అనంతపురం: జిల్లాలోని రొద్దం ఘాట్రోడ్డు వద్ద సోమవారం ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. బ్రేక్ ఫెయిలవడంతో ఘాట్ రోడ్డులో డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. బస్సును ఒక్కసారిగా నిలిపివేయడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు.
ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన మడకశిర నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా చోటుచేసుకుంది. ప్రయాణికులను మరో బస్సులో పంపించినట్టు అధికారులు తెలిపారు.
ఆర్టీసీ బస్సుకు బ్రేక్ ఫెయిల్; తప్పిన ప్రమాదం
Published Mon, Feb 2 2015 8:57 AM | Last Updated on Fri, Jun 1 2018 8:59 PM
Advertisement
Advertisement