Lotus Pond
-
లోటస్పాండ్లో వైఎస్ షర్మిల దీక్ష విరమణ
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై నిరసనగా ఉదయం నుంచి లోటస్ పాండ్లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగించిన షర్మిలకు గజ్వేల్ ప్రజలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కాగా, వైఎస్ షర్మిలను పోలీసులు శుక్రవారం ఉదయం హౌజ్ అరెస్ట్ చేశారు. అయితే, షర్మిల నేడు సిద్దిపేటలోని గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. కాగా, జగదేవ్పూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో షర్మిల పర్యటించాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయమే పోలీసులు ఆమె నివాసానికి చేరుకున్నారు. పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు తనను అడ్డుకున్న పోలీసులకు హారతిచ్చి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ షర్మిల మండిపడ్డారు. దళితబంధులో అవకతవకలు జరిగాయని ఆమె ధ్వజమెత్తారు. చదవండి: తెలంగాణలో బీజేపీ దూకుడు.. ప్లాన్ ఫలించేనా? -
వైఎస్ షర్మిల హౌజ్ అరెస్ట్.. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత!
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో లోటస్ పాండ్లోని ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో, అక్కడ ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. వైఎస్ షర్మిలను పోలీసులు శుక్రవారం ఉదయం హౌజ్ అరెస్ట్ చేశారు. అయితే, షర్మిల నేడు సిద్దిపేటలోని గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. కాగా, జగదేవ్పూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో షర్మిల పర్యటించాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయమే పోలీసులు ఆమె నివాసానికి చేరుకున్నారు. అనంతరం, జవదేవ్పూర్ వెళ్లకుండా షర్మిలను హౌజ్ అరెస్ట్ చేశారు. కాగా, దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయని ఇటీవల తీగుల్ గ్రామ ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఈనేపథ్యంలో వారిని కలిసేందుకు షర్మిల ప్లాన్ చేసుకున్నారు. దీంతో, పోలీసులు వైఎస్ షర్మిలను అడ్డుకున్నారు. ఇది కూడా చదవండి: వర్షాలపై అప్రమత్తంగా ఉండండి: హైకోర్టు ఆదేశాలు -
బంజారా హిల్స్ లోటస్ పాండ్ చెరువులో చేపల మృత్యువాత
-
అయ్యయ్యో.. చేపలు! లోటస్పాండ్ చెరువులో 3 వేలకుపైగా మృతి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లోని లోటస్పాండ్ అంటేనే అందమైన చెరువు, చుట్టూ పచ్చని మొక్కలు, చెరువులో పెద్ద ఎత్తున కనిపించే వివిధ రకాల చేపలు, తాబేళ్లు, పక్షులు కనిపిస్తుంటాయి. ఏమైందో ఏమో.. ఎవరేం చేశారో తెలియదు.. గడిచిన నాలుగు రోజులుగా చెరువులోని చేపలు వేలాదిగా మృతి చెందుతున్నాయి. చేపలు విలవిల్లాడుతూ గాల్లోకి ఎగురుతూ మృతి చెందుతున్న వైనాన్ని చూసి నిత్యం పార్కు వచ్చే వాకర్లు, సందర్శకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి మురుగు నీరు పారడం వల్ల అని కొందరు అంటుంటే, చెరువులో నీళ్లలో ఎవరో విష ప్రయోగం చేశారని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. చేపలతో పాటు పెద్ద ఎత్తున ఈ నీళ్లలో వేలాదిగా తాబేళ్లు సైతం ఉన్నాయి. ఇవి కూడా చనిపోతున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం నాలుగు రోజుల నుంచి విషయాన్ని గమనిస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. విష ప్రయోగమా? కలుషిత నీరా..? వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి చెరువులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచి్చంది. వర్షాలు తగ్గిన తర్వాత కూడా చుట్టు పక్కల ప్రాంతాల్లోని కొంత మంది నివాసితులు తమ సెల్లార్లలో నిండిన వరద నీటిని బయటికి పంపింగ్ చేశారు.ఈ నీరు సైతం చెరువులోకి వచ్చి చేరింది. దీనికి తోడు నిర్మాణంలో ఉన్న కొంత మంది భవన నిర్మాణదారులు బ్లాస్టింగ్లో వినియోగించే కెమికల్ వ్యర్థాలను కూడా ఈ చెరువులోకి పంపింగ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కెమికల్ వ్యర్థాలు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయని వాటి వల్లే చేపలు చనిపోయి ఉంటాయని ఇంకొంత మంది భావిస్తున్నారు. శాంపిల్స్ సేకరించిన అధికారులు గడిచిన నాలుగు రోజులుగా చేపలు చనిపోతున్న విషయాన్ని స్థానికులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు ఎని్వరాన్మెంట్ అధికారులు, బయోడైవర్సిటీ, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు ఫిర్యాదు చే శారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇక్కడ నీటి శాంపిల్స్ను తీసుకొని వెళ్లారు. మంగళవారం జలమండలి అధికారుల సైతం పార్కులో పర్యటించి పార్కులోకి మురుగు నీరు రావడం లేదని తెలిపారు. చేపలకు ఆహారం... నిత్యం ఈ పార్కుకు పెద్ద సంఖ్యలో స్థానికులు, సందర్శకులు వస్తుంటారు. వాకింగ్ చేయడంతో పాటు కొంత మంది చేపలకు వివిధ రకాల ఆహార పదార్థాలను వేస్తుంటారు. చేపలకు ఏం ఆహారం వేయాలి, ఎవరు వేయాలి అనే నియంత్రణ ఇక్కడ ఏ మాత్రం లేదు. ఎవరు పడితే వారు వచ్చి వారికి తోచిన ఆహార పదార్థాలను వేసి వెళ్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు చేపలకు బిస్కెట్లు, బన్ను, బ్రెడ్, రొట్టెలు ఇలా ఇష్టమొచి్చన ఆహార పదార్థాలను వేస్తుంటారు. చదవండి: ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్ తరలించేందుకు సహకరిస్తున్నాం -
పోలీసులతో షర్మిల వాగ్వాదం
-
హైదరాబాద్: లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత
-
వైఎస్ షర్మిలకు జ్యూడిషియల్ రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
బంజారాహిల్స్ (హైదరాబాద్): వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతోపాటు ఆమె డ్రైవర్ను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి సోమవారం షర్మిల లోటస్పాండ్లోని తన కార్యాలయం నుంచి బయలుదేరుతుండగా.. పోలీసులు అక్కడకు చేరుకుని పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. బయటకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ షర్మిలను అడ్డుకోవడంతో ఆమెకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆమె కారులో ఉన్న డ్రైవర్ను పోలీసులు బలవంతంగా కిందికి దింపేశారు. ఈ పరిణామంతో షర్మిల, పోలీసులమధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ ఠాణాకు తరలించారు. విధి నిర్వహణలో ఉన్న తనపై షర్మిల చేయి చేసుకున్నారని, నేమ్ ప్లేట్ను చించేశారని, తమ కానిస్టేబుల్ గిరిబాబు కాలు పైకి బలవంతంగా కారు ఎక్కించారని ఎస్సై రవీందర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా షర్మిల తదితరులపై కేసు నమోదు చేశారు. ఏ1గా షర్మిల, ఏ2గా ఆమె కారు డ్రైవర్ బాబు, ఏ3గా మరో డ్రైవర్ జాకబ్లను చేర్చారు. షర్మిల, బాబులను అరెస్టు చేయగా.. జాకబ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో షర్మిల, బాబులకు వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మే 8 వరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, పోలీసులు షర్మిలను చంచల్గూడ జైలుకు తరలించారు. పోలీసుల తీరు సరిగాలేదు: షర్మిల ‘సిట్ అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా దౌర్జన్యంగా వ్యవహరించారు. ఒక పార్టీ అధ్యక్షురాలి పట్ల పోలీసుల తీరు సరిగాలేదు. ఈ విధుల్లో మహిళా కానిస్టేబుల్ను నియమించలేదు. పోలీసులు ప్రవర్తించిన తీరుకు నిరసనగానే రోడ్డుపై బైఠాయించా’అని షర్మిల మీడియాతో పేర్కొన్నారు. కాగా, జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో షర్మిలను పరామర్శించేందుకు భర్త అనిల్, తల్లి వైఎస్ విజయమ్మ వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. కాగా, అరెస్ట్ను నిరసిçస్తూ వైఎస్సార్టీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. షర్మిలపై కక్ష సాధింపు చర్యలు వైఎస్ విజయమ్మ ధ్వజం వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంపై వైఎస్ విజయమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం షర్మిలను ఎందుకు అడ్డుకుంటోందని గట్టిగా నిలదీశారు. సోమవారం ఆమె తన నివాసంలో మీడియా తో మాట్లాడుతూ.. షర్మిలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై కోర్టుకు వెళ్తామని తెలిపారు. తాను షర్మిలను చూడటానికి పోలీస్స్టేషన్లోకి వెళ్తోంటే పోలీసులు అనుమతించలేదన్నారు. ‘నా కూతురుని చూసి పోతానన్నా పోలీసులు ఒప్పుకోలేదు. షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారని అడిగితే పోలీసుల దగ్గర సమాధానం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏకైక వ్యక్తి షర్మిల కాబట్టి ప్రభుత్వం ఇంతటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది’అని విజయమ్మ చెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్కు ఫిర్యాదు చేసేందుకు ఒంటరిగా వెళ్తున్న షర్మిలను ఎందుకు అరెస్టు చేశారన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నించిన అంశాలకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వం ఇలా వ్యవహరించడమేంటని మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడుతున్న ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు సాకారం చేయడానికి ఎంతో కష్టపడుతోందని చెప్పారు. ‘అంతమంది పోలీసులు కనీస గౌరవం లేకుండా ఒక మహిళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటే ఆవేశం రాదా? పది మంది మహిళా పోలీసులు నాపై పడు తూ కార్లో ఎక్కించబోతే నాకు కూడా ఆవేశం వచ్చింది. పోలీసులు షర్మిల డ్రైవర్, గన్మెన్లను కొట్టారు. చివరికి మీడియా వాళ్లను కూడా కొట్టారు. మీడియాకు చేతులెత్తి అభ్యర్థిస్తున్నా.. ప్రజల తరఫున నిలబడి నిజాలు చూపించండి. చిన్నచిన్న విషయాలను పెద్దగా చూపించడం కాదు.. ప్రజల కోసం పని చే యాలి’అని చెప్పారు. -
అర్ధరాత్రి వైఎస్ షర్మిల దీక్ష భగ్నం
-
అర్ధరాత్రి వైఎస్ షర్మిల దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ దీక్షను శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించారు. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె శుక్రవారం లోటస్పాండ్ వద్ద దీక్షకు దిగిన విషయం తెలిసిందే. కాగా షర్మిల దీక్ష శనివారం రెండోరోజు కూడా కొనసాగింది. దీక్ష చేస్తున్న షర్మిలను వైఎస్ విజయమ్మ కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. ‘ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ పతనానికి నాంది. న్యాయస్థానమంటే ఆయనకు గౌరవం లేదు..’ అని విమర్శించారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను పోలీసులు అకారణంగా అరెస్ట్ చేయడమే కాకుండా వారిపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా పార్టీ కార్యాలయం చుట్టూ బారికేడ్లు పెట్టారు. సామాన్యులను కూడా రానివ్వడం లేదు. వచి్చన వాళ్లందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు..’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ దేశమంతా రాజకీయాలు చేసుకోవచ్చు. ఆయనకు మాత్రం అన్ని పరి్మషన్లు వస్తాయి. కానీ, ప్రజల కోసం కొట్లాడే మా పార్టీపై మాత్రం దాడులా?..’అని మండిపడ్డారు. షర్మిల ప్రాణాలకు ప్రమాదం: వైద్యులు శనివారం సాయంత్రం వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. షరి్మల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని, ఆమె 30 గంటలుగా మంచినీళ్లు సైతం తీసుకోవడం లేదని డాక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. వైద్య పరీక్షలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్టేట్ లెవెల్స్ బాగా పెరిగాయని, యూరియా, బీపీ, గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె వెంటనే ఆసుపత్రిలో చేరకపోతే ప్రాణాలకు ప్రమాదమని చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పోలీసులు ఆమెను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. -
