floods
-
సాయం పేరుతో స్వాహా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి అందరూ బియ్యం ఇవ్వాలంటూ జనసేన శ్రేణులు గత ఏడాది ఊరూరా తిరిగి సేకరించారు. ఇలా దాతలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల నుంచి భారీగా సేకరించారు. చివరికి అనుకున్న స్థాయిలో బియ్యం సేకరించాక ఆ మొత్తాన్ని జనసేన నియోజకవర్గ ఇన్చార్జి ఒకరు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడిది బయటకు పొక్కింది. దీంతో.. ఆ మొత్తం డబ్బును పార్టీకి విరాళంగా ఇస్తానని.. ఇదంతా మంత్రి కందుల దుర్గేష్కు చెప్పేచేశానని ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వివాదం ముదరడంతో రెండ్రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో దీనిపై పంచాయితీ జరిగింది. అయినా సెటిల్ కాకపోవడంతో జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి వ్యవహారం తీసుకెళ్లారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పుడీ వ్యవహారం కలకలం రేపుతోంది. ఆ వివరాలు..అసలేం జరిగిందంటే.. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికంటూ జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు నేతృత్వంలో గతేడాది నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో భారీగా బియ్యం సేకరించారు. కానీ, ఇలా సేకరించిన బియ్యాన్ని విజయవాడలో బాధితులకు పంచకుండా ఆయన విక్రయించేశారు. ఈ సొమ్మును నియోజకవర్గ ఇన్చార్జే స్వాహా చేశాడని ఒక వర్గం దుమ్మెత్తిపోస్తుండగా.. ఇన్చార్జి వర్గం మాత్రం సొమ్ము తమవద్దే ఉందని, పార్టీకి విరాళం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే కుదరడంలేదని, మంత్రి కందుల దుర్గేష్కు విషయం చెప్పామని, ఆయన విరాళం ఇవ్వడానికి పవన్కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్తారంటూ చెబుతున్నారు. అయితే, నాలుగు నెలల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం వచ్చినప్పడు కూడా ఆయనకు చెక్కు ఇవ్వడం కుదరలేదా అని ప్రత్యర్థి వర్గం నిలదీస్తోంది.రూ.10 లక్షలు కాదు.. 16 లక్షలకు అమ్ముకున్నారు..జనసేన నియోజకవర్గ ఇన్చార్జి సువర్ణరాజు, ఆయన వ్యతిరేక వర్గం మధ్య ఈ విషయంలో కొద్దిరోజులుగా తారాస్థాయిలో వివాదం నడుస్తోంది. సేకరించిన బియ్యాన్ని రూ.10.27 లక్షలకు విక్రయించానని సువర్ణరాజు చెబుతుంటే.. రూ.16 లక్షలకు అమ్ముకున్నారని వ్యతిరేక వర్గం చెబుతోంది. దీనిపై పార్టీ జిల్లా నేతల వద్ద పంచాయితీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో.. రెండ్రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో జనసేన నాయకుడు కరాటం సాయి పార్టీ ఆదేశాలతో గోపాలపురం నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. సువర్ణరాజు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఘర్షణకు దిగడంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో కరాటం సాయి చేతులెత్తేసి జిల్లా ఇన్చార్జి నాదెండ్ల మనోహర్ దృష్టికి వ్యవహారం తీసుకెళ్తున్నట్లు చెప్పి సమావేశం ముగించారు. -
విపత్తులను మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: కరువు ఉరిమినా.. తుఫాన్లు తుడిచిపెట్టినా.. వరదలు, వర్షాలు ముంచెత్తినా.. అన్నదాతపై చంద్రబాబు ప్రభుత్వానికి కనికరం లేదు. కష్టాల్లో ఉన్న రైతులను ఉదారంగా ఆదుకోవాల్సిందిపోయి వారిని అన్ని విధాలుగా మోసం చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ముగిసి, రబీ కూడా చివరి దశకు చేరుకుంది. అయినా, ఖరీఫ్ ప్రారంభంలో దెబ్బతిన్న పంటలకూ పరిహారం ఇవ్వాలన్న ధ్యాసే లేదు. ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా అటకెక్కించి ఆ పరిహారమూ అందకుండా చేసింది. సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు చెల్లించాల్సిన రూ.26 వేల ( పీఎం కిసాన్ సాయంతో కలిపి)పెట్టుబడి సాయమూ ఇవ్వకుండా మోసం చేసింది. ఇంకొక వైపు సీజన్ ముగియకుండానే అందించాల్సిన పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) చెల్లింపులోనూ కావాలనే కాలయాపన చేస్తోంది. పంటలకు మద్దతు ధర లభించేలా చూడటంలోనూ చంద్రబాబు సర్కారుది మొండి వైఖరే. ఎరువులు, పురుగు మందులు, నాణ్యౖమెన విత్తనాలు లేక రైతులు అల్లాడుతున్నా పట్టించుకోవడంలేదు. వ్యాపారులు, దళారుల చేతిలో అన్యాయానికి గురవుతున్న అన్నదాతను ఆదుకోవాలన్న ఆలోచనే లేదు. మొత్తం మీద ప్రకృతి విపత్తులకంటే అన్నదాతకు కూటమి సర్కారు నిర్లక్ష్యమే పెద్ద విపత్తుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.అడ్డగోలు కోతలతో.. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు నెలకొక వైపరీత్యం రైతులను వెంటాడుతూనే ఉంది. ఖరీఫ్ మొదట్లోనే జూలైలో అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. 16 జిల్లాల 1.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం మాత్రం 44 వేల ఎకరాల్లోనే పంటలు దెబ్బతిన్నాయని, 31 వేల మందికి రూ.31.53 కోట్లు చెల్లించాలని లెక్కతేల్చింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కృష్ణా, వంశధార, నాగావళి నదులతో పాటు బుడమేరు, ఏలేరు వరదలు పంట పొలాలను ముంచెత్తాయి. 10 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తొలుత 5.93 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన 4 లక్షల మందికి రూ.557.63 కోట్ల పరిహారం ఇవ్వాలని అంచనావేశారు. ప్రభుత్వం ఇందులో అడ్డగోలుగా కోతలు వేసి దెబ్బతిన్న పంటల విస్తీర్ణం 3.11 లక్షల ఎకరాలకు కుదించింది. కేవలం 2 లక్షల మందికి రూ.319.08 కోట్లు ఇవ్వాలని చెప్పింది. పోనీ అదైనా ఇచ్చిందా అంటే అదీ లేదు.వైఎస్ జగన్ హయాంలో..⇒ విపత్తులకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకొనేందుకు ప్రత్యేకంగా రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు ⇒ ఏ సీజన్ పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అదే సీజన్ ముగిసేలోగా జమ. ఇలా ఐదేళ్లలో 34.41 లక్షల మందికి రూ.3,261.60 కోట్లు చెల్లించి అండగా నిలిచారు. ⇒ రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా ఐదేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్లు అందజేశారు. ⇒ వైఎస్సార్ రైతు భరోసా కింద ఐదేళ్లలో 53.58 లక్షల మందికి రూ.34,288.17 కోట్లు లబ్ధి చేకూర్చారు.చంద్రబాబు హయాంలో.. ⇒ బీమా ప్రీమియం బకాయిలు రూ.1,280 కోట్లు చెల్లించకపోవడం వల్ల రైతులకు దాదాపు రూ.2వేల కోట్లకు పైగా పరిహారం అందకుండా మోకాలడ్డారు. ⇒ 2024–25 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఈ పాటికే రూ.833 కోట్లు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఇందులో పైసా కూడా చెల్లించకపోవడంతో రైతులకు రూ.1200 కోట్లకుపైగా బీమా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. ⇒ కూటమి పాలనలో పంటల బీమా పథకం ఉందో లేదో కూడా తెలియని అయోమయ స్థితి నెలకొంది. ⇒ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్రమిచ్చే పీఎం కిసాన్ సాయంతో సంబంధం లేకుండానే ఒకే విడతలో ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున 2024–25లో చెల్లించాల్సిన రూ.10,717 కోట్లు కూడా చంద్రబాబు ఎగ్గొట్టారు.సగం మండలాల్లోనే కరువంటూ..లోటు వర్షపాతంతో రాయలసీమ జిల్లాల్లో 100 మండలాలకు పైగా కరువు కోరల్లో చిక్కుకున్నాయి. 60 రోజులకు పైగా చినుకు జాడ లేదు. 10 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం మాత్రం మొక్కుబడిగా 54 మండలాలనే కరువు ప్రభావితంగా ప్రకటించింది. వీటికీ పైసా పరిహారం విదల్చలేదు. నవంబరులో విరుచుకుపడిన ఫెంగల్ తుఫాను కోతకొచ్చిన పంటలను తుడిచిపెట్టింది. దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. అయినా రైతులను ఆదుకున్న పాపాన పోలేదు. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది జూలై మొదలుకొని డిసెంబర్ వరకు వివిధ వైపరీత్యాలకు 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని, రూ.2 వేల కోట్లకు పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. ఇందులోనూ కోతలేసి చివరికి 6.65 లక్షల ఎకరాల్లోనే పంటలు దెబ్బతిన్నట్లు, రూ.527.18 కోట్లు చెల్లించాలంటూ లెక్కగట్టింది.దీంతోపాటు ఆధార్ సీడింగ్ కాకపోవడం, సరైన బ్యాంక్ ఖాతా నంబర్లు ఇవ్వక పోవడం వంటి సాంకేతిక కారణాలతో నిలిచిన 2023, 24 సీజన్ల కరువు సాయం బకాయిలు రూ.311.39 కోట్లు విడుదల చేయకుండా మోకాలడ్డింది. ఇలా మొత్తం రూ.838.57 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో కేవలంæ 1.85 లక్షల మందికి రూ.284.56 కోట్లు చెల్లించి చేతులు దులిపేసుకుంది. అదీ కూడా ప్రజలు, వివిధ సంస్థలు ఇచ్చిన వరద విరాళాల పుణ్యమే. -
అసలు సమస్య ముంపే!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని ముంపు ముప్పు నుంచి తప్పించడానికి తొలి దశలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నిధులతో కొండవీటి వాగుపై ఉండవల్లి వద్ద మరో 7,500 క్యూసెక్కులు ఎత్తిపోసేలా ఎత్తిపోతలను నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతోపాటు కొండవీటి వాగు వరదను కృష్ణా నదికి మళ్లించేలా నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు 7.83 కిలోమీటర్ల పొడవున తవ్వే గ్రావిటీ కెనాల్పై నాలుగు చోట్ల పది క్యూసెక్కులను ఎత్తిపోసేలా ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా ఈ ఐదు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్) టెండర్ నోటిఫికేషన్ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేసింది. షెడ్యూళ్ల దాఖలుకు ఫిబ్రవరి 14ను తుది గడువుగా నిర్దేశించింది. రాజధానిని ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు 2018లో ఉండవల్లి వద్ద కొండవీటి వాగుపై 5 వేల క్యూసెక్కులను ఎత్తిపోసేలా రూ.260.48 కోట్లతో ఎత్తిపోతలను పూర్తి చేసింది. దీంతో పాటు ఇప్పుడు శాఖమూరు వద్ద 0.03, కృష్ణాయపాలెం వద్ద 0.10, నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం.. కొండవీటి వాగు, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా వెడల్పు చేయడం, కొండవీటి వాగు వరదను కృష్ణా నదికి మళ్లించడానికి నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.83 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వే పనులకు రూ.1,404.14 కోట్ల వ్యయంతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండో దశలో లాం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ తవ్వి.. దానికి అనుబంధంగా లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద మూడు రిజర్వాయర్లు, వైకుంఠపురం వద్ద మరో ఎత్తిపోతలను నిర్మించాలని ప్రపంచ బ్యాంకు–ఏడీబీ ప్రతినిధులు సూచించారని ప్రభుత్వం చెబుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రాజధాని అమరావతిని ముంపు ముప్పు నుంచి తప్పించే పనుల వ్యయమే తడిసి మోపేడయ్యేలా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.222 మి.మీ వర్షం కురిసినా ముప్పు ఉండకూడదురాజధాని అమరావతి ప్రాంతంలో వందేళ్లలో నమోదైన వర్షపాతం గణాంకాలను ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం విశ్లేషించింది. వందేళ్లలో ఒకసారి అమరావతి ప్రాంతంలో గరిష్టంగా 222 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ స్థాయిలో వర్షం కురిసినా రాజధాని అమరావతిని వరద ముప్పు నుంచి తప్పించేలా ముంపు నివారణ పనులు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల ప్రణాళిక మేరకు రాజధాని ముంపు నివారణ ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ ప్రణాళికలో ప్రధానాంశాలిలా ఉన్నాయి.» రాజధాని ప్రాంతంలో ప్రవహించే వాగుల్లో ప్రధానమైనవి కొండవీటి వాగు, పాలవాగు. కొండవీటి కొండల్లో పేరిచెర్ల వద్ద జన్మించే కొండవీటి వాగు అచ్చంపేట, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల మీదుగా ప్రవహించి ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉండవల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. కొండవీటి వాగు పరివాహక ప్రాంతం 421 చదరపు కిలోమీటర్లు. కొండవీటి కొండల నుంచి ప్రవాహించే ఈ వాగు 31.15 కిలోమీటర్ల ప్రయాణం తరువాత నీరుకొండ వద్ద రాజధానిలోకి ప్రవేశిస్తుంది. » రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు 23.85 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఈ వాగు కనిష్టంగా 6 మీటర్ల నుంచి గరిష్టంగా 20 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తోంది. కృష్ణా నది, కొండవీటి వాగుకు ఒకేసారి వరదలు వస్తే.. కృష్ణా వరద కొండవీటి వాగులోకి 23.85 కిలోమీటర్ల పొడవున ఎగదన్నే ప్రమాదం ఉంది. ఇది రాజధాని ముంపునకు దారితీస్తుంది. » రాజధానికి కొండవీటి వాగు ముంపు ముప్పు నివారించడానికి ఆ వాగు ప్రవాహ సామర్థ్యాన్ని అనంతవరం నుంచి శాఖమూరు మీదుగా నీరుకొండ వరకు (11.6 కి.మీ నుంచి 23.6 కి.మీ వరకు) 2,120 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి. కృష్ణాయపాలెం నుంచి నీరుకొండ వరకు(4.6 కి.మీ నుంచి 11.6 కి.మీ) కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని 8,120 క్యూసెక్కులకు పెంచేలా లోతు, వెడల్పు చేయాలి. కృష్ణాయపాలెం నుంచి ఉండవల్లి వరకు (4.6 కి.మీ నుంచి 0 కి.మీ) కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని 8,120 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి. » నీరుకొండ వద్ద 0.4, కృష్ణాయపాలెం వద్ద 0.1, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించాలి. » ఉండవల్లి వద్ద కొండవీటి వాగు నుంచి 5 వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజ్లోకి.. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలోకి ఎత్తిపోసేలా ఇప్పటికే ఎత్తిపోతలను నిర్మించారు. దానికి అనుబంధంగా 7,500 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో ఎత్తిపోతల నిర్మించాలి. » పాల వాగు సామర్థ్యాన్ని కృష్ణాయపాలెం నుంచి దొండపాడు వరకు 16.7 కి.మీల పొడవున 8,830 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి.» నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు 7.843 కి.మీల పొడవున 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో గ్రావిటీ కెనాల్ తవ్వాలి. ఈ కెనాల్పై నాలుగు చోట్ల పది క్యూసెక్కుల సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాలు నిర్మించాలి. ఈ పనులన్నీ తొలి దశలో పూర్తి చేయాలి.» రెండో దశలో రాజధాని అమరావతి ఆవల ప్రాంతం నుంచి కొండవీటి వాగు వరద ప్రవాహం 12,500 క్యూసెక్కులకు మళ్లించేలా లాం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ తవ్వాలి. దానికి అనుబంధంగా లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద రిజర్వాయర్లు నిర్మించాలి. కొండవీటి వాగు వరద ప్రవాహం 5,650 క్యూసెక్కులు కృష్ణా నదిలోకి ఎత్తిపోసేలా ఎత్తిపోతల నిర్మించాలి. » రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే రిజర్వాయర్లను ఖాళీ చేయాలి. వరద నియంత్రణను పర్యవేక్షించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. -
