గుండె కరిగిపోయే, మనసు చెదిరిపోయే దృశ్యాలు చూశా: సీఎం రేవంత్‌ | | Sakshi
Sakshi News home page

గుండె కరిగిపోయే, మనసు చెదిరిపోయే దృశ్యాలు చూశా: సీఎం రేవంత్‌

Published Tue, Sep 3 2024 12:01 PM | Last Updated on Tue, Sep 3 2024 2:50 PM

CM Revanth Reddy Tweet On Telangana Rains Situation

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వరద పరిస్థితులపై సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే దృశ్యాలు స్వయంగా చూశానని తెలిపారు. బాధితుల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సర్కార్‌ ఎంతటి సాయం చేయడానికైనా సిద్దమని తెలిపారు. బాధితుల మొఖాలలో ఓవైపు తీరని ఆవేదన.. మరోవైపు అన్నా’ వచ్చాడన్న భరోసా కనిపించిందన్నారు.

వరద బాధితులను పరామర్శించి నష్టపరిహారం ప్రకటించిన సీఎం రేవంత్

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబాబాద్‌ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు.వరదలో కొట్టుకుపోయి చనిపోయిన సైంటిస్టు అశ్విని కుటుంబాన్ని పరామర్శించారు.  వరద ప్రభావిత ప్రాంతాలు, పొలాలు, రోడ్లు పరిశీలించనున్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement