Mahabubabad District
-
ఆటోను ఢీ కొట్టిన లారీ.. మహిళా కూలీల పరిస్థితి విషమం
మహబూబాబాద్, సాక్షి: నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహిళా కూలీలతో వెళ్తున్న ఓ ఆటోను లారీ ఢీ కొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వీళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తొర్రూర్ మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన 14 మంది, ఫతేపురం గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు మిర్చి తోట ఏరడానికి బంగ్లా వైపు ఆటోలో వెళ్తున్నారు. ఆ సమయంలో ఆటోను లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల సాయంతో మూడు ఆంబులెన్సులలో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో 13 మందికి గాయాలు కాగా.. వాళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఈ ఆటో చాలా కూల్ గురూ.. సమ్మర్ స్పెషల్
ఆటో పైకప్పు నిండా పచ్చని పూల మొక్కలు, గడ్డి మొక్కలను పెంచాడు. మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీరు పోస్తున్నాడు. ఆటో ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాడు. ప్రయాణికులకు చల్లదనాన్ని పంచేందుకు.. మహబూబాబాద్ మండలం దర్గా తండాకు చెందిన భూక్యా హ్యాంజ్యా అలియాస్ ఆటో అంజి వినూత్న ఆలోచనకు దృశ్య రూపమిది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్చెరువు ఎండింది.. చేప చిక్కింది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నిజాం చెరువు నీరు అడుగంటిపోయింది. దీంతో కొద్దిపాటి నీటిలోని చేపలను మాధవాపురం గ్రామానికి వలస వచ్చిన సైబీరియన్ కొంగలు (Siberian Cranes) సునాయాసంగా వేటాడుతున్నాయి. కోరుకున్న చేపను కొంగలు పట్టేసుకుని గుటుక్కుమనిపిస్తున్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్ కళ తప్పిన ప్రకృతి ఆకురాలే సమయం వచ్చేసింది. వానాకాలం, చలికాలంలో పచ్చదనంతో ప్రకృతి ప్రేమికులను మురిపించిన గుట్టలు.. ఇప్పుడు ఎండ తీవ్రతతో మాడిపోతున్నాయి. తీవ్రమైన ఎండలతో చెట్లు ఆకురాల్చి మోడువారి కనిపిస్తున్నాయి. రాత్రివేళ కార్చిచ్చుతో మంటల్లో కాలిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లా (Peddapalli District) పాలకుర్తి మండలం జయ్యారం శివారు, అంతర్గాం మార్గంలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఎండిన చెట్లతో గుట్టలు బోసిపోయి కనిపించాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లిపైరు ఎండి.. పశువులకు తిండిహనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ఎండల తీవ్రతకు భూగర్బ జలాలు అడుగంటిపోయాయి. బావులలో నీళ్లు తగ్గి పంటలకు సరిపడా సాగునీరు అందక పంటలు (Crops) ఎండిపోతున్నాయి. దిక్కుతోచని రైతులు కొంత పంటనైనా కాపాడుకుందామని నీరున్నంత వరకు పారించుకుని.. మిగతా పంటను మూగజీవాలకు వదిలేశారు. – ధర్మసాగర్ఎడ్లకు మేత.. గుండె కోత.. ఎస్సారెస్పీ కాలువ నీరు రాలేదు.. వ్యవసాయ బావిలో నీరు అడుగంటింది. పొట్టదశకు వచ్చిన వరి పైరు ఎండిపోతోంది. పంట చేతికొస్తే పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు తీర్చుతామనే రైతు గంపెడాశ ఆవిరైపోయింది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మద్దిర్యాలకు చెందిన ఎండీ షరీఫ్.. తనకున్న నాలుగెకరాల్లో యాసంగి వరి వేశాడు. నీళ్లు అందక రెండెకరాల్లో పంట ఎండిపోయింది. దీంతో రైతు కుటుంబ సభ్యులు.. ఎండిన పైరును ఎద్దులకు మేతగా వినియోగిస్తూ ఇలా కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లిభగీరథ ప్రయత్నంఆదిలాబాద్ జిల్లాలో భానుడి భగభగలకు చేతిపంపులు, చేద బావుల్లో భూగర్భ జలమట్టం అడుగంటుతోంది. బిందెడు నీటి కోసం ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు భగీరథ ప్రయత్నమే చేయాల్సి వస్తోంది. దీంతో ఎప్పుడు వస్తుందో తెలియని మిషన్ భగీరథ నీరే దిక్కవుతోంది. ఆదిలాబాద్ (Adilabad) రూరల్ మండలంలోని పోతగూడ–2 గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి అవసరాల కోసం మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా సరఫరా అయ్యే పైపువాల్ వద్ద చుక్కనీటిని ఒడిసిపట్టేలా ప్రత్యేకంగా ఓ రేకును అమర్చి బొట్టుబొట్టు నీరు డ్రమ్ముల్లో పడేలా ఏర్పాట్లు చేసుకోవడం నీటి సమస్యకు నిదర్శనంగా నిలుస్తోంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్చదవండి: బిందెడు నీటికి బావిలోకి.. భగవంతుడా! -
వంట మనిషి ఇంట్లోనే బడి
కేసముద్రం: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెట్టే వంట మనిషి ఇల్లే ప్రభుత్వ పాఠశాలగా మారింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పరిధిలోని బ్రహ్మంగారి తండాలో 2001లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. సొంత భవ నం లేక నాటి నుంచి తండాలోని పలువురి ఇళ్లను అద్దెకు తీసుకుంటూ ఉపాధ్యా యులు బడి నడిపిస్తూ వచ్చారు. మొదట్లో స్కూల్లో 60 మంది విద్యార్థులు ఉండగా.. అద్దె ఇళ్లలో కనీస సౌకర్యాలు లేక సంఖ్య తగ్గుతూ 18 మందికి చేరింది.ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తి స్తున్నారు. గత ఏడాది బడి నడిపించడానికి తండాలో అద్దెకు ఇల్లు దొరకలేదు. దీంతో పిల్లల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో మధ్యాహ్నం భోజ నం వండిపెట్టే వంటమనిషి వినోద తన ఇంట్లో పాఠశాల నడిపించడానికి అంగీకరించింది. ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డుకు చుట్టూరా పరదా కట్టి పిల్లలకు విద్యా బోధన చేస్తున్నారు. ఎండతీవ్రతకు రేకుల షెడ్డు కింద కూర్చున్న పిల్లలు అల్లాడి పోతున్నారు. టాయిలెట్లు కూడా లేకపోవ డంతో ఇబ్బందులు పడుతు న్నారు. ఇదిలా ఉండగా ‘మన ఊరు– మన బడి’ కింద పాఠశాలకు భవనం మంజూరైనా పిల్లర్ల వరకే నిర్మాణం జరిగింది. -
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల వరకు..
మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా అనగానే మొదట గుర్తుకువచ్చేది క్రీడలు.. అంతేనా.. విద్య, ఉద్యమాలు, పోరాటాల్లో.. పాటల రచయితలు, సంగీత దర్శకులు, ఫొటోగ్రాఫర్లు, కళాకారులుగా.. ఇలా ఎందరో సత్తా చాటుతున్నారు. మిర్చి, పసుపు, పత్తి పంటల్లో రాణిస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ, పోలీస్, జవాన్, నేవీ తదితర అనేక రంగాల్లో వెలుగుతున్నారు. మానుకోట (Manukota) ముద్దుబిడ్డలుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. జిల్లా నుంచి సినీరంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్న కళాకారులు కోకొల్లలు. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ.. పాటలు పాడుతూ ఎదుగుతున్నారు. చిన్న సినిమాలకు తొలుత సంగీతం అందించి ప్రస్తుతం పెద్దపెద్ద హీరోల సినిమాలకు పనిచేస్తున్నారు. వీడియో, కెమెరామెన్, సినిమా ఫొటోగ్రఫీ, అసోసియేట్ డైరెక్టర్ వరకు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దాశరథి నుంచి.. మానుకోట జిల్లా నుంచి మొదట సినిమారంగంలో చిన్నగూడూరుకు చెందిన దాశరథి కృష్ణమాచార్యులు ప్రవేశించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’అని తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అందించిన కవి ఆయన. తెలుగు సినిమాలకు గేయ రచయితగా రాణించారు. ‘కన్నె వయసు’సినిమాలో ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో..’ పాట రాశారు. తోట రాముడు సినిమాలో ‘ఓ బంగరు రంగుల చిలకా పలకవే..’అనే పాట కూడా రాశారు. మానుకోట జిల్లా (Manukota District) కేంద్రం గుమ్ముడూరుకు చెందిన గోడిశాల జయరాజు సినీగేయ రచయిత, కవి. ప్రకృతిపై కథలు, గేయాలు రాశారు. అవి తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ సహా అనేక భాషల్లోకి అనువాదమై విస్తృత ప్రాచుర్యం పొందాయి. జయరాజు మొదట ‘అడవిలో అన్న’ సినిమాలో ‘వందనాలమ్మ’ పాట రాశారు. ‘దండోరా’ సినిమాలో ‘కొండల్లో కోయిల పాటలు పాడాలి’ అనే పాట రాశారు. కేసముద్రం మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన జె.కె.భారవి (సుదర్శన భట్టాచార్య) తెలుగు సినీ రచయితగా, దర్శకుడు, పాటల రచయితగా పేరొందారు. కన్నడ సినీరంగంలోనూ పేరు తెచ్చుకున్నారు. అన్నమయ్య, లవ్స్టోరీ, శ్రీమంజునాథ, శ్రీరామదాసు, పాండురంగడు, శక్తి, ఓం నమో వేంకటేశాయ, చిటికెల పందిరి, జగద్గురు ఆదిశంకర తదితర సినిమాల్లో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పని చేశారు. ఆత్రేయ ప్రియశిష్య పురస్కారం అందుకున్నారు. మానుకోట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన సంగీత దర్శకుడు చక్రధర్ రచయితగా, గాయకుడిగా, నటుడిగా రాణించారు. మొదట ‘పండు వెన్నెల’ అనే మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. చిరునవ్వుతో, ఇడియట్, శివమణి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, దేశముదురు, నేనింతే, చక్రం, ఆంధ్రావాలా, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తదితర 85 చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసి నంది అవార్డు అందుకున్నారు. బయ్యారం మండల గౌరారం గ్రామానికి చెందిన బొబ్బిలి సురేశ్ (Bobbili Suresh) సినీరంగంలో రాణిస్తున్నారు. నీదీ నాదీ ఒకే కథ, జార్జ్రెడ్డి, తోలుబొమ్మలాట, తిప్పర మీసం, గువ్వా గోరింక, విరాటపర్వం, చిల్బ్రో, టెన్త్క్లాస్ డైరీస్, మళ్లీ పెళ్లి తదితర సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. చదవండి: రాజమౌళి- మహేశ్ సినిమా.. ఒక్క లీక్ ఎంతపని చేసింది జిల్లా కేంద్రానికి చెందిన కందుకూరి అనిల్కుమార్ మొదట ప్రైవేట్ ఆల్బమ్ పాటలకు నృత్య దర్శకునిగా పని చేశారు. తరువాత పీపుల్స్వార్, పోలీస్ వెంకటరామయ్య, దండకారణ్యం సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన గిద్దె రాంనర్సయ్య.. తెలంగాణ ఉద్యమంలో పలు గీతాలు ఆలపించారు. ఉద్యమంలో ఎంతో మందిని తన పాటలతో ఉత్తేజ పరిచారు.కంబాలపల్లి గ్రామానికి చెందిన గుర్రాల ఉదయ్ (Gurrala Uday) జేఎన్టీయూలో బ్యాచ్లర్ ఆఫ్ ఫొటోగ్రఫీ కోర్సు పూర్తి చేశారు. మొదట షార్ట్ ఫిలిమ్స్ తీశారు. ‘స్వేచ్ఛ’సినిమాతో సినీరంగంలోకి డైరెక్టర్గా అడుగుపెట్టారు. ఉత్తమ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. జంగిలిగొండ గ్రామానికి చెందిన రాజమౌళి (Rajamouli) బుల్లితెర షోల్లో నటించారు. భోళాశంకర్, ధమాక, బంగారు బుల్లోడు, అనుభవించు రాజా, చోర్ బజార్, సిల్లి ఫెలోస్ తదితర సినిమాల్లోనూ నటించారు.తెలంగాణ యాసపై సినిమాలు చేస్తా నాకు మొదట సినిమాల్లో అవకాశం కల్పించింది ఆర్.నారాయణమూర్తి. ప్రకృతితో.. నాకూ ఉన్న అనుబంధాన్ని నా పాటల్లో వివరించా. భవిష్యత్లో సినిమాల్లో రచనలు చేసే అవకాశం వస్తే వదులుకోను. నా ప్రతిభను మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా గుర్తించి అవార్డు అందజేశారు. తెలంగాణ యాస, భాషపై మరిన్ని సినిమాలు చేస్తాను. – గొడిశాల జయరాజ్, సినీ రచయిత ‘స్వేచ్ఛ’షార్ట్ ఫిలింతో ప్రవేశం మొదట ‘స్వేచ్ఛ’షార్ట్ ఫిలింతో సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. చిన్న చిన్న సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాను. నేను రూపొందించిన ‘మేల్’సినిమా.. బెస్ట్ ఫిలిం స్క్రీన్ప్లే న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డుకు నామినేట్ అయింది. – గుర్రాల ఉదయ్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ ఆస్కార్ అవార్డు లక్ష్యం సినీరంగంలో మొదటి సినిమాతోనే నాకు మంచి గుర్తింపు వచ్చింది. భవిష్యత్లో పెద్ద పెద్ద హీరోలకు మంచి సంగీతం అందించి గుర్తింపు తెచ్చుకుని ఆస్కార్ అవార్డు అందుకోవాలన్నది నా కోరిక. ఇప్పటి వరకు నాకు చేయూతనిచ్చిన దర్శకులు, నిర్మాతలకు రుణపడి ఉంటా. – సురేష్ బొబ్బిలి, సంగీత దర్శకుడు కొత్తవారికి అవకాశమిస్తా టీవీ షోలు, సినీరంగంలో ఎంతో కష్టపడ్డాను. సినీ ప్రేక్షకులు, జిల్లా ప్రజల ఆశీస్సులతో ఇంతటి వాడినయ్యాను. నటనలో నైపుణ్యం ఉన్న వారికి కచ్చితంగా అవకాశం కల్పిస్తాను. పేద ప్రజలకు నా వంతుగా సేవ చేస్తున్నాను. – రాజమౌళి, జబర్దస్త్ నటుడు -
అమ్మా.. నేనేం పాపం చేశా!
మహాబూబాబాద్, సాక్షి: కన్నతల్లే ఆ పిల్లల పాలిట మృత్యు దేవతగా మారింది. తన భర్త మరణించాక మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అయితే తన సుఖానికి పిల్లలే అడ్డొస్తున్నారని భావించి వాళ్లను లేకుండా చేయాలనుకుంది. ఈ ప్రయత్నంలో ఆ చిట్టితల్లిని విషమిచ్చి ఆ కన్నతల్లి చేజేతులారా చంపేసుకుంది. డోర్నకల్ మండలంలోని జోగ్య తండ గ్రామ పంచాయతీ పరిధిలోని మంగళ్ తండాకు చెందిన వాంకుడోత్ వెంకటేష్(30) నాలుగు నెలల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో ఆయన భార్య ఉష, ఇద్దరు పిల్లలు నిత్యశ్రీ (05) అబ్బాయి వరుణ్ తేజ (07)ల అత్తింట్లోనే ఉంటోంది. ఈ నెల 5వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటూ పిల్లలిద్దరూ కిందపడి పోయారు. వాంతులు, విరోచనాలు కావడంతో కంగారు పడిపోయిన వెంకటేష్ తల్లి.. పిల్లలను ఏం జరిగిందని వాకబు చేసింది. అమ్మ కూల్డ్రింక్ తాగించిందని అమాయకంగా చెప్పారు ఆ ఇద్దరూ. ఆ తర్వాత బాబాయ్ రాంబాబు సహాయంతో పిల్లలను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల చికిత్స అనంతరం పిల్లల శరీరంలో గడ్డిమందు అవశేషాలు ఉన్నాయని వైద్యులు తెలపడంతో బంధువులు ఉషను నిలదీశారు. పిల్లలకు కూల్డ్రింక్లో గడ్డిమందు కలిపి తాగించినట్లు ఒప్పుకుందామె. ఈలోపు పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. పిల్లలకు ఏమైనా జరిగితే తనను చంపేస్తారన్న భయంతో.. ఉష ఎలుకల మందు తాగింది. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పిల్లల బాబాయ్ ఫిర్యాదు చేయడంతో.. డోర్నకల్ పోలీసులు ఈ నెల 10న హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుమారు రెండువారాల తర్వాత వరుణ్తేజ్ కోలుకోగా.. పరిస్థితి విషమించి నిత్యశ్రీ ఆదివారం మృతి చెందింది. దీంతో కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఆమెను అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఆ అధికారితో ఉష సంబంధం!నిత్యశ్రీ పోస్టుమార్టంను పర్యవేక్షించిన డోర్నకల్ సీఐ బీ రాజేశ్.. దగ్గరుండి ఆ చిన్నారి మృతదేహాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులకు అప్పగించే క్రమంలో జోగ్యతండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉషను తీసుకు రావాలంటూ ఆగ్రహంతో స్థానికులు ఊగిపోయారు. ఆంబులెన్స్కు అడ్డుపడి ధర్నా చేపట్టారు. స్థానికంగా ఉన్న ఓ పోలీస్ అధికారితో ఉష సంబంధం ఉందని, ఆ అధికారి చెప్పడంతోనే ఆమె ఈ ఘోరానికి పాల్పడిందని ఆరోపించారు. చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలా.. 12 గంటలు ధర్నా కొనసాగించారు. ఈ తరుణంలో గ్రామ పెద్దలతో పోలీసులు చర్చలు జరిపారు. నిత్యశ్రీ మృతికి కారణమైన పోలీస్ అధికారిపై విచారణ జరిపించి.. ఈ విషయంలో అయన పాత్ర ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించగా.. నిత్యశ్రీ మృతదేహాన్ని బంధవులకు అప్పగించారు. -
పాఠాలు చెబుదామన్నా.. పిల్లలు లేరు..
గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మూడు ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు రాక పోవడంతో ఉపాధ్యాయులు విధులకు హాజరై ఖాళీగా కూర్చొని వెళ్లిపోతున్నారు.వెంకటాపురం తండా, సర్వన్ తండా, కేళోత్ తండాలోని ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలను గురువారం ‘సాక్షి’ సందర్శించింది. మూడింటి లోనూ ఒక్క విద్యార్థి కూడా పాఠశాలకు రాలేదు. తండాల్లోని ఇంటింటికీ తిరిగి తమ పిల్ల లను పంపాలని కోరు తున్నా.. తల్లిదండ్రులు మాత్రం గార్లలోని ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారని ఉపా ధ్యాయులు పేర్కొన్నారు. -
ఊరంతా ఉద్యోగులే
మరిపెడ రూరల్: ఒకప్పుడు మారుమూల గిరిజన తండా.. ఆపై సౌకర్యాల లేమి. అయితేనేం సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఉన్నత చదువులు చదివారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇంటికొకరు ప్రభుత్వ కొలువుల్లో ఉన్నారంటే ఆశ్చ ర్యం కలుగక మానదు. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు అన్ని హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఆ గ్రామంలో ఉన్నారు. చిన్న, సన్నకారు రైతులు కష్టపడి తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించి ప్ర భుత్వ కొలువుల్లో స్థిరపడేలా చేశారు. మరికొందరు ప్రైవేట్ రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఏంటి అనుకుంటున్నారా.. అదే మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండధర్మారం. పట్టణాన్ని తలపించేలా.. మారుమూల తండా అయిన తండధర్మారం.. నేడు పట్టణాన్ని తలపిస్తోంది. అన్నీ డాబాలు, రెండు, మూడు బహుళ అంతస్తుల భవనాలున్నాయి. తాతముత్తాతల నుంచి గ్రామంలో వ్యవసాయమే ప్రధాన ఆధారంగా కుటుంబాలు జీవిస్తుండేవి. ఊరి పేరులో తండా అని ఉన్నప్పటికీ అక్కడ అన్ని వర్గాల కుటుంబాలు నివసిస్తున్నారు. గ్రామంలో 267 గృహాలు, 1,160 మంది జనాభా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రభుత్వ కొలువుతో ఆ పల్లె విలసిల్లుతోంది. తామేమీ తక్కువ కాదంటూ ఒకరికంటే ఒకరు పోటీ పడి ఉన్నత చదువులు చదువుతూ ప్రభుత్వ కొలువులు సాధిస్తున్నారు. పూర్వ కాలంలోనే ఈ గ్రామంలో బడి పంతుళ్లు, పోలీస్ పటేల్గా కొలువు దీరారు. వివిధ ప్రాంతాల్లో కొలువు దీరిన ఉద్యోగులంతా సంక్రాంతి పండుగకు స్వగ్రామంలో కలుసుకొని గ్రామంలోని మహిళలు, యువతకు వివిధ పోటీలు నిర్వహిస్తుంటారు. 100 మందికిపైగా ప్రభుత్వోద్యోగులు గ్రామంలో 10, 15 ప్రభుత్వ కొలువులు ఉంటేనే గొప్ప. అలాంటిది తండధర్మారంలో 100 మందికిపైగా ప్రభుత్వ కొలువుల్లో స్థిరపడ్డారంటే మామూలు విషయం కాదు. గ్రామానికి చెందిన గుగులోతు రవినాయక్ (ఐఏఎస్) తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం మహబూబ్నగర్ కలెక్టర్గా కొనసాగారు. అలాగే గుగులోతు వసంత్నాయక్ ఆర్ అండ్ బీ ఎస్సీగా విధులు నిర్వహిస్తున్నారు. గుగులోతు సుమలత ఇటీవల ఆర్టీఏ కొలువు సాధించి ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు, ఫారెస్ట్, ఎక్సైజ్, పోలీస్ ఇలా అన్ని శాఖల్లోనూ కొలువై ఉన్నారు. స్వాతంత్య్రం రాకముందే.. స్వాతంత్య్రం రాక ముందే గ్రామంలో పదుల సంఖ్యలో విద్యావంతులున్నారు. ఈ క్రమంలోనే గ్రామంలోని గుగులోతు సక్రునాయక్ మొదటి బడిపంతులుగా కొలువుదీరినట్లు గ్రామస్తులు తెలిపారు. అలాగే హన్మంతునాయక్, స్వాతంత్య్ర సమరయోధుడు వెంకన్ననాయక్, గుగులోతు భగ్గునాయక్ తర్వాత బడిపంతులుగా నియమితులయ్యారు. గుగులోతు సిరినాయక్ అనే వ్యక్తి పోలీస్ పటేల్గా విధులు నిర్వహించారు. వీరిని ఆదర్శంగా తీసుకునే గ్రామంలోని రైతులు, కూలీలు కష్టపడి పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. -
అయ్యో దేవుడా.. ఎందుకు ఇలా చేశావ్?
ఎంతో ఆనందంగా వీడ్కోలు పార్టీకి వెళ్లిన ఆ అమ్మాయి విగతజీవిగా మారిపోయింది. చదువు చెప్పిన గురువుల ముందు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేసిన ఆ విద్యార్థిని అర్థాంతరంగా తనువు చాలించింది. అప్పటివరకు ఆడిపాడిన అమ్మాయి ఆస్పత్రి బెడ్పై నిర్జీవంగా కనిపించడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో ముగినిపోయారు. అయ్యో దేవుడా.. ఎందుకు ఇలా చేశావ్ అంటూ కన్నీరుమున్నీరుగా రోదించారు.పాఠశాల విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో (ఫేర్వెల్ పార్టీ) ఒక విద్యార్థిని నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలింది. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల (ఈఎంఆర్ఎస్)లో మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలివి. సీరోలు ఈంఎఆర్ఎస్ పాఠశాల/కళాశాలలో పదో తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ (farewell party) కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. డీజే సౌండ్ (DJ Sound) బాక్స్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఇంటర్ విద్యార్థినులు సైతం నృత్యాలు చేశారు.ఈ క్రమంలో మరిపెడ మండలం తానంచర్ల (Tanamcherla) శివారు సపావట్ తండాకు చెందిన సీఈసీ మొదటి సంవత్సరం విద్యార్థిని సపావట్ రోజా (16).. వేదికపై నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజాను లేపేందుకు ప్రయత్నించారు. ఆమెను 108 వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఈఎంటీ గాంధీ సీపీఆర్ చేశారు. చివరికి మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు కుమార్తె మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. విచారణ లేకుండా సస్పెండ్ చేశారని..ములుగు/వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండల కేంద్రంలోని తన అద్దె గృహంలో మంగళవారం ఉదయం వెంకటాపురం అంగన్వాడీ ప్రాజెక్టు సీడీపీఓ ధనలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై కనీసం విచారణ లేకుండానే ఏకపక్షంగా సస్పెండ్ చేశారని మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాధితురాలి వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.గతంలో ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న తతంగంపై కలెక్టర్కు విన్నవించినా పట్టించుకోలేదని, ప్రస్తుతం సమాన వృత్తిలో ఉన్న ములుగు సీడీపీఓ, ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ చెప్పినట్లుగా వినడం తప్ప ఎదుట వ్యక్తి విషయాలను పరిగణనలోకి తీసుకోవటం లేదని ఆమె వీడియోలో పేర్కొన్నారు. సెంటర్లు నడవని కేంద్రాలకు ఎందుకు అద్దె చెల్లిస్తున్నారని, రిటైర్ అయిన ఆయాకు వేతనం ఎలా ఇస్తారని అడిగానని, వీటిని మనసులో పెట్టుకుని కలెక్టర్ ద్వారా సస్పెన్షన్ లెటర్ వచ్చేలా చేశారన్నారు. వీటన్నింటికి కారణం డీడబ్ల్యూఓ శిరీష అని పునరుద్ఘాటించారు.చదవండి: తెలంగాణ బీసీల్లో ముదిరాజ్లే టాప్.. తర్వాత ఎవరంటే?కాగా, సీడీపీఓ ధనలక్ష్మి తమపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం వెంకటాపురం(కె) ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు ధర్నా చేశారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సోమవారం కలెక్టర్ ధనలక్ష్మిని పిలిపించి మాట్లాడారు. ఇది జరిగిన అరగంటలోనే సీడీపీఓను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు రావడంతో ఆమె ఆందోళన చెందారు. ఈ క్రమంలో మంగళవారం ఆమె ఆత్మహత్యాయత్నం సంచలనం సృష్టించింది. ఈ విషయమై డీడబ్ల్యూఓ శిరీషను వివరణ కోరగా తాను ఆమెను ఏమీ ఇబ్బంది పెట్టలేదని వివరణ ఇచ్చారు. -
మొక్కు తీర్చుకుని వస్తూ మృత్యుఒడికి..
మొక్కు తీర్చుకోవడానికి షిర్డీ వెళ్లిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందారు. అలాగే సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లి తిరిగివస్తున్న వారి కారు అదుపుతప్పి లారీ కింద ఇరుక్కోవడంతో ఇద్దరు మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మహారాష్ట్రలోని గంగాపూర్ వద్ద ఓ ఘటన చోటుచేసుకోగా, భువనగిరి జిల్లా కేంద్రం సమీపంలో మరో ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన శ్యాంశెట్టి కృష్ణమూర్తి, ప్రేమలత దంపతులు తమ కొడుకు, కోడలుతో సరూర్నగర్ గ్రీన్ పార్కు ఏరియాలో నివాసం ఉంటూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. వీరికి మనవడు పుట్టిన సందర్భంగా మొక్కుతీర్చుకోవడానికి షిర్డీకి వెళ్లాలని అనుకున్నారు. భోగి పండుగ రోజు పెద్ద కూతురు ప్రసన్నలక్ష్మి, చిన్న కూతురు బజ్జూరి స్రవంతి కుటుంబాలతో కలిసి హైదరాబాద్ నుంచి ప్రైవేట్ బస్సులో వెళ్లి షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత స్థానికంగా తుఫాన్ వాహనం కిరాయికి తీసుకొని ఔరంగాబాద్లోని మినీ తాజ్మహల్ను సందర్శించారు. ఔరంగాబాద్ – షిర్డీ మధ్యలో గంగాపూర్ వద్ద బుధవారం రాత్రి వీరు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో శ్యాంశెట్టి ప్రేమలత (57) ఆమె కుమారుడి కొడుకు వైది్వక్ (6 నెలల బాలుడు), పెద్ద కూతురు తొల్పునూరి ప్రసన్నలక్ష్మి (42)తో పాటు ప్రసన్నలక్ష్మి పెద్ద కూతురు తొల్పునూరి అక్షిత (21) మృతిచెందారు. ప్రేమలత పెద్ద అల్లుడు శ్రీనివాస్, ప్రసన్నలక్ష్మి రెండో కూతురు శరణ్యతో పాటు ప్రేమలత భర్త కృష్ణమూర్తి, కుమారుడు వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ఔరంగాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమలత చిన్న కూతురు బజ్జూరి స్రవంతి, అల్లుడు రాంబాబుతో పాటు వీరి కుమారుడు, కుమార్తె ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం ఔరంగాబాద్ నుంచి స్వగ్రామానికి తరలించారు. సంక్రాంతి పండుగకు వచ్చి వెళ్తూ... మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకట్రాంతండాకు చెందిన గుగులోతు రవి, భూక్య సంతోష్ బావాబావమరుదులు. రవికి భార్య భవాని, కుమార్తె మోక్ష ఉండగా.. సంతోష్ కు భార్య అనూష (26), ఇద్దరు కుమార్తెలు ప్రణశ్వని, చైత్ర (6) ఉన్నారు. రవి, సంతోష్లు కుటుంబాలతో కొంతకాలంగా హైదరాబాద్లోని రామంతాపూర్లో ఉంటున్నారు. రవి, సంతోష్లు తమ భార్యాపిల్లలతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు కారులో స్వగ్రామం వెంకట్రాంతండాకు వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి హైదరాబాద్కు బయల్దేరారు. సంతోష్ కారు నడుపుతుండగా.. అతడి భార్య అనూషతో పాటు చిన్న కుమార్తె చైత్ర అతడి పక్కన కారు ముందు భాగంలో కూర్చున్నారు. మిగతావారు వెనక కూర్చున్నారు. గురువారం తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో భువనగిరి జిల్లా కేంద్రానికి సమీపంలోని రాయగిరి వద్దకు రాగానే వరంగల్–హైదరాబాద్ హైవే బైపాస్ రోడ్డుపై ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఇండికేటర్ వేయకుండా పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లోకి ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాడు. వెనకాలే వస్తున్న వీరి కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. కారు లారీ కిందిభాగంలో ఇరుక్కుపోవడంతో నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును జేసీబీ సహాయంతో బయటకు తీయగా.. అప్పటికే అనూష, చైత్ర మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మిగతా ఐదుగురిని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. భూక్య సంతోష్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు, ఎస్హెచ్ఓ సంతోష్ కుమార్ తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన రవి భార్య భవాని 8 నెలల గర్భంతో ఉంది. ఆస్పత్రికి తరలించిన అనంతరం వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కడుపులో ఉన్న శిశువుకు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు. -
ఇక్కడ తొలగించి..అక్కడ పెంచి..!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం నిర్మాణంతో 56 వేల వృక్షాలు నేలకూలబోతున్నాయి. ఈ భాగం రోడ్డు అలైన్మెంటు పరిధిలో ఉన్నందున వీటిని తొలగించేందుకు అటవీ శాఖ అనుమతించింది. భారీ సంఖ్యలో వృక్షాలను తొలగించాల్సిరావటంతో పర్యావరణంపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్తులో వాటి లోటును భర్తీ చేయాలన్న ఉద్దేశంతో కోల్పోయిన చెట్లకు ప్రతిగా 3.30 లక్షల మొక్కలను పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే మహబూబాబాద్లో భూమిని ఎంపిక చేశారు. మూడు ప్రాంతాల్లో ఎక్కువ అటవీ భూములు ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగాన్ని నిర్మించే 162 కి.మీ. నిడివిలో మూడు ప్రాంతాల్లో అటవీ భూములు అడ్డు వస్తున్నాయి. అడవి గుండా రోడ్డు నిర్మిస్తే వన్యప్రాణుల సంచారానికి ఇబ్బందిగా మారుతుంది. దీంతో ఆయా అటవీ భూముల్లో ఏదో ఒక చివరి నుంచి అలైన్మెంటు సాగేలా కన్సల్టెన్సీ సంస్థ దృష్టి పెట్టింది. రోడ్డుకు ఓవైపు 95 శాతం అటవీ భాగం ఉంటే, మరోవైపు 5 శాతం వరకు మాత్రమే ఇతర భూమి ఉండేలా అలైన్మెంటును రూపొందించింది. గజ్వేల్, నర్సాపూర్, యాదాద్రి ప్రాంతాల్లో ఈ అటవీ భూములున్నాయి. మెదక్ జిల్లా పరిధిలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లా పరిధిలో 28.2544 హెక్టార్లు, యాదాద్రి జిల్లా పరిధిలో 8.511 హెక్టార్లు.. వెరసి 72.3536 హెక్టార్ల మేర అటవీ భాగం అలైన్మెంటు పరిధిలోకి వచ్చింది. అంటే 200 ఎకరాలకు లోపు మాత్రమే ఉత్తర రింగు ప్రభావానికి గురికానున్నాయి. ఈ ప్రాంతాల్లో 44 వేల వృక్షాలను తొలగించాల్సి ఉంటుందని లెక్క తేల్చారు. దీంతో వాటిని తొలగించేందుకు ఇటీవల అటవీ శాఖ అనుమతించింది. ఇక అటవీ భూముల వెలుపల ఉండే సాధారణ భూముల్లోని మరో 12 వేల వృక్షాలను కూడా తొలగించాల్సి ఉంటుందని లెక్కతేల్చారు. వెరసి ఉత్తర భాగం పరిధిలో 56 వేల వృక్షాలను తొలగించబోతున్నారన్న మాట. పరిహారం స్థానంలో మొక్కల పెంపకం ప్రాజెక్టుల్లో కోల్పోయే అటవీ భూములకు కూడా పరిహారం ఇచ్చే విధానం గతంలో అమల్లో ఉండేది. అయితే మోదీ ప్రభుత్వం.. పరిహారానికి బదులు ప్రత్యామ్నాయ భూములు ఇచ్చి వాటిల్లో మొక్కలను పెంచాలని నిర్ణయించింది. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి ఇప్పుడదే వర్తింపజేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రత్యామ్నాయ భూమి కేటాయించారు. కొత్తగూడ మండలం పరిధిలోని పొగుళ్లపల్లి, నీలంపల్లి, గంగారం మండలం పరిధిలోని చింతల్గూడ గ్రామంలో ఈ భూమిని గుర్తించారు. ఈ మూడు గ్రామాల పరిధిలో కలిపి 3,29,452 చెట్లు పెరిగేలా త్వరలో మొక్కలు నాటనున్నారు. జంతువులకు ఇబ్బంది కలుగకుండా ఎకో బ్రిడ్జీలు 3 అటవీ ప్రాంతాల్లో జింకలు, దుప్పులు, నక్క లు, కోతులు, కొండముచ్చులు, నెమళ్లు, ఎలుగుబంట్లు కొన్ని ఇతర జంతువులు ఉన్నాయని గుర్తించారు. రోడ్డు నిర్మాణంతో వీటికి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోనున్నారు. జంతువులు ఒకవైపు నుంచి రోడ్డు దాటి మరోవైపు వెళ్లేలా ఎకో బ్రిడ్జీలు (పర్యావరణ హిత వంతెనలు) నిర్మించనున్నారు. వీటివల్ల పైనుంచి వాహనాలు వెళ్తున్నా, జంతువులు దిగువ నుంచి మరోవైపు వెళ్లేందుకు, వచ్చేందుకు వీలవుతుంది. ఇక జంతు సంచారం మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహనాల శబ్దాలు వాటిని ఇబ్బంది పెట్టకుండా రోడ్డుకు రెండు వైపులా నాయిస్ బారియర్స్ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉంది. -
కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
కురవి: విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి శివారు సక్రాంనాయక్ తండా గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. సక్రాంనాయక్ తండా డీఎన్టీ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న డీఎస్ శ్రీను (శ్రీనివాస్) నాలుగో తరగతి చదువుతున్న బాలికలకు కొన్ని రోజులనుంచి సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపిస్తున్నాడు. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో విసిగిపోయిన చిన్నారులు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో సోమవారం తల్లిదండ్రులు పాఠశాలలకు చేరుకుని శ్రీనివాస్కు దేహశుద్ధి చేశారు. ఎంఈఓ ఇస్లావత్ లచి్చరాంనాయక్ ఆదేశాల మేరకు కాంపల్లి హైసూ్కల్ హెచ్ఎం అరుణశ్రీ పాఠశాలకు చేరుకుని విచారణ జరిపారు. అనంతరం డీఈఈ రవీందర్రెడ్డికి నివేదిక ఇవ్వడంతో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు. అసభ్యకర ప్రవర్తనపై జిల్లా సంక్షేమ శాఖ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, బాలరక్షా భవన్ వారిని విచారణ చేసేందుకు నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న సీరోలు ఎస్సై నగేశ్ పాఠశాల వద్దకు చేరుకుని పిల్లల తల్లిదండ్రులతో, హెచ్ఎంతో మాట్లాడారు. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసిరిమాండ్కు తరలించినట్టు ఆయన తెలిపారు. -
ఎంతటి దుర్భర పరిస్థితి.. 118 మంది ఒకటే బాత్రూం
మహబూబాబాద్ అర్బన్: ఈ పాఠశాలలో మొత్తం 250 మంది విద్యార్థులు.. అందులో 132 మంది బాలురు.. బాలికలు 118 మంది.. కానీ ఉన్నది ఒక్కటే మూత్రశాల. బాలురకు చెరువు కట్టే దిక్కు కాగా, బాలికలు ఒకరి తరువాత ఒకరు క్యూలైన్ కట్టాల్సిందే. ఇదేదో మారుమూల గ్రామంలో కాదు.. జిల్లా కేంద్రం పరిధిలోని ఓ ఉన్నత పాఠశాలలో దుస్థితి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈదులపూసపల్లి పరిధి ఒకటో వార్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికలు, బాలురకు కలిపి ఒకే మూత్రశాల ఉంది. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో నిరుపయోగంలో ఉన్నాయి.బహిర్భూమికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఇంటికి పోవాల్సిందే. మగపిల్లలు సమీపంలోని చెరువుకట్టకు వెళ్తుండగా, బాలికలు క్యూలైన్లో నిలబడి మూత్రశాలకు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో నూతన మరుగుదొడ్లు నిర్మించాలని, లేకపోతే తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తున్నారు. పలుమార్లు విద్యాశాఖ అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రాలు ఇచ్చామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. -
కేటీఆర్ ఫ్లెక్సీలను చించేసిన గుర్తుతెలియని వ్యక్తులు
-
నేడు మహబూబాబాద్లో బీఆర్ఎస్ మహా ధర్నా
మహబూబాబాద్: లగచ ర్ల బాధితులకు అండగా సోమవారం మహబూబాబాద్లో బీఆర్ఎస్ పార్టీ దళిత, గిరిజన రైతులతో కలసి మహా ధర్నా నిర్వహించనుంది. మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాల యం ఎదుట ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్ర మం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పా ర్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న సీఎం రేవంత్రెడ్డిలో మార్పు రావాలని, ఆయనలో మార్పు వచ్చేవరకూ వదిలి పెట్టమని ఎర్రబెల్లి అన్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వందకుపైగా సీట్లతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. లగచర్ల రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని, ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం సొంత గ్రామంలో ఆయన కుటుంబ సభ్యుల కారణంగా మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని తెలిపారు.ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ పోలీసులు సంఘవిద్రోహ శక్తులను ముందే అరెస్ట్ చేసి ధర్నాకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ ధర్నాకు అనుమతి విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్కు చెంప పెట్టులాంటిందన్నారు. అనంతరం ధర్నా జరిగే ప్రాంతాన్ని నాయకులు పరిశీలించారు. -
రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
బీఆర్ఎస్ మహబూబాబాద్ ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గిరిజనులు, దళితులపై జరిగిన దాడికి నిరసనగా మహబూబాబాద్లో బీఆర్ఎస్ తలపెట్టిన గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అనుమతిస్తూ.. ధర్నాలో వెయ్యి మంది మాత్రమే పాల్గొనాలని షరతు విధించింది.అయితే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన రైతు ధర్నా ఇవాళ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.. కానీ పోలీసులు అనుమతించకపోవడంతో గిరిజన రైతు ధర్నాకు అనుమతి ఇవ్వాలంటూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ధర్నాకు అనుమతినిస్తూ హైకోర్టు పచ్చజెండా ఊపింది. -
మహబూబాబాద్ లో BRS తలపెట్టిన ధర్నాకు అనుమతి నిరాకరణ
-
బీఆర్ఎస్కు షాకిచ్చిన పోలీసులు.. కేటీఆర్ పర్యటన వాయిదా
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. మరోవైపు.. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ కూడా ధర్నా వాయిదా వేసుకుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్.. మహబూబాబాద్ పర్యటనను వాయిదా వేసుకున్నారు.గిరిజన, దళిత, పేద రైతులపై దాడికి నిరసగా మహబూబాబాద్లో బీఆర్ఎస్ నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. కాగా, బీఆర్ఎస్ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వెంటనే రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహబూబాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు బుధవారం రాత్రి ధర్నాకు దిగారు.అయినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ రైతు మహా ధర్నాకు కేటీఆర్ కూడా హాజరు కావాల్సి ఉండగా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. మరోవైపు.. ఈరోజు మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన విధించినట్టు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. నిమిషానికి నలభైసార్ల KCR రావాలే అని తెగ ఒర్లుతావు! అసెంబ్లీలో KCR ముందు నుంచునే మాట దేవుడెరుగు…కనీసం మహబూబాబాద్ లో మహాధర్నా కు అనుమతిచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేగా చిట్టినాయుడు?!— KTR (@KTRBRS) November 20, 2024 -
ఔషధాల కొండ.. కందికొండ గుట్ట
కురవి: దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యం విరాజిల్లింది. ప్రకృతిలో లభించే వనమూలికలు, ఔషధమొక్కలతో పలు రకాల రోగాలను నయం చేసేవారు. ప్రస్తుతం ఆయుర్వేద వైద్యం మనుగడలోకి వస్తోంది. వన మూలిక మొక్కలు ప్రకృతిలో ఎక్కువగా కొండలు, గుట్టల్లో లభిస్తాయి. అలాంటి ఔషధ మొక్కలకు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గుట్ట నిలయంగా పేరుగాంచింది. మునులు తపస్సు చేసిన ప్రాంతం కందికొండపై ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కొండపైకి నడక దారి, మార్గమధ్యలో గుహలు, పైన దేవాలయం, కోనేర్లు ఉన్నాయి. ఈ క్షేత్రంలో పూర్వం కపిలవాయి మహాముని, స్కంద మహాముని వంటి వారు తపస్సులు చేసినట్లు చరిత్ర చెబుతోంది. అయితే అప్పటి నుంచి ఈ కొండపై తపస్సుకు వినియోగించే మొక్కలతో పాటు, వైద్యం చేసేందుకు ఉపయోగపడే ఔషధ మొక్కలు కూడా పెంచినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొండ పరిసర ప్రాంతాలకు వెళ్లగానే ఏదో అనుభూతి, ప్రత్యేకమైన సువాసన వెదజల్లుతోందని స్థానికులు చెబుతారు. మూలికల సేకరణ.. గుట్టపై పెద్ద కందిచెట్టు ఉండేదని, అందుకే ఇది కందికల్ గుట్టగా చరిత్రలో లిఖించి ఉందని పూర్వికులు చెబుతుంటారు. కొండ అనేక వనమూలికలకు ప్రసిద్ధి అని, ఇక్కడికి సాధువులు, కోయ గిరిజనులు, ఆయుర్వేద వైద్యులు వచ్చి వనమూలికలు, ఔషధ మొక్కలను తీసుకెళ్తుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికీ కొంత మంది కోయ జాతికి చెందిన గిరిజనులు వచ్చి మొక్కలను తీసుకెళ్తుంటారని చెబుతుంటారు.గుట్ట ఎక్కుతుంటే మధ్యలో భోగం గుడి ఎదురుగా రెండు కోనేర్లు ఉంటాయి. అందులో అనేక ఔషధమొక్కలు కనిపిస్తుంటాయి. గుడి ముందు మరో కోనేరు ఉంటుంది. ఈ కోనేటిలో స్నానాలు ఆచరించడం వల్ల రోగాలు నయమవుతాయని నమ్మకం. అయితే కార్తీక పౌర్ణమితోపాటు, ఇతర శుభ దినాల్లో మూలికలను సేకరిస్తే మంచి ఫలితం ఉంటుందని సాధువులు చెబుతారు. అందుకోసమే తెలంగాణ ప్రాంతంలోని జంగాలు ఈ ప్రాంతం నుంచి ఔషధ మొక్కలు, వన మూలికలు సేకరించి తయారు చేసిన ఆయుర్వేద మందులు చెన్నై, ముంబై, సింగపూర్, ఢిల్లీ వంటి ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు వెళ్లి వైద్యం చేసి వస్తారు.ఔషధ మొక్కల పేర్లు..గుట్టపై ఉన్న కోనేరులో నాలుగు రకాల మొక్కలు కనిపిస్తాయి. ఈరజడ, రక్తజడ, అంతర దామెర, మద్దెడ వీటిని గుట్ట ఎక్కిన భక్తులు తెంపుకుని తీసుకెళ్తుంటారు. ఈరజడ ఆకులను ఇంటికి తీసుకెళ్లి చిన్నారులకు ఊదు పడుతుంటారు. వీటికి తోడు రాజహంస, పరంహంస, పందిచెవ్వు చెట్టు, నల్ల ఉసిరి చెట్టు, అడవి నిమ్మ, బుర్రజమిడి, నల్లవాయిలి చెట్లు ఉన్నాయి. గుడి దగ్గర బండ పువ్వు లభిస్తుంది. అలాగే నాగసారం గడ్డ, నేల ఏను మొక్కల ఆకులను పశువులకు రోగాలు వచ్చినప్పుడు ఉపయోగిస్తారు. కొండ మామిడి చెట్టుతో కాళ్లు, చేతులు విరిగితే కట్టు కడుతుంటారు. పొందగరుగుడు చెక్క, నల్లెడ తీగలు, బురుదొండ, అడవిదొండ లాంటి మొక్కలు లభిస్తా యని గ్రామస్తులు తెలిపారు. గొర్రెలు, మేకల కు రోగాలు వస్తే న యం చేసేందుకు చే గొండ ఆకు, ఉప్పుచెక్క, ముచ్చతునక చెట్టు ఆకులను వాడుతుంటారని గొర్రెలు, మేకల పెంపకందారులు చెబుతున్నారు. అలాగే కలములక చెట్టు మనుషులకు దగ్గుదమ్ముకు, సోమిడిచెట్టు చెక్క, ఆకులు చిన్న పిల్లలకు జబ్బు చేస్తే వాడుతుంటారని చెబుతున్నారు.కార్తీక పౌర్ణమిరోజు మూలికలు సేకరిస్తారు కందికొండ గుట్టపై అనేక ఔషధ మొక్కలుంటాయి. మొక్కల కోసం ఏటా కోయ జాతి గిరిజనులు, ఆయుర్వేద వైద్యులు, సాధువులు వస్తుంటారని గ్రామంలో చర్చించుకుంటారు. కార్తీక పౌర్ణమిరోజు మూలికలు సేకరిస్తే మంచిగా పని చేస్తాయని నమ్మిక. – బి.హేమలత, కందికొండ మాజీ సర్పంచ్ప్రతీ మొక్కలో ఔషధ గుణమే కొండపైన ఉన్న ప్రతీ మొక్కకు ప్రత్యేకత ఉంది. మనం రోజువారీగా చూసే మొక్కలతోపాటు, రకరకాల మొక్కలు దొరుకుతాయి. పెద్ద పెద్ద రోగాలను కూడా నయం చేసే మొక్కలు ఇక్కడ దొరుకుతాయట. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు గొర్రెల కాపరులను తీసుకెళ్లి మొక్కలు తెస్తారు. – మెట్టు ఉప్పల్లయ్య, కందికొండఆయుర్వేద కళాశాల ఏర్పాటు చేయాలి మా ఊరు సరిహద్దులో కందికొండ గుట్ట ఉంటుంది. ఇక్కడ దొరికే ఔషధ మొక్కలు ఎక్కడ దొరకవు అంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గుట్టపై ఉన్న మందు మొక్కలను పరిరక్షించాలి. దీనిని రాబోయే తరాలకు, ఆయుర్వేదంలో ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంతంలో ఆయుర్వేద కళాశాల ఏర్పాటు చేయాలి. – గాండ్ల సతీశ్, సూదనపల్లి -
నిషేధం.. నట్టింట్లో అపహాస్యం!
‘మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన దంపతులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మొదటగా లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఆపై కురవిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆ ఆస్పత్రి యజమానిపై లింగనిర్ధారణ, ఆబార్షన్లు చేస్తున్నారని కేసు నమోదైంది. అయితే ఆస్పత్రి యజమాని, ఆ దంపతులు కలిసి ల్యాప్టాప్ సైజులో ఉన్న స్కానింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. టెక్నికల్ పరిజ్ఞానం తెలిసిన ఖమ్మం పట్టణానికి చెందిన ఆర్ఎంపీతో కలిసి గిరిజన తండాలు, పల్లెల్లో స్కానింగ్ చేయడం, ఆడపిల్ల అని తేలితే అక్కడే అబార్షన్లు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు చేశారు. ఈ విషయం పసిగట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. మొబైల్ స్కానింగ్, అబార్షన్ వ్యవహారాన్ని బట్టబయలు చేసి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి కురవి పోలీసులకు అప్పగించారు’ కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన ఒక ముఠా స్కానింగ్ మెషిన్ను ఓ గర్భిణి ఇంటికి తీసుకెళ్లి పరీక్షలు చేస్తుండగా ఇటీవల టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. వీరు కొంత కాలంగా మొబైల్ స్కానింగ్ యూనిట్ను నిర్వహిస్తున్నారు. ఎన్ని పరీక్షలు, నిర్ధారణలు చేశారన్న విషయంపై విచారణ కొనసాగుతోంది. సాక్షి, మహబూబాబాద్: ఇప్పటి వరకు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా స్కానింగ్ సెంటర్కు వెళ్లి.. నిబంధనల మేరకు పరీక్షలు చేయించుకునేవారు. కానీ ఇప్పుడు కొనిచోట్ల పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన మొబైల్ స్కానింగ్ మెషిన్లు.. అదీ కూడా ల్యాప్టాప్ అంత సైజులో ఉన్నవి మార్కెట్లోకి రావడంతో అక్రమార్కుల పని సులువైంది. నాలుగైదు కేసులు ఉంటే.. లేదా చుట్టూ పక్కల తండాల్లోని గర్భిణులను ఒకచోటకు రమ్మని చెబుతున్నారు. చదవండి: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారంబ్యాగుల్లో మెషిన్లు పెట్టుకెళ్లి అక్కడే పరీక్షలు చేసి ఆడ, మగ శిశువు అని నిర్ధారిస్తున్నారు. పరీక్షలకు ఒక్కొక్కరి నుంచి రూ.5వేలకు పైగా తీసుకుంటున్నట్టు సమాచారం. పరీక్ష తర్వాత మగశిశువు అయితే ఆ గర్భిణిని ఇంటికి పంపించడం.. ఆడశిశువు అయితే అక్కడే అబార్షన్లు కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఇలా చేయడంతో పలువురు మహిళలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం, పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని బతికి బయటపడిన సంఘటనలు ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ఇలా..మొబైల్ స్కానింగ్ పరికరాలతో లింగనిర్ధారణ చేసి ఆడశిశువును చంపేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో మొబైల్ స్కానింగ్తో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుంటే పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో బీడీ ఖార్ఖానా ముసుగులో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుపడ్డారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గర్భవిచ్ఛిత్తి కేసులు బయటపడ్డాయి. అబార్షన్ సమయంలో మహిళలు చనిపోవడం, లేదా ప్రాణాపాయస్థితికి వస్తే కానీ బయటకు రావడం లేదు. మౌనంగా అధికారులుచట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ చేయడం (illegal gender test) అబార్షన్లు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నా.. పలు జిల్లాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. స్కానింగ్ సెంటర్ల తనిఖీల సమయంలో పెద్దగా పట్టించుకోవడం లేదని, సెంటర్ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లతో కొందరు అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి చట్టవిరుద్ధంగా నిర్వహించే లింగనిర్ధారణ పరీక్షలను అడ్డుకోకపోతే ఆడపిల్లల రేషియో మరింత పడిపోయే ప్రమాదం ఉందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
బడికి పోవాలంటే భయం భయం
-
రైలొస్తేనే బతుక్కి పట్టాభిషేకం
ఆ గ్రామాలు, గిరిజన తండాలన్నీ రైల్వే పట్టాల వెంబడే ఉంటాయి.. అందుకే వారి జీవన ప్రయాణం రైలు పరుగులపై ఆధారపడి ఉంటుంది. విధివంచితులు.. చిన్నతనంలోనే భర్తను కోల్పోయి.. కుటుంబ భారం మీదపడి పిల్లలను పోషించుకునేందుకు కొందరు.. జీవనోపాధి లేక మరికొందరు.. రైళ్లలో పల్లీ, బఠాణీలు, సీజన్ పండ్లు అమ్ముకొని వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. రైలు బండి నడిస్తేనే.. కుటుంబానికి తిండి దొరుకుతుంది. - సాక్షి, మహబూబాబాద్ రైలులోనే ప్రయాణం మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, గార్ల, గుండ్రాతి మడుగు, మహబూబాబాద్, తాళ్లపూపల్లి, కేసముద్రం స్టేషన్ల పరిధిలోని తండాలతోపాటు, అటు విజయవాడ, ఇటు సికింద్రాబాద్, బల్లార్షా వరకు ఉన్న తండాల్లో మహిళలకు వ్యాపారమే ప్రధానాధారం. పండించిన పల్లీలు, తమ గ్రామాలు, తండాల పరిసరాలలో దొరికే సపోటా, ఈతపండ్లు, తాటిముంజలు, జామకాయలు ఇలా సీజన్ల వారీగా సేకరించి వాటిని విక్రయించి కుటుంబాలను పోషించుకునేందుకు గిరిజన మహిళలు రోజూ రైలులో ప్రయాణిస్తారు. ఇలా రోజూ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే వీరి ప్రయాణం రాత్రి 10 గంటల వరకు ఉంటుంది.ఒక్కోరోజు రాత్రి 12 గంటల వరకు సరుకులు అమ్ముకొని ఇంటికి వస్తారు. కొన్ని సందర్భాల్లో రైల్వేస్టేషన్లలో తలదాచుకొని మర్నాడు ఇంటికి చేరిన సందర్భాలు ఉన్నాయి. ఇలా రోజూ 200 మంది వరకు ఈ వ్యాపారం చేస్తున్నారు. రోజుకు రూ.300 నుంచి రూ.1,000 వరకు సంపాదిస్తున్నారు.గుర్తింపు కార్డులివ్వాలి.. నా భర్త 14 ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటినుంచి పల్లీలు అమ్ముకుంటూ నాకున్న ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కుమారులను కష్టపడి సాదుకుంటూ వచ్చా. పొట్టకూటి కోసం పల్లీలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. రైలు బండి నడిస్తేనే తిండి దొరుకుతుంది. పెద్దసార్లు దయ ఉంచి గుర్తింపు కార్డులు ఇస్తే భయం లేకుండా వ్యాపారం చేసుకుంటాం. – బానోతు హచ్చి, బడితండా, కేసముద్రం మండలంబొగ్గు బండి ఉన్నప్పటి నుంచి.. నలభయ్యేళ్లుగా రైలులో పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చా. బొగ్గు బండి ఉన్నప్పటి నుంచి పల్లీలు అమ్మడం మొదలుపెట్టా. పల్లి గ్లాసు.. పైస నుంచి అమ్మిన. రైలులో ఎన్నోమార్లు ఆర్పీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. కోర్టులో జరిమానా కట్టి వచ్చేవాళ్లం. ఆర్పీఎఫ్ అధికారులు పట్టుకున్న ప్రతిసారీ తిరిగి ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యేది. పొట్టకూటికోసం పల్లీలు అమ్ముకుంటూ ఇబ్బందులు పడుతూ వచ్చాం. నాకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పల్లీలు అమ్మి అందరి పెళ్లిళ్లు చేసిన. మగ పిల్లలను చదివించిన. – బానోతు చాంది, బడితండా, కేసముద్రంవితంతువులే అధికం మహబూబాబాద్ జిల్లాలో ఏ తండాను కదిలించినా కన్నీళ్లే ఉబుకుతాయి. గుడుంబాకు బానిసలు కావడం, తండాలను కబళించే వింత వ్యాధులతో పాతికేళ్లు నిండక ముందే మృత్యువాత పడిన మగవారు ఎక్కువగా ఉన్నారు. అప్పటికే వివాహాలు చేసుకొని ఇద్దరు, ముగ్గురు పిల్లలతో 20 ఏళ్లు కూడా నిండని భార్యపై పిల్లలు, వృద్ధ అత్తామామల భారం పడుతుంది. ఈ సంసార సాగరాన్ని దాటేందుకు రైళ్లలో వ్యాపారం చేసుకోవడం సాధారణమవుతోంది. ఇలా పల్లీలు, బఠాణీలు, పండ్లు అమ్ముకొని పిల్లలను పెద్ద చదువులు చదివించి ప్రభుత్వ కొలువుల్లో చేరి్పంచిన వారు కొందరైతే.. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి భారం తీర్చుకున్నవారు మరికొందరు ఉన్నారు. అవమానాలు.. ఆప్యాయతలు నిత్యం రైలులో ప్రయాణం చేసుకుంటూ సరుకులు అమ్మే మహిళలకు అవమానాలు.. అ ప్యాయతలు ఎదురవుతుంటాయి. టికెట్ లేదని కేసులు పెట్టి జైలుకు పంపిన రైల్వే అధికారులు ఉన్నారు. మహిళలు కావడంతో ఆకతాయిలు ఇబ్బంది పెట్టడం, సూటిపోటి మాటలు, లైంగిక వేధింపులు కూడా చవిచూడాల్సి వస్తుందని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం రోజూ ప్రయాణం చేసే వారి ఆప్యాయత కూడా ఉంటుందంటున్నారు. దశాబ్దాలుగా రైలునే నమ్ముకొని జీవించే తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. -
TG: రెండు జిల్లాలో భీకర వర్షం.. ఈ రాత్రి ఎలా గడిచేనో..
సాక్షి, ఖమ్మం/మహబూబాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల నుంచి కోలుకునేలోపే మరోసారి మహబూబాబాద్, ఖమ్మంలో శనివారం మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షం ధాటికి ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది.ఇక, శనివారం సాయంత్రం నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రం సహా బయ్యారం మండలంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో, జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. అటు.. బయ్యారంలో జగ్నతండా జల దిగ్బంధమైంది. అన్ని వైపుల నుంచి వరద చుట్టుముట్టడంతో తండాలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన మరోసారి పెరుగుతున్న మునేరు వాగు ప్రవాహం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటోందన్నారు. అవసరమైతే సహాయక శిబిరాలు మళ్లీ తెరవాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు వెంటనే అక్కడినుండి తరలి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు వెళ్లాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సూచనలను పాటించి, తగినంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులతో సంప్రదించాలని కోరారు. అధికారులు వెంటనే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు, ప్రజలకు సహాయ సేవలు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. Inatensive Heavy rain in Mahabubabad bro now pic.twitter.com/3JQBEnpwLP— MKS Goud (@KothaMukesh2) September 7, 2024 మరోవైపు.. ఖమ్మంలో కూడా మరోసారి పరిస్థితి దారుణంగా మారాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్నేరుకు వరద పెరిగే అవకాశం ఉంది. శనివారం అర్ధరాత్రి తర్వాత మున్నేరు ఉధృతి పెరిగే సూచనలు ఉండటంతో కేఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. కమిషనర్.. అధికారులను అందరినీ అత్యవసరంగా ఆఫీసుకు పిలిపించారు. ముంపు ప్రాంతాలను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు ప్రజలకు సూచించారు. Water level is rising in munneru due to heavy rains in mahabubabad and warangal.* Munneru river* Date: *07.09.2024*Time : 7.26 PMWater level: 8.75'ft1st warning 16.00 ft 2nd Warning 24.00ft. Trend:- steadyదాన్వాయిగూడెం, రమణపేట,… pic.twitter.com/mngqnDTD9U— Municipal Commissioner (@MC_Khammam) September 7, 2024 #Mahabubabad #Telangana has again got very heavy rain and many places in #Khammam as well as #Yellandu catchment of #Munneru is getting heavy rains in the last 2 hours. Strict vigil required along Munneru sub-basin. @APSDMA @10NDRF @CWCOfficial_FF @ndmaindia pic.twitter.com/3yErRTI7Vj— S Lakshminarayanan (@sln_1962) September 7, 2024 -
చదువులూ వరద పాలు!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, మహబూబాబాద్: భారీ వర్షాలు మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో విద్యార్థుల చదువునూ వరదపాలు చేశాయి. మానుకోటలో 188 పాఠశాలలు, ఖమ్మం జిల్లాలో 72 పాఠశాలలు దెబ్బతిన్నాయి. శ్లాబ్లు కూలిపోవడం, పగుళ్లు రావడం, లీకేజీలు, కాంపౌండ్ వాల్ దెబ్బతినడం, కిచెన్ షెడ్ కూలిపోవడం, ఫర్నిచర్ దెబ్బతినడం, పుస్తకాలు, కంప్యూటర్లు, రికార్డులు, సర్టిఫికెట్లు తడిసిపాడైపోవడం వంటివి సమస్యగా మారాయి. అటు ముంపు ప్రాంతాల్లోని ఇళ్లలోనూ విద్యార్థుల బ్యాగులు, పుస్తకాలు తడిసి పాడైపోయాయి. దీనితో వేలాది మంది విద్యార్థుల చదువుపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. సోమవారం నుంచి బడులు తెరుచుకోనున్న నేపథ్యంలో చదువులు ఎలా సాగుతాయి, మళ్లీ పుస్తకాలు కొనడం ఎలాగని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఇది. రెండు అంతస్తుల ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్ తరగతి గదుల్లో బురద మేటలు వేశాయి. తొమ్మిదో, పదో తరగతి పుస్తకాలు తడిసి పాడైపోయాయి. పాఠశాలను చూసేందుకు వచ్చిన తొమ్మిదో తరగతి విద్యార్థులు రాంచరణ్, వరుణ్తేజ్, ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ఇక్కడి పరిస్థితి చూసి ఆవేదన చెందారు.బడికి వెళ్లాలంటే.. సర్కస్ ఫీట్లే..మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు– ఉగ్గంపల్లి మార్గంలో బ్రిడ్జి పక్కన రోడ్డు తెగిపోయింది. దీంతో విద్యార్థులు బడికి వెళ్లేందుకు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. తల్లిదండ్రులు బ్రిడ్జి పైనుంచి నిచ్చెన సాయంతో పిల్లలను కిందికి దింపి, రోడ్డుపైకి తీసుకెళ్లి పంపిస్తున్నారు. సాయంత్రం మళ్లీ అదే తరహాలో తిరిగి తీసుకెళుతున్నారు.భయం భయంగా వెళ్లాల్సి వస్తోందిమంగళవారం నుంచి రెండు రోజులు బడికి వెళ్లలేదు. మూడోరోజు మా నాన్న బ్రిడ్జి వద్దకు వచ్చి నిచ్చెన మీది నుంచి కిందికి దింపి రోడ్డు వరకు తీసుకొచ్చి బడికి పంపించాడు. సాయంత్రం మళ్లీ వచ్చి తీసుకెళ్లాడు. బ్రిడ్జి పైనుంచి నిచ్చెనతో దిగాలన్నా.. ఎక్కాలన్నా భయం వేస్తోంది. – ఏనుగంటి శ్రీజ, ఏడో తరగతి, ఉగ్గంపల్లి -
యువరైతును మింగిన వర్షాలు
కురవి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాగు చేసిన మిర్చి పంట కుళ్లిపోవడం.. చేసిన అప్పులు తీర్చేమార్గం లేక మనస్తాపానికి గురైన యువ రైతు భూక్య హత్తిరాం (33) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు శివారు హరిదాసు తండా జీపీ పరిధిలోని హర్య తండాలో శుక్రవారం జరిగింది. హత్తిరాం తనకున్న రెండు ఎకరాలకు తోడు మరో ఎకరం భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. గతేడాది మిర్చి సాగు చేయగా నల్లి రోగంతో పంట నాశనమైంది. అప్పుడు పంట కోసం రూ.6 లక్షల అప్పులు చేశాడు.ఆ అప్పులు తీరలేదు. ఈ ఏడాది అదే పంటను నమ్ముకుని తిరిగి మిర్చి సాగు చేశాడు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వేసిన మిరప తోట కుళ్లిపోయి పనికిరాకుండా పోయింది. దీంతో మనస్తాపానికి గురైన హత్తిరాం గురువారం తోట వద్ద పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. అస్వస్థతకు గురైన హత్తిరాం కుటుంబ సభ్యులకు మందు తాగినట్లు చెప్పాడు. అప్పటికే పరిస్థితి విషమిస్తుండటంతో కుటుంబసభ్యులు వెంటనే మహబూబాబాద్లోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి భూక్య స్వామి (సామ్య) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కురవి ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. మృతుడికి భార్య మీనా, అరవింద్, అరుణ్ కుమారులున్నారు. -
రైల్వే ట్రాక్ పునరుద్ధరణ
-
36 గంటల్లో మహబూబాబాద్ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ
మహబూబాబాద్, సాక్షి: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్ద మోరీ వద్ద వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి అయింది. ఈ పట్టాల పునరుద్ధరణ నిర్మాణ మరమ్మతు పనులను రైల్వే శాఖ అధికారులు యుద్ద ప్రాతిపదికన కేవలం 36 గంటల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించారు.తాజాగా నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ట్రాక్ కొట్టుకుపోవటంతో వందలాది రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. కొన్ని రైళ్లను దారిమళ్లించి విషయం తెలిసిందే. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి కావటంతో రేపటి(బుధవారం) నుంచి యాధావిధిగా రైళ్ల రాకపోకలు కొసాగుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
వరద బాధితులను పరామర్శించి నష్టపరిహారం ప్రకటించిన సీఎం రేవంత్
-
గుండె కరిగిపోయే, మనసు చెదిరిపోయే దృశ్యాలు చూశా: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే దృశ్యాలు స్వయంగా చూశానని తెలిపారు. బాధితుల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సర్కార్ ఎంతటి సాయం చేయడానికైనా సిద్దమని తెలిపారు. బాధితుల మొఖాలలో ఓవైపు తీరని ఆవేదన.. మరోవైపు అన్నా’ వచ్చాడన్న భరోసా కనిపించిందన్నారు.గుండె కరిగిపోయే దృశ్యాలు…మనసు చెదిరిపోయే కష్టాలు…స్వయంగా చూశాను.బాధితుల మొఖాలలో …ఒకవైపు తీరని ఆవేదన…మరోవైపు “అన్నా” వచ్చాడన్న భరోసా.వీళ్ల కష్టం తీర్చడానికి…కన్నీళ్లు తుడవడానికి…ఎంతటి సాయమైనా చేయడానికి సర్కారు సిద్ధం.#TelanganaRains2024 pic.twitter.com/0NQPobJsd5— Revanth Reddy (@revanth_anumula) September 3, 2024మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు.వరదలో కొట్టుకుపోయి చనిపోయిన సైంటిస్టు అశ్విని కుటుంబాన్ని పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలు, పొలాలు, రోడ్లు పరిశీలించనున్నారు. -
గాలిలో రైలు పట్టాలు..
సాక్షి, మహబూబాబాద్/ డోర్నకల్/ మహబూబా బాద్ రూరల్/ కేసముద్రం: మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో నాలుగు చోట్ల రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. వరద తాకిడికి పట్టాల కింద సిమెంట్ దిమ్మెలు, కంకరరాళ్లు, మట్టి కొట్టుకుపోయి ఊయలలా పట్టాలు వేలాడుతున్న విషయాన్ని రైల్వే సిబ్బంది పసిగట్టడం.. అప్రమత్తమైన అధికారులు ఎక్కడిక క్కడ రైళ్లను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయోధ్య పెద్దచెరువు కట్ట తెగడంతో..మహబూబాబాద్ రూరల్ మండలం అయోధ్య పెద్ద చెరువు కట్ట తెగడంతో వరద నీరు ఉధృతంగా తాళ్లపూసపల్లి సమీపంలో రైల్వేట్రాక్ కిందినుంచి వెళ్లింది. దీంతో కొత్తగా వేస్తున్న విజయవాడ– సికింద్రాబాద్ లైన్తోపాటు, పాత లైన్ల కింద ఉన్న మట్టి, కంకర రాళ్లతోపాటు, సిమెంట్ దిమ్మెలు కూడా కొట్టుకుపోయాయి. దీంతో ఆరు నుంచి పది అడుగుల మేరకు గొయ్యిపడి పట్టాలు గాలిలో వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. అదేవిధంగా కేసముద్రం విలేజీ పెద్ద చెరువు, దామర చెరువు, ఇంటికన్నె చెరువుల వరదతో ఇంటికన్నె, కేసముద్రం మధ్యలో వరద తీవ్రత పెరిగి ట్రాక్ అడుగు భాగం అంతా కొట్టుకుపోయింది. దీంతో ఇంటికన్నె–కేసముద్రం మధ్య 200 మీటర్ల మేర, తాళ్లపూసపల్లి–మహబూబాబాద్ మధ్యలో ఒక చోట 50 మీటర్లు, మరోచోట 10 మీటర్ల మేరకు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయి ట్రాక్ తీవ్రంగా దెబ్బతిన్నది. అదేవిధంగా నెక్కొండ– వరంగల్ మధ్య రెండు మీటర్ల మేర గొయ్యి పడింది. వేలాది మంది ప్రయాణికులతో ఉక్కిరి బిక్కిరిట్రాక్లు దెబ్బతిన్న విషయాన్ని ముందుగానే గుర్తించిన అధికారులు కేసముద్రంలో సంఘమిత్ర రెండు రైళ్లు, మహబూబాబాద్లో సింహపురి, మచిలీపట్నం, డోర్నకల్లో పద్మావతి, అప్, డౌన్ రెండు గౌతమి రైళ్లు నిలిపి వేయడంతో సుమారు పదివేలకు పైగా ప్రయాణికులు ఒక్కసారిగా మూడు స్టేషన్లలో దిగారు. రైళ్లు ఎప్పుడు వెళ్తాయో తెలియకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. కొందరు ప్రైవేట్ వాహనాలలో వెళ్లగా, మరికొందరు లాడ్జీలు తీసుకొని ఉన్నారు. ఎటూ వెళ్లలేని వారు స్టేషన్లలోనే ఉండటంతో మహబూబాబాద్, కేసముద్రం, డోర్నకల్ ప్రాంతాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు వారికి పండ్లు, బిస్కెట్లు, టిఫిన్, మధ్యాహ్న భోజనం, మంచినీరు, మందులు అందజేశారు.సార్లకు సమాచారం ఇచ్చాను..నేను కేసముద్రం– ఇంటికన్నె లైన్లోని 550 ఆర్ఏ ఎఫ్టీ వద్ద ఉన్నా. పైనుంచి వరద పెరిగింది. అప్ప టికే నా వద్దకు వచ్చిన పెట్రోలింగ్ టీమ్తో మాట్లాడి విషయం ముందుగా ఎస్ఎస్ఏ శ్రీనివాస్కు, తర్వాత రాజమౌళికి ఇచ్చాం. ట్రైన్ల వేగం తగ్గించారు. తర్వాత కూడా వరద పెరగడంతో కాషన్ ఆర్డన్ ఇవ్వాలని కోరాం. – మోహన్, ట్రాక్మన్, ఇంటికన్నెవారిద్దరి సమాచారంతో రైళ్లు ఆపేశాంగతంలో జరిగిన వరద అనుభవాల దృష్ట్యా రైల్వే లైన్లకు ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వాచ్మెన్లను పెట్టాం. ట్రాక్మన్ సమాచారంతో అప్రమత్తమై రోడ్డు మార్గంలో నేను 575 రైల్వే ఎఫెక్టెడ్ ట్యాంక్ వద్దకు వెళ్లాను. అప్పటికే పరిస్థితి విషమించింది. వరద పెరిగింది. విషయాన్ని పై అధికారులకు చేరవేశా. దీంతో ఎక్కడి రైళ్లు అక్కడ ఆపేశారు. – రాజమౌళి, సీనియర్ రైల్వే సెక్షన్ ఇంజనీర్ప్రమాద స్థాయి గమనించానునేను తాళ్లపూసపల్లి– కేసముద్రం లైన్లోని 575 ట్యాంకు వద్ద ఉన్నా. సాయంత్రంనుంచి గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. ప్రమాద స్థాయికి చేరుతుందని గమనించి రాత్రి 12 గంటల సమయంలోనే మా ఎస్ఎస్ఈ రాజమౌళికి చెప్పా. గస్తీ వాళ్లకు సమాచారం ఇచ్చి ఆయన వచ్చారు. రైళ్లు ఆపేశాం. – జగదీశ్, ట్రాక్మన్, తాళ్లపూసపల్లి -
భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్..
