె రూ.175, పామాయిల్ రూ.155కు మార్కెట్లో లభ్యమవుతున్నాయని చెప్పారు. నూనెల అక్రమ నిల్వలపై విజిలెన్స్ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా వంట నూనెల అక్రమ నిల్వలకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంగళవారం 337 హోల్సేల్, రిటైల్ దుకాణాలతోపాటు సూపర్ మార్కెట్లు, ఆయిల్ తయారీ సంస్థలపై దాడులు చేసి 141 కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర సరుకుల చట్టం కింద 65, తూనికలు–కొలతలు చట్టం కింద 1,056, ఆహార భద్రత చట్టం కింద 41, మరో 8 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు -
విభజన సమస్యల పరిష్కారానికి.. ఇక ప్రతి నెలా..
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉప కమిటీ ఇకపై ప్రతి నెలా సమావేశమై పురోగతిని సమీక్షించాలని నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉప కమిటీ తొలి సమావేశం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. సుమారు గంటన్నరకు పైగా జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా ఐదు అంశాలపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలను వినిపించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ధిక శాఖ ప్రత్యేక సీఎస్ ఎస్.ఎస్.రావత్, రాష్ట్ర పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్, వాణిజ్యపన్నుల శాఖ కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, ఎస్ఎఫ్సీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.గుల్జార్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. పెండింగ్ అంశాలపై చర్చించేందుకు ఇకపై ప్రతి నెలా సమావేశాన్ని నిర్వహిస్తామని ఆశిష్ కుమార్ తెలిపారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి రావాల్సిన పలు రకాల బకాయిలపై ఉత్తర్వులు జారీ చేయాలని సమావేశంలో కేంద్ర హోంశాఖను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. సమస్యలు వేగంగా పరిష్కారమయ్యేలా ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈక్విటీ ఇద్దరికీ ఇవ్వాల్సిందే ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనకు సంబంధించి కేంద్రానికి ప్రణాళిక అందచేశామని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ అధికారులు కోరారు. దీనిపై న్యాయ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలం జాప్యం చేసి ఇటీవలే కౌంటర్ దాఖలు చేయగా, కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని ఏపీ అధికారులు పేర్కొన్నారు. డబ్బులకు బదులుగా ఇచ్చిన ఈక్విటీ జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు చెందాలన్నారు. కరెంట్ బకాయిలపై.. ఏపీ జెన్కోకు తెలంగాణ డిస్కమ్లు చెల్లించాల్సిన రూ.6,284 కోట్ల విద్యుత్ బకాయిలపై ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర హోంశాఖను ఆంధ్రప్రదేశ్ కోరింది. అయితే ఏపీ ప్రభుత్వం దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినందున ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. న్యాయపరంగా పరిశీలన చేసి విభజన చట్టప్రకారం ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ అధికారులు పేర్కొన్నారు. రూ.3,800 కోట్ల పన్నులు రావాలి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో నమోదైన పలు కంపెనీలు పన్నులు కూడా అక్కడే చెల్లించాయి. ఏపీకి చెందిన సంస్థలు చెల్లించిన రూ.3,800 కోట్ల పన్నులను ఇప్పించాలని ఏపీ అధికారులు ఉప కమిటీ సమావేశంలో కోరారు. ధాన్యం డబ్బులు, సబ్సిడీ.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ధాన్యం సేకరణకు కోసం వినియోగించిన రూ.400 కోట్ల ఏపీ నిధులను తిరిగి చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వడంతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన రూ.600 కోట్ల సబ్సిడీని విడుదల చేయాలని సమావేశంలో ఏపీ అధికారులు కోరారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులపైనా ఏపీ అధికారులు వాదనలు వినిపించారు. -
సకాలంలో ధాన్యం డబ్బుల చెల్లింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 2.96 లక్షల మంది రైతుల నుంచి 21.04 లక్షల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే 1.42 లక్షల మంది రైతులకు రూ.1,969 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా రైతు పొలం ముంగిట నుంచే ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా ఆధార్ ఆధారిత నగదు జమ పద్ధతులను అవలభిస్తున్నట్టు చెప్పారు. ధాన్యం విక్రయించిన 21 రోజుల్లో రైతులకు కచ్చితంగా చెల్లింపులు చేస్తున్నట్టు వివరించారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో ఐదు వేల టన్నుల సేకరణ లక్ష్యం కాగా.. 376 మంది రైతుల నుంచి 2,748 టన్నుల ధాన్యం సేకరించినట్టు తెలిపారు. 46 మంది రైతులకు రూ.60 లక్షలు జమ చేసినట్టు వివరించారు. అయితే కొన్ని పత్రికలు(సాక్షి కాదు) వాస్తవాలు గ్రహించకుండా రైతులకు చెల్లింపులు జరపట్లేదంటూ అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని, ఇలాంటి వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వీరపాండియన్ హెచ్చరించారు. -
రేషన్ బియ్యం పంపిణీ 4నుంచి
