సీమాంధ్ర ఉద్యోగుల బస్సుపై రాళ్లదాడి
Published Fri, Sep 6 2013 9:33 PM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు వస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసినట్టు ఖమ్మం జిల్లా పెనుమల్లి పీఎస్లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుమల్లి మండలం మండలపాడు వద్ద జరిగింది. రాళ్లదాడిలో చింతలపూడి ఈవోకు స్వల్పగాయాలైనట్టు తెలిసింది. ఈ ఘటనపై పెనుమల్లి పీఎస్లో సీమాంధ్ర ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.
ఇదిలాఉండగా, నల్గొండ జిల్లాలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో శనివారం జరిగేసభకు తెలంగాణవాదులు అడ్డుతగలకుండా చర్యలు తీసుకున్నారు. జాతీయరహదారులపై 10-15 కి.మి చొప్పున చెక్పోస్టులు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని డీఐజీ నవీన్చంద్ తెలిపారు.
Advertisement
Advertisement