-
TG And AP: వరదల నీటిలో రైల్వే ట్రాక్.. 18 రైళ్లు ఆలస్యం!
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలుచోట్ల రోడ్లు, రైల్వే ట్రాక్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు.. భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా జలదిగ్బంధమైంది. జిల్లాలో రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకోయింది. దీంతో మట్టి కోతకు గురవడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.కాగా, భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ జలమయం అయ్యాయి. కేసముద్రం మండలంలో రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది. మట్టి కోతకు గురవడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్పై నుంచి వరద ప్రవహిస్తుండటంతో పందిపల్లి వద్ద మహబూబ్నగర్-విశాఖ ఎక్స్ప్రెస్ నాలుగు గంటల పాటు నిలిచిపోయింది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో మచిలీపట్నం, సింహపురి రైళ్లు నిలిచిపోయాయి. దాదాపు 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో ఈ రైళ్లను దారి మళ్లించే అవకాశం ఉంది.భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్మహబూబాబాద్ - కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి దగ్గర భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్.దీంతో మచిలీపట్నం ఎక్స్ప్రెస్తో పాటు పలు రైళ్లను నిలిపేసిన రైల్వే అధికారులు pic.twitter.com/1uJvcXA7Iw— HARISH TIRRI (@TIRRIHARISH) September 1, 2024 -
‘ఆరుద్ర’ను చూస్తే అనువైన వరుడు..
గిరిజనులకు తల్లీ తండ్రి ప్రకృతే. కొరత లేకుండా ధాన్యాన్ని పస్తులు ఉంచకుండా పంటల్ని పుష్కలంగా ఇవ్వడమే కాదు తమకు అనువైన తోడును కూడా ప్రకృతి మాతే తీసుకువస్తుందన్నది ప్రగాఢమైన నమ్మకం. ఆ నమ్మకం పెళ్లీడుకు వచ్చిన పడతుల్లో కోటి ఆశలను విరబూయిస్తుంది. ఆ ఆశలే ఇంటింటా సంబరమవుతాయి.పంట సాగు నుండి కన్నెపిల్లల పరిణయాల వరకు అంతా ప్రకృతి చెప్పిన విధంగానే నడుచుకుంటారు గిరిజనులు. అంతటి ప్రాధాన్యత కల్గిన వాటిల్లో ‘తీజ్’ పండుగ ముఖ్యమైనది."నాకు అరవై ఏళ్లు. మా చిన్నప్పుడు కూడా తీజ్ పండుగ చేసుకున్నాం. తీజ్ పెరిగిన తీరును చూసి మా అమ్మానాన్నలు, తండా పెద్దలు నాకు పెళ్లి చేశారు. ఇదే ఆనవాయితీ మా పిల్లలు కూడా చేస్తున్నారు0." – భూక్యా వీరమ్మ గన్యాతండ, మహబూబాబాద్తీజ్ అంటే..పెళ్లీడుకు వచ్చిన గిరిజన (లంబాడ) అమ్మాయిలు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. గోధుమ నారునే కాదు ఈ కాలాన కనిపించే ఆరుద్ర పురుగులనూ తీజ్ అంటారు. ఎర్రగా అందంగా ఉండే ఆరుద్ర పురుగులను దేవుడు తమకోసం పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు మనసులో కోరుకున్న కోరిక ఫలిస్తుందని వీరి నమ్మకం.ఇంటింటి ఆశీస్సులు..పెళ్లీడుకు వచ్చిన యువతులు తమకు కావాల్సిన వరుడి కోసం చేసే ఈ పండగకు ముందు గా తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. యువతులందరు ఇంటింటికి వెళ్లి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, వారు కానుకగా ఇచ్చే విరాళం తీసుకోవడంతో తండా అంతా సందడిగా మారుతుంది. ఇలా సేకరించిన విరాళం (ధాన్యం) తో తమకు కావాల్సిన గోధుమలు, శనగలు, ఇతర సామాన్లు కొనుగోలు చేస్తారు.గోధుమ మొలకలు..తీజ్ పండుగలో ముఖ్యమైనది తీజ్ (గోధుమ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్ళి దుస్సేరు తీగలు తెచ్చి, బుట్టలను అల్లి, తమ ఆరాధ్య దైవం తుల్జా భవాని, సేవాబాయి, సీత్లాభవానీలకు పూజలు చేసి, పుట్టమట్టిని తెస్తారు. మేకల ఎరువును కలిపి తండా నాయక్ చేతిలో ఉంచిన బుట్టలో ΄ోస్తారు. అప్పటికే నానబెట్టి ఉంచిన గోధుమలను అందులో వేస్తారు. శనగలకు రేగుముళ్లుతీజ్ వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనగలకు యువతులు రేగుముళ్లు గుచ్చుతారు. ఈ ప్రక్రియను బావ వరుసయ్యే వారు పడతుల మనస్సు చెదిరేలా వారిని కదిలిస్తూ ఉంటారు.నియమ నిష్టలతో..తండాలోని యువతులందరు తమ బుట్టలను ఒకేచోట పెడతారు. ఈ తొమ్మిది రోజులు పెట్టిన బుట్టలకు నీళ్లు ΄ోస్తూ, వాటి చుట్టూ తిరుగుతూ గిరిజన నృత్యాలు, పాటలు పాడుతూ గడుపుతారు.ఏడవ రోజు ఢమోళీ.. ఏడవరోజు జరిగే ఢమోళీ చుర్మోను మేరామా భవానీకి నివేదిస్తారు. వెండితో చేసిన విగ్రహం, రూపాయి బిళ్ల అమ్మవారి ముందు పెట్టి మేక΄ోతులు బలి ఇచ్చే తంతును‘ఆకాడో’ అంటారు.దేవతల ప్రతిరూపాలకు..ఎనిమిదవ రోజు మట్టితో ఆరాధ్య దైవాల ప్రతిరూపాలను తయారు చేస్తారు. అబ్బాయి(డోక్రా), అమ్మాయి(డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సాంప్రదాయాల ప్రకారం పెండ్లి చేస్తారు. ఆడపిల్లలు పెళ్లి కూతురుగా, మగ పిల్లలు పెళ్లికొడుకుగా ఊహించుకుంటూ ఈ తంతులో పాల్గొంటారు. పెళ్లి తర్వాత తమ కుటుంబ సభ్యులను విడిచి పెడుతున్నట్లు ఊహించుకుని ఏడ్వడం, వారిని కుటుంబ సభ్యులు ఓదార్చడంతో ఈ తంతును నిర్వహిస్తారు.తొమ్మిదవ రోజు నిమజ్జనం..డప్పు చప్పుళ్లు, నృత్యాలతో అందరూ బుట్టల వద్దకు వెళ్తారు. తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలను అందజేస్తారు. యువతులు ఆశీర్వాదాలు తీసుకుంటారు. తమ పూజాఫలంగా పెరిగిన తీజ్ను అన్నదమ్ముళ్లకు ఇచ్చి.. వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తర్వాత యువతీ, యువకులు బుట్టలను పట్టుకొని ఊరేగింపుగా వెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తారు. – ఈరగాని భిక్షం, సాక్షి, మహబూబాబాద్, ఫొటోలు: మురళీ కృష్ణ -
మహబూబాబాద్
గురువారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2024 7నెహ్రూసెంటర్: ఆర్టీసీలో ప్రమాదాలను నివారించేలా సంస్థ వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈమేరకు ఈ నెల 24నుంచి 30వ తేదీ ప్రమాద రహిత వారోత్సవాలను నిర్వహించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు రోడ్డు భద్రత నియమాలు, జాగ్రత్తలపై డ్రైవర్లకు అవగాహన కల్పించనున్నారు. అలాగే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాదాలను నిలువరించేలా చర్యలు తీసుకోనున్నారు.ప్రత్యేక కార్యక్రమాలు..ప్రమాద రహిత వారోత్సవాలను ఏడు రోజులు నిర్వహించనున్నారు. ప్రతీరోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతారు. మొదటి రోజు వారోత్సవాలను ప్రారంభించడం, రెండోరోజు డ్రైవర్లకు శిక్షణ, మూడో రోజు డ్రైవర్లకు మెడికల్ క్యాంపు ద్వారా చెకప్లు చేయించడం, నాలుగోరోజు ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్లు, ఓనర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి వారికి వివరించడం, ఐదోరోజు బస్సు ప్రత్యేక సేఫ్టీ కోసం అదనపు మెకానిక్లతో స్పెషల్ మెయింటెనెన్స్ చేయించడం, ఆరోరోజు తరచూ ప్రమాదాలు చేసే డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులతో కోఆర్డినేషన్ మీటింగ్, కౌన్సెలింగ్, ఏడోరోజు ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్లను సన్మానిస్తారు.డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...డ్రైవర్లు ౖడ్రైవింగ్ సమయంలో మెళకువలు పాటించాలి. వైపరు పనిచేసేలా చూసుకోవడం, బ్రేకులు, లైట్లు, టైర్లలో గాలి, సైడు అద్దాలను సరి చూసుకోవాలి. వేగ నియంత్రణ పాటించడంతో పాటు ముందు వెళ్లే వాహనాలకు సురక్షిత దూరాన్ని పా టించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.జాగ్రత్తలు పాటించాలి..ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డుపై తగు జాగ్రత్తలు పాటించాలని డీఎస్పీ తిరుపతిరావు సూచించారు. ప్రమాద రహిత వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రాంగణంలో వారోత్సవాలను బుధవారం ప్రారంభించారు. డీఎస్పీ మాట్లాడు తూ.. డైవర్లు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బస్సులను నడపాలని సూచించారు. ఆర్టీసీ అంటే ప్రజల సంస్థ అని డ్రైవర్లు సమయపాలన పాటించాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. వర్షాకాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలు జరుగకుండా చూసుకోవా లన్నారు. ప్రమాద రహిత వారోత్సవాలను విజయవంతం చేయాలని మానుకోట డీఎం ఎం.శివప్రసాద్ తెలిపారు. అనంతరం ప్రమాదరహిత వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఈఎస్ చారి, మల్లికార్జున్, రాఘవేంద్ర, పాపిరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.ప్రమాదాల నివారణకు చర్యలుప్రమాదాలను నివారించేలా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రమాద రహిత వారోత్సవాలను నిర్వహిస్తూ డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నాం. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండేలా శిక్షణతో పాటు ఆరోగ్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ప్రమాద రహిత ఆర్టీసీగా చర్యలు చేపడుతాం.– ఎం.శివప్రసాద్, ఆర్టీసీ డీఎంన్యూస్రీల్ -
మర్యాదకు మందు తెస్తే తాగకుండా పారిపోయిన చుట్టం
-
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి
కొత్తగూడ: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మండలంలోని ఎదుళ్లపల్లిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జినుకల రాజు(24) నాటు వేయడానికి తన పొలం సిద్ధం చేశాడు. ఈ క్రమంలో నీరు పారించడానికి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లాడు.రాత్రి అయినా ఇంటికి రాకపోవడం.. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబీకులకు అనుమానం వచ్చింది. దీంతో పొలం వద్దకు వెళ్లి చూడగా మోటార్ వద్ద షాక్ తగిలి మృతి చెంది ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు సింహద్రి, నాగమల్లు గుండెలవిసేలా రోదించారు. -
ఉరినే ఖాళీ చేసిన గ్రామస్థులు
-
రాష్ట్రంలో వడదెబ్బకు 8 మంది మృతి
చిట్యాల/ హాలియా/కాసిపేట/చొప్పదండి/ములుగు/మహబూబాబాద్/వరంగల్/మునుగోడు: రాష్ట్రంలో వడదెబ్బకు గురై వేర్వేరు ప్రాంతాల్లో శుక్ర వారం ఒక్కరోజే ఎనిమిది మంది మృతి చెందారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి చెందగా నల్లగొండ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. నల్లగొండ జిల్లాలోని అనుముల మండలంలోని కొత్తపల్లికి చెందిన బచ్చు ముకుందరెడ్డి(55) బైక్పై వ్యవసాయ పనిముట్ల కోసం ఉదయం నల్ల గొండ పట్టణానికి వెళ్లి పనిచూసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో వడదెబ్బకు గురయ్యాడు.చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా..మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. ఇదే జిల్లాలో ఏపీలోని పశి్చమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన కర్రి రాజు(40), భార్య దీనమ్మ తమ ముగ్గురు పిల్లలతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మధ్యాహ్నం నల్లగొండ జిల్లా చిట్యాల బస్టాండ్లో రామన్నపేటకు వెళ్లేందుకు రాజు బస్సుకోసం ఎదురుచూస్తుండగా వడదెబ్బకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు ఇదే జిల్లాకు చెందిన మునుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన కమ్మలపల్లి మమత (28) ఉపాధి పనుల నిమిత్తం కూలీ పనులకు వెళ్లి వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే తోటి కూలీలు 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. మంచినీళ్ల కోసమని కిందికి దిగి... కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని బసంత్ నగర్లో నివాసం ఉండే మధ్యప్రదేశ్కు చెందిన జాకీర్ హు స్సేన్(60) అనే లారీ డ్రైవర్ చొప్పదండికి సిమెంట్ లోడ్తో వచ్చాడు. ప్రధాన రహదారిపై ఓ హోటల్ సమీపంలో లారీని ఆపి మంచినీళ్ల కోసమని కిందికి దిగాడు. ఈ క్రమంలో అతడు వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే 108 సిబ్బందికి స్థానికులు సమాచారం అందించగా వారు వచ్చి హుస్సేన్ను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఇక మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కూలీ దుర్గం భీమయ్య(55) వడదెబ్బతో మృతి చెందాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు... మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ఎస్సీకాలనీకి చెందిన జన్ను ఎల్లమ్మ (50), ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన దామెర రాంబాబు(48) వడదెబ్బకు గురై మృతి చెందారు. అదేవిధంగా వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన పల్లకొండ ఐలయ్య(74) రోజువారీగా పందులు మేపడానికి వెళ్లి ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలి మృతిచెందాడు. -
తెలంగాణలో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’.. ఆ రెండు స్థానాలపై స్పెషల్ ఫోకస్!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలపై అన్ని ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ దూకుడు పెంచాయి. అన్ని పార్టీలు ప్రచారంలో ఆరాటం,ఆర్భాటం, పోరాటం ప్రదర్శిస్తున్నాయి. గతంలో ఇప్పుడు లేని విధంగా వరంగల్ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ప్రచారానికి తమ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతున్నాయి. కాంగ్రెస్ తరపున ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహబూబాద్, వరంగల్ బహిరంగ సభలో పాల్గొనగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను, మంత్రులను, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన లీడర్లను ప్రచారంలోకి దింపుతున్నాయి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఆదివారం మాజీ ముఖ్యమంత్రి కాజీపేట వరంగల్ హనుమకొండలో రోడ్ షోలో పాల్గొనున్నారు. దీంతో వరంగల్లో టిఆర్ఎస్లో జోష్ వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ రావులు సైతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పటికే వరంగల్లో కేటీఆర్ పర్యటన పూర్తి కాగా, పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో, అంతకు ముందు వరంగల్ లోక్సభ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సన్నాహాక సమావేశంలో హరీశ్రావు పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.వరంగల్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం పర్యటన వరంగల్, హనుమకొండ పట్టణాల్లో జరిగే కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించనున్నారు. కేసీఆర్ రోడోషోకు సంబంధించిన రూట్ మ్యాప్ ఇప్పటికే ఖరారు కాగా హన్మకొండ జిల్లా బీఆర్ ఎస్ అధ్యక్షుడు వినయ్భాస్కర్, మాజీమంత్రి దయాకర్రావు ఏర్పాట్లను ఇప్పటికే పర్యవేక్షించారు.మే 1న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు రోడ్ షోలో పాల్గొన్న అనంతరం మానుకోట జిల్లా కేంద్రంలోనే బస చేయనున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మానుకోట, హన్మకొండ జిల్లా కేంద్రాల్లో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభల్లో పాల్గొని పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు, శ్రేణులకు సందేశమిస్తూనే కాంగ్రెస్ పార్టీ విధానాలను, ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజలకు ముఖ్యమంత్రి వివరించారు. ఈనెల 30 భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో నిర్వహించే కాంగ్రెస్ జన జాతర సభకు హాజరుకానున్నారు. వరంగల్ పార్లమెంటరీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతున్న రెండో బహిరంగ సభ కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఒకే లోక్సభ నియోజకవర్గం పరిధిలో రెండో బహిరంగ సభ జరగలేదు. వరంగల్ లోక్సభ పరిధిలోనే నిర్వహిస్తున్న రెండో సభకు సీఎం హాజరవుతుండటం విశేషం. 30వ తేదీన రేగొండ మండల కేంద్రంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా రానున్న నేపథ్యంలో శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్ గెలిపించాలని కోరుతూ.. మే 3న హన్మకొండ జిల్లా ఖాజీపేట మండలం మడికొండ శివారులో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాగా.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. నరేంద్ర మోదీతో పాటు జాతీయ స్థాయి నేతలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. వరంగల్ లోక్సభ సీటుపై కన్నేసిన బీజేపీ ఈస్థానంలో గెలుపునకు అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వాసంతో ఉంది.ఆరూరి రమేష్ నామినేషన్కు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హాజరుకాగా, నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిశాక బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నామినేషన్లకు ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29న ముగియనుండటంతో బరిలో ఎంతమంది అభ్యర్థులు నిలచేది..? ఎవరెవరు అభ్యర్థులుగా మిగలబోతున్నారు..? అభ్యర్థుల్లో ప్రధాన ప్రత్యర్థులు ఎవరనేది క్లారిటీ రానుంది. మే 1 నుంచి సరిగ్గా పదకొండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం జోరుగా సాగనుంది. -
టచ్ చేస్తే మసే!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, మహబూబాబాద్: ‘‘20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, చిటికేస్తే వస్తారని కేసీఆర్ చెప్తున్నారు. చిటికె కాదు.. మిద్దెక్కి డప్పు కొట్టు .. నీ దగ్గర ఉన్నోళ్లు కూడా ఎవరైనా ఉంటారేమో చూద్దాం. గతంలోలాగా తోడేళ్లలా వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోదామని అనుకుంటున్నావేమో. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్రెడ్డి. కంచె వేసి కాపాడుకునే పవర్ఫుల్ హైటెన్షన్ వైర్ లాంటివాడు. కరెంటు తీగ మీద కాకి వాలితే ఎట్లా అయితదో.. కాంగ్రెస్ వైపు చూస్తే అట్లానే షాక్ కొట్టి మాడిమసై పోతారు. ప్రయత్నం చేసి చూడు’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో, పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీ, కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. సాయంత్రం మహబూబాబాద్లో కాంగ్రెస్ తెలంగాణ జన జాతర బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయా చోట్ల సీఎం రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘మా కారు కొంచెం పాడైంది. గ్యారేజీకి పొయిందని నిన్న, మొన్న కేటీఆర్ అంటున్నారు. కారు రిపేరవడం కాదు.. ఇంజిన్ సహా మొత్తం పాడైపోయింది. ఇనుప సమాన్ల కింద తూకానికి అమ్ముడే. నీ కారే కాదు.. తండ్రి కేసీఆర్ ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది.. ఇంకా నడవలేకపోతున్నరు. మొన్నటి ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ను పాతేసినా.. ఇంకా పొంకనాలు కొడుతున్నరు. మీ ఎమ్మెల్యేలే నీవెంబడి ఉంటలేరు. అలాంటిది ఎదుటి పార్టీల 20 మంది ఎమ్మెల్యేలున్నారని చెబుతావా? ఇంకెన్ని రోజులు ఇలా కథలు చెప్పి బతుకుతరు? మోదీ, కేసీఆర్ ఒక్కటే.. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలు. వారిలో ఎవరికి ఓటేసినా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. తెలంగాణకు ద్రోహం చేసినట్లే.. పదేళ్లు పాలించిన ఇద్దరు రాష్ట్రానికి చేసింది శూన్యం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని బయట పెట్టకుండా కేసీఆర్ ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడింది ప్రధాని కాదా? పదేళ్లలో పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును సమరి్ధంచినది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఏ ముఖంతో బీజేపీ ఓట్లు అడుగుతుంది? పదేళ్లు తెలంగాణకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిన బీజేపీ ఇప్పుడు ఓట్లు వేయాలంటూ ప్రజల ముందుకు రావడం సిగ్గుచేటు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుండా పక్కన పెట్టింది బీజేపీ కాదా? వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎటుపోయింది? తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ ఏర్పాటుపై వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజల ఓట్లు ఎలా అడుగుతారు? ఉత్తర భారత దేశంలో కుంభమేళా, గంగానది పరిరక్షణ కోసం వేల కోట్లు కేటాయించిన బీజేపీ ప్రభుత్వం.. మన మేడారం జాతరకు ముష్టి రూ.3 కోట్లు కేటాయించి అవమానించింది. 42 మంది తెలుగు మాట్లాడే ఎంపీలుంటే ఒక్క మంత్రి పదవి ఇచ్చారు. అదే యూపీలోని 60 మంది ఎంపీలకు 12 మంత్రి పదవులు, 26 మంది ఎంపీలు ఉన్న గుజరాత్కు ఏడు మంత్రి పదవులు ఇచ్చి వివక్ష చూపారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సొంతంగా ఒక్క సీటు కూడా గెలవదని గ్రహించే బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది. కేసీఆర్ తన బిడ్డ కవితకు బెయిల్ మంజూరు చేయించుకునేందుకు.. రాష్ట్రంలోని మహబూబ్నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి, జహీరాబాద్ సీట్లను వదిలేశారు. ఎవరెన్ని ఒప్పందాలు చేసుకున్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించిన తెలంగాణ ప్రజలు.. ఈ ఎన్నికల్లో మోదీకి కూడా బుద్ధి చెప్పడం ఖాయం. కమ్యూనిస్టులు, టీజేఎస్ మద్దతు తీసుకుంటాం పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీల మద్దతు తీసుకుంటాం. వారితో చర్చించే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చూసుకుంటారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం కలిసొచ్చే ఇతర పార్టీల మద్దతును కూడా కూడగడతాం. మరో పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ప్రజలకు ఇచ్చి న ప్రతీ హామీని నెరవేస్తుంది. తెలంగాణ బిడ్డల చావులను చూసిన సోనియా గాంధీ మనసు తల్లడిల్లి తెలంగాణ ఇచ్చారు. ఇప్పుడు ఆమె కుటుంబానికి అండగా ఉండేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. ఢిల్లీలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. 14 మంది ఎంపీలతో ఢిల్లీ వెళ్తాం..’’ అని రేవంత్ పేర్కొన్నారు. పాలమూరుకు పది పైసలైనా తెచ్చారా? శత్రువు చేతిలో కత్తి పెడితే.. వాడు పక్కోన్ని పొడవడు. మన కడుపులోనే పొడుస్తడు. నిన్న మొన్నటివరకు పదేళుŠల్ కేసీఆరే సీఎంగా, మోదీ పీఎంగా ఉన్నారు కదా. పాలమూరుకు పది పైసలన్నా తెచ్చారా? పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చారా? అది తేలేదుగానీ డీకే అరుణమ్మ మాత్రం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకుంది. పాలమూరులో ఆమె గెలిస్తే గడీలో ఉన్న బంధువులకు మేలే తప్ప పాలమూరుకు ఏ న్యాయమూ జరగదు. గల్లీ నుండి కేసీఆర్ వచ్చి నా.. ఢిల్లీ నుంచి మోదీ వచ్చి నా ఈ గడ్డ మనది. నాడు తట్టపనికో, మట్టి పనికో వలసలు పోయినం. ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికొచ్చినం. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే తలెత్తుకునేలా గౌరవాన్ని ప్రదర్శించినం. కేసీఆర్ది అసత్య ప్రచారం: మంత్రులు మహబూబాబాద్ సభలో మంత్రులు ప్రసంగించారు. రేవంత్ బీజేపీలోకి వెళ్తున్నారంటూ.. తాను బీఆర్ఎస్లోకి వెళ్తున్నానంటూ అసత్యపు ప్రచారం చేయడం మాజీ సీఎంకు అలవాటుగా మారిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 120 రోజులే అయిందని, ఈ కాస్త సమయంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. గత పదేళ్లలో గిరిజనుల కోసం ఏమీ చేయని బీజేపీకి గిరిజనులు బుద్ధి చెప్తారని మంత్రి సీతక్క చెప్పారు. -
ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
-
ఏసీబీకి చిక్కిన సబ్-రిజిస్ట్రార్
-
కదం తొక్కిన కార్మికులు
సాక్షి నెట్వర్క్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఐక్య కార్మిక సంఘాల అధ్వర్యంలో ఆయా కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్లో వ్యవసాయ మార్కెట్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. హనుమకొండలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లిలోని సింగరేణి గనుల్లో అన్ని సంఘాల నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జనగామలో రైల్వేస్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యా లీగా వచ్చి ధర్నా చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచే పార్టీలు, సంఘాల నాయకులు ఆర్టీసీ డిపోల వద్దకు చేరుకుని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే, అధికారులు ముందుగానే దూరప్రాంత సర్విసులు రద్దుచేశారు. మిగతా సర్విసులు మధ్యాహ్నం తర్వాత మొదలయ్యాయి. కాగా, ఖమ్మం రూరల్ మండలం కాశిరాజుగూడెం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులను కూడా నిరసనకారులు అడ్డుకున్నారు. హాల్ టికెట్లు చూపించినా అనుమతించకపోవడంతో విద్యార్థులు కన్నీటిపర్యంతం కాగా, ఇతరులు సర్దిచెప్పడంతో పంపించారు. ఇక సింగరేణివ్యాప్తంగా సమ్మె పాక్షికంగానే సాగింది. 39,010 మంది కార్మికులకు 18,072 వేల మంది(60 శాతం) విధులకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. అయితే, రోజువారీ లక్ష్యంలో 10 శాతం మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. -
Ayodhya: గర్భిణిల ఎదురుచూపు.. బాలుడైతే..
సాక్షి, మహబూబాబాద్: భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. గర్భగుడిలో రామ్లల్లా కొలువుదీరబోతున్నాడు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని తిలకించడానికి దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా రామ నామస్మరణ జరుగుతోంది. మరోవైపు.. తెలంగాణలోని మహబూబాబాద్ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట గడియల కోసం కొందరు గర్భిణీలు ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో వారు ప్రసవించాలని కోరుకుంటున్నారు. ఆ సమయంలో తమ బిడ్డలకు జన్మనివ్వాలని అనుకుంటున్నారు. వివరాల ప్రకారం.. అయోధ్యలో నేడు రాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రసవల కోసం గర్భిణీలు ఎదురుచూస్తున్నారు. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో శుభ గడియ కోసం గర్భిణీల వేచిచూస్తున్నారు. ఈ సమయంలో ప్రసవంలో పుత్రుడు జన్మిస్తే రాముడిగా.. ఆడపిల్ల జన్మిస్తే సీతమ్మగా పేరుగా పేరు పెట్టుకుంటామని చెబుతున్నారు. కాగా, దేశమంతా ఎదురు చూస్తున్న శుభ ముహూర్తాన సీతారాములకు జన్మనివ్వాలని గర్భిణీలు ఆరాటపడుతున్నారు. ఇక, పురిటి నొప్పులు వస్తున్నప్పటికీ నేడు శుభ ముహూర్తం కోసం వారు ఎదురు చూస్తున్నారు. -
విషాదం: కారు-ఆటో ఢీ.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
మహబూబాబాద్ జిల్లా: సంక్రాంతి పండగ వేళ వారంతా దైవదర్శనానికి వెళ్లి వస్తున్నారు. పిల్లల కేరింతలతో ప్రయాణం ఆనందంగా సాగుతోంది. ఇంతలో అనుకోని ప్రమాదం ఎదురైంది. ఎదురెదురుగా వస్తున్న కారు-ఆటో ఢీకొన్నాయి. ఒకే కుటుంబంలో నలుగులు అనంతలోకాలు చేరుకున్నారు. ఒకే కుటుంబంలో తల్లి , కొడుకు , మనుమడు , మనవరాలు మరణంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మహబూబాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. స్థానికంగా కంబాలపల్లి శివారులో కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పటల్కు తరలించారు. మృతులు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. జిల్లాకు చెందిన కుటుంబం నాగార్జునసాగర్ సమీపంలోని బుడియా బాపు దేవుడిని సందర్శించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నారు. అదే జిల్లాకు చెందిన మరో కుటుంబం గుంజేడులోని ముసలమ్మ దేవతను సందర్శించుకుని కారులో తిరిగి వస్తున్నారు. ఇంతలో కంబాలపల్లి శివారుకు చేరుకోగానే కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇస్లావత్ శ్రీను(కొడుకు), పాప ( శ్రీను తల్లి ), రిత్విక్ ( శ్రీను కుమారుడు), రిత్విక ( శ్రీను కూతురు) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ప్రాణం తీసిన చైనా మాంజా! -
ఉద్యోగం రావడంలేదని యువకుడి బలవన్మరణం
డోర్నకల్: ఉద్యోగం రావడంలేదనే మనోవేదనతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ శివారు ఎర్రమట్టితండాలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. డోర్నకల్ సీఐ బి.ఉపేందర్రావు తెలిపిన వివరాల ప్రకారం... ఎర్రమట్టితండాకు చెందిన భూక్యా అనిల్ అలియాస్ విజయ్(23) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే కొన్ని పోటీపరీక్షలకు హాజరైన అనిల్ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఆర్థిక ఇబ్బందులకుతోడు ఉద్యోగం రావడం లేదన్న మనోవేదనలో ఉన్న అనిల్ శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. మరునాడు ఉదయం కుటుంబసభ్యులు గమనించి చుట్టుపక్కల వెతకగా తండా సమీపంలోని ఓ వ్యవసాయబావిలో అనిల్ మృతదేహం లభ్యమైంది. మృతదేహం నుంచి పురుగుమందు వాసన రావడాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. ఉద్యోగం రాలేదనే బాధతోనే అనిల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అనిల్ తండ్రి జయరాజ్ 20 ఏళ్ల క్రితమే అదృశ్యంకాగా, తల్లి, సోదరుడు ఉన్నారు. తల్లి కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనిల్ ఆత్మహత్యకు ముందు రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖ వాట్సాప్లో చెక్కర్లు కొట్టింది. ఉద్యోగం రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో అనిల్ పేర్కొన్నాడు. కాగా, లేఖ విషయం తమ దృష్టికి రాలేదని పోలీసులు తెలిపారు. -
మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాస్ వార్నింగ్
-
మహబూబాబాద్ లో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి
-
మహబూబాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బీఆర్ఎస్ నేతలు
-
రేవంత్, ఉత్తమ్ కుమార్కు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్ఎస్ దూసుకుపోతోంది. మహబూబాబాద్లో బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్.. ప్రతిపక్ష పార్టీలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. 24 ఏళ్ల క్రితం పిడికెడు మందితో ఉద్యమాన్ని ప్రారంభించాం. తెలంగాణ వచ్చింది కాబట్టే మహబూబాబాద్ జిల్లా అయ్యింది. మన బాధలు ఎవరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ ఎన్నిసార్లు మోసం చేసినా పట్టుబట్టి తెలంగాణ సాధించాం. మహబూబాబాద్ తండాల్లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి కళకళలాడుతున్నాయి. గిరిజన ప్రాంతంలోనూ మెడికల్ కాలేజీని ప్రారంభించుకున్నాం. ఎన్నికల కోసం అబద్దాలు చెప్పడం లేదు. మొన్న మ్యానిఫెస్టో ప్రకటించాం. అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలి. మరింత ప్రగతి సాధించడానికి మీ దీవెన ఉండాలి. వెనుకబడిన గిరిజన ప్రాంతాన్ని మహబూబాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేసి రూపు రేఖలు మార్చాం. కాంగ్రెస్ నాయకులు రేవంత్, ఉత్తమ్ రెడ్డిలు రైతు బంధు వద్దంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటలే కరెంట్ ఇవ్వాలంటున్నాడు. రైతులు ఆలోచించి మేలు చేసే ప్రభుత్వానికి ఓటు వేయాలి. కాంగ్రెస్ నాయకుల మాటలు వింటే గోస పడుతాం. కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలకు మోస పోవొద్దు.రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి శంకర్ నాయక్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని కోరారు. రైతుబంధు వృథా అని ఉత్తమ్కుమార్ రెడ్డి అంటున్నారు. ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తామని కొందరు అంటున్నారు. వారిని ముందుగా బంగాళాఖాతంలో వేయాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. కర్ణాటకలో కరెంట్ కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఎరువుల కోసం యుద్ధాలు జరిగేవి. పోలీసు స్టేషన్లో ఎరువులను అందించిన దాఖలు చూశాం. నేడు ఎరువులు కొరత లేదు అని అన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24గంటల కరెంట్ లేదు. రైతుబంధు, రైతుబీమా నేరుగా ఖాతాల్లో జమ అవుతున్నాయి. రైతుబంధు, పెన్షన్లను పెంచుకుంటూ ముందుకు వెళ్తాం అని తెలిపారు. -
నా తండాకు రోడ్డువేసి రుణం తీర్చుకున్నా..
