బాబా గుడిలో చోరీ: 4.5 కిలోల వెండి అపహరణ | Robbery in Saibaba Temple in Penukonda | Sakshi
Sakshi News home page

బాబా గుడిలో చోరీ: 4.5 కిలోల వెండి అపహరణ

Published Sat, Aug 2 2014 9:06 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Robbery in Saibaba Temple in Penukonda

అనంతపురం: అనంతపురం జిల్లా పెనుకొండలోని షిర్డి సాయిబాబా దేవాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సాయిబాబాకు చెందిన వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ విషయాన్ని శనివారం ఉదయం దేవాలయానికి వచ్చిన ఆలయ పూజారీ గమనించి వెంటనే ఆలయ నిర్వహకులకు సమాచారం అందించాడు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాదాపు 4.5 కేజీల వెండి ఆభరణాలు చోరీ అయ్యాయని, అలాగే రూ. 15 వేల నగదు అపహరించుకుని పోయారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.    పోలీసులు దేవాలయానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement