Khammam
-
శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య.. ఖమ్మంలో ఉద్రిక్తత!
సాక్షి, ఖమ్మం: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శ్రీచైతన్య కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సదరు విద్యార్థిని తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని నందిని(16) ఆత్మహత్య చేసుకుంది. క్లాస్రూమ్లోనే నందిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో, కాలేజీ యాజమాన్యం ఆమె పేరెంట్స్కు సమాచారం అందించారు. వెంటనే నందిని మృతదేహాన్ని ఆసుపత్రి యాజమాన్యం మార్చురీకి తరలించింది. అయితే, విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నందిని మృతితో ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.కాగా, విద్యార్థిని మృతి నేపథ్యంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆసుపత్రి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగాయి. కాలేజీ యాజమాన్యంపై తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. కాలేజీపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
కాకతీయుల కాలంలోని అద్భుతమైన నిర్మాణం
జూలూరుపాడు: సుమారు ఏడు శతాబ్దాల క్రితం కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక కట్టడం కనుమరుగవుతోంది. కాకతీయుల కాలంలో తాగునీటి అవసరాలు, శత్రు సైన్యాల నుంచి తమను రక్షించుకోవడానికి దట్టమైన అడవి ఉన్న జూలూరుపాడు (Julurpadu) ప్రాంతంలో రాజాబావిని రాతికట్టడంతో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. సువిశాలమైన రాజాబావికి రెండు వైపులా నివాసం కోసం గదులు నిర్మించి ఉంటారని తెలుస్తోంది. ఈ బావి పైభాగాన తూర్పు, పడమరకు ఎదురెదురుగా 10 గదులు నిర్మించారు. బావిలోకి దిగేందుకు 30 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో రాళ్లతో మెట్లు నిర్మించారు. ఈ బావి చుట్టూ 8 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు గల పైకప్పు ఒకేరాయిలా కనిపిస్తోంది. పూడిక మట్టితో నిండిపోవడంతో బావి లోతు ఎంత అనేది తెలియడం లేదు. సున్నం, రాళ్లతో నిర్మించిన ఈ ప్రాచీన కట్టడం నేటికీ చెక్కుచెదరలేదు. అయితే, గుప్తనిధుల కోసం తవ్వకాలు, చెత్తాచెదారం పేరుకుపోవడం, బావిలో పూడిక పెరగడంతో నానాటికీ వైభవం కోల్పోతున్నా సంరక్షణపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దండయాత్రల నుంచి రక్షణకు.. శత్రువులు దండయాత్ర చేసినప్పుడు రక్షణ కోసం కాకతీయ రాజులు (Kakatiya Kings) పలు ప్రాంతాల్లో సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకునేవారని చరిత్ర చెబుతోంది. ఇందులో భాగంగానే వివిధ ప్రాంతాల మీదుగా సొరంగ మార్గాల ద్వారా ఖమ్మం ఖిలాకు వచ్చేవారని, కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు (వరంగల్)కోటకు, పాత ఖమ్మం (Khammam) జిల్లాలోని జూలూరుపాడు రాజుల బావి, భేతాళపాడు గుట్టలపై ఉన్న కోట వరకు వచ్చేవారని తెలుస్తోంది. జూలూరుపాడు నుంచి పాపకొల్లులోని పుట్టకోట, చండ్రుగొండ మండలం బెండాలపాడు గుట్టల్లో వెలిసిన శ్రీవీరభద్రస్వామి, కనగిరి గుట్టల్లోని ఆలయాలు, అప్పట్లో సైనికులు తలదాచుకునేందుకు ఏర్పాటు చేసిన కొన్ని స్థావరాలు నేటికీ కనిపిస్తాయి. అక్కడ ఉన్న సొరంగ మార్గాల ద్వారా శత్రువుల నుంచి రక్షణ పొందటంతోపాటు, శత్రువులపై మెరుపు దాడులు నిర్వహించేందుకు ఈ మార్గాలను ఉపయోగించుకునేవారు.గుప్తనిధుల కోసం తవ్వకాలు.. కాకతీయ రాజులు వజ్ర వైఢూర్యాలు, బంగారు అభరణాలను ఈ బావిలో భద్రపరిచే వారని నమ్ముతుంటారు. బావిలో గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారంతో ఏడేళ్ల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు బావి పైభాగాన ఉన్న గదుల్లో తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించినా అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో చారిత్రక కట్టడం ధ్వంసానికి గురవడంతో బావి ఆనవాళ్లు భావితరాలకు కన్పించకుండా పోయే పరిస్థితి ఏర్పడనుంది. తగ్గని నీటిమట్టం.. బావి నీటిని గతంలో ఈ ప్రాంత వాసులు తాగునీటిగా ఉపయోగించేవారు. బావిలో నీటిమట్టం తరగకపోవడంతో, బావిలో ఏమైనా గుప్త నిధులు ఉన్నాయా అని తెలుసుకునేందుకు కొన్నేళ్ల క్రితం గ్రామస్తులు ఆయిల్ ఇంజిన్లు పెట్టి నీటిని 15 రోజుల పాటు పంటలకు వినియోగించినా నీటిమట్టం ఎంతమాత్రం తగ్గలేదు. దీంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. బావిలోకి దిగుడు మెట్లు, బావి చుట్టూ తిరగటానికి వీలుగా ప్లాట్ఫామ్ ఉన్నాయి. ఈ తరం ఇంజనీర్లకు సైతం అంతు చిక్కని అద్భుత సాంకేతిక నైపుణ్యంతో రాతిబావిని నిర్మించడం విశేషం. అలాంటి బావి పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతూ పూడిక మట్టి, ముళ్ల పొదలతో నిండిపోయింది. బావి చుట్టూ ఉన్న స్థలం కూడా ఆక్రమణకు గురికావడంతో ముళ్ల పొదలు, చెట్లతో కళావిహీనంగా మారింది. చారిత్రక సంపద ధ్వంసం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాజాబావి నీళ్లు తాగే వాళ్లం 40 ఏళ్ల క్రితం రాజాబావి నీళ్లు తాగే వాళ్లం. వేసవి కాలంలో కూడా నీళ్లు బాగా ఉండేవి. ఈ నీటిని పంటల సాగుకూ ఉపయోగించేవారు. ప్రస్తుతం పూడికతో నిండిపోవడంతో పాటు ముళ్ల పొదలు, చెట్లు పెరగడంతో అటువైపు ఎవరూ వెళ్లడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మతులు చేయాలి. – చిన్నకేశి వెంకటేశ్వర్లు, జూలూరుపాడు చారిత్రక కట్టడాన్ని కాపాడాలి వందల ఏళ్ల నాటి చారిత్రక కట్టడం కనుమరుగు కాకుండా చూడాలి. రాజాబావి ధ్వంసమవుతుండటంతో భావితరాలకు కన్పించకుండాపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి చారిత్రక సంపదను రక్షించేందుకు ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టాలి. – తాళ్లూరి వెంకటేశ్వర్లు, జూలూరుపాడు బావి అభివృద్ధికి చర్యలు చేపట్టాలి రాజాబావి అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలి. కొన్ని దశాబ్దాలుగా అధికారులు పట్టించుకోకపోవడంతో ముళ్ల పొదలు, చెట్లతో నిండి కళావిహీనంగా మారింది. దీన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – నర్వనేని పుల్లారావు, జూలూరుపాడు చదవండి: వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే..పురాతన సంపదను కాపాడతాం కాకతీయుల కాలం నాటి పురాతన కట్టడమైన రాజా బావిని కాపాడుతాం. ఈ సమస్యను ఉన్నతాధికారులు, పర్యాటక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. స్థానిక గ్రామ పంచాయతీ నుంచి ఏమైనా చేయవచ్చేమో పరిశీలిస్తాం. ముళ్ల పొదలు, చెట్లు తొలిగించి, పూర్వవైభవం వచ్చేలా చర్యలు చేపడతాం. – డి.కరుణాకర్రెడ్డి, ఎంపీడీఓ జూలూరుపాడు -
ఆహా.. ఏమి టీ!
రోజూ ఇంట్లో పొద్దున్నే చాయ్ చేసి కుటుంబసభ్యులకు అందించే చేతులు.. ఇప్పుడు అదే చాయ్తో, అదే కుటుంబానికి ఆదాయాన్ని అందిస్తున్నాయి. స్వయం ఉపాధితోపాటు మరొకరికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో స్త్రీ టీ క్యాంటీన్లు నడుపుతున్న మహిళల విజయ ప్రస్థానమిది. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ చొరవతో ఏర్పాటైన ఈ క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి. దీంతో మరికొన్ని క్యాంటీన్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. - సాక్షి ప్రతినిధి, ఖమ్మంఉపాధి కల్పనే లక్ష్యం స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గం చూపించాలని భావించిన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్.. అందుకోసం వారితో టీ క్యాంటీన్లు ఏర్పాటు చేయించాలని సంకల్పించారు. అందుకోసం అన్ని శాఖల అధికారులతో చర్చించి ముందుడుగు వేశారు. టీ క్యాంటీన్కు ప్రత్యేక లోగో, బ్రాండ్ తయారు చేయించారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మొదటి విడతలో జిల్లాలో 41 షాపులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. తొలి షాపును కలెక్టరేట్ వద్దే ప్రారంభించారు.కలెక్టరేట్ ఆవరణలోని క్యాంటీన్ ఆదాయంతో పోలిస్తే గేటు బయట ఏర్పాటైన స్త్రీ టీ క్యాంటీన్కు రెట్టింపు ఆదాయం వస్తుండటంతో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 10, మండలాల్లో మరో 30కి పైగా మంజూరు చేశారు. ప్రస్తుతం 22 టీ క్యాంటీన్లను నడుస్తున్నాయి. మొత్తం 300 వరకు స్త్రీ టీ క్యాంటీన్లు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి ఏర్పాటుకు బ్యాంకు లింకేజీతో సంఘం తరఫున రూ.1.5 లక్షల వరకు రుణం అందిస్తున్నారు. సంఘంలోని మహిళలందరికీ ఒకటే కాకుండా అర్హత, ఆసక్తిని బట్టి ఒక్కొక్కరికి ఒక క్యాంటీన్ కేటాయిస్తున్నారు. నిరంతరం పర్యవేక్షణ... స్త్రీ టీ క్యాంటీన్ మంజూరు చేసే సమయంలో లబ్ధిదారులు గతంలో ఏదైనా వ్యాపారం చేశారా లేదా? అన్నది పరిగణనలోకి తీసుకున్నారు. యూనిట్ కేటాయించాక ఏ మేరకు లాభాలుంటాయనే అంశంపై రెండు నెలలపాటు మండల, జిల్లా సమాఖ్యల్లో చర్చించారు. చట్టాలు, పన్నుల చెల్లింపు, వ్యాపార నిర్వహణపై 400 మంది మహిళలకు హైదరాబాద్కు చెందిన నిపుణులతో శిక్షణ ఇప్పించారు. ఆపై రద్దీ ప్రాంతాలను గుర్తించి క్యాంటీన్లు ఏర్పాటుచేయించారు.అంతటితో వదిలేయకుండా మూడు నెలల పాటు వాటి నిర్వహణ, లాభాలను పరిశీలిస్తున్నారు. కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఈ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. యూనిట్లలో దివ్యాంగులకు 25 శాతం కేటాయించారు. టీతోపాటు కూల్డ్రింక్స్, ఇతరత్రా కలిపి కాస్త పెద్ద యూనిట్లు కూడా ఏర్పాటుచేయించాలని నిర్ణయించారు. ఇవి ఖమ్మం కార్పొరేషన్లో మూడు, మండలాల్లో 10 వరకు ఏర్పాటు కానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ఇవి గ్రౌండ్ అవుతాయి. పదేళ్ల తర్వాత కూడా కొనసాగాలనే సంకల్పంతో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు.ఇంకొకరికి ఉపాధి గ్రామంలో మాకు టీ స్టాల్ ఉన్నా పెద్దగా ఆదాయం ఉండేది కాదు. కలెక్టర్ ఇచ్చిన అవకాశంతో కలెక్టరేట్ వద్ద టీ స్టాల్ పెట్టాను. ఇప్పుడు మరొకరికి ఉపాధి కల్పిస్తున్నా. నెలకు రూ.30 వేల వరకు ఆదాయం వస్తుండగా, రూ.10 వేలు మిగులుతున్నాయి. – పోతగాని రాజేశ్వరి, స్త్రీ టీ క్యాంటీన్ ఓనర్, కలెక్టరేట్ బస్టాప్, ఖమ్మం. స్వయం ఉపాధి లభించింది.. మా స్త్రీ టీ క్యాంటీన్ గతనెల 4న ప్రారంభమైంది. ప్రస్తుతం టీ, కాఫీ, అల్లం టీ అమ్ముతున్నాం. కరెంట్ సౌకర్యం రాగానే పాలు, పెరుగు కూడా అమ్ముతాం. రోజురోజుకు వ్యాపారం పుంజుకుంటోంది. మొదటి నెల రూ.50 వేలు వచి్చంది. రుణ కిస్తీ చెల్లించగా.. కొంత మిగులుతోంది. – శ్రీరంగం గీత, జలగం నగర్, నవ్య గ్రామసమాఖ్య. మహిళల ఆర్థిక ఎదుగుదల కోసమే.. మహిళలు స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో స్త్రీ టీ క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. ప్రభుత్వం తరఫున యూనిట్ గ్రౌండింగ్ చేశాం కదా అని వదిలేయకుండా స్థల గుర్తింపు, ఏమేం అమ్మాలి, నాణ్యతపై క్షుణ్ణంగా చర్చించి, శిక్షణ ఇప్పించాకే ముందడుగు వేశాం. యూనిట్ ఏర్పాటయ్యాక నిత్యం పరిశీలిస్తూ ఏళ్ల తరబడి కొనసాగేలా చూస్తున్నాం. – ముజమ్మిల్ఖాన్, కలెక్టర్, ఖమ్మం. -
ఒకే ఒక్క స్టూడెంట్!
-
సామూహిక సీమంతం..
-
బీమా జ్యువెలరీ షోరూం ప్రారంభించిన రీతూ వర్మ
-
చెరువులోకి దూకిన వృద్ధ దంపతులు
-
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో విజయ్ మృతి
-
ఖమ్మం మార్కెట్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి,ఖమ్మంజిల్లా: ఖమ్మం వ్యవసాయ పత్తి మార్కెట్లో బుధవారం(జనవరి15) అగ్ని ప్రమాదం జరిగింది. మార్కెట్ యార్డ్ షెడ్డులో పత్తిబస్తాలు తగలబడ్డాయి. ఓ లాట్ పత్తి బస్తాలు దగ్ధమయ్యాయి. మంటలు ఎగిసిపడుతుండడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఖరీదు చేసిన పత్తి మంటల్లో కాలి పోవడంతో వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. కాగా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో పత్తి దగ్ధంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. మంటలను తక్షణమే అదుపులోకి తేవాలని అధికారులకు తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కమిషనర్,మార్కెట్ అధికారులతో మాట్లాడి తుమ్మల వివరాలు తెలుసుకున్నారు. -
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాగే, రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు.ఖమ్మంలోని కూసుమంచిలో మంత్రి పొంగులేటి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ..‘పేదవారి కల పది సంవత్సరాల్లో అలాగే నిలిచిపోయింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు. అనేక హామీలు ఇచ్చాము. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పెద్దలు కొల్లగొట్టారు. ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రభుత్వం చిత్త శుద్దితో ఉంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రభుత్వం ఇస్తుంది. డిసెంబర్ 13న మోడల్ హౌస్కి శంకుస్థాపన చేసుకుని సంక్రాంతి రోజున ప్రారంభించుకుంటున్నాం.అర్హులైన ప్రతీ పేదవారికి నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అనేక మంది అవాకులు చవాకులు పేలుతున్నారు. వాళ్ళు పూర్తి చేసింది లక్ష లోపు ఇళ్లు మాత్రమే. పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. దళారుల పాత్ర ఉండదు.. ఇందిరమ్మ కమిటీ సమక్షంలోనే ఎంపిక జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం పేదవారికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.రైతులకు రైతు భరోసా నిబంధనలు లేకుండా 12వేలు ఇస్తాం. పది సంవత్సరాల్లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం. నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. మీ దీవెనలతో మళ్లీ ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
వ్యవసాయ కూలీలతో ముచ్చటించిన మంత్రి పొంగులేటి
-
ఖమ్మం నగరంలో దొంగల హల్ చల్
-
అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?.. బీఆర్ఎస్కు డిప్యూటీ సీఎం సవాల్
సాక్షి, ఖమ్మం జిల్లా: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. లెక్కలపై అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ, మంచి పోషక విలువలు కలిగిన ఆహారం పిల్లలకు అందిస్తున్నామని తెలిపారు. నూతనంగా పెంచిన డైట్ ఛార్జీల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం పడుతుందన్నారు.‘‘రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు 2014 నాటికి 72450 కోట్ల రూపాయలు.. ప్రభుత్వంతో పాటు కొన్ని కార్పొరేట్ బ్యాంక్ల ద్వారా అప్పులు చేసింది. 5893 కోట్లు రాష్ట్ర విభజన జరిగే నాటికి అప్పు ఉంటే అవి 95 వేల కోట్లకు పెరిగింది. పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల 23 వేల కోట్లు చేసింది. అది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. మేము కూడ అప్పులు చేశామని అంటున్నారు. మీరు చేసింది తినేందుకు, మేము చేసేది అప్పు కట్టేందుకు’’ అంటూ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.మా ప్రభుత్వం ఏర్పడ్డాక 50 వేల కోట్లు.. మేము అప్పు వడ్డీ కలిపి 66 వేల 722 కోట్లు చెల్లించాం. 2014 రాష్ట్ర విభజన జరిగే నాటికి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు 6 వేల 400 కోట్లు ఉండేది. ఇంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి, తగుదునమ్మా అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మీద అరుస్తా ఉన్నారు. 10 ఏళ్లు పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు రేట్లు పెంచలేదు కాబట్టి అన్నంలో పురుగులు వంటివి వచ్చాయి. మళ్ళీ తిరిగి రెసిడెన్షియల్ స్కూల్లో టాయిలెట్స్ సరిగా లేవని మాట్లాడుతున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నది మీరే కదా?’’ అంటూ భట్టి ప్రశ్నించారు.‘‘మేము కేవలం సంవత్సర కాలంలోనే పూర్తి కాకముందే 21 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 66 వేల కోట్ల రూపాయలు అప్పు కడుతూ రైతుల అప్పు కడుతున్నాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని వేల కోట్లు రైతుల అప్పు కట్టలేదు. రైతు భరోసా 7 వేల 625 కోట్లు కల్పించాం. రైతు బీమా కట్టాం. 1500 రూపాయలు రైతు బీమా ప్రభుత్వం కట్టింది. ఆయిల్ ఫోం కి 40 కోట్లు విడుదల చేశాం. 30 వేల కోట్ల రూపాయలు రైతులకు మేము బోనస్ కాకుండా రైతుల కోసం మేము డిసెంబర్ నుండి వాటికి నేరుగా ఖర్చు పెట్టాం’’ అని భట్టి విక్రమార్క వివరించారు.పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ పంట నష్టపోయిన రైతులను పట్టించుకోలేదు. రైతుల పట్ల ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పని చేస్తుంది. భూమిలేని నిరుపేదల గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు. డిసెంబర్ 28వ తేదీన మొదటి ఇన్స్టాల్మెంట్ ఇస్తుంది. రైతుల పక్షాన, వ్యవసాయ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. సీఎం పైన, ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు ప్రచురిస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. 56 వేల మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందించాం. ఇంకా 22 వేల కోట్ల బడ్జెట్తో 3500 ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ప్రతిపక్ష పార్టీ వాస్తవాలను అవాస్తవాలుగా చూపించే ప్రయత్నం చేస్తుంది’’ అని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. -
అమెరికాలో కాల్పులు.. ఖమ్మం విద్యార్థి మృతి
-
అమెరికాలో కాల్పులు.. ఖమ్మం యువకుడి మృతి
సాక్షి,ఖమ్మంజిల్లా: తెలంగాణకు చెందిన యువకుడిపై అమెరికాలో దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు సాయితేజ అక్కడికక్కడే మృతిచెందాడు.సాయితేజ అమెరికాకు ఎమ్మెస్ చేయడానికి వెళ్లాడు. సాయితేజ మృతితో రామన్నపేటలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని ఖమ్మం తీసుకురావడానికి అధికారులు కృషి చేస్తున్నారు. -
తప్పులు చేసి నీతులు చెబుతారా?: బీఆర్ఎస్పై రేణుకా చౌదరి ఫైర్
సాక్షి, ఖమ్మం జిల్లా: బీఆర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి మండిపడ్డారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కొండలు.. గుట్టలు మింగిన వాళ్లు ఈ రోజు నీతులు చెబుతున్నారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఓ మాట మాట్లాడుతున్నారని.. సీఎంని, మంత్రులను కావాలనే విమర్శిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.ఈ రోజు హరీశ్రావు 8 గంటలకే మార్కెట్కి వెళ్లి పర్యటన చేయడం హాస్యాస్పదం. వ్యవసాయం గురించి తెలిసివాళ్లకు రైతులు ఏ సమయానికి మార్కెట్కు వస్తారో తెలుస్తుంది. మీకు ప్రాజెక్టులు, వాటి మీద వచ్చే కమిషన్ల గురించి మాత్రమే తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిద్రాహారాలు మాని పని చేస్తున్నారు. రైతులకు బేడీలు వేసిన వాళ్లు రైతుల గురించి మాట్లాడుతున్నారు.’’ అంటూ రేణుకా చౌదరి ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. ఆ అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీసుకొస్తుంది. ఉద్యోగులకు మొదటి తేదీ నాడే జీతాలు చెల్లిస్తోంది. సుజాతనగర్లో నకిలీ విత్తనాలు రైతులను నష్ట పరిచిన కంపెనీ యాజమాన్యంతో వారందరికీ పరిహారం చెల్లించేలా చేశాం. కొత్తగూడెం విమానాశ్రయం ప్రాసెస్ నడుస్తుంది. త్వరలోనే ఎయిర్పోర్ట్ రాబోతుంది’’ అని రేణుకా చౌదరి తెలిపారు. -
ఖమ్మం పత్తి మార్కెట్ లో పత్తి రైతులతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ
-
బోనస్ను బోగస్ చేసిన కాంగ్రెస్ సర్కార్: హరీష్ రావు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకు సాయం చేయలేని ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒక్కటేనని ఘాటు విమర్శలు చేశారు. అలాగే, ఈరోజు పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు గురువారం ఉదయం ఖమ్మంలోని పత్తి మార్కెట్ను సందర్శించారు. ఈ క్రమంలో రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, హరీష్ మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్లో ఒకటి ఖమ్మం పత్తి మార్కెట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. పత్తికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఆ బోనస్ను బోగస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం మద్దతు ధర వచ్చే పరిస్థితి కూడా లేదు.మార్కెట్ సెక్రటరీ ఇచ్చిన లెక్కల ప్రకారం రూ.6,500 మద్దతు ధర దాటడం లేదు. అకాల వర్షాలతో పంట దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కనీసం మద్దతు ధరకు కూడా పండించలేని పరిస్థితి ఉంది. రూ.500 బోనస్ దేవుడే ఎరుగు, కానీ మద్దతు ధరకు వెయ్యి రూపాయలు రైతు నష్టపోతున్నారు. రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది?. రైతులను ఆదుకోలేదు, వ్యవసాయ కూలీలను ఆదుకోలేదు, ఏ ఒక్క వర్గాన్నీ ఆదుకోలేదు. పత్తి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పత్తి మద్దతు ధర రూ.7,500 ఉండాల్సి ఉండగా, కేవలం రూ.6,500 మాత్రమే రైతులకు అందిస్తున్నారు. ఇవి మార్కెట్ యార్డ్ సెక్రటరీ ఇచ్చిన లెక్కలే. ఖమ్మం పత్తి మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి.శంకర్ రమాదేవి అనే రైతులు ఎనిమిది ఎకరాల్లో పత్తి పండిస్తే, కనీసం ఐదు క్వింటాళ్ల పంట కూడా రాలేదని, వచ్చిన దానికి కూడా మద్దతు ధర ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021లో రూ.11,000కు పత్తి కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు సగానికి సగం పత్తి ధర పడిపోయింది? ఇది దళారుల దోపిడీ వల్లే. రూ.7,520 మద్దతు ధరను పత్తి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు కనీసం రూ.500 బోనస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. దళారులు రూ.6,500కు పత్తి కొనుగోలు చేసి, సీసీఐ కేంద్రాలకు రూ.7,500కు అమ్ముతున్నారు.మిర్చి రైతులను కూడా ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసింది. గత సంవత్సరం రూ.23,000 మద్దతు ధర వస్తే, ఈసారి రూ.13,000 కూడా రావడం లేదు. మాయమాటలు చెప్పి రైతులను నట్టేట ముంచడం మంచిది కాదు. రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు. రూ.15,000 రైతు భరోసాను ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. రూ.15,000 కౌలు రైతులకు ఇస్తామని ఇవ్వలేదు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా, ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.ఒకరిపై ఒకరు పైచేయి కోసం పాకులాటమే తప్ప, ప్రజా సమస్యల కోసం పనిచేయడం లేదు. నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు ఖమ్మం జిల్లాలో పండితే, ఇప్పటివరకు 19 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఒక రైతుకైనా వడ్లకు బోనస్ వచ్చిందా?. సకాలంలో మిల్లులు అనుసంధానం చేయకపోవడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం దళారుల పాలైంది. సీసీఐ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం పెట్టామని చెబుతున్నా, వాస్తవానికి సీసీఐ కేంద్రాలు కనబడటం లేదు.ముఖ్యమంత్రి పత్తి కొనుగోలుపై సమీక్ష చేయడం లేదు. మద్యం అమ్మకాలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.. కానీ పత్తి, వరి కొనుగోళ్లపై సమీక్ష ఎందుకు చేయడం లేదు. మద్దతు ధరకు ధాన్యం కొనకపోతే, ఎవరికీ మెమోలు జారీ చేయడం లేదు. తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారేమో?. ఈరోజు పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అన్ని రకాల పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. -
ఆమె.. ఆయనలో సగభాగం.. భర్తకు పునర్జన్మనిచ్చిన భార్య
సాక్షి, ఖమ్మం జిల్లా: వివాహం జన్మజన్మల అనుబంధమని, చెరోసగంగా భార్యాభర్తలు జీవనం సాగించడం అన్యోన్య దాంపత్యమని పెద్దలు చెబుతారు. ఈ తరహాలోనే ఓ మహిళ తన భర్తను బతికించుకునేందుకు కాలేయదానం చేసి ఆయనలో సగభాగంగా మారడమే కాదు.. కలకాలం కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని పెళ్లి రోజున చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి నిలిచినట్లయింది.రఘునాథపాలెం మండలం పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను ఖమ్మంలోని ఏపీజీవీబీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య లావణ్య ఎల్ఎల్బీ చివరి సంవత్సరం చదువుతుండగా వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం శ్రీను అనారోగ్యం బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. కామెర్లు సోకగా కాలేయం సమస్య ఎదురైందని వైద్యులు గుర్తించారు.ఆపై హైదరాబాద్లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. అంతేకాక వివిధ పరీక్షల అనంతరం కాలేయ మార్పిడి మాత్రమే శ్రీనును బతికిస్తుందని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో కాలేయదానం చేసే వారి కోసం ఆరా తీస్తుండగా లావణ్యే ముందుకొచి్చంది. తన భర్తను కాపాడుకోవడానికి లివర్ ఇస్తానని చెప్పడంలో పరీక్షలు చేసిన వైద్యులు సరిపోతుందని నిర్ధారించారు. ఈ మేరకు లావణ్య లివర్ నుంచి 65శాతం మేర తీసిన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఈనెల 16న శస్త్రచికిత్స ద్వారా శ్రీనుకు అమర్చారు. ప్రస్తుతం దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉండగా కోలుకుంటున్నారని కుటుంబీకులు తెలిపారు.భర్తకు లివర్ దానం చేసి బతికించుకున్న భార్యఖమ్మం - పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను లివర్ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా లివర్ మార్చాల్సిందేనని వైద్యులు చెప్పారు. కానీ, ఎంత వెతికినా డోనర్ దొరక్కపోవడంతో అతని భార్య లావణ్య ముందుకొచ్చింది. ఆమె… pic.twitter.com/Jh0mA4IyaM— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024 -
తల్లి చెంతకు చేరేలోపే.. గుండెపోటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి
భారత్లో గుండె పోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. డ్యాన్స్ వేస్తూ, వ్యాయామం చేస్తూ, అలా కూర్చుని చనిపోయిన ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఈ మాయదారి గుండెపోటు బలితీసుకుంటుంది. తాజాగా అభం శుభం తెలియని ఓ చిన్నారి సైతం గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. సాక్షి, ఖమ్మం: అప్పటివరకు తల్లిదండ్రులతో ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారి గుండెపోటుతో మృతిచెందింది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెంకు చెందిన కుర్రా వినోద్, లావణ్య దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ప్రహర్షిక ఉంది. సోమవారం తల్లి లావణ్య గ్రూప్-3 పరీక్ష రాసేందుకు వెళ్లగా.. చిన్నారి నానమ్మ, తాతయ్యల వద్ద ఆడుకుంటూ ఉంది. సాయంత్రం ఇంటి తిరిగి వస్తున్న తల్లిని చూసి ప్రహర్షిక ఒక్కసారిగా ఆమె వైపు పరుగెత్తుకు వెళ్లింది. తల్లి కూడా రా..రా.. అంటూ కూతుర్ని చూస్తూ చేతులు చాచింది. కానీ అమ్మను చేరక ముందే ఆ పాప ఒక్కసారిగా కిందపడిపోయింది. తల్లి ఏమైందని ప్రశ్నించగా ఛాతీ వద్ద నొప్పి వస్తోందని చెప్పి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబసభ్యులు చిన్నారికి స్థానిక ఆర్ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి.. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ల ముందే మృతి చెందడంలో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు .చిన్నారి గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని వైద్యులు తెలిపారు. -
ఖమ్మం: అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం.. విద్యార్థికి గుండు కొట్టించి...