కంటతడి ఆరలేదు..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆగస్టు 31, 2024.. ఆకేరు వాగు నడిరాత్రి వేళ రైతు కంట వరద పారించింది. బువ్వపెట్టే భూమిని బీడుపెట్టింది. నాడు ఆకేరు సృష్టించిన విలయంతో పచ్చని పొలాల్లో ఇసుక, రాళ్లురప్పలు మేటవేశాయి. ఇళ్లు నేలకూలాయి. గొడ్డూగోదా, సామగ్రి.. సర్వం కొట్టుకుపోయాయి. ఎటుచూసినా ఐదారు మీటర్ల మేర పేరుకుపోయిన రాళ్లదిబ్బలు.. ఎకరాకు రూ.2 లక్షలు వెచ్చించి వీటిని తొలగిస్తే తప్ప సాగులోకి వచ్చే పరిస్థితి లేని భూములు.. ఏటా రెండు పంటలు పండించి.. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక చేష్టలుడిగి కూలీలుగా మారిపోయిన రైతన్న.. నాడు అతలాకుతలమైన వీరి జీవితాలు ఇప్పుడెలా ఉన్నాయి?.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండాలోని పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన..ఆరు నెలలుగా అదే దైన్యం.. పోతుగంటి సహదేవ్ రెక్కలు ముక్కలు చేసుకుని 90 బస్తాల ధాన్యాన్ని నిల్వ చేశాడు. రేపోమాపో మిల్లుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నంతలోనే వరద ముంచెత్తింది. 40 బస్తాలు నీళ్లపాలయ్యాయి. తడిసిన 50 బస్తాల ధాన్యా న్ని కొని ఆదుకుంటామన్న అధికారులు ఇప్పుడు చేతులెత్తేశారు. 6 నెలలుగా ఆ ధాన్యం అలాగే పడి ఉంది.సాయం చేస్తేనే సాగుపోతుగంటి బ్ర హ్మం ఐదెకరాల ఆసామి. 2.20 ఎకరాల్లో వరి, ఎకరంన్నరలో మిర్చి, ఎకరంలో పత్తి వేశాడు. పంటపండి చేతికొస్తుందనుకున్న దశలో ఆకేరు వరదతో పొలమంతా ఇసుక మేటలు వేసింది. ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల చొప్పున ఐదెకరాలకు ఇచ్చనా రూ.50 వేలకు తోడు మరో లక్ష వెచ్చించి పొలాన్ని బాగు చేసుకున్నాడు. మిగతా భూమి పరిస్థితేమిటో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.చి‘వరి’కిలా మిగిలా..పోతుగంటి వెంకన్న నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. వరద దెబ్బకు పంట మొత్తం రాళ్లురప్పల పాలైంది. రూ.2 లక్షలు ఖర్చుచేసి 200 ట్రిప్పుల మట్టి తోలించి పొలాన్ని సాగు యోగ్యం చేసుకుని ప్రస్తుతం వరి సాగుచేస్తున్న ఆయన.. బావులు పూడుకుపోవడంతో ఏటిలోని నీటిని మోటార్ల ద్వారా తరలిస్తూ తలకుమించిన భారాన్ని మోస్తున్నానని వాపోతున్నాడు. -
అమరావతి ‘ముంపు టెండర్ల’లో అక్రమాల వరద
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని కొండవీటి వాగు, పాల వాగు వరద ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు చేపట్టే పనుల టెండర్లలో అక్రమాలు వరదెత్తాయి. పనుల అంచనా వ్యయాన్ని 100 నుంచి 250 శాతం పెంచేసి.. మూడు ప్యాకేజీలుగా విభజించి.. ముందుగా ఎంపిక చేసిన కాంట్రాక్ట్ సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) అధికారుల ద్వారా ముఖ్యనేతలు మూడు టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయించారు. వీటి కాంట్రాక్ట్ విలువ (అన్ని పన్నులతో కలిపి) రూ.1,404.13 కోట్లుగా నిర్దేశించారు. పనుల విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్ట్ సంస్థలకు పనులు అప్పగించి.. పెంచిన అంచనా వ్యయం రూ.702.33 కోట్లను కమీషన్ల రూపంలో రాబట్టుకోవడానికి ప్రణాళిక రచించారు. మూడు ప్యాకేజీల పనులు ఇవీ ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణంగా ఇస్తున్న నిధులతో మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ చేపట్టింది. ఒకటో ప్యాకేజీ కింద కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 23.6 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 16.75 కి.మీ. పొడవున వెడల్పు చేసి, లోతు పెంచడం, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎల్ఎస్ (లంప్సమ్) విధానంలో 24 నెలల్లో పూర్తి చేయడంతోపాటు మరో రెండేళ్లు నిర్వహించాలని నిబంధనతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.462.26 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా రూ.60.53 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ (నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ), సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ ప్యాకేజీ పనుల అంచనా వ్యయం రూ.522.79 కోట్లు. రెండో ప్యాకేజీ ఇదీ రెండో ప్యాకేజీ కింద నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడం.. కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో రెండేళ్లలో పూర్తి చేసి, మరో రెండేళ్లు నిర్వహించాలనే షరతుతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.303.73 కోట్లుగా నిర్దేశించింది.దీనికి అదనంగా రూ.38.57 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా విలువ రూ.342.3 కోట్లు. ఒకటో, రెండో ప్యాకేజీ పనులకు షెడ్యూళ్లు దాఖలు చేయడానికి ఈనెల 31 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరిచి.. అర్హత ఉన్న కాంట్రాక్ట్ సంస్థలు దాఖలు చేసిన ఆరి్థక బిడ్లను ఫిబ్రవరి 5న తెరుస్తారు. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించనున్నారు. మూడో ప్యాకేజీ కింద.. మూడో ప్యాకేజీ కింద మంగళగిరి మండలం నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో ఈ నెల 1న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.470.74 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.68.30 కోట్లను రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా వ్యయం రూ.539.04 కోట్లు. ఈ పనుల టెండర్లలో షెడ్యూళ్ల దాఖలుకు ఈ నెల 22 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్, ఈనెల 25న ఆర్థిక బిడ్ తెరిచి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్ట్ సంస్థకు పనులు కట్టబెట్టనున్నారు. అంచనాల్లో పొంగిపొర్లిన అక్రమాలు రాజధాని ప్రాంతం నల్లరేగడి భూమితో కూడుకున్నది. పెద్దగా రాళ్లు, రప్పలు ఉండవు. పొక్లెయిన్లు వంటి యంత్రాలతో సులువుగా కాలువ తవ్వవచ్చు. పైగా ఇవేమీ కొత్తగా తవ్వే కాలువలు కాదు. కొండవీటి వాగు, పాల వాగులను విస్తరించడమే.. కొత్తగా 7.843 కిమీల పొడవున మాత్రమే కాలువ తవ్వాలి. ప్రస్తుత ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టి తవ్వడానికి ప్రస్తుతం గరిష్టంగా రూ.100 చెల్లిస్తున్నారు.ఈ లెక్కన 8 నుంచి 9 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కి.మీ. పొడవున కాలువ తవ్వకం పనుల అంచనా వ్యయం రూ.4.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు మించదని, 10 నుంచి 11 వేల క్యూసెక్కుల కాలువ తవ్వకం పనులకు కి.మీ. రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల (జీఎస్టీ, సీనరేజీ, ఎన్ఏసీ వంటి పన్నులతో కలిపి)కు మించదని జలవనరుల శాఖలో అనేక ప్రాజెక్టుల్లో చీఫ్ ఇంజినీర్గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక అధికారి తేల్చిచెప్పారు.ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మించడానికి అంచనా వ్యయం జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లకు మించదని రిజర్వాయర్ల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న మరో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఒకరు స్పష్టం చేస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఒకటో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం రూ.301.75 కోట్లకు మించదు. కానీ.. ఈ ప్యాకేజీ కాంట్రాక్ట్ విలువను జీఎస్టీ వంటి పన్నులతో కలిపి రూ.522.79 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.221.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. కొండవీటి వాగు, పాల వాగు లోతు, వెడల్పు పెంచే పనులకు కి.మీ. రూ.5 కోట్లు చొప్పున వేసుకున్నా రూ.201.75 కోట్లు అవుతుంది. శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.వంద కోట్లు లోపే అవుతుంది.జ్యుడీషియల్ ప్రివ్యూ ఉండి ఉంటే..జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థ ఉండి ఉంటే టెండర్ ముసాయిదా షెడ్యూల్ దశలోనే ఈ అక్రమాలు బహిర్గతమయ్యేవని.. అందుకే ఆ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఒకరు స్పష్టం చేశారు. జాయింట్ వెంచర్గా ఏర్పడి టెండర్ షెడ్యూల్ దాఖలు చేయడానికి వీల్లేదని నిబంధన పెట్టడం ద్వారా ముందే ఎంపిక చేసిన బడా కాంట్రాక్ట్ సంస్థకే పనులు అప్పగించేందుకు ముఖ్యనేతలు ఎత్తుగడ వేసినట్టు స్పష్టమవుతోంది. అదే టెండర్ నోటిఫికేషన్లో 50 శాతం పనులను సబ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చే వెసులుబాటును కల్పించడాన్ని బట్టి చూస్తే ముఖ్యనేతల దోపిడీ పన్నాగం బట్టబయలవుతుందని రిటైర్డ్ ఎస్ఈ ఒకరు స్పష్టం చేశారు.రాష్ట్రంలో 2014–19 మధ్య టెండర్ల వ్యవస్థను నీరుగార్చి, ప్రతిపాదన దశలోనే పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. అస్మదీయ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి.. వాటిని కమీషన్ల రూపంలో వసూలు చేసుకుని జేబులో వేసుకోవడానికి ముఖ్య నేతలు మరిగారు. 2019 మే 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని చేసి.. టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చారు. మొబిలైజేషన్ అడ్వాన్సు విధానాన్ని రద్దు చేశారు. రూ.100 కోట్లు.. అంతకంటే వ్యయం ఎక్కువగా ఉన్న పనులకు సంబంధించి టెండర్ ముసాయిదా షెడ్యూల్ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలి.దీన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసి.. ఇంజనీర్లు, మేధావులు, ప్రజలు, కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఆన్లైన్లో జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి అభిప్రాయాలను తీసుకుంటారు. వాటి ఆధారంగా ముసాయిదా షెడ్యూల్లో మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసిన ముసాయిదా షెడ్యూల్ను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదిస్తారు. దాంతోనే సంబంధిత శాఖ అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూను రద్దు చేసింది. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని పునరుద్ధరించింది. ఇది జరిగాకే రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు టెండర్లు పిలుస్తున్నారు. మిగిలిన రెండు ప్యాకేజీల్లోనూ ఇదే తీరురెండో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.197.05 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం పన్నులతో కలిపి రూ.342.3 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే అంచనా వ్యయం రూ.145.25 కోట్ల మేర పెంచేసినట్టు స్పష్టమవుతోంది. 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడానికి.. కిలోమీటర్కు రూ.6 కోట్ల చొప్పున రూ.47.05 కోట్లు అవుతుంది.కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం రూ.150 కోట్లకు మించదు. మూడో ప్యాకేజీ కింద నీరుకొండ వద్ద 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.200 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.339.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. మొత్తమ్మీద ముంపు ముప్పు నివారించడానికి చేపట్టిన మూడు ప్యాకేజీల పనుల్లో అంచనా వ్యయాన్ని రూ.702.33 కోట్లు పెంచేసినట్టు తేటతెల్లమవుతోంది. -
ఆ అమ్మ సునామీకి జన్మనిచ్చింది!
ఎప్పుడూ చూసే సముద్రమే ఆ రోజు కొత్తగా ఉంది. భయంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే సముద్రం విలయ విధ్వంసానికి సిద్ధంగా ఉంది. ఆరోజు... ఏ రోజూ మరచిపోలేని రోజు. సునామీ విశ్వరూపాన్ని చూపిన రోజు. ఇరవై సంవత్సరాల తరువాత కూడా... నిన్ననే జరిగినట్లు వెన్నులో చలిపుట్టించే రోజు...అండమాన్ నికోబార్లోని హట్ బే దీవిలో భీకర అలల ధాటికి నమిత రాయ్ ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. అప్పుడు నమిత వయసు పాతిక సంవత్సరాలు. దిక్కుతోచని పరిస్థితుల్లో పాములకు ప్రసిద్ధి చెందిన అడవిలో ఆశ్రయం పొందారు. ఎటు నుంచి ఏ విషసర్పం వచ్చి ప్రాణం తీస్తుందో తెలియని భయానక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ఆ పాముల అడవిలోనే పండంటి పిల్లాడికి జన్మనిచ్చింది నమిత.ఆ పిల్లాడికి ‘సునామీ’ అని పేరు పెట్టారు. రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లింది నమిత రాయ్...‘ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒంట్లో వణుకు పుడుతుంది. అప్పుడు నేను గర్భవతిని. రోజువారీ పనులతో బిజీగా ఉన్నాను. ఉన్నట్టుండి భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. మా తీరం నుండి మైళ్ళ దూరంలో సముద్రం తగ్గుముఖం పట్టడం చూసి షాక్ అయ్యాను. కొన్ని సెకనుల తరువాత మా దీవి వైపు భారీ సముద్రపు అలలు దూసుకొస్తున్నాయి, ఆ తర్వాత బలమైన ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు కేకలు వేస్తూ గుట్ట వైపు పరుగెత్తడం చూశాను. పానిక్ ఎటాక్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాను.కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చాను. కొండ అడవిలో వేలాది మంది స్థానికుల మధ్య నేను ఉన్నాను. నా భర్త, పెద్ద కొడుకును చూడగానే ప్రాణం లేచి వచ్చింది. మా ద్వీపంలోని చాలాప్రాంతాలు రాక్షస అలల తాకిడికి నాశనం అయ్యాయి. ఆస్తి అనేది లేకుండా పోయింది.ఒకరోజు రాత్రి పదకొండు గంటల తరువాత నాకు పురిటినొప్పులు వచ్చాయి. కానీ చుట్టుపక్కల డాక్టర్లు ఎవరూ లేరు. నేను ఒక బండరాయిపై పడుకొని సహాయం కోసం ఏడ్చాను. నా భర్త ఎంత ప్రయత్నించినా వైద్యసహాయం అందలేదు. అడవిలో ఆశ్రయం పొందిన కొందరు మహిళలను నా భర్త వేడుకున్నాడు. వారి సాయంతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సునామీకి జన్మనిచ్చాను.తిండి లేదు. సముద్రానికి భయపడి అడవి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో నా బిడ్డ బతుకుతాడా అనే బాధ మొదలైంది. కొబ్బరి నీళ్లే ఆహారమయ్యాయి. లాల్ టిక్రీ హిల్స్లో నాలుగు రాత్రులు గడిపిన మమ్మల్ని రక్షణ సిబ్బంది కాపాడారు. చికిత్స కోసం నన్ను పోర్ట్ బ్లెయిర్లోని జీబీ పంత్ ఆసుపత్రికి ఓడలో తీసుకువెళ్లారు. హట్ బే నుంచి పోర్ట్ బ్లెయిర్కు 117 కిలోమీటర్ల దూరం. సుమారు ఎనిమిది గంటల సమయం పట్టింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది నమిత.కోవిడ్ మహమ్మారి సమయంలో భర్త లక్ష్మీ నారాయణ మరణించడంతో ఇద్దరు కుమారులు సౌరభ్, సునామీలతో కలిసి పశ్చిమబెంగాల్లోని హుగ్లీలో నివసిస్తుంది నమితా రాయ్.నమిత పెద్ద కుమారుడు సౌరభ్ ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు సునామీ ‘ఓషనోగ్రాఫర్’ కావాలనుకుంటున్నాడు.‘మా అమ్మే నాకు సర్వస్వం. ఆమె ధైర్యశాలి. నాన్న చనిపోయాక మమ్మల్ని పోషించడానికి చాలా కష్టపడింది. ఫుడ్ డెలివరీ సర్వీసును నిర్వహించింది. దానికి సునామీ కిచెన్ అని సగర్వంగా పేరు పెట్టింది’ అంటున్నాడు సునామీ రాయ్.‘2004లో సమర్థవంతమైన హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో పెద్ద ఎత్తున విధ్వంసం,ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.400కు పైగా హెచ్చరిక కేంద్రాలు(వార్నింగ్ స్టేషన్స్) ఉన్నాయి. సునామీ నాటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అంటున్నారు అండామన్ నికోబార్ దీవుల అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారులు. -