సాక్షి, హైదరాబాద్: ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని ఈనెల నాలుగో తేదీ నుంచి పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ తెలిపింది. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతోందని ఈ విషయాన్ని రేషన్దారులు గమనించాలని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వేగంగా వరి కొను‘గోల్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంట కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతోంది. అన్ని జిల్లాల్లో కలిపి 10.55 లక్షల మంది రైతుల నుంచి ఇప్పటివరకు సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాలశాఖ సేకరించింది. ఇప్పటికే ఏడు జిల్లాల్లో ధాన్యం సేకరణ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 6,950 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి 6,862 కేంద్రాలను తెరిచారు. వాటిలో కొనుగోళ్లు పూర్తయిన 3,382 కేంద్రాలను శుక్రవారం నాటికి మూసివేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,252 కొనుగోలు కేంద్రాలు మాత్రమే నడుస్తున్నాయి. చాలా జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తి.. కోతలు ముందుగా ప్రారంభమైన ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ దాదాపుగా ముగిసింది. ఆలస్యంగా కోతలు జరిగిన సిరిసిల్ల, నిర్మల్ జిల్లాలలోని పదేసి గ్రామాల్లో రైతుల కోరిక మేరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తున్నప్పటికీ త్వరలోనే మూసివేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట, మంచిర్యాల, వరంగల్, జనగాం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, మహబూబ్నగర్, మేడ్చల్ జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయిన గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. ప్రైవేటుగానూ అమ్మకాలు.. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికార యంత్రాంగం అంచనా వేసింది. వ్యక్తిగత అవసరాలు, మిల్లర్లు కొనుగోళ్లు, విత్తనాల ధాన్యం పోగా 1.04 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అనుకున్నారు. అయితే అక్టోబర్ రెండో వారంలో మొదలు కావలసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ఆ నెలాఖరుకు మొదలయ్యాయి. చాలా జిల్లాల్లో నవంబర్ నెలాఖరు వరకు కూడా కొనుగోళ్లు మొదలు కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వడ్ల కొనుగోళ్లపై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల మధ్య రాజకీయ దుమారం చెలరేగింది. ఈ పరిస్థితుల్లో ధాన్యం విక్రయించేందుకు రోజుల తరబడి వేచి చూడలేని రైతులు మిల్లర్లకు, ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయించారు. ఇప్పటికీ వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో నేరుగా మిల్లర్లకే ధాన్యం విక్రయిస్తున్న ఉదంతాలు ఉన్నాయి. దీంతో కోటి మెట్రిక్ టన్నులకుపైగా కొనుగోలు కేంద్రాలకు వస్తుందనుకున్న ధాన్యం ఇప్పటివరకు 60 ఎల్ఎంటీ వరకే వచ్చింది. ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి అదనంగా మరో 30 లక్షల వరకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి గింజ వరకు సేకరిస్తాం తెలంగాణ రైతాంగంపై కక్ష కట్టిన కేంద్రం యాసంగి పంటను తీసుకోబోమని చెప్పడంతోపాటు వానాకాలం పంటను ఎంత సేకరిస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వరకే సేకరిస్తామని గతంలో పేర్కొనగా ఇప్పటికే ఆ లక్ష్యం దాటింది. ఏడు జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. మిగతా జిల్లాల నుంచి ఇంకా 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వస్తుందని భావిస్తున్నాం. ఎంత ధాన్యం వచ్చినా ఈ వానాకాలం పంటను చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. – మంత్రి గంగుల కమలాకర్ -
8,774 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు
సాక్షి, అమరావతి: మిల్లర్ల పాత్రను పూర్తిగా తగ్గిస్తూ రైతులకు మరింత మేలు చేకూర్చేలా ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పండించిన ధాన్యాన్ని సేకరించే విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం విజయవాడలో భేటీ అయ్యింది. మంత్రులు కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్, కొడాలి నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం విజయవాడలో సమావేశమై ధాన్యం సేకరణపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇకనుంచి ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఒక్క రైతు కూడా తాను పండించిన ధాన్యం అమ్ముకునేందుకు పక్క గ్రామానికి వెళ్లే అవసరం లేకుండా స్వగ్రామంలోనే అమ్ముకునేలా ఏర్పాట్లు చేయబోతున్నారు. వరి సాగయ్యే ప్రాంతాల్లో ఉన్న 8,774 ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా తీర్చిదిద్దబోతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ మొదటి వారం నుంచి ఆర్బీకేల్లో కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ధాన్యం సేకరణకు నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్, పౌరసరఫరాలశాఖ సంయుక్తంగా ధాన్యం సేకరణ చేపట్టాలని ఆదేశించారు. నూటికి నూరుశాతం కనీస మద్దతు ధరకే రైతుల నుంచి కొనుగోలు చేయాలన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై సీఎంకి నివేదిక సమర్పిస్తామని, ఆయన ఆదేశాల మేరకు విధివిధానాలు రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు ‘సాక్షి’కి చెప్పారు. బంద్ చేస్తే ప్రత్యామ్నాయం చూసుకుంటాం: మంత్రి కొడాలి రేషన్ డీలర్లు బంద్ చేసినంత మాత్రాన బియ్యం సరఫరా నిలిచిపోదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి బంద్ చేస్తామంటూ డీలర్లు మొండిపట్టుపడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. గన్నీ బ్యాగులు, యూజర్ చార్జీల విష యంలో రేషన్ డీలర్లకు సమస్య ఉందన్నారు. కరోనా కారణంగా రాష్ట్రం ఇచ్చే బియ్యం కాకుండా కేంద్రం కూడా రేషన్ ఇస్తోందని చెప్పారు. కేంద్రం కిలోకి 35 పైసల కమీషన్ ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మరో 65 పైసలు కలిపి రూపాయి కమీషన్ ఇస్తోందని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన పేమెంట్ పెండింగ్లో ఉందని చెప్పారు. సమస్యలు ఉంటే చర్చించుకోవాలే తప్ప ధర్నాలు, బంద్లు చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. డీలర్ల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కారానికి కృషిచేస్తామని, అయితే డెడ్లైన్లు పెడితే కుదరదన్నారు. ప్రజలకు బియ్యం వెళ్లకుండా చేస్తాం.. అంటే ఊరుకునేది లేదని, రేషన్ డీలర్లు 1వ తేదీన బంద్ చేస్తామంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామన్నారు. -
తెలంగాణ ఇంట ‘కోటి’ సిరుల పంట..