సాక్షి, ఖమ్మం: ఖమ్మం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. మెడికల్ విద్యార్థి హెయిర్ స్టయిల్పై వివాదం తలెత్తింది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాలలో ఓ విద్యార్థి భిన్నంగా హెయిర్ కట్ చేయించుకున్నాడని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థికి గుండు కొట్టించాడు. దీనిపై విద్యార్థి ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశాడు.సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ కావడం గమనార్హం. ఖమ్మం మెడికల్ కళాశాలలో ఈ ఏడాది చేరిన ములుగుకు చెందిన విద్యార్థి ఒకరు చైనా దేశస్తుల మాదిరి కటింగ్ చేయించుకున్నాడు. దీన్ని గమనించిన సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తూ ఇలా వ్యవహరించొద్దని సూచిచడంతో ఆ విద్యార్థి సెలూన్కి వెళ్లి జుట్టు ట్రిమ్ చేయించుకున్నాడు.కాగా, ఈ విషయం బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జన్)కు తెలియడంతో ఆగ్రహించిన ఆయన విద్యార్థిని సెలూను తీసుకెళ్లి ఏకంగా గుండు గీయించాడు. దీంతో మనస్తాపం చెందిన సదరు విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ను హాస్టల్ విధుల నుంచి తప్పించారు. కాగా, ఈ విషయమై ప్రిన్సిపాల్ను వివరణ కోరగా ఘటనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లడమే కాక విచారణకు ఫోర్మెన్ కమిటీని నియమించామని తెలిపారు. -
విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్
ఖమ్మం వైద్యవిభాగం/ నల్లగొండ టౌన్: ఖమ్మం మెడికల్ కళాశాలలో ఓ విద్యార్థి భిన్నంగా హెయిర్ కట్ చేయించుకున్నాడని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థికి గుండు కొట్టించాడు. దీనిపై విద్యార్థి ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశాడు. ఇక నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనలో విద్యార్థులతో పాటు జూనియర్ డాక్టర్ను సైతం సస్పెండ్ చేశారు. వివరాలు.. ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థికి ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ కావడం గమనార్హం. ఖమ్మం మెడికల్ కళాశాలలో ఈ ఏడాది చేరిన ములుగుకు చెందిన విద్యార్థి ఒకరు చైనా దేశస్తుల మాదిరి కటింగ్ చేయించుకున్నాడు. దీన్ని గమనించిన సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తూ ఇలా వ్యవహరించొద్దని సూచించడంతో ఆ విద్యార్థి సెలూన్కు వెళ్లి జుట్టు ట్రిమ్ చేయించుకున్నాడు. కాగా, ఈ విషయం బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జన్)కు తెలియడంతో ఆగ్రహించిన ఆయన విద్యార్థిని సెలూన్కు తీసుకెళ్లి ఏకంగా గుండు గీయించాడు. దీంతో మనస్తాపం చెందిన సదరు విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ను హాస్టల్ విధుల నుంచి తప్పించారు. కాగా, ఈ విషయమై ప్రిన్సిపాల్ను వివరణ కోరగా ఘటనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లడమే కాక విచారణకు ఫోర్మెన్ కమిటీని నియమించామని తెలిపారు. నల్లగొండ కాలేజీలో ర్యాగింగ్ కలకలం!నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ విద్యార్థినులను ర్యాగింగ్ చేశారనే ఆరోపణలతో ముగ్గురు సీనియర్ విద్యార్థులను, ఒక జూనియర్ డాక్టర్ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. సీనియర్ మెడికోలతో పాటు జూనియర్ డాక్టర్ కూడా విద్యార్థినులను ర్యాగింగ్ పేరుతో ఇబ్బందులకు గురిచేశారన్న ఫిర్యాదుతో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం విద్యార్థిని నెల రోజులు, ఇద్దరు నాలుగో సంవత్సరం విద్యార్థులను ఆరు నెలలు, ఒక జూనియర్ డాక్టర్ను మూడు నెలలపాటు సస్పెండ్ చేసినట్లు కాలేజీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే మొదటిసారి ర్యాగింగ్ విషయం బహిర్గతం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ర్యాగింగ్ విషయంపై కళాశాల ప్రిన్సిపల్ను వివరణ కోరడానికి ‘సాక్షి’ప్రయత్నించగా స్పందించలేదు. -
సర్కారు దవాఖానలో మందులు లేక ప్రజల ఇక్కట్లు
-
అందరి బంధువయా...‘వల్లభి’ రామయ్య!
ముదిగొండ: సామాజిక కట్టుబాట్లు కఠినంగా ఉన్న రోజుల్లో దళితులకు ఆలయ ప్రవేశం ఉండేది కాదు. కుల వివక్షత అడుగడుగునా తాండవించేది. అలాంటి రోజుల్లో దళితులు దేవుడిని తమ గుండెల్లో పెట్టుకుని రామాలయం నిర్మాణం చేపట్టారు. ఆ ఆలయానికి 90 ఏళ్ల నుంచి వారసత్వంగా ఇప్పటికీ దళితుడే పూజారిగా కొనసాగుతుండటం విశేషం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో ఉన్న ఈ ఆలయంలో శ్రీ రామచంద్రస్వామికి నిత్య పూజలు జరుగుతుండగా.. కులమతాలకతీకంగా అంతా దర్శించుకుని తరిస్తున్నారు.ఆ అవమాన భారంతోనే.. ఏళ్ల క్రితం గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ఉత్సవాలు జరుగుతుండగా కొందరు దళితులు గోడ పైనుంచి చూస్తుండగా అగ్రకుల పెద్దలు అవమానించారు. దీన్ని ఆత్మగౌరవ సమస్యగా భావించిన దళితులు రామాలయం నిర్మాణానికి ప్రతిన బూనారు. స్థల సేకరణ, ఆపై దేవాలయ నిర్మాణం చకచకా జరగగా.. దళితవాడలో సద్గురు బోధనానంద బోధనల ప్రభావంతో ఆధ్యాత్మిక చింతన అలవర్చుకున్న వంగూరి రామస్వామి తొలినాళ్లలో పూజారిగా బాధ్యతలు స్వీకరించారు. మొదట రాములవారి చిత్ర పటంతో నిత్యం పూజలు చేసేవారు. చిన్నగా నిర్మించిన ఆలయంలో పూజలు చేస్తున్న దళితులను అగ్రకులాల వారు హేళన చేసేవారు.దీంతో అగ్రకులాలు – దళితుల నడుమ వివాదం రాజుకుంది. అప్పటికే రామాలయ నిర్మాణం పేరుతో ఆత్మగౌరవ జెండాను ఎగురవేసిన దళితులు అగ్రకులాలపై సై అంటే సై అన్నారు. దీన్ని తట్టుకోలేక అగ్రకులాల వారు దాడులకు పాల్పడటంతో పలువురు గ్రామాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది.ఈ విషయం తెలిసిన గాంధేయవాది బన్సాలీ వల్లభి గ్రామానికి చేరుకుని దళితులు నిర్మించిన రామాలయంలోనే దీక్షకు పూనుకున్నారు. ఈ వార్త బాహ్య ప్రపంచానికి తెలియడంతో ఆనాటి ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోగా ఇరువర్గాల మధ్య రాజీ అనంతరం బన్సాలీ దీక్ష విరమించారు. భారమైనా బాధ్యతగా.. దళితులు రెక్కలు ముక్కలు చేసుకుని పొద్దస్తమానం కష్టపడితే కుటుంబాలను పోషించుకోవడమే కష్టం. అయినప్పటికీ కుటుంబ బాగోగుల కంటే మిన్నగా రాముడి కోసం, రాముడే శ్వాసగా వంగూరి రామస్వామి కుటుంబం జీవిస్తోంది. ఎంత కష్టమైనా.. తాము తిన్నా తినకపోయినా రామయ్యకు నిత్యపూజలు చేయడం, నైవేద్యం సమర్పించడాన్ని ఆనవాయితీగా మార్చుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కుటుంబ పోషణ మాటేమో కానీ.. వీరే కుటుంబానికి భారంగా మారినా రాముడి సేవలోనే జీవిస్తున్నారని చెప్పాలి.వైఎస్సార్ హయాంలో ధూపదీప నైవేద్యంఆలయంలో ఏటా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. వంగూరి రామస్వామి నిత్యం ధూప, దీప నైవేద్యాలు సమర్పిస్తూనే పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేవారు. వంగూరి రామస్వామి మరణానంతరం 1988లో ఆయన కుమారుడు చిన ముత్తయ్య పూజారిగా బాధ్యతలు స్వీకరించారు. 2021 వరకు ఆయన కొనసాగగా అనారోగ్య కారణాలతో చిన ముత్తయ్య మరణించాక ఆయన మనవడు అనంతరాములు పూజారిగా బాధ్యతలు స్వీకరించి ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈ క్రమాన అనంతరాములు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యాన అర్చకత్వం, పౌరోహిత్యంలో శిక్షణ పొందడం విశేషం. కాగా, ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి ఉన్న సమయంలో పలు ఆలయాల నిర్వహణ, అర్చకుల భృతి కోసం ధూప, దీప నైవేద్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో వల్లభి ఆలయానికి కూడా చోటు దక్కగా నెలనెలా నిధులు అందుతున్నాయి.రూ.40 లక్షలతో పునర్నిర్మాణంతొలినాళ్లలో నిర్మించిన ఆలయం పాతబడటంతో రూ.40 లక్షలతో నూతన ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయంలో 2023 మార్చి 17న ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్టాపనతో పాటు రాజగోపురం, కల్యాణమండపం, శిఖర ప్రతిష్టాపన భవనేస్వరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి చేతుల మీదుగా జరిగింది.దళిత పూజారి ద్వారా దగ్గరైన దేవుడు నా వయస్సు 80 ఏళ్లు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆలయం ఉంది. అప్పట్లో గానుగ సున్నంతో నిర్మించగా రాములవారి పటంతో శ్రీరామనవమి వేడుకలు వంగూరి చిన ముత్తయ్య జరిపించేవారు. ఇప్పుడు కులమత భేదం లేకుండా అంతా ఆలయానికి వస్తున్నారు. నూతన గుడి నిర్మించాక అభివృద్ధి చెందింది. దళిత పూజారి ద్వారా శ్రీరాముడు మాకు దగ్గరయ్యాడు. – సామల వీరన్న, వల్లభి గ్రామవాసి వారసత్వంగా పూజలు... తాతముత్తాతల నుంచి ఆనవాయితీగా వస్తుండటంతో పాటు టీటీడీలో వేదమంత్రాలు, పూజల్లో శిక్షణ తీసుకున్నాను. ఆలయంలో పూజలు చేస్తూనే సత్యనారాయణస్వామి వ్రతాలు, గృహప్రవేశాలు నిర్వహిస్తుంటా. సీఎంగా వైఎస్సార్ ఉన్నప్పుడు ప్రకటించిన ధూపదీప నైవేద్యం పథకం ద్వారా వచ్చే నిధులతో పాటు గ్రామస్తులు ఇచ్చే విరాళాలు ఆలయ అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. – వంగూరి అనంతరాములు, ప్రస్తుత పూజారి -
నడిపించేది నాన్న
కల నిజం అయ్యేది కష్టంతోనే. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆఫ్రీన్ కుటుంబానికి కలలు కనేంత వెసులుబాటు లేకపొవచ్చు. అయినా సరే.... ఆ తండ్రి కల కన్నాడు. ఆయన కూతురు కల కన్నది. ఆ కల సాకారం అయింది. ఖమ్మంకు చెందిన షేక్ ఆఫ్రీన్ జాతీయ స్థాయిలో అథ్లెట్గా రాణిస్తోంది....‘ఇది వేరే ప్రపంచం’ అనుకున్నారు అక్కాచెల్లెళ్లు సమ్రీన్, ఆఫ్రీన్. ఆ ప్రపంచం పేరు....స్టేడియం. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కొందరు రన్నింగ్ చేస్తున్నారు. కొందరు జంపింగ్ చేస్తున్నారు. ఒకవైపు క్రికెట్ ఆడుతున్నారు. కొందరు వాలీబాల్ ఆడుతున్నారు. వారి ఒంటికి పట్టిన చెమటల మాట ఎలా ఉన్నా...అందరి కళ్లల్లోనూ అంతులేని ఉత్సాహం పొంగిపొర్లుతుంది.ఆ ఉత్సాహమే పద్నాలుగు సంవత్సరాల ఆఫ్రీన్ను ఆ స్టేడియంకు దగ్గర చేసింది. ‘పప్పా... మేము నీతో పాటు రోజూ స్టేడియంకు వస్తాం’ అని అడిగారు. ఆఫ్రీన్ తండ్రి రహీమ్ హోంగార్డ్. స్పోర్స్›్టపర్సన్ కూడా. రోజూ తప్పకుండా స్టేడియంకు వచ్చి ఎక్సర్సైజ్లు చేయడం ఆయన దినచర్యలో భాగం. కుమార్తె విన్నపాన్ని విన్న రహీమ్... ‘అలాగే’ అన్నాడు. దీనికి ముందు ‘ఇక్కడికి వచ్చి ఏంచేస్తారు?’ అన్నాడు నవ్వుతూ. ‘మీలాగే ఎక్సర్సైజ్లు చేస్తాం’ అన్నారు సీరియస్గా.‘వీరిది ఒకటి రెండు రోజుల ఉత్సాహం. ఆ తరువాత అంతా మామూలే!’ అనుకున్నాడు రహీమ్. కానీ, అతడి అంచనా తప్పయింది. రకరకాల ఎక్సర్సైజ్లు చేయడం నుంచి ఆటల వరకు ఆఫ్రీన్కు స్టేడియం ప్రాణం అయింది. స్టేడియంకు రాని రోజూ అంటూ ఉండేది కాదు. ‘ఎప్పుడూ స్టేడియంలోనే కనిపిస్తావు. ఎప్పుడు చదువుకుంటావు!’ అని అడిగే వాళ్లు కొందరు.‘స్టేడియంలో కూడా చదువుకుంటూనే ఉన్నాను’ అని ఆఫ్రీన్ అన్నదో లేదు తెలియదుగానీ స్టేడియంలో తాను ఆటల ప్రపంచాన్ని చదువుతోంది. కట్ చేస్తే... షేక్ అఫ్రీన్ ప్రస్తుతం ఖమ్మంలోని ‘కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్’లో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు అథ్లెటిక్స్లోనూ రాణిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పొటీల్లో ఎన్నో పతకాలు సాధించింది. ఎంతో మంది పేదింటి అమ్మాయిలకు రోల్మోడల్గా నిలుస్తోంది. మొదట్లో కుమార్తెల ఉత్సాహానికి సంతోషపడిపొయిన రహీం ఆ ఇద్దరికి పరుగు పందెం నిర్వహించాడు. రన్నింగ్లో వారి ప్రతిభను చూసి ‘ఈ వజ్రాలకు సానబెట్టాల్సిందే’ అనుకున్నాడు. అదే సమయంలో కోచ్ గౌస్.... ‘ఆఫ్రీన్కు శిక్షణ ఇస్తే మంచి అథ్లెట్ అవుతుంది’ అన్నాడు. అతడి నోటి వాక్కు ఫలించింది. ఆఫ్రీన్ తో పాటు సమ్రీన్ కూడా అథ్లెటిక్స్లో రాణించింది. జాతీయ, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్లో పాల్గొంది. ఆఫ్రీన్ ట్రాక్ రికార్డ్2016లో మహబూబ్నగర్లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 600 మీటర్ల పరుగులో మూడో స్థానం, 2017లో హైదరాబాద్లో జరిగిన తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో 800 మీటర్ల పరుగులో మొదటిస్థానం, 400 మీటర్లలో రెండోస్థానంలో నిలిచింది. (నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!)2022లో జరిగిన తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో 300 మీటర్ల పరుగులో ద్వితీయస్థానం, లాంగ్జంప్లో ద్వితీయస్థానం సాధించింది. 2023లో వరంగల్లో నిర్వహించిన సౌత్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో ట్రిపుల్జంప్లో 5వ స్థానంలో నిలిచింది. 2023లో కరీంనగర్లో జరిగిన తెలంగాణ సౌత్జోన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో ట్రిపుల్ జంప్లో ద్వితీయస్థానంలో నిలిచింది. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి 19 వరకు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించినసౌత్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో మిడిల్రిలేలో 3వ స్థానం సాధించింది.ఇంకా ఎన్నో సాధించాలి...సాధిస్తానుపొటీల్లో పాల్గొనేటప్పుడు ఆటపైనే ధ్యాస ఉంటుంది. ఫలితం గురించి ఆలోచించను. మా నాన్న కూడా అదే చెబుతారు. నీ వంతుగా శ్రమిస్తే ఓడిపొయినా ఫర్వాలేదని ధైర్యం చెబుతారు. నేను పొటీల్లో రాణించడానికి నాన్న, అమ్మ కష్టపడుతున్నారు. అమ్మ జమీలా అసలు చదువుకోలేదు. నేను అథ్లెటిక్స్లో పాల్గొన్న వీడియోలు చూస్తూ నన్ను అభినందిస్తోంది. దేశం తరుపున పొటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించాలనేదే లక్ష్యం. – షేక్ ఆఫ్రీన్– బొల్లం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మంఫొటోలు: రాధారపు రాజు -
ప్రైవేట్కు దీటుగా ‘సింగరేణి’ విద్య
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఉన్నత విద్యాప్రమాణాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం సంస్థ పరిధిలో ఉన్న 9 పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యనందించేందుకు కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం (2025–26) నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలుకు సన్నాహాలు చేస్తోంది. తొలుత రామగుండం–2 ఏరియాలోని సెక్టార్–2 పాఠశాలను పైలట్ ప్రాజెక్టుగా గుర్తించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిబంధనల ప్రకారం తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరీ, మైదానం, కంప్యూటర్ ల్యాబ్ తదితర ఏర్పాట్లపై ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు (డైరెక్టర్) పర్యవేక్షించి అనుమతుల కోసం సన్నాహాలు మొదలుపెట్టారు.‘కారుణ్య’ ఉద్యోగుల పిల్లలపై నజర్గత ఏడేళ్లలో సింగరేణిలో కారుణ్య నియామకాల ద్వారా సుమారు 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. వీరిలో కొందరికి వివాహం జరగగా, పలువురు అవివాహితులు కూడా ఉన్నారు. అయితే వివాహమైన వారు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించకుండా.. వారికి మెరుగైన భవిష్యత్ ఇచ్చేందుకు కేంద్రీయ విద్యాలయాలు, ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా సింగరేణి విద్యావ్యవస్థను బలోపేతం చేయనున్నారు. సింగరేణిలో పాఠశాలల ఏర్పాటు సమయం (1975)లో అడ్మిషన్ కావాలంటే ఉన్నతాధికారి సిఫారసు కావాల్సి వచ్చేది. కానీ నేడు సింగరేణి వ్యాప్తంగా ఉన్న తొమ్మిది పాఠశాలలో కేవలం వెయ్యి మంది మాత్రమే చదువుతున్నట్లు అంచనా. ఈ తరుణంలో సింగరేణి పాఠశాలలను మళ్లీ అగ్రస్థానంలో నిలిపేలా సీఎండీ ఎన్.బలరామ్ ప్రత్యేక దృష్టి సారించారు.తరగతులపై అనునిత్యం పర్యవేక్షణగతంలో సింగరేణి పాఠశాలలో 10వ తరగతి ఫలితాలపైనే దృష్టి ఉండేది. కానీ ప్రస్తుతం అనునిత్యం అన్ని తరగతుల నిర్వహణ, పరీక్షలకు ప్రశ్నపత్రాల తయారీ, ఫలితాలపై అధ్యయనం చేస్తున్నారు. అంతేకాక డైరెక్టర్ స్థాయి అధికారులు వారంలో ఒక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచి ఉన్నత స్థానాలకు చేరుకునేలా సన్నద్ధం చేసేందుకు ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నారు.అన్ని రంగాల్లో రాణించేలా కృషిసింగరేణిలో విద్యావ్యవస్థ ప్రక్షాళనతో పాటు నూతన కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తాం. ప్రతి ఆరు నెలలకోసారి జాబ్మేళాలు నిర్వహిస్తాం. సింగరేణి విద్యాసంస్థలో చేరితే కళాశాల చదువు పూర్తయ్యేసరికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలనేది మా భావన. అలాగే, ఇంగ్లిష్ ల్యాబ్లు కూడా ఏర్పాటుచేస్తున్నాం. – గుండా శ్రీనివాస్, ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీకార్మికుల పిల్లల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంసింగరేణి కార్మికుల పిల్లలను రూ.లక్షలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. అలాకాకుండా వారికి మంచి భవిష్యత్ను అందించేలా సింగరేణి పాఠశాలల్లోనే బోధన అందుబాటులోకి తీసుకొస్తున్నాం. పాఠశాల విద్యతో పాటు పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టి నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా ఉజ్వల భవిష్యత్ అందిస్తాం.– ఎన్.బలరామ్, సింగరేణి సీఎండీప్రతివారంలో ఒక పరిశ్రమకు..విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాల కోసం ఆసక్తి పెంచేలా వారంలో ఒకరోజు పరిశ్రమకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఆయా పరిశ్రమల్లో ఏం తయారుచేస్తారు, ముడిసరుకు లభ్యత, తయారైన ఉత్పత్తుల మార్కెటింగ్పై విద్యార్థులకు అవగాహన కల్పించి వారిలో ఆలోచనాశక్తిని పెంపొందించాలనేది ఈ కార్యక్రమ లక్ష్యం. అంతేకాకుండా ఆటపాటలు, మార్షల్ ఆర్ట్స్పై నిత్యం రోజూ ఒక గంటపాటు తరగతులు నిర్వహిస్తున్నారు. -
ఉపాధ్యాయులూ మేల్కొనండి!
వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గడువు దగ్గర పడుతున్నా.. ఓటు నమోదుపై ఉపాధ్యాయులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లుండగా.. ప్రస్తుతం మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 10,089 మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.నవంబర్ 6 వరకు గడువు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సెప్టెంబర్ 30న ఓటరు నమోదు షెడ్యూల్ను విడుదల చేసింది. నవంబర్ 6వ తేదీ ఆఖరు తేదీగా ప్రకటించింది. గత ఎన్నికల ఓటరు జాబితా రద్దు చేశామని.. గతంలో ఓటు ఉన్న వారు కూడా తిరిగి నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు చెప్పారు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ఓటర్ నమోదుకు అవకాశం కల్పించారు. ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు దాటింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 12 కొత్త జిల్లాలున్నాయి. అందులో ఇప్పటి వరకు 10,089 మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. పెరిగిన ఉపాధ్యాయుల సంఖ్యఓటరు నమోదుకు ఆఖరి తేదీ నవంబరు 6. ఇంకా 10 రోజులు మాత్రమే గడువుంది. గత ఎన్నికల్లో 20,880 మంది ఓటర్లు ఉన్నందువల్ల ఈసారి ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరిగింది. ఓటర్ల సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. ప్రధానంగా హైస్కూల్ ఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, బీఈడీ కళాశాలల అధ్యాపకులతోపా టు ప్రభుత్వ రికగ్నైజ్డ్ హైస్కూళ్లు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఓటర్ నమోదుపై స్పందించాల్సి ఉంది. నివాసమే ప్రామాణికం..ఓటర్లుగా ఉపాధ్యాయులు, అధ్యాపకుల నమోదు గడువు నవంబర్ 1 అని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ తేదీ కంటే ముందు కనీసం 3 ఏళ్లు కచ్చితంగా బోధించి ఉండాలి. ఎన్నిచోట్ల పని చేసినప్పటికీ 3 ఏళ్లు బోధించినట్లు సర్వీస్ సర్టిఫికెట్తో పాటు సంబంధిత విద్యాశాఖాధికారి సంతకం తప్పనిసరిగా ఉంటేనే ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. నివాస ప్రాంతాన్నే ఎన్నికల సంఘం ఓటర్ నమోదుకు ప్రామాణికంగా నిర్ణయించింది. ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ చిరునామా ఆధారంగా ఓటు నమోదు చేసుకోవాలి. బోధన ఎక్కడ చేసినప్పటికీ అది ప్రామాణికం కాదు. ఉదాహరణకు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నల్లగొండలో నివసిస్తున్న వ్యక్తి వరంగల్ జిల్లాలో పనిచేస్తే.. ఆ వ్యక్తి నల్లగొండ చిరునామాతోనే ఓటు నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ మూడు జిల్లాల్లో ఎక్కడైనా ఉపాధ్యాయుడు పని చేస్తూ.. కరీంనగర్ జిల్లాలో నివసిస్తుంటే ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉండదు. ఓటు నమోదుకు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా వారి చిరునామాకు వెళ్లి.. దరఖాస్తుదారు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడా? లేడా? అనేది సిబ్బంది పరిశీలించాలి. ఒకవేళ అక్కడ నివాసం లేకుంటే ఆ దరఖాస్తును తిరస్కరిస్తారు. ఉపాధ్యాయులు ఎక్కడ నివాసం ఉంటే.. అక్కడ ఓటు నమోదు చేసుకుంటేనే ఆ దరఖాస్తు చెల్లుబాటవుతుంది. నివాసం ప్రామాణికంగానే దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారి కోరుతున్నారు. -
‘ఇంటిగ్రేటెడ్’లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య
ఖమ్మం రూరల్: బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ సమీపంలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న పాఠశాల నిర్మాణ పనులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలసి మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో 28 పాఠశాలలకు శంకుస్థాపన చేయగా.. పాలేరు నియోజకవర్గానికి స్థానం దక్కడం ఆనందంగా ఉందని అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సుమారు 3 వేల మంది పిల్లలకు విద్యతో పాటు క్రీడల్లో శిక్షణ ఉంటుందన్నారు. పది వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణమే.. విద్యారంగంపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమని పొంగులేటి తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పెండింగ్లో పెట్టిన 22 వేల మంది ఉపాధ్యాయుల పదోన్నతులు, 34 వేల మంది బదిలీలను వివాదాలకు తావు లేకుండా పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజుమ్మిల్ ఖాన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు మంత్రులున్న ఖమ్మానికి ఏంటీ కర్మ
-
Harika Dronavalli: ఖమ్మం కోడలు బంగారం!
ఖమ్మం స్పోర్ట్స్: చదరంగంలో తిరుగులేని క్రీడాకారిణిగా ఎదిగిన ద్రోణవల్లి హారికకు జిల్లా క్రీడాకారులు, ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హంగేరి రాజధాని బుడాపెస్ట్లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో భారత పురుషులు, మహిళల జట్లు పసిడి పతకాలు సొంతం చేసుకున్నాయి. అయితే, జట్ల విజయంలో కీలకంగా వ్యవహరించిన ద్రోణవల్లి హారిక ఖమ్మం కోడలే కావడంతో సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపిస్తున్నారు. హారిక స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లా కాగా, ఖమ్మంకు చెందిన చంద్ర వెంకటేశ్వర్లు కుమారుడు చంద్ర కార్తీక్తో 2018లో వివాహం జరిగింది. తొలినాళ్ల నుంచి అంతర్జాతీయ టోర్నీలపై దృష్టి సారించిన ఆమెకు 2022లో కుమార్తె జన్మించింది. అయినప్పటికీ భర్త, పాపతో కలిసి అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంటూ నైపుణ్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే అర్జున, పద్మశ్రీ అవార్డులు అందుకున్న హారిక ఇప్పుడు చెస్ ఒలింపియాడ్లో సత్తా చాటడం విశేషం. -
తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు ప్యాకెట్
ఖమ్మంరూరల్: దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం తీసుకొచ్చిన లడ్డూలో పొగాకుతో కూడిన ప్యాకెట్ రావడంతో భక్తులు నివ్వెరపోయిన ఘటన ఇది. ఖమ్మం రూరల్ మండలంలోని గొల్లగూడెం గ్రామపంచాయతీ శివారు కార్తికేయ టౌన్షిప్కు చెందిన దొంతు పద్మావతి బంధువులతో కలిసి ఈనెల 19న తిరుమల వెళ్లారు. అక్కడ 20వ తేదీన సర్వదర్శనం ద్వారా స్వామిని దర్శించుకున్నాక లడ్డూలు కొనుగోలు చేయగా ఆదివారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. కాగా, ఉదయం లడ్డూ ప్రసాదాన్ని ఇంట్లో దేవుడి వద్ద ఉంచి బంధువులకు ఇచ్చేందుకు ముందు కొద్దిగా నోట్లో వేసుకోగా పొగాకు వాసన వచ్చింది. దీంతో పద్మావతి లడ్డూ మొత్తం చూడగా అందులో పొగాకుతో కూడిన ప్యాకెట్ కనిపించింది. కాస్త నమిలిన పొగాకును కాగితంలో చుట్టగా అది లడ్డూలో కలిసిపోయి ఉంది. దీంతో ఆమె పలువురికి చూపించగా పద్మావతితో పాటు వెళ్లిన మిగతా వారు తీసుకొచ్చిన వారు తెచ్చిన లడ్డూలు బాగానే ఉన్నాయి. కాగా, పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో ఇలా రావడంపై పద్మావతి సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
రాళ్లలో రతనాలు పండేనా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భారీ వర్షాలు, వరదలతో ఖమ్మం జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం 68 వేల ఎకరాలకుపైగా దెబ్బతినగా.. అందులో ఇందులో 5 వేల ఎకరాలకుపైగా ఇసుక, రాళ్ల మేటలు వేశాయి. ఈ భూములను సాగుయోగ్యంగా మార్చడం ఎలాగని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు పరిహారం ఇస్తామని ప్రకటించిందని.. కానీ ఇసుక, రాళ్ల మేటలు వేసిన తమ భూముల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ భూములను సాగుయోగ్యం చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతాయని.. ప్రభుత్వం అదనంగా పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఆనవాళ్లు కూడా లేనంతా.. భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో మున్నేరు, ఆకేరు విలయ తాండవం చేశాయి. వీటి పరీవాహకంలో వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. నష్టంపై సర్వే చేపట్టిన అధికారులు.. 33శాతంపైన దెబ్బతిన్న పంటలనే పరిగణనలోకి తీసుకుని, 68,345 ఎకరాల్లో నష్టం జరిగినట్టు గుర్తించారు. వీటికి ఎకరాకు రూ.10 వేల చొ ప్పున పరిహారం అందనుంది. అయితే కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, నేలకొండపల్లి, మధిర, ఎర్రుపాలెం, బోనకల్, తల్లాడ తదితర మండ లాల్లో వేల ఎకరాల్లో భూములు సాగుయోగ్యం కాకుండా పోయాయి. ముఖ్యంగా తిరుమలాయపాలెం మండ లం రాకాసితండాలో సారవంతమైన మట్టి అంతా కొ ట్టుకుపోయి రాళ్లు తేలి, ఇసుక మేట వేసింది. పంటలు సాగు చేయాలంటే.. భూములను బాగు చేసుకోవాలి. ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చవుతాయని రైతులు వాపోతున్నారు.సర్వం కోల్పోయి.. భూమీ దెబ్బతిని.. తిరుమలాయపాలెం మండలం అజ్మీరా తండా పరిధిలోని రాకాసి తండాకు చెందిన భూక్యా దేశ్యా తన మూడెకరాలకు తోడు మరో ఎకరం కౌలుకు తీసు కుని మిర్చి సాగు చేశారు. రూ.4 లక్ష లు వెచ్చించి మలి్చంగ్ పద్ధతిలో నా టాడు. కానీ ఆకేరు వరదతో పంట ఆనవాళ్లు లేకుండా పోయింది. పైగా పొలం అంతా ఇసుక మేటలు వేసింది. వరదలతో ఇంట్లో ఉన్న సర్వం కో ల్పోయామని.. జీవనాధారమైన భూమి కూడా బా గా దెబ్బతిన్నదని దేశ్యా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. -
అక్రమ కట్టడాలు జలమయం
-
వరద బాధితులను ఆదుకుంటాం
కూసుమంచి/తిరుమలాయపాలెం/నేలకొండపల్లి: గతనెల 31 నుంచి ఈనెల 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో రూ. 10,300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా లోని కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో శనివారం మంత్రి పర్యటించారు. పాలేరు ఎడమ కాల్వ గండి మరమ్మతులను త్వరగా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాల ని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గంటల వ్యవధిలో 37 నుంచి 38 సెం.మీ. మేర వర్షం కురవడంతో అన్ని విభాగాల్లో నష్టం ఎదురైందని చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా, సీఎం వినతితో కేంద్ర బృందాలు పర్యటించాయని తెలిపారు.కేంద్ర ప్రభుత్వానికి వరద సాయం కోసం విన్నవించడమే కాక ప్రజలను ఆదుకునే దిశగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కేంద్రం నుంచి సాయం అందినా, అందకున్నా వరద బాధితులను ఆదుకుంటామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం త్వరలో అందిస్తామని, పూర్తిగా ఇళ్లు నష్టపోయిన ప్రజలకు నెలాఖరులోగా ఇందిరమ్మ పథకం ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఎనిమిది పోలీసు బెటాలియన్ల నుంచి 100 మంది సిబ్బందిని ఎంపిక చేసి వరద సహాయక చర్యలపై శిక్షణ ఇప్పించి కావాల్సిన పరికరాలు సమకూరుస్తామని తెలిపారు. వచ్చేవారం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను సీఎం రేవంత్రెడ్డి నేతృత్వాన కలిసి విపత్తు సాయం కోసం ప్రతిపాదనలు అందిస్తామని వెల్లడించారు. -
పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి..
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరు వరద ముంపు బాధితులకోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు ఖాళీ అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వరద నీరు తగ్గడంతో ముంపు బాధితులంతా పునరావాస కేంద్రాలను వీడి ఇళ్లకు చేరుకున్నారు. ఈనెల 1న మున్నేరుకు వచి్చన భారీ వరదలతో ఖమ్మం నగరంలోని 13 డివిజన్లతో పాటు ఖమ్మం రూరల్ మండలంలోని 20 కాలనీలు నీట మునిగాయి. వందలాది ఇళ్లను వరద ముంచెత్తగా.. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని రామన్నపేట ప్రభుత్వ పాఠశాల, జూబ్లీ క్లబ్, స్వర్ణభారతి కల్యాణ మండపం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ధంసలాపురం పాఠశాలల్లో 8,200 మందికి, ఖమ్మం రూరల్ మండలంలో టీసీవీ రెడ్డి ఫంక్షన్హాల్, రామ్లీలా ఫంక్షన్హాల్, పోలేపల్లి స్ఫ్రింగ్ లీఫ్ పాఠశాల, సాయిబాబా ఆశ్రమంలో 2,300 మందికి ఆశ్రయం కలి్పంచి ఇన్నాళ్లూ భోజనం సమకూర్చారు. బాధితులు వెళ్లిపోవడంతో కేంద్రాల మూసివేత వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు పూర్తికావడం, ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకోవడంతో పునరావాస కేంద్రాలను వీడి ఇళ్లకు చేరుకున్నారు. ఈనెల 10 వరకు ప్రభుత్వ యంత్రాంగం పునరావాస కేంద్రాలను నిర్వహించగా.. బాధితులు ఇళ్లకు వెళ్లిపోతుండడంతో శుక్రవారం పూర్తిగా మూసివేసింది. అయితే, ఇళ్లు పూర్తిగా నేలమట్టమైన వారు మాత్రం ఎక్కడకు వెళ్లాలో దిక్కుతోచక.. మిగిలిన ఒకటి, అరా సామగ్రితో చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. కొనసాగుతున్న దాతల చేయూతవరద బాధితులకు పలువురు నిత్యావసరాలతో పాటు భోజనం అందిస్తున్నారు. అనేక మంది ఇళ్లను కోల్పోయి వండుకునేందుకు సామగ్రి లేక భోజనం కోసం ఇబ్బంది పడుతుండగా.. వారికి స్వచ్ఛంద సేవా సంస్థలు భోజనం సమకూరుస్తున్నాయి. శుక్రవారం కూడా ఖమ్మం రూరల్ మండలంలోని రాజీవ్ గృహకల్ప, ఖమ్మంలోని వెంకటేశ్వరనగర్లో బాధితులకు పలు సంస్థల ద్వారా భోజనం సమకూర్చారు. -
నష్టం రూ.10,320 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తద్వారా వెల్లువెత్తిన వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసిన దానికంటే రెట్టింపు నష్టం జరిగి నట్లు తేలింది. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో రెండురోజుల పాటు పర్యటించి వచి్చన కేంద్ర ఉన్నతాధికారుల బృందం.. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ అయ్యింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎస్ శాంతికుమారి ఈ సమావేశంలో పాల్గొన్నారు.రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేయగా.. శుక్రవారం కేంద్ర బృందానికి ఇచి్చన నివేదికలో రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. విపత్తు నిధుల వినియోగం విషయంలో అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులు వాడలేని పరిస్థితి.. తెలంగాణ రాష్ట్రం మొత్తం మునిగిపోయిన పరిస్థితుల్లో సైతం ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎస్డీఆర్ఎఫ్ కింద అందుబాటులో ఉన్న రూ.1,350 కోట్లలో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని సీఎం రేవంత్.. కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఒక కిలోమీటర్ రోడ్డు దెబ్బతింటే కేవలం లక్ష రూపాయలు ఖర్చు చేయాలనే నిబంధన పెట్టారని, దీనితో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ రేట్) వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని, వాటిని పరిశీలించి విపత్తు సాయం అందించాలని కోరారు.వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందని, ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందని తెలిపారు. తనతో పాటు మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రాణనష్టం భారీగా తగ్గిందని చెప్పారు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయని, లక్షలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. పంట పొలాల్లో బండరాళ్లు, కంకర, మట్టి మేటలు వేయటంతో రైతులు కోలుకోలేనంతగా నష్టపోయారని చెప్పారు. చాలాచోట్ల రహదారులు, రోడ్లు, కల్వర్టులు, చెరువులు కొట్టుకు పోవటంతో నష్టం ప్రాథమిక అంచనాలను మించిపోయిందని వివరించారు. మున్నేరు సమస్యకు రిటైనింగ్ వాలే పరిష్కారం ⇒ ఖమ్మం నగరానికి మున్నేరు వాగుతో ఉన్న వరద ముప్పును నివారించాలంటే రిటైనింగ్ వాల్ నిర్మాణం ఒక్కటే శాశ్వత పరిష్కారమని సీఎం స్పష్టం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కేంద్రం తగినన్ని నిధులు కేటాయించేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. రాకాసి తండా, సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజలకు సమీపంలోని సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. ఈ మేరకు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సాయం అందించాలని కోరారు. నివారణపై ఎక్కువగా దృష్టి పెట్టాలి ⇒వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవటం కంటే, నివారించే చర్యలపై ఎక్కువగా దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి అన్నారు. వర్షపాతం, వడగాడ్పుల వంటి వాతావరణ, పర్యావరణానికి సంబంధించిన విపత్తులపై వీలైనంత ముందుగా హెచ్చరికలు జారీ చేసేలా ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. విపత్తు పరిస్థితుల్లో తక్షణం స్పందించేలా వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసే పోలీసు బెటాలియన్లను ఉపయోగించుకుంటామంటూ ముఖ్యమంత్రి తన ఆలోచనలను కేంద్ర బృందంతో పంచుకున్నారు. ప్రతి బెటాలియన్లో ఎంపిక చేసిన వంద మందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామని చెప్పారు. వారికి అవసరమైన పరికరాలు, శిక్షణ, నైపుణ్యం విషయంలో ఎన్డీఆర్ఎఫ్ సాయం కోరుతున్నామని తెలిపారు. 50 వేల చెట్లు నేలమట్టం మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు 50 వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన ఉదంతం సమావేశంలో చర్చకు వచి్చంది. ఇది అటవీ ప్రాంతంలో సంభవించడంతో ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, మైదాన ప్రాంతంలో జరిగితే భారీ నష్టం జరిగేదని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన జరిగినట్లు తమ దృష్టికి రాలేదని కేంద్ర బృందం వ్యాఖ్యానించింది. అందుకే కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని సీఎం కోరారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పరిశీలించాలని సూచించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) సలహాదారు కల్నల్ కేపీ సింగ్ సారథ్యంలోని కేంద్ర బృందంలో అధికారులు శాంతినాథ్శివప్ప, మహేష్ కుమార్, నాయల్కాన్సన్, రాకేష్ మీనా, శశివర్ధన్రెడ్డి ఉన్నారు. నష్టం అంచనాలు ఇలా.. విభాగం అంచనా నష్టం (రూ.కోట్లలో) రహదారులు (ఆర్అండ్బీ, పంచాయతీరాజ్) 7693.53 సాగునీటి పారుదల 483.00 పురపాలక శాఖ 1216.57 తాగునీటి సరఫరా 331.37 విద్యుత్ శాఖ 179.88 వ్యవసాయం 231.13 ఆసుపత్రులు, అంగన్వాడీలు (కమ్యూనిటీ అసెట్స్) 70.47 మత్స్య శాఖ 56.41 గృహ నిర్మాణం 25.30 పశుసంవర్ధక శాఖ 4.35 పాఠశాల భవనాలు 27.31 వరదల్లో మరణించిన వారికి నష్టపరిహారం 1.40 మొత్తం 10,320.72 -
‘సాక్షి’లో చూసి సాయమందించాం
ఖమ్మం మయూరిసెంటర్: స్పందించే మనసుంటే ఎక్కడి వారికైనా సాయం చేయొచ్చని నిరూపించారు నిజామాబాద్ జిల్లా యువకులు. ఇటీవలి వరదలతో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వీరి కష్టా లపై ఈనెల 6న సాక్షిలో ‘భూమి రాళ్లపాలు.. బతుకు రోడ్డుపాలు’శీర్షికన ప్రచురితమైన కథనం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వన్నెల్ (కె) గ్రామ యువకులను కది లించింది. దీంతో వారు బాధితులను ఆదు కునేందుకు నడుం బిగించి రూ. లక్ష విరాళాలు సేకరించారు. ఖమ్మం్లలో పరిచ యం ఉన్న వారిని తోడ్కొని బుధవారం రాకాసితండాకు వచ్చారు. దీంతో యువకులు 77 కుటుంబాలకు 77 సీలింగ్ ఫ్యాన్లు కొనుగోలు చేసి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వన్నెల్ (కె) గ్రామ యువకులు అర్గుల శ్రీకాంత్, మచ్చేందర్, అనంతుల శ్రీను, డాక్టర్ సాయి, గజానంద్, జి.హనుమాను పాల్గొన్నారు. వైద్య విద్యార్థిని తేజశ్రీకి కూడా... ఈనెల 4న ‘సరి్టఫికెట్లు మున్నేరు పాలు’.. ‘చదువుల తల్లులకు ఎంత కష్టం’శీర్షికతో సాక్షి ప్రధాన సంచికలో వచి్చన కథనానికి దాతలు స్పందిస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్కు చెందిన మహిళలు స్థానిక కార్పొరేటర్ మోతారపు శ్రావణి ఆధ్వర్యంలో తేజశ్రీని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. హైమావతి ట్యాబ్ అందించగా, కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మహిళలు రూ.10 వేలు, కొల్లు జ్యోతి రూ.5 వేలు, పారిజాతం కమలం ప్రసాద్ రూ.5 వేలు అందజేశారు. తేజశ్రీ మాట్లాడుతూ అండగా నిలిచిన సాక్షికి, దాతలకు ధన్యవాదాలు చెప్పారు. సాక్షిలో చూసి చలించిపోయానురాకాసితండా పజలు పడిన ఇబ్బందులను సాక్షి పత్రిక లో చూశాను. వారికి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో మా కొంతమంది యువకులను సంప్రదించి, విరాళాలు సేకరించాం. ఖమ్మంలో ఉన్న మిత్రుల ద్వారా ప్రజలకు అందించాం. – అర్గుల శ్రీకాంత్ -
ఖమ్మం పర్యటనలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
ఖమ్మం జిల్లాకు మరోసారి మున్నేరు ముప్పు
సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లాకు మరోసారి మున్నేరు ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం, మున్నేరు వద్ద నీటిమట్టం 16 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి హెచ్చరికలు జారీచేశారు. 24 అడుగులు చేరితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని తెలిపారు. మరో 24 గంటల పాటు మున్నేరు ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇల్లు ఖాళీ చేసి పునరావస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు.మరోవైపు, వర్షాలతో ప్రకాష్ నగర్ బ్రిడ్జి డ్యామేజ్ అవ్వడంతో పూర్తిగా రాకపోకలు నిలిపివేసిన అధికారులు..రోడ్డు మధ్యలో గోడ నిర్మించారు. మరమ్మత్తులు పూర్తయ్యేంతవరకు రాకపోకలు స్తంభించనున్నాయి. ఖమ్మం- కోదాడ , విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మున్నేరు ముప్పు.. గ్రామాలకు అలెర్ట్మున్నేరులో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు.. వరద ప్రభావిత గ్రామాలైన కంచల, ఐతవరం, దామూలూరుతో పాటు పలు గ్రామాల ప్రజలను అలెర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం నందిగామ వద్ద మున్నేరుకు 65,000 క్యూసెక్కుల వరద చేరింది. 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై నీరు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఖమ్మం జిల్లాకు మున్నేరు ముప్పు...