గ్లోబల్ ‘వార్నింగ్’ ఇటు వరద... అటు కరువు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘గ్లోబల్ వార్మింగ్’ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రానున్న కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా ప్రాంతాల వారీగా తీవ్రతను బట్టి వరదలు, కరువు వంటి పరిస్థితులు ఎదురు కానున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు తీవ్ర కరువును, మరికొన్ని తీవ్ర వరద ముప్పును ఎదుర్కోనున్నాయి. ఈమేరకు ఐఐటీ గువహటి, ఐఐటీ మండీ, బెంగళూరుకు చెందిన సీఎస్టీఈపీ (సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ) సంస్థలు తాజాగా చేసిన సంయుక్త అధ్యయనంలో పేర్కొన్నాయి.దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ వాతావరణంలో మార్పులు, వరదలొచ్చే అవకాశాలు, కరువులు వంటివాటిపై అధ్యయనం చేశారు. దీని ప్రకారం ఏపీలోని మూడు జిల్లాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కోనున్నట్టు వెల్లడించారు. కరువు కోరల్లో విశాఖ, కర్నూలు రాష్ట్రంలోనే ప్రధాన నగరంగా ఉన్న విశాఖపట్నం జిల్లాలో కరువు సమస్య పొంచివున్నట్టు అధ్యయనంలో తేలింది. దీంతోపాటు కర్నూలు, ప్రకాశం జిల్లాలు కూడా తీవ్ర కరువును ఎదుర్కొనే అవకాశం ఉందని ఐఐటీ నిపుణులు తేల్చారు. గతంతో పోలిస్తే ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ (భూ ఉపరితల ఉష్ణోగ్రత) 1 డిగ్రీ సెల్సియస్ నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని తేల్చారు. ఎక్కువ ఉష్ణోగ్రతల ఒత్తిడి కారణంగా కొండచరియలు విరిగి పడటం వంటి ప్రమాదాలూ ఉండవచ్చునని పేర్కొన్నారు. వరదల కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అధ్యయనం తేల్చింది. ఇదిలా ఉండగా.. వరద ముప్పుతో పాటు గుంటూరుకు కరువు ప్రమాదం కూడా ఉందని తేల్చారు.శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు వరద ముప్పు చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 51 జిల్లాలు అత్యధిక వరద ప్రమాదాన్ని, 118 జిల్లాలు అధిక వరద ముప్పును ఎదుర్కోనున్నట్టు తేలింది. మరో 91 జిల్లాలు అత్యధిక కరువు ప్రమాదం, 188 జిల్లాలు అధిక కరువు ప్రమాదం ఉన్న కేటగిరీలో చేర్చారు. వరద ముప్పులో ‘ఆ మూడు’ రాష్ట్రంలో రానున్న సంవత్సరాల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కోనున్నట్లు అధ్యయనంలో తేల్చారు. వాతావరణంలో మార్పులు, తుపానులు, ఉష్ణోగ్రతల కారణంగా ఈ మూడు జిల్లాల్లో తీవ్ర వరదలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల వరదల కారణంగా విజయవాడ నీట మునిగిన విషయం తెలిసిందే. -
రాష్ట్ర ప్రజలపై యూజర్ పిడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు వరుసగా షాక్ల మీద షాక్లు ఇస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు సంగతి దేవుడెరుగు.. రోజుకో రీతిన ప్రజలను బాదేస్తోంది. మొన్న కరెంట్ చార్జీల రూపంలో రెండుసార్లు భారీ షాక్లు ఇవ్వగా, నిన్న రిజిస్ట్రేషన్ చార్టీలను ఇదివరకెన్నడూ లేని రీతిలో పూరి గుడిసెలను సైతం వదలకుండా పెంచేసింది. క్లాసిఫికేషన్ల పేరుతో దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇవన్నీ చాలవన్నట్లు తాజాగా యూజర్ చార్జీల పేరుతో నగర, పట్టణ వాసులను భారీగా బాదేయడానికి సిద్ధమైంది. మరో వైపు ఏరు దాటేశామని ప్రజలందరినీ బోడి మల్లన్నలు చేస్తూ.. రాష్ట్రంలో వసూలు చేసే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై ప్రత్యేకంగా వరదల సెస్ విధించడానికి అనుమతివ్వాలంటూ జీఎస్టీ కౌన్సిల్ను కోరింది. ప్రజలేమనుకుంటే మాకేంటని నిస్సిగ్గుగా ప్రజలను అన్ని రకాలుగా వాయించేస్తూ.. ‘బాబు అంటే బాదుడే బాదుడు’ అని నిరూపించుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో యూజర్ చార్జీలు అనే పదం వింటే తెలుగు రాష్ల్రాల ప్రజలందరికీ గుర్తుకు వచ్చేది నారా చంద్రబాబునాయుడే. ఇప్పుడు ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉంటూ మరోసారి ‘యూజర్ చార్జీలు’ అంటూ ప్రజల మీద భారం వేయడానికి సిద్ధమయ్యారు. ప్రధానంగా పట్టణ ప్రజలపై యూజర్ చార్జీల మోత మోగించాలని వికసిత్ ఆంధ్రా–2029 కార్యాచరణ ప్రణాళికలో స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సామాజిక, ఆర్థిక సర్వేలోనూ చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. నీటి సరఫరాకు సంబంధించి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఆపరేషన్, మురుగునీటి శుద్ది ప్లాంట్ల ఆపరేషన్.. నిర్వహణ, నీటి సరఫరా, పంపిణీ నెట్ వర్క్, యంత్రాల నిర్వహణ, ఆపరేషన్కు అయ్యే వ్యయాన్ని పట్టణ ప్రజల నుంచి యూజర్ చార్జీల రూపంలో వసూలు చేయడానికి అడుగులు ముందుకు వేస్తోంది. ఇందుకోసం వినియోగదారుల చార్జీల పేరుతో పట్టణ స్థానిక సంస్థలు సంస్కరణలు చేపట్టాలని దిశా నిర్దేశం చేస్తోంది. ఎప్పటికప్పుడు యూజర్ చార్జీల నిర్వహణ, ఆపరేషన్ వ్యయానికి తగినట్లుగా రుసుము పెంచాల్సి ఉందని కూడా నొక్కి చెప్పింది. ఇలా ప్రజలను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ బాదేస్తున్న కూటమి ప్రభుత్వం.. తమది సిటిజన్ ప్రెండ్లీ వ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకోవడం గమనార్హం.ఆస్తి పన్ను పెంచేలా అడుగులుపట్టణాల్లో ఆస్తి పన్ను సంస్కరణల ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇంటి నిర్మాణ వైశాల్యం, ఖాళీ స్థలం కొలతలను వేయించింది. పట్టణాల్లో ఆస్తులన్నీ రియల్ టైమ్ మదింపు చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేయనున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో సింగిల్ డిజిట్ ఉపయోగించి బిల్డింగ్ ప్లాన్ ఆమోదంతో సహా ఆస్తుల డేటా సేకరిస్తున్నారు. ఇంటిగ్రేటెట్ డిజిటలైజ్డ్ బిల్లింగ్ ద్వారా ఆస్తి పన్నుకు సంబంధించి ఆటోమెటిక్ డిజిటల్ బిల్లు జనరేట్ చేయనున్నారు. ఎస్ఎంఎస్తో పాటు వివిధ మార్గాల ద్వారా ఆస్తి పన్ను చెల్లింపును యజమానులకు గుర్తు చేయనున్నారు. బౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) ఆధారంగా ఆస్తుల వివరాలను మ్యాపింగ్ చేయనున్నారు. చాలా కాలంగా ఆస్తుల కిందకు రాని ఆస్తులన్నీ ఈ మ్యాపింగ్లోకి తీసుకురావడంతో పన్నుల పరిధిలో మరిన్ని ఆస్తులు రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డ్రోన్స్ ద్వారా కూడా ఇప్పటికే మ్యాపింగ్లో ఉన్న ఆస్తులకు అదనంగా ఉన్న ఆస్తులను జత చేస్తోంది. ఆస్తి పన్ను రిజిస్టర్ను రాష్ట్ర స్టాంప్ డ్యూటీతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ విభాగాలకు అనుసంధానం చేయనున్నారు. తద్వారా ఆస్తులలో మార్పులు చేసినట్టయితే అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేయడానికి వీలు కలుగుతుంది.వరదలనూ వాడుకుంటాం..రాష్ట్రంలో వసూలు చేసే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై ప్రత్యేకంగా సెస్ విధించడానికి అనుమతివ్వాలంటూ కూటమి సర్కారు జీఎస్టీ కౌన్సిల్ను కోరింది. శనివారం రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ ప్రతిపాదన చేశారు. 5 శాతం జీఎస్టీ దాటిన అన్ని వస్తువులపై అదనంగా ఒక శాతం ఏపీ ఫ్లడ్ సెస్ విధించడానికి అనుమతివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారమన్కు విజ్ఞప్తి చేశారు. ఈ సెస్ ద్వారా వచ్చే నిధులతో రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంత్రాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపడతామన్నారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు ఇదే తరహాలో సెస్ విధించారని తెలిపారు. 5 శాతానికి మించిన జీఎస్టీ శ్లాబులపై ఈ సెస్ విధిస్తుండటంతో పేదలు, మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం ఉండదంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇన్నోవేషన్లకు ప్రొత్సహమిచ్చేలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహించే రీసెర్చ్ సర్వీసెస్కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫోర్టిఫైడ్ బియ్యంపై జీఎస్టీ సుంకాన్ని తగ్గించాలని, ఐజీఎస్టీ సెటిల్మెంట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేపట్టాలని, ఈ డేటా రాష్ట్రాలకూ అందుబాటులో ఉంచాలన్నారు. చిన్న వ్యాపారులు, కాంపోజిషన్ జీఎస్టీ చెల్లింపుదారులకు అద్దెల విషయంలో విధించే రివర్స్ ఛార్జ్ మెకానిజం (ఆర్సీఎం) నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించేందుకు జీఎస్టీ కౌన్సిల్ మంత్రివర్గ ఉప సంఘాన్ని వేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబు కూడా పాల్గొన్నారు. -
వరదలు.. పెనుగాలులు.. భూకంపం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలోని గోదావరి తీర ప్రాంతాలు ప్రకృతి విపత్తులకు నిలయంగా మారుతున్నాయి. కొన్నేళ్ల నుంచి జరిగిన ఘటనలను పరిశీలిస్తే.. ఏటా ఏదో ఒక విపత్తు ఎదురవుతోంది. ముఖ్యంగా ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. వరుసగా అతి భారీ వర్షాలు, వరదలు, పెనుగాలులు టోర్నడోలు, ఇప్పుడు భూకంపం వంటివి తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.అతి భారీ వర్షాలతో..2022 జూలై 14 నుంచి 16 వరకు ఈ ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి కారణంగా గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. ఏ క్షణమైనా కరకట్ట కొట్టుకుపోయి భద్రాచలం మునిగిపోతుందనే పరిస్థితి ఏర్పడింది. 2023 జూలై 27న భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో అత్యంత భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో ఏకంగా ఒక్కరోజే 64.9 సెంటీమీటర్ల వాన పడింది. అందులో కేవలం మూడు గంటల్లోనే 46.4 సెంటీమీటర్ల అతి భారీ వాన పడింది. అదేరోజు జయశంకర్ జిల్లా చిట్యాలలో 61.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాగులు ఉప్పొంగి గ్రామాలు నీట మునిగి పన్నెండు మంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ఆగస్టు 31న నర్సంపేట, పాలకుర్తి, మహబూబాబాద్ నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షంపడి మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులకు కనీవినీ ఎరుగని రీతిలో వరద వచ్చింది. ఖమ్మం పట్టణం, పరిసర గ్రామాలు చిగురుటాకులా వణికిపోయాయి.లక్ష చెట్లను కూల్చేసిన పెనుగాలులుఈ ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్ ఒకటో తేదీల మధ్య ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో తీవ్ర పెను సుడిగాలులు వీచాయి. ఏటూరునాగారం అభయారణ్యంలో ఏకంగా 334 హెక్టార్ల పరిధిలో లక్ష వరకు చెట్లు కూలిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ వాయు విధ్వంసానికి కారణాలను ఇప్పటికీ స్పష్టంగా తేల్చలేదు. ఇక్కడే భూకంప కేంద్రాలురాష్ట్రంలోని సిర్పూర్, జైనూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, మంథని, భూపాలపల్లి, వరంగల్, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలు భూకంప సీస్మిక్ జోన్–3 పరిధిలో ఉన్నాయి. బొగ్గు గనులు విస్తృతంగా ఉన్న ఈ ప్రాంతాల్లో తరచూ భూమి నుంచి భారీ శబ్దాలు రావడం సాధారణంగా మారిపోయింది. ఇదే ప్రాంతంలోని భద్రాచలంలో 1969లో 5.7 తీవ్రతతో భూకంపం రాగా.. ఇప్పుడు 5.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. గత ఆరేళ్లలో మణుగూరులో స్వల్ప స్థాయిలో మూడు సార్లు ప్రకంపనలు వచ్చాయి కూడా. భారీగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం, బొగ్గు తవ్వకాలు, గోదావరిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు వంటివి విపత్తులకు దారితీస్తున్నాయని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. వేడి నీటిబుగ్గలకూ కేంద్రంములుగు జిల్లాలోని రామన్నగూడెం ప్రాంతంలో వేడి నీటిబుగ్గలు ఉన్నాయి. 1954లో ఇక్కడ చమురు నిక్షేపాల అన్వేషణ కోసం తవ్వకాలు జరిపి వదిలేసిన బోరులోనుంచి ఇప్పటికీ వేడి నీళ్లు వెలువడుతూ ఉన్నాయి. భూమి పొరల్లో పగుళ్ల వల్ల నీళ్లు మరింత లోతుకు వెళ్లి... అక్కడి అధిక ఉష్ణోగ్రతల వల్ల వేడై పైకి ఉబికివస్తాయని నిపుణులు చెబుతున్నారు.మానవ తప్పిదాలపై ప్రకృతి హెచ్చరికలివి!మానవ తప్పిదాలపై ప్రకృతి చేసిన హెచ్చరికలను మనం పట్టించుకోలేదు. మూడు నెలల క్రితం తాడ్వాయి అడవుల్లో టోర్నడోల తీవ్రత కారణంగా లక్ష చెట్లు నేలకొరిగినప్పుడే భూకంపాలపై హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ ఘటన జరిగాక కారణాలేమిటన్న దానిపై ప్రభుత్వం, వర్సిటీలు, ఎన్జీఆర్ వంటి సంస్థలు ఎలాంటి పరిశోధనలు చేయలేదు. మనం గోదావరి బెల్ట్ను నాశనం చేశాం. ప్రాజెక్టుల కోసం అడవులు నరికేశాం. భూమి లోపల పొరలు ఎలా ఉన్నాయి? డ్యామ్ల వల్ల వాటికి ఏ మేరకు నష్టం అన్నది సాంకేతికంగా పరిశీలించలేదు. అది భూకంపాలకు కారణమవుతోంది.– పాకనాటి దామోదర్రెడ్డి, పర్యావరణవేత్త -
హైదరాబాద్ లో 40 ఏళ్ళలో 45 శాతం చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి: రంగనాథ్
-
ఫెంగల్ తుఫాన్ బీభత్సం.. సీఎం స్టాలిన్కు ప్రధాని ఫోన్
చెన్నై: ఫెంగల్ తుఫాన్ తమిళనాడులో అపార నష్టాన్ని మిగిల్చింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, తమిళనాడులోని విల్లుపురం, సేలం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై జిల్లాలో పెను విలయాన్ని మిగిల్చింది. కుండపోతగా వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈ వరదలకు ఊర్లకు ఊర్లో మునిగిపోయాయి.తాజాగా వరదలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు ప్రధానమత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని వర్షాలు, వరద పరిస్థితిపై ప్రధాని ఆరా తీశారు.కేంద్రం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు.ఇక ఉత్తర తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు పోతెత్తాయి. వంతెనలు, రోడ్లు నీట మునిగాయి. భారీ విస్తీర్ణంలో పంట పొలాలు ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు నీట మునిగి ఉన్నాయి. సాయం కోసం గ్రామీణ జనం ఎదురుచూస్తున్నారు. మరోవైపు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తోపాటుగా మంతరులు బాధిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.తిరువణ్ణామలై మహా దీపం కొండపై నుంచి మట్టి చరియలు, బండరాళ్లు కొట్టుకు వచ్చి ఆదివారం రాత్రి ఇళ్లపై పడిన విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఈ శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని ప్రాణాలతో రక్షించేందుకు ప్రయత్నిచినా.. ఫలితం లేదు. సోమవారం రాత్రి మృతదేహాలుగా వారంతా బయట పడ్డారు.మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం అరేబియన్ సముద్రంలో ప్రవేశించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. -
‘బుడమేరు వరద సాయం ఇదేనా బాబూ?’