యాసంగిలో 80 లక్షల టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న పౌర సరఫరాల శాఖ, ఇప్పటికే 90 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. కృష్ణా బేసిన్లోని మహబూబ్నగర్, వికారాబాద్, నారాయణపేట, గద్వాల వంటి జిల్లాల్లో గత ఏడాది యాసంగి కన్నా ఈసారి రెట్టింపునకు పైగా ధాన్యం సేకరించారు. సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణలో రాష్ట్రం రికార్డులు సృష్టిస్తోంది. 2019-20లో 1.11 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన ప్రభుత్వం.. 2020–21 ఏడాది రెండు సీజన్లలో కలిపి ఏకంగా 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి చరిత్ర నెలకొల్పింది. ఒక్క యాసంగి సీజన్లోనే లక్ష్యానికి మించి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం విశేషం. గత ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో నీటి సమృద్ధి పెరిగింది. దీంతో యాసంగిలో కేవలం వరి పంటే 53 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. ఉత్పత్తికి అనుగుణంగా ప్రభుత్వం ధాన్యం సేకరణ చేపట్టి దాదాపుగా పూర్తి చేసింది. ఇప్పటికే 90 లక్షల మెట్రిక్ టన్నుల మార్కును దాటగా, మరో యాభై వేల నుంచి లక్ష టన్నుల మేర ధాన్యం సేకరించి ఈ సీజన్కు ముగింపు పలకనుంది. గత సీజన్లో 49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. నిండుగా కాల్వలు.. అలుగు దుంకిన చెరువులు రాష్ట్రంలో గతేడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల కింది కాల్వలన్నీ నిండుగా పారాయి. ఆరు నుంచి ఏడు తడులుగా నీటిని పారించడంతో పంటలకు కావాల్సినంత నీరు అందింది. దీనికితోడు 46 వేలకు పైగా చెరువులకు గానూ 38 వేలకు పైగా చెరువులు అలుగు దుంకాయి. ఈ నేపథ్యంలో 53 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవగా.. 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిని అంచనా వేశారు. అందులో స్థానిక అవసరాలకు పోనూ 80 లక్షల టన్నులు సేకరించాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే లక్ష్యానికి మించి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. దీని విలువ సుమారు రూ.17 వేల కోట్ల మేర ఉండగా, ఇందులో రూ.14 వేల కోట్ల చెల్లింపులు పూర్తి చేసినట్లు పౌర సరఫరాల సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఏడేళ్లలో ఐదింతలు పెరిగిన సేకరణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఏడేళ్ల కాలంలో ఐదింతలకు పైగా పెరిగింది. నిరంతర విద్యుత్, రైతుబంధు, కాళేశ్వరం సహా చెరువుల ద్వారా పెరిగిన నీటి లభ్యత కారణంగా ధాన్యం ఉత్పత్తి గణనీయంగా ఉంది. దీనికి తగ్గట్లే గత ఏడాది యాసంగిలో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. తాజాగా కరోనా, హమాలీల కొరత, లాక్డౌన్ వంటి పరిస్థితులను అధిగమించి సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో 6,967 కేంద్రాల ద్వారా 15 లక్షల మంది రైతుల నుంచి ఇప్పటివరకు 90 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. - మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ -
ధాన్యం రైతు 'ధర'హాసం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యాన్ని ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు (ఎమ్మెస్పీ) భారీగా కొనుగోలు చేస్తుండటంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. ఉన్న ఊళ్లోనే ధాన్యాన్ని అమ్ముకోగలుగుతున్నారు. తద్వారా రవాణా ఖర్చు ఆదా అవుతోంది. ప్రస్తుత రబీలో ధాన్యాన్ని విక్రయించేందుకు ఆర్బీకేల ద్వారా 3.55 లక్షల మంది రైతులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. శనివారం నాటికి 2,11,320 మంది రైతుల నుంచి రూ.4,521.08 కోట్ల విలువైన 24,14,969.28 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రబీ పంట కోతలు పూర్తయ్యాయి. దాంతో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అధిక భాగం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నెల్లూరు, ప్రకాశం.. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పంట కోతలు ప్రారంభమవుతుండటంతో ఆ ప్రాంతాల్లోనూ వేగంగా ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్దే కొనుగోలు చేయడమే కాకుండా 21 రోజుల్లోగా అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. ప్రభుత్వమే భారీ ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో బహిరంగ మార్కెట్లోనూ అదే ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 24,14,969.28 టన్నులు కొనుగోలు ► రబీలో రైతులు 21.75 లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేశారు. దిగుబడి అయిన ధాన్నాన్ని వీలైనంతంగా కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే 24,14,969.28 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. ► ప్రభుత్వం ధాన్యం క్వింటాలుకు సాధారణ రకానికి