-
TG: రెండు జిల్లాలో భీకర వర్షం.. ఈ రాత్రి ఎలా గడిచేనో..
సాక్షి, ఖమ్మం/మహబూబాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల నుంచి కోలుకునేలోపే మరోసారి మహబూబాబాద్, ఖమ్మంలో శనివారం మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షం ధాటికి ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది.ఇక, శనివారం సాయంత్రం నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రం సహా బయ్యారం మండలంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో, జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. అటు.. బయ్యారంలో జగ్నతండా జల దిగ్బంధమైంది. అన్ని వైపుల నుంచి వరద చుట్టుముట్టడంతో తండాలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన మరోసారి పెరుగుతున్న మునేరు వాగు ప్రవాహం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటోందన్నారు. అవసరమైతే సహాయక శిబిరాలు మళ్లీ తెరవాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు వెంటనే అక్కడినుండి తరలి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు వెళ్లాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సూచనలను పాటించి, తగినంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులతో సంప్రదించాలని కోరారు. అధికారులు వెంటనే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు, ప్రజలకు సహాయ సేవలు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. Inatensive Heavy rain in Mahabubabad bro now pic.twitter.com/3JQBEnpwLP— MKS Goud (@KothaMukesh2) September 7, 2024 మరోవైపు.. ఖమ్మంలో కూడా మరోసారి పరిస్థితి దారుణంగా మారాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్నేరుకు వరద పెరిగే అవకాశం ఉంది. శనివారం అర్ధరాత్రి తర్వాత మున్నేరు ఉధృతి పెరిగే సూచనలు ఉండటంతో కేఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. కమిషనర్.. అధికారులను అందరినీ అత్యవసరంగా ఆఫీసుకు పిలిపించారు. ముంపు ప్రాంతాలను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు ప్రజలకు సూచించారు. Water level is rising in munneru due to heavy rains in mahabubabad and warangal.* Munneru river* Date: *07.09.2024*Time : 7.26 PMWater level: 8.75'ft1st warning 16.00 ft 2nd Warning 24.00ft. Trend:- steadyదాన్వాయిగూడెం, రమణపేట,… pic.twitter.com/mngqnDTD9U— Municipal Commissioner (@MC_Khammam) September 7, 2024 #Mahabubabad #Telangana has again got very heavy rain and many places in #Khammam as well as #Yellandu catchment of #Munneru is getting heavy rains in the last 2 hours. Strict vigil required along Munneru sub-basin. @APSDMA @10NDRF @CWCOfficial_FF @ndmaindia pic.twitter.com/3yErRTI7Vj— S Lakshminarayanan (@sln_1962) September 7, 2024 -
చదువులూ వరద పాలు!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, మహబూబాబాద్: భారీ వర్షాలు మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో విద్యార్థుల చదువునూ వరదపాలు చేశాయి. మానుకోటలో 188 పాఠశాలలు, ఖమ్మం జిల్లాలో 72 పాఠశాలలు దెబ్బతిన్నాయి. శ్లాబ్లు కూలిపోవడం, పగుళ్లు రావడం, లీకేజీలు, కాంపౌండ్ వాల్ దెబ్బతినడం, కిచెన్ షెడ్ కూలిపోవడం, ఫర్నిచర్ దెబ్బతినడం, పుస్తకాలు, కంప్యూటర్లు, రికార్డులు, సర్టిఫికెట్లు తడిసిపాడైపోవడం వంటివి సమస్యగా మారాయి. అటు ముంపు ప్రాంతాల్లోని ఇళ్లలోనూ విద్యార్థుల బ్యాగులు, పుస్తకాలు తడిసి పాడైపోయాయి. దీనితో వేలాది మంది విద్యార్థుల చదువుపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. సోమవారం నుంచి బడులు తెరుచుకోనున్న నేపథ్యంలో చదువులు ఎలా సాగుతాయి, మళ్లీ పుస్తకాలు కొనడం ఎలాగని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఇది. రెండు అంతస్తుల ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్ తరగతి గదుల్లో బురద మేటలు వేశాయి. తొమ్మిదో, పదో తరగతి పుస్తకాలు తడిసి పాడైపోయాయి. పాఠశాలను చూసేందుకు వచ్చిన తొమ్మిదో తరగతి విద్యార్థులు రాంచరణ్, వరుణ్తేజ్, ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ఇక్కడి పరిస్థితి చూసి ఆవేదన చెందారు.బడికి వెళ్లాలంటే.. సర్కస్ ఫీట్లే..మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు– ఉగ్గంపల్లి మార్గంలో బ్రిడ్జి పక్కన రోడ్డు తెగిపోయింది. దీంతో విద్యార్థులు బడికి వెళ్లేందుకు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. తల్లిదండ్రులు బ్రిడ్జి పైనుంచి నిచ్చెన సాయంతో పిల్లలను కిందికి దింపి, రోడ్డుపైకి తీసుకెళ్లి పంపిస్తున్నారు. సాయంత్రం మళ్లీ అదే తరహాలో తిరిగి తీసుకెళుతున్నారు.భయం భయంగా వెళ్లాల్సి వస్తోందిమంగళవారం నుంచి రెండు రోజులు బడికి వెళ్లలేదు. మూడోరోజు మా నాన్న బ్రిడ్జి వద్దకు వచ్చి నిచ్చెన మీది నుంచి కిందికి దింపి రోడ్డు వరకు తీసుకొచ్చి బడికి పంపించాడు. సాయంత్రం మళ్లీ వచ్చి తీసుకెళ్లాడు. బ్రిడ్జి పైనుంచి నిచ్చెనతో దిగాలన్నా.. ఎక్కాలన్నా భయం వేస్తోంది. – ఏనుగంటి శ్రీజ, ఏడో తరగతి, ఉగ్గంపల్లి -
సర్వే.. నామ్ కే వాస్తే..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పట్టణం, రూరల్ మండలాల్లో చేపట్టిన ముంపు బాధితుల సర్వే నామ్కే వాస్తేగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే కోసం వచ్చిన సిబ్బంది కేవలం పేర్లు, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, ఇంట్లోకి నీరు ఎంత వరకు వచ్చిందనే వివరాలు మాత్రమే తీసుకుంటున్నారని చెప్తున్నారు. భారీ వరదలతో పదులకొద్దీ ఇళ్లు నేలమట్టం అయ్యాయని.. వందల సంఖ్యలో ఇళ్ల గోడలు కూలి, కిటికీలు, తలుపులు ధ్వంసమై తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇళ్లలోని సామగ్రి అంతా తడిసి, కొట్టుకుపోయి నష్టపోయామని గుర్తు చేస్తున్నారు. సర్వే సిబ్బంది ఇవేవీ నమోదు చేయడం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల సాయం కోసం మాత్ర మే ఈ సర్వే చేస్తే.. తాము కోల్పోయిన ఇళ్లు, నష్టపోయిన సామగ్రికి పరిహారం అందనట్లేనా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని కోసం మళ్లీ సర్వే ఏదైనా చేస్తారా, సాయం అందుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.పేర్లు నమోదు చేయడం లేదంటూ..మున్నేరు వరదతో ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలాల్లో 70 కాలనీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తంగా 15,777 ఇళ్లు వరద తాకిడికి గురైనట్టు అంచనా. ఈ ముంపును తేల్చేందుకు 172 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారు. ఈ ప్రక్రియ శుక్రవారం నాటికి కొలిక్కి వ చ్చిందని అధికార యంత్రాంగం చెబుతోంది. కానీ సర్వే మొదలుపెట్టిన తొలి రోజున చాలామంది ఇళ్లలో లేకపోవ డంతో వందలాది మంది పేర్లు నమోదు కానట్టు తెలుస్తోంది. తర్వాత కూడా దాతలు ఇచ్చే వస్తువులు, భోజనం అందుకోవడానికి వెళ్లినవారు, కుటుంబం మొత్తం పునరావాస కేంద్రాల్లోనే ఉన్న వారు చాలా మంది తమ పేరు ముంపు బాధితుల జాబితాలో నమోదుకాలేదని వాపోతున్నారు. నమోదవకుంటే ప్రభుత్వమిచ్చే రూ.10వేలు కూడా అందవేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏ అధికారి కూడా.. రాలేదు..వరదలు వస్తున్నాయని సమాచా రం ఇవ్వలేదు. తెలిసినవారు ఫోన్ చేస్తే నిద్రలో లేచి కట్టుబట్టలతో బయటికి పరుగెత్తాం. వరదలు తగ్గి ఐదు రోజులైనా మా ప్రాంతానికి ఏ అధికారి కూడా రాలేదు. మా దగ్గర సర్వే జరగకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం అందుతుందో, లేదో తెలియడం లేదు.– రేష్మ, పద్మావతినగర్, ఖమ్మంసర్వే లేదు.. సాయం లేదు..రెండు రోజుల నుంచి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికా రులు సర్వే చేశారు. మా ప్రాంతానికి మాత్రం రాలేదు. అక్కడికి వెళ్లి అధికారులను అడిగితే ‘వస్తారు.. మీ ఇంటి దగ్గరే ఉండు’ అని చెప్పారు. సర్వేలో నమోదైతేనే సాయం అందుతుందని కొందరు అంటున్నారు. మరి మా వివరాలు ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు సాయం చేస్తారో తెలియడం లేదు. – పాటి ప్రదీప్కుమార్, వెంకటేశ్వరనగర్, ఖమ్మం -
ఆశలు పోయి.. ఆవేదనే మిగిలి..
ఖమ్మం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇళ్లలో, కాలనీల్లో మోకాళ్లలోతు బురద పేరుకుపోయింది. ఎంతగా ఎత్తిపోస్తున్నా తగ్గడం లేదు. బురద, చెత్తాచెదా రం కారణంగా డ్రైనేజీలూ మూసుకుపోయి ఉన్నాయి. ఒక్కపూట తిండి కోసం, గుక్కెడు మంచి నీళ్ల కోసం కూడా అల్లాడుతు న్నామని బాధితులు వాపోతున్నారు. అధికారులెవరూ తమ ప్రాంతాలకు రాలేదని, ఎలాంటి సాయం అందలేదని ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. పెద్దతండా, జలగంనగర్, బొక్కల గడ్డ, వెంకటేశ్వర కాలనీలలో పరిశీలించగా.. అంతటా బాధితుల నుంచి ఇదే మాట. ‘‘మాకు ఇక ఏడ్చేందుకూ కన్నీళ్లు కూడా లేవు..’’ అని వెంకటేశ్వర కాలనీలో అక్కి మంగమ్మ వాపోయింది. ‘‘మా ఇళ్లు గుర్తుపట్టలేనంతగా దెబ్బ తిన్నాయి. నాలుగు రోజులుగా కట్టుబట్టలతో ఉన్నాం. ఇదేం పాపమో మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు..’’ అని కె.సరిత, శీలం ప్రియాంక, ఎం.మమత, సత్యమ్మ బావురు మన్నారు. కాలనీ వైపు ఎవరొచ్చినా.. ఏదైనా సాయం చేస్తారేమోనని ఆశగా చూస్తున్నామని పేర్కొన్నారు.బురద ఎత్తిపోస్తూ.. ఆరోగ్యం దెబ్బతిని..ఇళ్లలో పేరుకున్న బురద ఎత్తిపోస్తూ, సామగ్రిని శుభ్రం చేసుకుంటున్న క్రమంలో చాలా మంది ముంపు బాధితులకు ఎలర్జీలకు లోనయ్యారు. కాళ్లు, చేతులపై పుండ్లు ఏర్పడ్డాయి. అలా ఏర్పడ్డ పుండ్లను చూపిస్తూ డి.లలిత, నారాయణమ్మ, రమణమ్మ కన్నీటి పర్యంతం అయ్యారు. ఫంగస్ వ్యాధులే దీనికి కారణమని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. డ్రైనేజీలు పూడుకుపోయి.. తీవ్ర దుర్గంధంలో..వరద ప్రభావిత కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. బురద నిండి నడవడమూ కష్టంగా మారింది. అన్నీ చిన్న చిన్న కాలనీలు కావడంతో కార్పొరేషన్ వాహనాలు రావడం లేదు. అక్కడి పేదలే రాత్రింబవళ్లు బురద ఎత్తిపోస్తున్నారు. వరద వచ్చిన ఐదు రోజుల తర్వాత ప్రభుత్వం నిత్యావసరాలు, దుప్పట్లను సరఫరా చేసినా.. అవి సరిపోని పరిస్థితి. బురద, చెత్తాచెదారంతో కాలనీల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే అంటువ్యాధులు వ్యాపిస్తాయని సహాయక శిబిరాల్లోని వైద్యులు హెచ్చరిస్తున్నారు కూడా. ఇక్కడి నుంచి రోజూ 300 ట్రాక్టర్ల చెత్తను డంప్యార్డ్లకు పంపుతున్నామని వరంగల్ నుంచి వచ్చిన శానిటేషన్ సూపర్వైజర్ చందు తెలిపారు.అధికారుల జాడే లేదంటూ..వరదలపై అప్రమత్తం చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని బాధితులు మండిపడుతున్నారు. ముంపు తర్వాత కూడా అధికారులెవరూ తమ దగ్గరకు రాలేదని వెంకటేశ్వర కాలనీకి చెందిన పార్వతమ్మ వాపోయారు. ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి సాయం లేదని.. శాంతినగర్లోని చుట్టాల ఇంటికెళ్లి తినివస్తున్నామని, ఎన్నాళ్లిలా తింటామని జి.నాగమణి కన్నీళ్లు పెట్టింది. కూలీ పనిచేసే వడ్లకొండ సూరమ్మ మూడుగదుల రేకుల ఇల్లు కూలిపోయింది. ఆ ఇంటిని చూస్తూ ఆమె కన్నీళ్లుపెడుతూనే ఉంది. తల్లితండ్రి గుండెపోటుతో చనిపోతే ఒక్కడే ఉంటున్న కిరణ్ ఇల్లు కూలిపోయింది. చదువుకున్న సర్టిఫికెట్లు కూడా నీటిపాలై ఆవేదనలో పడిపోయాడు.‘పండుగ’కూ వరద ముంపుఖమ్మం పట్టణం, రూరల్ మండలాలను ముంచేసిన వరద.. ఈసారి వినాయక చవితి పండుగనూ ముంచేసింది. ముంపు కాలనీల్లో ఏటా వీధివీధినా వినా యక విగ్రహాలతో నవరాత్రులను ఘనంగా జరుపు కొనేవారు. కానీ ఈసారి వరదల కలకలంతో పండుగ కళ దూరమైంది. వినాయక విగ్రహాలు, పూజా సామ గ్రి విక్రయించేవారు కూడా నిరాశలో పడిపోయారు. కాలేజీల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో బాధితులు వస్త్రాలు, సామగ్రి ఆరబెట్టుకో వడం కనిపించింది. వరదలకు ముందే కాలనీల ప్రజలు వినాయక విగ్రహాల కోసం ఆర్డర్లు ఇచ్చారని.. అవన్నీ క్యాన్సిల్ అయ్యాయని విగ్రహాల తయారీదా రు హరికుమార్ వాపోయారు.‘పాత సామాన్లు కొంటాం’!కొందరికి అంతులేని ఆవేదన.. మరికొందరికి ఎంతో కొంత ఆశ. ముంపు ప్రాంతాల్లోనివారు వరదల్లో తడి సి, పాడైపోయిన సామగ్రిని ఓ మూలకు పడేస్తున్నా రు. ఈ నేపథ్యంలో పాత సామాన్లు కొనే వారి హడా వుడి పెరిగింది. ఆటో ట్రాలీలకు మైకులు పెట్టుకుని ‘పాత సామాన్లు కొంటాం. విరిగిన వస్తువులు, కుర్చీ లు కొంటాం..’ అంటూ తిరుగుతున్నారు. ఇది చూసి బాధితులు మరింత ఆవేదనకు లోనవుతున్నారు. -
ఒక శిబిరం.. ఎన్నో కన్నీళ్లు
నిండా ఆరు నెలలు కూడా నిండని పసికందు పునరావాస కేంద్రంలో చీరతో కట్టిన ఊయలలో గుక్కపెట్టి ఏడుస్తోంది. ఆరేళ్ల చిన్నారి నిహారిక కన్నీళ్లు పెట్టుకుంటూనే తన చిట్టి చేతులతో ఊయల ఊపుతూ తమ్ముడిని బుజ్జగిస్తోంది. ‘‘తమ్ముడికి అమ్మ ఉదయం పాలిచ్చి వెళ్లింది. ఇప్పుడు ఆకలేసి ఏడుస్తున్నాడు. ఏం చేయాలి’’ అంది ఆ చిన్నారి నిహారిక. ఖమ్మంలోని జలగంనగర్కు చెందిన నర్సింహ, భవాని దంపతుల ఇల్లు వరదలో మునిగిపోయింది. ఆ కాలనీలో, ఇంట్లో అంతా బురద, చెత్తా చెదారం మేట వేసింది. దీంతో పిల్లలను వెంట తీసుకెళ్లలేక.. వారిని పునరావాస కేంద్రంలోనే వదిలి, ఇంట్లో బురద ఎత్తిపోసేందుకు వెళ్లారు.గణేశ్ అనే యువకుడికి తీవ్ర జ్వరం. పునరావాస కేంద్రంలోనే ఓ కిటికీకి సెలైన్ వేలాడదీసి ఆయనకు పెట్టారు. గణేశ్కు డెంగీ లక్షణాలు ఉన్నాయని, ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్య సిబ్బంది చెప్తున్నారు. ఆ యువకుడి తల్లిదండ్రులు వరద ముంచేసిన ఇంటిని శుభ్రం చేసుకునేందుకు వెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్లేవారెవరూ లేక.. పునరావాస కేంద్రంలోనే బిక్కుబిక్కుమంటున్నాడు.ఏదులాపురానికి చెందిన 70 ఏళ్ల గురవయ్యకు రెండు రోజులుగా నీళ్ల విరేచనాలు. కళ్లు పీక్కుపోయాయి. మాట పెగలడం లేదు. కాళ్లలో సత్తువ కూడా లేదు. పునరావాస కేంద్రంలో వైద్య సిబ్బంది ఇచి్చన మాత్రలు వేసుకుని ఓ పక్కన ఒత్తిగిల్లుతున్నాడు. అక్కడున్న వారిలో 12 మందికి శుక్రవారం ఉదయం నుంచీ ఇలా విరేచనాలు మొదలయ్యాయని గురవయ్య చెప్పాడు. ఆహారం వల్లనో, నీటితోనో గానీ.. నానా అవస్థలు పడుతున్నామని వాపోయాడు..ఖమ్మం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఖమ్మంలోని పునరావాస కేంద్రంలో వరద ముంపు బాధితుల కష్టాలివి.. ఇంటికెళ్లే పరిస్థితి లేక, పునరావాస కేంద్రంలో పెడుతున్న ఆహారం తినలేక, రాత్రుళ్లు నిద్రకూడా సరిగా లేక నానాయాతన పడుతున్నారు. కేంద్రంలో అన్ని వసతులు కలి్పంచామని అధికారులు చెప్తున్నా.. కానీ అన్నీ ఇబ్బందులేనని బాధితులు వాపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ గడుపుతూ.. వరదలతో ముంపునకు గురైన ఖమ్మంలోని జలగంనగర్, పలు ఇతర కాలనీల వాసులకు సమీపంలో రామ్లీలా ఫంక్షన్ హాల్లో పునరావాసం కల్పించారు. 1,500 మందిని ఆ కేంద్రానికి తరలిస్తే.. శుక్రవారం ఉదయం వంద మంది కూడా కనిపించలేదు. ఉన్న వారంతా చిన్న పిల్లలు, వృద్ధులే. యువకులు, తల్లిదండ్రులు ముంపు బాధితులు ఇళ్లను, సామగ్రిని శుభ్రం చేసుకోవడానికి.. పిల్లలు, వృద్ధులను పునరావాస కేంద్రాల్లోనే వదిలేసి ఇళ్లకు వెళ్తున్నారు. రాత్రికల్లా తిరిగి వస్తున్నారు. అంతదాకా పిల్లలు, వృద్ధులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అమ్మా ఎప్పుడొస్తావ్! ‘అమ్మా ఎప్పుడొస్తావ్. ఇక్కడ ఉండలేకపోతున్నాను’.. పదేళ్ల ప్రణవి ఏడుస్తూ సెల్ఫోన్లో తల్లిని అడుగుతోంది. ‘‘చస్తే చస్తాం.. ఇంటికెళ్లి పోవాలనిపిస్తోంది..’’ అన్నారో 75 ఏళ్ల పెద్దాయన. వారిని ఇంకా వరద బీభత్సం వెంటాడుతూనే ఉంది. ఏం జరిగిందో, ఇకపై జరుగుతుందో తెలియడం లేదంటూ ఆందోళన కనిపిస్తోంది. ఆడుతూ, పాడుతూ ఉండే పిల్లలు పునరావాస కేంద్రంలో కాలు కదపకుండా ఉండలేకపోతున్నారు. గుక్కెడు నీళ్లు తాగాలన్నా ఎవరినో అడగాలి. బుక్కెడు బువ్వ కోసమూ లైన్లో నిలబడాలి. ఇక్కడ ముద్ద నోట్లోకి వెళ్లడం లేదని వినేష్, పల్లవి, సుధ వాపోయారు. ‘జ్వరం వచి్చందని చెప్పుకునే తోడు లేదు. తిన్నావా? అని అడిగే దిక్కు లేదం’టూ వృద్ధులు కన్నీళ్లు పెడుతున్నారు. అలా తినాలంటే ఎలా? తాగునీటి డ్రమ్ముల్లో దోమలు, కీటకాలు, వంటశాలలో తడి, దుర్వాసన. వండే, వడ్డించే గరిటలు కిందే పెడుతుండటంతో అంటుతున్న మట్టి. హడావుడిగా వంట. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల కూరలు.. అన్నం కోసం లైన్ కట్టాలి. అయిపోతే వండి తెచ్చేవరకు అలాగే నిరీక్షించాలి. పెట్టినంతే తినాలి. కడుపు నిండలేదని మళ్లీ అడిగినా ఉండదు.. ఇదీ సహాయక శిబిరాల్లో పరిస్థితి. ఇదంతా చూస్తూ ఖర్మకాలి వచ్చామంటూ వృద్ధులు వాపోతున్నారు. కలో గంజో తాగి ఇంటి దగ్గర ఉండటమే నయమంటున్నాడు సుబ్బయ్య.కాళ్లు లాగుతున్నాయని వెళ్తే పారాసిటమాల్ ఇచ్చారని చెప్పారో వృద్ధుడు. మూడు రోజులుగా చలి జ్వరంతో బాధపడుతున్నా చెప్పుకోలేని పరిస్థితి ఉందని బావురుమన్నారు మరో వృద్ధుడు. అమ్మానాన్నలు రాగానే చిన్నారులు గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నారు. ఇంటికి తీసుకెళ్లాలంటూ మారాం చేస్తున్నారు. ఇంటి నిండా బురద ఉందని చెప్పినా పిల్లలు వినడం లేదని సుశీల అనే మహిళ వాపోయింది.నా ఖమ్మం కోసం నేను!వినాయక మండపాల వద్ద సామగ్రి సేకరణకు బాక్స్లు.. కలెక్టర్ వినూత్న ఆలోచనఖమ్మం సహకారనగర్: ఖమ్మం జిల్లాలో వరద ముంపుతో నష్టపోయిన వారికి అందరూ అండగా నిలబడాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన గూగుల్ మీట్ ద్వారా జిల్లా వ్యాప్తంగా అధికారులతో ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా ‘నా ఖమ్మం కోసం నేను’ పేరిట కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు ప్రతీ గణేశ్ మండపం వద్ద ఒక బాక్స్ ఏర్పాటు చేయాలని, అందులో ముంపు బాధితుల కోసం దుస్తులు, చెప్పులు తదితర ఉపయోగపడే సామగ్రి వేసేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా ఆపదలో ఉన్న వారికి అందరం అండగా నిలుస్తామని కలెక్టర్ తెలిపారు. -
