శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం పచ్చికగూడ వద్ద సోమవారం మధ్యాహ్నం తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పాలకొండకు చెందిన డీఏవీ స్కూల్ బస్సును చెరకు లోడుతో వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఆ సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. గాయపడిన విద్యార్థులను సీతంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
Published Mon, Mar 14 2016 3:19 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM
Advertisement
Advertisement