YS Sharmila: ‘సర్కార్ దిగొచ్చేదాకా దీక్ష ఆపను’
సాక్షి, హైదరాబాద్: వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నగరంలోని లోటస్పాండ్లోని నివాసం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ షర్మిల ఆమరణ నిరహార దీక్ష నేపథ్యంలో.. లోటస్ పాండ్ను పోలీసుల దిగ్బంధించారు. కర్ఫ్యూ వాతావరణం నెలకొంది అక్కడ. పార్టీ కార్యకర్తలను ఎవరినీ లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇంకోవైపు ఆమె వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. నా పాదయాత్రకు అనుమతి ఇవ్వండి అంటూ ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. ‘‘బాధితుల మీదే కేసులు పెట్టి వేధిస్తున్నారని, వైఎస్సార్టీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి కారణాలేవీ లేవని, ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నార’’ని ఆమె మండిపడ్డారు. మరోవైపు వైఎస్ఆర్టీపీ పార్టీ నేతల, కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్లోనే 40 మంది పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. మరోవైపు బంజారాహిల్స్ పీఎస్లో ఏడుగురు పార్టీ నేతలు పోలీసుల అదుపులో ఉన్నారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన తన పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు అరెస్ట్ అయిన పార్టీ నేతలను విడుదల చేసేంత వరకు దీక్ష ఆపేది లేదంటున్నారు వైఎస్ షర్మిల. ఈ మేరకు శుక్రవారం ఆమె ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. హైకోర్టు అనుమతి ఇచ్చినా.. పాదయాత్ర చేసుకోనివ్వకుండా న్యాయస్థానం తీర్పునే సీఎం కేసీఆర్ అగౌరవ పరస్తున్నారన్నారని షర్మిల దీక్ష చేపట్టిన సందర్భంగా మండిపడ్డారు. -
రేపటి నుంచి షర్మిల ప్రజాప్రస్థానం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్రకు రేపు శ్రీకారం చుడుతున్నారు. సోమవారం లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్రెడ్డి పాదయాత్ర వివరాలను మీడియాకు వెల్లడించారు. షర్మిల పాదయాత్ర దాదాపు 400 రోజులు.. 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల మేర సాగుతుందన్నారు. 14 పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో కొనసాగుతుందని చెప్పారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. 9 ప్రాంతాల్లో బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. రోజూ సాయంత్రం పలు సమస్యల పరిష్కారంపై షర్మిల స్థానిక నాయకులు, ప్రజలతో భేటీ అవుతారని చెప్పారు. రచ్చబండ తరహాలో ప్రజలతో మాటముచ్చట కార్యక్రమం సాగుతుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో మూడు మండలాలను కలుపుకొనిపోయేలా రూట్ మ్యాప్ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా షర్మిల పా దయాత్ర సాగుతుందన్నారు. ప్రతి మంగళవారం పాదయాత్ర ఎక్కడ జరుగుతుంటే అక్కడే నిరుద్యోగ నిరాహార దీక్ష జరుగుతుందని వెల్లడించారు. నేడు తల్లి విజయమ్మతో ఇడుపులపాయకు.. తన తల్లి విజయమ్మతో కలసి షర్మిల మంగళవారం ఉదయం ఇడుపులపాయ వెళ్తారు. అక్కడ వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, ఇడుపులపాయకు వెళ్తున్న నేపథ్యంలో నేడు జరగాల్సిన నిరుద్యోగ నిరాహార దీక్షను వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. షర్మిలను ఆదరించండి.. రాజన్న అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కోసం.. మీ కోసం మీ రాజన్న బిడ్డ షర్మిల చేపడుతున్న ప్రజాప్రస్థానం పాదయాత్రను ఆదరించాలని వైఎస్ విజయమ్మ ప్రజలకు పిలుపునిచ్చారు. షర్మిల పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఆమె సోమవారం ఓ సందేశాన్ని విడుదల చేశారు. చేవెళ్ల నుంచి ప్రారంభించనున్న షర్మిల పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. షర్మిల అడుగులో అడుగు వేసి ఓ ప్రభంజనాన్ని సృష్టించాలన్నారు. -
దీక్ష విరమించిన వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన 72 గంటల దీక్షను వైఎస్ షర్మిల ఆదివారం విరమించారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో ఉన్న తన కార్యాలయంలో షర్మిల కొనసాగిస్తున్న ఉద్యో గ దీక్షను నిరుద్యోగ అమరుల కుటుంబ సభ్యులు ఆమెకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదనే మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడిన గుగులోత్ రవిందర్ నాయక్, కొప్పు రాజు, మురళి ముది రాజు కుటుంబ సభ్యులను షర్మిల ఈ సంద ర్భంగా ఓదార్చారు. రవిందర్ నాయక్ భార్య, కొప్పు రాజు తల్లి, మురళి ముదిరాజు తల్లికి రూ. 50 వేల చొప్పున తన వంతుగా ఆర్థిక సాయం అందించారు. నిరుద్యోగ అమరుల కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న వైఎస్ షర్మిల అనంతరం దీక్షా శిబిరం నుంచి ప్రసంగించిన షర్మిల కేసీఆర్ సర్కార్పై తీవ్రస్థాయిలో విరు చుకుపడ్డారు. ప్రైవేటు ఉద్యోగాలు కూడా రావట్లేద ని ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నార న్నారు. అయినా ప్రభుత్వం పైసా సహాయం చేయలేదని మండిపడ్డారు. పాలకులకున్నది గుండెనా.. బండరాయా? అని నిలదీశారు. నిరుద్యోగులవి ప్రభుత్వ హత్యలు కావా? అని ప్రశ్నించారు. 40 లక్షల మంది నిరుద్యోగులు ప్రతిరోజూ మానసికంగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించారని విమర్శించారు. 3.85 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయట్లేదని ప్రశ్నించారు. ‘‘మాట మీద నిలబడే వైఎస్సార్ బిడ్డగా చెబుతున్నా. కేసీఆర్ మెడలు వంచైనా ఉద్యోగాలు భర్తీ చేయిస్తా. నోటిఫికేషన్లు వచ్చే వరకు ప్రతి జిల్లాలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతాయి. రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. ఏ నిరుద్యోగీ ఆత్మహత్య చేసుకోవద్దు.’’అని షర్మిల స్పష్టం చేశారు. చదవండి: ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలి: వైఎస్ షర్మిల కేసీఆర్ వారిపట్ల ఎందుకు సవతి తల్లి ప్రేమ: షర్మిల -
రెండో రోజు కొనసాగుతున్న వైఎస్ షర్మిల దీక్ష
-
రెండో రోజు కొనసాగుతున్న వైఎస్ షర్మిల దీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలని కోరుతూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం వైఎస్ షర్మిలకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, ఇందిరాపార్క్ వద్ద గురువారం ఆమె దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడ దీక్ష కొనసాగించడానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో లోటస్పాండ్ వద్ద దీక్ష కొనసాగించేందుకు వైఎస్ షర్మిల ధర్నా చౌక్ నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో బీఆర్కే భవన్ వద్ద పోలీసులు ఆమెను మరోసారి అడ్డుకున్నారు. ప్రత్యేక వాహనంలో ఆమెను తరలించే ప్రయత్నం చేయడంతో కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సందర్భంగా తోపులాట జరగడం, పోలీసులు కొంత దురుసుగా వ్యవహరించడంతో ఒక దశలో వైఎస్ షర్మిల స్పృహతప్పి పడిపోయారు. దుస్తులు స్వల్పంగా చిరిగిపోవడంతో పాటు ఎడమ చేతికి గాయమైంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాదయాత్ర చేస్తూ లోటస్పాండ్కు చేరుకున్న వైఎస్ షర్మిల దీక్షను కొనసాగిస్తున్నారు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని ప్రతినబూనారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. చదవండి: ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలి: వైఎస్ షర్మిల తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు -
కేసీఆర్ వారిపట్ల ఎందుకు సవతి తల్లి ప్రేమ: షర్మిల
సాక్షి, హైదరాబాద్: దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ దళితులను దగా చేశారని వైఎస్ షర్మిల విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి కావాలని ఏ దళితుడు అడగలేదని, కేసీఆరే మాట ఇచ్చి, దగా చేశారని మండిపడ్డారు. ఇప్పటి పాలకులకు దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదనడానికి ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని బుధవారం ఆమె తన కార్యాలయంలో బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంకా వారిపట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తూ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని మండిపడ్డారు. మూడెకరాల భూమి, రిజర్వేషన్ల పెంపు, డబుల్ బెడ్రూం ఇళ్లు, పెన్షన్లు ఇలా ఎన్నో హామిలిచ్చి నెరవేర్చకుండా దళితులను కేసీఆర్ మోసం చేశారన్నారు. రాజయ్య మీద ఒక్క ఆరోపణ రాగానే పదవి నుంచి తప్పించిన కేసీఆర్.. మల్లారెడ్డిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. దళితులపై కేసీఆర్ ప్రేమకు ఇదే నిదర్శనమన్నారు. నాగార్జునసాగర్ ఎన్నికలకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు అంబేద్కర్ జయంతి వేడుకలకు మాత్రం అడ్డొస్తాయా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేడ్కర్ పేరు పెట్టడం కేసీఆర్కు ఇష్టం లేదని ఆరోపించారు. ఆ ప్రాజెక్ట్ను రీడిజైన్ పేరిట అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ట్యాంక్బండ్లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని ఇప్పటికీ దాని ఊసే లేదని ఎద్దేవా చేశారు. సమానత్వం కోసం అంబేడ్కర్ పోరాడితే.. సమాన అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు కృషి చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు. అణగారిన వర్గాలు ఆత్మగౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో 46 లక్షల పక్కా ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పేదలకు 6 లక్షల ఎకరాలు భూ పంపిణీ చేసిన నేత వైఎస్ అని కొనియాడారు. రాజ్యాంగ రూపశిల్పి అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా రాజన్న సంక్షేమ పాలనను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో దళిత నేత, ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న, బి.సంజీవరావు, డేవిడ్ శాంతరాజ్, జార్జ్ హెర్బర్ట్, పాకాల డానియేల్, దయానంద్, బి.మరియమ్మ, పోలీసు రాంచందర్, బి.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
దొరల పాలనతో ప్రజలు కష్టాల పాలు
సాక్షి, హైదరాబాద్: పోరాడి సాధించుకున్న తెలంగాణలో దొరల పాలనతో ప్రజలు కష్టాలపాలవుతున్నారని కరీంనగర్ జిల్లా కన్నారంకు చెందిన మిడిదోడ్డి మహేందర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన లోటప్పాండ్లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ పరిస్థితుల్లో నేనున్నా అంటూ తెలంగాణ ప్రజలకు అండగా నిలిచేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల ముందుకు రావడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆమె దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. ప్రజల గోసను వివరిస్తూ.. దొరల పాలనను అంతం చేసే విధి విధానాలతో పుస్తకం రాస్తున్న విషయాన్ని ఆమెకు వివరించానన్నారు. రాబోయే ఎన్నికల్లో షర్మిల పార్టీ మంచి విజయం సాధించేందుకు ఈ పుస్తకం దిక్సూచిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్ పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే విధంగా సంక్షేమ పాలను అందించారని, వైఎస్సార్ స్ఫూర్తితో వైఎస్ షర్మిల మళ్లీ రాజన్న సంక్షేమ పాలన తీసుకువచ్చేందుకు కృషిచేస్తుందని అన్నారు. ఆమెతో కలిసి పని చేయడానికి తనలాంటి ఎంతో యువకులు నడుం బిగిస్తున్నారని మహేందర్ తెలిపారు. -
లోటస్పాండ్@లక్ష్మీస్ ఎన్టీఆర్
ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రిలీజ్ని ఆపగలిగారు కానీ.. ముక్కలు ముక్కలుగా సినిమా మొత్తం రిలీజ్ అవడాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి కౌంటర్గా మనకు పనికొచ్చే డైలాగులున్న సినిమా ఏదైనా ఉంటే బయటకు తీయండి’’ అన్నాడు చంద్రబాబు. ‘‘ఆల్రెడీ తీయించి పెట్టాను నాయుడు గారూ..’’ అన్నాడు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు. ఆయన ముందుచూపు ప్రణాళికకు మెచ్చుకోలుగా చూశాడు చంద్రబాబు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, లోకేశ్ కూడా అక్కడే ఉన్నారు. లోకేశ్ తప్ప మిగతా అందరూ చెమటతో తడిసి ముద్దయి ఉన్నారు! లోకేశ్ ఫ్రెష్గా ఉన్నాడు. ‘‘టన్నుల కొద్దీ ఏసీ ఉన్నా మనకిలా డ్రమ్ముల కొద్దీ చెమటలు పడుతున్నాయేమిటి’’ అన్నాడు గజపతిరాజు. ‘‘పట్టడం కాదు. కారుతున్నాయి’’ అన్నాడు కుటుంబరావు. ‘‘ఏసీ పాడైనట్లుంది. ఆ ఫ్యాన్ వెయ్యండి’’ అన్నాడు యనమల. ‘‘స్టాప్.. స్టాప్ ద షిట్ టాకింగ్’’ అని అరిచాడు చంద్రబాబు. కళా వెంకట్రావు బెదురుగా చూశాడు. చంద్రబాబు కోపం చూసి కాదు ఆ బెదురు. చంద్రబాబు అన్న మాటల్లో స్టాప్, షిట్, టాకింగ్.. ఈ మూడూ విడివిడిగా అర్థమయ్యాయి కానీ, మూడు కలిపితే మాత్రం మీనింగ్ అర్థం కావడం లేదు. ‘‘నేను చెప్పానా.. నాన్గారికి ఫ్యాన్ పడదని’’ అన్నాడు లోకేశ్.. పేపర్లోంచి తల పైకెత్తకుండానే. ఆవేళ్టి పేపర్ హెడ్డింగుల్ని కూడదీసుకుని చదువుతూ, మాటల్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు లోకేశ్. ‘‘సినిమా చూపిస్తానన్నారు. చూపించండి..’’ అన్నాడు చంద్రబాబు చెమటలు తుడుచుకుంటూ. కుటుంబరావు ప్లే బటన్ నొక్కాడు. స్క్రీన్పై సినిమా మొదలైంది. కానీ ఎవరూ స్క్రీన్ వైపు చూడడం లేదు! సినిమా దారి సినిమాది. వీళ్ల దారి వీళ్లది. లోకేశ్ దారి లోకేశ్ది. ‘‘లోటస్ పాండ్లో ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోందో తెలియడం లేదు’’ అన్నాడు చంద్రబాబు టెన్షన్గా. ‘‘తెలిసింది’’ అని చిటికేశాడు కళా వెంక్రటావు. ‘‘ఏం తెలిసింది?’’ అన్నాడు యనమల. ఏసీ ఉన్నా మనకు చెమటలు ఇంతగా ఎందుకు పడుతున్నాయో తెలిసింది. ప్రచారానికి బ్రేక్ ఇచ్చి లోటస్ పాండ్లో జగన్ ఏం చేస్తున్నాడోనన్న విషయంపై మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం’’ అన్నాడు వెంకట్రావు. ‘‘అంతేనంటావా..’’ అన్నాడు చంద్రబాబు కాస్త ఊరట చెందుతూ. ‘‘అంతకాకుండా ఏముంటుంది నాయుడుగారూ... ‘ఈ’పేపర్ రాసిందనీ, ‘ఆ’పేపర్ రాసిందనీ మరీ చెమటలు పట్టి తడిసిపోయేంతగా మనం లోటస్ పాండ్ గురించి భయపడక్కర్లేదు. జగన్ ఇంటికి జగన్ వెళ్తున్నాడు. ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంటికి వెళ్లకపోతుంటే డౌట్ పడాలి కానీ, ఇంటికి వెళ్లొస్తుంటే డౌటెందుకు?’’ అన్నాడు వెంకట్రావ్. ‘‘హీ.. హీ.. హీ..’’ అని నవ్వాడు లోకేశ్. అంతా అతడి వైపు చూశారు. అతడు ఎవరి వైపూ చూడడం లేదు. పేపర్లో హెడ్డింగ్లు చదువుతూ నవ్వుకుంటున్నాడు. ‘‘అన్నీ నాన్గారి హెడ్డింగులే. అన్నీ నాన్గారి ఫొటోలే. నాన్గారు చెయ్యూపిన ఫొటో, నాన్గారు చెయ్యూపించిన ఫొటో. ఈరోజైతే నాన్గారి పేద్ద బయోగ్రఫీ కూడా ఇచ్చారు’’ అంటూ ఒక్కో హెడ్డింగూ చదువుతున్నాడు. సడన్గా స్క్రీన్ మీద సినిమా సౌండ్ పెరిగింది. ‘‘నువ్వేం చేస్తున్నా.. పేపర్ చదువుతున్నావా?’’.. అంటున్నాడు కోట శ్రీనివాసరావు. ‘‘మీకెలా తెలుసు సార్?!!’’ ‘‘ఇందులో తెలియడానికేముందీ.. పైన చదువుతున్నావ్, కింద కోసుకెళ్లిపోయాడు’’.. అన్నాడు కోట. ‘‘సినిమా సౌండ్ ఎందుకు పెరిగిందీ? అన్నాడు చంద్రబాబు విసుగ్గా. ‘‘నేనే పెంచా నాయుడు గారూ.. ఈ సీన్ భలే ఉంటుంది’’ అని చెమటలు తుడుచుకుంటూ పడీపడీ నవ్వుతున్నాడు కుటుంబరావు. - మాదవ్ -
ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన తర్వాతనే మద్దతిస్తాం
-
‘మాట తప్పితే చరిత్ర హీనులుగా మిగిలిపోతాం’
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని, హంగ్ ఏర్పడే అవకాశాలున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని... ప్రత్యేక హోదా ఫైల్పై సంతకం పెట్టిన పార్టీకి మాత్రమే మద్దతిస్తామని స్పష్టం చేశారు. లోటస్పాండ్లో ఆయన గురువారం తటస్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ పార్టీ విధివిధానాల గురించి వారికి వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా హంగ్ వస్తేనే మంచిదని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. 25 ఎంపీ స్థానాలను ప్రజలు వైఎస్సార్ సీపీకే కట్టబెడతారని.. తద్వారా కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని పేర్కొన్నారు. విశాఖకు రైల్వేజోన్ రావాలి.. రైల్వేజోన్ అంశంపై తనకు పూర్తి అవగాహన ఉందని వైఎస్ జగన్ అన్నారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు రైల్వేజోన్ ఉందని.. చట్టప్రకారం విశాఖకు రైల్వే జోన్ రావాలన్నారు. రైల్వే జోన్ కోసం వైఎస్సార్ సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్ కోసం అలుపెరుగని కృషి చేస్తామని పేర్కొన్నారు. మగ్గం ఉన్న ప్రతీ ఇంటికీ రూ. 2 వేలు తమ పార్టీ ప్రకటించిన పథకాలను ఎంతగా కాపీ కొట్టినా ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మగ్గం ఉన్న ప్రతీ ఇంటికీ రూ. 2 వేలు ఇస్తామని, పవర్లూమ్ ఉన్న వారికి కరెంటు చార్జీలు తగ్గిస్తామని తెలిపారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రతీ కులానికి ఓ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్ హయాంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఆర్థిక భరోసా కల్పిస్తాం.. వైఎస్సార్ చేయూత ద్వారా 45 ఏళ్లు దాటిన మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో రూ. 75 వేలు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. గ్రామ సెక్రటేరియట్ ద్వారా పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని తెలిపారు. ప్రతీ గ్రామంలో 10 మంది ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేసేందుకు ప్రతీ 50 కుటుంబాలకు రూ. 5 వేల జీతంతో ఒకరిని నియమిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా ప్రభుత్వ పథకాలను మంజూరు చేస్తామని తెలిపారు. తొలి అసెంబ్లీ సమావేశంలోనే చట్టం తెస్తాం ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ సీఎం చంద్రబాబు తన బినామీలకే కట్టబెడుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. దేవాలయాల్లోని కాంట్రాక్టులు కూడా తన బంధువులకే అప్పగిస్తున్నారని ఆరోపించారు. కియా ఫ్యాక్టరీ ఘనత చంద్రబాబు తీసుకున్నా సరే గానీ.. అందులో 5 శాతం ఉద్యోగాలు కూడా స్థానికులకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన, ఏర్పాటుకానున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని తొలి అసెంబ్లీ సమావేశంలోనే చట్టం తెస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా కేలండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ప్రతీ మే నెలలో రూ. 12,500 వైఎస్సార్ రైతు భరోసా ద్వారా 85 లక్షల మందికి పైగా రైతులకు ప్రతీ మే నెలలో రూ. 12,500 ఇస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ తన పదవీకాలంలో పథకాల తీరుపై స్వయంగా అధికారులకు ఫోన్ చేసేవారని.. సీఎం సీటులో ఉన్న వ్యక్తి ధ్యాసను బట్టి పథకాల అమలు ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గమనించాలన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వాళ్లనే ఈ లోకం గుర్తుపెట్టుకుంటుందని.. అలా చేయని పక్షంలో చరిత్ర హీనులుగా మిగిలిపోతామని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. -
రాజన్న రాజ్యం రావాలి : గణనాథుడికి ప్రత్యేక పూజలు
సాక్షి, హైదరాబాద్ : లోటస్ పాండ్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు విజయ సాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బత్తుల బ్రహ్మానంద రెడ్డి హాజరై వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే వినాయక చవితి నాటికి ఏపీలో ప్రజలు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోవాలని, రాజన్న పాలన రావాలని, ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నట్టు పార్టీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి తెలిపారు. గణేష్ ఉత్సవాలు ప్రజలందరిలో ఐక్యమత్యం పెంచుతాయని అన్నారు మండలి విపక్ష నేత ఉమ్మారెడ్డి. ‘వైఎస్సార్సీపీ విజయానికి ప్రధమ మెట్టుగా భావిస్తూ.. 2019 జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి రాజ్యాధికారి సిద్ధిస్తుంది. ముఖ్యమంత్రి అవుతారనే విశ్వాసంతో ఈ రోజు వినాయక చవితిని పండుగగా జరుపుకున్నాం. రాష్ట్ర ప్రజలందరూ సుఖ శాంతులతో కలకాలం వర్థిల్లాలి. రాష్ట్రం మంచిగా అభివృద్ధి చెందాలనే భావనతో ఈ పండుగను చేసుకోవడం జరిగింది’ అని విజయ సాయి రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజానీకం అంతా కోరుకునేది కూడా ఈ నాడు ఉన్న ప్రభుత్వం పోయి, రాజన్న రాజ్యం రావాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వార్లు చెప్పారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా తప్పకుడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రాప్రజానీకం సుభిక్షంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్టు తెలిపారు. రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టిన పోలవరం ప్రాజెక్ట్ దగ్గర్నుంచి, 87 జలయజ్ఞాలు ప్రాజెక్టులు కూడా రాబోయే సంవత్సరంలో అధికారంలోకి రాగానే తప్పకుండా పూర్తిచేయాలి. రైతాంగం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల వారు ఎటువంటి ఆటంకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని నేడు పార్టీ ఆఫీసులో పూజ చేశామని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యా లయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఉన్న కేంద్ర కార్యాలయానికి ముఖ్య నాయకులు చేరుకొని వేడుకలను నిర్వహించారు. నూతన సంవత్సర కేక్ను రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్రాజు, కార్య దర్శులు పుత్తా ప్రతాప్రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, నాయకులు బుర్రా సురేష్గౌడ్, బి.మోహన్ కుమార్, రమాభాస్కర్ పాల్గొన్నారు. -
కొత్త జిల్లాలతో పార్టీ బలపడుతోంది
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలతో పార్టీ బలపడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీకి మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్రెడ్డి, పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్కుమార్ సమక్షంలో కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి లోకా లక్ష్మారెడ్డి తదితరులు పార్టీలో చేరారు. వారికి శ్రీకాంత్రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ లీగల్ సెల్ అధ్యక్షుడి నియామకం వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా మందాడి సరోజ్రెడ్డి నియమితులయ్యారు. అలాగే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మునిగాల కల్యాణ్రాజ్ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గట్టు శ్రీకాంత్రెడ్డి ఆయా నియామకాలు చేసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. -
రేపు వైఎస్సార్సీపీ 3 జిల్లాల విస్తృత భేటీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అధ్యక్షతన ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల విస్తృత సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆయా జిల్లాల నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ప్రకటనలో తెలిపారు. -