రూ.1868, ఏ–గ్రేడ్ రకానికి రూ.1888 ఎమ్మెస్పీగా ప్రకటించి, అదే ధరకు కొనుగోలు చేస్తోంది. రైతుల కళ్లాల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దాంతో గ్రామాల్లోని 7,706 ఆర్బీకేలతో పౌర సరఫరాల శాఖ నేతృత్వంలోని 3,936 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అనుసంధానం చేశారు. ► ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు తమ పేర్లను ఆయా గ్రామాల్లోని ఆర్బీకేల్లో నమోదు చేయించుకోవాలి. ఈ–పంటలో ఆ రైతులు వరి సాగు చేశారా లేదా అన్నది సరి చూసుకుని, కళ్లాల వద్దే ధాన్యం కొనుగోలుకు కూపన్లు జారీ చేస్తారు. ఏ రోజున ఏ సమయంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తారన్నది ఆ కూపన్లలో స్పష్టంగా ఉంటుంది. ► ఆ మేరకు ఆర్బీకేలోని వీఏఏ (గ్రామ వ్యవసాయ సహాయకుడు) కళ్లం వద్దకు వెళ్లి ధాన్యం నాణ్యతను పరిశీలించి, కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఎఫ్సీఐ (భారత ఆహార సంస్థ) ప్రమాణాల మేరకు నాణ్యత లేకపోతే.. ధాన్యంలో తేమ శాతం తగ్గే వరకు అరబెట్టాలని వీఏఏ సూచిస్తారు. ఆ తర్వాత ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన 21 రోజుల్లోగా రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. గిట్టుబాటుధర దక్కకపోతే అమ్ముకోవద్దు బహిరంగ మార్కెట్లో కనీస మద్ధతు ధర దక్కకుంటే ధాన్యాన్ని అమ్ముకోవద్దు. ఆర్బీకేల్లో పేర్లు నమోదు చేయించుకోండి. కళ్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేయడానికి కూపన్లు జారీ చేస్తాం. కూపన్లలో పేర్కొన్న రోజున ధాన్యం కొనుగోలు చేయడానికి అధికారులు రాకపోతే.. మరో కూపన్ జారీ చేసి, ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. రైతులు పండించిన అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. మిల్లర్లు, దళారీలకు ధాన్యాన్ని అమ్ముకోవద్దు. – కోన శశిధర్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ రైతులకు అన్ని విధాలా భరోసా ► దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచింది. వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు పంటల సాగులో సూచనలు, సలహాలు ఇస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోంది. ► అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల పంటకు నష్టం వాటిల్లితే బీమా పథకం ద్వారా పరిహారం అందజేస్తూ రైతులకు బాసటగా నిలుస్తోంది. తుదకు పండించిన పంటను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తోంది. -
ప్రజల సంక్షేమం కోసమే ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ
విజయనగరం గంటస్తంభం: రేషన్ బియ్యం అంటే ఏదో మొక్కుబడిగా అందివ్వడం కాదు. అవి ప్రతీఒక్కరూ వినియోగించుకునేవిగా ఉండాలి. దానివల్ల వారి ఆరోగ్యం మెరుగుపడాలి. ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ పోషకాలు కలిగిన ఫోర్టిఫైడ్ రైస్ను అందిస్తోంది. ప్రయోగాత్మకంగా ఇప్పటివరకూ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోనే వీటిని పంపిణీ చేస్తుండగా ఈ నెల నుంచి జిల్లాలోని అందరికీ అందిస్తోంది. వీటిని వృథా చేసుకోకుండా వినియోగించుకుంటే వారి ఆరోగ్యానికి, పిల్లలకు ఎంతో మంచిది. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లా ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీకి రాష్ట్రంలో విజయనగరం జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో జిల్లాలో 78.7శాతం పిల్లల్లో, 75.5శాతం మహిళల్లో రక్తహీనత ఉన్నట్లు తేలడంతో తొలి ప్రాధాన్యతగా జిల్లాను ఎంపిక చేశారు. రక్తహీనత నివారించేందుకు ఈ బియ్యం దోహదపడుతా యన్న ఉద్దేశంతో వీటిని ప్రత్యేకంగా అందజేస్తున్నారు. గతంలో మన రైతులు పండించిన ధాన్యాన్ని మరపట్టి వాటిని రేషన్డిపోల ద్వారా ప్రభుత్వం సరఫరా చేసేది. ఇప్పుడు అదే ధాన్యం మరపట్టి బియ్యంలో ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అదనంగా చేర్చుతున్నారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి కీలక సూక్ష్మ పోషకాలు చేర్చడం వల్ల పోషకా హార లోపాన్ని అధిగమించేలా చేస్తుంది. జిల్లాలో 21 రైస్ మిల్లుల్లో ఇప్పుడు ఫోరి్టఫైడ్ రైస్ తయారవుతోంది. ఈ ఏడాది 1.10లక్షల మెట్రిక్ టన్నులు తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకా అవసరమైన బియ్యా న్ని ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తారు. ఎక్కువ మంది పోషకాహార లోపం నుంచి బయట పడేందుకు ఈ బియ్యం సరఫరా చేయాలని సర్కారు యోచించింది. ఈ రైస్ వల్ల రుచి బాగుంటుంది. వంట చేసే విధానంలో ఏమీ మార్పు ఉండదు. పోషకాహార లోపంతో సమస్యలు పోషకాహార లోపంవల్ల చాలా ఇబ్బందులున్నాయి. పోషకాహార లోపం ఉన్నవారు ఎత్తు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసపడడం, మానసికంగా అలసిపో వడం, నాలుక పాలిపోవడం, తలవెంట్రుకలు రాలడం, ఏకాగ్రత లోపించడం, బలహీనంగా, చికాకుగా ఉండడం, అరచేతులు, అరికాళ్లు