సాక్షి, మహబూబాబాద్: ‘మా పెద్దతండాకు అప్పట్లో సక్రమంగా రోడ్డు లేదు. బడి కూడా లేదు. ఈ దుస్థితిని చూసి నా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసేవారు. మన తండా బాగుపడదా.. అని ఎప్పుడూ బాధపడేవారు. ఇప్పుడు నేను మంత్రిగా తండాకు కావాల్సిన వసతులు కల్పించా. చక్కటి రోడ్డు వేయించా. నా తల్లిదండ్రులు ఉండి ఉంటే ఈ అభివృద్ధిని చూసి సంతోషపడేవారు’అంటూ వారిని తలచుకుంటూ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కంటతడి పెట్టారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా క్రాస్రోడ్డు నుంచి చెక్డ్యామ్ వరకు రూ.1.35 కోట్లలో నిర్మించతలపెట్టిన బీటీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రి సత్యవతి మాట్లాడుతూ గతంలో తన తండా పరిస్థితిని వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. -
ముచ్చటగా మూడోసారి బరిలోకి.. ఈసారి ఓటమి తప్పదా?
పోరాటాల పురుటి గడ్డ మానుకోట. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న మానుకోట తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావంతో గులాబీ తోటకు అడ్డగా మారింది. ఎస్టీ రిజర్వుడు స్థానమైన మహబూబాబాద్ లో గిరిజన నేతల మద్య రాజకీయ పోరు రక్తికట్టిస్తుంది. పార్టీలు ఎన్ని ఉన్నా ప్రధానంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజేపి మద్యనే పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తుంటే, కాంగ్రెస్ బిజేపి ఇంకా అభ్యర్థి ఎంపికలో తలమునకలై పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నాయి. పాతకాపుల మద్యనే మానుకోటలో పోటీ నెలకొన్న పాలిటిక్స్పై స్పెషల్ స్టోరీ. ప్రజానాయకుడిగా పేరు ఒకప్పటి మానుకోట మహబూబాబాద్గా మారి జిల్లా కేంద్రంగా అవతరించింది. నియోజకవర్గాల పునఃర్విభజనతో ఎస్టీ రిజర్వుగా మారిన మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు మండలాలు 155 గ్రామ పంచాయితీలు 238734 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం బిఆర్ఎస్ కు చెందిన శంకర్ నాయక్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అవిర్బావంతో 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన శంకర్ నాయక్ రెండోసారి 2018లో గెలిచి ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. విమర్శలకు తోడు గ్రూప్ రాజకీయాలు ముచ్చటగా మూడో సారి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలుస్తున్న శంకర్ నాయక్ ఈసారి ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన శంకర్ నాయక్కు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని బట్టి గెలుపుఓటములు ఆధారపడి ఉన్నాయి. రెండు సార్లు ఎమ్మెల్యే అయిన శంకర్ నాయక్ బినామీ పేర్లమీద ఆస్థులు కూడబెట్టారనే విమర్శలు ఉన్నాయి. విమర్శలకు తోడు పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ రవీందర్ రావుతో సఖ్యత లేకపోవడం, మంత్రి సత్యవతి రాథోడ్తో అంటిముట్టనట్లు వ్యవహరించడం అతనికి ప్రతికూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చదవండి: కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న మాట నిజమే: ఈటల శంకర్ నాయక్కు చెక్ పడే పరిస్థితులు ఒకదశలో ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటు స్వపక్ష పార్టీ నాయకులే రోడ్డెక్కారు. అధిష్టానం పెద్దలు పార్టీనాయకుల మద్య సయోద్యకుదుర్చి మూడో సారి శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వడంతో అభ్యర్థిని మార్చాలనే డిమాండ్తో ఆందోళనకు సైతం జరిగాయి. పార్టీ పెద్దల జోక్యంతో ప్రస్తుతం అంతా సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా రగిలిపోతున్న నాయకులతో శంకర్ నాయక్కు చెక్ పడే పరిస్థితులు ఉత్పన్నమవుతాయనే ప్రచారం సాగుతుంది. తనకే టికెట్ వస్తుందనే ధీమా ఇక కాంగ్రెస్లో అదే పరిస్థితి నెలకొంది. టిక్కెట్ రేసులో కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, డాక్టర్ మురళి నాయక్ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో బలరాం నాయక్ పోటీ చేసి శంకర్ నాయక్పై 13వేల పై చిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతోపాటు అధిష్టానం పెద్దల ఆశిస్సులు ఉండడంతో ఈసారి సైతం తనకే టికెట్ వస్తుందనే దీమాతో ఉన్నారు. గట్టి పోటీ బలరాం నాయక్ అభ్యర్థి అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గెలుపుకు తిరుగుండదని ఇరు పార్టీల నాయకులు బావిస్తున్నారు. బలరాం నాయక్ కంటే స్థానిక డాక్టర్ ప్రజలతో తత్సంబందాలు ఉన్న మురళీ నాయక్ను కాంగ్రెస్ బరిలోకి దింపితే గట్టి పోటీ ఉంటుందని బావిస్తున్నారు. బలరాంనాయక్ ను కాదని మురళీనాయక్కు టికెట్ దక్కే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. నామమాత్రంగానే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి హుస్సేన్ నాయక్ పోటీ చేయనున్నారు. గత 2018 ఎన్నికల్లో పోటీ చేసిన హుస్సెన్ నాయక్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. యూత్ పాలోయింగ్ ఎక్కువగానే ఉన్నప్పటికి ఓట్లను రాబట్టుకోవడంలో విఫలం అవుతున్నారనే భావన ప్రజల్లో ఉంది. తాజా రాజకీయ పరిస్థితుల నేపద్యంలో హుస్సెన్ నాయక్ పోటీ నామమాత్రంగా మారనుంది. చదవండి: ఈనెల 16న బీఆర్ఎస్ భారీ సభ.. మేనిఫెస్టో విడుదల ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్యనే నువ్వానేనా అన్నట్లు పోటీ సాగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత, గ్రూప్ రాజకీయాలను విపక్షాలు అనుకూలంగా మలుచుకునే పనిలో పడి ఎత్తుకు పై ఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్లో సైతం గ్రూప్ రాజకీయాలు, అభ్యర్థి విషయంలో క్లారిటీ లేక పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అది కాస్త శంకర్ నాయక్కు అనుకూలంగా మారే పరిస్థితులున్నాయి. -
మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
-
మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల కిత్రం జరిగిన బాలుడి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మందసాగర్కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది, కాగా 2020 అక్టోబర్18న మహబూబాబాద్కు చెందిన కుసుమ వసంత, రంజిత్ రెడ్డి దంపతుల కుమారుడు దీక్షిత్ రెడ్డిని మందసాగర్ డబ్బుల కోసం కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి కేసముద్రం మండలం అన్నారం శివారులో ఉన్న ధానమయ్య గుట్టపై తీసుకెళ్లా.. బాలుడిని హతమార్చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అదే రోజు రాత్రి దీక్షిత్ తండ్రికి ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే బాలుడిని వదిలేస్తానని చెప్పాడు. పోలీసులకు దొరక్కుండా ఇంటర్నెట్ కాల్స్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇది జరిగిన మూడురోజుల అనంతరం తాళ్లపూసపల్లి సమీపంలో ఉన్న ధానమయ్య గుట్టలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. అప్పట్లో ఈ ఘటన ఉదంతం కలకలం రేపింది. అప్పటి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి శనిగపురంకు చెందిన పంక్చర్ షాప్ నిర్వహుకుడు మంద సాగర్ నిందితుడిగా తేల్చారు పోలీసులు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేసినట్లు తేలింది. మళ్లీ దొరికిపోతామన్న భయంతోనే దీక్షిత్ను చంపినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో అరెస్టైన సాగర్ ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్షననుభవిస్తున్నాడు.. మూడేళ్లుగా సాగిన విచారణలో తాజాగా ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. చదవండి: హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఇద్దరు మృతి -
మహబూబాబాద్లో విషాదం: ఉరేసుకొని ఏఆర్ ఎస్సై ఆత్మహత్య
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గంగారం మండలం బావురుగొండలో ఏఆర్ ఎస్సై పడిగ శోభన్బాబు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొని ప్రాణాలు విడిచారు కాగా శోభన్బాబు సత్తుపల్లి బెటాలియన్లో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మెడికల్ లీవ్లో సోమవారం ఇంటికి వచ్చిన శోభన్బాబు.. పొలం వద్ద ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు వెల్లడించారు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కేఎంసీలో ర్యాగింగ్.. ఏడుగురిపై కఠిన చర్యలు -
ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి హౌర్హా వెళ్తున్న రైలులో ఉన్నట్టుండి పొగలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి హౌర్హా వెళ్తున్న రైలులో బ్రేక్ లైనర్స్ పట్టివేయడంతో దట్టమైన పొగలు వ్యాపించింది. మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆందోళన చెందిన వెంటనే రైలును ఆపేశారు. భయంతో రైల్లోంచి దిగి పరుగులు తీశారు. అర్ధగంటకుపైగా రైలును అధికారులు నిలిపి వేశారు. అనంతరం మరమ్మతులు చేపట్టి, యథాతథంగా రైలును పంపించారు. -
మహిళా దొంగల హల్చల్.. పట్టపగలే బట్టల దుకాణంలో చోరీ
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పట్టపగలు మహిళా దొంగలు హల్చల్ చేశారు. బట్టల దుకాణంలోకి కస్టమర్ల మాదిరిగా ప్రవేశించిన నలుగురు మహిళలు చీరల చోరీకి పాల్పడ్డారు. యాజమాని పవన్ కన్నుగప్పి 20 వేల రుపాయల విలువ చేసే చీరలు అపహరించారు. కిలేడీల చోరీ బాగోతం పీపీ కెమెరాలో రికార్డు అయింది. సీసీ పుటేజ్ ఆధారంగా ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు షాప్ నిర్వాహకులు. మరో ముగ్గురు పారిపోగా. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అయిదుగురు మహిళలు గుంటూరు నుంచి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. కొత్తగూడ లో శుక్రవారం అంగడి కావడంతో సందడిగా మారిన షాప్లో చోరీకి యత్నించిన మహిళా చోరులు.. నిఘా కళ్ళతో అడ్డంగా బుక్కయ్యారు. -
'ఆవిడ వల్లే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు..'
మహబూబాబాద్: అప్పట్లో ట్రాన్స్జెండర్ను పెళ్లి చేసుకుని వార్తల్లోకి ఎక్కిన మహబూబాబాద్ జిల్లా వాసి ధరావత్ శివరాం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాన్స్జెండర్ తపస్వీ వేధింపులు భరించలేకే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుని తల్లి పోలీసులను ఆశ్రయించింది. తపస్వీతో విడిపోయిన తన కొడుకు మరో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించగా.. అడ్డుకుని వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటకు చెందిన ధారావత్ శివరాం, జల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్జెండర్ కొర్ర ప్రవీణ్ అలియాస్ తపస్విని వివాహం చేసుకున్నారు. ఇద్దరు మధ్యలో మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు శివరాం ప్రయత్నిస్తుండగా ట్రాన్స్జెండర్ తపస్వి అడ్డుకున్నారు. అయితే.. ఈ క్రమంలో శివరాం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తపస్వి వేధింపులు భరించలేక పురుగులు మందు తాగి శివరాం ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తల్లి పోలీసులును ఆశ్రయించింది. గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇదీ చదవండి: కామపిశాచికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారు?: శేజల్ సంచలన ఆరోపణలు -
Mahabubabad: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్? ఈసారి ఉత్కంఠ!
అధికార పార్టీలో అసమ్మతి... వర్గ విభేదాలు... స్వార్థ రాజకీయాలు... మండల గ్రామస్థాయిలో అసంతృప్తుల విభేదాలు.. కీలకమైన నేతలు ఉండడంతో పార్టీకి తలవొంపులు తెచ్చే విధంగా ప్రవర్తించడం...గత పది సంవత్సరాల పాలనలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. ఎన్నికలను ప్రభావితం చేసే కీలకమైన అంశాలు: స్థానిక సంస్థల ప్రజా ప్రతి నిధులలో ఎంపిటిసిలు , సర్పంచుల అసంతృప్తి...దళిత బంధు లబ్ధిదారుల ఎంపికపై నిరాశ... డబల్ బెడ్ రూమ్...రైతు రుణమాఫీ.. ధరణి పోర్టల్ , పోడు భూముల పట్టాల పంపిణీలో గిరిజనేతరుల అసంతృప్తి ... గ్రామాలు , పట్టణాల అభివృద్ధి పై ప్రజల భిన్న అభిప్రాయాలు. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు: కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రం కావడంతో శరవేగంగా అభివృద్ది చెందుతుంది. ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేయగా ఈ సంవత్సరం నుంచి తరగతులు సైతం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలను సైతం మంజూరు చేసింది. హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఉంది 300 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అభ్యర్థులు : బీఆర్ఎస్ బానోత్ శంకర్ నాయక్ (కన్ఫాం) కాంగ్రెస్ : (ఆశవాహులు) బలరాం నాయక్ (మాజీ మంత్రి) మాజీ మంత్రి(TPCC నేత) డాక్టర్ మురళి నాయక్, నూనావత్ రాధా బీజేపీ : (ఆశవాహులు) యాప సీతయ్య జాటోత్ హుస్సేన్ నాయక్ వృత్తిపరంగా ఓటర్లు రైతులు కూలీలు ఎక్కువగా ఉంటారు. మతం కులం ఓటర్లు: ఎస్టి 95000 BC:76000 SC:32000 మైనార్టీ :16 ఓసి :14 నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: మానుకోటగా పేరొందిన నియోజకవర్గంలో దట్టమైన అడవులు కొండలు గుట్టలు ఉన్నాయి.. ఆలయాలు అనంతరం టెంపుల్.. పర్యటక ప్రాంతం.. గూడూరు మండలం లోని గూడూరు జలపాతం -
డోర్నకల్: ఎమ్మెల్యేకు వ్యతిరేకత.. పుంజుకుంటున్న కాంగ్రెస్
2009 నియోజకవర్గాల పునఃర్విభజన వరకు జనరల్ స్థానంగా ఉన్న డోర్నకల్ కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. పునఃర్విభజనతో ఎస్టీ రిజర్వుడుగా మారింది. జనరల్ స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యానాయక్, ప్రస్తుతం ఎస్టీ రిజర్వుస్థానంలో ఎదురీదే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులైన మంత్రి సత్యవతి రాథోడ్, సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ బిఆర్ఎస్ పార్టీలో టికెట్ కోసం పోటీ పడ్డారు. కానీ చివరికి అధిష్టానం రెడ్యానాయక్కే టికెట్ను ఖరారు చేసింది. దాంతో పార్టీ కీలక నేతల్లో అసమ్మతి నెలకొంది. ఎన్నికలను ప్రభావితం చేసే ముఖ్య అంశాలు: గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజక వర్గం ఇది. ముఖ్యంగా విద్యా, వైద్యం,స్థానిక సమస్యలు..డబుల్ బెడ్రూం ఇళ్ళు, దళిత బందు పతకాలను పరిమితంగా అమలు చేయడం. సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఏడు సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలిచిన మంత్రిగా పనిచేసినప్పటికి మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళిన నిలదీసే పరిస్తితి ఏర్పడింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు : బీఆర్ఎస్ రెడ్యా నాయక్ (కన్ఫాం) కాంగ్రెస్ పార్టీ : జాటోత్ రామ చoద్రునాయక్ (ఆశావాహులు) మలోత్ నెహ్రూ నాయక్ (ఆశావాహులు) ననావత్ భూపాల్ నాయక్(ఆశావాహులు) బిజేపి పార్టీ : లక్ష్మణ్ నాయక్ (ఆశావాహులు) రాజకీయ అంశాలు : ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో టిఆర్ఎస్ పాగా వేసి తన బలం పెంచుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ కాస్త పుంజుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాను ఏలిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన ప్రభావం డోర్నకల్ నియోజకవర్గంలో చూపే పరిస్థితి కనిపిస్తుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరడంతో ఖమ్మం ప్రక్కన డోర్నకల్ పై పొంగులేటి ప్రభావం కనిపించే పరిస్థితి ఉంది. వృత్తిపరంగా ఓటర్లు : గిరిజనులు రైతులు ఎక్కువగా ఉంటారు మతం/కులం వారిగా ఓటర్లు : ఎస్టీ ఓటర్లు 92616 మంది బిసి ఓటర్లు 76 వేల మంది ఎస్సీ ఓటర్లు 29401 మంది ముస్లీం మైనార్టీ ఓటర్లు 6464 మంది నియోజకవర్గంలో బౌగోళిక పరిస్థితులు : వాగులు : పాలేరు, ఆకేరు, మున్నేరు ఆలయాలు : కురవి శ్రీ భద్రకాళీ సమేత వీరద్రస్వామి, నందికొండ గ్రామo శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ, నర్సింహులపేట వెంకటేశ్వర స్వామి ఆలయాలు, మరిపెడ మాకుల వెంకటేశ్వర స్వామి, డోర్నకల్ పురాతన శ్రీరాముల వారి ఆలయం(పెరుమండ్ల సంకిసా), చిన్నగూడూరు మండల కేంద్రం దాశరథీ స్వగ్రామం. -
తమ్ముడు.. అమ్మా నాన్నలను బాగా చూసుకో!
వరంగల్: తల్లిదండ్రులకు భారం అవుతున్నాననే మనస్తాపంతో ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన బొమ్మ శివాజీ(24) బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి కొంత కాలం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి, పోటీ పరీక్షలకు సిద్ధ అవుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల రాసిన పరీక్షల్లో ఉద్యోగం రాకపోవడంతో అమ్మానాన్నలకు భారంగా మారుతున్నానని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి తన సోదరుడికి సెల్ ఫోన్లో అమ్మానాన్నలను బాగా చూసుకో.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ చేసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోదరుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా స్థానికులు బావి నుండి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గట్ల సుధాకర్ తెలిపారు. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ఆందోళన
-
మహబూబాబాద్ జిల్లా బొడ్లాడ శివారులో స్కూల్ బస్ బోల్తా
-
కేసీఆర్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ: కవిత కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఇల్లెందు: సీఎం కేసీఆర్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీచేస్తానని, ఆయన నిర్ణయమే తనకు శిరోధార్యమని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎమ్మెల్యే, ఎంపీగా విజయం సాధించానని, పార్లమెంట్లో అడుగుపెట్టిన తొలి బంజారా మహిళగా తనకు గుర్తింపు లభించిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కార్యకర్తలు, ప్రజలు తనపై ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లెందు అసెంబ్లీ స్థానాలు తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నందున, ఆయా ప్రాంతాల ప్రజలందరికీ సుపరిచితురాలినేనని పేర్కొన్నారు. కాగా, ఎస్టీ జాబితా నుంచి బంజారాలను తొలగించాలన్న ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. గిరిజనులకు నేరుగా లబ్ధి చేకూరేవిధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఈ తరుణంలో బాపురావు వైషమ్యాలు రెచ్చగొట్టడం దారుణమని అన్నారు. అంతకుముందు ఎంపీ కవిత ఇటీవలి వర్షాలకు కూలిపోయిన ఇళ్లను సందర్శించి, బాధితులను పరామర్శించారు. ఇది కూడా చదవండి: మాపై దుష్ప్రచారం కాంగ్రెస్లోని ఓ కీలక నేత పనే -
ట్రాక్టర్ మునిగినా.. ఈదుతూ బయటపడిన రైతు..
మహబూబాబాద్: మానుకోటి జిల్లా కురవి మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజి) శివారు బంగారుగూడెం జీపీ పరిధిలోని చౌళ్ల తండా వద్ద పొలాలు దున్నేందుకు వెళ్లిన ట్రాక్టర్ మున్నేరువాగు వరద నీటిలో గురువారం మునిగిపోయింది. బంచరాయి తండా గ్రామానికి చెందిన రైతు బానోత్ లచ్చిరాం చౌళ్ల తండాకు చెందిన పొలాలను దున్నేందుకు ట్రాక్టర్ తీసుకుని వెళ్లాడు. ఈక్రమంలో మున్నేరు వాగు ప్రవాహం పెరిగింది. రెండువైపులా నీరు వచ్చి చేరుతుండడంతో నీటిలో ట్రాక్టర్ మునిగిపోయింది. దీంతో లచ్చిరాం ట్రాక్టర్ను అక్కడే వదిలి ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. నీటిలో ట్రాక్టర్ మునిగిపోయిన విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. -
మంత్రి సత్యవతి Vs రెడ్యానాయక్.. డోర్నకల్ బీఆర్ఎస్లో తన్నులాట!
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజ కవర్గంలో రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ వర్గీయులు దుర్భాలాడుకుంటూ తన్నులాడుకున్నారు. పరస్పరం బాహాబాహీకి దిగారు. రూ. 5 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసేందుకు రెడ్యానాయక్ బుధవారం ఉదయం కురవి మండలం బంగ్యా తండాకు చేరుకున్నారు. మా ఊరికి ఏం అభివృద్ధి చేశావంటూ తండాకు చెందిన మంత్రి సత్యవతి వర్గీయుడైన మాజీ సర్పంచ్ హచ్చా నాయక్ అనుచరులు ఎమ్మెల్యే ప్రచార రథానికి అడ్డుతగిలారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనం ముందు భాగంలో టైర్ల కింద పడుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్యే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయకుండానే తండాలో ఏర్పాటు చేసిన సభ వద్దకు వెళ్లారు. సభ వద్ద హచ్చానాయక్ తమ్ముడు కిషన్నాయక్ రభస చేస్తుండగా ఎమ్మెల్యే అనుచరుడు సింగ్యానాయక్, ఇతర వర్గీయులు అతనిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రతిగా మంత్రి సత్యవతి వర్గీయులు పెద్ద సంఖ్యలో రావడంతో ఇరువర్గాలూ ఒకరినొకరు కొట్టుకున్నారు. అంగీలు చిరిగిపోయినా ఎవ్వరూ తగ్గలేదు. చివరికి పోలీసులు వారించినా వినలేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ తండానుంచి బయటకు వెళ్తుండగా కారుకు అడ్డంగా పడుకున్నారు. పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించడంతో ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. చదవండి: జడ్జి భర్తపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. ‘ఆస్పత్రికి వెళ్లాలి, దారి ఇవ్వండి’ అని అడిగినందుకు.. -
ఎమ్మెల్యే శంకర్నాయక్ మాకొద్దు.. సొంత పార్టీ నాయకుల సంచలన ఆరోపణలు
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ బీఆర్ఎఎస్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్పై సొంతపార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తిరుగుబాటు చేశారు. మూడోసారి ఎమ్మెల్యే శంకర్ నాయక్ను మార్చకపోతే, తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ‘ఎమ్మెల్యే శంకర్నాయ క్ను రెండు సార్లు గెలిపిస్తే కార్యకర్తలను అణ గతొక్కారు. భూ కబ్జాలు, రక్తపాతాలు సృష్టించారు. ఇటువంటి నేర చరిత్ర ఉన్న శంకర్ నాయక్కు ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ వద్దు.... కొత్త అభ్యర్థి కి టికెట్ ఇవ్వాలి’ అంటూ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు వర్గీయులు, మానుకోట బీఆర్ఎస్ నాయకులు తీర్మానం చేసి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. శనివారం మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్లు గ్రామ సమీపంలోని ఓ మామిడి తోటలో ముగ్గురు మహబూబాబాద్ ము న్సిపల్ కౌన్సిలర్లు, ఒక కో–ఆప్షన్ సభ్యుడు, కేసముద్రం సర్పంచ్తో పాటు మహబూబా బాద్, నెల్లికుదురు, కేసముద్రం, గూడూరు మండలాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మా ర్కెట్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. బినామీలకే పెద్దపీట వేశారు.. మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ బానోత్ హరిసింగ్ మాట్లాడుతూ.. నేర చరిత్ర ఉన్న శంకర్నాయక్కు కాకుండా కొత్తవారికి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. మరోసారి శంకర్నాయక్ను గెలిపిస్తే బిహార్ను తలపించేలా మానుకోటలో అరాచకాలు సృష్టిస్తారని ఎడ్ల రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. మానుకోటలో అభ్యర్థిని మార్చి కొత్తవారికి టికెట్ ఇస్తే కానీ బీఆర్ఎస్ మళ్లీ గెలవదని నాయకులు రవీంద్రాచారి, ఎడ్లవేణు, కన్నా, జెర్రిపోతులు వెంకన్న, నిమ్మలశ్రీనివాస్ పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్నాయక్ అనుచరులు జెడ్పీటీసీ రావుల శ్రీనా«థ్రెడ్డి, ఎంపీపీలు.. కేసముద్రంలో సమావేశమై ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు సరికావని, ఎమ్మెల్యేను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. చదవండి: పోరాడండి.. తోడుగా ఉంటాం.. ఈటలకు మోదీ భరోసా -
కాంగ్రెస్కు ఆ జిల్లాలో అభ్యర్థుల కరువు.. సొంత పార్టీలో లేకపోతేనేం..
తెలంగాణ కాంగ్రెస్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈసారి అధికారంలోకి వస్తామనే ధీమా కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది. కాని అన్ని చోట్లా సరైన అభ్యర్థులు దొరకాలిగా? అందుకే గెలుపు గుర్రాల అన్వేషణ ప్రారంభించారు. సొంత పార్టీలో లేకపోతే పక్క పార్టీల వారికి గాలం వేస్తున్నారట పీసీసీ నేతలు. ఇంతకీ ఓరుగల్లులో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది?.. తెలంగాణ కాంగ్రెస్లో ఎన్నడూ లేనివిధంగా ఐక్యతా రాగం వినిపిస్తోంది. నాయకుల మధ్య విభేదాలు ఎన్ని ఉన్నా..అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ కలిసికట్టుగా పనిచేసి గెలుద్దామన్న ఆలోచనలు కనిపిస్తున్నాయనే చర్చ అయితే సాగుతోంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించాలని అక్కడి నేతలు పట్టుదలతో ఉన్నారు. ఇంటిలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్కే అనుకూల పరిస్థితులున్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీ నాయకత్వం కూడా దీనిపై విభేదించడంలేదని, అయినప్పటికీ కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ మీద ఉండబోవని బీఆర్ఎస్ నాయకలు చెబుతున్నారు. కాని గులాబీ పార్టీ శిబిరంలో ఆందోళన కనిపిస్తోందనే టాక్ నడుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను..11 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరిలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం సొంతంగా చేయించుకున్న సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైనట్లు తెలుస్తోంది. భూ దందాలు, బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, సెటిల్మెంట్లకు ఎమ్మెల్యేలు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. చదవండి: రేపు వరంగల్లో బీజేపీ సన్నాహక సమావేశం.. ఆ నేతలు కలిసి పనిచేసేనా? కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీకే ఎమ్మెల్యేలు పరిమితం అవుతున్నారన్న విమర్శలు బాగా ఉన్నాయి. నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోకుండా.. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి తమకు ఆదాయాన్ని అందించేవారికే అపాయింట్మెంట్ ఇస్తూ.. ఎక్కువ సమయం వారికే కేటాయిస్తున్నారన్న చర్చ బలంగా నడుస్తోంది. పైగా ప్రతీ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్లో అంతర్గత కుమ్మలాటలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నేతల తీరు ఇలాగే కొనసాగితే జిల్లాలో పరిస్థితి చేజారే ప్రమాదం ఉందని పలు సర్వేల ద్వారా బీఆర్ఎస్ అధిష్టానానికి స్పష్టంగా అర్థమైనట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖచ్చితంగా మెజారిటీ స్థానాల్లో గెలుస్తామన్న ధీమా కాంగ్రెస్లో వ్యక్తమవుతోంది. పలు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లోని ఉన్న బలమైన నాయకులను కాంగ్రెస్లో చేర్చుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నర్సంపేట, మహబూబాబాద్, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నేతలతో చర్చలు జరుపుతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో పోటీకి చాలా మంది నాయకులున్నట్లు తెలుస్తోంది. పై మూడు సెగ్మెంట్లలో చర్చలు సఫలమైతే వారు త్వరలోనే హస్తం పార్టీలో చేరతారని అంటున్నారు. రాష్ట్రంలో గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అని ప్రజలు విశ్వసిస్తున్నందున, నాయకులంతా ఐక్యంగా ఉంటూ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవాలని హైకమాండ్ నేతలకు సూచించిందని సమాచారం. -
TSPSC Group 4 Exam: పోలీసుల మానవత్వం.. 3 నెలల చిన్నారిని లాలిస్తూ
తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష కొనసాగుతోంది. పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించనుండగా.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1 అయిపోయింది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. కాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో భార్యభర్తలు ఇద్దరు గ్రూప్- 4 పరీక్ష రాయడానికి వచ్చారు. దీంతో సదరు దంపతుల 3 నెలల చిన్నారిని పోలీసులు లాలించారు. కురవి మండల పెద్దతండాకు చెందిన జగ్గులాల్, సబితా దంపతులిద్దరికి గ్రూప్-4 పరీక్షకు హాజరయ్యారు. వారి చిన్నారిని నాన్నమ్మ దగ్గర ఉంచగా పాప బాగా ఏడుస్తుండటంతో మహిళ కానిస్టేబుల్ శ్రీలత చిన్నారిని దగ్గర తీసుకొని లాలించారు. మంచం తెప్పించి చెట్టుకింద పడుకోబెట్టారు. తొర్రురులో 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా పలువురు చిన్నపిలల తల్లులు కూడా పరీక్షకు హాజరయ్యారు. వారి పిల్లలకు పోలీసులు అరటిపండ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ అందించి మానవత్వం చాటుకున్నారు. మానవత్వం చూపిన పోలీస్ సిబ్బందిని తొర్రురు డీఎస్పీ రఘు, తొర్రురు సీఐ సత్యనారాయణ ఎస్సై సతీష్, ఎస్సై రాంజీ నాయక్ అభినందించారు. -
శీనన్నా.. ఆరోగ్యం బాగుందా..?
సాక్షి, మహబూబాబాద్: గిరిజనుల ఆరాధ్య దైవం కుమురం భీమ్ నినదించిన జల్.. జంగిల్.. జమీన్ డిమాండ్ నెరవేరిందని, ప్రభుత్వం పోడు భూములకు గిరిజనులే యజమానులుగా గుర్తించి పట్టాలు ఇవ్వడం సంతోషకరమని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కె. తారక రామారావు చెప్పారు. ఈ నెల నుంచే వారికి రైతుబంధు, రైతు బీమా కూడా వర్తిస్తుందని తెలిపారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సమీకృత కూరగాయల మార్కెట్, ఇతర అభివృద్ధి పనులను, 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గిరిజనులకు పోడు భూముల హక్కుపత్రాలను అందజేసి మాట్లాడారు. తెలంగాణ ఏర్పా టయ్యాక అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని చెప్పారు. 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసుకున్నామని.. మరో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. కాలంతో పోటీపడి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామన్నారు. ప్రధాని సమాధానం చెప్పాలి ములుగులో గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారని.. వీటిని ఎందుకు అమలు చేయడం లేదో కొద్దిరోజుల్లో వరంగల్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అన్నీ ఉచితంగా ఇస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్తోందని.. వారు చందమామను కూడా ఇస్తామంటారని ఎద్దేవా చేశారు. కాగా.. ఎన్నో ఏళ్ల కల అయిన పోడు పట్టాల పంపిణీని చివరికి కేసీఆర్ నెరవేర్చారని మంత్రి సత్య వతి రాథోడ్ పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ను విమర్శిస్తున్న క్రమంలో ఓ దర్జీ కథ చెప్తూ.. కురవి వీరభద్రస్వామిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శీనన్నా.. ఆరోగ్యం బాగుందా..? మహబూబాబాద్లోని రాంచంద్రాపురం కాలనీలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. పిల్లి విజయ–శ్రీను దంపతులను గృహప్రవేశం చేయించారు. అనారోగ్యానికి గురై మంచంలో ఉన్న శ్రీనును పలకరించారు. ‘‘శీనన్నా.. ఆరోగ్యం ఎలా ఉంది.. పింఛన్ వస్తుందా? ఎందరు పిల్లలు, ఏం చదువుతున్నారు?’’అని అడిగారు. తర్వాత మంత్రి సత్యవతిరాథోడ్ పిల్లి విజయ–శ్రీను దంపతులకు నూతన వ్రస్తాలను, డబుల్ బెడ్రూం ఇంటి పట్టాను అందజేశారు. -
కేటీఆర్ అసంతృప్తి.. ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్
-
కేటీఆర్కు నిరసన సెగ.. ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన మంత్రి
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. జిల్లాలోని మానుకోటలో రూ. 50 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ప్రారంభించారు. అంతేకాకుండా పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అయితే పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ప్రారంభించేందుకు వెళ్తున్న కేటీఆర్తో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా ఆగ్రహంతో ఎమ్మెల్యే చేయిని మంత్రి తీసి పడేశారు. కేటీఆర్ సీరియస్గా షాక్ ఇవ్వడంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్తోపాటు అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు. ఇక పోడు పట్టాల పంపిణీ సభా వేదికపై కేటీఆర్కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పుష్పగుచ్చం ఇచ్చేందుకు ప్రయత్నించగా తిరస్కరించారు. సభాముఖంగా జరిగిన అవమానంతో ఎమ్మెల్యే నరేందర్ వేదికపై చిన్నబోయి కూర్చున్నాడు. అయితే పట్టణంలో పర్యటించిన కేటీఆర్కు జర్నలిస్టులతో పాటు పలువురు నిరసన వ్యక్తం చేయడంతో కేటీఆర్ అసహనానికి గురైనట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. చదవండి: ‘పొత్తుల కోసం వెంపర్లాడం.. కేసీఆర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తాం’ -
క్షమాణలు చెప్పాకే మోదీ వరంగల్లో అడుగు పెట్టాలి: కేటీఆర్
సాక్షి, మహబూబాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర పునఃర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాణలు కోరిన తర్వాతే వరంగల్లో అడుగుపెట్టాలని అన్నారు. ములుగులో రాష్ట్ర ప్రభుత్వం 360 ఎకరాల భూమి కేటాయించినప్పటికీ.. గిరిజన యూనివర్శిటీకి ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. మహబూబాబాద్లో జరిగిన పోడు భూముల పట్టాల పంపిణీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తీరు, బీజేపీ వైఖరిపై ధ్వజమెత్తారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి రిపేర్ సెంటర్ మంజూరు చేయడం సరైంది కాదన్నారు. రైళ్లు తయారీ చేసే ఫ్యాక్టరీనీ గుజరాత్కు తరలించి.. రిపేర్ సెంటర్ కాజీపేటకు ఇవ్వడం వివక్షకు గురిచేయడమేనని మండిపడ్డారు. వీటన్నిటికీ జవాబు చెప్పిన తర్వాతనే ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనకు రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చదవండి: గిరిజనులకు గుడ్న్యూస్ చెప్పిన కేసీఆర్.. ఆ కేసులు రద్దు! కాగా పోడు భూములకు పట్టాలు మాత్రమే కాకుండా.. రైతు బంధు, రైతు బీమా కూడా అందుతుందని కేటీఆర్ అన్నారు. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా వర్తిస్తుందని చెప్పారు. జిల్లాలో 24,281 మంది రైతులకు 67,730 ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
దారుణం: తహసీల్దార్పై యువకుల దాడి.. కారణం ఇదే..