నేడు వైఎస్సార్సీపీ తెలంగాణ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్య నాయకుల సమావేశం గురువారం ఉదయం హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల నాయకులు సమావేశంలో పాల్గొంటారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి, తెలంగాణ ఇన్చార్జి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో.. పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందిస్తారు. రాష్ర్టంలో పార్టీ పటిష్టత, తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యాచరణ, పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నిక తదితర అంశాలపై చర్చిస్తామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. -
ఈ ఏడాది వైఎస్ఆర్ సీపీకి బ్రహ్మాండం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉగాది వేడుకల్లో వైఎస్ఆర్ సీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. 'ఆంధ్రప్రదేశ్ లో పాలకులు స్వార్థాన్ని వీడితేనే అభివృద్ధి. పాలకులకు గ్రహాలు అనుకూలించడం లేదు. అకాల వర్షాల వల్ల నష్టాలు, పరిపాలన ఇబ్బందులు తలెత్తుతాయి. వైఎస్ఆర్ సీపీకి ఈ ఏడాది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. పార్టీ ఫిరాయించినవారికి రాజకీయంగా భవిష్యత్ లేదు. అక్రమ కేసులు, కుట్రలు కుతంత్రాలు నుంచి వైఎస్ జగన్ కడిగిన ముత్యంలా బయపపడతారు. వైఎస్ఆర్ సీపీ మరింతగా ప్రజల మన్నన చూరగొంటుంది. రాబోయే రోజుల్లో యువ నాయకత్వానిదే భవిష్యత్' అని మారేపల్లి పంచాంగం చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఈ ఉగాది ప్రతిఒక్కరి జీవితాల్లో ఆనందం నింపాలన్నారు. అంతకు ముందు ఆయన 'శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ప్రతీ తెలుగు ఇంటికి శాంతి సౌభాగ్యం ఆనందం ఆరోగ్యం తీసుకురావాలని కోరుకుంటున్నాను' అని ట్విట్ చేశారు. అలాగే రెండు రాష్ట్రాల ప్రజలు, తెలుగువారికి శుభం కలగాలని వైఎస్ విజయమ్మ ఆకాంక్షించారు. ఉగాది వేడుకల్లో పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విజయ సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
నేడు లోటస్పాండ్లో ఉగాది వేడుకలు
సాక్షి, హైదరాబాద్: లోటస్పాండ్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తారు. -
4న తెలంగాణ వైఎస్సార్సీపీ సమావేశం
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 4న హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగనుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. ఆ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయటంపై దృష్టి సారించనున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, మంచినీటి సమస్య, ప్రాజెక్టుల రీడిజైన్ అంశం, రైతుల సమస్యలు, ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు చెప్పారు. సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు హాజరు కావాలని శివకుమార్ కోరారు. -
అంబేద్కర్ స్ఫూర్తి ఇంకా రావాలి: వైఎస్ జగన్
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీ ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి నీరుకారుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 67 ఏళ్లయినా దళిత క్రైస్తవులకు మతం ఆధారంగా ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు కాని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ పరిస్థితి సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. దళితుల సాంఘిక, ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ మారలేదని చెప్పారు. బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తి ఇంకా రావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందరం కలసి ఈ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ వ్యవస్థను మార్చే క్రమంలో తమ పార్టీ ఎప్పుడు ముందుంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దేశ ప్రజలందరికి వైఎస్ జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం లోటస్పాండ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో 67వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని వైఎస్ జగన్ ఎగురవేశారు. అనంతరం జాతీయ నేతల చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
లోటస్ పాండ్లో విద్యుత్ ఉద్యోగ సంఘం డైరీ అవిష్కరణ
-
లోటస్ పాండ్లో స్పెల్ బీ పోటేలు
-
వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో వినాయక చవితి వేడుకలు
-
వైఎస్ జగన్ ప్రత్యేకహోదా అంశంపై దిశానిర్దేశం
-
'లేకుంటే.. అసెంబ్లీని ముట్టడిస్తాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ సంఘం సభ్యులు శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని లోటస్ పాండ్లోని తన నివాసంలో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా వారు జగన్తో.. రాష్ట్రంలో 1.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 'చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 15 నెలలు గడచినా.. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. దీంతో పీజీ చేసిన విద్యార్థులు కూడా సెక్యూరిటీ గార్డులుగా పని చేసే దుస్థితి నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా నోటిఫికేషన్ ఇవ్వాలి. లేకపోతే అన్ని రాజకీయ పార్టీల మద్దుతతో అసెంబ్లీని ముట్టడిస్తాం' అని చెప్పారు. -
వైఎస్ జగన్ను కలిసిన ముస్లిం సోదరులు
-
షర్మిల పరామర్శ యాత్రను జయప్రదం చేయండి
శుక్రవారం లోటస్ పాండ్ లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న పొంగులేటి. చిత్రంలో నల్లా సూర్యప్రకాశ్, శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి గాదె నిరంజన్ రెడ్డి తదితరులు * రంగారెడ్డి జిల్లాలో 29న జిల్లెలగూడ మంద మల్లమ్మచౌరస్తా నుంచి యాత్ర ప్రారంభం * వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి * ప్రతి కార్యకర్తా నాలుగు రోజులూ షర్మిల వెంట నడవాలి * పరామర్శయాత్ర నియోజవర్గ ఇన్చార్జిలతో భేటీ సాక్షి, హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 29 నుంచి రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించనున్న పరామర్శ యాత్రను జయపద్రం చేయాలని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తతోపాటు మండలం నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఉన్న నాయకులంతా ఈ నాలుగు రోజులు షర్మిల వెంట నడవాలన్నారు. శుక్రవారం లోటస్పాండ్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేష్రెడ్డి అధ్యక్షతన ‘పరామర్శ యాత్ర నియోజకవర్గ ఇన్చార్జి’లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 29వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు షర్మిల బెంగళూరు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి ఆమె జిల్లెలగూడ మంద మల్లమ్మ చౌరస్తా, కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి మహానేత వైఎస్సార్ ఆకస్మిక మృతి తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించే కార్యక్రమానికి శ్రీకారం చుడతారన్నారు. ప్రతీ కుటుంబాన్నీ పరామర్శించి వారికి భరోసా కల్పిస్తారన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాష్, గట్టు శ్రీకాంత్రెడ్డి, గాదె నిరంజన్రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, పార్టీ కార్యదర్శి ఎనుగు మహిపాల్రెడ్డి, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, మహిళా నేతలు అమృతసాగర్, సూరజ్ ఎజ్ధానీ, జి.ధనలక్ష్మి, ఎం.శ్యామల, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం. ప్రభుకుమార్, కార్మిక నేత నర్రా భిక్షపతి, మైనార్టీ నేతలు ముజ్తబ అహ్మద్, మసూం, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు భాస్కర్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, నగర యువజన, సేవాదళ్ విభాగాల అధ్యక్షులు ఎ.అవినాష్గౌడ్, బండారి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ సీపీ ముఖ్యనేతల సమావేశం
హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సమావేశం అయ్యారు. లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో బుధవారం నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఓటుకు నోటు వ్యవహారంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వైఎస్ జగన్ను కలిసిన ఎన్నారై కమిటీ
-
వైఎస్ జగన్ను కలిసిన ఎన్నారై కమిటీ
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వైఎస్సార్సీపీ ఎన్నారై యూఎస్ఏ కమిటీ సభ్యులు కలిశారు. ఆదివారం లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ నివాసంలో ఎన్నారై కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అక్కడ వైఎస్ జగన్ సమక్షంలో కడప మేయర్ సురేశ్ బాబుకు రూ.2.50 లక్షల చెక్కు అందజేశారు. కడప కార్పొరేషన్ పరిధిలోని 25 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తగిన సదుపాయాల అందించేందుకు ఆ చెక్కు అందించినట్టు ఎన్నారై కమిటీ కన్వీనర్ రత్నాకర్ తెలిపారు. ప్రస్తుతం తాము చేసిన సాయం తొలి విడతలో భాగమేనని ఆయన చెప్పారు. భవిష్యత్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుకు మరిన్ని సౌకర్యాలకు సాయం చేస్తామని వైఎస్సార్సీపీ ఎన్నారై కమిటీ తరఫున కన్వీనర్ రత్నాకర్ ఈ సందర్భంగా తెలియజేశారు. -
వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
హైదరాబాద్: హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మన్మధనామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కార్యాలయంలో వైఎస్ఆర్ సీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాగ శ్రవణం చేశారు. అనంతరం వేడుకల్లో పాల్గొన్న వారికి ఉగాది పచ్చడిని అందజేశారు. పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిండెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. -
'సవరణలకు ఒప్పుకుంటేనే బిల్లుకు మద్దతు'
-
తిరుగులేని శక్తిగా ఎదుగుదాం