పాలిపోవడం, వ్యాధినిరోధకశక్తి తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. రేషన్ బియ్యం పొందేవారిలో కష్టపడే వారు ఎక్కువ. పోషకాహార లోపం వల్ల వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించి ఫోరి్టఫైడ్ రైస్ సరఫరా చేస్తోంది. ఫోలిక్ యాసిడ్ ఫోర్టిఫైడ్ రైస్లో ముఖ్యంగా లభించేది ఫోలిక్ యాసిడ్. బాలింత తల్లుల్లో పెరుగుదలకు తోడ్పడుతుంది. పిండం అభివృద్ధి చెందుతుంది. పసిపిల్లల్లో మెదడు, వెన్నెముక పెరగడానికి తోడ్పడుతుంది. రక్త నిర్మాణం బాగా జరుగుతుంది విటమిన్ బి–12 మెదడు, నాడీ మండలం పని చేయడంలో, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. ఐరన్ మన శరీరంలో జరిగే అనేక జీవక్రియల్లో ఐరన్ ముఖ్య భూమిక పోషిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని సరైన మోతాదులో ఉంచి రక్తహీనత అరికట్టడంలో ఐరన్ది ప్రధాన పాత్ర. ఫోర్టిఫైడ్ రైస్ తినడం వల్ల అందులో ఐరన్ రక్తహీనతతో పోరాడుతుంది. వృథా చేయవద్దు ప్రభుత్వం ఫోరి్టఫైడ్రైస్ సదుద్దేశంతో సరఫరా చేస్తోంది. దీనికోసం అదనంగా కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తోంది. కార్డుదారులు వాటిని వండి తింటే వారి ఆరో గ్యం బాగుంటుంది. సాధారణ బియ్యంలో మి ల్లింగ్ సమయంలో పోషకాలు కలుపుతున్నాం. బియ్యంపై ప్రజలు అపోహలు వీడాలి. ఇందులో కలిపే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి–12 వంటి అనేక ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. కార్డుదారులంతా వాటిని వినియోగించుకోవాలి. - జి.సి. కిశోర్కుమార్, సంయుక్త కలెక్టర్, విజయనగరం -
అంగన్వాడీ కేంద్రాలకు ఫోర్టిఫైడ్ బియ్యం
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఈ నెల నుంచి సార్టెక్స్ బియ్యానికి బదులు పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తున్నట్టు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. పౌర సరఫరాల సంస్థ ద్వారా ఈ బియ్యాన్ని సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫోర్టిఫైడ్ బియ్యంలో సూక్ష్మపోషక విలువలతో పాటు రక్తహీనతను నివారించే ఐరన్, గర్భస్థ శిశువు వికాసానికి ఉపకరించే ఫోలిక్ ఆమ్లం, నాడీ వ్యవస్ధ బలోపేతానికి అవసరమైన విటమిన్ బి–12 వంటివి ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 7.15 లక్షల గర్భిణులు, బాలింతలు, 9.66 లక్షల పిల్లలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలపై క్షేత్ర స్థాయిలో ప్రాజెక్ట్ డైరెక్టర్స్, సీడీపీవోలకు తగిన సూచనలు ఇచ్చి విస్తృత ప్రచారం చేయాల్సిందిగా ఆదేశించామన్నారు. అంగన్వాడీ కేంద్రాలతో అనుసంధానమైన లబ్ధిదారులంతా ఈ సదుపాయాన్ని వినియోగించుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడానికి వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని కృతికా శుక్లా గుర్తు చేశారు. -
నేటి నుంచి పేదలకు ఉచిత బియ్యం పంపిణీ
గుడివాడ టౌన్: కరోనా నేపథ్యంలో పేదవారిని ఆదుకోవాలనే దృక్పథంతో శనివారం నుంచి ప్రతి ఒక్కరికి 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 10 కిలోలు సార్టెక్స్ స్వర్ణరకం మధ్యస్త సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. మే, జూన్ నెలల్లో ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతుందన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ. 800 కోట్లు వెచ్చించిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.47 కోట్లు బియ్యం కార్డులున్నాయన్నారు. వారందరికీ ఉచిత బియ్యం అందిస్తామన్నారు. -
కొనుగోళ్లకు అధిక ప్రా'ధాన్యం'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జోరందుకుంటున్నాయి. కోవిడ్ ఉధృతి పెరిగిన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ యంత్రాంగమే తమ ముంగిటకు వచ్చి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కోతలు ముందుగా ప్రారంభమైన పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొనుగోళ్లు ఇప్పటికే ఊపందుకున్నాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 6,731 మంది రైతుల నుంచి రూ.181.07 కోట్ల విలువైన 96,916 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. నెల్లూరు జిల్లాలో 3,398 మంది రైతుల నుంచి రూ.90.20 కోట్ల విలువైన 47,807 టన్నులు, ప్రకాశం జిల్లాలో 1,514మంది రైతుల నుంచి రూ.23.52 కోట్ల విలువైన 12,506 టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే సేకరించారు. ఈ మూడు జిల్లాల్లో వారం రోజుల వ్యవధిలోనే రూ.294.79 కోట్ల విలువైన 1,57,229 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రికార్డు స్థాయిలో వరి సాగు చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది రబీలో రికార్డు స్థాయిలో 23,61,937 ఎకరాల్లో వరి సాగయ్యింది. హెక్టారుకు సగటున 7,025 కేజీల చొప్పున సుమారు 66.37 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అందులో