విజయవాడ, సాక్షి: ఏపీలో చంద్రబాబు పాలన ఎంత అధ్వానంగా ఉందో చెప్పే పరిస్థితి ఇది. విజయవాడ ఎంపీతో పాటు కూటమి ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బుడమేరు వరద సాయం ఇంకా పూర్తి స్థాయిలో అందలేదంటూ బహిరంగంగానే పెదవి విరిచారు. ఈ క్రమంలో.. ఇవాళ జరిగిన తొలి డీఆర్సీ సమావేశంలో సమస్యలను ఏకరువు పెట్టారు వాళ్లు.బుడమేరు వరద సాయం ఇంకా చాలామందికి అందలేదంటూ డీఆర్సీలో ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని),ఎమ్మెల్యేలు నిజాలు ఒప్పుకున్నారు. బుడమేరు వరద ముంపు బాధితుల్లో బాధితులకు ఇంకా నష్టపరిహారం అందలేదు. మరోమారు ఎన్యుమరేషన్ చేయాలి అని ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని) అన్నారు. కొండచరియలు విరిగిపడి చనిపోయిన వారికి పరిహారం ఇవ్వలేదు. కొండ ప్రాంత ప్రజలను ఆదుకోవాలి అని ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.వరద బాధితులను ఇంకా కొంత మందికి నగదు అందలేదు. మేము బయటకు వస్తుంటే ప్రజలు అడుగుతున్నారు. అన్ని ప్రాంతాల్లో వాటర్ డ్యామేజ్ జరిగింది. బుడమేరు డైవర్షన్ చర్యలు తీసుకోవాలి. పట్టి సీమ నీళ్లు వదిలినప్పుడు బుడమేరులోకి వస్తున్నాయి. బుడమేరు వల్ల మైలవరం నియోజకవర్గం పూర్తిగా దెబ్బతింది. జి.కొండూరులో 13,800 ఎకరాల రైతులు ఇబ్బది పడుతున్నారు. 1 కోటి 20 లక్షల మోటార్లు రిపేర్లు ఉన్నాయి అని మైలవరం ఎమ్మెల్యే,వసంత కృష్ణప్రసాద్ అన్నారు.నందిగామ ఎమ్మెల్యే,తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. నందిగామలో పంట పూర్తిగా దెబ్బతింది. రైతులకు నష్ట పరిహారం అందించాలని అన్నారు.గన్నవరం ఎమ్మెల్యే,యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. విజయవాడ, అంబాపురం , గన్నవరంలో 200 కోట్లు అభివృద్ధి పనులు చేయాలి. అభివృద్ధి పనులకు నిధులు కేటాయంచాలి. విజయవాడ రూరల్ మండలంలో అభివృద్ధి చేయాలి అని అన్నారు.ఇక జగ్గయ్యపేట ఎమ్మెల్యే,శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ.. త్రాగునీరు విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యను తక్షణమే పరిష్కరించాలని అన్నారు.ధాన్యం కనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తిరువూరు,ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఆలోచన చేయాలి. తిరువూరులో పత్తి పంట కొనేవారు లేదు. పత్తి పండుతున్నా ఇక్కడ కొనుగోలు కేంద్రం లేదు..గుంటూరులో ఉంది అని గుర్త చేశారాయన.ఇక.. పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ.. కండ్రిక, జక్కంపూడి ప్రాంతంలో ఇంకా ఆటో డ్రైవర్లకు పరిహారం అందలేదన్నారు. అలాగే.. ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. -
రాజధాని అమరావతికి ముంపు తప్పదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి ముంపు ముప్పు తప్పదని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. భారీ వర్షాలు, వరదలతో ఆ ప్రాంతమంతా ముంపునకు గురవుతుందని పేర్కొంది. వరద నియంత్రణకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఉన్నప్పటికీ.. కొండవీటి వాగుతోపాటు, పాలవాగు నుంచి వచ్చే వరద నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చింది. ఈ నేపథ్యంలో ముంపు నివారణకు భారీ వ్యయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.వరద నివారణ పనులు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఏకంగా రూ.8,014.61 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్టు ప్రపంచ బ్యాంకు రుణ డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం వరద నియంత్రణ పేరుతో కొండవీటి వాగు పంపింగ్ స్టేషన్ను రూ.450 కోట్లతో నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి అదనంగా మొత్తం 20 ప్యాకేజీలలో వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు టెండర్లు ఆహ్వానించనున్నట్టు ప్రపంచ బ్యాంకు డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. విస్తుపోతున్న అధికారులు, నిపుణులువరద నివారణకు రూ.8,014.61 కోట్లు ఖర్చవుతుందని తెలిసి.. ఆ పనులు ప్రతిపాదించడం పట్ల అధికార యంత్రాంగం విస్తుపోతోంది. వరద ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలనే ప్రభుత్వ ఆలోచనే లోపభూయిష్టంగా ఉందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వరద నియంత్రణకు వెచ్చించే నిధుల్లో సగం ఖర్చుతోనే వరద ముంపులేని ప్రాంతంలో పరిపాలన భవనాలను నిర్మించవచ్చని అధికారులు, నిపుణులు పేర్కొంటున్నారు. రాజధాని పేరుతో అమరావతిలోనే రూ.వేల కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం చూస్తుంటే.. మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవనే విషయం స్పష్టమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.వరద నివారణ ప్రతిపాదనలు ఇలా..ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు అమరావతి ప్రాంతంలో వరద ముంపును నివారించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు ఇవీ.⇒ కొండవీటి వాగును (23.60 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.⇒పాల వాగు (16.70 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.⇒ శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో 50 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ కొండవీటి వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ (7.82 కి.మీ,) నిర్మాణం ద్వారా కృష్ణా నదికి మళ్లించాలి.⇒ వర్షాకాలంలో అదనపు నీటిని డ్రెయినేజీలకు మళ్లించేందుకు కరకట్ట వద్ద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి. ⇒ ఉండవల్లి వద్ద 7,500 క్యూసెక్యుల సామర్థ్యంతో వరద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి.⇒ వరద నీటిని నిలుపుదల చేసేందుకు కృష్ణాయపాలెంలో 1.7 మీటర్ల ఎత్తు కట్టతో 90 ఎకరాల్లో 0.1 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో రిటెన్షన్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ శాఖమూరు వద్ద 50 ఎకరాల్లో 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ నీరుకొండలో 400 ఎకరాల్లో 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలి. -
మేటల తొలగింపు మాటల వరకే
వరద బారినపడి పొట్టదశకు వచ్చిన వరి పంట నాశనమైపోయింది. పొలాల్లో వేసిన ఇసుకమేటలు నెలలు గడుస్తున్నా అలాగే ఉన్నాయి. ఇంతవరకూ అధికారులుగానీ, నాయకులుగానీ పట్టించుకోలేదు. కనీసం అంచనాలు కూడా వేయలేదు. ఒకపక్క పంట పోయింది. వేరేపంట వేద్దామంటే పొలం నిండా ఇసుక, మట్టి మేటలు వేసి ఉంది. దాన్ని తొలగించాలంటే ఎకరానికి రూ.30 వేల నుంచి రూ. 40 వేలు ఖర్చవుతుంది. కాలువలకు పడిన గండ్లు కూడా ఇంకా పూడ్చలేదు. పలుమార్లు జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడంలేదు. ఏంచేయాలో దిక్కుతోచడంలేదు. – ముప్పిడి శ్రీనివాసరెడ్డి, కౌలురైతు, రాపర్తి, పిఠాపురం మండలంపిఠాపురం: ఏటా మూడు పంటలు పండే మాగాణి ఇసుక దిబ్బలా కనిపిస్తోంది. వరద సమయంలో వచ్చి మేమున్నామని హామీ ఇచ్చిన నాయకులు, అధికారులు పత్తాలేకుండా పోయారు. నెలలు గడిచిపోతున్నాయి. పొలానికి వెళ్తే కాలువకు పడిన గండ్లు వెక్కిరిస్తున్నాయి. పంట పోయి, పొలం నాశనమై ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తుంటే.. సర్కారు నాలుక మడతెట్టింది. ఇసుకమేటలు తొలగించేందుకు పరిహారం ఇచ్చేది లేదని, ఉపాధి హామీ ద్వారా పనులు చేయిస్తామంటూ చేతులెత్తేయడంతో రైతులు నిరాశలో కూరుకుపోయారు.సెప్టెంబర్ నెలలో కురిసిన భారీవర్షాల కారణంగా ఏలేరు కాలువ ముంచెత్తడంతో కాకినాడ జిల్లాలో పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, పెద్దాపురం, కిర్లంపూడి తదితర మండలాల్లో సుమారు 80 వేల ఎకరాల్లో వరి, వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏలేరు కాలువకు గండ్లుపడి సుమారు 500 ఎకరాల్లో ఇసుక, మట్టి భారీఎత్తున మేటలు వేశాయి. పిఠాపురం మండలం రాపర్తి ఏరియాలోని వరి పొలాల్లో సుమారు 2 అడుగుల మేర ఇసుక మేటలు వేసింది. దీంతో ఇసుక తొలగిస్తే తప్ప తరువాతి పంట వేయలేమని రైతులు వాపోతున్నారు. హెక్టారుకు రూ. 17 వేలు ఇస్తామన్నారు.. వరద ప్రభావం వల్ల పంటలు నాశనమైన పొలాలకు ఎకరానికి రూ.10వేలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని, ఇసుక మేటలు వేసిన పొలాలకు హెక్టారుకు రూ.17 వేలు ఇస్తామని అప్పట్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రకటించారు. 3 అంగుళాల మేర ఇసుక మేట ఉంటే పరిహారానికి అర్హులుగా పరిగణిస్తామన్నారు. అయితే పొలాల్లో 8 నుంచి 10 అంగుళాల మేర ఇసుక మేటలు ఉన్నట్లు గుర్తించామన్నారు. జిల్లాలో 75 వేల ఎకరాల్లో వరి, ఇతర పంటలు నీట మునిగాయని, 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం జరిగితేనే ఇన్పుట్ సబ్సిడీ వస్తుందని తెలిపారు. ప్రత్యేక బృందాలతో పంటనష్టం అంచనాలు తయారు చేసేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. రైతులు ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇసుకమేటలకు పరిహారం రాదనడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.పొట్టదశలో పంట తుడిచిపెట్టుకుపోయింది సకాలంలో వర్షాలు కురవడంతో ఈ ఏడాది పంటలు బాగా పండుతాయన్న ఆశతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టి సాగు చేశాను. అంతా బాగుంది, పంట పొట్టదశకు చేరుకుంటుందన్న సమయంలో వరద ఒక్కసారిగా పంటను తుడిచిపెట్టేసింది. పెట్టుబడి అంతా నీటి పాలయ్యి అప్పులు మిగిలాయి. ప్రభుత్వం చూస్తే ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇస్తారో ఇవ్వరోకూడా తెలియదు. పంట పోతే పోయింది. పొలాల్లో వేసిన ఇసుక మేటలు మాపై మరింత భారాన్ని వేశాయి. నిబంధనల పేరుతో ఇసుకమేటలు తొలగింపుకు పరిహారం ఇవ్వమని అధికారులు చెబుతున్నారు. గతంలో హెక్టారుకు రూ. 17 వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు లేదంటున్నారు. పొలాల్లో వేసిన ఇసుకమేటలు తొలగించాలంటే ఎకరాకి రూ. 40 వేలకు పైనే ఖర్చవుతుంది. – చింతపల్లి నీలారెడ్డి, రైతు, రాపర్తి, పిఠాపురం మండలం మట్టి, ఇసుక మేటలకు పరిహారం రాదు వరద వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసిన రైతులకు పరిహారం వచ్చే అవకాశం లేదు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పంట పొలాల్లో ఇసుక, మట్టి మేటలు తొలగించడానికి చర్యలు తీసుకుంటారు. అది ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదు. – ఎ.అచ్యుతరావు, వ్యవసాయశాఖ అధికారి, పిఠాపురం మండలం -
శ్రీశైలం 4 క్రస్ట్ గేట్లు ఎత్తి సాగర్కు నీటి విడుదల
శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్/తాడేపల్లిరూరల్: శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు పెరుగుతుండటంతో గురువారం 4 రేడియల్ క్రస్ట్గేట్లను తెరచి 1,12,300 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదులుతున్నారు. గురువారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 1,89,328 క్యూసెక్కుల వరద శ్రీశైలంకు వచ్చి చేరుతోంది. బుధవారం నుండి గురువారం వరకు బుధవారం నుండి గురువారం వరకు ఎగువ ప్రాజెక్ట్ల నుంచి శ్రీశైలంకు 1,27,093 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. కుడిగట్టు కేంద్రంలో 15.213 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.744 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 215.8070 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం పూర్తిస్థాయి 885 అడుగులకు చేరుకుంది. సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగటంతో నాగార్జున సాగర్ జలాశయం నుంచి గురువారం 20 రేడియల్ క్రస్ట్గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి 2,10,149 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా అంతే నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్లో 20 క్రస్ట్గేట్ల ద్వారా స్పిల్వే మీదుగా 1,62,000 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 28,826 క్యూసెక్కులు మొత్తం 1,90,826 క్యూసెక్కులు దిగువకి విడుదల చేస్తున్నారు. కుడి,ఎడమ కాలువలు, ఎస్ఎల్బీసీ, వరద కాలువల ద్వారా 19,323క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాగా ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో బ్యారేజి రిజర్వాయర్లో 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ 30 గేట్లను 1 అడుగు మేర ఎత్తి దిగువకు 21 వేల 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
భారీ వర్షానికి బెంగళూరు అస్తవ్యస్తం
బెంగళూరు: భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన కర్నాటకలోని బెంగళూరు నగరం భారీ వర్షానికి అతలాకుతలమైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకుంది.నీటి ప్రవాహం కారణంగా పలు రహదారులును అధికారులు మూసివేశారు. బాధితులను రక్షించేందుకు అధికారులు పడవలను వినియోగిస్తున్నారు. మరోవైపు పలువురు బెంగళూరువాసులు సోషల్ మీడియాలో అధికారులపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని పలు రహదారుల్లో మోకాళ్ల లోతు మేరకు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. #WATCH | Karnataka | Residents of an Apartment in Yelahanka are being rescued through boats.Due to incessant heavy rain, waterlogging can be seen at several places in Bengaluru causing problems for the residents in Allalasandra, Yelahanka pic.twitter.com/AekmTVOAlW— ANI (@ANI) October 22, 2024మీడియాకు అందిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం వరకు బెంగళూరు రూరల్ పరిధిలో 176 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బెంగళూరు అర్బన్ ప్రాంతంలో 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. సోమవారం రాత్రి 20కి పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. నాలుగు ఇండిగో విమానాలను చెన్నైకి మళ్లించారు. నగరంలోని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు.ఇది కూడా చదవండి: మరోమారు 30 విమానాలకు బాంబు బెదిరింపులు -
అనంత అతలాకుతలం.. ముంచేసిన పండమేరు (ఫొటోలు)
-
బాధితులకు భరోసా .. గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
-
కృష్ణాలో పెరుగుతున్న వరద ప్రవాహం
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్/తాడేపల్లి రూరల్: కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహం గంటగంటకూ పోటెత్తుతోంది. ఆదివారం సాయంత్రానికి జూరాల, సుంకేశుల, హంద్రీ నుంచి 1,95,929 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్ వద్ద ఆరు రేడియల్ క్రస్ట్గేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా నాగార్జున సాగర్కు 1,67,898 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం వరకు ఎగువ ప్రాజెక్ట్ల నుంచి 1,75,782 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా.. 1,59,070 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా.. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగడంతో నాగార్జునసాగర్ జలాశయం వద్ద 20 రేడియల్ క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 2,32,110 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. ఇక్కడి నుంచి 2,45,943 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద నీరు చేరుతోంది. జేఈ రాజేష్ మాట్లాడుతూ.. పులిచింతల ప్రాజెక్ట్, ఇతర వాగుల నుంచి 1,62,689 క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి రానుందన్నారు. ఈ దృష్ట్యా బ్యారేజీ వద్ద 20 గేట్లు 4 అడుగులు, 50 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి దిగువకు 1,57,250 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని తెలిపారు. -
శ్రీశైలంలో 4, సాగర్లో 16
నాగార్జునసాగర్, దోమలపెంట: వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో నాలుగు గేట్లు పైకెత్తి స్పిల్వే ద్వారా 1,11,932 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో జూరాల నుంచి స్పిల్వే ద్వారా 82,940 క్యూసెక్కులు, విద్యుదు త్పత్తి చేస్తూ 35,524, సుంకేసుల నుంచి 72,114, హంద్రీ నుంచి 250 మొత్తం 1,90,828 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 36,900 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 31,139 మొత్తం 68,039 క్యూసెక్కుల నీరు అదనంగా సాగర్కు విడుదలవుతున్నాయి. ప్రస్తు తం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 884.7 అడుగుల వద్ద 213.8824 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారా 8,000 క్యూసెక్కులు, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్ఎన్ ఎస్ఎస్కు 1,561, రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో శనివారం అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు 16 రేడియల్ క్రస్ట్గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 16 గేట్లను ఐదడుగులు పైకి ఎత్తి స్పిల్వే మీదుగా 1,29,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం 590 అడుగుల గరిష్ట నీటిమట్టంతో ఉంది. ప్రస్తుతం సాగర్ జలాశయానికి 1,74,120 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ ప్రధాన విద్యుదుత్పా దన కేంద్రం ద్వారా 29,435 క్యూసెక్కులు, క్రస్ట్గేట్ల నుంచి 1,29,600 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వ లకు, ఏఎమ్మార్పీ, వరద కాల్వలకు 15,085 క్యూసె క్కుల నీరు వదులుతున్నారు. మొత్తం సాగర్ నుంచి 1,74,120 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. -
అర్జీలన్నీ అంతే సంగతులా!?
విజయవాడ కండ్రికలోని ఈమె ఇల్లు ఇటీవల బుడమేరు వరదల్లో పూర్తిగా మునిగింది. 12 రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపింది. సర్వే సిబ్బంది వివరాలు రాసుకుని వెళ్లారు. అయితే, పరిహారానికి సంబంధించిన జాబితాలో మాత్రం ఈమె పేరులేదు. సచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితంలేదు. కలెక్టరేట్లో కూడా మరోసారి దరఖాస్తు చేసుకుంది. చివరికి.. ఎవరిని అడిగినా లాభంలేక సాయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ : బుడమేరు వరదతో విజయవాడలో నిండా మునిగిన బాధితులకు నష్టపరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వరదలు వచ్చి 45 రోజులకు పైగా గడిచినప్పటికీ, సాయం కోసం ఇంకా వేలాది మంది బాధితులు నిరీక్షిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క బాధితుడికి సహాయం అందిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. రకరకాల సాకులతో బాధితుల జాబితాకు కోతేసి గతనెల 17న సచివాలయాల్లో ప్రదర్శించారు. కానీ, సర్వే అంతా తప్పుల తడకగా ఉందని, గ్రౌండ్ఫ్లోర్ అయితే, ఫçస్ట్ ఫ్లోర్ అని.. వాహనాలు నమోదు కాలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మరికొందరైతే తమ పేర్లు నమోదు చేయలేదంటూ రోడ్డెక్కి ధర్నా చేశారు. దీంతో బాధితుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు సచివాలయాల పరిధిలో దరఖాస్తులు తీసుకున్నారు. ఆ సమయంలో 18వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో కొన్నింటిని పరిష్కరించి, వరద బాధితుల ఖాతాల్లో నగదు జమచేశారు. అయినా ఇంకా తమకు పరిహారం అందలేదంటూ చాలామంది సెపె్టంబరు 27 వరకు సచివాలయాల చుట్టూ తిరిగారు. తామేమీ చేయలేమని అక్కడి సిబ్బంది చెతులేత్తేయడంతో సెప్టెంబరు 28 నుంచి బాధితులు దరఖాస్తులతో విజయవాడలోని కలెక్టరేట్ బాటపట్టారు. ఇలా వచ్చిన దరఖాస్తులు 21వేలకు పైగా ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సాయం కోసం ఎదురుచూపులు.. సీన్ కట్చేస్తే.. ఇప్పుడీ దరఖాస్తుల గురించి సమా«ధానం చెప్పేవారే కరువయ్యారు. వీటిని అధికారులు పరిశీలించి, అర్హులైన జాబితాలు సచివాలయాల్లో ఉంచితే బాధితుల్లో గందరగోళం ఉండేది కాదు. అయితే, దరఖాస్తులు కంటితుడుపుగా తీసుకున్నారా లేక కాలయాపన చేసి వీటిని కోల్డ్స్టోరేజిలోకి నెడతారా అని బాధితులు అనుమానిస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోవడంతో, బాధితుల అర్జీలన్నీ బుట్టదాఖలు అయినట్లేనని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు. అంచనా బృందాల అరాచకం.. ఇక నష్టం అంచనా జాబితాలోనే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందంటూ బాధితులు మండిపడుతున్నారు. అంచనా బృందాలు వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నా డోర్లాక్ అని నమోదు చేశారని, గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటే నాలుగో అంతస్తు అని నమోదు చేశారని.. ఇల్లంతా బురదమయంగా కనిపిస్తున్నా.. నష్టం జరగలేదని నమోదు చేశారని, వాహనాలు పూర్తిగా పాడైనా.. ఎలాంటి నష్టం జరగలేదని నమోదు చేశారని, ఆధార్, బ్యాంకు ఖాతాలన్నీ సక్రమంగానే ఉన్నా నాట్ ట్రేస్డ్ అని నమోదు చేశారని బాధితులు దుమ్మెత్తిపోస్తున్నారు. సాయం చేసింది గోరంతే.. ఇదిలా ఉంటే.. వరద నష్టం అంచనా పూర్తయిన తరువాత ముంపు ప్రాంతాల్లో 2.68 లక్షల కుటుంబాలకు నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇందులో 2.32 లక్షల కుటుంబాలకు సంబంధించి 1,700 సర్వే బృందాలతో సర్వే చేయించారు. ఇందులో ఇప్పటివరకు 89,616 ఇళ్లు నీట మునిగినందున రూ.188.80 కోట్ల పరిహారం అందించారు. ఎంఎస్ఎంఈలు, వాహనాలు, వ్యవసాయరంగం, పశువులు, మత్స్యశాఖ, చేనేత, ఉద్యానవనం అన్ని శాఖలకు కలిపి రూ.97.66 కోట్ల సాయం మాత్రమే అందించారు. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించే రూ.55.60 కోట్ల పరిహారం ఉంది. అంటే.. వరదకు సంబంధించి జిల్లాలో అన్ని రకాల సాయం కింద అందించింది కేవలం రూ.286.46 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక బాధితులకు ఇచ్చిన పరిహారం కంటే అగ్గిపెట్టెలు, భోజనాలు ఇతర ఖర్చుల కింద ఎక్కువగా ఖర్చుచేయడం విశేషం. అతీగతీలేని సాయం.. మేం రాజీవ్నగర్ ప్లాట్ నెంబరు 26లో ఉంటున్నాం. బుడమేరు వరదలో ఇల్లు పూర్తిగా మునిగింది. సర్వే సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. నష్టపరిహారానికి సంబంధించిన జాబితాలో పేరున్నా డబ్బు మాత్రం పడలేదు. ఎవర్ని అడిగినా సమా«ధానం కరువైంది. చివరికి కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు అతీగతీలేదు. – వెంగల సాయితేజ, రాజీవ్నగర్ -
ప్రశ్నించే స్వరం వినిపించకూడదా?