నేడు ఖమ్మం జిల్లాకు కేంద్ర మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రానికి వాటిల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏరియల్ సర్వేకు సిద్ధమైంది. ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.శివరాజ్సింగ్ శుక్రవారం ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి నేరుగా ఖమ్మం చేరుకోనుండగా బండి సంజయ్ ఆయనతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. అనంతరం పంట నష్టంతోపాటు ఆస్తి నష్టంపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో వారు సమీక్షించనున్నారు. -
ఐదు రోజులైనా అదే యాతన
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరద వచ్చి ఐదు రోజులైనా ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరీవాహక ప్రాంతాలు ఇంకా తేరుకోలేదు. బురద, దుర్వాసన ఓవైపు.. తాగడానికి, ఇతర అవసరాలకు నీళ్లు దొరకక మరోవైపు బాధితులు తీవ్రఅవస్థలు పడుతున్నారు. ఆర్థిక సాయం సర్వేలో.. తమ పేర్లు నమోదు చేయ లేదంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బురద తొలగింపు, పారిశుధ్య పనులు ఇంకెప్పుడు పూర్తవుతాయో తెలియడం లేదని వాపోతున్నారు. తొలగని బురద.. అందని నీరు సుమారు 50 కాలనీల్లో బురద నిండిపోయి ఉంది. వాహనాలతో తొలగిస్తూనే ఉన్నా.. ఇంకా భారీగా పేరుకుపోయే కనిపిస్తోంది. ఇళ్లలో బాత్రూంలను వాడుకునే పరిస్థితి లేదు. ఇళ్లను, సామగ్రిని శుభ్రం చేసుకుందామనుకునే వారికి తగినన్ని నీళ్ల అందడం లేదు. కొన్ని కాలనీలకే ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. భోజనాల వేళ దాతలు ఇచ్చే తాగునీటి ప్యాకెట్లే తప్ప రక్షిత నీరు అందడం లేదని వాపోతున్నారు. తమను సర్వే చేయడం లేదంటూ.. వరద సమయంలో ఆస్పత్రులు, శుభకార్యాలు, పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు.. ఇళ్లకు తిరిగి వచ్చి అక్కడి పరిస్థితి చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. సుమారు రెండు వేలకుపైగా ఇళ్లు పూర్తిగా నీటమునగడంతో విద్యుత్ మీటర్లు పాడయ్యాయి. విద్యుత్ శాఖ వాళ్లు వాటి స్థానంలో కొత్తవి బిగించే పనులు చేస్తున్నా.. గోడలు తడిసే ఉండటంతో షాక్ వస్తుందన్న భయం పట్టుకుంది. ఇప్పటికే ఖమ్మంరూరల్ మండలం కేబీఆర్ కాలనీలో ఓ ప్రైవేట్ ఎల్రక్టీషియన్ విద్యుత్ షాక్తో మృతి చెందాడు. దీంతో పగలంతా ఇళ్లలో శుభ్రం చేసుకుంటున్న బాధితులు.. రాత్రికి తిరిగి పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు. భర్త ఆపరేషన్ కోసం వెళ్లి.. ఖమ్మం వెంకటేశ్వర నగర్కు చెందిన ఐతరాజు జ్యోతి, వెంకన్న కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వెంకన్నకు గొంతు ఆపరేషన్ కోసం భార్యాభర్తలు హైదరాబాద్ వెళ్లారు. వరద విషయం తెలిసి ఆందోళనలో పడ్డారు. స్థానికంగా లేకపోతే సర్వేలో పేరు రాయరని, ఆర్థిక సాయం అందదేమోనని భావించిన చెందిన జ్యోతి బుధవారం రాత్రి ఇంటికి వచ్చారు. ఇంట్లో నిత్యావసరాలు సహా సామగ్రి అంతా తడిసి పాడైపోయి ఉండటాన్ని చూసి కన్నీళ్లులో మునిగిపోయారు. కిరాణం, వాటర్ ప్లాంట్ కొట్టుకుపోయి.. ఇక్కడి వెంకటేశ్వర నగర్లో కాటం వెంకటేశ్వర్లు కిరాణం, వాటర్ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. ఈ రెండూ మునిగి, సామగ్రి కొట్టుకుపోయి.. రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని ఆయన వాపోతున్నారు. ముంపు సర్వే కోసం ఇంకా ఎవరూ రాలేదని, ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. పదివేల సాయం ఏ మూలకు..? కాల్వొడ్డు ప్రాంతంలో నివసించే రామిశెట్టి నాగమ ణి భర్త గతంలోనే చనిపోయారు. ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది. ఇళ్లలో పనిచేసుకుంటూ జీవించే నాగమణికి.. వరదల వల్ల కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు. ప్రభుత్వం ఇస్తామన్న రూ.10 వేల పరిహారం దేనికీ సరిపోదని ఆమె వాపోతున్నారు. శుభకార్యానికి వెళ్లొచ్చే సరికి.. వెంకటేశ్వరనగర్లో నర్రి సుగుణ, యాదయ్య కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. ఓ పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇంటిని వరద ముంచెత్తింది. ఇంట్లోని నాలు గు క్వింటాళ్ల బియ్యం, ఇతర నిత్యావసరాలు తడిసి పాడైపోయాయి. తనను పరామర్శించేందుకు వచ్చిన పెద్దకుమార్తెని చూసి కట్టుబట్టలతో మిగిలామంటూ సుగుణ కన్నీరుపెట్టారు.కోలుకోని ముంపు గ్రామాలు! సాక్షి, మహబూబాబాద్/అనంతగిరి (కోదాడ): సూర్యాపేట, మానుకోట జిల్లాల్లోని ముంపు గ్రామాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. భారీ వరద కారణంగా మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, ఇనుగుర్తి, దంతాలపల్లి, నర్సింహులపేట, మరిపెడ, కురవి, చిన్నగూడూరు, డోర్నకల్ మండలాల్లో 45 చెరువులు తెగిపోయాయి, మరో 35 చెరువులు దెబ్బతిన్నాయి. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారమే.. చెరువులు, కుంటల కింద 27,639 ఎకరాల్లో ఇసుక మేటలు, రాళ్లు నిండిపోయాయి.మహబూబాబాద్ నుంచి కురవి మీదుగా ఖమ్మం వెళ్లేందుకు సీరోలు మండలం ముల్కలపల్లి వద్ద నిర్మించిన బ్రిడ్జి భారీ వరదకు కూలిపోయింది. దానితో రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. వరద బీభత్సంతో చిన్నగూడూరు, ఎల్లంపేట, పురుషోత్తమాయగూడెం, తానంచెర్ల, ఉల్లెపల్లి తదితర చోట్ల పైపులైన్లు తెగిపోవడం, పగిలిపోవడం వంటి జరగడంతో.. గత ఐదు రోజులుగా 45 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఇక సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కిష్టాపురం, గోండ్రియాలలో ముంపు బాధితులు తమకు నిత్యావసరాలు, తాగునీరు అందడం లేదని వాపోతున్నారు. -
భూమి రాళ్లపాలు బతుకు రోడ్డుపాలు!
తిరుమలాయపాలెం: అకస్మాత్తు వరదలతో ఇళ్లు నీట మునిగి, సామగ్రి అంతా కోల్పోవడమే కాదు.. జీవనాధారమైన పంట పొలాలనూ కోల్పోయిన దుస్థితి నెలకొంది. పచ్చని పంటలతో కళకళలాడే భూములను ఆకేరు వరద రాత్రికి రాత్రే బీడు భూములుగా మార్చేసింది. ఒక్కసారిగా చుట్టుముట్టిన వరదను చూసి కట్టుబట్టలతో పరుగెత్తిన గిరిజనులు.. వరద తగ్గాక వచ్చి చూసేసరికి ఇళ్లు, సామగ్రి అంతా నాశనమయ్యాయి. దాన్ని ఏదోలా దిగమింగుకుని పొలాల వద్దకు వెళ్లి చూసిన రైతులు.. అక్కడంతా రాళ్లురప్పలు, ఇసుక మేటలే కనిపించడంతో ఆవేదనతో కన్నీట మునిగిపోయారు. అసలు ఎవరి భూమి ఎక్కడ ఉందో తెలియనంతగా మారిపోవడాన్ని తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. రాకాసి తండాను తుడిచిపెట్టిన ఆకేరు 70 కుటుంబాలు ఉన్న రాకాసితండాకు పక్కనే ఆకేరు ప్రవహిస్తుంది. సాగునీరు అందుబాటులో ఉండటంతో.. ఇక్కడి గిరిజన రైతులు మిర్చి, పత్తి, వరి పండిస్తారు. కానీ మునుపెన్నడూ లేనంతగా ఆకేరు పోటెత్తడంతో వరద గ్రామాన్ని చుట్టుముట్టింది. గిరిజనులంతా ఎక్కడికక్కడ వదిలేసి సమీపంలోని గుట్టలపైకి చేరుకున్నారు. ఆ వరద కొద్ది గంటల్లోనే చాలా ఇళ్లను నేలమట్టం చేసింది. ధాన్యం, బియ్యం, నిత్యావసరాలు, ఇతర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. పొలాలన్నీ మాయం.. సారవంతమైన ఆకేరు పరీవాహక గ్రామాల్లోని వ్యవసాయ భూములు వరదతో ఆనవాళ్లు కోల్పోయాయి. తిరుమలాయపాలెం మండలంలోని హైదర్సాయిపేట, రావిచెట్టుతండా, తూర్పుతండా, అజీ్మరాతండా, రాకాసితండా, బీసురాజుపల్లితండా, రమణా తండాల పరిధిలో వెయ్యి ఎకరాలకుపైగా భూములు నామరూపాల్లేకుండా రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయి. సాగునీటి బోర్లు, మోటార్లు, పైపులు కూడా జాడ లేకుండా పోయాయి. మరోవైపు బీరోలు, బంధంపల్లి చెరువులకు గండ్లు పడి.. దిగువన ఉన్న పంట భూముల్లో ఇసుక మేటలు వేసింది. ఈ భూములను తిరిగి సాగుయోగ్యంగా మార్చాలంటే.. లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇస్తామంటున్న అరకొర సాయం ఎలా కాపాడుతుందని ప్రశి్నస్తున్నారు.పచ్చని పొలంలో.. ఇసుక, రాళ్ల మేటలుఇయన పేరు పోతుగంటి సహదేవ్. తిరుమలాయపాలెం మండలం రాకాసితండాకు చెందిన ఈయన నాలుగున్నర ఎకరాల్లో వరిసాగు చేశారు. నెల రోజుల క్రితమే నాట్లు వేయగా.. ఇటీవలే కలుపు తీసి ఎరువులు వేశాడు. కానీ ఆకేరు వరదతో కళ్లముందే పొలం నామరూపాలు లేకుండా పోయింది. అంతా ఇసుక, రాళ్ల మేటలు వేసింది. అదంతా తొలగించాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుందని సహదేవ్ వాపోతున్నారు. భార్య పుస్తెలతాడు కుదువ పెట్టిన డబ్బులతో పంటకు పెట్టుబడి పెట్టానని.. ఆ పంటా పోయి, ఇప్పట్లో పంటలు పండించే పరిస్థితీ లేక.. ఎలా బతకాలో తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇకపై బతికేదెట్లా? అజ్మీరా తండాకు చెందిన బోడ దాసు ఐదెకరాల్లో వరిసాగు చేశాడు. సాగు నీటికి ఇబ్బంది లేకపోవడంతో ముందుగానే నాట్లు వేశాడు. పచ్చగా కళకళలాడుతున్న వరి పంట ఒక్కరోజులోనే తుడిచి పెట్టుకుపోయింది. పొలంలో ఇసుక మేటలు వేసింది. ఆయన భార్య మరణించగా.. కుమారుడు శోభన్ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు, దివ్యాంగురాలైన కుమార్తెకు వివాహం చేశాడు. ఇప్పుడు పొలం దెబ్బతినడంతో ఇకపై బతికేదెట్లాగని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.రాళ్ల కుప్పలు కాదు.. వరి పొలమే! ఈ చిత్రంలో కుప్పలుకుప్పలుగా రాళ్లతో నిండి కనిపిస్తున్నది వ్యవసాయ భూమే! ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండా వద్ద ఆకేరు వాగు వరద ఉధృతికి.. పొలంలో సారమంతా కొట్టుకుపోయి ఇలా రాళ్లు, రప్పలు మిగిలాయి. ఇకపై ఎలాంటి పంటలూ పండించలేకుండా తయారైంది. -
వందేళ్ల వంతెన చాన్నాళ్లు 12 ఏళ్ల వంతెనకు నూరేళ్లు
నిజాం కాలంలో వందేళ్ల క్రితం ఖమ్మం మున్నేరుపై రాతి కట్టడంగా నిర్మించిన బ్రిడ్జి 36.9 అడుగుల మేర వరదను తట్టుకుని నిలబడింది. అదే మున్నేరుపై ప్రకాశ్నగర్ వద్ద పదేళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి స్పాన్ మాత్రం పక్కకు జరిగింది. భారీ వరదతో బ్రిడ్జి స్పాన్ బేరింగ్ పైనుంచి పక్కకు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈనెల 1న ఉదయం 9 నుంచి రాత్రి 12 గంటల వరకు మున్నేరుకు భారీగా వరద వచి్చంది. 36.9 అడుగుల మేర వరద ప్రవాహం ఆరు గంటలపాటు కొనసాగింది. ఈ వరద ప్రవాహంతోనే బ్రిడ్జి స్పాన్ బేరింగ్ల పైనుంచి పక్కకు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకొన్ని గంటలు వరద ఇలాగే కొనసాగితే బ్రిడ్జికి ముప్పు వాటిల్లేదని నిపుణులు చెబుతున్నారు. – ఖమ్మం మయూరి సెంటర్పదిలంగా వందేళ్ల బ్రిడ్జి.. అనేకసార్లు భారీగా వరదల తాకిడి తగిలినా ఎక్కడా తొణుకు లేకుండా ఖమ్మం కాల్వొడ్డు వద్ద నిర్మించిన బ్రిడ్జి పదిలంగా నిలిచింది. నిజాంల కాలంలో రాతితో కట్టిన ఈ బ్రిడ్జి వద్ద పలుసార్లు 30 అడుగులకు పైగా వరద ప్రవహించినా చెక్కుచెదరలేదు. గత పదేళ్లుగా బ్రిడ్జి పని అయిపోయిందని, వందేళ్లు దాటినందున ప్రమాదం పొంచి ఉన్నట్లేనని అధికార యంత్రాంగం, ప్రజలు చర్చించుకుంటున్నా.. సగర్వంగా నిలవడం విశేషం. కాగా, ప్రకాశ్నగర్ బ్రిడ్జిపై ఎస్12 స్పాన్ పక్కకు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మూడో బ్రిడ్జిగా నిర్మాణం.. హైదరాబాద్, సూర్యాపేట, హైదరాబాద్, కోదాడ, విజయవాడ ప్రాంతాల వైపు నుంచి ఖమ్మం నగరంలోకి వచ్చేందుకు మున్నేరుపై మూడు వంతెనల నిర్మాణం జరిగింది. 110 ఏళ్ల క్రితం నిజాం కాలంలో కాల్వొడ్డు వద్ద ఒక బ్రిడ్జి.. కరుణగిరి వద్ద రెండు దశాబ్దాల క్రితం మరో బ్రిడ్జి నిర్మించారు. నానాటికీ రద్దీ పెరగడంతో 2010లో ప్రకాశ్నగర్ వద్ద మున్నేరుపై మూడో బ్రిడ్జి నిర్మాణానికి నాటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. 2013లో ఈ బ్రిడ్జి అందుబాటులోకి రాగా.. గత ఏడాది 30.7 అడుగులు, ఈనెల 1న 36.9 అడుగుల మేర వరద వచి్చంది. తాజా వరదతో బ్రిడ్జి నాణ్యత వెలుగులోకి వచి్చందన్న చర్చ జరుగుతోంది. -
సీఎం రేవంత్ తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లు లేరు: హరీష్ రావు
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో నడుస్తుంది ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లెవరూ లేదరని తేల్చిచెప్పారు. వరద బాధితులకు సహాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ముందుగా మేల్కొంటే మరింత ప్రాణనష్టం తగ్గే అవకాశం ఉండేదన్నారు.ఈ మేరకు సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో గురువారం ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం, మహబూబాబాద్లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. సిద్దిపేట నుంచి ఉడుతా భక్తిగా సహాయం చేస్తున్నామన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని అందరూ ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నెల వేతనం వరద బాధితులకు అందిస్తున్నామని చెప్పారు. తమలాగే బీజేపీ, మిగతా పార్టీల నాయకులు సహాయం చేయడానికి మందుకు రావాలని కోరారు. తాము వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే తమపై దాడి చేసి కేసులు నమోదుచేస్తున్నారని ఆరోపించారు. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారని చెప్పారు తమకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే దాడులు చేస్తున్నారని విమర్శించారు. బాధితులకు అన్నం, నీళ్లు ఇవ్వలేకపోయారని చెప్పారు. నీళ్లలో ఇళ్లు మునిగిపోయినవారికి రూ.2 లక్షలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. -
ముఖ్యమంత్రి పదవికి అసలు చంద్రబాబు అర్హుడేనా? : వైఎస్ జగన్మోహన్ రెడ్డి
-
ఖమ్మంకు విరాళంగా నెల జీతం
-
కాంగ్రెస్ వల్లే ఖమ్మం వరదలు: పువ్వాడ అజయ్
సాక్షి,హైదరాబాద్: మున్నేరు వరద భాదితులను ఆదుకునేందుకు వెళ్తే తమపైన దాడి చేశారని మాజీ మంతత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులకు వాయిస్ లేదని విమర్శించారు. తెలంగాణభవన్లో పువ్వాడ అజయ్ మీడియాతో మాట్లాడారు.‘ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారని ప్రజలు భావిస్తున్నారు. మున్నేరుకు వరద ఎక్కడి నుండి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలుసా. అజయ్ కుమార్ ఆక్రమణల వలనే ఖమ్మం మునిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. మున్నేరు పరివాహకంలో రాజీవ్ గృహకల్ప,జలగం నగర్ కాలనీలు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు రేవంత్ రెడ్డి వ్యవహరించారు. ఖమ్మం నగరంలో ఒక్క ఇంచు నేను ఆక్రమణలు ఉన్నా కూల్చివెయ్యి. నా హాస్పిటల్ కట్టి 25 సంవత్సరాలు అయింది. నా హాస్పిటల్కు చుక్క నీరు రాలేదు. నా హాస్పిటల్కు మున్నేరుకు సంబంధం లేదు. కేసీఆర్ వరద సాయం చేస్తే నువ్వు సీఎం పదవిలో ఉండి ఎందుకు..? ప్రజలను డైవర్ట్ చేసేందుకు నిన్న మాపై దాడులు చేశారు. మున్నేరుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ కావాలని రూ.650 కోట్లు మంజూరు చేయించాను. రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టడం లేదో ప్రభుత్వం చెప్పాలి. భౌతికంగా మాపై దాడి చేస్తే ఖమ్మం ప్రజల భాదలు తీరుతాయా..? మంత్రుల ఫంక్షన్ హాల్స్ ఆక్రమణలో ఉన్నాయని ఖమ్మం ప్రజలు అనుకుంటున్నారు. రెవిన్యూ మంత్రి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మరో మంత్రి విల్లాలు వక్ఫ్ బోర్డు భూముల్లో ఉన్నాయి. హైడ్రా కూల్చివేతలు మంత్రుల ఫంక్షన్ హాళ్లు,విల్లాలతో మొదలు పెట్టండి. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు మనుషులే మాపై దాడి చేశారు’అని అజయ్కుమార్ మండిపడ్డారు. -
నెల జీతం విరాళంగా ఇస్తాం: హరీశ్రావు
సాక్షి,సిద్దిపేట: కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీల అందరి నెల జీతం వరద బాధితులకు ఇస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ల నెల జీతం కూడా ఇస్తామని చెప్పారు. ‘ఖమ్మం వరద బాధితులకు సహాయం చేయడానికి అందరు ముందుకు రావాలి. సిద్దిపేట మున్సిపల్ కమిషర్ రూ.11 వేల విరాళం ఇచ్చారు. రేపు సిద్దిపేట నుంచి వెళ్లే సరుకులను ఖమ్మం వరద బాధితుల ఇంటింటికి అందిస్తాం. 6 లారీల్లో ఖమ్మంకు సరుకులను పంపుతున్నాం. రాష్ట్రంలో వరదలు వచ్చాయి. నేను ఖమ్మం వెళ్ళాను. వరద బాధితులు 24 గంటలు నీటిలో ఉన్నారు. వాళ్ళను చూస్తే నా కళ్లలో నీళ్లు వచ్చాయి. వాళ్లకు ఏమి లేవు. అన్నీ కొట్టుకుపోయాయి. వాళ్లకు మన సిద్దిపేట నుంచి 500 గ్రాసరి కిట్లు పంపించడానికి అమర్ నాథ్ సేవా సమితి ముందుకు వచ్చింది. అమర్నాథ్ సేవా సమితికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సిద్దిపేట నిలయం. చెరువులను కాపాడం మన అందరి బాధ్యత. ఆకర్షణ కన్నా ఆధ్యాత్మికత ముఖ్యం..మట్టి వినాయకులను పూజిద్దాం’అని హరీశ్రావు పిలుపునిచ్చారు. -
మున్నేరు ముంచింది..