కనీసం 45లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం మార్కెట్కు వస్తున్న రబీ ధాన్యంతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 48 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. మాసూళ్లను పూర్తి చేసిన రైతులు ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. ‘కృష్ణా’లో అత్యధికంగా 428 కేంద్రాలు ఇప్పటివరకు 50 వేల మంది రైతులు రైతు భరోసా కేంద్రాల్లో తమ పంట వివరాలను నమోదు చేసుకోగా.. వీటికి అనుబంధంగా ఏర్పాటు చేసిన 1,552 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. గ్రేడ్–ఏ ధాన్యం క్వింటాల్కు రూ.1,880, కామన్ వెరైటీ ధాన్యానికి రూ.1,860 చొప్పున కనీస మద్దతు ధర చెల్లిస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 428 కేంద్రాలు ఏర్పాటు చేయగా, తూర్పు గోదావరిలో 373, పశ్చిమ గోదావరిలో 350, నెల్లూరు జిల్లాలో 183, ప్రకాశం జిల్లాలో 144, గుంటూరు జిల్లాలో 67, కడపలో 6, విజయనగరంలో ఒకటి చొప్పున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది లేకుండా.. వరుసగా రెండో ఏడాది కూడా సాగునీరు పుష్కలంగా ఇవ్వడంతో గత రబీతో పోలిస్తే ఈ ఏడాది రబీలో సాగు విస్తీర్ణం పెరిగింది. మంచి దిగుబడులొస్తాయని అంచనా వేశారు. కోతలు ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కొనుగోలు సమయంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కరోనా సాకుతో దళారులు చెప్పే మాయమాటల్ని నమ్మి రైతులెవరూ మోసపోవద్దు. కనీస మద్దతు ధర కంటే ఒక్క రూపాయి తక్కువకు కూడా ఏ ఒక్కరూ ధాన్యాన్ని అమ్ముకోవద్దు. సకాలంలో చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – కోన శశిధర్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ -
అవసరమైతే చంద్రబాబును అరెస్ట్ చేస్తారు
గుడివాడ టౌన్: అమరావతి దళితులను మోసగించి చంద్రబాబు అండ్ కో భారీ కుంభకోణానికి పాల్పడిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీ చేయడంపై మంగళవారం ఆయన స్పందిస్తూ.. అవసరమైతే సీఐడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టుకు కూడా పంపుతారని మంత్రి నాని స్పష్టం చేశారు. తనకు తానే సీఆర్డీఏ చైర్మన్గా ప్రకటించుకున్న చంద్రబాబు ఇష్టానుసారం జీవోలు విడుదల చేసి, దళితులను మోసం చేసి రూ.500 కోట్లకు పైగా సొమ్ము కాజేశారని తెలిపారు. అమరావతిలోనే వస్తుందనే విషయాన్ని చంద్రబాబు అనుచరులు ముందే తెలుసుకుని అక్కడి దళితులను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. రాజధాని కోసం అసైన్డ్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుందని భయపెట్టి దళితుల నుంచి 500 ఎకరాలను కారుచౌకగా కొట్టేసి ప్రభుత్వానికి అధిక ధరకు అమ్మారని గుర్తు చేశారు. వాస్తవానికి అసైన్డ్ భూములను అనుభవించడమే తప్ప అమ్మకాలు, కొనుగోలు చేయరాదన్నారు. ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే దళితుల భూములు కాజేశారన్నారు. అచ్చెన్నాయుడు, బుద్దా వెంకన్నలాంటి కుక్కలు ఎంత మొరిగినా తమను గెలిపించిన దళితులకు న్యాయం చేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం దళితులకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తుందని, ఇందులో భాగంగా చంద్రబాబుకు నోటీసులు జారీ అయ్యాయని చెప్పారు. చంద్రబాబు, ఆయనకు సహకరించిన మాజీ మంత్రి నారాయణ, ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం తప్పు లేదన్నారు. -
రక్తహీనత నివారణకు బలవర్థక బియ్యం
సాక్షి, అమరావతి: రక్తహీనత లోపాన్ని నివారించేందుకు వీలుగా రాష్ట్రంలో ఎంపికచేసిన కొన్ని ప్రాంతాల్లో బలవర్థకమైన బియ్యాన్ని (ఫోర్టిఫైడ్ రైస్) పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా 3 వేల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ను సేకరించేందుకు వీలుగా పౌరసరఫరాలసంస్థ టెండర్లను ఆహ్వానించింది. ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)కు చెందిన ఫోర్టిఫికేషన్ రిసోర్స్ సెంటర్ (ఎఫ్ఎఫ్ఆర్సీ) ప్రకారం బియ్యానికి బీ–12తో పాటు వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలను మిశ్రమం చేసే సొంత మిల్లు ఉన్నవారు మాత్రమే టెండర్లలో పాల్గొనాలని పౌరసరఫరాలసంస్థ అధికారులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు 750 మెట్రిక్ టన్నులు, తూర్పు గోదావరి జిల్లాకు 600, పశ్చిమ గోదావరి జిల్లాకు 850, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు 500, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు 300 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ను కేటాయించారు. టెండరు దక్కించుకున్నవారు ఆయా జిల్లాల్లో సూచించిన గోదాములకు బియ్యాన్ని సరఫరా చేయాలి. కొందరు పేదలు తీసుకుంటున్న ఆహారంలో ఇనుము, అయోడిన్, జింక్, విటమిన్ ఏ, డీ, బీ–12 లోపించినట్లు గుర్తించా రు. వీటిలోపం వల్ల వస్తున్న జబ్బుల నుంచి వారిని దూరం చేసేందుకు బలవర్థకమైన ఆహా రం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఈ నెల 10 వరకు ఫిబ్రవరి రేషన్
సాక్షి, అమరావతి: ఫిబ్రవరి నెలలో వివిధ కారణాల వల్ల రేషన్ సరుకులు తీసుకోని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. గత నెలలో సరుకులు తీసుకోని 35.18 లక్షల కుటుంబాలకు ప్రభుత్వ తాజా నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది. నాణ్యమైన బియ్యంతోపాటు ఇతర సబ్సిడీ సరుకులను లబ్ధిదారులందరికీ అందించాలనే లక్ష్యంతో గత నెలలో తీసుకోని వారికి రెండు నెలల కోటాను ఒకేసారి అందించే వెసులుబాటు కల్పించింది. ఈ నెల 10వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుంది. గత నెల నుంచి 9,260 మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 1,45,98,041 బియ్యం కార్డులుండగా.. 1,10,79,333 కార్డుదారులు మాత్రమే ఫిబ్రవరి నెల సరుకులు తీసుకున్నారు. వివిధ కారణాలతో 35,18,708 కార్డుదారులు సరుకులు తీసుకోలేకపోయారు. వలంటీర్లకు మ్యాపింగ్ కాని కార్డుదారులు, వలస కూలీల వంటివారు సరుకులు ఎక్కడ తీసుకోవాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వాహనం వద్దనైనా తీసుకోవచ్చు రేషన్ కార్డుదారులు ఏ మొబైల్ వాహనం వద్దనైనా సరుకులు పొందేవిధంగా ప్రభుత్వం పోర్టబిలిటీ అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ వలంటీర్ పరిధిలోని క్లస్టర్కు మ్యాప్ కాని కార్డులు 4,45,388 ఉన్నట్టు గుర్తించారు. ఈ కార్డుదారులు కూడా ఎక్కడైనా సరుకులు తీసుకోవచ్చు. ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటును పేదలు సద్వినియోగం చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ కోరారు. -
ఎస్ఈసీ త్వరగా నిర్ణయం తీసుకోవాలి
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) త్వరగా నిర్ణయం తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కోరారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉంటోందని.. కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ఇంటింటికీ రేషన్ బియ్యాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. మంత్రి ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీని అమలుచేసి, అక్కడ ఎదురైన లోటుపాట్ల ఆధారంగా ఈ మొబైల్ వాహనాలను తీసుకొచ్చామన్నారు. అయితే, పేదలకు ఎంతో అవసరమైన ఈ పథకం ఎన్నికల కోడ్కు విరుద్ధమని, దాన్ని నిలిపివేయాలని సీఎస్కి ఎస్ఈసీ లేఖ రాశారన్నారు. దీంతో ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం.. న్యాయస్థానం ఐదు రోజుల్లోగా దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీని ఆదేశించడం హర్షణీయమని కొడాలి చెప్పారు. కాగా, పట్టణ ప్రాంతాల్లో రాజకీయ నేతలెవరూ లేకుండానే సోమవారం నుంచి ఇంటింటికీ రేషన్ బియ్యాన్ని మొబైల్ వాహనాల ద్వారా అందిస్తారని మంత్రి చెప్పారు. ఎస్ఈసీ నిర్ణయం వచ్చాకే గ్రామాల్లోనూ అమలు చేస్తామన్నారు. -
రైతు ఖాతాల్లో ధాన్యం డబ్బు
సాక్షి, అమరావతి: రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులను పెండింగ్లో పెట్టడానికి వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో ఆ బిల్లులను పౌర సరఫరాల సంస్థ రైతు ఖాతాలకు జమ చేస్తోంది. శనివారం ఒక్కరోజే రూ.378.74 కోట్లను ధాన్యం అమ్మిన రైతు ఖాతాల్లో జమ చేసింది. ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 24.25 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని 2,171 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి నేరుగా ప్రభుత్వం సేకరించింది. రైతులకు రవాణా భారం లేకుండా కళ్లాల్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థకు చెందిన నిధులను సార్వత్రిక ఎన్నికల ముందు ఇతర పథకాలకు మళ్లించడంతో అప్పటినుంచి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సీజన్లో ఇప్పటివరకు రూ.2,826.63 కోట్లను చెల్లించగా.. మిగిలిన రైతులకు కూడా త్వరగా చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో రూ.వెయ్యి కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం రైతులకు తక్షణ చెల్లింపుల కోసం పౌర సరఫరాల సంస్థ ద్వారా బ్యాంక్ నుంచి రూ. 5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. సకాలంలో చెల్లిస్తాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రైతులకు సకాలంలో ధాన్యం డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ సీజన్లో ఇప్పటివరకు రూ.2,826 కోట్లకు పైగా సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేశాం. – కోన శశిధర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ ఆనందం రెట్టింపైంది సంక్రాంతి పండుగ దృష్ట్యా బిల్లులు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో నా బ్యాంక్ ఖాతాకు రూ.1,44,000 జమయ్యింది. దీంతో పండుగ పూట ఆనందం రెట్టింపైంది. పెండింగ్ బిల్లులు రావడంతో కష్టానికి తగ్గ ఫలితం దక్కిందన్న సంతృప్తి కల్గింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. – జున్నూరి సూర్యనారాయణ, రైతు, నాగవరం గ్రామం, ఉప్పలగుప్తం మండలం, తూర్పు గోదావరి పంట కోసం చేసిన అప్పు తీర్చేశా.. సంక్రాంతి పండుగ సమయంలో ధాన్యం డబ్బులు బ్యాంకు ఖాతాలకు జమ కావడంతో కష్టాల నుంచి గట్టెక్కినట్లైంది. రైతుల ఇబ్బందులను సీఎం వైఎస్ జగన్ గుర్తించడం హర్షణీయం. పెండింగ్లో ఉన్న ధాన్యం బిల్లులు రావడంతో ఆ మొత్తంతో పంట కోసం చేసిన అప్పు తీర్చేశా. – కరెనిది గోవింద్, రైతు, కేశనకుర్రు పాలెం, ఐ.పోలవరం మండలం, తూర్పు గోదావరి -