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తహసీల్దార్పై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. కాగా, తండావాసుల దాడిలో తహసీల్దార్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, ఆయనను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. తహసీల్దార్ ఇమ్మాన్యుయేల్పై ఆదివారం మధ్యాహ్నం పట్టణ శివారు సాలార్ తండాకు వెళ్లారు. ఈ సందర్బంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లా కోర్టుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. గత అధికారులు కేటాయించిన 9 ఎకరాల స్థలానికి హద్దులు పెడుతుండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి తహసీల్దార్తో వాగ్వాదానికి దిగారు. భూమి తమదంటూ.. ఇక్కడ ఎలాంటి హద్దులు పెట్టొద్దంటూ తహసీల్దార్ను అడ్డగించారు. ఇలా కాసేపు వారి మధ్య వాగ్వాదం తర్వాత తహసీల్దార్ తిరిగి వెళ్తుండగా వారు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తహసీల్దార్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను తోటి సిబ్బంది మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నిందితులు ప్రవీణ్, నవీన్ను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఇది కూడా చదవండి: విషాదం: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి -
హిజ్రా పెళ్లి అదిరిపొయ్యింది
-
ట్రైన్లో పరిచయం.. ట్రాన్స్డెంజర్తో ప్రేమ
-
ట్రైన్లో పరిచయం.. ట్రాన్స్డెంజర్తో ప్రేమ.. ఇలా ఒక్కటయ్యారు
సాక్షి, వరంగల్: ఎన్ని ఆటంకాలు వచ్చినా కల్యాణ సమయ వస్తే ఆగదంటారు పెద్దలు. అలాగే, మనిషి జీవితంలో వివాహం ఎవరితో జరగాలనేది మనిషి పుట్టినప్పుడు నిర్ణయం బడుతుందని పెద్దల నమ్ముతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. మహబూబాబాద్ జిల్లాలో వింత వివాహం ఆదర్శంగా జరిగింది. ఓ యువకుడు ట్రాన్స్డెంజర్ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరి ప్రేమను అర్థం చేసుకుని కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో వివాహం ఘనంగా జరిగింది. వివరాల ప్రకారం.. గార్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ట్రాన్స్జెండర్ బానోత్ రాధిక(28) డోర్నకల్ మండలం సిగ్నల్ తండాకు చెందిన ధారావత్ వీరూ(30) ప్రేమించుకున్నారు. గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలోని శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేదమంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే, బానోత్ రాధికకు రైలులో వీరూ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో రెండు సంవత్సరాలు ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ అధ్యక్షులు మాట్లాడుతూ సమాజంలో తమను గుర్తించాలన్నారు. ఇలాంటి ఆదర్శ వివాహాలు మరిన్ని జరగాలని కోరుకున్నారు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు కూడా కల్యాణ లక్ష్మి అందజేయాలని కోరారు. వివాహ తంతులో ట్రాన్స్జెండర్ శోభ, రాధిక, దుర్గ, నందు, రవళి పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: లండన్లో హైదరాబాద్ యువతి దారుణ హత్య -
దొంగోడికోసం అవ్వ కాపలా..
-
విడ్డూరం!...ఆటోపై గడ్డి మొలిచింది
-
ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చేతివాట.. డస్ట్బిన్, బకెట్, చీపుర్లు.. ఏదీ వదలడం లేదు!
వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు మెరుగైన వైద్యం, వసతులను కల్పించేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో సిబ్బంది చేతివాటంతో ఆస్పత్రికి చెడ్డపేరు వస్తుందని పలువురు అంటున్నారు. మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శానిటేషన్ వస్తువులైన డస్ట్బిన్, చీపుర్లు, ఇతర సామగ్రిని ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది ఎత్తుకెళ్లారు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిలోని పేషెంట్కేర్ విభాగంలో పని చేసే ఓ మహిళ ఆస్పత్రి నుంచి డస్ట్బిన్ బకెట్, చీపుర్లను పట్టుకుని బయటకు రాగా అదే ఆస్పత్రిలో పని చేసే ఓ సెక్యూరిటీగార్డ్ తన ద్విచక్రవాహనంపై వచ్చి సదరు మహిళను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఇదే ఘటనపై ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావును వివరణ కోరగా చోరీ జరిగిన విషయం ఆదివారం ఉదయం తన దృష్టికి వచ్చిందని, వెంటనే సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులకు సమాచారం అందించామని తెలిపారు. ఇదిలా ఉండగా వస్తువులను ఆస్పత్రి నుంచి తీసుకెళ్లిన విషయంలో పేషెంట్కేర్లో పని చేసే మహిళ, సెక్యూరిటీగార్డుపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. -
సీఎం ఆదేశిస్తే డోర్నకల్ నుంచి పోటీ చేస్తా: మంత్రి సత్యవతి రాథోడ్
సాక్షి, మహబూబాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సామాన్య మహిళనైన నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి గిరిజన, మహిళలకు, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయమని ఆదేశించారని తెలిపారు. మానుకోట ప్రజానీకం అభివృద్ధికి కేసీఆర్ సహకారంతో వైద్య విద్యాలయం, ఇంజనీరింగ్ కళాశాల తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ‘డోర్నకల్ నియోజకవర్గంలో మీకంటూ ఒక వర్గం ఉన్నది.. పార్టీ చేపట్టే వివిధ కార్యక్రమాలకు మీ వారు ఎవరూ హాజరు కావట్లేదని’ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేస్తూ..ఇది సందర్భం కాదంటూనే..మాకంటూ వర్గమేమీ లేదని, మేమంతా ముఖ్యమంత్రి గొడుగు కింద పనిచేస్తాం..ఎలాంటి అనుమానాలు అక్కరలేదన్నారు. చదవండి: తెలంగాణలో బీజేపీని తుడిచివేస్తామన్న రాహుల్.. దాని వెనక మర్మమేంటో? -
అమ్మా లే అమ్మా.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి
పెద్దవంగర: లాలించి జోల పాడి నిద్రపుచ్చే తల్లిని శాశ్వత నిద్ర ఆవహించిందని తెలియక అమ్మా లే అమ్మా.. పాలు ఇవ్వమ్మా.. అంటూ తల్లి మృతదేహంపై పాల కోసం ఓ పసికందు ఆరాట పడిన విషాద ఘటన ఇది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పెద్దవంగర మండలం కొరిపల్లి గ్రామానికి చెందిన తేలుకుంట్ల స్వరూప (24), నరేష్లకు ఇద్దరు పిల్లలు మూడేళ్ల ఆకాంక్ష, పదినెలల ఆధ్య. నరేష్ ఇటీవల సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కేంద్రంలో ఓ ప్లాట్ను కొనుగోలు చేశాడు. శుక్రవారం రిజిస్టేషన్ చేయించుకుని స్వగ్రామం కొరిపల్లికి ద్విచక్రవాహనంపై కుటుంబంతో సహా తిరిగి వస్తున్న క్రమంలో రాత్రి తిర్మలగిరి మండల పరిధిలోని తొండ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వెనుకనుంచి లారీ ఢీకొట్టడంతో స్వరూప అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారులకు గాయాలు కావడంతో హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పది నెలల ఆద్య తల్లి స్వరూప మరణించిన విషయం తెలియక పాలకోసం అల్లాడిపోయింది. చనిపోయిన తల్లి రొమ్ము మీద పడి పాల కోసం ఆరాటపడటం చూసిన వారు కంటతడి పెట్టారు. ఇది కూడా చదవండి: కొడుకు శవాన్ని చేతుల్తో మోశా.. -
మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
-
క్షుద్రపూజల కలకలం
-
మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న టెన్షన్
-
బీర్ల వ్యాన్ బోల్తా
-
‘కేసీఆర్ సారూ.. మీరు సల్లగుండాలె’.. బార్ ఓనర్ల అభిషేకం వైరల్
మహబూబాబాద్: కృతజ్ఞతను ప్రదర్శించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్లైల్. తమకున్నంతలో కొందరు చేస్తే.. ఇంకొందరు మాత్రం అతికి పోతుంటారు. అయితే ఇక్కడ మాత్రం కొందరు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పట్ల తమ కృతజ్ఞతను ప్రత్యేకంగా చాటుకున్నారు. జిల్లాలోని మానుకోటలో బార్ షాప్ యాజమానులు వినూత్నంగా సీఎం కేసీఆర్కు థ్యాంక్స్ తెలియజేసుకున్నారు. బార్ షాపుల్లో 90 ఎం.ఎల్, క్వార్టర్, ఆఫ్ బాటిళ్లకు అనుమతి ఇవ్వడంతో.. ఇలా కేసీఆర్ ఫొటో ముందు మందు బాటిళ్లు ఉంచి దణ్ణం పెట్టారు. కేసీఆర్ చల్లగా ఉండాలంటూ కోరుకున్నారు. ఆపై ఫొటోకు పాలాభిషేకం చేశారు బార్ యజమానులు. ప్రస్తుతం ఆ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. -
ఉత్తుత్తి కోర్టు..వాదనలు వినండి..
-
అబ్బాయిపాలెంలో రోడ్డెక్కిన రైతులు
-
విధి ఆడిన వింత నాటకం.. పెళ్లింట పెను విషాదం
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. రేపు పెళ్లిచేసుకోబోతున్న వరుడు.. విధి ఆడిన వింత నాటకంలో తనువు చాలించాడు. దీంతో, పెళ్ళిసందడితో ఉండాల్సిన ఇళ్ళు శోకసంద్రంగా మారింది. కరెంట్ షాక్ రూపంలో వరుడిని మృత్యువు వెంటాండింది. వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెంతండాకు చెందిన భూక్య బాలాజీ కాంతి దంపుతుల ఏకైక కుమారుడు భూక్య యాకుబ్. కాగా, యాకుబ్కు గార్ల మండలం పిక్లీతండాకు చెందిన అమ్మాయితో శుక్రవారం అర్ధరాత్రి వివాహం జరగాల్సి ఉంది. పెళ్ళి ఏర్పాట్లలో నిమగ్నమైన యాకుబ్, ఇంట్లో నీళ్ళ కోసం బోరు(మోటార్) ఆన్ చేసే క్రమంలో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. అయితే, మరికొద్ది గంటల్లో పెళ్ళి పీటలు ఎక్కాల్సిన వరుడు పాడెక్కడంతో పెళ్లింట విషాదం అలముకుంది. పెళ్ళికొడుకు మృతితో కన్నవారితోపాటు బంధుమిత్రులు బోరున విలపించారు. ఎదిగిన కొడుకు ఓ ఇంటివాడు అవుతున్న తరుణంలో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక, యాకుబ్ రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. ఇది కూడా చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో రేణుకకు బెయిల్ -
పరీక్షల్లో గిన్ని మార్కులతో పాసయితివి.. ఉత్తగ సచ్చిపోతివి బిడ్డా..
సాక్షి, మహబూబాబాద్: పరీక్షల్లో ఫెయిల్ అయి కొందరు విద్యార్థుల.. పరీక్షలు ఫలితాలు వెలువడక ముందే మరొకొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. క్షణికావేశంలో విద్యార్ధులు తీసుకునే నిర్ణయాలు వారి తల్లిదండ్రులకు తీరాని శోకాన్ని నింపుతున్నాయి. పరీక్ష ఫలితాలే జీవితాలను మార్చలేవని విద్యార్థులు తెలుసుకోవాలని పేరెంట్స్ చెబుతున్నా కొందరు మాత్రం మారడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఫలితాలు వెలువడక ముందే భయంతో ఇంటర్ విద్యార్థి గుగులోతు కృష్ణ(19) ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. కేసముద్రం మండలం పిక్లా తండా శివారు బోడగుట్ట తండాకు చెందిన ఇంటర్ విద్యార్థి గుగులోతు కృష్ణ(19) ఇంటర్ చదువుతున్నాడు. కాగా, ఇంటర్ సెకండ్ ఇయర్లో తనకు మంచి మార్కులు రావనే ఆలోచనతో ఆవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ‘అమ్మ, నాన్న నన్ను క్షమించండి .. నాకు ఎంబీబీఎస్లో సీటు రాదు. అందుకనే ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, మంగళవారం ఉదయం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కృష్ణ.. బైపీసీలో 892/1000 మార్కులు సాధించాడు. ఏ గ్రేడ్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఇక, ఫలితాలు చూసిన అనంతరం.. కృష్ణ పేరెంట్స్ కన్నీటిపర్యంతమయ్యారు. ‘కొడుకా.. లేనిపోని అనుమానంతో ఉరేసుకొని చనిపోతివి.. ఇప్పుడు ఇంటర్ పరీక్షల్లో గిన్ని మార్కులతో పాసయితివి’ అంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందారు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఇదిలా ఉండగా.. కృష్ణ కల్వల ఆదర్శ పాఠశాలలో పదోతరగతి వరకు పూర్తి చేసి ఏటూరు నాగారంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ బైపీసీలో చేరాడు. ఇటీవల పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. కృష్ణ చిన్నప్పటి నుంచి ఎంబీబీఎస్ చేయాలనే కోరికతో కష్టపడి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంటర్ పూర్తి చేసి నీట్ పరీక్షకు సన్నద్ధమయ్యాడు. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నానని అతనిలో నిరాశ మొదలైంది. తనకు ఎంబీబీఎస్లో సీటు రాదని ఆవేదన చెందాడు. దీంతో, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది కూడా చదవండి: మహిళా ప్రయాణికులకు రూ.80 కే టీ–24 టికెట్ -
మహబూబాబాద్: బొడ్రాయి పండుగలో అపశ్రుతి
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని కంబాలపల్లిలో బొడ్రాయి పండుగలో అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రామ దేవతల ప్రతిష్టాపన సందర్భంగా గ్రామస్థులు బోనాలు నిర్వహించారు. బోనాలతో గ్రామస్థులు బొడ్రాయి వద్దకు చేరుకోగ.. బోనంపై ఉన్న దీపం పైన పందిరి గడ్డిని తగలగడంతో మంటలు చెలరేగాయి. దీంతో యాగశాల పూర్తిగా దగ్గమయ్యింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఎగిసిపడిన మంటలను గ్రామస్థులు బిందెలతో నీళ్లు చల్లి అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే గడ్డి, తడకల పందిరి పూర్తిగా దగ్ధమయ్యింది. భక్తులకు ఎలాంటి హాని జరగకపోవడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. బొడ్రాయి పండుగలో నరదృష్టి పోయిందని గ్రామస్థులు భావిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చాక ఎంపీ మాలోతు కవిత ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదవండి: మృత్యు ఘంటికలు!.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు -
అన్నదమ్ముల అదృశ్యం..!
-
ఎవరు ముందు వస్తే వారే గోడలకు నీల్లు పట్టాలి
-
రూ. 5 వేలతో పొలంలో కూలీలకు పెద్ద గొడుగు! సూపర్ ఐడియా..
పొలాల్లో లేదా ఆరుబయట పనులు చేసుకునే వారికి మండే ఎండ పెద్ద ఇబ్బంది కలిస్తుంటుంది. ముఖ్యంగా మిరప, పత్తి, కూరగాయలు తదితర ఆరుతడి పంటల్లో వ్యవసాయ పనులు చేసే కూలీలకు, రైతులకు ఎండ పెద్ద సమస్యగా ఉంటుంది. వేసవి వచ్చిందంటే రైతులు, వ్యవసాయ కూలీల పాట్లు, ముఖ్యంగా మహిళా కూలీల పాట్లు వర్ణించనలవి కాదు. మిట్ట మధ్యాహ్నం ఎండకు తట్టుకోలేక 2–3 గంటల సేపు పనులకు విరామం ఇచ్చి చెట్లు, షెడ్ల కింద సేదదీరాల్సిన పరిస్థితులు వచ్చాయి. కూలీల అవసరం ఎక్కువగా ఉండే మిరప, పత్తి, కూరగాయ తోటల్లో ఎండాకాలంలో సకాలంలో పనులు పూర్తికావటం లేదు. రైతులు, రైతు కూలీల ఎండ కష్టాలను తీర్చడానికి ఓ గ్రామీణ మోటారు మెకానిక్ చక్కటి ఆలోచన చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ అద్భుత ఆవిష్కరణను అందించిన సృజనశీలి పేరు రేపల్లె షణ్ముగరావు. ఊరు కంబాలపల్లి. జిల్లా మహబూబాబాద్. పొలంలో పక్కపక్కన సాళ్లలో పది మంది పనులు చేసుకోవడానికి సరిపోయేంత నీడనిచ్చే చక్రాలతో కూడిన ‘సామూహిక గొడుగు’ను రూపొందించారు. 20 అడుగుల వెడల్పున 6 అడుగుల మేరకు నీడనిస్తుంది. 7 అడుగుల ఎత్తు ఉంటుంది. అవసరం మేరకు ముందుకు జరుపుకోవడానికి 4 చక్రాలను అమర్చారు. ఖరీదు రూ. 5–6 వేలు 6 అడుగులు నీడ పడే స్థలంలో పని పూర్తి చేసుకున్న తర్వాత ముందుకు తోస్తే గొడుగు సులభంగా ముందుకు జరుగుతుంది. ఆ విధంగా నీడలోనే వ్యవసాయ పనులు చేసుకోవచ్చని షణ్ముఖరావు తెలిపారు. ఇనుప పైపులతో చేసే దీని ఖరీదు రూ. 5–6 వేలు. బరువు 15–18 కిలోలు మాత్రమే. విడి భాగాలను 10 నిమిషాల్లో ఒకచోట చేర్చి గొడుగును నిలబెట్టుకోవచ్చు. పని పూర్తయ్యాక వేటికవి విడదీసి మడిచి ఇంటికి తీసుకెళ్లొచ్చు. చక్రాల దగ్గర, పైకప్పు దగ్గర రెండు చోట్ల మాత్రమే వెల్డింగ్ ఉంటుంది. మిగతా అన్ని చోట్టా నట్లు, బోల్టులే. తయారీ ఖర్చు రూ. 5–6 వేలు. ఖాళీ సంచులను కుట్టి పై కప్పుగా వేసుకుంటే ఖర్చుతగ్గుతుంది. దగ్గర్లో ఉండే వారికి షణ్ముఖరావు తయారు చేసి ఇస్తున్నారు. అయితే, దూరప్రాంతాలకు దీన్ని పంపాలంటే (పొడవు 20 అడుగులు ఉంటుంది కాబట్టి) రవాణా చార్జీ తయారీ ఖర్చంత అవుతోంది. దీన్ని గమనించిన షణ్ముఖరావు రైతులు ఎవరికి వారు తయారు చేసుకోవటం మేలని సూచిస్తున్నారు. ఏయే కొలతల్లో ఎలా ఈ పెద్ద గొడుగును తయారు చేసుకోవాలో చెబుతూ డిజైన్ను బహిరంగ పరిచారు. ఈ వివరాలు చూపిస్తే గ్రామాల్లో స్థానికంగా ఉండే వెల్డర్ ఎవరైనా సులభంగా దీన్ని తయారు చేసేయగలుగుతారు. ఇప్పటికే పలువురు రైతులు తయారు చేయించుకొని వాడుతున్నారని షణ్ముఖరావు సంతోషంగా చెప్పారు. ఎర్రని ఎండ కాచే మిట్ట మధ్యాహ్న వేళల్లో కూడా నిశ్చింతగా వ్యవసాయ పనులను సులువుగా, భద్రంగా పూర్తి చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతోందని దీన్ని వాడుతున్న రైతులు తెలిపారు. కలుపు లేదా పత్తి తీయటమో, మిరపకాయలు కోయటమో, కల్లాల్లో తాలు ఏరటమో, కూరగాయలు కోయటమో ఏ పనులైనా ఈ ‘సామూహిక గొడుగు’ నీడన చేసుకోవచ్చు. కరోనా అనంతర కాలంలో ఎండను పెద్దగా తట్టుకోలేకపోతున్నామని కొందరు రైతులు వాపోతున్నారు. ఎండ తీవ్రత ప్రతి ఏటా పెరుగుతున్న నేపథ్యంలో షణ్ముఖరావు ఆవిష్కరణ ప్రజలకు ఉపయోగకరంగా మారటం సంతోషదాయకం. ఎవరైనా తయారు చేసుకోవచ్చు 30 ఏళ్లుగా మోటారు మెకానెక్గా రైతులు, కూలీలు ముఖ్యంగా మహిళల బాధలను దగ్గరి నుంచి చూస్తున్నాను. ఎండ తీవ్రత పెరుగుతున్నందు వల్ల తట్టుకోలేకపోతున్నారు. వారి బాధను కొంతైనా తగ్గించాలని ఈ ఆవిష్కరణ చేశా. ఇటు 20 అడుగులు, అటు 6 అడుగుల మేరకు నీడనిస్తుంది. ఎత్తు 7 అడుగులు ఉంటుంది. కొలతలు పొలంలో సాళ్లను బట్టి మార్చుకోవచ్చు. బొమ్మలో చూపిన విధంగా కొలతల ప్రకారం ఎవరైనా గ్రామాలు, పట్టణాల్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. వెల్డింగ్ చేసే వ్యక్తికి సందేహాలుంటే నాతో ఫోన్లో మాట్లాడిస్తే వివరంగా చెబుతాను. నాకు రూపాయి ఇవ్వక్కర్లేదు. రైతులు సంతోషంగా ఉంటే అంతే చాలు. ఇప్పటికే అనేక మంది రైతులు తయారు చేయించుకొని వాడుతున్నారు. గత ఐదేళ్లలో 8 ఆవిష్కరణలు చేశాను. వరుసగా 4 ఏళ్లు ఉత్తమ ఆవిష్కర్తగా కలెక్టర్ నుంచి అవార్డులు తీసుకున్నాను. – రేపల్లె షణ్ముఖరావు (94921 13609), పెద్ద గొడుగు ఆవిష్కర్త, కంబాలపల్లి. మహబూబాబాద్ జిల్లా మూడేళ్ల నుంచి వాడుతున్నాం.. చాలా సంతోషంగా ఉంది.. పత్తి, మిరప, వేరుశనగ పంటలు పండిస్తున్నాం. మూడేళ్ల క్రితం షణ్ముఖరావు చెప్పినట్లు మా ఊళ్లోనే 15“7“7 అడుగుల కొలతతో తయారు చేయించుకున్నాం. ఎండ బాధ లేకుండా సంతోషంగా పనులు చేసుకుంటున్నాం. మా పనులకు కూలీలు పిలిస్తే చాలు వస్తున్నారు. మధ్యాహ్నం కూడా పని ఆపకుండా కొనసాగిస్తున్నాం. 2 గంటలు పని కలిసి వస్తోంది. ఈ పెద్ద గొడుగును పది నిమిషాల్లో బిగించుకొంటున్నాం. పని పూర్తి చేసుకున్నాక పది నిమిషాల్లో మడిచి ఇంటికి తెచ్చుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. – గడ్డం జైపాల్రెడ్డి (97019 26657) రైతు, మణుగూరు -
దోస్తులతో ఆడిపాడి.. అమ్మ చేతి గోరుముద్దలు తిని.. నిద్రలోకి వెళ్లి..
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని బోడతండాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ 13 ఏళ్ల బాలిక గుండెపోటుతో మృతి చెందింది. బోడతండాకు చెందిన బోడ లక్పతి–వసంత దంపతుల రెండోకూతురు స్రవంతి(13) మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. శ్రీ రామనవమి సెలవు ఉండటంతో గురువారం సాయంత్రం వరకు ఇంటివద్ద తోటిపిల్లలతో కలిసి ఆటలాడుకుంది. తండాకు కొంతదూరంలో నిర్మిస్తున్న కొత్త ఇంటి వద్ద రాత్రి నిద్రించేందుకు తల్లిదండ్రులు వెళ్లగా బాలిక తన నానమ్మతో కలిసి పాత ఇంటి వద్ద నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో నిద్రలేచి ఛాతీలో నొప్పి గా ఉందని నానమ్మకు చెప్పింది. తర్వాత మూత్రవిసర్జనకు బయటికి వెళ్లి వచ్చి పడుకుంది. కొంతసేపటికి బాలిక బాగా ఆయాస పడుతున్నట్లుగా నానమ్మ గుర్తించింది. బాలిక బాబాయి వచ్చి సీపీఆర్ చేసి వెంటనే మరిపెడ మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా అప్పటికే బాలిక మృతిచెందినట్లు చెప్పారు. కూతురు బతుకుతుందన్న ఆశతో తల్లిదండ్రులు ఖమ్మంలోని మరో ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి చనిపోయిందని నిర్ధారించారు. స్రవంతి అకాలమృతితో బోడతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
నా కోరిక నెరవేరింది.. చిట్టి పాదాల పారాణి ముద్రలతో స్వాగతం! మనసుకు హాయి..
మా ఇంటి మహాలక్ష్మి ఆడపిల్లపుట్టిందని సంబరం చేశారు. ఇంట్లోకి పూలతో రహదారి పరిచారు. చిట్టి పాదాల పారాణి ముద్రలు వేశారు. అమ్మాయి పుడితే ఇలా స్వాగతం పలకండి. ‘ఆడదే ఆధారం... మన కథ ఆడనే ఆరంభం...’ అంటూ పాడుకునే నేల మనది. ఆడపిల్ల పుట్టగానే గొంతులో వడ్ల గింజలు వేసిన నేల కూడా ఇది. తల్లి గర్భంలోనే శిశువును గుర్తించి పుట్టకముందే ప్రాణం తీస్తున్న పాపాలకూ కొదవలేదు. ఇక ఆడపిల్లను కన్నతల్లికి ఎదురయ్యే కష్టాలను ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆడపిల్ల పుట్టింది... అనగానే కోడలిపై చిర్రుబుర్రులాడే అత్తలు, భార్య–బిడ్డల ముఖం చూడని మగవాళ్లు ఉన్న సమాజం మనది. ఇన్ని దారుణాల మధ్య ఓ సంతోషవీచిక వెల్లివిరిసింది. పుట్టింది ఆడపిల్ల అని తెలియనే పండుగ చేసుకున్నారు. ఊరూ వాడా అందరినీ పిలిచి వేడుక చేసుకున్నారు. అమ్మమ్మగారింట్లో రెండు నెలలు పూర్తి చేసుకున్న బిడ్డ మూడవ నెల నానమ్మ దగ్గరకు ప్రయాణమైంది. ఆ బిడ్డనెత్తుకుని అత్తగారింటికి వచ్చిన తల్లికి పూలబాట పరిచారు అత్తింటివాళ్లు. పాపకు ఘన స్వాగతం పలికారు. ఆడబిడ్డ పుట్టడం అంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రావడమేనన్నారు. ఆదర్శంగా నిలిచిన కుటుంబం తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాలో ఉంది. కే సముద్రం మండలం, తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన పొడగంటి శ్రీనివాసాచారి, భద్రకాళి దంపతుల ఆదర్శవంతమైన ఆత్మీయత ఇది. పాపాయి కోసం పూజలు కోడలు గర్భిణి అని తెలియగానే మగ పిల్లవాడు పుట్టాలని అనుకుంటారు. కానీ భద్రకాళి కుటుంబీకులు మాత్రం ఆడపిల్ల కావాలని పూజలు చేశారు. వాళ్ల పెద్దకొడుకు సాయి కిరణ్కు సిరిసిల్ల పట్టణానికి చెందిన సంహితతో రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. సంహిత నెలతప్పినప్పటి నుంచి భద్రకాళితోపాటు ఆమె తోడికోడలు సుమ, మరదలు రమ్య కూడా ఆడపిల్లలు పుట్టాలని వ్రతాలు, పూజలు చేశారు. వాళ్లందరికీ మగపిల్లలే. ఈ తరంలోనైనా ఇంట్లో ఆడపిల్ల కావాలని వాళ్ల కోరిక. ప్రసవం రోజు వరంగల్లో ఆసుపత్రికి ఇంటిల్లిపాది తరలి వెళ్లారు. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే సంతోషంగా కేకలు వేస్తూ, హాస్పిటల్లో అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. అపూర్వ స్వాగతం కోడలు పుట్టింటికి వచ్చిన రోజు ఇంటిని పూలతో అలంకరించారు. ముత్తయిదువలతో స్వాగతం పలికారు. చిన్నపాప కాళ్లకు పారాణి రాసి తొలి అడుగుల గుర్తులు నట్టింట్లో ముద్రించుకున్నారు. ఆ అడుగులను కళ్లకు అద్దుకున్నారు. ఆ జ్ఞాపకం కలకాలం నిలిచి ఉండడానికి ఫొటోలు తీశారు. నా కోరిక తీరింది నాకు చిన్నప్పటి నుండి ఆడపిల్లలంటే ఇష్టం. మా వారు కూడా ఆడపిల్ల ఉన్న ఇంటి అందమే వేరు అంటూ ఉంటారు. అందుకోసమే మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆడ పిల్లలను ప్రతి పండుగకు పిలుస్తాం. వారు చేసే సందడి చూసి సంబుర పడుతాం. మా ఇంట్లో ఆడపిల్ల ఉండాలనే కోరిక నెరవేరింది. అందుకోసమే అలా స్వాగతం పలికాం. – భద్రకాళి, పాపాయి నానమ్మ – ఈరగాని భిక్షం, సాక్షి, మహబూబాబాద్ -
మోదీ కొత్త స్కీం తెచ్చిండ్రు.. పైసలన్నీ ఒక్కరి ఖాతాలోకే..! కేటీఆర్ సెటైర్లు
సాక్షి, మహబూబాబాద్: తొర్రూరు మహిళా సభలో మాట్లాడుతూ కేంద్రంపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. బీజేపీ అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనం మొత్తం తీసుకు వస్తానన్న ప్రధాని మోదీ.. అధికారంలోకి వచ్చాక మొత్తం పైసలన్నీ ఒక్కరి ఖాతాలో వేసిండని ధ్వజమెత్తారు. మొదట వన్ నేషన్ వన్ ట్యాక్స్.. వన్ నేషన్ వన్ రేషన్ అన్నారని, ఇప్పుడు కొత్త స్కీమ్ తెచ్చి వన్ నేషన్ వన్ ఫ్రెండ్- ఒక దేశం ఒక దోస్త్ అంటూ దేశ సంపదను అదానీకి దోచి పెడుతున్నాడని విమర్శలు గుప్పించారు. 'శ్రీలంక పోయి రూ.6,000 కోట్ల ప్రాజెక్ట్ ఇప్పించారు. గవర్నమెంట్ అగ్రిమెంట్ అని నమ్మబలికి దోస్త్కు దోచిపెట్టి, దొంగ సొమ్ముతో ఎమ్మెల్యేలు కొనాలి.. ప్రభుత్వాలను కూల్చాలని పార్టీలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎనిమిదిన్నర ఏళ్ళలో ఏం చేసావయ్యా మోదీ.. అంటే చెప్పడానికి ఏమీ లేదు. ఆకాశంలో అప్పులు ఉన్నాయి. దేశంలో ఉన్నవాళ్లంతా పిచ్చోళ్ళు రూ.400 ఉన్న సిలిండర్ను రూ.1,200 చేసినా కరుకాచి నాకు వాత పెడతలేరు అనుకుంటున్నాడు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేకపోయారు. కేవలం హిందూ ముస్లిం పంచాయతీలు పెట్టి మత పరమైన విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారు. గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచి అన్ని పిరం చేశారు. అలాంటి ప్రధాన మంత్రి మనకు అవసరమా? అని కేసీఆర్ ఫైర్ అయ్యారు. అలాగే వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల కంటే పాలకుర్తిలో బీఆర్ఎస్కు అత్యధిక మెజార్టీ తీసుకురావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రూ.1,550 కోట్లు మహిళా దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ చిరు కానుకగా అందజేయడం జరుగుతుందన్నారు. సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో దేశవ్యాప్తంగా 20 పంచాయితీలను ఎంపికచేస్తే 19 తెలంగాణకు చెందినవే ఉన్నాయన్నారు. త్రీ స్టార్, ఫోర్ స్టార్లో మన పంచాయతీలే అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి కేసీఆర్ అని, కేసీఆర్ అంటే కాలువలు చెరువులు రిజర్వాయర్లు అని పేర్కొన్నారు. తొర్రూరుపై వరాల జల్లు.. తొర్రూరు మున్సిపాలిటీకి రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కొడకండ్లలో రెండు ఎకరాల్లో మినీ టెక్ట్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తొర్రూర్ లో 50 పడకలు, పాలకుర్తిలో మరో 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు తాము ఏం చేశామో ఘంటాపథంగా చెప్పగలుగుతాం, మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బేజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పగలుగుతుందా? అని ఛాలెంజ్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో రైతులు ఉల్లిగడ్డ పండిస్తే కేవలం 2 రూపాయలే వచ్చాయట అని సైటర్లు వేశారు. చదవండి: ఢిల్లీ వెళ్లేముందు కేసీఆర్తో మాట్లాడిన కవిత.. ఏం చెప్పారంటే..? -
కంచె.. ప్రాణాలు తీసింది
చిన్నగూడూరు: కోతులు, అడవి పందుల నుంచి పంటకు రక్షణగా పెట్టిన విద్యుత్ వైర్ల కంచె తండ్రీకొడుకుల ప్రాణం తీసింది. ఈ ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం దుమ్లాతండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన ఆంగోత్ సీవీనాయక్(60), అమ్మీ దంపతుల కుమారుడు కిరణ్(30) మొక్క జొన్న పంట వేశారు. పంట కంకి పోయడంతో కోతులు, అడవి పందులు వచ్చి పంటను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో చేను చుట్టూ విద్యుత్ వైర్ అమర్చారు. సాయంత్రం విద్యుత్ ఆన్చేసి, ఉదయాన్నే తీసివేసేవారు. కానీ మంగళవారం ఆఫ్ చేయడం మర్చిపోయారు. పంటకు నీరు కడుతుండగా కిరణ్ కాలుజారి విద్యుత్ సరఫరా అవుతున్న వైర్లకు తగిలి షాక్కు గురయ్యాడు. పక్కనే ఉన్న తండ్రి నాయక్ కుమారుడిని కాపాడేందుకు పట్టుకున్నాడు. గమనించిన తల్లి అమ్మీ కేకలకు పక్కనే ఉన్న రైతులు వచ్చి వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కానీ అప్పటికే ఇద్దరూ మరణించారు. కళ్లముందే భర్త, కొడుకు షాక్తో విలవిల్లాడుతూ మరణించడంతో గుండలవిసేలా రోదించింది. చిన్నగూడూరు ఎస్సై రవికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహబూబాబాద్ జిల్లా: వైఎస్ షర్మిల అరెస్ట్
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర రద్దు అయింది. ఎమ్మెల్యే శంకర్నాయక్పై షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఆయన అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో షర్మిల పాదయాత్ర అనుమతిని పోలీసులు రద్దు చేశారు. షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమెను హైదరాబాద్ తరలించారు. చదవండి: బహిరంగ చర్చకు సిద్ధమేనా -
24 గంటలు.. 19 కాన్పులు
సాక్షి,నెహ్రూ సెంటర్: మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 24 గంటల్లో 19 కాన్పులు జరిగాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 19 ప్రసవాలు జరిగాయని, వాటిలో 15 సాధారణ, 4 సిజేరియన్ శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రసవాల్లో అధిక రిస్క్ కేసులు కూడా ఉన్నాయని, కానీ తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు సిజేరియన్ ప్రసవాలను తగ్గించి.. సాధారణ కాన్పులను పెంచే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది ఈ విజయం సాధించారని వివరించారు. కాన్పుల విభాగం అధిపతి డాక్టర్ బి.వెంకట్రాములు ఆధ్వర్యంలో స్త్రీ వైద్య నిపుణులు అలేఖ్య, శస్త్ర చికిత్స డ్యూటీ నిపుణులు శైలజ, శ్రావణి, మత్తు విభాగం వైద్యులు శ్రవణ్కుమార్, శ్రీనివాస్ సేవలందించారని తెలిపారు. వారందరనీ కలెక్టర్ శశాంక అభినందించారని పేర్కొన్నారు. -
బతుకుదెరువు.. గుండె బరువు.. తల్లి ఒడిలో నుంచి ఎగిరిపడి!