-
ఖమ్మం ప్రజలను నిండా ముంచిన మున్నేరు వాగు
-
ముందే చెప్పి ఉంటే.. ముంచేదా మున్నేరు!
ఉమేష్ చంద్ర, యాకేష్ సోదరులు. ఒకరు గ్రానైట్ బండలపై పేర్లు చెక్కే ఆర్టిస్ట్ కాగా.. మరొకరు సుతారి మేస్త్రి. ఈ కుటుంబాలు రెండూ మోతీనగర్లో రూ.14 లక్షలు వెచ్చించి నాలుగేళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకున్నాయి. గత ఏడాది వరద వచ్చినా వస్తువులు పాడయ్యాయే తప్ప ఇళ్లు దెబ్బతినలేదు. ఈసారి ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి.సామాన్లు, దర్వాజాలు, కిటికీలు కొట్టుకుపోయాయి. రేడియం స్టిక్కర్ మిషన్లు, కంప్యూటర్లు కొట్టుకుపోవడంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. ముందస్తుగా వరద ముంపు సమాచారం ఇస్తే సామగ్రిని ఇతర చోట భద్రపరుచుకునే వారమని ఈ సోదరులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం ఇస్తే నష్టం తప్పేది.. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్నేటి వరద ఖమ్మం నగరాన్ని, ఖమ్మం రూరల్ మండలాల్లోని పలు ప్రాంతాలను ముంచేసింది. గత వందేళ్లలో కనీవినీ ఎరుగని జల ప్రళయం బీభత్సం సృష్టించింది. ఇళ్లను నేలమట్టం చేసింది. బియ్యం, ఉప్పు, పప్పుల్లాంటి నిత్యావసర సరుకుల్నే కాదు..విలువైన వస్తువుల్నీ ఊడ్చుకుపోయింది. ఉపాధికి, ఉద్యోగ అవకాశాలకు కీలకమైన వందలాది మంది యువత సర్టిఫికెట్లూ కొట్టుకుపోయాయి. అనేక కాలనీల్లో రోడ్లపైనే కాదు..వేలాది ఇళ్లు, దుకాణాల్లో బురద మేటలు వేసింది. వరద ముంచెత్తే ప్రమాదంపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ లేకపోవడం వల్లే సర్వం కోల్పోవాల్సి వచ్చిందని, కట్టుబట్టలతో ప్రాణాలు దక్కించుకున్న తమకు ఇప్పుడు బురదే మిగిలిందని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మున్నేరు పరీవాహక ప్రాంతంలో ఇప్పుడు ఎవరిని కదిలించినా ఇలాంటి కన్నీటి గాథలే విన్పిస్తున్నాయి. ఇళ్లు చూసి.. గొల్లుమంటూ.. గత నెల 31న మొదలైన వరద ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. 50కి పైగా కాలనీల్లో 10 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వరద తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి మున్నేటి ఒడ్డున ఉన్న ఇళ్లకు చేరుకుంటున్న వారు అక్కడి పరిస్థితి చూసి కన్నీళ్లు పెడుతున్నారు. ఇళ్లల్లో బురద మేటలు వేయగా.. అనేకచోట్ల ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయి నేలమట్టమయ్యాయి. మరికొన్నిచోట్ల పైకప్పులు లేచిపోయాయి. ఒక్కో ఇంట్లో రూ.5 లక్షల విలువైన గృహోపకరణాలకు నష్టం జరిగిందనుకున్నా.. మొత్తం నష్టం రూ.వేల కోట్లలో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్రమత్తం చేయడంలో విఫలం గత ఏడాది జూలై 26 నుంచి 29వ తేదీ వరకు మూడురోజుల పాటు వరద వస్తే గరిష్టంగా 30.7 అడుగులుగా నమోదైంది. అప్పట్లో వరద ముంపును ముందే ఊహించి అప్రమత్తం చేయడంతో బాధితులు విలువైన సామగ్రితో పాటు పునరావాస కేంద్రాలు, బంధువుల ఇళ్లకు తరలిపోయారు. దీంతో ఆస్తినష్టం భారీగా తగ్గింది. అయితే ఈసారి మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో 40 సెం.మీ.కు పైగా వర్షం కురవడం.. వరద ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలాల్లోని లోతట్టు ప్రాంతాలకు పోటెత్తడం, దీనిపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ లేకపోవడంతో బాధితులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత నెల 31న రాత్రి 9 గంటలకు 11 అడుగులుగా ఉన్న మున్నేరు ఈనెల 1న తెల్లవారుజామున 3 గంటలకు 19 అడుగులుగా నమోదైంది. ఆ తర్వాత గంట గంటకూ వేగంగా పెరుగుతూ ఉదయం 11 గంటలకే 36 అడుగుల పైకి చేరింది. అయితే ఎగువన భారీ వర్షంతో వరద వస్తుందన్న సమాచారాన్ని గత నెల 29, 30 తేదీల్లోనే నీటిపారుదల, ఇతర శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ముంపు ప్రాంతాల ప్రజలకు చేరవేస్తే ఆస్తినష్టం ఇంతగా జరగకపోయేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఏడాది మాదిరి ముందుగా వరద సమాచారం ఇవ్వకపోవడం వల్లే సర్వం కోల్పోయామని బాధితులు విలపిస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రూ.లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగిందని.. అరకొర సాయమే తప్ప ప్రభుత్వం ఈ స్థాయిలో తమను ఆదుకుంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. వరద ముంచెత్తుతుండటంతో విలువైన సామాన్లు అటకలపై భద్ర పరిచామని, కానీ ఊహించని స్థాయిలో వరద రావడంతో అన్నీ కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా బురదే మున్నేటికి ఇరువైపులా ఉన్న దానవాయిగూడెం, రామన్నపేట, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప, జలగం నగర్, పెదతండా, వెంకటేశ్వరనగర్, మోతీనగర్, బొక్కలగడ్డ, మంచికంటినగర్, ప్రకాష్నగర్, పంపింగ్వెల్ రోడ్డు, ఎఫ్సీఐ గోడౌన్లు, టీఎన్జీవో కాలనీ, ధంసలాపురం, అగ్రహారం కాలనీలను వరద ఆగమాగం చేసింది. ముంపు కాలనీల్లో అంతా పేద, మధ్య తరగతి ప్రజలే నివసిస్తున్నారు. ఏళ్లుగా కూడబెట్టి కొన్న విలువైన వస్తువులు కొట్టుకుపోవడంతో తిరిగి తామెప్పుడు కోలుకుంటామోనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా అన్ని ఇళ్లల్లో బైక్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, బీరువాలు, ఏసీలు, మంచాలు, పరుపులు, దుప్పట్లు, వాషింగ్ మిషన్లు, టీవీలు, మిక్సీలు, గ్యాస్ స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయాయి. ఏ వస్తువూ మిగల్లేదు. అక్కడక్కడా సామగ్రి ఉన్నా బురదతో నిండిపోయి పనికొచ్చే పరిస్థితి కానరావడం లేదు. ఎగువ నుంచి కొట్టుకొచ్చిన చెత్తాచెదారం, చెట్ల మొద్దులు, వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయాయి. చిన్న కిరాణా షాపులు, మెకానిక్ షాపులు, పండ్ల దుకాణాల్లో సైతం బురద నిండిపోయింది. ఇళ్లు, దుకాణాలు శుభ్రం చేసుకుంటున్న బాధితులు అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టమవుతోంది. పరామర్శకు వచ్చే నేతలు, అధికారులు, సిబ్బంది బురదలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ బురద మేటలు, వ్యర్థాలు తొలగించడం సహాయక సిబ్బందికీ, బాధితులకు సవాల్గా మారింది. జేసీబీలు, ట్రాక్టర్లతో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చెత్త, బురద తొలగిస్తున్నా ఇదంతా పూర్తికావడానికి ఎన్ని రోజులు పడుతుందో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. తిండి లేదు.. నీళ్లు లేవు వరద కాలనీల్లో బాధితులు తిండి, తాగునీటికి అల్లాడుతున్నారు. పునరావాస కేంద్రాల నుంచి వచ్చి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న బాధితులు ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ సిబ్బందితో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పార్టీల నేతలు ఆహారాన్ని పంపణీ చేస్తున్నా.. ఇవి ఏ మూలకూ చాలడం లేదు. మధ్యాహ్నం భోజనానికి పొట్లాలు అందిస్తే.. మళ్లీ రాత్రి సమయానికి భోజనం అందుతుందో లేదోననే అనుమానం వ్యక్తవుతోంది. ఇక ఇళ్లల్లో తాగునీటి బోర్ల మోటార్లు, మిషన్ భగీరథ పైపులైన్లు ధ్వంసం కావడంతో నీటికి అల్లాడాల్సి వస్తోంది. వస్తున్న మంచినీటి ట్యాంకర్లు ఎటూ సరిపోవడం లేదు. చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ.. వరద ప్రభావంతో ఈ కాలనీల్లో వందలాది విద్యుత్ స్తంభాలు నేలమట్టమై ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయాయి. సబ్ స్టేషన్లు నీట మునిగాయి. దీంతో మున్నేటి లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. దీంతో ముంపు బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నా రాత్రివేళ చీకట్లోనే ఉంటున్నారు. పాములు, తేళ్ల బెడదతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇళ్లు సాయం అందేదెన్నడు? ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆర్వీ కర్ణన్, వీపీ గౌతమ్, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్దత్, కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఇతర శాఖల అధికారులు నష్టానికి సబంధించిన వివరాల సేకరణపై సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. అయితే రూ.కోట్లలో నష్టం రూ.కోట్లలో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా..మున్నేరు ముంపు ప్రాంతమంతా బురద మేట వేయడంతో నష్టాన్ని ఎప్పటికి నిర్ధారిస్తారు? ఆపై సాయం ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.వినాయకుడి బొమ్మలు కొట్టుకుపోయి రూ.2 లక్షల నష్టం సూర్యాపేట జిల్లా చంద్రన్నకుంటకు చెందిన సత్నామ్సింగ్ ఏటా కాలువ ఒడ్డులో వినాయక విగ్రహాలు అమ్ముతాడు. ఈసారి వంద విగ్రహాలు తీసుకురాగా మున్నేరు వరదతో 20 విగ్రహాలు కొట్టుకుపోయాయి. ఒక్కో విగ్రహం రూ.10 వేల చొప్పున రూ.2 లక్షలు నష్టపోయాడు. మిగిలిన విగ్రహాలకు సైతం కొన్ని భాగాలు దెబ్బతిని, రంగులు కోల్పోవడంతో మళ్లీ సిద్ధం చేసేందుకు రూ.లక్ష వరకు ఖర్చవుతుందని సత్నామ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. రూ.25 వేల విలువైన బియ్యం తడిసి ముద్ద.. ఖమ్మం వెంకటేశ్వరనగర్కు చెందిన భూమా ఉపేందర్, ధనలక్ష్మి ఇల్లు ఏటి ఒడ్డున ఉండడంతో సామగ్రి కొట్టుకుపోయింది. ఉపేందర్ గాందీచౌక్ లో హమాలీగా చేస్తున్నా డు. ఆయన ఇద్దరు పిల్ల లు తొమ్మిది, పదో తరగతి చదువుతున్నారు. బియ్యం ధరలు పెరుగుతాయని ముందుగానే రూ.25 వేలు వెచ్చించి నాలుగు క్వింటాళ్లు కొనుగోలు చేశాడు. అయితే భారీ వరదలో బియ్యం తడిసిపోయాయి. ఎందుకూ పనికి రాకుండా పోవడంతో తిండి గింజలు లేక దంపతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.కొట్టుకుపోయిన రూ.1.80 లక్షల క్యాష్బ్యాగ్ బొక్కలగడ్డకు చెందిన ఘంటసాల గోపాల్, బాలకృష్ణ సోదరులు. వీరి ఇళ్లు ఎదురెదురుగానే ఉన్నాయి. ఇద్దరి ఇళ్లల్లోనూ బురద చేరింది. బురదతో గోపాల్ ఆటో పాడైంది. పాత ఇనుము సామాను వ్యాపారం చేసే బాలకృష్ణ లావాదేవీల కోసం రూ.1.80 లక్షలు అప్పు తెచ్చి పెట్టాడు. వరదలో ఈ డబ్బుల బ్యాగ్ కొట్టుకుపోయింది. వీరి ఇళ్ల పైకప్పులు సైతం లేచిపోవడంతో రెండు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. -
మునిగే తండాలో ఇక ఉండలేం
సాక్షి, మహబూబాబాద్: ‘సారూ.. శనివారం రాత్రి వచ్చిన వరదతో చెట్టుకొకరం.. పుట్టకొకరం అయినం. ట్యాంకులు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నం.. ఇట్టా మునిగే తండాలో ఉండలేం.. మాకు వేరేచోట ఇళ్లు కట్టించి ఇవ్వండి.. తండా అంతా అక్కడే ఉంటాం..’అంటూ సీఎం రేవంత్రెడ్డి ఎదుట మహ బూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం శివారు సీతారాం తండావాసులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పర్యటనలో భాగంగా మంగళవారం తండాకు వచి్చన సీఎం స్థానికులతో మాట్లాడారు. సీఎం: నీ పేరు ఏం పేరు...? తండావాసీ: నాపేరు మంగీలాల్ సార్..సీఎం: ఏం జరిగింది? ఎక్కడివరకు నీళ్లు వచ్చాయి? (ఇల్లు చూపిస్తూ) మంగీలాల్: శనివారం రాత్రి అందాజ 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఇంట్లోకి నీళ్లు రావడం ప్రారంభించాయి. ఏంది అని చూడగానే బయట అంతా కొండ మాదిరిగా నీళ్లతో ఉంది. నా భుజాల వరకు నీళ్లు వచ్చేశాయి. వెంటనే మేము పిల్లల్ని తీసుకుని పెద్ద బిల్డింగ్, ట్యాంకులు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాం..ఇక ఇక్కడ ఉండలేం సార్.. మాకు వేరే ఇల్లు కట్టించండి. సీఎం: శీనన్నా (పొంగులేటి శ్రీనివాస్రెడ్డి) వీళ్లను చూడు. ఈ ఇల్లు మీరే కట్టుకున్నారా? (మళ్లీ మంగీలాల్ను ఉద్దేశించి) మంగీలాల్: లేదు సార్.. ఇందిరమ్మ ఇల్లు అప్పుడు కట్టుకున్నాం. సీఎం: ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం.. ఇక్కడే ఉంటారా.. వేరే చోటుకు వెళ్తారా? కలెక్టర్ గారూ అంతా చూడండి. తండా మొత్తం నమోదు చేసుకోండి. మంచి సైట్ చూడండి. ఇంట్లో ఏం తడిసినయి? ఏం ఇబ్బంది జరిగింది? మంగీలాల్ కొడుకు: సార్ నా పుస్తకాలు తడిసినయి.. ఈ ఇంట్లో ఉండలేము. మళ్లీ మునుగుతాం.. మాకు వేరే ఇల్లు కావాలి. మంగీలాల్: బియ్యం, బట్టలు అన్నీ తడిసినయ్ సార్ సీఎం: ఈమె తెలుసా? (సీతక్కను చూపిస్తూ) ఈమె నీకు కావాల్సిన పుస్తకాలు కొనిస్తుంది.. ఈయన తెలుసా? (ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ను చూపిస్తూ) ఈయన పెద్ద డాక్టర్. ఈయన మాదిరిగానే మంచిగా చదువుకోవాలి.. అధైర్య పడకండి.. అన్నీ చూసుకుంటాం. -
పోతే ఒక్కడిని.. వస్తే పది మందిమి
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం ప్రకాశ్నగర్ బ్రిడ్జిపై వరదలో చిక్కుకున్న తొమ్మిదిమందిని కాపాడేందుకు ‘పోతే ఒక్కడిని..వస్తే పది మందిమి అంటూ జేసీబీ డ్రైవర్ ఎస్కే.సుబాన్ ధైర్యం చేయగా, ‘జేసీబీ మధ్యలో ఆగిపోతే మనమైనా తీసుకొద్దామంటూ’వెంకటగిరికి చెందిన మొర్రిమేకల ఉపేందర్, మొర్రిమేకల జవహర్లాల్, కనపర్తి నాగేశ్వరరావులతోపాటు కొందరు గ్రామపెద్దలు ముందుకు రావడంతో దాదాపు 14 గంటల పాటు ఆపదలో చిక్కుకున్నవారు ప్రాణాలతో బయటపడ్డారు. అసలేం జరిగిందంటే... ఈ నెల 1న ఆదివారం మున్నేరు వాగుకు ఒక్కసారిగా వచ్చిన భారీ వరదతో ఖమ్మం ప్రకాశ్నగర్ బ్రిడ్జిపై వోగబోయిన శ్రీనివాసరావు, ఆయన కుమారుడు విక్రమ్, కట్టెలమండె వాచ్మెన్ మోహన్–లక్ష్మి దంపతులు, వీరి ఇద్దరు కుమారులు, వర్కర్లు వినోద్, వెంకన్నతో పాటు మరొకరు చిక్కుకున్నారు. షాపుల్లో ఉన్న వీరు వరద పరిస్థితిని గమనించి ఎటూ వెళ్లలేక ప్రకాశ్నగర్ బ్రిడ్జిపైకి చేరుకున్నారు. ఉదయం నుంచి తమకు సాయం చేయాలని వీరితోపాటు కుటుంబీకులు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని వేడుకున్నా స్పందన కనిపించలేదు. హెలికాప్టర్ వస్తోందని.. ఎన్డీఆర్ఎఫ్ టీం వస్తుందంటూ రాత్రి 10 గంటల వరకు తాత్సారం చేశారు. యంత్రాంగం జాప్యంతో... యంత్రాంగం చెబుతున్న మాటలతో విసుగెత్తిన వెంకటగిరివాసులు తొమ్మిది మంది ప్రాణాలను ఎలాగైనా రక్షించాలని నిర్ణయించుకున్నారు. అక్కడే ఉన్న జేసీబీ యజమాని వెంకటరమణ దృష్టికి తీసుకెళ్లగా డ్రైవర్ సరేనంటే వాహనం ఇచ్చేందుకు సిద్ధమేనని చెప్పాడు. డ్రైవర్ ఎస్.కే.సుబాన్(హరియాణావాసి)తో మాట్లాడారు. కాలు కాస్త ఇబ్బందిగా ఉండే ఆయన్ను బండి తీసుకొని వరదలోకి వెళ్లే ధైర్యం ఉందా అని అడగగా.. ‘ప్రాణాలను కాపాడేందుకే కదా వెళ్తా.. వస్తే అందరం వస్తాం.. లేకపోతే ఒక్కడిని పోతా’అని ముందుకొచ్చాడు. అయితే రాత్రి 8 గంటల నుంచి రెండుసార్లు ప్రయతి్నంచగా.. మధ్యలో రోడ్డు కోతకు గురికావడంతో బండి ముందుకు కదల్లేదు. దీంతో మొర్రిమేకల ఉపేందర్, మొర్రిమేకల జవహర్లాల్, కనపర్తి నాగేశ్వరరావు తాము తాళ్ల సాయంతో బ్రిడ్జిపైకి వెళతామని చెప్పగా..11 గంటల సమయాన వారు రోడ్డు కోతకు గురైన ప్రాంతం వరకు జేసీబీపై వెళ్లి అక్కడ నుంచి జేసీబీ బకెట్ మీదుగా బ్రిడ్జివైపు దిగారు. అనంతరం బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది మందిని అదే జేసీబీ బకెట్లోకి ఎక్కించి సురక్షితంగా ఇవతలికి తీసుకొచ్చారు. తొమ్మిది మందిని సురక్షితంగా తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన జేసీబీ యజమాని, స్థానికులతోపాటు డ్రైవర్ సుబాన్ సేవలను కొనియాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రాణాలను కాపాడాలని.. వరదలోకి వెళ్లేందుకు ధైర్యం ఉందా అని అడిగారు. నేను పోతే ఒక్కడినే.. వస్తే పది మంది అని సాహసించి ముందుకు వెళ్లాను. ఇంజిన్ పైకి నీళ్లు వచ్చాయి. మొదట రెండుసార్లు ప్రయతి్నంచి విఫలమయ్యాను. మూడోసారి స్థానికుల సహకారంతో తొమ్మిది మందిని రక్షించగలిగాం. – ఎస్.కే.సుబాన్, జేసీబీ డ్రైవర్డ్రైవర్తో పాటే మేం కూడా.. హెలికాఫ్టర్తో కాపాడుతారని అంటుంటే చూద్దామని వచ్చాం. ప్ర భుత్వ సాయం ఎంతకూ అందకపోవడంతో వారిని రక్షించేందుకు మేము ముందుకొచ్చాం. జేసీబీ డ్రైవర్తో పాటు మేము తాళ్లను తీసుకొని వరదను దాటి వెళ్లి తొమ్మిది మందిని ఒడ్డుకు చేర్చాం. – మొర్రిమేకల ఉపేందర్, వెంకటగిరివాసిబండికి నష్టం జరిగినా సరే అన్నా.. జేసీబీ పోయినా ప ర్వాలేదు.. ప్రాణాలు కాపాడొచ్చనుకుని బండి పంపించా. పోలీసులు ఒప్పుకోకుంటే మాదే బాధ్యత అని ఒప్పందం చేసుకొని బండి ని పంపా. జేసీబీ ఇంజిన్లోకి నీళ్లు పోవడంతో మరమ్మతుకు రూ.85 వేలు ఖర్చు అవుతుంది. అయినా ప్రాణాలు కాపాడామనే తృప్తి కలిగింది. – వెంకటరమణ, జేసీబీ యజమాని -
International Day of Charity observed: వరదెత్తిన కష్టాల్లో కరుణే ప్రదానం
ఖమ్మం గుమ్మంలో వరద. బెజవాడ కంటిలో బుడమేరు ΄పొంగు. ఆకలి ఆర్తనాదాలు తెలుగువారిని చుట్టుముట్టాయి. ఈ సమయంలో సాయం చేసే చేతులే కాదు దాతృత్వం చూపే గుండెలూ కావాలి. నోట్ బుక్స్ తడిసిపోయిన ఒక చిన్నారికి స్కూల్ బ్యాగ్తో మొదలు గుడిసె కూలిన ఒక పేదవాడికి చిన్న ఆసరా వరకూ దాతృత్వంతో సాయం చేయవచ్చు. ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చేస్తాయి. మనుషులం మనం. ఇవ్వడం తెలిసినవాళ్లం. ఇది ఇవ్వాల్సిన సమయం.‘దానం చేయడం వల్ల ఎవరూ పేద కాబోరు’ అంటుంది ఆనీ ఫ్రాంక్ అనే యూదు బాలిక. ‘ఎంత దానం ఇస్తున్నావన్నది కాదు... ఎంత ప్రేమగా దానం ఇస్తున్నావన్నదే ముఖ్యం‘ అంది మదర్ థెరిసా. ‘దానమీయని వాడు ధన్యుండుగాడయ’ అన్నాడు వేమన. ‘దానం చేయనివారు భూమికి పెద్ద భారం’ అన్నాడు శ్రీనాథుడు. ‘పిట్టకు చారెడు గింజలు... చెట్టుకు చెంబుడు నీళ్లు... ఇవి అందించడానికి మించిన మానవ జన్మకు పరమార్థం ఏముటుంది’ అంటుంది ఓ కథలోని బామ్మ. దానం మనిషి గుణం. ముఖ్యంగా సాటి మనిషి కష్టకాలంలో ఉన్నప్పుడు దానం చేయడానికి తప్పకుండా ముందుకు రావాలి.మనది దానకర్ణుడి నేలమనది దాన కర్ణుడి నేల. ఒకసారి కృష్ణుడు కర్ణుడిని చూడటానికి వెళితే ఆ సమయానికి అతను స్నానానికి సిద్ధమవుతూ రత్నాలు ΄÷దిగిన గిన్నెలో నూనె తలకు రాసుకుంటున్నాడట. కృష్ణుడు ఆ గిన్నె చూసి ‘కర్ణా.. గిన్నె చాలా బాగుంది ఇస్తావా’ అనగానే ఎడమ చేతిలో ఉన్న గిన్నెను ‘తీసుకో’ అని అదే చేత్తో ఇచ్చేశాడట కర్ణుడు. కృష్ణుడు ఆశ్చర్యపోయి ‘అదేమిటి కర్ణా... ఎడమ చేత్తోనే ఇచ్చేశావు’ అనంటే కర్ణుడు ‘అంతే కృష్ణా. దానంలో ఆలస్యం కూడదు. నువ్వు అడిగాక ఎడమ చేతిలో నుంచి కుడి చేతిలోకి మారేలోపు నా మనసు మారొచ్చు. లేదా నాకు మృత్యువు సమీపించవచ్చు. అందుకే ఇచ్చేశాను’ అన్నాడట. లోకంలో ఎందరో చక్రవర్తులు పుట్టి ఉంటారు, గిట్టి ఉంటారు. కాని దానం కోసం నిలిచిన శిభి, బలి చక్రవర్తులే ఇన్ని వేల ఏళ్ల తర్వాత కూడా శ్లాఘించబడుతున్నారు.వరదల్లో అన్నం పెట్టిన తల్లితూర్పు గోదావరి జిల్లాలోని లంకలగన్నవరంలో తరచూ వరదల చేత లేదంటే ΄÷లాలు పండకపోవడం చేత జనం ఆకలితో అల్లాడుతుంటే వారి కోసమని అన్నదానం మొదలెట్టి ఆంధ్రుల అన్నపూర్ణగా కొలవబడుతున్న తల్లి డొక్కా సీతమ్మ (1841–1909)ను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మన దగ్గర ఉన్నది అవసరమున్న వారికి పంచడం వల్ల కలిగే తృప్తి, దొరికే ఆశీర్వచనం దైవికమైనవి. దానాల్లోకెల్లా శ్రేష్ఠమైనది అన్నదానం అంటారు. ఇవాళ వరదల్లో చిక్కుకున్నవారి కోసం అన్నదానం చేయవలసినవారే కావాల్సింది.స్పందించే హృదయంమనిషి హృదయానికి ఉన్న గొప్ప లక్షణం స్పందించే గుణం. అదే మానవత్వ గుణం. కరుణ, కనికరం, దయ, సానుభూతి ఇవన్నీ సాటి మనిషి కోసం సాయపడమంటాయి. సాయంలో ఉన్నతమైనది దాతృత్వం. కొందరు అడగకపోయినా దానం చేస్తారు. కొందరు అడిగినా చేయరు. ఉండి కూడా చేయరు. ఒకప్పుడు పెద్ద పెద్ద ఘటనలు జరిగితే సినిమా హీరోలతో మొదలు సామాన్యుల వరకూ స్పందించేవారు. కనీసం నూట పదహార్లు పంపే పేదవారు కూడా ఉండేవారు. ఇవాళ దానం కోసం ప్రొత్సహించే వ్యక్తులు లేరు. తామే తార్కాణంగా నిలవాలని కూడా అనుకోవడం లేదు. వేల కోట్లు ఉన్నవారు కూడా రూపాయి విదల్చకపోతే ఆ సంపదకు అర్థం ఏమిటి?లక్ష సాయాలుఇవాళ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలో వరద బీభత్సంగా ఉంది. పిల్లలకు పుస్తకాల దగ్గర నుంచి వృద్ధులకు మందుల వరకు అన్నీ కావాలి. వంట పాత్రలు నాశనమయ్యాయి. స్టవ్లు పాడయ్యాయి. ఇళ్లు కూలిన వారు ఎందరో. పశువులు కొట్టుకుని పోయాయి. చేతి వృత్తుల పరికరాలు, ఉపాధి సామాగ్రి అంతా పోయింది. జనం రోడ్డున పడ్డారు. వీరి కోసం ఎన్ని వేల మంది సాయానికి వస్తే అంత మంచిది. సరిౖయెన చారిటీ సంస్థలకు విరాళాలు ఇచ్చి సాయం అందగలిగేలా చూడటం అందరి విధి. లేదా ముఖ్యమంత్రుల సహాయనిధికే విరాళం ఇవ్వొచ్చు. మన దగ్గర డబ్బు లేకపోతే సమయం అయినా దానం ఇవ్వొచ్చు. సమయం వెచ్చించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నా చాలు. నేడు ‘అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం’ సందర్భంగా చంద్రునికో నూలుపోగైనా ఇద్దామని సంకల్పిద్దాం. -