విజయవాడలో బుడమేరు వరద ముంపునకు గురైన కోటి మందికి భోజనం ఖర్చు రూ.368 కోట్లుగా తేల్చారు. అసలు పునరావాస కేంద్రాలు ఎక్కడ పెట్టారు? అందులోకి ఎంత మందిని తరలించారు? ఎవరికి భోజనం పెట్టారు? అందరూ నీళ్లలో మునిగి ఉంటే మొబైల్ జనరేటర్లు పెట్టారంటా! నీళ్లలో ఉన్నోళ్లు తమను చంద్రబాబు బయటకు తీసుకురావట్లేదని మొత్తుకున్నారు. వీళ్లేమో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లకు రూ.23 కోట్లు ఖర్చు రాశారు. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై నిలదీయకూడదా? మీరు చేసే అవినీతిపై ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఇదెక్కడి అరాచక పాలన..?’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నించే స్వరమే వినిపించకూడదని ఆరాటపడుతూ తప్పుడు కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దీనికి ‘సాక్షి’ ఎడిటర్పై పెట్టిన కేసే తార్కాణమని చెప్పారు. ‘ఇలాగైతే ప్రజలు మీకు సింగిల్ డిజిట్ కూడా దక్కకుండా చేస్తారు...’ అంటూ చంద్రబాబును హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..చేసిన తప్పును నిజాయితీగా ఒప్పుకో..చంద్రబాబు అధికారంలో ఉన్నంత మాత్రానా ఏం చేసినా చెల్లుతుందనుకుంటే ప్రజలు తిరగబడతారు. అప్పుడు చంద్రబాబుకు, ఆయన పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదు. మా నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదు. బంతిని నేలకేసి ఎంత గట్టిగా కొడితే అంతపైకి లేస్తుంది. ఎప్పటికైనా చేసిన తప్పును నిజాయతీగా ఒప్పుకుంటే.. ఆ వ్యక్తిలో పరివర్తన వస్తే కొద్దో గొప్పో సానుకూలత పెరుగుతుంది. అంతేగానీ తప్పు కనిపించకూడదు... దాని గురించి ఎవరూ మాట్లాడకూడదంటే ఎవరూ హర్షించరు. రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడేందుకు మా పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మద్యం విషయంలో మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. మా హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలు లేవు. ప్రభుత్వమే పారదర్శకంగా నిర్వహించింది. డిజిటల్ పేమెంట్లతోపాటు క్యాష్ పేమెంట్లను అందుబాటులో ఉంచాం. ప్రతి దుకాణంలో పీవోఎస్లు పెట్టాం. ఇప్పుడు మొత్తం ప్రైవేటు పరం అయ్యాయి. టీడీపీకి చెందిన వాళ్లే నడుపుతున్నారు. స్ట్రైక్ రేటు చూసుకుని స్కాములు చేస్తామంటే ఈసారి దెబ్బ గట్టిగా తగులుతుంది. జమిలి ఎన్నికలు మన చేతుల్లో లేవు. ఏం జరిగినా పార్టీని సన్నద్ధంగా పెట్టడానికి రెడీగా ఉన్నాం. గ్రామ స్థాయిలో పార్టీకి బూత్ కమిటీలు నియమించి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేగంగా వేస్తున్నాం. వరదల్లోనూ స్కామ్లేనా?చంద్రబాబు స్కామ్లు ఏ స్థాయిలో ఉన్నాయో విజయవాడలో వరదల సమయంలో చూశాం. బుడమేరు వరద ముంపునకు గురైన కోటి మందికి భోజనం ఖర్చు రూ.368 కోట్లుగా తేల్చారు. అసలు పునరావాస కేంద్రాలు ఎక్కడ పెట్టారు? అందులోకి ఎంత మందిని తరలించారు? ఎవరికి భోజనం పెట్టారు? అందరూ నీళ్లలో మునిగి ఉంటే మొబైల్ జనరేటర్లు పెట్టారంటా! నీళ్లలో ఉన్నోళ్లు తమను చంద్రబాబు బయటకు తీసుకురావట్లేదని మొత్తుకున్నారు. వీళ్లేమో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లకు రూ.23 కోట్లు ఖర్చు రాశారు. ఇంత దారుణంగా స్కాముల మీద స్కాములు చేస్తున్నారు. పైగా ఇవే ప్రశ్నలు అడిగినందుకు ‘సాక్షి’ ఎడిటర్పై కేసు పెట్టారు. ఇంత దారుణంగా ప్రభుత్వ పాలన చేస్తుంటే ప్రశ్నించకూడదా? వీళ్లు ఏం చేసినా ఎవరూ మాట్లాడకూడదా? అసలు వీళ్లు పరిపాలన చేయడానికి యోగ్యులేనా? ప్రజలందరూ ఆలోచించాలి. -
వరద బాధితులకు న్యాయం జరిగే వరకు మా దీక్ష ఆగదు : వైఎస్సార్సీపీ నేతలు
విజయవాడ: వరద బాధితులకు తక్షణమే నష్ట పరిహారం ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష కొనసాగుతుంది. నిరాహార దీక్షలో వరద బాధితులు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. దీనిలో భాగంగా పలువురు వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. వరద బాధితులకు మద్దతుగా వైఎస్సార్సీపీ కదిలింది: దేవినేని అవినాష్వరద బాధితులకు అన్ని విధాల తోడుగా ఉండడానికి నిరాహార దీక్ష చేస్తున్నాంవరద బాధితులకు మద్దతుగా వైఎస్సార్సీపీ కదిలిందిచంద్రబాబు వల్లనే వరదలు వచ్చాయిమైలవరం, జగ్గయ్యపేట, విజయవాడ సింగినగర్, ఇతర ప్రాంతాలు వరదల్లో ప్రజలు ఉన్నారువరదల్లో నష్టపోయిన వారికి ఒక్కరికి నష్ట పరిహారం అందించలేదురోజు కలెక్టరేట్ వద్ద వరద బాధితులు పడిగాపులు పడుతున్నారువరద బాధితులకు నష్ట పరిహారం అడుగుతుంటే వైఎస్సార్సీపీపై బురద జల్లుతున్నారుఫోటోలకు పోజులు ఇవ్వడం తప్ప కూటమి నేతలు చేసింది ఏమీ లేదురూ. 500 కోట్ల విరాళాలు కూటమి ప్రభుత్వం ఏం చేసిందిఅబద్ధపు మాటలు, అబద్ధపు తీరు తప్ప ఎమీ చేయడం లేదుకూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటమిది.. కూటమి ప్రభుత్వం పడిపోవడానికి ఇదే నాందివైఎస్సార్సీపీ కోటి కాదు.. రూ. కోటి 50 లక్షలు ఖర్చు పెట్టింది50వేల కుటుంబాలను సరుకులు పంపిణీ చేసిందిమా లెక్కలు మేము ఇస్తాం.మీరు ఖర్చు పెట్టిన దానికి లెక్కలు ఇవ్వగలరా? వరదలను చూపెట్టి వందల కోట్లు వసూళ్లు చేశారు: వెల్లంపల్లి శ్రీనివాస్ప్రజల ఆర్భాటాలు కోసమే చంద్రబాబు ప్రయత్నం చేశాడుసంక్షోభంలో చంద్రబాబు అవకాశాలు వెతుక్కుంటాడు.. ఇప్పుడు అవినీతి చేస్తున్నారుఎంత ఖర్చు పెట్టారో మంత్రులు చెప్పలేకపోతున్నారు..ఆర్టీఏ అప్లయి చేసుకోమంటున్నారువిజయవాడ ఇమేజీని డ్యామేజ్ చేసింది కూటమి ప్రభుత్వంకుమ్మరి పాలెం, ఊర్మిళ నగర్, హౌసింగ్ బోర్డ్ ఏరియాలో ఒకరికి నష్ట పరిహారం అందలేదుచెప్పిన మాట ప్రకారం వైఎస్ జగన్ కోటి కాదు.. కోటిన్నర ఖర్చు చేశారువైఎస్ జగన్ని చూసి కూటమి నేతలు సిగ్గు తెచ్చు కోవాలికలెక్టరేట్లో అప్లికేషన్లు అమ్ముకుంటున్న చరిత్ర కూటమి ప్రభుత్వంది వరద బాధితులకు చివరి వ్యక్తి వరకు పరిహారం అందేవరకు పోరాటం చేస్తాం కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేదు: మల్లాది విష్ణురూ. 534 కోట్ల రూపాయిలు వరద బాధితులకు నష్ట పరిహారం అందించినట్లు అధికారులు లెక్కలు చెప్పారుప్రతి దేవస్థానం నుండి ఫుడ్ తీసుకొచ్చి బయట పడేసి వెళ్లిపోయేవాళ్ళు డీబీటి ద్వారా ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్దేఈ రోజు నష్ట పరిహారం కోసం బాధితులు రోడ్ల మీద ఆందోళన చేస్తాన్నారువరద బాధితులకు నష్ట పరిహారం అందేవరకు పోరాటం చేస్తాంపావలాది రూపాయిన్నారకి కొన్నారుకూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయితే కలెక్టరేట్ వద్ద బాధితులు ఎందుకు ఆందోళన చేస్తారు.కేంద్రం దగ్గర నుండి ఏం తెచ్చారు.. మరింత సహకారం కావాలని ఏమైనా అడిగారా?రీ ఎన్యుమరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాంమంత్రులకు అధికారులకు సమన్యాయం లేదు.. దోచుకునే అమౌంట్లో లెక్కలు తేలడం లేదు -
వరదలు చూసి వసూలు చేసిన చందాలు పేద వారికి పంచకుండానే మింగేశారు
-
అమెరికాను భయపెడుతోన్న మరో తుఫాను: భయం గుప్పిట్లో ఫ్లోరిడా
ఫ్లోరిడా : హెలెన్ తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి బయటపడకముందే అమెరికాను మరో తుఫాను భయపెడుతోంది. ఫ్లోరిడా తీరం వైపు మిల్టన్ హరికేన్ దూసుకొస్తోంది. మిల్టన్ ఐదో కేటగిరీ హరికేన్గా బలపడిందని, అత్యంత శక్తిమంతమైన ఈ తుఫాను వల్ల ప్రాణహాని ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫ్లోరిడా పశి్చమ తీరం వైపు కదులుతున్న మిల్టన్.. బుధవారం తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ఉధృతితో బుధవారం తెల్లవారుజామునుంచే తీవ్రమైన గాలులు వీస్తాయని ఎన్హెచ్సీ హెచ్చరించింది. మిల్టన్ ఐదో కేటగిరీ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను సురక్షిత స్థానాలకు తరలిస్తున్నారు. ఈ అతిపెద్ద తరలింపు ప్రయత్నానికి సిద్ధం కావాలని గవర్నర్ రాన్ డిసాంటిస్ ప్రజలను కోరారు. మిల్టన్ మార్గంలోని విమానాశ్రయాలు మూసివేశారు. తుఫాను హెచ్చరికలతో ప్రజలు తమ ఇళ్ల నుంచి ఒకేసారి బయటకు రావడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. మిల్టన్ తుఫాను.. హరికేన్లను వర్గీకరించడానికి ఉపయోగించే సాఫిర్–సింప్సన్ స్కేలుపై మిల్టన్ ఐదో కేటగిరీగా నమోదైనది. ఈ తుఫాను సమయంలో గాలులు గంటకు 285 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్హెచ్సీ) తెలిపింది. మొదట రెండో కేటగిరీలో ఉన్న తుఫాను కొన్ని గంటల్లోనే 5వ కేటగిరీకి మారింది. ఇంత వేగంగా తుఫాను బలపడటం నమ్మశక్యంగా లేదని ఫ్లోరిడా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతా ఈ హరికేన్ బలపడిందంటున్నారు. ఒక శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత తీవ్రమైన తుఫాను ఇదే కావచ్చని చెబుతున్నారు. హరికేన్లు మూడో కేటగిరీ దాటితేనే తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. గత నెలలో ఫ్లోరిడాను తాకిన హెలెన్ తుఫాను నాలుగో కేటగిరీకి చెందింది. గంటకు 225 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో ఆస్తి నష్టం జరిగింది. దీని ధాటికి నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, టేనస్సీ, వర్జీనియాలో దాదాపు 230 మంది మరణించారు. ఇంకా మృతదేహాలను వెలికి తీస్తూనే ఉన్నారు. సాధారణం కంటే 2024 హరికేన్ సీజన్ తీవ్రంగా ఉందని నేషనల్ ఓషియానిక్ అటా్మస్ఫియరిక్ అసోసియేషన్ (ఎన్ఓఏఏ) అంచనా వేసింది. మానవుల వల్ల ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్ట ఉష్ణోగ్రతలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. -
అమరావతి మునగలేదన్నారు..! మరి వరద సాయమేంటి బాబూ?
సాక్షి, అమరావతి: ‘ప్రపంచంలో అద్భుతమైన రాజధాని అమరావతి వరదల్లో మునగలేదు. ఒక్క ఇల్లూ దెబ్బతినలేదు. గిట్టనివారు దు్రష్పచారం చేస్తున్నారు. రాజధాని మునిగిందని ఎవరైనా ప్రచారం చేస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం’ అని ఇటీవల ఓ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన బహిరంగ ప్రకటన. కానీ, ఇదే చంద్రబాబు ప్రభుత్వం రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలో ఏకంగా 1,039 మందికి రూ. 80.88 లక్షల పరిహారం అందించింది. మరి ఇదేమిటి? రాజధాని మునగలేదన్న చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వమే ఆ ప్రాంతంలోని వారికి సాయం చేయడమంటే మునిగిందనేది సుస్పష్టం. దాచుకున్నా దాగని పచ్చి నిజం. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలోని 11 గ్రామాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాలకు ఇళ్లు రెండు రోజులకు పైగా నీట మునిగాయని, ప్రజలు దుస్తులు, గృహోపకరణాలు కోల్పోయారని చెబుతూ ఈ ప్రాంత ప్రజలకు ఇటీవల ప్రభుత్వం పరిహారం అందించింది. వరద పరిహారం అందుకున్న గ్రామాల్లో ప్రస్తుతం శాసన సభ, సచివాలయం ఉన్న వెలగపూడి, కొత్త రాజధాని నిర్మాణం కోసం ప్రకటించిన రాయపూడి కూడా ఉన్నాయి. తుళ్లూరు మండలంలో వరద నష్టాన్ని బట్టి ఒకొక్కరి ఖాతాలో రూ.5 వేల నుంచి రూ.19 వేల వరకు జమచేశారు. దాంతోపాటు బియ్యం, నిత్యావసరాలను కూడా అందించారు. వెలగపూడి, రాయపూడిల్లో తీవ్ర వరద నష్టం ఆగస్టు నెల చివరి వారం, సెపె్టంబర్లో కురిసిన వరుస వర్షాలు రాష్టంలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా బుడమేరు గేట్లు ఎత్తేయడంతో వరద అంతా విజయవాడ నగరంపై పడింది. దాదాపు 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పది రోజులకు పైగా ఇళ్లు నీటిలోనే ఉండిపోవడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. దీంతోపాటు రాజధానిగా ప్రకటించిన తుళ్లూరు మండలంలోని 11 గ్రామాలు కూడా మునిగిపోయినట్టు అధికారులు గుర్తించారు.ప్రస్తుతం అసెంబ్లీ ఉన్న వెలగపూడి, కొత్త రాజధాని నిర్మిస్తామని ప్రకటించిన రాయపూడి గ్రామాలు సైతం ఉన్నాయి. అమరావతిలో కీలకమైన ప్రాంతాలైన వెలగపూడి, రాయపూడి గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగిందని, 219 మంది నిరాశ్రయులయ్యారని అధికారులే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వీటితోపాటు మందడం, పెదపరిమి, తుళ్లూరు, మల్కాపురం, వెంకటాయపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, హరిశ్చంద్రపురం, ఉద్దరాయనిపాలెం తదితర 11 గ్రామాలూ ఉన్నాయని చెప్పారు. ఆ గ్రామాల్లో పక్కా ఇళ్లు, కచ్చా ఇళ్లు దెబ్బతిన్నాయని, గ్రౌండ్ ఫ్లోర్లు రెండు రోజులకు మించి నీటిలోనే మునిగిపోయాయని నివేదికలో పేర్కొన్నారు. చుట్టూ నీరు చేరడంతో ప్రజల జీవనోపాధి సైతం కోల్పోయారని నివేదికలో వివరించారు. కానీ, సీఎం చంద్రబాబు మాత్రం రాజధానికి అసలు వరదే రాలేదని చెప్పారు. లంక ప్రజలకు అందని వరద సాయం తుళ్లూరు మండలంలో బుడమేరు, కృష్ణానదిని ఆనుకుని కొన్ని లంక గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్దండరాయునిపాలెం లంక, రాయపూడి పెదలంక, హరిశ్చంద్రాపురం, బోరుపాలెంలోని కొన్ని నివాసాలు, లింగాయపాలెం, తాళ్లాయపాలెంలోనూ లంక గ్రామాలు ఉన్నాయి. వరద ఎక్కువగా రావడంతో ఈ లంకల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కానీ పరిహారం మాత్రం చాలా తక్కువ మందికి ఇచ్చారు. అమరావతికి మధ్యలో ఉన్న వెలగపూడి, తుళ్లూరు, రాయపూడి, మందడం, మల్కాపురం, వెంకటాయపాలెం పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇక్కడి ప్రజల వార్షిక ఆదాయం రూ.10 వేలు, అంతకంటే తక్కువని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వం లంక గ్రామాలను పక్కనపెట్టి, రాజధాని ప్రాంతం మధ్యలో ఉన్న గ్రామాల్లోని ప్రజల ఖాతాల్లో వరద నష్ట పరిహారం సొమ్ము జమ చేసింది. దుస్తులు, ఇంట్లో సామగ్రి పాడైపోయినందుకు రూ.5 వేలు, 10 రోజులు ఉపాధి కోల్పోయినందుకు రోజుకు రూ.300 చొప్పున ఇంట్లో ఇద్దరికి కలిపి రూ.6 వేలు, ఇల్లు నీటిలో మునిగిపోయినందుకు నష్ట తీవ్రతను బట్టి రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించారు. విడ్డూరం ఏంటంటే పరిహారం పొందిన వారిలో ఏడేళ్ల పిల్లలు, దశాబ్దం క్రితం గ్రామం వదిలి వెళ్లిపోయినవారు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్నవారు సైతం ఉన్నారు. -
‘అక్షయపాత్ర’ రోజూ పంపిన లక్ష భోజనాలు ఏమయ్యాయి?
సాక్షి, అమరావతి: వరద బాధితుల భోజనాలపై కూటమి ప్రభుత్వం రూ.368 కోట్లు ఖర్చు చేస్తే.. అక్షయపాత్ర ఫౌండేషన్ రోజూ లక్ష మందికి అందించిన భోజనాలు ఏమయ్యాయని, ఇతర స్వచ్ఛంద సంస్థలు చేసిన సాయం మాటేమిటని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నిలదీశారు. సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి తప్పుడు లెక్కలతో రూ.534 కోట్లను కూటమి నేతలు దోచేశారని ధ్వజమెత్తారు. ఒక్క పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేయకుండా రూ.1.39 కోట్లు,మంచినీళ్ల బాటిళ్లకు రూ.26 కోట్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపిందన్నారు. ఏ కాంట్రాక్టర్ ద్వారా ఆ ఏర్పాట్లు చేశారో ప్రభుత్వంవివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.బాధితులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ప్రభుత్వం నిజంగా బాధితులకు సాయం చేసి ఉంటే.. ఇప్పుడు కలెక్టరేట్ వద్దకు వేలా దిమంది ఎందుకు పోటెత్తుతున్నా రని అవినాష్, భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. పారిశుధ్య కార్మికులకు రూ.51 కోట్లు ఇచ్చామంటున్న ప్రభుత్వం ఎవరి ద్వారా అవి చెల్లించారో చెప్పాలన్నారు. ఆహారం పంపిణీ కోసం 412 డ్రోన్లు ఉపయోగించి, అందుకోసం రూ.2 కోట్లు చెల్లించినట్లు చెబుతున్నారని, నిజానికి అప్పుడు కనీసం 10 డ్రోన్లు కూడా కనపడలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూ.534 కోట్లకు సరైన లెక్కలు చెప్పే వరకు ఊరుకోబోమని, వరద బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు ప్రకటించారు. -
బాబు జమానా.. అవినీతి ఖజానా ముంపులోనూ మేసేశారు
బుడమేరు గేట్లెత్తి బెజవాడను నిండా ముంచిన చంద్రబాబు సర్కారు.. ఆదుకోండి మహాప్రభో అని వేడుకునేందుకు వచ్చిన వరద బాధితులను కలెక్టరేట్ గేట్లు మూసి నిర్దయగా గాలికొదిలేసింది. కానీ.. అదే వరద పేరు చెప్పి పాలకులు రూ.వందల కోట్లు కొల్లగొట్టేశారు. సహాయక చర్యలు చేపట్టి బాధితుల్ని ఆదుకున్నట్టు ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఆ ముసుగులో ఏ పనీ చేయకుండానే ఖర్చుల పేరిట ఖజానా నుంచి భారీఎత్తున నిధులను పక్కదారి పట్టించారు.సాక్షి, అమరావతి: వరద సహాయక చర్యల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చుల లెక్కలు ప్రజల్ని నివ్వెరపరుస్తున్నాయి. బుడమేరు, కృష్ణా వరదలో పేరుకుపోయిన అవినీతి బురదను చూసి జనం అసహ్యించుకుంటున్నారు. సహాయ, పునరావాస చర్యల్లో ఘోరంగా విఫలమైన టీడీపీ సర్కారు.. ఖర్చులు మాత్రం దిమ్మతిరిగేలా చూపడంతో ఇంత ఖర్చు ఎక్కడ పెట్టారోనని ముక్కున వేలేసుకుంటున్నారు.అసలు సహాయక చర్యలే చేపట్టక జనం అల్లాడిపోతే ప్రభుత్వం ఏకంగా రూ.534 కోట్లను రిలీఫ్ క్యాంప్ల కోసం ఖర్చు చేసినట్టు చెబుతుండటం విస్తుగొలుపుతోంది. గత నెలలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలను వరదలు అతలాకుతలం చేసినా ప్రభుత్వం ఎక్కడా పునరావాస కేంద్రాలు తెరవలేదు. విజయవాడలోని సగం ప్రాంతం మునిగిపోయినా పునరావాస కేంద్రాలు లేకపోవడంతో జనం డాబాలపైన, అపార్ట్మెంట్స్లోని పై అంతస్తుల్లోనే వారం రోజులపాటు గడిపారు. కాగితాల్లో పునరావాస కేంద్రాలు తెరిచినట్టు చూపించినా రెండు, మూడు మినహా అవి ఎక్కడా లేవు. భోజనం ఖర్చు రూ.376 అన్ని ఖర్చుల్లోనూ భోజనాల ఖర్చే రూ.368.18 కోట్లు చూపించడంతో వరద బాధితులు నోరెళ్లబెడుతున్నారు. బాధితులకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు పెద్దఎత్తున ఆహారం సమకూర్చారు. వరద ఎక్కువగా ఉండటంతో ముంపు ప్రాంతాల్లో శివారు ప్రాంతాలకు వాటిని తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. కానీ.. చంద్రబాబు మాత్రం ప్రభుత్వం తరఫున 97 లక్షల మందికి ఆహారం అందించినట్టు లెక్క రాసేశారు. 3.97 లక్షల మందికి టిఫిన్, 4.33 లక్షల మందికి మధ్యాహ్న భోజనం, 4.26 లక్షల మందికి రాత్రి భోజనం ఇచ్చినట్టు ఆయనే స్వయంగా పలుమార్లు వెల్లడించారు.97.70 లక్షల మందికి టిఫిన్, లంచ్, డిన్నర్కి రూ.368.18 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కల్లో చూపారు. అంటే ఒక్కో బాధితుడికి రోజుకు రూ.376 చొప్పున ఆహారం కోసం ఖర్చు చేసినట్టు రాసుకుని ఆ మొత్తాన్ని కొల్లగొట్టారు. ఆహారం అందక జనం అష్టకష్టాలు పడితే.. వారికి స్టార్ హోటల్ భోజనం పెట్టినట్టు చెప్పడాన్ని బట్టి అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మంచినీళ్లలోనూ అదే తీరు వరద బాధితులకు 94 లక్షల మంచినీళ్ల బాటిళ్లు ఇచ్చినట్టు లెక్క రాసుకుని రూ.26.80 కోట్లను పాలకులు బొక్కేశారు. 94 లక్షల బాటిళ్లలో పావు వంతు కూడా జనానికి అందలేదు. నిత్యావసర సరుకులు కూడా అందరికీ అందకపోయినా లక్షలాది మందికి ఇచ్చేసినట్లు.. అందుకోసం రూ.61 కోట్లకు పైగా ఖర్చయినట్టు లెక్కల్లో చూపించారు. విజయవాడ సింగ్నగర్ పరిసరాల్లో ఇప్పటికీ కొన్నిచోట్ల వరద కంపు కొడుతున్నా, చెత్త కనిపిస్తున్నా పారిశుధ్యం మాత్రం సూపర్గా ఉందని.. ఇలా చేయడానికి రూ.51 కోట్లు ఖర్చయ్యిందని లెక్కల్లో రాసేసుకున్నారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల కోటా రూ.23 కోట్లు అన్నిటికంటే విచిత్రమైన విషయం కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23.07 కోట్లు ఖర్చవడం. అసలు జనానికి ఇవి ఎక్కడ ఇచ్చారో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఏ ప్రాంతంలో వరద బాధితుల్ని అడిగినా కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో మొబైల్ జనరేటర్ల ఖర్చు కూడా అందులో ఉందని కవర్ చేసుకుంటున్నారు. కానీ.. అవి ఎక్కడ, ఎన్ని పెట్టారో కూడా అధికారులకు తెలియదు. అవినీతి వరదలో వీటి ఖర్చే వింతల్లోకెల్లా వింతగా కనిపిస్తోంది. డ్రోన్ల ఖర్చు రూ.2 కోట్లువరద ఖర్చుల వింతల్లో డ్రోన్ల ఖర్చు సరికొత్తగా ఉంది. కేవలం డ్రోన్ల కోసం రూ.2 కోట్లు ఖర్చు చేసినట్టు చూపించారు. డ్రోన్లతో ఆహారం సరఫరా చేసినట్టు ఏఐ సాయంతో ఫొటోలు తయారు చేసి.. ఇప్పుడు వాటి కోసం కోట్లు ఖర్చయినట్టు లెక్కలు రాశారు. చెత్త తరలింపు, వరద నీరు తోడటం వంటి ఖర్చులే రూ.7 కోట్లు దాటిపోయాయి. వరద బాధితుల తరలింపు, చెత్త ఎత్తడం, పారిశుధ్యం ఈ లెక్క వేరేగా ఉంది. అవన్నీ కలుపుకుంటే ఖర్చులే రూ.557 కోట్లు దాటిపోయింది.అంత ఖర్చు ఎక్కడ పెట్టారు?ఇంత భారీ ఎత్తున సహాయ, పునరావాస చర్యల కోసం ఖర్చు పెట్టినట్టు ప్రభుత్వం చెబుతుండటంతో అంత ఖర్చు ఎక్కడ పెట్టారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. చేయని ఖర్చుకు భారీగా లెక్కలు చూసి సర్కారు పెద్దలు దండుకున్నట్టు ఏ లెక్క చూసినా స్పష్టమవుతోంది. ఈ సొమ్ములో చాలా వరకూ విడతల వారీగా ఇప్పటికే విడుదలైంది. కలెక్టర్లు, వివిధ శాఖల ద్వారా ఆ సొమ్మును డ్రా చేసి బిల్లులు కూడా చాలా వరకూ చెల్లించేశారు. వరద ఖర్చుల్లో ఒక్కో అంశంపైనా అవినీతి కేసులు పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరద బాధితులను ఆదుకోకపోగా వారి పేరుతో రూ.వందల కోట్లు దోచేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రూ.500 కోట్ల విరాళాలు హుష్ కాకే! వరద బాధితులను ఆదుకోవడానికి చంద్రబాబు భారీగా విరాళాలు సేకరించారు. ఇప్పటివరకు రూ.500 కోట్లకుపైగా నిధులు దాతల నుంచి అందినట్టు ప్రకటించారు. విరాళాలు బాగా వచ్చాయనుకుంటే.. వాటికి మించి రూ.557 కోట్ల ఖర్చుల లెక్కలు చూపించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రాన్ని కుంగదీసిన వరద చంద్రబాబు సర్కారుకు కాసులు కురిపించినట్టు స్పష్టమవుతోంది. బాధితులకు రూ.602 కోట్ల నష్టపరిహారం ఇచ్చినట్టు ప్రకటించినా.. ఇంకా చాలా మందికి అందలేదు. నిత్యం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బాధితులు చేస్తున్న ఆందోళనలే ఇందుకు నిదర్శనం. -
‘ఆటో’ బతుకులు అస్తవ్యస్థం
సాక్షి, అమరావతి: ‘అటో డ్రైవర్ కె.శివారెడ్డి ఊర్మిళనగర్ రెండో లైనులో అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. ఇటీవల వచ్చిన బుడమేరు వరదలకు ఆ ఇల్లు మునిగిపోయింది. జీవనాధారమైన ఆటోతో పాటు ద్విచక్రవాహనం పూర్తిగా పాడైపోయాయి. సచివాలయ సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారు. కానీ ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా పరిహారం రాలేదు. అప్పు చేసి ఆటోకు మరమ్మతులు చేయించుకుంటే రూ.45 వేలు ఖర్చయింది. ఇంటికిగానీ, వాహనాలకు గానీ పరిహారం ఇప్పించాలంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు.పదహారేళ్లుగా ఇదే ప్రాంతంలో ఆటో నడుపుతున్న నా పేరు ఎందుకు జాబితాలో లేదని ఎవరిని అడిగినా సమాధానం చెప్పడంలేదని వాపోతున్నాడు.’’...ఇది బుడమేరు వరదల్లో ఆటోలను కోల్పోయిన వేలాది మంది డ్రైవర్ల ఆవేదన. నగరంలో తిరిగే ఆటోలలో అతకధికం సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, పాయకాపురం, కండ్రిగ, వాంబేకాలనీ, మిల్క్ ప్రాజెక్ట్, డాబా కోట్లు సెంటర్, రాజరాజేశ్వరిపేట, నందమూరి కాలనీ, భరతమాత కాలనీ, ఊరి్మళనగర్ల నుంచే వస్తున్నాయి. అక్కడి నిరుద్యోగులు డ్రైవర్లుగా మారి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వారందరి జీవితాలు అస్తవ్యస్ధంగా మారాయి. ఈ నేపధ్యంలో ఆ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల బతుకు చిత్రంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇది.మరమ్మతులకు కొత్త అప్పులురోజుల తరబడి ముంపులోనే ఉండటంతో ఆటోలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బయట మెకానిక్ దగ్గర నుంచి కంపెనీ షోరూమ్ వరకూ ఒక్కో దాని మరమ్మతులకే రూ.12 వేల నుంచి రూ.75 వేల వరకూ వ్యయం అవుతోంది. రేడియేటర్, ఇంజిన్, బ్యాటరీతో పాటు బీఎస్ 6 వాహనాల్లో సెన్సార్లు పాడవ్వడంతో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇన్ని వాహనాలకు మరమ్మతులు చేసేందుకు మెకానిక్ల కొరత ఉండటంతో రోజుల తరబడి మోటార్ షెడ్ల వద్దే ఆటోలు పడి ఉంటున్నాయి. ఒకసారి మరమ్మతు చేసినా మళ్లీ మళ్లీ కొత్త లోపాలు బయటపడుతున్నాయి. దీంతో కొత్త అప్పులు చేసి మరమ్మతులకు వెచి్చస్తున్నారు. ఉపాధి లేక, కుటుంబాలను పోషించుకోలేక, వాయిదాలు కట్టలేక అవస్థలు పడుతున్నామని డ్రైవర్లు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేయించుకున్న రాష్ట్ర ప్రభుత్వంగానీ, స్థానిక ప్రజాప్రతినిధులుగానీ తమను అసలు పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.బీమా సంస్థల కొర్రీలువరద నీటిలో మునిగిన ఆటోలకు క్లెయిమ్లు ఎగవేసేందుకు బీమా సంస్థలు ఉన్న అన్ని అవకాశాలనూ వాడుకుంటున్నాయి. బీమా చేసే సమయంలో డ్రైవర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి తెలియని షరతులను పొందుపరిచి వాటిని ఇప్పుడు సాకుగా చూపిస్తున్నాయి. ఒక ఆటోకి బీమా రావాలంటే సుమారు రెండు నెలలు సమయం పడుతుందని తప్పించుకుంటున్నాయి. అదికూడా వరద వచి్చనప్పటి నుంచి ప్రతి దశలోనూ తీసిన ఫొటోలు, వీడియోలు ఉంటేనే బీమా వర్తిస్తుందని మెలికపెడుతున్నాయి.ప్రాణాలే కాపాడుకుంటామా, ఫొటోలు తీస్తామా అంటూ బాధితులు అడుగుతుంటే బీమా సంస్థలు సమాధానం చెప్పడం లేదు. రెండు వారాల్లోనే క్లెయిమ్లు పూర్తి చేసేలా బీమా సంస్థలతో మాట్లాడామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ఆచరణలో మాత్రం అది శూన్యం. బీమా సంస్థలు కనీసం 45 రోజుల పాటు ఆటోను ఉన్న చోటు నుంచి కదపకుండా ఉంచాలని చెప్పాయి. అప్పటి వరకూ మరమ్మతు చేయకపోతే మొత్తానికే పనికిరాదని, ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకోవడం లేదని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.పరిహారం లేదురాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సెప్టెంబర్ 1న విజయవాడలో వదర విలయం సృష్టించింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారి జీవనాధారాలైన ఆటోలు, మోటార్ సైకిళ్లు వరద నీటిలో పూర్తిగా మునిపోయాయి. రోజుల తరబడి బురద నీటిలోనే నానిపోవడంతో ఇంజిన్, సెన్సార్లు,కార్బొరేటర్ వంటి ముఖ్యమైన భాగాలు దెబ్బతిన్నాయి. ఆటోకి రూ.10 వేలు, ద్విచక్ర వాహనానికి రూ.3 వేలు చొప్పున పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం రకరకాల కొర్రీలతో మూడొంతుల మందిని మోసం చేసింది. ఆటో నడిపితేగానీ పూటగడవని నిరుపేదలు వాటిని బాగు చేసుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక ప్రభుత్వ కార్యాలయాలు,అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. బుడమేరు వరదల వల్ల దాదాపు 15 వేలకుపైగా అటోలు నీట మునిగితే ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం కేవలం 6,515 మాత్రమే ఉన్నట్టు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో 4,348 ఆటోలకు పరిహారం అందించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేశారు. కానీ వాస్తవానికి మొత్తం బాధితుల్లో దాదాపు 80 శాతం మంది ఆటోవాలాలకు నష్టం పరిహారం అందలేదని బాధితులు చెబుతున్నారు. చాలా మంది పేర్లు బాధితుల జాబితాలోనే లేవు..కొందరి పేర్లు ఉన్నా వారికి డబ్బులు పడలేదు.ఎవరూ పట్టించుకోవట్లేదు‘‘వరదల్లో ఇల్లు మునిగిపోయింది. ఆటో బాగా బెబ్బతింది. ప్రస్తుతానికి నడిచేలా చేయడానికి రూ.8 వేలు ఖర్చయ్యింది. ప్రభుత్వం రూ.10 వేల ఇస్తామని చెప్పింది. కానీ మా వివరాలను నమోదు చేయడానికి కూడా ఎవరూ రాలేదు. సచివాలయంలో అడిగితే కలెక్టరేట్కు వెళ్లమని చెప్పారు. అక్కడికి వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదు.’’ –లింగయ్య, ఆటో డ్రైవర్, రాజీవ్నగర్ కాలనీజీవనాధారం పోతే పరిహారం రాదా?‘‘ఆటో నడిపితేగానీ మా కుటుంబం నడవదు. వరదల వల్ల ఆటో మునిగిపోయి జీవనాధారాన్ని కోల్పోయాం. బీమా రావాలంటే 45 రోజులు ఆటోను వాడకూడదంటున్నారు. బాగు చేయించుకునే స్తోమత కూడా లేదు. అయినా జాబితాలో మా పేరు లేదంటున్నారు. సచివాలయానికి వెళ్లి అడిగితే తమకేమీ తెలియని చెబుతున్నారు. మా గోడును ఎవరికి చెప్పుకోవాలి. మమ్మల్ని ఆదుకునేవారెవరు.’’ –బాబ్జి, ఆటో డ్రైవర్, రాజరాజేశ్వరిపేటఅద్దె ఆటోనే ఆధారం‘‘నేను ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతున్నాను. వరదకు ఆటో మునిగిపోయింది. ఎలాంటి పరిహారం రాలేదు. ఎవరిని అడిగినా ఎలాంటి ఉపయోగం లేదు.ఏం చేయాలో తెలియడం లేదు.’’ –దుర్గారావు, ఆటో డ్రైవర్, వాంబేకాలనీ.చాలా ఖర్చవుతోంది‘ఇంటర్ చదివి ఆటో నడుపుతున్నాను. మా నాన్న కూడా ఆటో డ్రైవరే. రెండు ఆటోలూ వరదలో మునిగిపోయాయి.ఒక సారి రిపేరుకి రూ.12 వేలు ఖర్చయ్యింది. కానీ మళ్లీ రేడియేటర్ పాడయ్యింది. నాలుగు రోజులుగా మెకానిక్ దగ్గరే పెట్టి బాగుచేయిస్తున్నాం.’’ –వై.సాయి, ఆటో డ్రైవర్, పాయకాపురం. -