సాక్షి, హైదరాబాద్: దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డికి రంగారెడ్డి జిల్లా మానసపుత్రిక లాంటిదని, అలాంటి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా బలోపేతం చేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జి. సురేష్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిశీలకుడు కె.శివకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ రైతు శ్రేయస్సే ధ్యేయంగా వైఎస్సార్ పనిచేశారన్నారు. రైతుల క్షేమం కోరి సీఎం పదవి చేపట్టిన మరుక్షణమే ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బాగోగులను పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో దాదాపు 78 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని, ఇప్పటి వరకు ప్రభుత్వం రైతు ఆత్మహత్యలపై స్పందించకపోవడం దారుణమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. బంగారు తెలంగాణ, డబుల్ బెడ్రూంలు.. అంటూ కాలం వెల్లదీస్తున్నారని, ముందు రాజీవ్ గృహకల్ప కింద పేదలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తేచాలని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధి కాలనీలకు మంజీరా నీరు సరిగా రావడం లేదని, ఇంట్లో నలుగురుంటే ఇద్దరికే రేషన్ వస్తోందని విమర్శించారు. ఒక ఉన్న పింఛన్లు సైతం తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. అంగన్వాడీ, డ్వాక్రా మహిళల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి నిధులు సరిపోవడం లేదని అన్నారు. మున్ముందు రోజుల్లో హామీల సీఎంగా కేసీఆర్ ఖ్యాతికెక్కుతారని విమర్శించారు. రాబోయే రోజులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవేనని జోష్యం చెప్పారు. జగనన్న ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటున్నారని, వాడవాడలా కమిటీలు వేసుకుని ప్రజా సమస్యలపై పోరాడుదామని అన్నారు. గ్రేటర్లో పాదయాత్రకు షర్మిల సిద్ధంగా ఉన్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 25 స్థానాలకు తక్కువ లేకుండా గెలుచుకోవాలని సూచించారు. సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.అమృతసాగర్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీకి ఆదరణ ఉందని, అందరం కలిసికట్టుగా సురేష్ రెడ్డి నాయకత్వంలో పనిచేద్దామని అన్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు సమావేశానికి తరలివచ్చారు. మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, హయత్నగర్, కూకట్పల్లి, శంషాబాద్, శేరిలింగంపల్లికి చెందిన పార్టీ నాయకులు ఎం.కుమార్ రెడ్డి, సీహెచ్ త్రిపాఠి, ఆర్.సతీష్ రెడ్డి, టి.ఇన్నారెడ్డి, గోపాల్ రెడ్డి, యాదయ్య, వెంకట్రెడ్డి, టి.ఆరోగ్యరెడ్డి, శ్రీధర్, బి.సంతోష్ కుమార్ నేత, విద్యార్థి నాయకుడు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. తీర్మానాలివే.. జిల్లాలోని రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వం కరువు ప్రాంతాల్లోని రైతులకు పెట్టుబడి రాయితీతోపాటు వివిధ దశల్లో ఆర్థిక సాయం చేయాలి. రబీ సీజన్లో జిల్లాలో 14వేల ఎకరాల్లో వరిపంట ఎదిగే దశలో ఉంది. నీటి అవసరం అధికంగా ఉంది. కూరగాయల పంటలు కూడా దాదాపు 10వేల హెక్టార్లలో సాగవుతున్నాయి. ఇవన్నీ బోరునీటిపైనే ఆధారపడ్డాయి. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి. వేసవి సీజన్ మొదలైంది. గ్రామాల్లో, నగర శివారు ప్రాంతాల్లో తాగు నీటి ఎద్దటి తీవ్రంగా ఉంటుంది. తక్షణమే నీటి ఎద్దడి తీర్చాలి. వికారాబాద్ను జిల్లా కేంద్రంగా మారుస్తానన్న కేసీఆర్ ఎన్నికల హామీ నెరవేర్చుకోవాలి. -
రేపు వైఎస్సార్సీపీ తెలంగాణ కార్యాలయం ప్రారంభం
-
లోటస్ పాండ్లో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
లోటస్ పాండ్లో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను పార్టీ నేతలు ఆదివారం లోటస్ పాండ్లో నిర్వహించారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి తదితరులు...కేక్ కట్ చేశారు. తమ ప్రియతమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు నేతలు రక్తదానం చేశారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనాథ పిల్లలకు వైఎస్ఆర్ సీపీ ఐటీ వింగ్ ఆర్థికసాయం చేసింది. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. మరోవైపు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు, పార్టీ నేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. -
ఇరు రాష్ట్రాల సమస్యలను సభలో ప్రస్తావించండి
-
ఇరు రాష్ట్రాల సమస్యలను సభలో ప్రస్తావించండి: వైఎస్ జగన్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమకు సూచించారని ఆ పార్టీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్, ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహాంపై వైఎస్ జగన్ అధ్యక్షతన శనివారం లోటస్పాండ్లో సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మేకపాటి రాజమోహన్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఇరు రాష్ట్రాలలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల కోసం సంబంధిత మంత్రులు, అధికారులను కలసి చర్చించాలని వైఎస్ జగన్ సూచించారన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్లకు కేంద్రం తక్షణమే నిధులు విడుదల చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేలా వ్యవహారించాలని వైఎస్ జగన్ తెలిపారని ఆయన అన్నారు. అలాగే హుదూద్ తుపాను సాయం, రైతుల సమస్యలు, ముంపు మండలాలు తదితర అంశాలపై పార్లమెంట్లో తమ గళంవినిపిస్తామని మేకపాటి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, అరకు ఎంపీ కొత్తపల్లి గీతను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ను మరోసారి కోరతామని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ హాజరయ్యారు. -
గుంటూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. రాజధాని భూసేకరణపై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో స్థానిక ప్రజలు అభిప్రాయాలను జిల్లా నేతలు ఈ సందర్భంగా వైఎస్ జగన్కు వివరించినట్లు సమాచారం. అలాగే జిల్లాలోని ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని వారు వివరించారు. కాగా వచ్చే నెల 5న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే నిరసన కార్యక్రమాలపై జిల్లా నేతలలో వైఎస్ జగన్ చర్చించారు. కాగా ఈ నెల 21న విశాఖపట్నం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలాగే త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాంపై 22న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్ సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. 24, 25 తేదీల్లో ఒంగోలులో ప్రకాశం జిల్లా పార్టీ సమీక్షా సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు వైఎస్ జగన్ హాజరుకానున్నారు. -
రాఖీ కట్టిన షర్మిలకు వైఎస్ జగన్ కొండంత భరోసా!
హైదరాబాద్: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి చిహ్నమైన రాఖీ పండుగను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిలు ప్రేమానురాగాల మధ్య జరుపుకున్నారు. లోటస్ పాండ్ లో వైఎస్ విజయమ్మ వెంట ఉండగా తన అన్న వైఎస్ జగన్ కు సోదరి షర్మిల రాఖీ కట్టారు. రాఖీ కట్టిన తన సోదరి షర్మిలకు బతికున్నంత కాలం తాను భరోసాగా ఉంటానని వైస్ జగన్ తన ప్రేమను చాటుకున్నారు. ఆప్యాయతలకు అతి దగ్గరగా.. సోదర, సోదరీమణులు అపురూపంగా జరుపుకునే రాఖీ పండుగను వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు ఆనందంగా జరుపుకున్నారు. -
ప్రభుత్వంపై ఒత్తిడి తెండి: వైఎస్ జగన్
-
ప్రభుత్వంపై ఒత్తిడి తెండి: వైఎస్ జగన్
అధికార తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీ నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని లోటస్పాండ్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశంలో ఆయన నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీనేతలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ సూచించారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడి వారి సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని తెలిపారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగేలా ప్రభుత్వాన్ని నిలదీయాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన చెప్పారు. వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
లోటస్ పాండ్లో వైఎస్ఆర్ సీపీ సమావేశం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం లోటస్ పాండ్లోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల అధ్యక్షులతో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలపై జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ చర్చిస్తున్నారు. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం గుంటూరు జిల్లా వెళ్లనున్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు జరిగే నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. రేపు ఉదయం 8.30 గంటలకు వైఎస్ జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో గుంటూరు వెళ్తారు. -
వైఎస్ జగన్ను కలిసిన సిఐఐ ప్రతినిధి బృందం
హైదరాబాద్: భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం ఈ రోజు లోటస్పాండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని కలిశారు. వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో పరిశ్రమలు, విద్యుత్, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలను చేర్చాలని వారు జగన్కు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లారెడ్డి లోటస్పాండ్లో జగన్ సమక్షంలో ఐఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
జగన్ను కలిసేందుకు జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజలు
-
పార్టీ ఎమ్మెల్యేలతో వైయస్జగన్ భేటి
-
దీక్షకు దన్నుగా...
సాక్షి, సిటీబ్యూరో: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న ఆమరణ దీక్ష నేపథ్యంలో సర్వత్రా ఉ్కతంఠ నెలకొంది. అందరి దృష్టీ లోటస్పాండ్పై కేంద్రీకృతమైంది. సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్తో శనివారం ఉదయం నుంచి లోటస్పాండ్లో జగన్ ఆమరణ దీక్ష చేపడుతున్న విష యం తెలిసిందే. దీక్షను స్వాగతిస్తూ, మద్దతునిస్తూ పలువురు పాల్గొననున్నారు. రాష్ట్రంలోని వివిధ సీమాంధ్ర జిల్లాలకు చెంది, పెద్దసంఖ్యలో నగరంలో స్థిరపడ్డ కుటుంబాలతో పాటు పలువురు హైదరాబాదీలు జగన్ దీక్షను స్వాగతిస్తూ పార్టీ కార్యాలయానికి లేఖలు పంపారు. రాష్ట్రాన్ని విడదీసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పాడు చేయొద్దంటూ పలువురు మైనారిటీ నేతలు సైతం శుక్రవారం సందే శాలు పంపారు. ఇదిలా ఉంటే ఆమరణ దీక్ష నేపథ్యంలో నగరంలోని ఆయన అభిమానులు, పార్టీ నాయకులు శనివారం నుండి విస్తృత కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. జగన్కు సంఘీభావంగా దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని నిర్ణయించారు. ఇతర పార్టీలూ స్పందించాలి 13 జిల్లాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా చేసిన ఏకపక్ష విభజన నిర్ణయంపై మిగిలిన పార్టీలు ఇప్పటికైనా స్పందిం చాలని రాష్ట్ర పరిరక్షణ వేదిక కో ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి, ఏపీఎన్జీఓల సంఘం మాజీ అధ్యక్షుడు గోపాల్రెడ్డి కోరారు. జగన్మోహన్రెడ్డి చేయతలపెట్టిన దీక్షను స్వాగతిస్తున్నామన్నారు. అంతా మద్దతునివ్వాలని కోరారు. -
జగన్ దీక్షకు భారీ బందోబస్తు
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం నుంచి చేపట్టనున్న ఆమరణ నిరాహారదీక్షకు నగరపోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దీక్షను అడ్డుకుని, భగ్నం చేస్తామని కొన్ని సంఘాలు ప్రకటించడంతో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీక్షావేదికతో పాటు లోటస్పాండ్ చుట్టూ ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి ఆయా మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించాలని నిర్ణయించారు. బందోబస్తుపై పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. జగన్ గత నెలాఖర్లో బెయిల్పై విడుదలైనప్పుడు ఆయన ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో చంచల్గూడ జైలు వద్దకు చేరుకోవడం తెలిసిందే. జైలు నుంచి లోటస్పాండ్ వరకు రోడ్ల న్నీ జనసంద్రమయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వీఐపీల జాబితాలో ఉన్న జగన్ దీక్షకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి లోట స్పాండ్ వరకు ప్రధాన మార్గాల్లో నాలుగు చోట్ల బారికేడ్లతో కార్డన్ ఏరియాలు ఏర్పా టు చేయనున్నారు. లోటస్పాండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిఘా, గస్తీని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. దీక్ష జరిగినన్నాళ్లూ సీమాంధ్ర, ఇతర జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారని పోలీసుల అంచనా. సాధ్యమైనంతమేర వాహనాలను లోటస్పాండ్ దాకా రాకుండా అడ్డుకోవాలని నిర్ణయించారు. రావి నారాయణరెడ్డి ఆడిటోరియం వద్దే వాహనాలను ఆపేసి, అక్కడ నుంచి అభిమానులను కాలినడకన దీక్షాస్థలికి పంపాలని భావిస్తున్నారు. -
లోటస్పాండ్కు పోటెత్తిన అభిమానం
-
లోటస్పాండ్లో అభిమానుల తాకిడి
-
సందడే సందడి!