‘సాయం’ చేతగాక దాడులా?.. ఖమ్మం ఘటనపై కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం దాడి ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ నేతలపై దాడిని ఖండించిన కేటీఆర్... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్కుమార్, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయటం అసహనానికి నిదర్శనం మంటూ మండిపడ్డారు. ప్రజలకు సాయం చేయటం చేతగాక... సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబడ్డారని కేటీఆర్ ధ్వజమెత్తారు.‘‘మీరు ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండటమే తప్పా?. ప్రజలకు సేవ చేయటం చేతకాదు...సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయటమా? సిగ్గు చేటు. ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి.’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.‘‘ఇలాంటి ఎన్ని దాడులు చేసిన సరే.. ప్రజల వద్ద బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారు. మీకు సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయం.’’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. -
పువ్వాడపై రాళ్ల దాడి..
-
హరీష్రావు ఖమ్మం పర్యటనలో ఉద్రిక్తత.. రాళ్ల దాడి
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హరీష్రావు వాహనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ వాహనాలపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. వరద బాధితులను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీష్రావు ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి.. బడ్జెట్లో సున్నా, వరద సాయంలోనూ సున్నా’’ అంటూ హరీష్రావు మండిపడ్డారు.అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తే, ప్రధానిని నిలదీద్దామని హరీష్రావు అన్నారు. రాష్ట్ర, కేంద్ర నిర్లక్ష్యానికి మహబూబాబాద్, ఖమ్మం ప్రజలు బలైపోయారు. సాగర్ కెనాల్ కొట్టుకుపోవడం వల్ల వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన మండిపడ్డారు. -
‘పోతే నా ఒక్కడి ప్రాణం..’ ఖమ్మం రియల్ హీరో సాహసం వైరల్
ఖమ్మం, సాక్షి: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం అతలాకుతలం అయింది. మున్నేరుకు పోటెత్తిన వరదతో ఖమ్మం, ఖమ్మం రూరల్ మండలాల్లోని పరీవాహక ప్రాంత కాలనీల్లోకి నీరు చేరింది. తెలుగురాష్ట్రాల రాకపోకలకు కేంద్రబిందువుగా ఉన్న ఖమ్మం జిల్లా కేంద్రం ఒక్కరోజు కురిసిన వర్షానికే జలదిగ్భంధం అయిపోయింది. అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించిపోయింది. అయితే..శనివారం రోజు కురిసిన భారీ వర్షాలకు.. మున్నేరు వరద ప్రమాదకరంగా పొంగిపొర్లింది. భారీ వర్షం, వరద ధాటికి ప్రకాశ్నగర్ బ్రిడ్జ్ మీద నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహించింది. అనుకోకుండా.. ఈ బ్రిడ్జి మీద చిక్కుకుపోయిన తొమ్మిది మంది సాయం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూశారు. ఈ ప్రమాదకర వరదల్లో సుభాన్ ఖాన్ అనే జేసీబీ డ్రైవర్ ప్రదర్శించిన సాహసం.. జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది. If I go, it is one life, if I return, I will save nine lives: this was the courage shown by #Subhankhan who took a JCB to bring back 9 people marooned on Prakash Nagar Bridge #Khammam from early hrs on Sept1; You can hear daughter brimming with pride #MyDaddyBravest #RealLifeHero pic.twitter.com/tbthGfUhRB— Uma Sudhir (@umasudhir) September 3, 2024వాళ్లను రక్షించేందుకు సుభాన్ ప్రయత్నిస్తుండగా అంతా వారించారు. ‘నేను అక్కడిపోతే నాది ఒక్క ప్రాణం పోవచ్చు. నేను సాహసం చేస్తే తొమ్మిది ప్రాణాలు రక్షించిన వాడిని అవుతాను’ అని జేసీబీతో వెళ్లి వారిని బయటకు తీసుకువచ్చారు. వరద సహాయక కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక బీఆర్ఎస్ నేతలు, స్థానిక ప్రజలు జేసీబీ డ్రైవర్ సుభాన్ ఖాన్ చేసిన సాహసాన్ని కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సుభాన్ను ఫొన్లో అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఆ రియల్ హీరో సాహసం నెట్టింట చర్చగా మారింది. -
గుండె కరిగిపోయే, మనసు చెదిరిపోయే దృశ్యాలు చూశా: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే దృశ్యాలు స్వయంగా చూశానని తెలిపారు. బాధితుల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సర్కార్ ఎంతటి సాయం చేయడానికైనా సిద్దమని తెలిపారు. బాధితుల మొఖాలలో ఓవైపు తీరని ఆవేదన.. మరోవైపు అన్నా’ వచ్చాడన్న భరోసా కనిపించిందన్నారు.గుండె కరిగిపోయే దృశ్యాలు…మనసు చెదిరిపోయే కష్టాలు…స్వయంగా చూశాను.బాధితుల మొఖాలలో …ఒకవైపు తీరని ఆవేదన…మరోవైపు “అన్నా” వచ్చాడన్న భరోసా.వీళ్ల కష్టం తీర్చడానికి…కన్నీళ్లు తుడవడానికి…ఎంతటి సాయమైనా చేయడానికి సర్కారు సిద్ధం.#TelanganaRains2024 pic.twitter.com/0NQPobJsd5— Revanth Reddy (@revanth_anumula) September 3, 2024మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు.వరదలో కొట్టుకుపోయి చనిపోయిన సైంటిస్టు అశ్విని కుటుంబాన్ని పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలు, పొలాలు, రోడ్లు పరిశీలించనున్నారు. -
వరద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: సీఎం రేవంత్
సాక్షి,ఖమ్మం: వరద బాధితులకు తక్షణసాయం కింద రూ. 10 వేలు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఖమ్మం వరదల ప్రాంతాల్లో సీఎం రెండో రోజు పర్యటన సందర్భంగా మీడియాతో చిట్చాట్ మాట్లాడారు. అనంతరం మహబూబాబాద్లో పర్యటించి వరద బాధితులను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఖమ్మంలో కూడా వరదలు ఆక్రమణల వల్లే వచ్చాయి. మున్నేరు రిటెయినింగ్ వాల్ ఎత్తు పెంచడంపై ఇంజనీర్లతో మాట్లాడి చూస్తాం. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి అవసరం అనుకుంటే ఆక్రమణలు తొలగిస్తాం. మిషన్ కాకతీయ అనేదే కమీషన్ కాకతీయ అని దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలో చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పటిష్టం చేశాం అన్నారు.మరి గతంలో తెగని చెరువులు ,ఇప్పుడు ఎందుకు తెగుతున్నాయి.75 సంవత్సరాలలో ఇంత వర్షం ఎప్పుడూ పడలేదు. అంత విపత్తు జరిగినా ప్రాణ నష్టాన్ని తగ్గించామంటే అది ప్రభుత్వ ముందు చూపే. వరదలపై హరీశ్రావు మాట్లాడుతున్నారు. ముందు మీ పార్టీ నాయకుడు పువ్వాడ అజయ్ ఆక్రమించిన హాస్పిటల్లో కాలువల విషయంలో హరీశ్రావు నిలబడి తొలగించి ఆదర్శంగా ఉండాలి. కేంద్రం ప్రభుత్వానికి లేఖ రాశాం. వారి నుంచి స్పందన రావాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మాత్రం మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నాం. వరదల సహాయంతో మా మంత్రులు ప్రజలతో ఉంటున్నారు. మా ప్రజలు మమ్ముల్ని అడుగుతారు.. నిలదీస్తారు.. వారు మా వారే.. మాకు ఓటు వేసి గెలిపించారు. ఫాంహౌస్లో పడుకున్న వారిని అడుగుతారా? ఇటువంటి విపత్తుల సమయంలో గతంలో ముఖ్యమంత్రులు హామీలు ఇచ్చారు. అమలు చేయలేదు. మాది చేతల ప్రభుత్వం. గత ప్రభుత్వ హామీలు కూడా మేమే అమలు చేస్తాం. రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా విపత్తు నిర్వహణ సంస్థ సిద్ధం చేస్తున్నాం’అని సీఎం తెలిపారు. మహబూబాబాద్లో సీఎం కామెంట్స్.. యువ సైంటిస్టు అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అశ్విని సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాంఆకేరు వాగు పొంగిన ప్రతిసారి మూడు తండాలు మునుగుతున్నాయి.వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకుంటాం. -
ఖమ్మం : ముంచెత్తిన మున్నేరు.. ఖమ్మం కకావికలం (ఫొటోలు)
-
సహాయక చర్యల్లో ఆ మంత్రులు విఫలం
సాక్షి, హైదరాబాద్, చేగుంట(తూప్రాన్): ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వరదల్లో చిక్కుకున్న 9 మందిని కూడా కాపాడలేకపోయారని మాజీ మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. సోమవారం మెదక్ జిల్లా చేగుంటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాతావరణశాఖ హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే అనేక మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు.వర్షాలతో 16 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం 31 మంది మృతి చెందారని తెలిపారు. ఖమ్మంలో కాపాడమని కోరుతున్న వరద బాధితులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు సహాయక చర్యలు చేపట్టడం మానేసి బీఆర్ఎస్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని నిందించారు. ప్రతీ ఎకరాకు రూ.10వేల పరిహారమివ్వాలి ఓ వైపు ప్రజలు ఆపదలో ఉంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాజకీయాలు మాట్లాడుతున్నారని హరీశ్రావు విమర్శించారు. ప్రజల కన్నీళ్లు తుడవకుండా ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారని ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ ఎకరాకు రూ.10వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, శాసన మండలి మాజీ సభ్యులు, ప్రొఫెసర్ నాగేశ్వర్పై సోషల్ మీడియా వేదికగా బీజేపీ చేస్తున్న దాడిని హరీశ్రావు ఖండించారు. -
సోషల్ మీడియాలో బతికేస్తున్న కేటీఆర్, హరీశ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రతిపక్షాలు ప్రజాప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు పనికిమాలినవని.. వాళ్లు చేసిన పాపాలపై నిలదీస్తారనే భయంతో ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేక ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు రాజకీయంగా బతికేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. అనుకోని విధంగా వచి్చన ఈ విపత్తును ఎదుర్కొనేలా రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్గా ఉన్నందునే రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు.వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులరి్పంచాక డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలకు పని లేదని.. వారు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గత బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా తాము గడీల్లో పడుకోలేదని, ప్రజల మధ్యే ఉండి సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో కొద్దిపాటి వర్షం పడితే జంట నగరాలు మునిగిపోయాయని, కానీ ఇంత పెద్ద విపత్తు వచ్చినా హైదరాబాద్ నేడు సురక్షితంగా ఉందంటే తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఫలితమేనని భట్టి తెలిపారు. భారీ వర్షాలు, వరదతో నిరాశ్రయులైన వారికి తక్షణమే నిత్యావసర సరుకులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. -
ప్రతీ ఎకరాకు పది వేల సాయం: సీఎం రేవంత్
CM Revanth Khammam Tour Updates..👉వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.ఖమ్మం జిల్లాకు వెళ్తూ సూర్యాపేట జిల్లాలో వరదలపై సీఎం రేవంత్ సమీక్ష.మోతే మండలం రాఘవపురం వద్ద రైతులు, అధికారులతో సీఎం రేవంత్ సమీక్షసమీక్షకు హాజరైన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి, మందుల సామెల్, పద్మావతి, వేం నరేందర్ రెడ్డిసీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్సూర్యాపేట జిల్లాలో 30 సెంటిమీటర్ల అతి భారీ వర్షం పడిందిపంట, ఆస్తి నష్టం పైన అధికారులు ప్రాథమిక నివేదికను అధికారులు ఇచ్చారు.ప్రభుత్వం నిరంతరంగా మంత్రులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం.ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.ఖమ్మం, నల్లగొండ పరిస్థితిపై ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరానువర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారంపశువులు చనిపోతే 50 వేల సాయంపంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి పదివేల సాయంఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లుసూర్యాపేట కలెక్టర్కు తక్షణ సాయంగా ఐదు కోట్లుపాఠశాల సెలవులపైన జిల్లా కలెక్టర్లకు నిర్ణయాధికారంవరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ధన్యవాదాలుఅమెరికాలో ఉండి ఒకాయన ట్విట్టర్ పోస్టులు పెడుతున్నాడుఒకాయన ఫాంహౌస్లో ఉన్నాడువరద సమయంలో బురద రాజకీయాలు వద్దు.బెయిల్ కోసం 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళతారు కానీ వరద బాధితులను పరామర్శించరు.మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా నేను సమీక్ష చేస్తున్న.వరదల సమయంలో కేంద్రం వైపు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ను ప్రారంభించుకుంటున్నాం.జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాన మోదీని ఆహ్వానించాంరాష్ట్రంలో ఐదు వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వస్తున్నాయి.తక్షణమే కేంద్రం రెండు వేల కోట్లు కేటాయించాలని కోరుతున్న.కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు పని చేయాలి.రాజకీయాలకు ఇది సమయం కాదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..నాకు ఊహ తెలిసింత వరకు ఇంతలా మున్నేరు వాగు ఉధృతిని చూడలేదు.వరద ఒక ప్రళయంగా విరుచుకుపడింది.జనం చిగురు టాకులా వణికిపోయారు.అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నాం.ఆస్తి నష్టం మాత్రం పెద్ద ఎత్తున జరిగింది.ఇది ప్రకృతి వైపరీత్యం.ప్రతిపక్ష పార్టీలు వరదలను కూడా రాజకీయం చేస్తున్నాయి.సోషల్ మీడియా పోస్టులు పెడుతూ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చూస్తుంది.ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.జనం ఎవరు ఆందోళన చెందవద్దు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం..బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది.జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా చూడటానికి సీఎం ఖమ్మం రావడాన్ని ఖమ్మం ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం.తాత్కాలిక ఉపశమనం కోసం వరద బాధితులకు 10వేలు ఇస్తున్నాం.నష్టం తీవ్రత ఎంత అన్నది పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత దాని ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. మంత్రి ఉత్తమ్ కామెంట్స్..రెండు రోజులుగా భారీ వర్షాలతో ప్రజల ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనప్రకృతి వైపరీత్యాలతో భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉండేందుకు రాష్ట్ర యంత్రాంగం సమాయత్తం అయిందిదురదృష్టవశాత్తు కోదాడలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారుకొన్ని ఇండ్లకు నష్టం జరిగాయిజిల్లా యంత్రాంగం అద్భుతంగా స్పందించిందిజిల్లా అధికారులకు అభినందనలుచనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి.వ్యవసాయ పొలాల్లో నీరు వచ్చి నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను.మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్..అనుకోని వర్షాలతో ప్రజా ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం.మరో మూడు రోజులు వర్షాలు నేపధ్యంలో దెబ్బతిన్న ఆర్ అండ్ బీ రోడ్లను మరమ్మతులు చేపిస్తాం. దెబ్బ తిన్న నేషనల్ హైవే వారం తరువాత పునరిద్దరిస్తాం.నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలి.అధికారులు లీవ్లు పెట్టకుండా 24గంటలు అందుబాటులో ఉండాలి మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్..మున్నేరు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో వారి ఇళ్లలో ఉన్న పరిస్థితిని చూస్తే కన్నీళ్లు వచ్చాయి.సీఎం గారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.మున్నేరు ఉధృతికి సంబంధించి టీవీల్లో వార్తలను చూసి తాను కూడా ఖమ్మం రావాలనుకున్నాను.అంతలా ఖమ్మంలో వర్ష బీభత్సం కొనసాగింది.మున్నేరు ఉధృతిని చూస్తే ఊహించని ప్రళయమే అన్నట్లు అనిపించింది.వరదల నేపథ్యంలో చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం కలిసికట్టుగా పని చేసి ముంపు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.ప్రతిపక్ష పార్టీల విమర్శలను మీడియా వాళ్ళు పట్టించుకోవద్దు. 👉తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు, వరద సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అలాగే, ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించనున్నారు. 👉ఇక, సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్.. భారీ వర్ష సూచన ఉన్న చోట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సహాయక బృందాలు చేపడుతున్న చర్యలపై అధికారులతో సీఎం చర్చించారు. పంటనష్టం వాటిల్లిన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు, సీఎం సలహాదారు వేంనరేందర్రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.👉అనంతరం, సీఎం రేవంత్ ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరారు. సోమవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ ఖమ్మం జిల్లాలోనే బస చేయనున్నారు. ఇక, రేపు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మార్గం మధ్యలో కోదాడలోనూ పర్యటించనున్నారు. నేడు ఖమ్మం జిల్లాలో పర్యటనకు వెళ్లూ సూర్యాపేట, పలు వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ పరిశీలించనున్నారు. -
ఆ 9 మందిని కాపాడే వరకు ఇక్కడ నుంచి వెళ్ళను..
