రాఖీ కట్టిన షర్మిలకు వైఎస్ జగన్ కొండంత భరోసా!
హైదరాబాద్: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి చిహ్నమైన రాఖీ పండుగను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిలు ప్రేమానురాగాల మధ్య జరుపుకున్నారు.
లోటస్ పాండ్ లో వైఎస్ విజయమ్మ వెంట ఉండగా తన అన్న వైఎస్ జగన్ కు సోదరి షర్మిల రాఖీ కట్టారు. రాఖీ కట్టిన తన సోదరి షర్మిలకు బతికున్నంత కాలం తాను భరోసాగా ఉంటానని వైస్ జగన్ తన ప్రేమను చాటుకున్నారు.
ఆప్యాయతలకు అతి దగ్గరగా.. సోదర, సోదరీమణులు అపురూపంగా జరుపుకునే రాఖీ పండుగను వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు ఆనందంగా జరుపుకున్నారు.