-
కార్యకర్తలు, అభిమానులకు ఆప్యాయంగా పలకరింపు
-
లోటస్పాండ్ వద్ద బారులు తీరిన జనం
-
అభిమానులను కలవనున్న జగన్
హైదరాబాద్: జైలు నుంచి విడుదలయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ అభిమానులను కలిసేందుకు సమయాన్ని కేటాయించారు. ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభిమానులను కలవాలని ఆయన నిర్ణయించారు. రేపటి నుంచి లోటస్పాండ్లోని నివాసంలో అభిమానులను ఆయన కలవనున్నారు. 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ బెయిల్పై నిన్న విడుదలయిన సంగతి తెలిసిందే. నేరం రుజువు కాకుండానే ఆయన 485 రోజులు జైలులో ఉన్నారు. జైలు నుంచి విడుదల తర్వాత రోజే వైఎస్ జగన్ పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆయన బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ఫోరం నాయకులు జగన్ను కలిశారు. -
అభిమానులతో నిండిపోయిన లోటస్ పాండ్
-
జన సంద్రమైన లోటస్ పాండ్
ప్రియతమ నేత వైస్ రాజశేఖరరెడ్డి తనయుడు... జననేత జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అభిమాన కెరటాలు ఎగిసిపడ్డాయి. యువనేత జనంలోకి రావటంతో అభిమానుల ఆనందం అవధులు దాటింది. బుధవారం లోటస్పాండ్ జన సంద్రమైంది. వైఎస్ జగన్ను చూసేందుకు రాష్ట్ర నలువైపుల నుంచి అశేష జనవాహిని కదలివచ్చింది. -
జననేతను చూసేందుకు తరలివచ్చిన జనసంద్రం
హైదరాబాద్ : ప్రియతమ నేత వైస్ రాజశేఖరరెడ్డి తనయుడు... జననేత జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అభిమాన కెరటాలు ఎగిసిపడ్డాయి. యువనేత జనంలోకి రావటంతో అభిమానుల ఆనందం అవధులు దాటింది. బుధవారం లోటస్పాండ్ జన సంద్రమైంది. వైఎస్ జగన్ను చూసేందుకు రాష్ట్ర నలువైపుల నుంచి అశేష జనవాహిని కదలివచ్చింది. అభిమాననేతకు కరచాలనం చేయాలని పోటీపడింది. జగన్ బయటకు రాగానే లోటస్పాండ్ను నినాదాలతో హోరెత్తించారు. జై జగన్ ... నినాదాలు మిన్నంటాయి. చప్పట్లు, ఈలలతో ఆ ప్రాంతం మొత్తం మారుమోగిపోయింది. తన కోసం వచ్చిన వారందరికీ జగన్ అభివాదం చేశారు. ఒక్కొక్కరిగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ఎలా ఉన్నారంటూ ప్రేమగా అడిగారు. ఆప్యాయంగా పలకరించారు. సమస్యలు విన్నారు..విజ్ఞప్తులు స్వీకరించారు. ప్రతి ఒక్కరికీ ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి విద్యార్ధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రాంతాలకు అతీతంగా తరలివచ్చిన అభిమానులతో లోటస్పాండ్ కోలాహలంగా మారింది. చేతులు పట్టుకుని బాగున్నారా అన్నా..బాగున్నావా తమ్ముడు... అంటూ పలకరిస్తూ.. అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అందరికీ కొండంత భరోసానిచ్చారు. -
తాజా మాజీ ఎమ్మెల్యేలతో జగన్ భేటి
-
జగన్ను ఢిల్లీకి ఆహ్వానించిన సీమాంధ్ర ఉద్యోగులు
హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా జంతర్ మంతర్ దగ్గర తాము తలపెట్టిన నిరసన దీక్షకు మద్దతు ఇవ్వాల్సిందిగా సీమాంధ్ర సెక్రటేరియట్ ఉద్యోగుల ఫోరం... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఢిల్లీకి రావాల్సిందిగా ఆయనను ఉద్యోగులు ఆహ్వానించారు. సంఘం ప్రతినిధులు బుధవారం ఉదయం లోటస్పాండ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తమకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగా అపాయింట్మెంట్ ఇవ్వడంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు అరగంట పాటు జరిగిన సమావేశంలో సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న తీరుతెన్నుల్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.... ఉద్యోగుల్ని అడిగి తెలుసుకున్నారు. ఉద్యమంలో స్వయంగా పాలుపంచుకోవాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జగన్ను కోరారు. ఢిల్లీ నిరసన ప్రదర్శనకు వస్తే బాగుంటుందని పదేపదే అడిగారు. అయితే షరతులతో కూడిన బెయిల్ ఉన్నందున తాను రాలేనని... పార్టీ ప్రతినిధులను ఢిల్లీకి పంపిస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమకు తెలిపారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు -
జగన్ ఇంట పండుగ
-
జగన్ కోసం జనం
-
జగన్ కోసం జనం
* చంచల్గూడ జైలు నుంచి లోటస్పాండ్ వరకు పోటెత్తిన జన సునామీ మంగళవారం సరిగ్గా సాయంత్రం 3.55 గంటలకు తెల్లరంగుపై నీలం రంగు చారల చొక్కా వేసుకున్న జగన్ జైలు నుంచి బయటికొచ్చారు. ఆ వెంటనే ‘వచ్చాడదిగో పులివెందుల పులి బిడ్డ’ అంటూ అభిమానులు పెద్దపెట్టున నినాదాలు చేశారు... పావురాలను పైకి ఎగురవేశారు. సాక్షి, హైదరాబాద్: రాజధానిలో దారులన్నీ మంగళవారం చంచల్గూడ వైపే మళ్లాయి. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన జనంతో మలక్పేట్, చంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్, డబీర్పురా పరిసరాలు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మంగళవారం విడుదలవుతారని తెలియడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుదీర్ఘ కాలం తర్వాత తమ మధ్యకు తిరిగి వస్తున్న ప్రియతమ నేతను కళ్లారా చూసుకునేందుకు, కరచాలనం చేసేందుకు చంచల్గూడ జైలు ముందు ఉదయం 8 గంటల నుంచే జనం భారీ సంఖ్యలో బారులు తీరారు. చూస్తుండగానే 11 గంటలకల్లా జైలు ఎదురుగా ఉండే ప్రాంతమంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. అభిమానుల తాకిడి పెరిగే కొద్దీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జైలు ప్రాంగణంలోకి ఎవరినీ రానీయకుండా ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. వాహనాలను జైలు ప్రాంగణానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే నిలిపేశారు. ప్రజాప్రతినిధుల వాహనాలను కూడా అనుమతించకపోవడంతో వారంతా జైలు దాకా నడిచే వచ్చారు. తమ నాయకుడు ఎప్పుడెప్పుడు బయటికొస్తాడా, ఎప్పుడు ఆయనతో కరచాలనం చేస్తామా అనే ఆరాటం అందరి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ఎండ నిప్పులు చెరుగుతున్నా ఎవరూ అంగుళమైనా కదల్లేదు. తిండి, నీరూ కూడా పట్టించుకోకుండా జైలు గేటు వైపే దృష్టి నిలిపి నిలబడ్డారు. అక్కడ ఏ చిన్న అలజడి రేగినా జగనేవస్తున్నారంటూ కేరింతలు కొట్టారు. పెద్ద సంఖ్యలో వచ్చిన యువత జగన్ మాస్కులు ధరించి సందడి చేశారు. కాసేపు తొక్కిసలాట కూడా జరిగింది. జగన్ వచ్చిన వేళ... అసంఖ్యాక అభిమాన జనం ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. సరిగ్గా సాయంత్రం 3.55 గంటలకు తెల్లరంగుపై నీలం రంగు చారల చొక్కా వేసుకున్న జగన్ జైలు నుంచి బయటికొచ్చారు. లోపలి నుంచి జైలు ప్రధాన ద్వారం దాకా జగన్ను వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్రెడ్డి ఎత్తుకుని తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీ మహిళా నేతలు జైలు గేటు వద్ద గుమ్మడికాయతో ఆయనకు దిష్టి తీశారు. జగన్ బయటికి రాగానే దిక్కులు పిక్కటిల్లేలా జయజయ ధ్వానాలు చేశారు. ఆయనపై పూలవర్షం కురిపించారు. ప్రవాహంలా ఆయన వైపు తోసుకెళ్లారు. వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలిన జగన్కు, జైలు గేటు నుంచి ఎదురుగా నిలిపిన వాహనం వరకు చేరుకోవడం కూడా గగనంగా మారింది. అభిమానులందరికీ జగన్ రెండు చేతులూ జోడించి ఆప్యాయంగా అభివాదం చేశారు. వాహనం ఫుట్బోర్డుపై నుంచుని చుట్టూ చూస్తూ చేతులూపారు. చిరునవ్వుతో అందరినీ పలకరించారు. ఎట్టకేలకు భారీ పోలీసు భద్రత నడుమ జగన్ కాన్వాయ్ చంచల్గూడ నుంచి ముందుకు సాగింది. అడుగడుగునా అభిమాన జనం జగన్కు నీరాజనం పట్టారు. పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులంతా వాహనాల పెకైక్కి కూర్చుని మరీ ప్రయాణించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు సైతం ఆయనతో కరచాలనం చేసేందుకు దారిపొడవునా పోటీలు పడడం విశేషం. చంచల్గూడ నుంచి నల్లగొండ క్రాస్రోడ్స్, చాదర్ఘాట్, మొజాం జాహీ మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, తాజ్ డెక్కన్, జీవీకే, నాగార్జున సర్కిల్, కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, ఫిలింనగర్ రోడ్డు దాకా అడుగడుగునా ప్రజాభిమానం వెల్లువెత్తింది. అన్నిచోట్లా ఆగుతూ, అతి నెమ్మదిగా సాగుతూ ఐదున్నర గంటల అనంతరం జగన్ ఎట్టకేలకు రాత్రి 9.30 గంటలకు లోటస్పాండ్ నివాసానికి చేరుకున్నారు. చంచల్గూడ-చాదర్ఘాట్ చంచల్గూడ జైలు నుంచి చాదర్ఘాట్ దాకా అభిమానులు అసంఖ్యాకంగా రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. జగన్ కాన్వాయ్పై అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. ‘పులివెందుల పులిబిడ్డ’, ‘ఏపీ కా షేర్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఛావ్ణీ చౌరస్తాలో కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్సీపీ సాంస్కృతిక విభాగం కళాకారులు ఆటపాటలతో అలరించారు. మొజాంజాహీ మార్కెట్ చౌరస్తా వద్ద ఎటు చూసినా జన సందోహమే నెలకొంది. మార్కెట్ నుంచి బేగంబజార్, అఫ్జల్గంజ్ రోడ్లపైకి అభిమానులు భారీగా తరలివచ్చారు. మార్కెటింగ్ మంత్రి ముకేశ్ గౌడ్ క్యాంపు కార్యాలయం సమీపంలో రోడ్డుపై పూలు, పండ్ల వ్యాపారులు, స్థానికులు టపాకాయలు కాల్చారు. జగన్ను పూలమాలలతో సత్కరించారు. జగన్ వాహనం నుంచి దిగి అందరికీ అభివాదం చేశారు. ఆయనతో కరచాలనానికి అంతా పోటీ పడ్డారు. కాన్వాయ్ గాంధీభవన్ సమీపానికి చేరుకోగానే గోషామహల్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున నినాదాలతో స్వాగతం పలికారు. లక్డీకాపూల్ చౌరస్తాలో లంబాడాల నృత్యాలు వైఎస్సార్సీపీ ఖైరతాబాద్ నియోజకవర్గ నాయకురాలు విజయారెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచే పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో లక్డీకాపూల్ బస్టాప్ వద్దకు చేరుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై లంబాడా మహిళలు నృత్యాలతో ఆకట్టుకున్నారు. సాయంత్రం 6.10 నిమిషాలకు అక్కడికి చేరుకున్న జగన్ కారు నుంచి అభిమానులకు అభివాదం చేశారు. విజయారెడ్డి మహిళలతో కలిసి జగన్కు హారతిచ్చి ఘన స్వాగతం పలికారు. లక్డీకాపూల్ పాత ఫ్లైఓవర్ మీదుగా భారీ ర్యాలీగా సాయంత్రం 6.45 గంటలకు జగన్ ఖైరతాబాద్ చౌరస్తా వద్దకు చేరుకున్నారు. పంజాగుట్ట చౌరస్తాలో కోలాహలం జగన్ పంజాగుట్ట చౌరస్తాకు వస్తున్నారన్న సమాచారంతో సాయంత్రం 4 నుంచే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడి వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వేల సంఖ్యలో అభిమానులు బ్యాండుమేళాలతో నృత్యాలు చేస్తూ, బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. పంజాగుట్ట ఫ్లైఓవర్ మీదకూ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జిమీదనుంచి తమ ప్రియతమ నేతను చూడవచ్చని వారంతా భావించారు. చివరికి జగన్ అక్కడికి రావడం లేదని తెలిసి వారంతా నిరాశ చెందారు. చెన్నారెడ్డి విగ్రహం మీదుగా కాన్వాయ్ ముందుకుసాగడంతో అభిమానులు కాన్వాయ్ను అనుసరించారు. నాగార్జున సర్కిల్ సమీపంలోని ఫ్లై ఓవర్పైనుంచి అభిమానులు కాన్వాయ్పై పూలవర్షం కురిపించారు. మొరాయించిన స్కార్పియో నాగార్జున సర్కిల్ నుంచి కొద్దిగా ముందుకెళ్లగానే పంజాగుట్ట శ్మశాన వాటిక వద్ద జగన్ బులెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనం మొరాయించింది. దాంతో ఆయన మరో స్కార్పియోలోకి మారారు. టీవీ9, హెరిటేజ్ సంస్థల ముందు నుంచి కాన్వాయ్ వెళ్లినపుడు ఆయా సంస్థల ఉద్యోగులు కేరింతలు కొడుతూ జగన్కు అభివాదం చేయడం కనిపించింది. నాగార్జున సర్కిల్ నుంచి లోటస్పాండ్ వరకు మార్గమధ్యంలోని దుకాణాల నిర్వాహకులు జగన్ రాక కోసం ఆసక్తిగా నిరీక్షించారు. దుకాణాల బయటకు వచ్చి అభివాదం చేశారు. కేబీఆర్ పార్క్ చౌరస్తాలో వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని జగన్ కాన్వాయ్కి ఘన స్వాగతం పలికారు. అనంతరం జూబ్లీహిల్స్ చౌరస్తా కూడా జనసంద్రంగా మారింది. సరిగ్గా 9.30 గంటలకు జగన్ లోటస్పాండ్లోని తన నివాసానికి చేరుకున్నారు. అభిమానుల పూలవర్షం , మహిళల నృత్యాలు, యువకుల కేరింతల నడుమ జై జగన్ నినాదాలు మిన్నంటాయి. జగన్కు బాల్కనీ నుంచి కుటుంబ సభ్యులు అభివాదం చేశారు. జైలు వద్దకు వచ్చిన నాయకులు... ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, గొల్లబాబూరావు, బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, టి. బాలరాజు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కె.శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు మేకాశేషుబాబు, దేవగుడి నారాయణరెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, మాజీఎమ్మెల్యేలు పిల్లి సుభాష్చంద్రబోస్, వై.బాలనాగిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, జోగిరమేష్, కొడాలినాని, పేర్నినాని, గొట్టిపాటి రవికుమార్, మద్దాల రాజేష్ కుమార్, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, సామినేని ఉదయభాను లతో పాటు ఇతర నేతలు హెచ్ఏ రెహ్మాన్, కొల్లి నిర్మల, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పుత్తాప్రతాప్రెడ్డి, ఎంవీఎస్ నాగిరెడ్డి, కోటింరెడ్డి వినయ్రెడ్డి, బి.జనార్ధన్రెడ్డి, ఆదం విజయ్కుమార్, కాలేరు వెంకటేష్, దేప భాస్కర్రెడ్డి, కొలను శ్రీనివాసరెడ్డి, ఈసీ శేఖర్గౌడ్, కొండా రాఘవరెడ్డి, కె.సురేశ్రెడ్డి, ధన్పాల్రెడ్డి తదితర నాయకులున్నారు. అలాగే బంధువులు వైఎస్ వివేకానందరెడ్డి, కడప మాజీ మేయర్ పి.రవీంధ్రనాథ్రెడ్డి, సోదరుడు వైఎస్ అవినాష్రెడ్డి, బంధువు యశ్వంత్రెడ్డి తదితరులు మధ్యాహ్నమే జైలు వద్దకు చేరుకున్నారు. పోలీసులు ఊహించనంతగా.. సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం జైలు నుంచి విడుదల సందర్భంగా పోలీసులు చేపట్టిన భద్రతా చర్యలు తల్లకిందులయ్యాయి. నిఘా సంస్థల ఊహకు కూడా అందని రీతిలో అభిమానులు చంచల్గూడ జైలు వద్దకు చేరుకోవటంతో భద్రతా సిబ్బంది అవాక్కయ్యారు. జగన్ను స్వాగతించేందుకు వందల సంఖ్యలో జనం వస్తారని ఉన్నతాధికారులు భావించారు. అందుకు తగ్గట్టుగానే ఒక కంపెనీ బీఎస్ఎఫ్, మూడు ప్లాటూన్ల ఏపీఎస్పీ బలగాలు, దక్షిణ మండలం పరిధిలోని 10 మంది సీఐలు, 30 మంది ఎస్ఐలు, 90 మంది కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుళ్లతో పాటు తూర్పు, దక్షిణ మండలాలకు చెందిన టాస్క్ఫోర్స్ సిబ్బందితో డీసీపీ తరుణ్జోషి మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే జైలు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 8 గంటల నుంచే జనం పెద్ద సంఖ్యలో జగన్కు స్వాగతం పలికేందుకు జైలు వద్దకు వచ్చారు. జన ప్రవాహం చూస్తుండగానే అంతకంతకూ పెరుగుతూ పోయింది. సుదూర ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తరలివచ్చారు. నిఘా సంస్థలు కూడా ఇంత మంది వస్తారని ఊహించలేదు. అభిమానులను అదుపు చేసేందుకు ముళ్లకంచెలు, బారికేడ్లు ఏర్పాటుచేశారు. చంచల్గూడ జైలు ప్రధాన ద్వారం నుంచి మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలను జైలుకు చాలా దూరంలోనే నిలిపేశారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మీడియాను మాత్రమే జైలు ప్రధాన ద్వారం దాకా అనుమతించారు. అయితే అభిమానులు, కార్యకర్తలు బారికేడ్లు, ముళ్ల కంచెలు దాటుకుంటూ జైలు ప్రధాన గేటు ముందుకు దూసుకువచ్చారు. పోలీసులు లాఠీచార్జి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. అభిమానులు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా నిలబడ్డారు. ఎస్కార్ట్నూ నెట్టేసిన అభిమానులు... జగన్ వెళ్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి ఎస్కార్ట్గా పోలీసు వాహనాల కాన్వాయ్ వచ్చినప్పటికీ.. జైలు నుంచి కేవలం రెండు వందల మీటర్ల దూరం వరకు రాగానే అభిమానుల వాహనాలు ఒక్కసారిగా కాన్వాయ్ మధ్యలోకి దూసుకువచ్చాయి. దీంతో జగన్ కాన్వాయ్ ముందు, వెనకాల పోలీసు ఎస్కార్ట్ వాహనాలు చెల్లాచెదురయ్యాయి. -
జగన్ ఇంట పండుగ
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘమైన ఎదురు చూపులు ఫలించిన వేళ... పదహారు నెలల జైలు జీవితం అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంట అడుగుపెట్టిన ఆనంద క్షణాన... కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కళ్లు ఆనందంతో చెమర్చాయి. ఇన్ని రోజుల ఎడబాటు తరువాత లోటస్పాండ్లోని ఇంటికి చేరుకున్న కొడుకును చూసి తల్లి విజయమ్మ చలించిపోయారు. నాన్న కోసం అనుక్షణం తల్లడిల్లిన రెండు పసి హృదయాలు ఉద్వేగానికి లోనయ్యాయి. దుఃఖం-సంతోషం మిళితమైన అనిర్వచనీయమైన అనుభూతికి లోనైన జగన్ పిల్లలు హర్ష, వర్ష తండ్రిని వాటేసుకున్నారు. ఆయన భార్య భారతి ఉద్వేగానికి లోనయ్యారు. అన్న రాకతో షర్మిల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చంచల్గూడ జైలు నుంచి బెయిలుపై విడుదలైన జగన్ రాత్రి 9.30 గంటలకు ఇంటికి చేరుకున్నపుడు ఆయనకు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణుల నుంచి అపూర్వమైన రీతిలో స్వాగతం లభించింది. గత ఏడాది మే 27వ తేదీన సీబీఐ పిలుపుమేరకు వరుసగా మూడోరోజు విచారణ కోసం ఇదే ఇంటి నుంచి ఆ రోజు ఉదయం 9.30 గంటలకు భారీ భద్రత నడుమ బయలుదేరి వెళ్లిన జగన్ను అటునుంచి అటే అరెస్టు చేసి తీసుకుపోయారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు జగన్ కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తూనే ఉంది. కష్టాల కడలిని దాటుకుని జైలు నుంచి వచ్చిన జగన్కు ఆత్మీయులు ఎదురేగి ఇంటిలోకి తీసుకెళ్లారు. జైలు నుంచి ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన అభిమానుల స్వాగత ర్యాలీతో జగన్ ఇంటికి చేరుకుని అడుగు లోపల పెడుతున్న క్షణం అక్కడున్న అందరూ ఒక్కసారిగా ఉద్విగ్నానికి లోనయ్యారు. తల్లి, భార్య, పిల్లలు, సోదరి.. జగన్ను సాదరంగా ఆహ్వానించారు. గుమ్మడికాయతో దిష్టి తీసి హారతి పట్టారు. ‘వైఎస్సార్ అమర్ రహే... జై జగన్’ అంటూ అభిమానుల నినాదాలు మిన్నంటుతుండగా జగన్ ఇంట్లోకి అడుగు పెట్టారు. హాలులోకి ప్రవేశించగానే అక్కడ ఉన్న తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలు చల్లి వినమ్రంగా నివాళులర్పించారు. ఆ తరువాత తల్లి తన కుమారుడిని ముద్దాడారు. జగన్ కూడా అమ్మను ఆప్యాయంగా ముద్దాడారు. ఇల్లంతా పార్టీ అగ్రనేతలు, కార్యకర్తలు, బంధువులతో కిక్కిరిసి పోవడంతో ఆయన అందరినీ చిరునవ్వుతో పలుకరిస్తూ అభివాదం చేశారు. జగన్ విడుదల సందర్భంగా ఇల్లంతా పూలతో అలంకరించడంతో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఉదయం నుంచే జగన్ నివాసం బయట కార్యకర్తల, మీడియా కోలాహలం ఎక్కువగా కనిపించింది. ఉదయం నుంచే జనం అక్కడకు చేరుకోవడం ప్రారంభించారు. చంచల్గూడ జైలు నుంచి జగన్ బయటకు అడుగు పెట్టారనే వార్త తెలిసినప్పటి నుంచీ ప్రజలు ఆయన ఇంటి వద్ద బాణసంచా కాలుస్తూ, నృత్యాలు చేస్తూ కనిపించారు. ఆయన నివాసానికి చేరుకునే నలుమార్గాల్లోనూ ట్రాఫిక్ రద్దీ పెరిగి పోవడంతో పోలీసులు క్రమబద్ధం చేశారు. రాత్రి పదిన్నర గంటల తరువాత గానీ అక్కడ సద్దుమణగలేదు. -
జగన్నాథ యాత్రలా..