-
ముంచెత్తిన మున్నేరు.. ఖమ్మం కకావికలం
-
మంత్రి తుమ్మలకు నిరసన సెగ
సాక్షి,ఖమ్మం : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు నిరసన సెగ తగిలింది. ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్ వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లిన తుమ్మలకు వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు.గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది. ప్రకాశ్ నగర్ వద్ద డేంజర్ లెవల్లో మున్నేరు ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మం పట్టణంలోని ఇండ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇళ్ల మధ్య నుంచి మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రకాశ్ నగర్ వద్ద మున్నేరు వాగు గోదావరి నదిని తలపిస్తోంది. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో ఖమ్మం ప్రకాష నగర్ బ్రిడ్జ్పై తొమ్మిది మంది చిక్కుకున్నారు.ఈ తరుణంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరు వరద పరిశీలించేందుకు తమ్మల నాగేశ్వర్రావు వెళ్లారు. ఆ సమయంలో తుమ్మలకు నిరసన సెగ తగిలింది. ప్రభుత్వానికి,తుమ్మలకు వ్యతిరేకంగా వరద పరిశీలిస్తున్న తుమ్మలను అడ్డుకున్నారు. ఉదయం 9 గంటల నుండి వరదల్లో చిక్కుకున్న 9 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించ లేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఖమ్మం లింగయ్యనగర్లో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, ఖమ్మం జిల్లా: ఖమ్మంలోని లింగయ్య నగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జేసీబీలతో గుడిసెలను తొలగించేందుకు ప్రైవేట్ వ్యక్తులు యత్నించారు. ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నామంటూ భూదాన్ భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. తమ ప్రాణాలైనా అర్పిస్తామంటున్న భూదాన్ భూ నిర్వాసితులు, ప్రైవేట్ వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది.అడ్డుకున్న భూదాన్ నిర్వాసితులపై దాడి జరిగింది. ఈ క్రమంలో మహిళలకు తీవ్ర గాయాలు కాగా, ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ వ్యక్తులను భూదాన్ భూ నిర్వాసితులు తరిమికొట్టారు.ప్రైవేట్ రౌడీలు వచ్చి పోలీసుల సమక్షంలో తమపై దాడికి పాల్పడుతున్న కానీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తమకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలనంటే పోలీసుల సమక్షంలో రౌడీలు వచ్చి తమపై దాడి చేయడమా అంటూ నిర్వాసితులు మండిపడ్డారు. -
జాలి లేని దేవుడా... ఎంత పని జేత్తివిరా?
ఖమ్మంరూరల్: తల్లి గర్భం నుంచి సెకన్ల తేడాతో లోకంలోకి వచ్చిన వారిద్దరూ కలిసే పెరిగారు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఉద్యోగాలు సాధించి కూలీనాలి చేస్తూ తమను పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని భావించాలనే తపనతో కష్టపడుతున్నారు. ఇంతలోనే వీరిని మృత్యువు ఒకేసారి బలి తీసుకుంది. 22ఏళ్లుగా కలిసి పెరుగుతున్న సోదరులను కలిపే తీసుకెళ్లిన జాలి లేని మృత్యువును శాపనార్ధాలు పెడుతున్న వారి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాద ఘటన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి సమీపాన మంగళవారం చోటు చేసుకుంది. నిరుపేద కుటుంబం...ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెంకు చెందిన అత్తులూరి నర్సింహారావు, రమాదేవి దంపతులు కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మహేష్, నవీన్(22) కవల కుమారులు ఉన్నా రు. సోదరులిద్దరు డిగ్రీ పూర్తిచేయగా గ్రూప్స్తో పాటు పోలీసు ఉద్యోగ నియామక పరీక్షలకు సిద్ధమవుతూ కొన్నాళ్లుగా ఖమ్మంలోని ఓ సెంటర్లో శిక్షణ పొందుతున్నారు. మంగళవారం ఉదయం తల్లి రోజులాగే కూలీ పనులకు వెళ్లగా తండ్రి ఇంకో గ్రామానికి వెళ్లాడు. దీంతో సాయంత్రం సోదరులిద్దరూ బైక్పై స్నేహితుడైన భద్రాద్రి జిల్లా సుజాతనగర్కు చెందిన పవన్తో కలిసి తమ అమ్మమ్మ ఊరైన కూసుమంచి మండలం పెరికసింగారం బయలుదేరారు. అక్కడ వీరి మేనమామ మెకానిక్ షెడ్ నిర్వహిస్తుండడంతో అప్పుడప్పుడు వెళ్లి కాసేపు గడిపి వచ్చేవారు. అలాగే, మంగళవారం కూడా వెళ్లిన సోదరులు గమ్యస్థానానికి చేరలేదు.ఆటో రూపంలో వచ్చిన మృత్యువుకవల సోదరులు మహేష్, నవీన్తో పాటు వారి స్నేహితుడు పవన్ బైక్పై పెరికసింగారం వెళ్తుండగా మార్గమధ్యలో మద్దులపల్లి వద్ద ఎదురుగా వచ్చిన ట్రాలీ ఆటో వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేష్, నవీన్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే, పవన్కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. కాగా, అమ్మమ్మ దగ్గరకు వెళ్తున్నామని చెప్పి బయలుదేరిన మహేష్, నవీన్ మృతి చెందారని తెలియడంతో స్వగ్రామమైన దానవాయిగూడెంతో పాటు అమ్మమ్మ ఊరైన పెరికసింగారంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. కలిసి జన్మించిన కుమారులు కలిసే పెరిగి కుటుంబానికి అండగా నిలుస్తారని భావిస్తున్న తరుణంలో ఒకేసారి కన్ను మూయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రెక్కల కష్టంతో కుమారులిద్దరిని చదివించామని, ఉద్యోగాలు సాధించేందుకు శిక్షణ పొందుతుండగా ఇలా జరిగిందని వారు రోదిస్తున్న తీరుతో అంతా కంటతడి పెట్టారు. ఈమేరకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా తల్లిదండ్రులు, బంధువులు రాత్రంతా రోదిస్తూ అక్కడే గడిపారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామారావు తెలిపారు. -
ఖమ్మంలో సంచలనం రేకెత్తించిన బాలుడి దత్తత ఘటన సుఖాంతం
-
బతుకు బండికి భరోసా!
ఆమె చేస్తున్నది టీజీఎస్ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం. ఆమె భర్త హోంగార్డు.. వారిది దిగువ మధ్య తరగతి కుటుంబం.. అయితేనేం, థలసీమియా వ్యాధి బారిన పడిన చిన్నారులకు చేతనైన మేరకు అండదండలు అందించాలన్న సంకల్పానికి ఇవేమీ అడ్డంకి కాలేదు. తన సమీప బంధువు కుమారులు థలసీమియాతో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు పడిన వేదనను చూసి చలించి పోయింది. అప్పుడే ఆమె థలసీమియా బాధితులకు చేతనైన సేవ చేయాలని సంకల్పించింది. ఆమె సంకల్ప బలం ముందు తనకు వచ్చే ఆదాయం ఎంత..? తాను ఎలా సాయపడగలననే ఆలోచనలు చిన్నవే అయ్యాయి.ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ కాలనీలో ఉంటున్న ప్రోద్దుటూరి అనిత ఖమ్మం ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తోంది. ఆమె భర్త రవిచందర్ సీపీ కార్యాలయంలో హోమ్గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వారి బంధువుల పిల్లలిద్దరూ థలసీమియాతో బాధపడుతూ మృతిచెందారు. ఆ బాలల తల్లిదండ్రులు పడిన వేదనను దగ్గర నుంచి చూసిన అనిత అలాంటి చిన్నారుల కోసం ఏదైనా చేయాలని సంకల్పించారు. గతంలో హెచ్ఐవీపై అవగాహన కల్పించే స్వచ్ఛంద సంస్థలో పనిచేసిన అనుభవంతో రక్త సేకరణపై దృష్టి పెట్టారు. ఆమె నిర్ణయానికి కుటుంబం మద్దతుగా నిలిచింది.స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం...థలసీమియాతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాద్ వెళ్లి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితులు. దీంతో గతంలో అనిత పనిచేసిన ఎ జీవో ద్వారా సేవ చేద్దామని చూసినా.. వీలు కాక΄ోవడంతో వ్యక్తిగత దాతల నుంచి రక్తదానం చేయించడం ద్వారా పిల్లలకు రక్తం ఎక్కించే వారు. ఆ తర్వాత 2010లో ‘సంకల్ప స్వచ్ఛంద సంస్థ’ పేరుతో రిజిస్టర్ చేశారు. తొలుత 25 మందికి ఈ సంస్థ ద్వారా రక్తం ఎక్కించడం ్ర΄ారంభించారు. హైదరాబాద్ వెళ్లి రక్తం ఎక్కించుకోవడం చాలా వ్యయ ప్రయాసలతో కూడిన పని కావడంతో ఇక్కడ సంఖ్య పెరిగింది. దీంతో రక్తదాతల కోసం కాలేజీలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రక్తదాతల భాగస్వామ్యంతో ఇప్పుడు ‘సంకల్ప’ ద్వారా 220 మందికి రక్తం అందుతోంది. ఇక్కడ చికిత్సతో పాటు మందులు కూడా ఉచితమే. 2009 నుంచి ఇప్పటివరకు 500కు పైగా బ్లడ్క్యాంపులతో΄ాటు వ్యక్తిగత దాతల నుంచి 15 వేల లీటర్లకు పైగా రక్తాన్ని సేకరించి చిన్నారులకు అందజేశారు.‘కరోనా’ కాలంలోనూ...కరోనా కష్ట కాలంలోనూ థలసీమియా చిన్నారులకు రక్తం ఎక్కించే ప్రక్రియ నిరాటంకంగా సాగింది. అనిత చేస్తున్న సేవతో స్ఫూర్తి పోందిన అనేకమంది బయటకు రావడానికే భయపడుతున్న ఆ సమయంలోనూ ఆ చిన్నారుల కోసం రక్తదానం చేశారు.సంస్థ ఆధ్వర్యంలో అవగాహన...థలసీమియా అనేది నివారించదగిన వ్యాధి. అలాగే వంశ΄ారంపర్యంగా వస్తుంది. పెళ్లికి ముందు హెచ్బీఎ –2 (ఎలక్ట్రో ఫోర్సెస్) పరీక్ష చేయించుకుంటే థలసీమియా వ్యాధితో పుట్టే పిల్లలు లేకుండా చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వాలు కూడా పోలియో, ఎయిడ్స్పై ప్రచారం చేసినట్లుగా థలసీమియా పరీక్షలపై అవగాహన కల్పించడం లేదు. ఈ క్రమంలో సంకల్ప స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 7,500 మంది డిగ్రీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. థలసీమియాపై అవగాహన కల్పించేలా ప్రతి ఏడాది ర్యాలీ నిర్వహిస్తున్నారు.బోన్ మ్యారో ఆపరేషన్లపై దృష్టి...థలసీమియా రహితం కావాలంటే బోన్ మ్యారో ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఇది సామాన్యులకు సాధ్యపడేది కాదు. అయితే చిన్నారులకు ఈ ఆపరేషన్లు చేయించడం పై దృష్టి పెట్టింది సంకల్ప. నామమాత్రపు ధరలతో ఆపరేషన్ జరిగేలా సంస్థ చర్యలు తీసుకుంటోంది. ఈ సంస్థ ్రపారంభించిన తర్వాత రక్తం అందక చనిపోయిన వారు లేరంటే సంస్థ సంకల్ప బలం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.– బొల్గం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మంకడుపు కోత తప్పించాలనే...ఓ కుటుంబంలో తలసేమియాతో ఉన్న పిల్లలు పుట్టారంటే వారిని ఎలా కా΄ాడుకోవాలన్నది బాధ చెప్పలేనిది. ఆ నరకం నుంచి తల్లిదండ్రులు బయటపడాలనేది మా సంకల్పం. ప్రస్తుతం ఇది నిర్విఘ్నంగా సాగుతోందంటే దాతల వల్లనే సాధ్యమవుతోంది. నేను కండక్టర్గా బస్సులో ఏ గ్రామానికి వెళ్లినా అక్కడ బస్సు ఎక్కే యువకులకు థలసీమియా గురించి చెప్పి.. రక్తదానం చేయమని కోరేదాన్ని. దాంతో కండక్టర్గా నేను ఆ బస్సుకి వస్తే.. నన్ను చూసి భయపడి బస్సు ఎక్కేవాళ్లు కాదు. కొంతకాలం తర్వాత రక్తదానంతో తాము ఒకరికి ్రపాణం పోస్తున్నామని యువకులకు అర్థమైంది. ఇలా మొదలైన ప్రస్థానం యువకుల రక్తదానంతో ముందుకు సాగుతోంది. థలసీమియాతో బాధపడుతున్న పిల్లలకు ప్రభుత్వం పింఛన్ ఇస్తే వారికి ఉపయోగపడుతుంది. – ్రపోద్దుటూరు అనిత, సంకల్ప స్వచ్ఛంద సంస్థ, ఖమ్మం -
TG: రైతులకు శుభవార్త.. మూడో విడతలో రుణమాఫీ నిధులు విడుదల
సాక్షి, వైరా: తెలంగాణలో మూడో విడతలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేశారు. 14.45లక్షల మంది రైతులకు మూడో విడతలో రుణాలను విడుదల చేశారు. ఇక, ఇప్పటికే రెండు విడతల్లో రూ.లక్షన్నర వరకు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. రెండు విడతల్లో రూ.12వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.👉వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. 140 కోట్ల మంది స్వేఛ్చావాయువులు పీల్చేలా కాంగ్రెస్ స్వాతంత్ర్యం తెచ్చింది. ఖమ్మం గడ్డ.. కాంగ్రెస్కు అడ్డా. వరంగల్ డిక్లరేషన్లో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ మాట్టిచ్చారు. మే 6, 2022న రైతు డిక్లరేషన్లో చెప్పిన విధంగా రుణమాఫీ చేస్తున్నాం. ఎనిమిది నెలల్లోపే రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నాం. ఈరోజు రూ.18వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాం.. చేశాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం.. చేశాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాం. మేం చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతుంది. బీఆర్ఎస్ బతుకు బస్టాండ్ అయ్యింది. ప్రజలే తప్పు చేశారన్నట్టుగా కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటు. సీతారామ ప్రాజెక్ట్కు అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత మాది. 2026 కల్లా సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. ప్రతీ నియోజకవర్గంలో 3400 ఇళ్లను మంజూరు చేశాం. సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణకు ఇచ్చారు. ఆ గ్యారంటీలను అమలు చేయడానికి మేం కృషి చేస్తున్నాం. బీఆర్ఎస్ను బంగాళాఖాతంలోకి విసిరేసే బాధ్యత తీసుకుంటా. తెలంగాణలో బీజేపీకి చోటు లేదు. 65వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు గాడిత గుడ్డు ఉంది. ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్కు అండగా ఉండాలి. బీఆర్ఎస్ను బద్దలకొడుతాం.. బీజేపీని బొందపెడతాం. 👉డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నేడు చరిత్రలో లిఖించదగిన రోజు. సాధ్యం కాదన్న రూ.2లక్షల రుణమాఫీని చేసి చూపిస్తున్నాం. రుణమాఫీ చేయలేమని అందరూ అన్నారు. కానీ, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి చూపించాం. దేశ చరిత్రలో తొలిసారి రూ.2లక్షల రుణమాఫీ చేశాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం.. సంకల్పాన్ని నిజం చేశాం. కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే.. ఆ డబ్బులు వడ్డీలకే సరిపోయాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.లక్ష రుణమాఫీ కూడా చేయలేదు. సీఎం రేవంత్ ఆదేశించిన మరుక్షణమే రైతుల ఎకౌంట్లలోకి రుణమాఫీ జరుగుతుంది. రుణమాఫీ ఒక్కటే కాదు.. రైతుల సమస్యలపై కూడా దృష్టిపెట్టాం. ఏ ప్రభుత్వం చేయని విధంగా వ్యవసాయ శాఖకు నిధులు కేటాయించాం. కాంగ్రెస్, బీఆర్ఎస్కు మధ్య తేడాను చూడండి. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు రుణమాఫీనే నిదర్శనం. ఆర్థిక మంత్రిగా రుణమాఫీ బాధ్యత తీసుకోవడం ఆనందంగా ఉంది. సీఎం రేవంత్ అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల్లో పెట్టుబడులకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. వ్యవసాయపరంగా, పారిశ్రామికపరంగా కీలక అడుగులు వేస్తున్నాం. రూ.36వేల కోట్ల పెట్టుబడులను సీఎం తీసుకువచ్చారు. ఖమ్మం జిల్లాకు నీళ్లు రాకుండా చేయాలని బీఆర్ఎస్ కుట్రలు చేసింది. ఇందిరాసాగర్ను రీడిజైన్ చేసి ప్రాజెక్ట్ అంచనాలు పెంచారు. రూ.1000 కోట్ల ప్రాజెక్ట్ను రూ.23వేల కోట్లకు పెంచారు. డబ్బులు ఏమైపోయాయో ఎవరికీ తెలియదు. సీతారామ ప్రాజెక్ట్ కేసీఆర్ మానసపుత్రిక అని మాట్లాడుతున్నారు. ఒక్క ఎకరాకు కూడా సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇవ్వలేదు. దోపిడీ చేయడం కోసమే వాళ్లకు మానసపుత్రిక. గోదావరిపైనే ప్రాజెక్ట్ల రీడిజైన్తో రూ.23వేల కోట్లకు అంచనాలు పెంచి దోపిడీ చేశారు. కాంగ్రెస్ ఎక్కువ ప్రాజెక్ట్లు కట్టిందా? బీఆర్ఎస్ ఎక్కువ కట్టిందా? అనే చర్చకు సిద్ధం. 👉మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సీతారామకు భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తాం. తెలంగాణలో రైతులకు ఈరోజు పండుగ రోజు. గత బీఆర్ఎస్ సర్కార్ నాలుగుసార్లు రుణమాఫీ చేస్తే మిత్తిలకు కూడా సరిపోలేదు. రూ.31వేల కోట్లు రైతు రుణమాఫీ చేయడం చారిత్రాత్మకం. ఆరేళ్లలోనే సీతారామ ప్రాజెక్ట్కు రూ.600 కోట్లు ఇచ్చాం. ఎంత ఖర్చు అయినా సరే మిగిలిన పనులు పూర్తి చేస్తాం.👉మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభించుకోవడం సంతోషకరం. తెలంగాణలో మార్పు కోసమే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నాం. ఎన్నికల కష్టాలు వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది.👉మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా రూ.2లక్షలు రుణమాఫీ చేయలేదు. గత బీఆర్ఎస్ సర్కార్ రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసింది. గతంలో సీతారామ ద్వారా బీఆర్ఎస్ ఒక్క ఎకరాకు కూడా ఇవ్వలేదు. ఇందిర, రాజీవ్ ప్రాజెక్ట్లను రీడిజైన్ చేసి సీతారామ తెచ్చారు. సీతారామ ప్రాజెక్ట్ను పదేళ్లు సాగదీస్తూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీతారామ పనులు వేగవంతం చేశాం. మిగిలిన సీతారామ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేస్తాం.👉మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. ప్రజా ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాకు గోదావరి నీటిని తీసుకొచ్చాం. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తికి కట్టుబడి ఉన్నాం అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రాజెక్ట్లపై బీఆర్ఎస్ నేతలవి బోగస్ మాటలు: సీఎం రేవంత్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంకితం చేశారు. రెండో పంప్ హౌస్ వద్ద పైలాన్ ఆవిష్కరించిన సీఎం రేవంత్.. అనంతరం స్విచ్ ఆన్ చేశారు.కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పూసగూడెంలో సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను సీఎం రేవంత్.. రైతాంగానికి అంకితం చేశారు. రెండో పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసి గోదావరి జలాలను దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో గోదావరి జలాలకు సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. దీంతో, కాలువలోకి గోదావరి జలాలను విడుదల చేశారు. ఇక, సీతారామ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా నదిలో గోదావరి నీరు కలవనుంది. ఈ క్రమంలో కృష్ణా నది చివరి పొలాలకు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్ట్ పూర్తికి సహకరిస్తున్నాం. ఇది మా విశ్వసనీయతకు గుర్తింపు. ప్రాజెక్ట్ల మీద సమగ్రంగా చర్చించాం. నల్లగొండ జిల్లాలో చాలా ప్రాజెక్ట్లు అసంపూర్తిగా ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ల రీడిజైన్ పేరుతో వేల కోట్లు దండుకున్నారు. కేసీఆర్, హరీష్ రావు బోగస్ మాటలు చెప్పారు. ప్రాజెక్ట్లను పూర్తి చేయాలని కేసీఆర్ ఎప్పుడూ అనుకోలేదు. దోపిడీ బయటపడుతుందని బీఆర్ఎస్ దేనికీ డీపీఆర్లు ఇవ్వలేదు. మా శ్రమను హరీష్ రావు చులకన చేసి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నాలుగేళ్లుగా సీతారామ పంపులను ఆన్ చేయలేదు. మేం నీళ్లు చల్లుకోలేదు.. గోదారమ్మ మా మీద నీళ్లు చల్లింది. గత పదేళ్లలో రూ.లక్షా 80వేల కోట్లు ఖర్చు చేసినా రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వలేకపోయారు. ఖమ్మం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.ఇక, మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. నా కల సాకారం చేసినందుకు సీఎం రేవంత్కు ధన్యవాదాలు. గత ప్రభుత్వం సీతారామా ప్రాజెక్ట్ను నిర్లక్ష్యం చేసిందన్నారు. -
5 లక్షలకు మనవడిని అమ్మేసిన నాయనమ్మ