అందని పరిహారం.. ఆగని దరఖాస్తులు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): బుడమేరు వరద బాధితులు నెల రోజులుగా పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. వరదకు సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన తమకు ప్రభుత్వం సహాయం చేస్తుందేమోనన్న ఆశతో వేలాది బాధితులు నిత్యం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయానికి వస్తున్నారు. కార్యాలయం గేట్లు మూసేసి పోలీసులు దూరంగా తోసేస్తున్నా, అధికారులు ఛీత్కరించుకుంటున్నా ‘వరదకు బలైపోయాం.. సాయం చేయండయ్యా’ అని వేడుకొంటున్న తీరు అందరినీ కదిలిస్తోంది తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం చలనం రావడంలేదు. బాధితులకు ఏదో చేసేశామంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలే తప్ప.. వాస్తవంగా ఒరిగిందేమీ లేదు. ఈ విషయాన్ని కలెక్టరేట్ వద్దకు వస్తున్న బాధితుల సంఖ్యే చెబుతోంది. నిత్యం వందలాది బాధితులు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్కు క్యూ కడుతూనే ఉన్నారు. బాధితుల నుంచి గుట్టలుగుట్టలుగా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. శనివారం నాడు కూడా కండ్రిక, వైఎస్సార్ కాలనీ, ఉడా కాలనీ, భవానీపురం ప్రాంతాల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారిని కలెక్టర్ కార్యాలయం లోపలికి అనుమతించకపోవడంతో బందరు రోడ్డుపై ఎండలోనే చంటి పిల్లలతో సహా పడిగాపులుకాశారు. చాలా సేపటి తర్వాత అధికారులు వచ్చి దరఖాస్తులు స్వీకరించారు. అయితే, దరఖాస్తులో సచివాలయ నంబర్ తప్పనిసరిగా రాయాల్సి రావడంతో బాధితులు ఇబ్బందులు పడ్డారు. తమ ప్రాంత సచివాలయ కోడ్ తెలియక ఒకటికి రెండు సార్లు ఇంటికి, కలెక్టరేట్కు తిరిగారు. నెల రోజులుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్నామని, ఇప్పటికీ రూపాయి సాయం అందలేదని బాధితులు వాపోతున్నారు. పరిహారం ఎందుకు జమ కాలేదో ఏ ఒక్కరూ చెప్పడంలేదని మండిపడుతున్నారు. వరదల్లో అన్నీ కోల్పోయిన తమకు పరిహారం ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది, స్థానిక వీఆర్వోలు కలెక్టరేట్కు వెళ్లమని చెబుతున్నారే తప్ప సరైన కారణాలు చెప్పడం లేదని మండిపడుతున్నారు. రీ సర్వే చేయాలి ఎఫ్సీఐలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యాను. హెచ్ఐజీ–2లో 235 ఫ్లాట్లో ఉంటున్నా. వరదలకు ఇల్లు మునిగిపోయింది. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, మోటార్, కారు, స్కూటర్ మొత్తం దెబ్బతిన్నాయి. రూ. 2 లక్షలకు పైగా నష్టం వచి్చంది. సర్వే టీం రెండు మూడు సార్లు వచ్చి రాసుకున్నారు. వాళ్లేమి రాశారో తెలీదు. ఈ రోజుకు కూడా నాకు పరిహారం అందలేదు. స్థానిక ఎమ్మెల్యేను కలిసి విన్నవించాను. కలెక్టర్ను కలిసేందుకు వస్తే అందుబాటులో లేరు. మా ప్రాంతంలో రీ సర్వే చేసి నష్టం వివరాలు సమగ్రంగా నమోదు చేయాలి. – వీవీ సూర్యనారాయణ రావు, హౌసింగ్ బోర్డు కాలనీ, భవానీపురం -
ధర దడ
తెనాలి: రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. దసరా పండుగ సమీపిస్తున్న కొద్దీ ఈ జోరు మరింత ఎక్కువగా ఉంది. శరన్నవరాత్రుల సంబరాల హోరులో టమాటా, ఉల్లి సహా అనేక నిత్యావసర సరుకుల ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలు ‘కొనబోతే కొరివి..’ అన్నట్లుగా ఉన్నాయి. ముందుముందు ఇవి ఇంకెంత భారమవుతాయోనని బెంబేలెత్తిపోతున్నారు. ఉదా.. బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, వంట నూనెలు, నిమ్మకాయ, పూల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. రైతుబజారులో టమాటా కిలో ధర గురువారం రూ.64 ఉంటే, శుక్రవారానికి రూ.73కు చేరుకుంది. బహిరంగ మార్కెట్లో రూ.80లకు విక్రయిస్తున్నారు. పది రోజుల క్రితం వరకూ రూ.40–45 పలికిన టమాటా ఇప్పుడు రెట్టింపు కావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన కూరగాయల పరిస్థితి కూడా కొంచెం అటూఇటుగా అదే పరిస్థితి. ఘాటెక్కిన ఉల్లి..వెల్లుల్లి ధరలు..ఉల్లిపాయలైతే కర్నూలువి రూ.45 పైమాటే. మహారాష్ట్ర నుంచి వచ్చే ఆరుదల పాయ కిలో రూ.70 పైమాటగానే ఉంది. వెల్లుల్లి ధర చుక్కలనంటింది. నాణ్యత ప్రకారం కిలో రూ.250 నుంచి రూ.450 వరకు అమ్ముతున్నారు. ఇక అన్ని రకాల నూనెలూ లీటరుకు రూ.20 పెరిగాయి. అయిదు లీటర్ల డబ్బాలు దాదాపు అన్నీ కొంచెం అటూఇటుగా రూ.680లకు అమ్ముతున్నారు.బియ్యం ధరలూ పైపైకి..బియ్యం ధరలు కూడా పెరిగిపోతున్నాయి. 25 కిలోల బియ్యం బస్తా రూ.1,450–1,600లకు అమ్ముతున్నారు. ఎగుమతులకు అనుమతివ్వడంతో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయని చెబుతున్నారు. స్థానిక నిమ్మ మార్కెట్లో నిమ్మకాయలు కిలో రూ.70 ఉంటే రిటైల్ మార్కెట్లో డజను రూ.70కి తక్కువకు దొరకటంలేదు. అలాగే, పూల ధరలు ఠారెత్తిస్తున్నాయి. హోల్సేల్లో మల్లెపూలు కిలో రూ.1,500 కాగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా రిటైల్లో మూర రూ.100లకు అమ్ముతున్నారు. సన్నజాజులు కిలో రూ.1,000, కనకాంబరాలు కిలో రూ.2,000గా ఉంది. ఇతర రకాలైనా కనీసం రూ.50–60 పెట్టనిదే మూర పూలు లభించడంలేదు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలతో ఏర్పడిన డిమాండ్తో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వరదలే కారణమట..మరోవైపు.. ధరల పెరుగుదలకు ఇటీవల వచ్చిన వరదలను కారణంగా చెబుతున్నారు. ధరలను నియంత్రించే యంత్రాంగమేదీ రాష్ట్రంలో ఉన్నట్లుగా కనిపించటంలేదు. పండుగ రోజుల్లో ఈ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్య ప్రజలు పండగ గట్టెక్కేదెలా అని మథనపడుతున్నారు. -
విజయవాడ వరదలు : జనం కన్నీళ్లకు జవాబు ఇదేనా? (ఫొటోలు)
-
అడిగింది రూ.10,320 కోట్లు.. ఇచ్చింది 416 కోట్లే
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలు, వరదల వల్ల రూ. 10,320.72 కోట్ల భారీ నష్టం జరగ్గా కేంద్రం మాత్రం జాతీయ విపత్తుల సహాయ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి కేవలం రూ. 416.8 కోట్ల అత్తెసరు నిధులనే విడుదల చేసింది. కేంద్రం కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో భీకర వరదలు ఎన్నడూ రాలేదని, తగిన రీతిలో నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్రం నామమాత్రంగా నిధుల కేటాయింపులు జరిపిందని విమర్శిస్తున్నాయి. ఇటీవల వరదల బారిన పడిన 14 రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర విపత్తుల సహాయ నిధి (ఎస్డీఆర్ఎఫ్)లో కేంద్రం వాటా కింద మొత్తం రూ. 5,858.6 కోట్లను ఎన్డీఆర్ఎఫ్ నుంచి కేంద్ర హోంశాఖ మంగళవారం విడుదల చేసింది. బీజేపీ, ఎన్డీయేపాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఏపీ, అస్సాం, బిహార్, గుజరాత్కు అధిక నిధులు అందించింది. విపక్షాల పాలనలో ఉన్న తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు కేంద్రం మొండిచేయి చూపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
AP: పరిహారం.. పంపిణీ అస్తవ్యస్తం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, అమరావతి: బుడమేరు వరదల్లో దారుణంగా దెబ్బతిన్న విజయవాడ నగరంలోని కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అప్రమత్తంగా లేక వారిని వరద నీటిలో నిలువునా ముంచి ఘోర తప్పిదం చేయడమే కాకుండా ఇప్పుడు పరిహారం పంపిణీలోనూ తీవ్రమైన తప్పులు చేస్తోంది. ఉద్దేశ పూర్వకంగా చాలా మంది బాధితులకు సాయం ఎగ్గొడుతోంది. సాయం అందించడంలోనూ వివక్ష చూపుతూ సరికొత్త రాజకీయం చేస్తోంది. గ్రౌండ్ఫ్లోర్లో ఉంటూ నష్టపోయిన వారికి రూ.25 వేలు, పై అంతస్థుల్లో ఉండే వారికి రూ.10 వేలు నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పై అంతస్థుల్లో ఉండే కూటమి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులకు మాత్రం ఇప్పటికే పరిహారం జమ అయింది. వారంతా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటున్నట్లు నమోదు చేసుకుని ఎక్కువ పరిహారం పొందారు. వాస్తవంగా గ్రౌండ్ఫ్లోర్లో ఉండే వారిలో చాలా మందికి ఇప్పటికీ పరిహారం అందలేదు. నష్టం అంచనాలను గుర్తించడం దగ్గర నుంచి బాధితులకు ప్రకటించిన సాయాన్ని అందించడం వరకూ అన్నింటా ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరిస్తోంది. జరిగిన నష్టంతో పోల్చితే ప్రకటించిన పరిహారం ఏ మూలకూ సరిపోదని బాధితులు చెబుతున్నారు. చివరికి ఇస్తామని చెప్పిన పరిహారాన్ని కూడా అందరికీ సక్రమంగా ఇవ్వకపోవడంతో బాధితుల ఆందోళన వర్ణనాతీతం. తమను పట్టించుకునే నాథుడు లేడని, తమ గోడు ఎవరూ వినడంలేదని, తమకు సాయం అందడంలేదంటూ విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కి వేలాది మంది బాధితులు పోటెత్తడమే ఇందుకు నిదర్శనం. తమకు పరిహారం ఎందుకు ఇవ్వలేదంటూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సమస్యలే. వరద వచ్చిన నెల రోజుల తర్వాత కూడా ఆ ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. ప్రభుత్వం ఇచ్చే సాయం అరకొరగా ఉండడం, అదీ అందరికీ అందకపోవడంతో అన్నిచోట్లా ఆందోళన వెల్లువెత్తుతోంది. విజయవాడ సింగ్నగర్ తదితర ప్రాంతాల్లో ‘సాక్షి’ బృందం పరిశీలించినప్పుడు అడుగడుగునా బాధితుల కష్టాలే కనిపించాయి. అంతా షో చేశారు..⇒ ‘పది రోజులుగా వరద నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమని కాలం గడిపాం. తీరా వరద తగ్గాక సాయం కోసం 20 రోజులుగా కుస్తీ పడుతున్నా పట్టించుకొనే నాథుడే లేరు. ఇంటి వద్దకు సర్వే బృందాలు వచ్చి, ఫొటోలు, వివరాలు తీసుకున్నారు. తీరా జాబితాలో చూస్తే మాత్రం పేర్లు కనిపించలేదు. సచివాలయాల చుట్టూ తిరిగి మళ్లీ దరఖాస్తు చేసుకున్నాం. అయినా జాబితాలోకి పేర్లు ఎక్కలేదు. కలెక్టరేట్ వద్దకు వెళ్లి కూడా మా గోడు చెప్పుకున్నాం. కనికరం, జాలి లేదు’ అని బాధితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ⇒ విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలకు బయట ప్రాంతాల నుంచి సచివాలయ ఉద్యోగులను తీసుకువచ్చి నష్టాన్ని అంచనా వేయించారు. ఒక యాప్లో వివరాలు నమోదు చేయాలని చెప్పినా అందుకు సరైన సమయం ఇవ్వలేదు. దీంతో వారికి అన్ని ఇళ్ల గురించి తెలియకపోవడంతో ఎన్యుమరేషన్ అస్తవ్యస్తంగా సాగింది. పది రోజులపాటు నీళ్లు నిలవడంతో ఇళ్లు, ఇళ్లలోని సామాన్లు, వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంత నష్టం జరిగినా ఎన్యుమరేషన్లో మాత్రం చాలా తక్కువ నష్టం జరిగినట్లు నమోదు చేశారు. ⇒ వాస్తవానికి 2.68 లక్షల కుటుంబాలకు నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 2.32 కుటుంబాలకు సంబంధించి 1700 సర్వే బృందాలతో సర్వే చేయించింది. 78,558 ఇళ్లు మాత్రమే మునిగాయని, అందులోనూ పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లు 64,799 మాత్రమేనని ప్రభుత్వం ప్రకటించింది. కానీ లక్షకుపైగా ఇళ్లు మునిగిపోయినట్లు స్థానిక బృందాల ద్వారా తెలుస్తోంది. ⇒ మునిగాయని గుర్తించిన ఇళ్లకు సైతం సరిగా పరిహారం ఇవ్వలేదు. గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయినా ఆ ఇల్లు దెబ్బతినలేదని రాశారు. ఒకే ప్రాంతంలో రెండు, మూడు కుటుంబాలు ఉంటే ఒకరికే నష్టం జరిగినట్లు నమోదు చేశారు. ఇల్లు, వస్తువులు, వాహనాలు మునిగిపోయి ఎందుకూ పనికిరాకుండా పోతే ఏదో ఒక దానికే పరిహారం ఇచ్చారు. రెండు వాహనాలు ఉంటే ఒక దానికే ఇచ్చారు. వాహనానికి పరిహారం ఇస్తే ఇంటికి ఇవ్వలేదు. ఎన్యుమరేషన్లో అంతా కోతలే⇒ కొన్ని చోట్ల పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లను కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు రాశారు. కొంతమంది ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నా నష్టాల జాబితాలో రాయలేదు. ముఠా కార్మికులకు నాలుగు చక్రాల ట్రక్కులు ఉంటే వాటిని పట్టించుకోలేదు. ఎన్యుమరేషన్ బృందాలు నష్టాన్ని అంచనా వేసినప్పుడు చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి తల దాచుకోవడంతో ఆ కుటుంబాల వివరాలు నమోదు కాలేదు. దీంతో వారికి పరిహారం అందలేదు.⇒ 25 వేలకుపైగా ఆటోలు దెబ్బతింటే కేవలం 4348 ఆటోలకు మాత్రమే పరిహారం ప్రకటించింది. లక్షన్నరకుపైగా ద్విచక్ర వాహనాలు ఎందుకూ పనికిరాకుండా పోతే 44,402 వాహనాలు మాత్రమే దెబ్బతిన్నట్లు గుర్తించారు. తోపుడు బండ్లు, కిరాణా షాపులు, చిన్న పరిశ్రమలు, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలు వేలాదిగా నీట మునిగినా వాటి సంఖ్య తగ్గించి చూపించారు. ట్రేడ్ లైసెన్సులు ఉంటేనే చిన్నపరిశ్రమలకు పరిహారం ఇస్తామని చెప్పడంతో వేలాది బీరువా పరిశ్రమలకు ఒక్క పైసా పరిహారం అందలేదు. ⇒ ఎన్యుమరేషన్ బృందాలకు ప్రభుత్వం ముందే పరిమితులు పెట్టడంతో ఎక్కడికక్కడ కోతలు పెట్టేశారు. జరిగిన నష్టానికి, అంచనా వేసిన నష్టానికి సంబంధం లేకుండా పోయింది. చాలా మంది బ్యాంకు ఖాతాలకు ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింకవకపోవడంతో పరిహారం జమ కాలేదు. డబ్బులు ఎకౌంట్లో పడని వారికి మళ్లీ ఎన్యుమరేషన్ చేస్తామని ప్రకటించినా, ఇంతవరకు అధికారులు బాధిత ప్రాంతాల వైపు కన్నెత్తి చూడలేదు. కేవలం బ్యాంకు సమస్యలతో 20 వేల కుటుంబాలకు పరిహారం అందలేదు.జాబితాలోనే కుట్ర⇒ జాబితాలో పేర్లు లేవని బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో, మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారు. అప్పుడు 18 వేల దరఖాస్తులు రాగా, 13,700 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. గత నెల 30వ తేదీ అందరికి పరిహారం అందుతుందని సీఎం ప్రకటించినా అందలేదు. దీంతో కలెక్టరేట్కు బాధితులు పోటెత్తారు. ⇒ అర్జీలు సమర్పించిన వారిలో 90 శాతం మంది గ్రౌండ్ ఫ్లోర్లో నివసించే వారే ఉండటం గమనార్హం. నష్టం అంచనా జాబితా తయారీలోనే ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటున్నా.. ఫోర్త్ ఫ్లోర్ అని నమోదు చేశారని, ఇల్లంతా బురదమయం అయి కనిపిస్తున్నా.. నష్టం జరగలేదని నమోదు చేశారని.. ఆధార్, బ్యాంక్ ఖాతాలు అన్నీ సక్రమంగానే ఉన్నా.. నాట్ ట్రేస్డ్ అని నమోదు చేశారని కలెక్టరేట్కు వచ్చిన బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ నిరుపేదలు ఎక్కవగా ఉండే వాంబేకాలనీ, వడ్డెరకాలనీ, శాంతినగర్, పైపులరోడ్డు, సింగ్నగర్, న్యూఆర్ఆర్పేట, కండ్రిక, రాజీవ్నగర్, జక్కంపూడి, అంబాపురం, భవానిపురం, అంబాపురం, కెల్రావు నగర్, పాయకాపురం, రామలింగేశ్వరనగర్ కట్ట, మధ్యకట్ట, రామకృష్ణాపురం, దేవీనగర్ ప్రాంతాల ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు ఎక్కువగా వచ్చారు. ⇒ కాగా, సీఎం సహాయ నిధికి దాతలు రూ.400 కోట్లు అందజేశారు. ఇందులో బాధితులకు అందించిన సాయం రూ.202 కోట్లు మాత్రమే. ఈ ప్రభుత్వానికి కనికరం లేదుఈ ప్రభుత్వానికి పేదలంటే అలుసు. కాస్త అయినా కనికరం లేదు. ఇల్లు మొత్తం మునిగిపోవడంతో పీకల్లోతు నీళ్లలో నుంచి బయటపడ్డాం. వరద తగ్గిన తర్వాత ఇంటికి వచ్చి రాసుకున్నారు. కానీ డబ్బులు పడలేదు. సచివాలయం చుట్టూ పది సార్లు తిరిగాం. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కలెక్టరేట్కు వచ్చి అర్జీలు ఇస్తున్నాం. కూలీ పనులు చేసుకుని బతికేవాళ్లం. మమ్మల్ని ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదు. – జమ్ము సన్యాసమ్మ, న్యూ రాజరాజేశ్వరిపేట -