సాక్షి, మహబూబాబాద్: బతుకుదెరువు కోసం బయల్దేరిన ఓ కుటుంబానికి గుండె బరువైంది. పొట్టకూటి కోసం ఊరూరా తిరిగి స్టీల్ సామగ్రి అమ్మే కుటుంబంలో ఆటో బోల్తా పడి విషాదం నిండింది. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారులో మంగళవారం ఆటో బోల్తా పడి రేబెల్లి యాలాద్రి–సమ్మక్క దంపతుల కుమార్తె రాణి(3) మృతి చెందింది. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి జమాండ్లపల్లికి చెందిన యాలాద్రి–సమ్మక్క దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరు బతుకుదెరువు కోసం ఊరూరా తిరిగి స్టీల్ సామగ్రి, అమ్ముతూ, గ్యాస్ స్టవ్లు మరమ్మతు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈక్రమంలో యాలాద్రి, సమ్మక్క తమ కుమార్తె రాణి కలిసి టాటా ఏస్ ట్రాలీ క్యాబిన్లో కూర్చున్నారు. వారితో పాటు వెనకాల ట్రాలీలో సమ్మక్క తల్లి వెంకటమ్మ కూర్చుని వరంగల్ వెళ్లేందుకు బయల్దేరారు. శనిగపురం శివారు గుండ్లబోడుతండా మూల మలుపు వద్ద గల రైస్ మిల్లు ప్రాంతానికి ఆటో చేరుకోగానే.. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో ఒక్కసారిగా టాటాఏస్ ట్రాలీ అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈఘటనలో యాలాద్రి పక్కనే ఉన్న సమ్మక్క, చిన్నారి రాణి, ఆటో వెనుకభాగంలో కూర్చున్న వెంకటమ్మ రోడ్డుపై పడిపోయారు. సమ్మక్క, వెంకటమ్మకు స్వల్పగాయాలవగా.. రాణి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆటోలో వారిని ఆస్పత్రికి తరలించగా.. రాణి మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. సమ్మక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ ఎస్సై సీహెచ్.అరుణ్కుమార్, స్థానికులు తెలిపారు. చదవండి: ఇన్స్టాలో ఐఫోన్ అగ్గువ.. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకున్న నిట్ విద్యార్థిని -
పులి జోన్..పరేషాన్!
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కుగ్రామం దొరవారి తిమ్మాపురం. ఈ గ్రామంలో 25 ఆదివాసీ గిరిజన కుటుంబాలు రెండు శతాబ్దాలుగా నివాసం ఉంటున్నాయి. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పచ్చటి అడవిలో ప్రశాంతమైన జీవనం సాగిస్తున్న ఈ ఆదివాసీ బిడ్డల్లో అలజడి మొదలైంది. ‘ఈ గ్రామానికి వసతులు కల్పించలేం.. మీరు ఖాళీ చేయండి.. మైదాన ప్రాంతంలో మీకు పునరావాసం కల్పిస్తాం..’అంటూ అధికారులు ఒత్తిడి చేయడమే ఇందుకు కారణం. అడవిలో జీవించే తాము ఎక్కడికీ రాలేమని గిరిజనులు తేల్చి చెప్పడంతో ఒత్తిడి పెంచేందుకు అధికారులు త్రీఫేజ్ విద్యుత్ను తొలగించారు. అయితే ఇదంతా ఆ గ్రామానికి వసతులు క ల్పించలేక అధికారులు చేస్తున్న పని కాదని, అడవి మధ్యలో ఉన్న ఈ గ్రామాన్ని ఖాళీ చేస్తే ఇక్కడ టైగర్ జోన్ ఏర్పాటు చేయవచ్చని, తద్వారా అటు వన్యప్రాణుల సంరక్షణ, ఇటు అడవుల పరిరక్షణ చేయవచ్చనేది ప్రభుత్వ ఆలోచన అని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఆదివాసీ సంఘాలు, ఇతర సంఘాలు తిమ్మాపురం గిరిజనులకు మద్దతు పలికాయి. అయినా వారిలో ఆందోళన.. అడవి విడిచి పెట్టాల్సి వస్తుందేమో అని ఆవేదన. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ విధమైన తరలింపు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినట్లు సమాచారం. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ప్రభుత్వం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు పులుల సంరక్షణ.. అడవుల రక్షణ కోసం ఆదివాసీ గూడేలపై కన్నువేసిందనే ప్రచారం జరుగుతోంది. నల్లమల డీప్ ఫారెస్టుతో పాటు తెలంగాణలోని గోదావరి లోయ ప్రాంతాలైన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో టైగర్ జోన్లు ఏర్పాటు చేస్తే గోదావరి లోయ బెల్ట్ అంతా అడవితో నిండి ఉంటుంది. అడవి మధ్యలో గ్రామాలు ఖాళీ చేస్తే పోడు భూములు అడవిలో కలిసిపోతాయి. ఇక ముందు పోడు చేసుకునే అవకాశం కూడా ఉండదు. అందుకోసమే ప్రభుత్వం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా..: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ రిజర్వ్ ఏరియాలోని గ్రామాలైన మైసంపేట, రాంపూర్ ప్రాంతాల గిరిజనులను పులుల అభయారణ్యం నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మొత్తం కోర్ ఏరియాలో 39 గూడేలు ఉండగా.. ఇందులో 15 గూడేలను మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం కొత్త మద్దిపడగ పరిధిలోని మైసంపేట, రాంపూర్ పునరావాస గ్రామాల్లోని 142 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ.21.30 కోట్లు పరిహారం ఇచ్చారు. æనల్లమల అడవిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో కోర్ ఏరియాలో ఉన్న చెంచుల పెంటలను అడవి నుంచి బయటకుపంపించే ప్రయత్నాలకు అధికారులు సిద్ధమయ్యారు. సారంపల్లి,కుడిచంతలబైల్ గ్రామస్తులతో సమావేశమయ్యారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పరిహారం అందించి పునరావాసం ఏర్పాటు చేస్తామని ఆశ చూపుతున్నారు. ►ములుగు జిల్లా కన్నాయిగూడెం, ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, గోవిందరావుపేట మండలాల పరిధిలో మొత్తం 53 గొత్తికోయ గ్రామాలను గుర్తించి 2022 జూన్లో సర్వే చేశారు. ప్రస్తుతం గూడేలు ఖాళీ చేయాలని, మంచి ప్యాకేజీలు ఇచ్చి మైదాన ప్రాంతాల్లో పునరావాసం కల్పిస్తామని వారిని బుజ్జగిస్తున్నారని తెలుస్తోంది. ►మహబూబాబాద్తో పాటు పక్కనే ఉన్న వరంగల్ జిల్లా ఖానాపురం మండలం చిలకమ్మనగర్ ఆదివాసీ గూడేలను కూడా ఖాళీ చేయించే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం. ఇందులో భాగంగానే తొలుత దొరవారి తిమ్మాపురం గ్రామంపై దృష్టిపెట్టి ఆ గూడేన్ని ఖాళీ చేయించే పనిలో అధికారులు ఉన్నారు. ►భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, పినపాక అడవి మధ్యలో ఉన్న అడవి రామారం, కాచనపల్లి, గుండాల మధ్యలో ఉన్న బాటన్న నగర్ గ్రామాలపై కూడా ఫారెస్టు అధికారుల కన్నుపడినట్లు సమాచారం. ఈ రెండు గ్రామాలను కూడా ఖాళీ చేయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడికి పోవాలి..ఎట్టా బతకాలే.. అడవిలోనే పుట్టా. ఇక్కడే పెరిగాను. జంతువులు అంటే మాకేం భయం. ఇక్కడి నుంచి పొమ్మంటే ఎక్కడికి పోయేది. ఎట్టా బతకాలే.. మా ఊరు విడిచి వెళ్లలేం. ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాం. మా అవ్వ, అయ్యను పెట్టిన జాగలోనే నన్ను పెట్టాలి. – పిడబోయిన లక్ష్మయ్య, దొరవారి తిమ్మాపురం ఖాళీ చేయమని చెప్పొద్దు చుట్టూ అడవి. అడవి మధ్యలో మా ఊరు. అందరం పని చేసుకుంటూ బతుకుతాం. ఇంత మంచిగా ఉన్న మా ఊరును ఖాళీ చేయమంటే మేం ఎట్టా బతికేది. గవర్నమెంటోళ్లు మా ఊరికి రోడ్డు వేసి వసతులు కల్పించాలి. అంతేకానీ..ఖాళీ చేయమని మాత్రం అనొద్దు. – పెరుకు గోవిందమ్మ, దొరవారి తిమ్మాపురం -
బడిలో ‘కంటి వెలుగు’.. పక్కింట్లో పాఠాలు..
కురవి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు–2 కార్యక్రమా న్ని నిర్వహించడంతో విద్యార్థులకు పక్కింట్లో తరగతులు నిర్వహించారు. పైగా ఈ కార్యక్రమాన్ని జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించడం గమనార్హం. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(జీ) శివారు తాట్య తండాలో గురువారం జరిగింది. తాట్య తండాలోని ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు–2 కార్యక్రమానికి ఆరోగ్య, వైద్య శాఖ సిబ్బంది ఏర్పాట్లు చేయగా, మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. పాఠశాలలో కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేయడంతో ఆ పక్కనే భూక్య భద్రు అనే వ్యక్తి ఇంట్లో ఉపాధ్యాయురాలు పద్మ విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని సైతం అదే ఇంటి ఆవరణలో వడ్డించారు. దీనిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. కంటివెలుగు కార్యక్రమాన్ని వేరేచోట కాకుండా బడిలో నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును తప్పుపట్టారు. -
మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు.. 20 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో రేపు (బుధవారం) జరిగే బిఆర్ఎస్ ఆవిర్భావ సభ నేపథ్యంలో పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలిపారు. అయితే 17 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మార్చితే 100కు పైగా సీట్లలో బిఆర్ఎస్ గెలుస్తుందని స్పష్టం చేశారు. ఏ సర్వే అయినా, తాను వ్యక్తిగతంగా చేసిన సర్వేలు చూస్తే 80 నుంచి 90 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని తెలిసిందన్నారు. కేసీఆర్కు ఓటేస్తాం కానీ కొందరి ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. 15 నుంచి 20 స్థానాల్లో బీజేపీ, 20 నుంచి 25 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ ఉంటుందని 17 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మార్చితే బీఆర్ఎస్ వందకు పైగా స్థానాలు గెలుస్తుంది అన్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ.. మరికొన్ని చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. చదవండి: ('కుటుంబం కంటే ఎక్కువగా ప్రజలను ప్రేమించడం చెవిరెడ్డికే సాధ్యం') -
మహబూబాబాద్: టమాటా కూర అత్త ప్రాణం మీదకు తెచ్చింది
సాక్షి, మహబూబాబాద్: కోడలు వండిన టమాట కూర.. ఆ అత్త ప్రాణం మీదకు తెచ్చింది. భార్యను అవమానించిందంటూ సొంత తల్లిపైనే ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ మండలంలో జరిగింది. వేంనూరులో ఆత్తకోడళ్ళ మధ్య ఘర్షణ.. ఒక ప్రాణం మీదకు తెచ్చింది. వండిన టమాటా కూర బాగలేదని కోడలిని మందలించింది అత్త బుజ్జి. ఈ విషయంపై భర్తకు ఫిర్యాదు చేసింది నందిని. తన భార్యనే అట్లా అంటావా అంటూ మటన్ కొట్టే కత్తితో కొడుకు మహేందర్ సొంత తల్లిపైనే దాడికి దిగాడు. ఈ దాడిలో తల్లి బుజ్జి తల్లి తలకు తీవ్రగాయ్యాలు. వెంటనే ఆమెను స్థానికులు మహబూబాబాద్ ఏరియా హస్పటల్ కి తరలించారు. ఆపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. -
వాళ్లు చెప్పినట్టు వింటే.. తాలిబన్ రాజ్యమే
దేశాన్ని రక్షించేందుకు తెలంగాణ బిడ్డలు ముందుకు రావాలి ప్రజలు అభివృద్ధి వైపు సాగాలంటే సమాజంలో శాంతి, సహనం అవసరం. మతపిచి్చ, కులపిచ్చి పెంచి విద్వేషాలు రెచ్చగొడితే దేశం తిరోగమనం వైపు పయనిస్తుంది. మేధావులు, యువత దీనిపై ఆలోచన చేయాలి. మన చుట్టూ ఏం జరుగుతోందో పరిశీలన చేయాలి. మనం బాగున్నాం కదా, పొరుగింటోళ్లు ఏమైపోతే ఏమిటని అనుకుంటే, ఓ రోజు మనకూ ప్రమాదం వస్తుంది. అందువల్ల ఉద్యమ పంథా, పోరాట రక్తమున్న తెలంగాణ బిడ్డలు ఈ దేశాన్ని రక్షించడానికి ముందుకు రావాలి. – సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి, మహబూబాబాద్/భద్రాద్రి కొత్తగూడెం: ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. వారి ప్రయత్నాలు ఫలిస్తే రాష్ట్రంలో అశాంతి పెరిగిపోతుంది. సమాజం మరో తాలిబన్లా మారిపోతుంది. ఇక్కడికి పెట్టుబడులు రావు. ఉద్యోగాలు, ఉపాధి లభించవు. మన చుట్టూ జరుగుతున్న విద్వేష రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవాలి. దీనిపై సమాజంలో చర్చ జరగాలి..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. గురువారం మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నూతన కలెక్టరేట్లను, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆయా చోట్ల కలెక్టర్లను వారి చాంబర్లలోని కుర్చీల్లో కూర్చోబెట్టి అభినందించారు. తర్వాత రెండు చోట్ల నిర్వహించిన సభల్లో ప్రసంగించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవు. దేశానికే మార్గదర్శకంగా నిలిచాం. దీనికి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. రెండు రోజులు చెప్పినా అవి ఒడవవు. తెలంగాణలో గతంలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇప్పుడు 33 జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ధైర్యం చేసి తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం. ప్రజలు సంక్షేమ పథకాల జాతరను అనుభవిస్తున్నారు. గతంలో 600 ఫీట్లు బోరు వేసినా నీరు ఉండేది కాదు. ప్రస్తుతం సమృద్ధిగా నీరు,కరెంట్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి జిల్లాలో ప్రజలకు, ఉద్యోగులకు సౌకర్యంగా ఉండేలా సమీకృత కలెక్టరేట్లను నిర్మించుకుంటున్నాం. ఇతర రాష్ట్రాల్లో మంత్రుల చాంబర్ కంటే తెలంగాణలో కలెక్టర్ చాంబర్ అద్భుతంగా ఉందని పంజాబ్ మంత్రి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్ర అసమర్థత వల్లే తగ్గిన ఆదాయం తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.5లక్షల కోట్లు ఉండేది. ఇప్పుడు రూ.11.54 లక్షల కోట్లకు చేరింది. మనస్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేసి ఉంటే రాష్ట్ర జీఎస్డీపీ రూ.14.5 లక్షల కోట్లకు చేరేది. కేంద్ర అసమర్థ పనితీరు వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రానికే దాదాపు రూ.3 లక్షల కోట్ల నష్టం జరిగింది. అన్ని రాష్ట్రాలను కలిపితే ఈ నష్టం మరెంతో ఉంటుంది. జల వివాదాలు తీర్చడం లేదు దేశవ్యాప్తంగా నదుల్లో సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నా.. రైతుల పొలాల వద్దకు రావు. కృష్ణానదిపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ 19 ఏళ్లు గడిచినా తీర్పు ఇవ్వలేదు. మనం మొండి పట్టుదలతో తెగించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నాం. నీటి సమస్య లేకుండా చేసుకున్నాం. దేశంలో సమృద్ధిగా నీటి వనరులున్నా నదులపై ఉన్న వివాదాలను తేల్చకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం తాగునీటి సమస్య తీరలేదు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తాగునీటి ఎద్దడి ఇంకా ఉండటం ఏమిటి? 10 రోజులకోసారి నీళ్లు సరఫరా చేసే దుస్థితికి కారణాలేమిటి? ఇప్పటివరకు కేంద్రాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ల అసమర్థత, తప్పుడు విధానాల ఫలితమే ఇది...’’ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బిజీ బిజీగా కార్యక్రమాలు సీఎం కేసీఆర్ తొలుత హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబాబాద్కు చేరుకున్నారు. అక్కడ నూతన కలెక్టరేట్ను, జిల్లా గ్రంధాలయాన్ని, బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ సమీపంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. తర్వాత హెలికాప్టర్ ద్వారా కొత్తగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్.. తొలుత కొత్తగూడెం–పాల్వంచ మధ్యలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించారు. అక్కడే నిర్వహించిన సభలో మాట్లాడారు. తర్వాత రోడ్డు మార్గంలో కొత్తగూడెం వెళ్లి బీఆర్ఎస్ జిల్లా ఆఫీసును ప్రారంభించారు. అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట మంత్రులు సత్యవతిరాథోడ్, వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు, ఎమ్మెల్యేలు శంకర్నాయక్, రెడ్యానాయక్, బానోతు హరిప్రియ, చల్లా ధర్మారెడ్డి, యాదగిరిరెడ్డి, టి.రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నూకల రాంచంద్రారెడ్డి విగ్రహాలు పెడతాం: కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన ఆదర్శ నాయకుడు నూకల రాంచంద్రారెడ్డి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. తొలి ఉద్యమ సమయంలోనే ఆయన తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. చాలామంది నాయకులకు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గురువు అయితే.. పీవీకి గురువు నూకల రాంచంద్రారెడ్డి అన్నారు. అలాంటి నేత గురించి ఈ తరం యువతకు తెలపడం ప్రభుత్వ బాధ్యత అని.. మహబూబాబాద్, వరంగల్ పట్టణాల్లో ప్రభుత్వ ఖర్చులతో రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏదైనా ఒక ఇనిస్టిట్యూట్కు ఆయన పేరు పెడతామన్నారు. రెండు జిల్లాలకు వరాలు మహబూబాబాద్కు కొత్తగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నామని.. వచ్చే విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక అభివృద్ధి పనుల కోసం మహబూబాబాద్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, జిల్లాలోని మిగతా 3 మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున నిధులు ఇస్తున్నట్టు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి సీఎం ప్రత్యేక నిధులనుంచి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 481 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రత్యేక నిధిని మంజూరు చేస్తున్నామని సీఎం చెప్పారు. జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలకు రూ.40 కోట్ల చొప్పున.. ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు ఇస్తున్నట్టు ప్రకటించారు. పాలనలో ఉద్యోగుల భాగస్వామ్యం పెంచుతాం: సీఎస్ శాంతికుమారి రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని, పరిపాలనా ఫలాలను ప్రజలకు చేర్చేందుకు ఉద్యోగుల భాగస్వామ్యం పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. తాను జిల్లాలో పనిచేసినప్పుడు కలెక్టర్ కార్యాలయాలు ఇరుకు గదులతో టాయిలెట్స్ కూడా సరిగాలేక ప్రజలు ఇబ్బంది పడేవారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు సమీకృత కలెక్టరేట్లు ఇంద్ర భవనాల్లా ఉన్నాయని, వీటిని చూస్తే అసూయగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అడగకుండానే వరాలిచ్చే కేసీఆర్: మంత్రి ఎర్రబెల్లి అడిగితే వరాలు ఇచ్చేవాళ్లు ఉంటారేమోగానీ.. సీఎం కేసీఆర్ మాత్రం అడగకుండానే కష్టాలను అర్థం చేసుకొని వరాలు ఇచ్చే పేదల ఆరాధ్య దైవమని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. ఇదే తరహాలో ఆయన మానుకోట ప్రజలపై చల్లని చూపు సారించాలని కోరారు. సీఎం ఆశీస్సులతో మానుకోట అభివృద్ధిలో బంగారు కోట కావాలని ఆకాంక్షించారు. -
మహబూబాబాద్లో సీఎం కేసీఆర్.. కొత్త కలెక్టరేట్ ప్రారంభం
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ భవనాన్ని, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కాగా, జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించగా తర్వాత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం, సీఎం కేసీఆర్.. భదాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లనున్నారు. కొత్తగూడెం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. -
మానుకోటకు సీఎం కేసీఆర్.. నిఘా పెంచిన పోలీసులు
సాక్షి, మహబూబాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నూతన జిల్లాగా ఏర్పడిన తరువాత నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంతోపాటు, సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఎం పర్యటించే ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మరమ్మతుల పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్లతోపాటు మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావులతో సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్, కలెక్టర్ కార్యాలయాల ప్రారంభంతోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కో–ఆర్డినేటర్లు, ఇతర ముఖ్య నాయకులు, అధికారులు మొత్తం 10వేల మందితో సీఎం సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సమావేశానికి ఎవరెవరిని ఆహ్వా నించాలి, ఏ మండలం నుంచి ఎంత మంది వస్తున్నారనే విషయంపై మంత్రులు, అధికారులు చర్చించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం మహబూబాబాద్లో గడపనున్నారు. అనంతరం సీఎం మహబూబాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడం జిల్లాకు వెళ్లనున్నారు. పోడు భూములకు పట్టాలిచ్చే విషయంలో జాప్యం చోటుచేసుకోవడం, గిరిజనేతరులకు పట్టాల పంపిణీ విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేకపోవడం, నారాయణపురం గ్రామంలోని కొందరు కైతులకు పట్టాలు ఇవ్వని విషయంపై ఆందోళనలు, నిరసలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు వారిపై గట్టి నిఘా పెట్టారు. -
నేడు మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన
-
ఫిబ్రవరిలో పోడు భూములకు పట్టాలు
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోడు రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఫిబ్రవరిలో చేపట్టనున్నట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈనెల 12న ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్ పర్యటన నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్లు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యవతి మాట్లాడారు. మహబూబాబాద్లో సీఎం కేసీఆర్తో భారీ బహిరంగ సభ ఏర్పా టు చేయాలని అనుకున్నామని అన్నారు. సభ లో గిరిజనులకు పోడు భూములకు సంబంధించి పట్టాలు పంపిణీ చేసేందుకు సమాయ త్తమయ్యామని చెప్పారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల పట్టాల పంపిణీలో జాప్య మవుతోందన్నారు. ఫిబ్రవరిలో మహబూబా బాద్లో భారీ బహిరంగ సభ పెట్టి పట్టాలు పంపిణీ చేసేందుకు వస్తానని సీఎం చెప్పినట్లు మంత్రి వివరించారు. అప్పటివరకు గిరిజను లు వేచి ఉండాలని, అర్హులైన వారందరికి పట్టాలు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు -
మిర్చిపై ‘నల్ల తామర’ పంజా!
సాక్షి, మహబూబాబాద్: గత ఏడాది మిర్చి రైతులను గగ్గోలు పెట్టించిన నల్లతామర పురుగు మళ్లీ పంజా విసురుతోంది. మెల్లగా 40శాతం పంటకు వ్యాపించిన పురుగు.. మిర్చి పంటను నిలువునా నాశనం చేస్తోంది. ఎన్ని మందులు కొట్టినా ఫలితం ఉండటం లేదని, పూత రాలిపోయి మొక్కలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ పురుగు సోకిన విషయం తెలిసిన నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్సెక్ట్ రిసోర్సెస్ (ఎన్బీఏఐఆర్)–బెంగళూరు, సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ (సీఐపీఎంసీ)–హైదరాబాద్ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో పంటలను పరిశీలిస్తూ.. రైతులకు సూచనలు ఇస్తున్నారు. గత ఏడాది ఆగమాగం చేసి.. గత ఏడాది రాష్ట్రంలో మిర్చి పంటకు నల్లతామర పురుగు సోకింది. మొదటి పూత సమయంలోనే ప్రతాపం చూపింది. వేల ఎకరాలకు విస్తరించి తీవ్ర నష్టం కలగజేసింది. చాలా మంది రైతులు పెట్టుబడి కూడా చేతికి రాక అప్పుల పాలయ్యారు. మనస్తాపానికి గురై ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 24మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే మిర్చికి మంచి ధర ఉండటంతో ఈసారైనా పంట బాగుంటే అప్పులు తీర్చుకోవచ్చన్న ఉద్దేశంతో అదే పంట వేశారు. మొత్తంగా రాష్ట్రంలో 2,41,908 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఇందులో చాలా మంది రైతులకు మొదటి పూత దశ వరకు పంట బాగానే ఉండటంతో సంతోషపడ్డారు. కానీ మొదటి కాత పడిన కొద్దిరోజులకే మళ్లీ నల్లతామర పురుగు సోకింది. ఇప్పటివరకు 90వేల ఎకరాలకుపైగా వ్యాపించింది. మరింతగా విస్తరిస్తుండటంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. భూమి చదును చేయడం నుంచి విత్తనాల సేకరణ, ఎరువులు, పురుగు మందులదాకా మిర్చి సాగుకోసం ఇప్పటివరకు ఎకరానికి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. సోకిన ఒకట్రెండు రోజుల్లోనే.. నల్లతామర పురుగు సోకితే ఒకట్రెండు రోజుల్లోనే పంటకు తీవ్ర నష్టం జరుగుతోందని రైతులు చెప్తున్నారు. చేనులో పూలన్నీ రాలిపోతున్నాయని.. చెట్టు మోడుబారడం మొదలవుతోందని అంటున్నారు. పంటను రక్షించుకునేందుకు రకరకాల మందులు వాడామని.. పది, పదిహేను రోజుల్లో ఎకరానికి రూ.40 వేలకుపైగా విలువచేసే మందులు పిచికారీ చేసినా లాభం లేదని వాపోతున్నారు. జిల్లాల్లో శాస్త్రవేత్తల పరిశీలన నల్లతామర సోకిన విషయం తెలుసుకున్న ఎన్బీఏఐఆర్ శాస్త్రవేత్తలు కె.శ్రీదేవి, రచన, కందన్, సీఐపీఎంసీ శాస్త్రవే త్తలు సునీత, నీలారాణి, రవిశంకర్లతోపాటు ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు శ్రీధర్, వెంకటరమణ, ఇతర ఉద్యాన శాస్త్ర వేత్తలు వారం రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మి ర్చిసాగు అధికంగా ఉన్న ఖమ్మం, మహబూబాబాద్, గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, జయశంకర్ భూపా లపల్లి, వరంగల్ జిల్లాలకు వెళ్లి.. గత ఏడాదికి ఇప్పటికి పురుగులో వచ్చిన తేడా, పంటను ఆశించిన తీరును పరి శీలించారు. నల్ల తామర నియంత్రణ కోసం బవేరియా భాసియానా, లెకానీసీలియం లెకానీ, సూడోమోనాస్, బ్యాసిల్లస్, సబ్టైలిస్ పౌడర్లను ప్రయోగత్మకంగా రైతుల మిర్చి తోటల్లో పిచికారీ చేయించారు. కీటకనాశని జీవ శిలీంధ్రాలతో ఫలితం నల్ల తామర పురుగు నివారణ కోసం ఎన్బీఏఐఆర్ శాస్త్రవేత్త కందన్ నేతృత్వంలో తయారుచేసిన కీటకనాశని జీవ శిలీంధ్రాలు మంచి ఫలితం ఇస్తున్నాయి. కర్ణాటకలోని మిర్చి తోటలపై ప్రయోగాత్మకంగా పిచికారీ చేశాం. తెలంగాణలోనూ అదే రకమైన నల్లతామర పురుగు ఆశించినట్టు నిర్ధారించాం. ఇక్కడా బ్యాలిల్లస్, సూడోమోనాస్ తదితర మందులను పిచికారీ చేయించాం. పంటలు రికవరీ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం. – కె.శ్రీదేవి, ఎన్బీఏఐఆర్ శాస్త్రవేత్త రైతులు జాగ్రత్తలు పాటించాలి తెలంగాణలో మిర్చి అధికంగా సాగుచేసిన ఏడు జిల్లాల్లో పర్యటించాం. పురుగు తీవ్రత గత ఏడాది కన్నా తక్కువగా ఉంది. గత ఏడాది సన్నమిర్చి రకాలకు రాలేదు. కానీ ఇప్పుడు తేజ రకం విత్తనాలకు ఎక్కువగా ఆశిస్తున్నట్టు గుర్తించాం. దీనికి విరుగుడు బ్యాక్టీరియా, శిలీంధ్రాలతో తయారు చేసిన కీటక నాశనులే అని ప్రయోగాల్లో తేలింది. రైతులు విత్తన శుద్ధి, పంట మార్పిడి మొదలైన సస్యరక్షణ చర్యలు కూడా పాటించాలి. – లీలారాణి, సీఐపీఎంసీ శాస్త్రవేత్త -
Birthday Politics: ఆ బర్త్డే వేడుకల వెనుక రహస్యం ఏంటి?
ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో పొలిటికల్ బర్త్డే పార్టీలు జోరందుకున్నాయి. రెండు పార్టీలు..ఇద్దరు గిరిజన నేతలు..మరో బీసీ నేత పుట్టిన రోజు వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించుకున్నారు. గిరిజన నేతలిద్దరూ స్వపక్షంలోనే ప్రతిపక్షంలా మారిపోయారు. సొంత పార్టీలోని ప్రత్యర్థులపై పై చేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు గజమాలల బర్త్డే వేడుకల వెనుక రహస్యం ఏంటి? మానుకోటలో ఏం జరిగింది? పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లులో పార్టీల మధ్య..ఒకే పార్టీలోని ప్రత్యర్థుల మధ్య పోరు తీవ్రమవుతోంది. అంతర్గత విభేదాలతో రగిలిపోతున్న కొందరు నేతలు రాజకీయంగా పంతం నెగ్గించుకునేందుకు.. ఎదుటివారిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమ సత్తా చాటేందుకు సరికొత్త వ్యూహాలతో జనంలోకి వెళ్తున్నారు. అవకాశం దొరికితే చాలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు బర్త్ డే వేడుకలను వేదికగా చేసుకొని బలనిరూపణకు దిగుతున్నారు. మానుకోటలో అధికార పార్టీ ఎంపీ మాలోతు కవిత, ములుగు జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య నిర్వహించిన బర్త్ డే వేడుకలు ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇద్దరు నేతలు సృష్టించిన హంగామా చర్చనీయాంశంగా మారింది. చదవండి: (TS: కాంగ్రెస్లో ఎవరిగోల వారిదే.. ఠాక్రే ముందున్న సవాళ్లేంటీ?) గజమాల వెనక రాజకీయం పోటాపోటీ కార్యక్రమాలకు అధికార, విపక్ష పార్టీలనే తేడా లేదు. కొత్త సంవత్సరం తొలిరోజున మహబూబాబాద్ ఎంపీ, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత పుట్టినరోజు. ఆరోజు కవిత, ఆమె అనుచరులు సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. భారీ క్రేన్ సహాయంతో గజమాల వేసుకుని మానుకోటలో జనసందోహంతో ఊరేగింపు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అనుచరులతో రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. కవిత ఆమె అనుచరులు సృష్టించిన హంగామా వెనుక అసలు రాజకీయం వేరే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. రాబోయే ఎన్నికల్లో మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న కవిత సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకే బర్త్ డే వేడుకలతో సత్తా చాటే ప్రయత్నం చేశారని ప్రచారం సాగుతోంది. రైతు దీక్ష, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎంపీ కవిత నుంచి మైక్ లాక్కుని అవమానపరిచేలా వ్యవహరించారు. ఈ వ్యవహారంతో రగిలిపోతున్న కవిత వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ టార్గెట్ గా పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. నేనూ లైన్లో ఉన్నాను..! రాజకీయాల్లోకి వచ్చాక ఏనాడూ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోని భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఈసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ లో జనవరి 2న బర్త్ డే వేడుకలతో హంగామా చేశారు. భారీ క్రేన్ సహాయంతో గజమాల ధరించి వెంకటాపూర్లో ఊరేగింపు మొదలుపెట్టి నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాల్లో పర్యటించారు. పోదెం వీరయ్య పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన నిర్వహించుకున్న బర్త్డే వేడుకలు జరుగుతున్న ప్రచారం నిజమే అనిపిస్తున్నాయని అంటున్నారు. వీరయ్య హస్తానికి హ్మాండిచ్చి కారెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కారు ఎక్కడానికి సిద్ధమవుతున్న వీరయ్య, అక్కడా ఉంటా.. ఇక్కడ ఉంటా అంటున్నారట. భద్రాచలం, ములుగు రెండు నియోజకవర్గాలు తనవే అని నిరూపించుకునేందుకు బల ప్రదర్శన నిర్వహించినట్లు ప్రచారం సాగుతుంది. వీరయ్య వ్యూహమేంటీ? ములుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీతక్కకు చెక్ పెట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన పోదెం వీరయ్యకు గులాబీ పార్టీ గాలం వేసినట్లు తెలుస్తుంది. ముందుగా సీతక్కనే గులాబీ గూటిలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు యత్నించినప్పటికీ రేవంత్ రెడ్డి నమ్మిన బంటులా ఉన్న సీతక్క పార్టీ మారేందుకు ససేమిరా అనడంతో పోదెం వీరయ్యతో సీతక్కకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే వీరయ్య గులాబీ బాస్ ముందు కొన్ని షరతులు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్లో చేరి ములుగులో తాను పోటీలో నిలిచినా.. భద్రాచలంలో మాత్రం తాను సూచించిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలని ప్రతిపాదన పెట్టినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎన్నడు లేని విధంగా బర్త్ డే సెలబ్రేషన్ పేరుతో ములుగు నియోజకవర్గంలో భారీ ఊరేగింపు నిర్వహించి అక్కడా ఉంటా.. ఇక్కడ ఉంటానని చాటి చెప్పినట్లు జనం భావిస్తున్నారు. వీరయ్య వ్యూహం జనానికి అవగతం అవుతున్నా.. గులాబీ బాస్ మదిలో ఏముందో తేట తెల్లం కావాలంటే మరి కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే. తగ్గేదేలే..! బర్త్ డే రాజకీయం ములుగు, మహబూబాబాద్లోనే కాదు అటు భూపాలపల్లిలో సైతం సాగుతోంది. మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి బర్త్ డే సందర్భంగా ఇటీవల గ్రాండ్ గా వేడుకలు నిర్వహించి అనుచరుల్లో కొత్త ఊపును తీసుకొచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి చెక్ పెట్టి వచ్చే ఎన్నికల్లో టికెట్ సాధించడమే లక్ష్యంగా చారీ సాబ్ బర్త్ డే పార్టీతో సత్తా చాటే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బర్త్ డే వేడుకలు.. విందు భోజనాలతో రాజకీయాలను మలుపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు ఓరుగల్లు నేతలు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ఎన్నికల ఎత్తుగడలతో నాయకులంతా ముందుకు సాగుతున్నారు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం..లారీ నుంచి ఆటో పైపడ్డ గ్రానైట్ రాయి
-
మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ బండరాయి పడి నలుగురు దుర్మరణం పాలయ్యారు. కురవి మండలం అయ్యగారిపల్లెలో ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. లారీ లోడ్ నుంచి గ్రానైట్ బండరాయి ఆటోపై పడడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది. కూలీ పనులు ముగించుకుని వాళ్లంతా ఇంటికి వస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులంతా చిన్నగూడురు మండలం మంగోళిగూడెం వాసులుగా తెలుస్తోంది. -
మా భూములకూ పట్టాలు ఇవ్వండి
సాక్షి, మహబూబాబాద్: ‘తాతలు, తండ్రుల కాలం నుంచి అడవి బిడ్డలతో కలసి బతుకుతున్నాం. అడవిలోనే పుట్టాం.. ఇక్కడే పెరిగాం. మేం సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకపోతే ఎలా? మేము ఎక్కడికి వెళ్లాలి.. ఎలా బతకాలి’అంటూ మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనేతర రైతులు తమ గోడు వినిపించారు. తమకు పట్టాలు ఇచ్చేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ డేవిడ్కు గురువారం వినతిపత్రం సమర్పించారు.ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో గిరిజనేతరులకు పట్టా లు ఇచ్చేందుకు సాధ్యం కాని నిబంధనలు విధించింది. దీంతో తమకు పట్టాలు వచ్చే అవకాశం లేదని భావించిన గంగారం, కొత్తగూడ, గూడూరు, బయ్యారం ఏజెన్సీ మండలాలకు చెందిన రైతుల ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ పాటించారు. అనంతరం ట్రాక్టర్లు, ఆటోల ద్వారా పెద్ద ఎత్తున గిరిజనేతరులు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే కలెక్టరేట్కు వెళ్తున్న ర్యాలీని మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న ముఖ్య నాయకులను తమ వాహనాల్లో కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ అదనపు కలెక్టర్ డేవిడ్కు వినతిపత్రం అందజేసేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం తిరిగి వారిని ర్యాలీ వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిజనులతో సమానంగా తమకు కూడా పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పీరయ్య, శ్రీనివాస్రెడ్డి, చల్ల నారాయణరెడ్డి, కొమ్మెనబోయిన వేణు, ఖాసీం, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
యాకమ్మ ఒక గొప్ప వెలుగు
తాళ్లపల్లి యాకమ్మ ఇంట్లో ఎవరూ చదువుకోలేదు. కథలు అంటే తెలియదు. మహబూబాబాద్ దళితవాడలో అర్ధాకలితో పెరిగిన యాకమ్మ తల్లిదండ్రుల్ని కోరింది ఒక్కటే – చదివించమని. ఇంటర్లో పెళ్లయినా ఆ తర్వాత పిల్లలు పుట్టినా యాకమ్మ చదువు మానలేదు. తెలుగులో పిహెచ్డి చేసింది. ఎం.ఏ సంస్కృతం చేసింది. ఆ సమయంలో కథలు చదివి తన బతుకు గోస కూడా కథలుగా రాయాలనుకుంది. రెండు కథాసంపుటాలు, ఒక నవల వెలువరించింది. ‘చదువుకుంటే ఏమవుతుందో నన్ను చూసైనా నా జాతి ఆడపిల్లలు తెలుసుకోవాలని నా తపన’ అంటున్న యాకమ్మ పరిచయం. ‘దళిత ఆడపిల్లలు బాగా చదువుకోవాలి. ఉద్యోగాలు తెచ్చుకోవాలి. ఆర్థికంగా గట్టిగా నిలబడాలి. ఆ తర్వాత రాజకీయ అధికారం కోసం ప్రయత్నించి పదవులు పొంది దళితుల కోసం, పేదల కోసం పని చేయాలి’ అంటారు యాకమ్మ. ఆమె ‘కెరటం’ అనే దళిత నవల రాశారు. అందులోని మల్లమ్మ అనే దళిత మహిళ పాత్ర అలాగే ప్రస్థానం సాగిస్తుంది. కష్టపడి చదువుకుని, ఉద్యోగం పొంది, ఆ తర్వాత సవాళ్లను ఎదుర్కొని సర్పంచ్ అయ్యి, ఆ తర్వాత ఎం.ఎల్.ఏ. అవుతుంది. ‘ప్రజలు’ ఎప్పుడూ ప్రజలుగానే ఉండిపోవడం ఏ కొద్దిమంది మాత్రమే ఎం.ఎల్.ఏనో ఎం.పినో అవ్వాలనుకోవడం ఎందుకు అని యాకమ్మ ప్రశ్న. యాకమ్మది వరంగల్ జిల్లా మహబూబాబాద్. అక్కడికి దగ్గరగా ఉన్న అన్నారంలోని యాకూబ్ షా వలీ దర్గాలో మొక్కుకుంటే పుట్టిందని తల్లిదండ్రులు యాకమ్మ అని పేరు పెట్టారు. ఇంటికి పెద్ద కూతురు యాకమ్మ. ఇంకో చెల్లి. తండ్రి మాదిగ కులవృత్తిని నిరాకరించి దొర దగ్గర జీతానికి పోయేవాడు. తల్లి కూలి పని చేసేది. ఇద్దరూ కూడా తమకు పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు తమలాంటి జీవితం కాకుండా మంచి జీవితం చూడాలని అనుకునేవారు. ముఖ్యంగా తల్లి అబ్బమ్మ తన కూతుళ్లను బాగా చదివించాలనుకునేది. యాకమ్మ కూడా అందుకు తగ్గట్టే చదువును ఇష్టపడేది. అక్కడ పదోతరగతి దాటితే పెళ్లి చేయడం ఆనవాయితీ. యాకమ్మ ఇంటర్కు రాగానే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకున్నారు. యాకమ్మ తల్లిదండ్రులను, భర్తను అడిగింది ఒక్కటే– పెళ్లయ్యాక కూడా చదువు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వమని. మంచినీళ్లు తాగి పెళ్లయ్యాక అత్తగారింట యాకమ్మకు చదువు వీలయ్యేది కాదు. భర్త వీరాస్వామి డ్రైవర్గా పని చేసేవాడు. అతని తోబుట్టువుల రాకపోకలు ఉండేవి. సంపాదన చాలక తినడానికి కూడా ఉండేది కాదు. తల్లిదండ్రులు ఇచ్చిన రెండు జతల బట్టలతోనే కాలేజీకి వెళ్లి డిగ్రీ పూర్తి చేసింది యాకమ్మ. లంచ్బెల్లో స్నేహితురాళ్లు లంచ్ చేస్తుంటే దూరంగా చెట్టు కింద కూచుని మంచినీళ్లు తాగి మళ్లీ తరగతులకు వచ్చేది. ఆకలి ఉన్నా చదువు ఆపలేదు. ఇద్దరు పిల్లలు పుట్టినా చదువు ఆపలేదు. తెలుగులో పీహెచ్డీ యాకమ్మ కాకతీయ యూనివర్సిటీలో పి.జి. ఆ తర్వాత ద్రవిడ యూనివర్సిటీ నుంచి పి.హెచ్.డి. చేసింది. తెలుగు పండిట్గా ఉద్యోగం రావడంతో పిల్లలకు పాఠాలు చెప్పాలంటే సంస్కృతం కూడా తెలిసి ఉండాలని సంస్కృతంలో పి.జి. చేసింది. ఆ సమయంలోనే తన గైడ్ బన్న ఐలయ్య ద్వారా సాహిత్యం తెలిసింది. కథలు చదివే కొద్దీ తన జీవితంలోనే ఎన్నో కథలు ఉన్నాయి ఎందుకు రాయకూడదు అనిపించింది. కాని ఎలా రాయాలో తెలియదు. అయినా సరే ప్రయత్నించి రాసింది. ‘కథలు రాస్తున్నాను’ అని వారికీ వీరికీ చెప్తే ‘ఈమె కూడా పెద్ద రచయితనా? ఈమెకు ఏం రాయవచ్చు’ అని హేళన చేశారు. కానీ వాళ్లే ఆ తర్వాత ఆమె రచనలను అంగీకరించారు. యాకమ్మ కుమార్తె ఎం.బి.బి.ఎస్ చేస్తోంది. కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. భర్త అనారోగ్యం వల్ల పని తగ్గించుకున్నాడు. ఇంటిని, ఉద్యోగాన్ని చూసుకుంటూనే కథను విడవకుండా సాధన చేస్తోంది యాకమ్మ. చదువుకుంటే జీవితాలు మారతాయని తనను చూసి తెలుసుకోండి అని అట్టడుగు వర్గాల ఆడపిల్లలకు ఆమె మాటల ద్వారానో కథల ద్వారానో చెప్తూనే ఉంటుంది. ‘ఆడపిల్లలు చదువుకోవాలి. సమాజాన్ని మార్చాలి. పెళ్లి పేరుతోనో డబ్బులేదనో వారిని చదువుకు దూరం చేయొద్దు’ అంటుంది యాకమ్మ. ఆమె చీకట్లను తరిమికొట్టడానికి విద్యను, సాహిత్యాన్ని ఉపయోగిస్తోంది. యాకమ్మ ఒక గొప్ప వెలుగు. రెండు సంపుటాలు యాకమ్మ 2018 నుంచి రాయడం మొదలుపెట్టింది. కథ వెంట కథ రాసింది. ‘మమతల మల్లెలు’, ‘రక్షణ’ అనే రెండు సంపుటాలు వెలువరించింది. ఆ తర్వాత దళిత నవల ‘కెరటం’ రాసింది. తన జీవితం నుంచి తాను చూసిన జీవితాల నుంచి కథలను వెతికింది. వెతలు తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో వరుసపెట్టి కథలు రాసి ‘దుఃఖ నది’ అనే సంకలనం తెచ్చింది. వెక్కిరించిన వాళ్లు, వివక్ష చూపిన వారు మెల్లగా సర్దుకున్నారు. వరంగల్ జిల్లా మొత్తం ఇప్పుడు యాకమ్మ అంటే ‘కథలు రాసే యాకమ్మేనా’ అని గుర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు పిలుస్తున్నారు. అవార్డులు ఇస్తున్నారు. ఇదీ యాకమ్మ ఘనత. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
చదువులో రాణించలేకపోతున్నానని విద్యార్థిని ఆత్మహత్య
డోర్నకల్: చదువులో రాణించలేకపోతున్నానని మనస్తాపానికి గురైన విద్యార్థిని పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. బొడ్రాయితండాకు చెందిన తేజావత్ శ్వేత(19) ఖమ్మంలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఫస్టియర్లో ఫెయిలవడం, ఇటీవల జరిగిన ఎస్ఐ అర్హత పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఆవేదన చెందింది. చివరకు 16వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగింది. దీంతో శ్వేతను కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించిన అమ్మాయి దూరమవుతోందని...
సికింద్రాబాద్: ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందని భావించిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మహబుబాబాద్ వెల్లికుదురు మండలం వావిలాలకు చెందిన దారావత్ సంతోష్(17) ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నానని, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాడు. 18 ఏళ్లు వయస్సు నిండిన తరువాత పెళ్లి చేస్తామని సంతోష్కు వారి తల్లిదండ్రులు నచ్చజెప్పారు. దీంతో సంతోష్ తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 13న రాత్రి 10 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ హైదరాబాద్ ఎండ్ పిట్లైన్ వద్ద గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నాడు. మృతుని జేబులో లభ్యమైన సెల్ఫోన్ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు) -
ఇద్దరికిద్దరు.. సాహసవీరులు..
-
గులాబీ గూటిలో ముసలం.. ఎంపీకి తలనొప్పిగా మారిన మంత్రి!
ఔను!. వాళ్ళిద్దరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. ఒకే సామాజిక వర్గానికి చెందిన మహిళా నేతలు. ఒకరు మంత్రి అయితే మరొకరు ఎంపీ పైగా అధికార పార్టీ జిల్లా అధ్యక్షురాలు. ఒకే ప్రాంతం నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు నేతలు పైకి ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా, అంతర్గతంగా రాజకీయంగా రగిలిపోతున్నాట. ఇద్దరి మద్య ఆధిపత్యపోరు పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తుందట. ఎవరా నేతలు... ఎందుకు వారి మధ్య కోల్డ్ వార్.. మానుకోటగా పేరొందిన మహబూబాబాద్ జిల్లాలో అధికారపార్టీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికారపార్టీ టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులే జిల్లాను ఏలుతున్నారు. మంది ఎక్కువైతే పెరుగు పలుచనైనట్లు అంతా అధికారపార్టీ ప్రజాప్రతినిధులే కావడంతో ఇక వారికి ఎదురే ఉండదనుకుంటాం. కానీ అక్కడ మాత్రం ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితి నెలకొంది. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఇద్దరు ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు ఉన్నా ఆ జిల్లాలో ఇద్దరు మహిళా నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతుందట. చదవండి: ఎమ్మెల్యేకు ఊహించని ఫోన్ కాల్.. టీఆర్ఎస్ గెలుస్తుందా సార్ అంటూ.. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత బయట ఎక్కడ కలిసినా, కార్యక్రమాల్లో పాల్గొన్నా...ఇద్దరు చాలా క్లోజ్గా కనిపిస్తారు. వారిని చూసిన వారెవ్వరైనా...వారి మధ్య విభేదాలు ఉన్నాయంటే అసలు నమ్మరు. బయటకు ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా ఆధిపత్యం కోసం అంతర్గంతంగా యుద్ధమే సాగిస్తున్నారట. మూడోసారి కేసిఆర్ సీఎం కావాలని ఏకంగా మంతి సత్యవతి రాథోడ్ పాదరక్షలు లేకుండా నడిచే దీక్ష చేపట్టగా, బయ్యారం ఉక్కు పరిశ్రమకై కవిత ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేస్తూనే రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని లోలోపల రగిలిపోతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే తమ రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ తమ పంతం నెగ్గించుకునే పనిలో పడ్డారట. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మహబూబాబాద్ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ గతంలో తెలుగుదేశం నుంచి డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకముందు తెలుగుదేశం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి రెడ్యానాయక్పై ఓటమిపాలయ్యారు. చివరకు టిఆర్ఎస్లో చేరగా చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సైతం టిఆర్ఎస్లో చేరాడంతో సత్యవతి రాథోడ్కు స్థానం లేకుండా పోయింది. 2018లో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్కే గులాబీ దళపతి టిక్కెట్ ఇచ్చి, సత్యవతి రాథోడ్ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి అప్పగించారు. చిరకాల రాజకీయ ప్రత్యర్ధులు ఒకే పార్టీలో ఉండడంతో గులాబీ బాస్ సమన్యాయం చేసినప్పటికీ సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్ కుటుంబాల మధ్య సఖ్యత లేని పరిస్థితే కనిపిస్తుంది. మంత్రి సత్యవతి రాథోడ్ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇరు కుటుంబాలు రాజకీయంగా పై చేయి సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మహబూబాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత రెడ్యానాయక్ కూతురు. కవిత, రెడ్యానాయక్ వారసురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మహిళా నేతల్లో ఎంపీ కవితకు చురుకైన నాయకురాలిగా గుర్తింపు ఉంది. అయితే తన తండ్రి రెడ్యానాయక్, మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య ఉన్న బేదాభిప్రాయాలు కవితకు తలనొప్పిగా మారాయి. అంతేకాదు కవిత కూడా మంత్రి సత్యవతి రాథోడ్ తో విభేదించే పరిస్థితిని తెచ్చిపెట్టాయి. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ డోర్నకల్ నియోజకవర్గమే కాకుండా...మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఇద్దరూ పోటీపడుతున్నారు. ఎంపీ కవిత పార్టీ అధ్యక్షురాలిగా మహబూబాబాద్ పరిమితం అయినా.. ఎంపీ పరిధి మాత్రం ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఉండడంతో ఆమె కూడా తరచూ ఆ ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఇక సత్యవతి రాథోడ్...మహబూబాబాద్తో పాటు, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు ఇంచార్జీ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇద్దరు మహిళా నేతలు కలిసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎప్పుడు పరస్పర విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు. కానీ, బహిరంగంగా ఎక్కడా బయటపడకున్నా, అంతర్గతంగా విభేదాలు పొడచూరినట్టు సమాచారం. పర్యటనలు, కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసే ఉంటున్నా...ఎవరి కేడర్ను వారు ప్రోత్సహిస్తున్నట్టు చర్చ నడుస్తోంది. ఆధిపత్యం కోసం అనుచరగణాన్ని ప్రోత్సహిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు అసలు కారణం రాబోయే ఎన్నికలని ప్రచారం జరుగుతోంది. రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్ చిరకాల ప్రత్యర్థులు కావడం ఒకటైతే, మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలపై కన్నేశారని, వచ్చే ఎన్నికల్లో ఎదో ఒక స్థానం నుంచి టికెట్ దక్కించుకుని పోటీచేస్తారన్న చర్చసాగుతుంది. డోర్నకల్ నుంచి రెడ్యానాయక్ ఉండగా, మహబూబాబాద్ నుంచి ఎంపీ కవిత ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారట. అందుకే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నాయక్తో కవితకు విభేదాలు ఉన్నాయి. రెండు నియోజకవర్గాల నుంచి రెడ్యానాయక్ కుటుంబంతో మంత్రి సత్యవతి రాథోడ్కు చెక్ పడే అవకాశం ఉండడంతో ఇప్పటినుంచే తమ ప్రయత్నాలను ముమ్మరం చేసి రాజకీయంగా పై చేయి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారట. శంకర్ నాయక్తో కవితకు చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారట. పైకి అంతా కలిసి ఉన్నట్లు కనిపిస్తున్న రాజకీయంగా మంత్రి ఎంపీ ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్ సాగుతుంది. మానుకోట గులాబీ గూటిలో అంతర్గత వైరం అధిష్టానం దృష్టికి సైతం వెళ్ళింది. కానీ ఎక్కడా విభేదాలు ఉన్నట్లు బయట పడకుండా జాగ్రత్త పడుతూ చాప కింద నీరులా ఒకరిపై మరొకరు పై చేయి సాధించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసి పార్టీ క్యాడర్ తమ వైపు తిప్పుకొని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలని చూస్తున్నారట. మానుకోటలో అధికారం పార్టీలో నాయకుల రాజకీయాలను నిశ్చితంగా గమనిస్తున్న గులాబీ దళపతి రెండు కుటుంబాలు ఇద్దరు మహిళా నేతలకు ఏ విధంగా న్యాయం చేస్తారోనని పార్టీ శ్రేణులతో పాటు స్థానికులు చర్చించుకుంటున్నారు. మానుకోట గులాబీ గూటిలో ముసలం ఎటువైపు దారి తీస్తుందోనని జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
భూ సమస్య పరిష్కరించడం లేదని మహిళ ఆత్మహత్యాయత్నం
నర్సింహులపేట: భూ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని, పరిష్కరించడం లేదని ఓ మహిళ ఆత్మ హత్యాయత్నం చేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో జరిగింది. బాధితురాలు సుంకరి సరిత తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన సుంకరి వెంకనర్సు, కిష్టమ్మలకు కుమారులు సుంకరి లక్ష్మయ్య, నారాయణ, భద్రయ్య, సోమయ్య, సాంబయ్య. వీరికి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 1127, 1128, 1129లో 2.10 ఎకరాల భూమి ఉంది. వాటాల ప్రకారం సుంకరి భద్రయ్య, వెంకటమ్మలకు రావాల్సిన 20 గుంటల భూమిని సుంకరి సుధాకర్, సుంకరి సాంబయ్యలు 10 గుంటల చొప్పున తెలియకుండా రికార్డుల్లో ఎక్కించుకున్నారు. తన తల్లిదండ్రుల భూమిని తన పేరుమీదకు మార్చుకోవాలని సరిత ఏడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతోంది. పట్టించుకోకపోవడంతో విసుగుచెందిన ఆమె.. సోమవారం కార్యాల యానికి వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. అక్కడే ఉన్న సిబ్బంది అమెను అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై మంగీలాల్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, తహసీల్దార్ వివేక్తో కలిసి భూ సమస్యపై సరితతో మాట్లాడారు. తన తల్లిదండ్రులకు ఒక్కతే కుమార్తెనని, వారు చనిపోవడంతో, ఆ భూమిని తమ పేర ఎక్కించాలని మొరపెట్టుకుంటున్నా వినడం లేదని సరిత తెలిపింది. ఈ విషయంపై తహసీల్దార్ను వివరణ కోరగా, ఈ సమస్య కోర్టు పరిధిలో ఉందని, కోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
మహబూబాబాద్ : కేసముద్రం వద్ద బావిలోకి దూసుకెళ్లిన కారు
-
తీవ్ర విషాదం: బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన..
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని కేససముద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డుపక్కనే ఉన్న పాడుబడిన బావిలోకి ఓ కారు దూసుకెళ్లింది. కాగా, ప్రమాదం జరిగిన సందర్భంలో కారులో ఏడుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. వివరాల ప్రకారం.. బాణోత్ భద్రునాయక్ కుటుంబ సభ్యులు భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి నుంచి అన్నారం షరీఫ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ప్రమాదానికి గురైన సమయంలో బాణోత్ భద్రునాయక్, ఆయన భార్య సుమలత, కొడుకు దీక్షిత్తో పాటు డ్రైవర్ గుగులోతు బిక్కు, ఆయన కోడలు అచ్చాలి సహా మరో ఇద్దరు మహిళలున్నారు. కాగా, కారు ప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరు మహిళల మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదం నుంచి డ్రైవర్ గుగులోతు బిక్కు, ఆయన కోడలు ఆచాలి ప్రాణాలతో బయటపడ్డారు. బావిలో ఉన్న బానోతు భద్రునాయక్ ఆయన భార్య సుమలత, కొడుకు దీక్షిత్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీస్తున్నారు. -
అబ్బాయి మైనర్, అమ్మాయి మేజర్.. ప్రేమించి మోసం చేశాడని!
సాక్షి, మహబూబాబాద్: అబ్బాయి మైనర్. అమ్మాయి మేజర్. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండా శివారు చర్లతండాకు చెందిన బోడ సౌజన్య బుధవారం తేజావత్ రాంసింగ్ తండాలోని ప్రియుడు(మైనర్) ఇంటి ఎదుట బైఠాయించింది. సౌజన్య, తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన ఓ మైనర్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నారు. గతేడాది వీరి మధ్యన మనస్పర్థలు వచ్చాయి. అనంతరం మైనర్ ఆమెను పెళ్లి చేసుకోనన్నాడు. దీంతో సౌజన్య పోలీసులను ఆశ్రయించింది. అతడిని మైనర్గా గుర్తించిన పోలీసులు పెద్దల సమక్షంలో మాట్లాడుకోమని యువతికి సలహా ఇచ్చారు. దీంతో అతడు మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని, అప్పటి వరకు ఒకర్నొకరు కలుసుకోవద్దని పెద్దల సమక్షంలో పత్రాలు రాసుకున్నారు. అయినప్పటికీ అప్పుడప్పుడూ కలుసుకుంటూ వచ్చారు. ఇటీవల మైనర్ తన ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడం లేదని యువతితో చెప్పాడు. చదవండి: Shamshabad: వాట్సాప్లో అమ్మకం.. గేదెల ఫొటోను చూపించి.. దీంతో నాలుగు రోజుల క్రితం సౌజన్య అతడి ఇంటికి వచ్చింది. మూడ్రోజులు అతడి ఇంట్లోనే ఉంది. మంగళవారం ఉదయం సౌజన్యను బయటికి నెట్టి ఇంటికి తాళం వేసి కుటుంబీకులు వెళ్లిపోయారు. ఈవిషయాన్ని ఆమె చర్లతండాలోని తన తల్లిదండ్రులతో పాటు బంధువులకు చెప్పుకొని, అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. విషయం తెలుసుకున్న గూడూరు పోలీసులు ఆరా తీశారు. మైనర్ మరో ఏడాది తర్వాతైనా తనను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవాలని, లేదంటే తాను అదే ఇంటి ఎదుట ఆత్మహత్యకు పాల్పడుతానంటూ ఆమె బైఠాయించింది. ఈవిషయమై పోలీసులను వివరణ కోరగా.. మేజర్ అయిన ఆమె మైనర్తో పెళ్లి కావాలంటే తామెలా చేస్తామని, పరారీలో ఉన్న మైనర్, అతడి తల్లిదండ్రులను రప్పించి సమస్యను పరిష్కరించుకోమని గ్రామపెద్దలకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. -
పీఈటీ సార్ కొడతారనే భయం.. సైకిల్పై 65 కిలోమీటర్లు వెళ్లి..
సాక్షి, వరంగల్, ఖమ్మం: పాఠశాలకు ఆలస్యంగా వెళ్తే పీఈటీ కొడతారనే భయంతో సైకిల్పై 65 కిలోమీటర్లు ప్రయాణించిన ఒక బాలుడిని పోలీసులు తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ గండ్రాతి సతీష్ తెలిపిన వివరాలివి. ఖమ్మానికి చెందిన 12 ఏళ్ల కుషాల్ రాజా అదే ప్రాంతంలోని వండర్ కిడ్స్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. రోజూ సైకిల్పై పాఠశాలకు వెళ్లే రాజా బుధవారం ఆలస్యం అయ్యాడు. దీంతో పీఈటీ దండిస్తారని భయపడి పాఠశాలకు వెళ్లకుండా ఖమ్మం నుంచి సైకిల్ తొక్కుతూ 65 కిలోమీటర్లు ప్రయాణించి తొర్రూరు మండలం మాటేడుకు బుధవారం రాత్రి చేరుకున్నాడు. చీకట్లో ఎటు వెళ్లాలో తెలియక ఏడుస్తున్న బాలుడిని చూసి స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారమిచ్చారు. కానిస్టేబుల్ రాజు బాలుడి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని వారికి సమాచారం అందించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సతీష్ బాలుడికి కౌన్సెలింగ్ చేసి అల్పాహారం పెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు. -
అయ్యో ఇలా అయితే ఎలా.. ప్రకటించిన రోజే పార్టీ పేరు మార్చేస్తే..
సాక్షి, తొర్రూరు: సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ పేరును రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మరిచిపోయారు. బుధవారం రాత్రి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు దసరా ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పెట్టిన కొత్త పార్టీ ఏమిటని.. ప్రజలను ప్రశ్నించగా.. ఒకరు బీఎస్పీ అని సమాధానమిచ్చారు. మంత్రి సైతం బీఆర్ఎస్ బదులు బీఎస్పీ అని పలకడం విశేషం. ఆయన పార్టీ పేరు మరిచిపోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: (KCR BRS Party: 'బీఆర్ఎస్ అభ్యర్థులతో పోటీ చేయించబోం') -
పోగొట్టుకున్న చోటనే వెతకాలి..!
సాక్షి, మహబూబాబాద్: ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎర్రబంగారం పండిస్తే సిరులు కురుస్తాయని ఆశపడి మిర్చి సాగు చేసిన రైతులకు తామర పురుగు, నల్లిపురుగు, పేను బంక పురుగు చుక్కలు చూపించాయి. దుక్కి దున్నడం నుంచి ఏపుగా పెరిగి.. కాత, పూత సమయంలో ఈ మాయదారి పురుగు రావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 70 శాతానికి పైగా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు నష్టాల పాలయ్యారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 24 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది మిరప పూతకు ఆశించిన తామర పురుగు(ఫైల్) తగ్గేదేలే అంటూ మిర్చి సాగు.. గత ఏడాది మిర్చి పంట సాగుచేసి నష్టపోయినా.. రైతులు మాత్రం తగ్గేదే లేదు అన్నట్లు మళ్లీ ఈ ఏడాది కూడా అదే పంట సాగుచేసేందుకు పోటీ పడుతున్నారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3,88,182 ఎకరాల్లో మిర్చి సాగుచేశారు. ఇందులో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1,03,537 ఎకరాల్లో సాగుచేయగా.. మహబూబాబాద్ జిల్లాలో 82,434 ఎకరాలు, జోగుళాంబ గద్వాలలో 35,309, భద్రాద్రి కొత్తగూడెంలో 32,375, జయశంకర్ భూపాలపల్లిలో 30,499 ఎకరాలు సాగుచేశారు. గత ఏడాది నష్టాలను చూసిన అధికారులు.. ఈ ఏడాది మిర్చి సాగుచేసే వారు పెద్దగా ఉండరని భావించారు. కానీ వారి అంచనాలు తారుమారు చేసి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా, మహబూబాబాద్లో 70 వేల ఎకరాలకు పైగా, భద్రాద్రి కొత్తగూడెంలో 28 వేల ఎకరాలపైగా సాగుచేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2.5 లక్షల ఎకరాలకు పైగా సాగుచేశారని, ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది 2 లక్షలు నష్టం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(సీ) గ్రామానికి చెందిన రైతు సోమిరెడ్డి లక్ష్మయ్య గత ఏడాది ఎకరం భూమిలో మిర్చి సాగు చేశాడు. రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పంటకు వైరస్ సోకింది. అనేక మందులను పిచికారీ చేశాడు. అయినా ఫలితం దక్కలేదు. పెట్టుబడితోపాటు భార్యాభర్తల కష్టం సైతం నేలపాలైంది. ఇతర పంటలు వేస్తే కలిసి రాదనే భావనతో లక్ష్మయ్య ఈ ఏడాది కూడా మిర్చి పంట వేశాడు. ఇప్పటివరకు రూ.70వేలు ఖర్చు చేశాడు. తోటలో అక్కడక్కడా బొబ్బరోగం కనిపిస్తోంది. తామర పురుగు కూడా ఆశిస్తే పెట్టుబడి అప్పులు కుప్పలుగా పేరుకుపోయే ప్రమాదం ఉంది. సాఫీగా పంట పండితే అప్పులు తీరుతాయని లక్ష్మయ్య చెప్పాడు. వేరే పంట వేయలేక.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన రైతు మడికంటి శ్రీను గత ఏడాది మూడు ఎకరాల్లో మిర్చి సాగుచేశాడు. రూ.మూడు లక్షల పెట్టుబడి పెట్టాడు. కానీ మూడు క్వింటాళ్ల మిర్చికూడా పండలేదు. దీంతో చేసిన కష్టంపోగా పెట్టుబడి అప్పుగానే మిగిలింది. ‘వేరే పంట వేయలేక.. నష్టపోయిన మిర్చి పంటవేసి పోగొట్టుకున్న చోటనే వెతకాలి.. తాడోపేడో.. తేల్చుకునేందుకు ఈ ఏడాది కూడా మూడెకరాల్లో మిర్చి పంట వేశా’నని శ్రీను చెప్పాడు. జాగ్రత్తలు పాటిస్తే పంటను రక్షించుకోవచ్చు మిరప పంటను ఆశించే నల్లతామర పురుగుకు మందులేదు. కానీ జాగ్రత్తలు పాటించి, సస్యరక్షణ చర్యలు చేపడితే పంటను రక్షించుకోవచ్చు. పంట చుట్టూ జొన్న, సజ్జ పంటలు రెండు మూడు వరుసల్లో వేసుకోవాలి. నత్రజని ఎరువులు మోతాదుకు మించి వాడొద్దు. నీలిరంగు జిగురు అట్టలు ఎకరాకు 40 చొప్పున పెట్టుకోవాలి. వేపనూనె, కానుగ నూనె, పలుసార్లు పిచికారీ చేయాలి. జీవ నియంత్రణ కారకాలు, భవేరియా బాసియానా లేదా లెకానిసీలియం లెకానీని తగిన మోతాదుల్లో స్ప్రే చేయాలి. తామర పురుగు నివారణకు వాడే పురుగు మందులు ఒకే మందును పలుమార్లు కొట్టొద్దు. ఎప్పటికప్పుడు మందు మార్చాలి. నాటిన 15వ రోజు, 45వ రోజున ఫిప్రోనిల్ గుళికలను వేయాలి. – కె.భాస్కర్, ఉద్యాన శాస్త్రవేత్త, (జేవీఆర్ ఉద్యాన పరిశోధనా కేంద్రం, మల్యాల) ఇదీ చదవండి: తెలంగాణలో ‘స్పినోడాన్’ శిలాజాలను గుర్తించిన శాస్త్రవేత్తలు -
లేవరా.. ఒక్కసారి నన్ను చూడరా!
కేసముద్రం: ‘లేవరా.. ఒక్కసారి నన్ను చూడరా. బాయి కాడికి పోదాం’అంటూ ఓ తండ్రి కుమారుడి మృతదేహాన్ని హత్తుకుంటూ గుండెలవిసేలా రోదించాడు. కోతుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు తన వరి పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ అభంశుభం తెలియని బాలుడిని బలితీసుకుంది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మర్రితండాలో సోమవారం చోటుచేసుకుంది. మర్రితండాకు చెందిన వాంకుడోతు నీల, బాసు దంపతులకు ఇద్దరు కుమారులు అశోక్, జీవన్(14) ఉన్నారు. చిన్నకుమారుడు జీవన్ చదువు మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. తోటిమిత్రులతో కలిసి జీవన్ మేకలను మేపేందుకు ఊరి చివరకు వెళ్లాడు. ఇదే గ్రామ శివారు చెరువు ముందు తండాకు చెందిన వాంకుడోతు బిచ్చు అనే రైతు, తన వరి పొలం చుట్టూ విద్యుత్ తీగను ఏర్పాటు చేశాడు. పొలం వైపుగా మేకలు వెళ్లకుండా చూసేందుకని అటుగా వెళ్లిన జీవన్ కాలుకు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తాకడంతో షాక్కు గురై వెంటనే కుప్పకూలిపోయాడు. గమనించిన మిత్రులు వాంకుడోతు గణేశ్, నవీన్, సూర్య అతన్ని బయటకు తీసేందుకు యత్నించగా, వారికి స్వల్పంగా విద్యుత్ షాక్ కొట్టడంతో భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ఇంతలో జీవన్ పంటపొలంలోనే మృతి చెందాడు. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపడంతో బోరున విలపిస్తూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పంట యజమాని బిచ్చు ఇంటి ముందు జీవన్ మృతదేహాన్ని ఉంచి కుటుంబసభ్యులు, తండావాసులు ఆందోళన చేశారు. పోలీసులు వచ్చి బాధితులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ‘కరెంటుతీగ పెట్టి మా బిడ్డను కడుపున పెట్టుకున్నారు సార్.. మాకు న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు పోలీసుల కాళ్లపై పడి వేడుకున్నారు. చివరకు కుటుంబసభ్యులను, తండావాసులకు సర్దిచెప్పి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. కంటతడి పెట్టించిన తల్లిదండ్రుల రోదన అప్పటి వరకు ఇంట్లో సరదాగా గడిపిన జీవన్ గంటల వ్యవధిలోనే శవమై కనిపించడంతో తల్లిదండ్రులైన నీలా, బాసు రోదించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. బిడ్డా ఒక్కసారి లేవరా అంటూ ఆ తల్లి రోదించిన తీరు హృదయాలను బరువెక్కించింది. ’ -
భార్య గొంతుకోసి హత్య
మహబూబాబాద్ రూరల్: మద్యానికి బానిసై విచక్షణ కోల్పోయిన ఓ భర్త మాంసం కోసే కత్తి తో భార్య గొంతుకోసి దారుణంగా చంపాడు. మహబూబాబాద్ అడ్వొకేట్స్ కాలనీ కట్టెలమండి సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ ఎడ్లపల్లి సతీష్, మృతురాలి బంధువులు తెలిపిన ప్రకారం.. మహబూబాబాద్లోని భవానినగర్ తండాకు చెందిన జాటోతు భాస్కర్, కల్పన (27).. 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి స్వరూప, రిషిత, వర్షిత సంతానం. జిల్లా కేంద్రంలోని ఓ మాంసం దుకాణంలో భాస్కర్ గుమాస్తాగా పనిచేస్తుండగా, కల్పన పలువురి ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. భాస్కర్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఐదు రోజులుగా కల్పన తల్లిగారి ఇంటి వద్దే ఉంటోంది. గురువారం ఉదయం కల్పన అడ్వొకేట్స్ కాలనీలోని ఇళ్లలో పనికి వెళ్తుండగా.. రోడ్డుపై ఆమెతో భాస్కర్ ఘర్షణకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న భాస్కర్.. భార్య మెడలోని పుస్తెల తాడును తెంపి.. కత్తితో గొంతుకోసి పారిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కల్పన అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి తమ్ముడు మాలోతు చందు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. పిల్లలు పుట్టక ముందు వరకు మంచిగా ఉన్నారని, ఆ తర్వాత తరచూ కల్పనతో భాస్కర్ గొడవ పడుతుండేవాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాగడానికి డబ్బులు ఇవ్వమని అడుగుతూ, మద్యం తాగొచ్చి అసభ్యకరంగా దూషిస్తూ కొట్టేవాడని వెల్లడించాడు. కాగా, భార్యాభర్తల గొడవతో కొద్దిరోజులుగా కల్పన తల్లి వద్దే పిల్లలు ఉంటున్నారు. స్వరూప 8వ తరగతి, రిషిత ఆరో తరగతి, వర్షిత రెండో తరగతి చదువుతున్నారు. తల్లి చనిపోవడం.. తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయనుండటంతో పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
అప్పులబాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
మహబూబాబాద్ రూరల్/చెన్నారావుపేట: ఆ రైతు కుటుంబాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. అప్పు తెచ్చి వైద్యం చేయించుకున్నారు. ఎలాగోలా బతికి బయటపడిన ఆ రైతు పంటల సాగుకు మరికొంత అప్పు చేశాడు. అయితే ఆశించిన రీతిలో పంట పండక అప్పుల భారం నెత్తినపడింది. తీర్చేదారి లేక ఆ ఇంటి పెద్ద పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా లక్ష్మతండా గ్రామ పంచాయతీ పరిధిలోని బూరుకుంట తండాలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన ధరంసోత్ రాములు నాయక్ (58)కు 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కుటుంబం మొత్తానికి కరోనా రావడంతో వైద్యం కోసం అప్పు చేశాడు. మిర్చి, పత్తి పంటల సాగుకు మరికొంత అప్పు తెచ్చాడు. మొత్తంగా రూ.15 లక్షల వరకు అప్పులయ్యాయి. కానీ పంటల దిగుబడి రాలేదు. అప్పుల భారంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం ఉదయం ఇంటి సమీపంలోని వ్యవసాయ భూమిలో పురుగు మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాములు నాయక్ రాత్రి 9 గంటల సమయంలో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో మరో రైతు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామానికి చెందిన ఎడ్ల బొంద్యాలు (65)కు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఐదో కుమార్తెకు గత ఏడాది వివాహం చేశాడు. ఇందుకోసం రూ.4 లక్షలు, వ్యవసాయానికి మరో రూ.లక్ష అప్పు చేశాడు. అయితే పంటలు సరిగా పండక, అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో.. తీర్చలేనని మనస్తాపానికి గురై ఈ నెల 15న ఇంట్లోనే పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఆయన మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
న్యూట్రీఫెర్మ్తో గుడుంబా తయారీ.. తాగితే ప్రాణాలు పోవడం ఖాయం!