* జైలు నుంచి జనం మధ్యకు జగన్ * అభిమానుల పూల వర్షం నడుమ ఇంటికి * సునామీని తలపిస్తూ పోటెత్తిన జనప్రవాహం * చంచల్గూడ నుంచి లోటస్పాండ్ దాకా ప్రభంజనమే * 20 కి.మీ. దూరానికి ఏకంగా ఐదున్నర గంటల పైనే * అందరినీ పలకరిస్తూ, అభివాదం చేస్తూ సాగిన జగన్ * హారతి పట్టిన షర్మిల.. స్వాగతం పలికిన విజయమ్మ, భారతి జనం.. జనం.. జనం.. పిల్లలు మొదలుకుని చంటిపిల్లల తల్లుల దాకా... యువతీయువకుల నుంచి వయోవృద్ధుల దాకా... చంచల్గూడ నుంచి లోటస్పాండ్ దాకా ఎటు చూసినా సముద్రాన్ని తలపిస్తూ జనమే. 20 కిలోమీటర్ల దారి పొడవునా అడుగడుగునా జగన్నామ జపం చేస్తూ జన ప్రభంజనమే. 16 నెలల చెర వీడి తిరిగి తమ మధ్యకు వస్తున్న ప్రియతమ నేతను కళ్లారా చూసుకోవడానికి, హృదయపూర్వకంగా స్వాగతం పలకడానికి రాష్ట్రం నలుమూలల నుంచీ అశేష సంఖ్యలో అభిమానులు హైదరాబాద్కు పోటెత్తారు. మంగళవారం ఉదయానికే చంచల్గూడ వద్ద పిల్ల కాలువలా మొదలైన జన సందోహం మధ్యాహ్నానికల్లా వెల్లువలా మారింది. ఇక జన నేత బయటికి వచ్చే సమయానికైతే జైలు వద్ద జన ప్రవాహం అచ్చంగా సునామీనే తలపించింది. అంతా ఆత్రుతతో, ఎంతో ఉత్కంఠతో, అంతులేని ప్రేమాభిమానాలతో ఎదురు చూసిన సమయం ఎట్టకేలకు రానే వచ్చింది. మధ్యాహ్నం 3.55కు జైలు నుంచి జగన్ బయటికి అడుగు పెట్టారు. అంతే. కట్టలు తెంచుకున్న అభిమానంతో జనమంతా ఒక్కసారిగా ఆయనకేసి దూసుకెళ్లారు. తమ నేతను కళ్లారా చూసుకునేందుకు, కరచాలనం చేసేందుకు అంతా ఒక్కసారిగా మున్ముందుకు తోసుకెళ్లారు. ‘జై జగన్’ అంటూ పెద్దపెట్టున వారు చేసిన నినాదాలతో చంచల్గూడ పరిసరాలన్నీ ప్రతిధ్వనించాయి. ముందు జాగ్రత్తగా పోలీసులు పకడ్బందీగా ఏర్పాటు చేసిన మూడంచెల ముళ్ల కంచెలు కూడా అభిమాన జన ప్రవాహంలో కొట్టుకుపోయాయి. జాతీయ వార్తా చానళ్లన్నీ జగన్ విడుదలకు విశేష ప్రాధాన్యమిచ్చాయి. పలు చానళ్లు ప్రత్యేక బులెటిన్లు కూడా నడిపాయి. ఇక రాష్ట్ర చానళ్లయితే మధ్యాహ్నం నుంచీ రాత్రి దాకా ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అంతర్జాతీయ మీడియా కూడా జగన్ విడుదల వార్తను ప్రముఖంగా ప్రసారం చేసింది. ఇక ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ సైట్లయితే మంగళవారం పూర్తిగా జగన్మయంగా మారాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచీ టీవీలకే అతుక్కుపోయిన కోట్లాది మంది రాష్ట్ర ప్రజలు కూడా హర్షధ్వానాలు చేస్తూ, కేరింతలు కొడుతూ, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ, బాణసంచా కాల్చుకుంటూ సంతోషంలో మునిగిపోయారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. చెరగని చిరునవ్వుతో అభిమానులను పలకరిస్తూ, అడుగడుగునా కురిసిన పూల వర్షంలో తడుస్తూ జగన్ ఒక్కో అడుగూ ముందుకు సాగారు. వీలున్న చోటల్లా వాహనం దిగారు. అవ్వా అక్కలను పలకరించారు. పసిపిల్లలను ఎత్తుకుని ముద్దు చేశారు. అందరి అభినందనలను, అభివందనాలను ప్రేమాప్యాయతలతో స్వీకరించారు. జన నేతను తమ సెల్ ఫోన్లలో వీడియో తీసేందుకు దారి పొడవునా ప్రజానీకం పోటీలు పడ్డారు. జగన్ యాత్ర అచ్చంగా జగన్నాథ రథయాత్రను తలపించింది. మధ్యాహ్నం 3.55కు చంచల్గూడ వద్ద మొదలై, 20 కిలోమీటర్ల దూరంలోని లోటస్పాండ్ నివాసానికి చేరుకునేందుకు ఏకంగా ఐదున్నర గంటలు పట్టింది. రాత్రి 9.30 తర్వాత ఇంటికి చేరుకున్న జగన్కు ఘన స్వాగతం లభించింది. సోదరి షర్మిల హారతి పట్టారు. మాతృమూర్తి విజయమ్మ, భార్య భారతి, పిల్లలు ఆనందబాష్పాలు రాల్చారు. బంధుమిత్రులు సాదరంగా ఆహ్వానం పలికారు. -
లోటస్పాండ్లో జగన్
చంచల్గూడ జైలు నుంచి విడుదలయిన వైఎస్ జగన్ మంగళవారం రాత్రి 9.15 గంటల ప్రాంతంలో లోటస్పాండ్లోని తన నివాసానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు హారతిచ్చి ఆయనకు స్వాగతం పలికారు. జననేతకు అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. -
జగన్కు హారతిచ్చి స్వాగతించిన కుటుంబీకులు
హైదరాబాద్: వైఎస్ జగన్ మోహన్రెడ్డి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అభిమానులు, ఆప్తులు, కుటుంబీకులు, శ్రేయోభిలాషులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల ఆశీస్సుల మధ్య జననేత ఇంటికి చేరుకున్నారు. జగన్ కోసం బారులు తీరిన అభిమానులతో చంచల్గూడ నుంచి లోటస్పాండ్ వరకూ రహదారి జనగోదారిని తలపించింది. దీంతో కేవలం 11 కిలోమీటర్లు ప్రయాణించడానికి జగన్కు ఆరు గంటల సమయం పట్టింది. దారిపొడవునా ఘనస్వాగతం పలికిన అభిమానులకు అభివాదం చేసుకుంటూ జగన్ ముందుకు కదిలారు. చెరగని చిరునవ్వుతో ఆత్మీయులను పలకరిస్తూ కదిలారు. మధ్యమధ్యలో వాహనం నుంచి కిందికి దిగి అభిమానులను జగన్ పలకరించారు. మొత్తానికి ఆయన రాకకోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని 16 నెలలుగా ఎదురుచూస్తున్న కుటుంబీకుల కళ్లల్లో ఆనందం వెల్లువెత్తింది. అభిమానుల్లో ఆనందం అంబరాన్నంటింది. లోటస్పాండ్ పరిసరాలన్నీ జై జగన్నినాదాలతో హోరెత్తిపోయాయి. బాణాసంచా పేలుళ్లు అంబరాన్నంటాయి. ర్రాతి 9.20 గంటల ప్రాంతంలో లోటస్ పాండ్ లోని తన నివాసానికి జగన్ చేరుకున్నారు. కుటుంబీకులు జగన్కు హారతిచ్చి స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులను ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆయనపై పూలవర్షం కురిపించారు. తన నివాసంలోని తన తండ్రికి జగన్ నివాళులు అర్పించారు. సన్నిహితులను, అభిమానులను జగన్ అప్యాయంగా పలకరించారు. -
లోటస్ పాండ్ చేరుకున్న జగన్
-
హారతితో స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు
-
లోటస్ పాండ్ వద్ద పండుగ వాతావరణం
-
లోటస్ పాండ్ వద్ద పండుగ వాతావరణం
హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరై....నేడు విడుదల కానున్న సందర్భంగా ఆయన నివాసం లోటస్ పాండ్లో సందడి వాతావరణం నెలకొంది. అభినందనలు తెలిపేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చినవారితో లోటస్ పాండ్ పరిసరాల్లో పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. జగన్ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపేందుకు పార్టీ నాయకులు కూడా లోటస్ పాండ్కు తరలి వస్తున్నారు. -
జగన్ కు బెయిల్ లోటస్ పాండ్లో మిన్నంటిన సంబరాలు