అన్నదాతలకు చకచకా చెల్లింపులు
సాక్షి, అమరావతి: రైతులకు ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నదాతల కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరిసేలా చేయడం కోసం ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు విడుదల చేయడంతో రైతులకు ఊరట లభించినట్లైంది. రైతుల నుంచి ధాన్యం సేకరించిన తరువాత 15 రోజుల్లోగా చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ బిల్లులు పెండింగ్లో పెట్టడానికి వీల్లేదని అప్పట్లో పౌరసరఫరాల సంస్థ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో రైతుల నుంచి ధాన్యం సేకరించిన తర్వాత నిర్ణీత వ్యవధిలోగా వారికి డబ్బులు చెల్లించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆరి్థకశాఖ విడుదల చేసిన రూ.వెయ్యి కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ చివరి నాటి వరకు ధాన్యం సేకరించిన రైతులకు సంక్రాంతి పండుగ సందర్భంగా డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థకు చెందిన నిధులను సార్వత్రిక ఎన్నికల ముందు ఇతర పథకాలకు మళ్లించింది. దీంతో అప్పటి నుంచి రైతులకు ధాన్యం బిల్లులు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఎన్నికల తర్వాత పౌరసరఫరాల సంస్థ నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సేకరిస్తున్న ధాన్యానికి బిల్లుల చెల్లింపులు ఆలస్యం కాకూడదని సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా చెల్లింపులు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మూడు రోజుల కిందట ప్రభుత్వం రూ.1,000 కోట్లు విడుదల చేయడంతో ఇటు రైతులకు, అటు అధికారులకు మేలు కలగనుంది. రోజుకు రూ.160 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోళ్లు ఈ నెల 1వ తేదీ నుంచి మరింత పెరిగాయి. రోజుకు రూ.160 కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది. ఇప్పటి వరకు 23.99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ బిల్లులకు సంబంధించి ఇప్పటికే రూ. 2,447.90 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ధాన్యానికి కూడా సకాలంలో జమ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే బ్యాంకుల నుంచి రూ.ఐదువేల కోట్ల రుణం తీసుకునేందుకు పౌరసరఫరాల సంస్థకు ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇవ్వడమే కాకుండా ఆ మొత్తానికి గ్యారంటీ కూడా ఇచ్చింది. -
ధాన్యం సేకరించిన పక్షంలోగా చెల్లింపులు
సాక్షి, అమరావతి: రైతుల నుంచి ధాన్యం సేకరించిన తరువాత గతంలో చెప్పినట్లుగానే 15 రోజుల్లోగా చెల్లింపులు జరపాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి సంక్రాంతి కల్లా రైతులకు బకాయిలను పూర్తిగా చెల్లించాలన్నారు. ధాన్యం సేకరణ బిల్లులు పెండింగ్లో పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. నిర్ణీత లక్ష్యం ప్రకారం ఖరీఫ్ ధాన్యం సేకరణ జరపాలని సూచించారు. ధాన్యం సేకరణ, ఇంటి వద్దే నిత్యావసర సరుకులు పంపిణీపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. 3వ వారంలో డోర్ డెలివరీ వాహనాలు ప్రారంభం.. ఇంటి వద్దే నిత్యావసర సరుకుల పంపిణీ కోసం సిద్ధం చేసిన ప్రత్యేక వాహనాలు ఈనెల 3వ వారంలో ప్రారంభమవుతాయి. అదే రోజు 10 కిలోల రైస్ బ్యాగ్స్ ఆవిష్కరణ ఉంటుంది. ఫిబ్రవరి 1వతేదీ నుంచి ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ మొదలవుతుంది. ఇందుకోసం 9,260 మొబైల్ యూనిట్లు, అధునాతన తూకం యంత్రాలు సిద్ధమయ్యాయి. 2.19 కోట్ల నాన్ ఓవెన్ క్యారీ బ్యాగులు రెడీగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు లక్ష్యానికి మించి నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాలను కేటాయించాం. ఎస్సీలకు 2,333, ఎస్టీలకు 700, బీసీలకు 3,875, ఈబీసీలకు 1,616, ముస్లిం మైనారిటీలకు 567, క్రిస్టియన్ మైనారిటీలకు 85 వాహనాల కేటాయింపు జరిగింది. వాహనాల లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ ఇస్తుండగా 10 శాతం వాటాను వారు భరించాలి. 60 శాతం బ్యాంకు రుణం అందుతుంది. సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగంగా ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందచేస్తున్నాం. ప్రతి జిల్లాలో రుణాల మంజూరు క్యాంపులు నిర్వహిస్తున్నాం.