కొత్తగూడ(మహబూబాబాద్ జిల్లా): ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు, గిరిజనులు మొదట సహజసిద్ధమైన ఇప్పపువ్వుతో గుడుంబా తయారు చేసుకుని తాగేవారు. క్రమంగా బెల్లం, పటిక, యూరియాతో తయారుచేసి గుడుంబాను విక్రయించారు. అయితే నల్లబెల్లం విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో కొన్ని రోజులు చక్కెర వినియోగించారు. కాగా బెల్లంతో అయినా చెక్కెరతో అయినా గుడుంబా తయారీలో పటిక క్రీయాశీలకంగా మారింది. కాగా పటిక దొరక్కపోవడంతో తయారీదారులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. న్యూట్రీఫెర్మ్ స్ప్రే మందుతో గుడుంబా తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చదవండి: ప్రగతి భవన్లో మంత్రి ‘కేటీఆర్’ ఎమోషనల్ సీన్.. 500గ్రాముల ప్యాకెట్తో 20సీసాలు.. పటిక దొరక్కపోవడంతో తయారీదారులు కొత్తదారిలో వెళ్తున్నారు. 500గ్రాముల ప్యాకెట్తో 20 సీసాల గుడుంబా వస్తోంది. దీనికి బెల్లం, చక్కెర, పటికతో పనిలేదు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టుకునే అవకాశం లేదు. యథేచ్ఛగా తీసుకెళ్లవచ్చు. మిర్చి, పత్తిలాంటి ఆరుతడి పంటల ఎదుగుదలకు న్యూట్రీఫెర్మ్ అనే మందు ఫర్టిలైజర్ షాపుల్లో దొరుకుతుంది. ఓ ప్యాకెట్ తీసుకుని ఒక డ్రమ్ములో సగం నీరు పోసి కలియబెట్టి రెండు రోజులు నానబెడతారు. మూడోరోజు గుడుంబా తయారు చేసే విధంగానే బట్టీ పెడతారు. సాధారణంగా గుడుంబా తయారు చేయడాని వారం రోజులు పడుతుంది. దీనికి రెండు రోజులే సమయం పట్టడం, అధికారులు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో తయారీదారులు గుట్టుచప్పుడు కాకుండా న్యూట్రీఫెర్మ్ గుడుంబా తయారు చేస్తున్నారు. వాపు వస్తున్న ముఖాలు.. పంటలపై స్ప్రే చేసే మందుతో తయారుచేసే గుడుంబా వల్ల తయారీదారుల ముఖాలు వాపు వస్తున్నట్లు తెలిసింది. ముఖాలు వాస్తున్నా లాభాల కోసం గుడుంబా తయారీని వారు మానడం లేదు. అయితే తయారీదారుల పరిస్థితి ఇలా ఉంటే తాగే వారి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. తాగిన వారి అవయవాలు త్వరగా పాడైపోయి మృత్యువుకు దగ్గర కావడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. గుడుంబాతో ఎక్కువ లాభాలు ఉండడంతో కొందరు కుటీర పరిశ్రమగా మార్చుకున్నారు. వీరిపై ఎన్ని కేసులు బనాయించినా గుడుంబా తయారీని మాత్రం మానడం లేదు. నాజీతండా కేంద్ర బిందువు..? నూతన గుడుంబా తయారీ విధానానికి వరంగల్ జిల్లా ఖానాపురం మండలం నాజీతండా కేంద్ర బిందువు అని తెలుస్తోంది. ఈ గ్రామంలో గుడుంబా తయారు చేసి పలు గ్రామాలకు సరఫరా చేయడంతో పలు కేసులు నమోదయ్యాయి. మూడు మండలాల సరిహద్దు గ్రామం కావడంతో పోలీసుల నిఘా తక్కువ. ఎక్సైజ్ అధికారులకు తండావాసులు భయపడకపోవడం గమనార్హం. ఖానాపురం మండలంలోని పలు గ్రామాలతో పాటు జిల్లాలోని కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాల్లో దాదాపు అన్ని గ్రామాలకు ములుగు జిల్లా పస్రా మండలంలోని పలు గ్రామాలకు ఇక్కడి గుడుంబా సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఇక్కడి మహిళలు గుడుంబా తయారు చేస్తారు. చిన్నచిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి భార్యభర్తలు ద్విచక్రవాహనాల ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తారు. మధ్యలో ఎవరైనా ఆపి తనిఖీ చేసేందుకు యత్నిస్తే మహిళలు అరవడం, గోల చేయడం, తమపై అత్యాచారయత్రం చేకస్తున్నారని గగ్గోలు చేసి అధికారులను భయానికి గురిచేస్తారు. మద్యం ధరలు పెరగడంతో.. ప్రభుత్వం మద్యం ధరలను పెంచడంతో రోజువారి కూలీలు, వ్యవసాయదారులు గుడుంబా తాగడానికి మొగ్గు చూపుతున్నారు. పొద్దంతా పొలం పనులు చేసి రాత్రి సమయంలో అధికంగా వెచ్చించి మద్యం తాగలేక చాలా మంది గుండుబా తాగుతున్నారు. అయితే నూతన గుడుంబా తయారీ విధానం వారికి తెలియకే తాగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ప్రాణాలకే ప్రమాదం గుడుంబా దేనితో తయారు చేసినా తాగడం ప్రాణాలకే ప్రమాదం. ఇంకా స్ప్రే మందుతో తయారు చేసిన గుడుంబాను అస్సలు తాగొద్దు. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది రోగుల్లో గుడుంబా కారణంగా కిడ్నీలు, లివర్, గుండె ఇతర అవయవాలు దెబ్బతినడం గమనిస్తున్నాం. దీని ప్రభావం పేగులపై కూడా పడుతుంది. –రవీందర్నాయక్,అసిస్టెంట్ ప్రొఫెసర్, మానుకోట మెడికల్ కాలేజీ కఠిన చర్యలు తీసుకుంటాం గుడుంబాను అరికట్టేందుకు బెల్లం, పటిక రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేశాం. స్ప్రే మందులతో గుడుంబా తయారీ నా దృష్టికి రాలేదు. ఇక నుంచి వాటిపై కూడా దృష్టి పెడుతాం. ప్రాణాలకే ప్రమాదం అని తెలిసినా తయారు చేయడం, తాగడం సరైంది కాదు. ప్రజలు చైతన్యవంతులై గుడుంబాను నిషేధించడంతో పాటు ఎక్కడ గుడుంబా తయారు చేసినా సమాచారం అందించాలి. –నగేష్, ఎస్సై -
మరణించిన వ్యక్తికి.. బూస్టర్ డోస్
బయ్యారం(వరంగల్): మరణించిన వ్యక్తికి బూస్టర్ డోస్ వేసినట్లు ఆరోగ్యశాఖ నుంచి మెసేజ్ వచ్చింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. మండల కేంద్రానికి చెందిన బొందలపాటి కృష్ణయ్య(87) అనారోగ్యంతో గత నెల 28న మృతి చెందాడు. అంతకుముందు కృష్ణయ్య సంగారెడ్డి జిల్లా పరిధిలో నివాసం ఉండేవారు. కోవిడ్ టీకా రెండు డోసులూ సంగారెడ్డి జిల్లా బానూర్ పీహెచ్సీ పరిధిలో వేసుకున్నాడు. అయితే ఈనెల 17న క్రిష్ణయ్యకు బూస్టర్డోస్ వేసినట్టు సెల్ఫోన్కు మెసేజ్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యానికి గురై ఆన్లైన్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పరిశీలించారు. అందులోనూ బూస్టర్డోస్ వేసినట్టు ఉంది. -
రష్యా అగ్ని పర్వతంపై మెరిసిన త్రివర్ణం
మరిపెడరూరల్/ముషీరాబాద్: గిరిజన సాహసికుడు యశ్వంత్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. రష్యాలోని 5,642 మీటర్ల ఎత్తయిన ఎల్బ్రస్ అగ్ని పర్వతాన్ని అధిరోహించాడు. పర్వత శ్రేణిపై భారత జాతీయ పతకాన్ని ఎగురవేసి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన భూక్య రాంమ్మూర్తి, జ్యోతి దంపతుల కుమారుడు యశ్వంత్కు చిన్నప్పటి నుంచే పర్వతారోహణ అంటే ఇష్టం. గతేడాది జూన్లో జమ్మూకశ్మీర్లోని 5,602 మీటర్ల ఎత్తయిన ఖార్డుంగ్లా పర్వతాన్ని, ఆగస్టులో ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. ఈ ఏడాది జూన్లో హిమాచల్ ప్రదేశ్లోని ఎత్తయిన యునామ్ మంచు పర్వత శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. ఈ క్రమంలో ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ కంపెనీ వారు యశ్వంత్ను రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతారోహణకు ఎంపిక చేశారు. యశ్వంత్ 5,642 మీటర్ల ఎత్తయిన ఈ అగ్ని పర్వతాన్ని ఇటీవలే అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. -
కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడి, బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని ఆ పార్టీ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ అన్నారు. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా దంతాలపల్లిలోని పీహెచ్సీని ఆయన ఆదివారం సందర్శించారు. తొలుత కురవిలో వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వీఆర్ఎన్ గార్డెన్లో లోక్సభ ప్రవాస్ యోజన కోర్ కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. బీజేపీ అభివృద్ధి పథకాలను తెలంగాణలో పూర్తిస్థాయిలో అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ పథకం నేరుగా లబ్ధిదారులకు చేరుతోందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద కోట్లాది మంది పేదలు ఇళ్లు నిర్మించుకుంటున్నారని తెలిపారు. కోవిడ్ సమయంలో దేశంలోని ప్రజలకు వ్యాక్సిన్ అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారని, ఫ్రీ రేషన్తో పేదలందరికీ ఆహార భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి వంటివాటిని నేటికీ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
ప్రేమ పేరుతో లొంగదీసుకొని.. ప్రియుడు మోసం చేశాడంతో
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అజ్మీరతండా గ్రామ పంచాయతీ పరిధి దారావత్తండాకు చెందిన భూక్య అనూష(18) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అనూష మహబూబాబాద్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. అదే తండాకు చెందిన దారావత్ శేఖర్ ట్రాక్టర్ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అనూష, శేఖర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలో శేఖర్ పెళ్లి చేసుకుంటానని అనూషను నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈవిషయం ఇటీవల యువతి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు శేఖర్ తల్లిదండ్రులతో మాట్లాడారు. అనూష తల్లిదండ్రులు వారిద్దరికీ పెళ్లి చేద్దామన్నారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు ఒక్కసారిగా కోపోద్రుక్తులై దుర్భాషలాడారు. ఇదే విషయంపై యువకుడిని నిలదీయగా.. అతను కూడా ముఖం చాటేశాడు. దీంతో తాను ప్రేమికుడి చేతిలో మోసపోయానని గ్రహించిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాగా.. తన బిడ్డ చావుకు కారణమైన శేఖర్, అతడి కుటుంబీకులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిపెడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: ఎంత పని చేశావు తల్లీ! తన కొడుకుకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని.. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కన్నతల్లిని నమ్మించి.. రూ.12 లక్షలు కాజేసిన కడారి రామకృష్ణ
మహబూబాబాద్ రూరల్: కంటిచూపు మందగించిన కన్నతల్లిని మోసగించి భారీ మొత్తంలో డబ్బులు కాజేశాడు ఓ ప్రబుద్ధుడు. అతడి మోసాన్ని తట్టుకోలేక అంబేడ్కర్ విగ్రహం ఎదుట గుండు గీయించుకుని ఆ తల్లి నిరసన తెలిపింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన సరోజన తొర్రూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటెండర్గా పనిచేస్తోంది. ఆమె భర్త 20 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు రామకృష్ణ, శ్రీనివాస్ అనే ఇద్దరు కుమా రులు, ఒక కుమార్తె ఉండగా, వారందరికీ పెళ్లిళ్లయ్యాయి. ఇటీవల ప్రమాదవశాత్తు ఆమె కుడికాలు విరగడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పడంతో ఇద్దరు కుమారులు నెలలో 15 రోజుల చొప్పున కొంతకాలం ఆమెకు సేవలు చేశారు. ఈ క్రమంలో మధుమేహ వ్యాధితో బాధ పడుతున్న సరోజనకు కంటిచూపు సరిగా లేకపోవడంతోపాటు తీవ్ర అనారోగ్యం బారినపడింది. ఆస్పత్రికి తీసుకువెళ్తామని నమ్మించి ఇందిరాచౌక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్కు తీసుకెళ్లాడు. తల్లి ఖాతాలోంచి రూ.12.40 లక్షలను తన ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నాడు. కదల్లేని స్థితిలో ఉన్న ఆమెను కొట్టి కుమారుడు, కోడలు పారిపోయారు. దీనిపై పెద్దకుమారుడిని నిలదీయగా వారంలో మొత్తం తిరిగి ఇస్తానని నమ్మించి భార్య, అత్తను వెంటపెట్టుకుని హైదరాబాద్కు పారిపోయాడు. ప్రస్తుతం తన వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేవని, డబ్బులు అడిగిన ప్రతిసారి తనను కొడుతున్నారని సరోజన కన్నీటిపర్యంతమైంది. మహబూబాబాద్లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట గుండు గీయించుకొని ఆమె నిరసన తెలిపింది. కొడుకు చేసిన మోసంపై మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తల్లి చేసిన ఆరోపణలపై కుమారుడు రామకృష్ణను వివరణ కోరగా తాను మోసం చేయలేదని, శనివారం వచ్చి సమాధానం చెబుతానన్నాడు. -
బతుకమ్మ, బోనాలతో వీఆర్ఏల నిరసన
సాక్షి, నెట్వర్క్: ప్రభుత్వం ప్రకటించిన విధంగా తమకు పేస్కేళ్లు, పదోన్నతులు, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్లతో వీఆర్ఏలు చేపట్టిన సమ్మె కొత్తరూపం దాల్చింది. గురువారం తెలంగాణ సంప్రదాయ పండుగలైన బతుకమ్మ, బోనాల ప్రదర్శనలతో నిరసనలు తెలిపారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్తో 25 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం నుండి సరైన స్పందన లేదని నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా కొత్త తరహా నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వీఆర్ఏ జేఏసీ నాయకులు రాజయ్య, వంగూరు రాములు, దాదేమియా, వెంకటేష్ యాదవ్, శిరీషారెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణం స్పందించి న్యాయమైన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
ఆడపిల్ల పుట్టిందని సంబరాలు చేసుకున్న ఓ కుటుంబం
-
వీఆర్ఏలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి!
మహబూబాబాద్: నర్సింహులపేట మండలం వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక మండల వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు 2017, 2020, 2022లో నిండు అసెంబ్లీలో వీఆర్ఏలకు పే స్కేల్, అర్హత గల వారికి ప్రమోషన్స్, 55సంవత్సరాలు నిండిన వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా ఇంకా అమలు చేయలేదు అని అన్నారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరిచి జీవో విడుదల చేయాలని కోరుతూ డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్యా నాయక్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛైర్మెన్ యన్ శేకర్, జిల్లా ఉపాధ్యక్షడు ఎండీ మన్సూర్ అలీ, కొ వైర్మెన్ దర్మారపు ఉప్పలయ్య, కే.చైతన్య, యస్.సుధాకర్, లలిత, దివ్య, ఇర్ఫాన్, వెంకట నారాయణ, మోహన్, జనార్దన్, అబ్బాస్, రాములు, బిక్షం యకయ్య, మల్లయ్య, మనోజ్, తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధానికి కూతురు అడ్డొస్తుందని.. సొంత అన్నతో కలిసి
సాక్షి, వరంగల్: సభ్యసమాజం తలదించుకునేలా చేసింది ఓ కసాయి తల్లి. తన సొంత అన్నతో వివాహేతర సంబంధం సాగిస్తూ అడ్డొస్తుందని సోదరుడితో కలిసి ఆరేళ్ల కన్న కూతురి గొంతు నులిమి కడతేర్చింది. పోలీసులు నిందితులిద్దరిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉమ్మడి పెనుగొండ గ్రామ శివారు నర్సింహులగూడెంకు చెందిన పూనెం శిరీషకు.. ఏడేళ్ల క్రితం పెనుగొండ గ్రామ శివారు కట్టుగుడెంకు చెందిన అశోక్తో వివాహం జరిగింది. వీరికి కూతురు అనూశ్రీ(6) ఉంది. శిరీష తన సొంత అన్న పూనెం కుమారస్వామితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అన్నాచెల్లె కలిసి ఐదేళ్ల క్రితం అనూశ్రీని తీసుకుని భువనగిరిలోని మర్రిగుడెంకు వెళ్లారు. అక్కడే పౌల్ట్రీఫాంలో పనిచేస్తూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. అనూశ్రీ తరచూ అనారోగ్యంతో బాధపడుతుండేది. ఆస్పత్రులకు తీసుకెళ్లే స్థోమత లేకపోవడం, పెరిగి పెద్దదైతే ఖర్చులు భరించాల్సి వస్తుంది. పైగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని వారు భావించారు. ఈ క్రమంలో గత నెల 24న అనూశ్రీ చాతిపై తల్లి కూర్చోని గట్టిగా పట్టుకోగా కుమారస్వామి గొంతు నులిమి హత్య చేశాడు. మరుసటి రోజు మృతదేహన్ని స్వగ్రామమైన నర్సింహులగూడెం తీసుకెళ్లి కడుపునొప్పితో చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేశారు. గ్రామస్తులకు అనుమానం రావడంతో డయల్ 100కు సమాచారం అందించారు. చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతిని కారుతో ఢీకొట్టి.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టంలో బాలిక గొంతు నులిమి హతమార్చినట్లు తేలింది. దీంతో పోలీసులు శిరీష, కుమారస్వామిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం ఒప్పుకున్నారు. మర్రిగుడెంలో ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కేసును యాదగిరి టౌన్ పోలీస్స్టేషన్కు బదిలీ చేయనున్నట్లు పేర్కొన్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ: పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదని..
కేసముద్రం: ఆలస్యంగా పరీక్ష కేంద్రా నికి చేరుకున్న విద్యార్థినిని హాల్లోకి అనుమతించకపోవడంతో మనస్తాపా నికి గురైన ఆమె ఇంటి వద్ద పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం భూక్యా రాంతండా గ్రామపంచాయతీ శివారు కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన జాటోతు లచ్చిరాం, శారద దంపతుల చిన్న కుమార్తె సమీరా కేసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్(హెచ్ఈసీ) చదువుతోంది. అదే కళాశాలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫస్టియర్ పరీక్ష రాసేందుకు కేంద్రం వద్దకు 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని కేంద్రం నిర్వాహకులు చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంటికి చేరుకుని.. పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సమీరా చికిత్స పొందుతోంది. -
గుండెల్నిపిండే ఘటన: అమ్మ పడుకుంది.. మళ్లీ లేస్తుంది..
సాక్షి, మహబూబాబాద్: పట్టా కప్పుకొని అమ్మ పడుకుందంటే నిద్రపోతోందనే తెలుసు వారికి.. కానీ, అది శాశ్వతనిద్ర అని, ఇక ఎప్పటికీ లేవదని వారికేం తెలుసు.. తమ ఇంటికి ఎవరెవరో వచ్చిపోతుంటే బేలచూపులు చూస్తున్న ఈ ఇద్దరు చిన్నారులకు తాము అనాథలమయ్యామనే విషయం ఏం తెలుసు.. ‘నాన్న అమ్మను కొట్టి వెళ్లిపోయాడు. అమ్మ పట్టా కప్పుకొని పడుకుంది. మా అమ్మ మళ్లీ లేస్తుంది’ అని నాలుగేళ్ల కుమారుడు అంటుంటూ స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా రిపెడ మండలం ఆనకట్ట తండాలో చోటుచేసుకుంది. ఆనకట్టతండాకు చెందిన భూక్య రవీందర్, తేజావత్ మమత(28) దంపతులు. వీరికి నాలుగేళ్ల కుమారుడు, రెండున్నరేళ్ల కుమార్తె ఉన్నారు. రవీందర్ ఇటీవల భార్యపై అనుమానం పెంచుకుని పలుమార్లు దాడికి పాల్పడగా, పెద్ద మనుషులు సర్దిచెప్పుకుంటూ వచ్చారు. అయినప్పటికీ అనుమానం వీడని రవీందర్ మంగళవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో నరికాడు. కత్తితో గొంతు కోశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక పరారయ్యాడు. – మరిపెడ రూరల్ -
Inugurthy: మరో కొత్త మండలం... ఇనుగుర్తి
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఇనుగుర్తిని నూతన రెవెన్యూ మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఈమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, స్థానిక ఎమ్మెల్యే శంకర్నాయక్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు సోమవారం సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అర్హతలు ఇనుగుర్తికి వున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 607 మండలాలుండగా, తాజాగా మరో కొత్త మండలం ఏర్పాటుతో సంఖ్య 608కి పెరగనుంది. (క్లిక్: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. కొత్తగా 13 మండలాలు) -
వరదలో చిక్కుకుపోయిన 21 మంది కూలీలు.. రాత్రంతా అక్కడే!
సాక్షి, మహబూబాబాద్/మరిపెడ రూరల్/మద్దిరాల: వాళ్లంతా రెక్కాడితే కానీ డొక్కాడని గిరిజన కూలీలు. కూలికోసం ఏరు దాటి వెళ్లారు. రోజువారీగా పనిచేస్తుండగానే ఒక్కసారిగా వచ్చిన వరద చుట్టుముట్టింది. రెండు పాయలుగా ఉన్న సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం శివారులో పాలేరు వాగులో మధ్యలో కూలీలు చిక్కుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం శ్రమించి కూలీలను శనివారం ఉదయం బయటకు తీసుకొచ్చింది. నీళ్ల మధ్య చిక్కుకున్న కూలీలు.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల రెవెన్యూ పరిధిలోని కోట్యాతండా, వాల్యతండా గ్రామ పంచాయతీల పరిధిలోని చౌళతండాకు చెందిన 17 మంది, వాల్యతండాకు చెందిన నలుగురు.. మొత్తం 21 మంది కూలీలు సరిహద్దు ప్రాంతంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన తిరుమలయ్య వ్యవసాయ క్షేత్రంలోని వరి నాటు వేయడానికి ఆటోలో శుక్రవారం ఉదయం వెళ్లారు. అక్కడ వాగు 2 పాయలుగా చీలిన ప్రదేశంలో రైతు వ్యవసాయ భూమి ఉంది. ఉదయం నాటు వేయడానికి వెళ్లినప్పుడు మాములుగానే ఉండటంతో కూలీలు వెళ్లి నాటు వేశారు. తిరిగివస్తుండగా వాగు ఒక్కసారిగా ఉధృతి పెరిగింది. ఎటుచూసినా నీరు.. మధ్యలో కూలీలు ఉండిపోయారు. బయటికొచ్చే మార్గం లేకపోవడంతో ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు విషయం చెప్పారు. వారు అధికారులకు సమాచారం అందించారు. ఉదయం సురక్షితంగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం కూలీలను బయటకు తీసే ప్రక్రియ ప్రారంభించారు. రాత్రి డ్రోన్ ద్వారా కూలీలకు ఆహారం అందజేశారు. రాత్రి 2గంటలకు ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకున్నా వర్షం కురుస్తుండటంతో కూలీలను ఒడ్డుకు చేర్చడం సాధ్యం కాలేదు. దీంతో శనివారం ఉదయం 5 గంటల సమయంలో ఆపరేషన్ ప్రారంభించారు. దాదాపు గంటన్నర పాటు ఎన్డీఆర్ఎఫ్ బృంద ఇన్చార్జి మన్మోహన్సింగ్ ఆధ్వర్యంలో శ్రమించి బోటు సాయంతో కూలీలను ఒడ్డుకు చేర్చారు. దీంతో కూలీలు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా కలెక్టర్ శశాంక్ రక్షణ చర్యలను పర్యవేక్షించారు. చీకట్లో గడిపాం పాలేరు వాగు మధ్యలో ఉండిపోయి రాత్రంతా కారు చీకట్లో ఉండిపోయాం. అధికారులు ధైర్యం చెప్పినా భయం వేసింది. తాగేందుకు నీళ్లు కూడా లేవు. రాత్రి మొత్తం బురదలో నిలబడే ఉన్నాం. –తేజావత్ దేవి నా కొడుకు గుర్తుకొచ్చాడు వాగులో చిక్కుకున్న. నా రెండేళ్ల కొడుకు గుర్తుకు వచ్చి ఏడ్చా. తోటి కూలీలు ధైర్యం చెప్పి నన్ను ఓదార్చారు. అయినప్పటికి కొడుకును చూస్తాను అనుకోలేదు. –ఆంగోతు కవిత, చంటి బిడ్డతల్లి ఇదీ చదవండి: Telangana: రానున్న 2 రోజుల్లో అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ -
మహబూబాబాద్ జిల్లా: వరద నీటిలో చిక్కుకున్న ఆర్యభట్ట పాఠశాల బస్సు
-
Photo Feature: దంచికొట్టిన వానలు.. స్తంభించిన రాకపోకలు
సాక్షి, వరంగల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్లోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో గల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు కాజ్వేల పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోవడంతో నిత్యావసరాలు, వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చదవండి: 11 గంటల ఉత్కంఠకు తెర.. హమ్మయ్య! ఆ తొమ్మిది మంది సేఫ్ రామన్నగూడెం వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదావరి మత్తడి పోస్తున్న లక్నవరం సరస్సు సరస్సులో నీటిపై తేలియాడుతున్నట్లుగా ఉన్న వంతెన కొండాయివద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో రోడ్డు దాటి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రజలు ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్న వాగు కొత్తగూడ: తాడు సాయంతో కత్తెర్ల వాగు దాటుతున్న వేలుబెల్లి గ్రామస్తులు వాజేడు: చింతూరుకు చెందిన మహిళ వైద్యం కోసం వెళ్తుండగా రోడ్డు దాటిస్తున్న యువకులు కోతకు గురైన నర్సింగాపూర్–బోర్లగూడెం ప్రధాన రహదారి కొత్తగూడెం: బూర్కపల్లి వాగు దాటుతున్న రామన్నగూడెం గ్రామస్తులు వాజేడు: భువనపల్లి–లక్ష్మీపురం రోడ్డుపై ప్రవహిస్తున్న వరద దొంగలగట్టు వాగు లోలెవల్ వంతెనపై ప్రవహిస్తున్న నది మహాముత్తారం: గండికామారం రోడ్డుపై వరద ఉధృతి కాటారం: గంగారం వద్ద వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వాగు కోతకు గురైన నర్సింగాపూర్–మీనాజిపేట రహదారి బూర్గుపేట–లక్ష్మీదేవిపేట మధ్య మారేడుగొండ చెరువు ఉధృతి ఏటూరునాగారం: చెల్పాక రోడ్డుపై నాగులమ్మ ఒర్రె వరద -
వైద్యం అందక.. గర్భంలోనే శిశువు మృతి
కొత్తగూడ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గర్భిణి మహిళ అవస్థపడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మొర్లి సరిత 6 నెలల గర్భవతి. ఆమెకు సరిగా రక్తం లేకపోవడంతో ఇప్పటికే రెండుసార్లు రక్తం ఎక్కించారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి తీవ్ర కడుపునొప్పి వచ్చింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి గ్రామ సమీపంలోని కత్తెర్లవాగు పొంగి పొర్లుతోంది. రాత్రి సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. సోమవారం ఉదయం గ్రామపంచాయతీ ట్రాక్టర్లో వాగు దాటించి నర్సంపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్ చేసిన వైద్యులు సమయానికి వైద్యం అందకపోవడం వల్ల గర్భంలోనే శిశువు మృతి చెందినట్లు గుర్తించి అబార్షన్ చేశారు. -
కుల పంచాయితీలో మహిళపై దాడి.. నిండు ప్రాణం తీసిన వాట్సాప్ ప్రచారం
సాక్షి, మహబూబాబాద్: వాట్సాప్ వేదికగా జరిగిన ప్రచారంపై నిర్వహించిన కులపంచాయితీలో కొందరు ఓ మహిళపై దాడి చేశారు. ఆ మహిళ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన ఆదివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ముక్తి స్వాతి(38) తన పెద్ద కుమార్తె రాజేశ్వరికి మే నెలలో వివాహం జరిపించింది. ప్రభుత్వం ఇస్తున్న కల్యాణలక్ష్మి పథకం డబ్బుల కోసం పంచాయతీ కార్యదర్శి సంతకం అవసరం ఉండడంతో గ్రామంలోని ఆఫీసుకు వారంరోజుల క్రితం వెళ్లింది. ఈ సమయంలో పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని స్వాతి తనతో సన్నిహితంగా ఉండే అదే గ్రామానికి చెందిన చింత అరవింద్కు తెలిపింది. దీంతో అరవింద్.. పంచాయతీ కార్యదర్శి మంగీలాల్కు ఫోన్ చేసి చంపుతానని బెదిరింపు కాల్స్తోపాటు మెసెజ్లు పెట్టాడు. ఈక్రమంలో అరవింద్ ఇంటికి పంచాయతీ కార్యదర్శి వెళ్లి అతడి తల్లి భద్రమ్మతో బెదిరిస్తున్న విషయం తెలిపి పోలీసులకు ఫిర్యా దు చేస్తానని అన్నారు. తను తన కొడుకుకు నచ్చజెప్తానని పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని భద్రమ్మ కోరడంతో అతను విషయాన్ని గ్రామ సర్పంచ్ వెంకన్నకు చెప్పాడు. సర్పంచ్ తను మాట్లాడుతానని తెలిపారు. చదవండి: Hyderabad: ఓ వైపు కరోనా.. మరోవైపు అంటువ్యాధులు.. స్వాతి నంబర్తో వాట్సాప్ క్రియేట్ చేసిన అరవింద్ స్వాతికి చిన్న ఫోన్ ఉంది. సిమ్ను తన సెల్ఫోన్లో వేసుకున్న అరవింద్ వాట్సాప్ను ఆదివారం క్రియేట్ చేశాడు. దాని ఆధారంగా పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, మహిళలు పంచాయతీ కార్యాలయానికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనే సారాంశంతో గ్రామంలోని పెద్దమనుషులకు మెసెజ్లు పంపాడు. దీంతోపాటు పంచాయతీ కార్యదర్శిపై స్వాతి సర్పంచ్కు ఫిర్యాదు చేసిన ఆడియో, తదితర సందేశాలు సోషల్మీడియాలో వైరల్గా మారడంతో పంచాయతీ కార్యదర్శి ఈ విషయాన్ని మళ్లీ గ్రామసర్పంచ్ వెంకన్నకు తెలిపాడు. సర్పంచ్.. స్వాతితోపాటు ఆమె కులపెద్దమనుషులను పంచాయితీకి పిలిచారు. పంచాయితీలో స్వాతిపై దాడి వాట్సాప్లో వచ్చిన వాటిపై ఆదివారం సాయంత్రం గ్రామంలో పంచాయితీ నిర్వహిస్తుండగా ‘ఇంత జరగడానికి కారణం నువ్వే’అంటూ స్వాతిపై అరవింద్ తల్లి భద్రమ్మ, స్వాతి ఆడపడుచు సైదమ్మ దాడి చేసి కొట్టారు. పదిమంది దూషిస్తూ కొట్టడాన్ని అవమానంగా భావించిన స్వాతి ఇంటికి వెళ్లింది. రేకులరాడ్డుకు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ తరువాత ఇంటికి వచ్చిన నాగేశ్వరరావు భార్య ఉరివేసుకున్న విషయాన్ని గమనించి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చే వరకు మృతి చెందింది. కాగా, తనపై కావాలని వాట్సాప్లో తప్పుడు ప్రచారం చేశారని, తాను ఎవరిపట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ తెలిపారు. చదవండి: మెదక్లో విషాదం: విద్యార్థులపై దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు తన అక్క స్వాతి అవమానభారంతో ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన చింత అరవింద్, చింత భద్రమ్మ, చింత పుల్లయ్య, ఇర్ప సైదమ్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు కల్తి ప్రవీణ్ బయ్యారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గార్ల–బయ్యారం సీఐ బాలాజీ తెలిపారు. -
మహబూబాబాద్: మైక్ సెట్ రిపేర్ చేస్తుండగా షాక్.. ముగ్గురి మృతి
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి కురిసిన గాలివానకు గ్రామంలోని రామాలయం గుడిపై ఉన్న మైక్ సెట్ దెబ్బతింది. దెబ్బతిన్న మైక్ సెట్ సరి చేస్తుండగా.. కరెంట్ షాక్తో ముగ్గురు మృతి చెందారు. మృతుల్ని సుబ్బారావు, మస్తాన్ రావు, వెంకయ్యలుగా నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.