వరద నష్టపరిహారంపై గందరగోళం
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ బుడమేరు వరద నష్టపరిహారంపై గందరగోళ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. బాధితులకు వారి బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహారాన్ని జమచేస్తామని ప్రకటించినప్పటికీ అలా కాకపోవడంతో వారు రోడ్డెక్కి లబోదిబోమంటున్నారు. ఇస్తామన్న కొద్దిపాటి పరిహారంలోనూ కోతలు, దానికితోడు సాంకేతిక కారణాలను చూపి నిలిపివేస్తున్నారని వారు మండిపడుతున్నారు. కేవైసీ కాలేదని.. నీ ఖాతా వాడుకలో లేదనే బ్యాంకు సిబ్బంది సమాధానాలతో వరద బాధితులకు దిక్కుతోచడంలేదు.ప్రభుత్వం నష్టపరిహారాన్ని ఎగ్గొట్టడానికే ఈ విధమైన ఎత్తుగడలను అనుసరిస్తోందంటున్నారు. తమకు జరిగిన అన్యాయం.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ నగరంలోని పలు సచివాలయాల వద్ద వరద బాధితులు సోమవారం ధర్నాలు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయానికి కూడా అనేకమంది తరలివెళ్లారు.బ్యాంకుల్లో బారులుతీరిన బాధితులు.. నిజానికి.. వరద నష్టపరిహారాన్ని ఈనెల 30 నాటికి బాధితుల ఖాతాల్లో జమచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బాధితులు బ్యాంకులకు పోటెత్తారు. అయితే, మీ ఖాతా వాడుకలో లేదని.. కేవైసీ చేయించుకోవాలని బ్యాంకు సిబ్బంది సూచించటంతో ఇళ్లకు వెళ్లి ఆధార్, పాన్కార్డుల జిరాక్స్లను తీసుకుని మళ్లీ వచ్చారు. ఆ తర్వాత క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించినప్పటికీ మళ్లీ ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) లింక్ అంటూ మెలికపెట్టారు. ప్రభుత్వ పథకాల నగదు బ్యాంకు ఖాతాల్లో పడాలంటే ఎన్పీసీఐతో ఖాతాలు లింక్ అయి ఉండాలని అధికారులు చెప్పడంతో బాధితులు అయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. చాలా కుటుంబాల్లో నాలుగైదు ఏళ్ల క్రితం చనిపోయిన వారి ఖాతాల్లో నగదు జమకావడంతో వారేమి చేయాలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. -
USA: హెలెన్ విధ్వంసం
ఫ్లోరిడా: అమెరికాను తాకిన భీకర హెలెన్ తుపాను ఫ్లోరిడాతో పాటు ఆగ్నేయ అమెరికాలో అపారమైన విధ్వంసం సృష్టించింది. జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియాల్లో వరదలు, ఇళ్లు కూలిన ఘటనల్లో 72 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగేలా ఉంది. వరద నష్టం 15 నుంచి 26 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. టెన్నెసీలోని యునికోయ్ కౌంటీ హాస్పిటల్లోకి వరద చేరడంతో మొత్తం 54 మంది భవనంపైకి చేరారు. వారిని హెలికాప్టర్ ద్వారా కాపాడారు. న్యూపోర్టు సమీపంలో జలాశయం పొంగిపొర్లుతుండటంతో 7 వేల మందిని తరలించారు. నార్త్ కరోలినాలో వందేళ్లలోనే రికార్డు స్థాయిలో వరదలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. అట్లాంటాలో 48 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 28.24 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇక్కడ 1878 తర్వాత ఈ స్థాయి వర్షం ఇదే మొదటిసారని జార్జియా వాతావరణ విభాగం ప్రకటించింది. వరదల ధాటికి పార్కు చేసిన కార్లన్నీ మునిగిపోయాయి. ఈ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఫ్లోరిడాలో పలు ప్రాంతాలకు చేరేందుకు పడవలే దిక్కయ్యాయి. ఫ్లోరిడా, జార్జియా, కరోలినాల్లో 30 లక్షల ఇళ్లు, వ్యాపారసంస్థలకు కరెంటు నిలిచిపోయింది. ఇటీవలి ఇడాలియా, డెబ్బీ తుపాన్లను మించిన నష్టం కలిగిందని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీ శాంటిస్ తెలిపారు. తుపాను తీవ్రత తగ్గినా కుండపోత కొనసాగుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. -
ఎన్టీఆర్ కలెక్టరేట్ వద్ద వరద బాధితుల ఆందోళన
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): బుడమేరు వరదల్లో సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన తమ పేర్లు ప్రభుత్వం సహాయం ప్రకటించిన జాబితాల్లో లేవంటూ వరద బాధితులు శనివారం పెద్ద సంఖ్యలో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా కలెక్టరేట్కు చేరుకున్న బాధితులంతా తమ గోడు పట్టించుకోండంటూ నిరసనకు దిగారు. పూర్తిగా నష్టపోయిన తమ పేర్లు నమోదు చేయలేదని, సచివాలయాలకు వెళితే సమాధానం చెప్పే వాళ్లే లేరని వాపోయారు.గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఫస్ట్ ఫ్లోర్ ఉన్నట్లు నమోదు చేశారని ఇంకొందరు తెలిపారు. బైక్కు మాత్రమే పరిహారం వచ్చి0దని, ఇంటికి ఇవ్వలేదని మరికొందరు తెలిపారు. నెల రోజులుగా ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వరదల్లో మునిగిపోయి నెల రోజులవుతోందని, అసలు తమకు పరిహారం ఇస్తారో లేదో తెలియడంలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్వే టీం వచ్చి వివరాలు తీసుకున్నారని, జాబితాలో మాత్రం తమ పేర్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామని వచ్చామని తెలిపారు. పోలీసులు బాధితులను గేటు వద్దే నిలిపివేయడంతో వారంతా ఆగ్రహానికి గురయ్యారు. తమను లోపలికి అనుమతించాలని, అధికారులకు తమ ఆవేదన చెప్పుకొంటామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితుల ఆగ్రహం తీవ్రం కావడంతో చివరికి బాధితులను లోపలికి అనుమతించారు. కలెక్టరేట్ సిబ్బంది వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు.జాబితాలో పేరు ఉంది.. పరిహారం రాలేదు ‘పన్నెండు రోజుల పాటు మా ఇల్లు వరద నీటిలోనే ఉంది. ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా పాడైపోయాయి. బండి మునిగిపోయింది. సర్వే వాళ్లు వచ్చి పేర్లు రాసుకున్నారు. సచివాలయానికి వెళ్లి చూస్తే పేరయితే ఉంది.. కానీ ఇంత వరకు మాకు ప్రభుత్వ సాయం అందలేదు’ అని న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన సులోచన ఆవేదన వ్యక్తం చేసింది.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి: సీపీఎం కలెక్టరేట్ వద్దకు వరద బాధితులు వచ్చారన్న సమాచారంతో సీపీఎం నేతలు సీహెచ్ బాబూరావు, డి.వి.కృష్ణ అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికైనా బాధితుల ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఎన్యూమరేషన్లో లోపాలు సరిదిద్దాలని డిమాండ్ చేశారు. సచివాలయాల ద్వారా తిరిగి బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అందరికీ న్యాయం చేయాలని వారు కోరారు. -
నేపాల్లో పోటెత్తిన వరదలు..50 మంది మృతి
కఠ్మాండు:నేపాల్లో వరదలు పోటెత్తాయి. గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎనిమిది జిల్లాల్లో దాదాపు 50మంది మరణించారు.సుమారు 11మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వరదల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వరదలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.వరద బాధిత ప్రాంతాల్లో దాదాపు 3 వేల మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.నేపాల్ సాయుధ పోలీసు దళానికి చెందిన భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు.వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు 23 రాఫ్టింగ్ బోట్లు రంగంలోకి దిగాయి. వరదల బారిన చిక్కుకున్నవారిలో ఇప్పటి వరకు 760 మందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. -
ఏపీకి రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల విరాళం
ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను ఆదుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల భారీ విరాళం అందించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడును రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డు సభ్యుడు పీఎంఎస్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మెంటార్ పీవీఎల్ మాధవరావులు కలిసి రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ తరపున రూ.20 కోట్ల చెక్ను అందజేశారు.ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధానంగా విజయవాడ నగరం పూర్తిగా మునిగిపోయింది. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. వరద బాధితులను ఆదుకునేందుకు పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ కూడా ముందుకు వచ్చి భారీ సాయం అందించింది. -
మూసీకి వరద..జీహెచ్ఎంసీ హైఅలర్ట్
సాక్షి,హైదరాబాద్: భాగ్యనగరానికి తాగునీరందించే జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్సాగర్లో నీరు ఫుల్ట్యాంక్లెవెల్ (ఎఫ్టీఎల్) స్థాయికి చేరింది. ఎగువ నుంచి ఉస్మాన్సాగర్కు వరద నీరురావడంతో నీటి మట్టం పెరిగింది. జలాశయానికి ఇన్ఫ్లో 500 క్యూసెక్కులు అధికారులు తెలిపారు.జలాశయం నిండడంతో పాటు ఇన్ఫ్లో ఉండడంతో రెండు గేట్లు ఎత్తి ఉస్మాన్సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో పాటు మూసీకి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బందిని కమిషనర్ అమ్రపాలి అప్రమత్తం చేశారు.ఇదీ చదవండి: హైడ్రా ఎఫెక్ట్..మూసీ పరివాహక ప్రాంతంలో ఉద్రిక్తత -
వరద సాయం విడుదల
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరు వరదలు, భారీ వర్షాల బాధితులకు పరిహారాన్ని సీఎం చంద్రబాబునాయుడు బుధవారం విడుదల చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకింగ్, బీమా, అర్బన్ క్లాప్ యాప్, ఎల్రక్టానిక్ ఉపకరణాల మరమ్మతులపై తొలుత సమీక్షించారు. వరద నష్ట పరిహారం లేఖలను లబ్దిదారులకు లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ.. వరదల వల్ల రాష్ట్రంలో మొత్తం రూ.7,600 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రూ.602 కోట్ల మేర పరిహారాన్ని వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే ఈ నెల 30 కల్లా పరిష్కరించి సాయం అందిస్తామని చెప్పారు. అత్యంత పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి, ఆ జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించి, బాధితులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రం మొత్తం మీద 74 మంది మరణించారని చెప్పారు. వీరి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో నీళ్లు వచ్చిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉన్నవారికి రూ.10 వేల చొప్పున అందించినట్లు తెలిపారు. రుణాలు రీషెడ్యూల్ చేయమని చెప్పామన్నారు. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీలు, ఆధార్ కార్డులు, జనన, మరణ ధ్రువీకరణపత్రాలు ఇలా ఏ సర్టిఫికెట్ పోయినా వెంటనే ఉచితంగా ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. పాడైపోయిన పాఠ్యపుస్తకాల స్థానంలో పిల్లలందరికీ కొత్త పుస్తకాలు ఉచితంగా ఇవ్వమని చెప్పామన్నారు. ఆర్థిక సాయానికి సంబంధించి గత రెండు రోజుల్లో 17 వేల అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వాటిలో 4 వేలు డూప్లికేషన్స్ పోగా 13 వేల దరఖాస్తులను రెండు రోజుల్లో పరిశీలించి, అర్హులైన వారికి సాయమందిస్తామని చెప్పారు. సహాయ కార్యక్రమాలను ఈ నెల 30కి పూర్తిచేసి ఆరోజు సాయంత్రం థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.400 కోట్ల విరాళాలు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. ఈ రోజు విడుదల చేసిన రూ.602 కోట్లలో రూ.400 కోట్లు దాతలిచ్చినవేనని తెలిపారు. విధ్వంసాలు చేయడం, వాటిని వేరేవారిపై నెట్టడం కొందరికి అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలు, శాంతిభద్రతలు కాపాడటం వంటివి తమ బాధ్యత అని, వీటికి ఎవరు విఘాతం కలిగించినా, తప్పులు చేసినా సహించబోమని చెప్పారు. -
Video: గంగా నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన ఇళ్లు
బిహార్ భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు మూతపడ్డాయి. అనేక రైళ్లు రద్దయ్యాయి. పలు యూనివర్సిటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. వర్షాల కారణంగా బిహార్లో ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలోని దాదాపు 12 జిల్లాలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సాధారణ నీటిమట్టాన్ని దాటి అధికంగా పారుతున్నాయి. చాలా చోట్ల గంగా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుంది.మమ్లాఖా జిల్లాలో గంగా నదీ ఉగ్రరూపానికి దాదాపు 10 ఇళ్లు కొట్టుకుపోయాయి. రెండు, మూడు అంతస్థుల నిర్మాణాలు సైతం నదిలోకి జారుకొని కొన్ని సెకన్లలో అవి అదృశ్యమయ్యాయి. భాగల్పూర్ జిల్లాలోని అనేక ఇళ్లు కేవలం 10 నిమిషాల్లో గంగానదిలో మునిగిపోయాయి. దీంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఇళ్లు నీళ్లలో కొట్టుకుపోతుండగా పలువురు వీడియోలు తీయడంతో అవి కాస్తా వైరల్గా మారాయి.#WATCH : These Videos from Bhagalpur, district of Bihar.. where a terrible flood was seen not in the Ganga, but in just 10 minutes many houses got washed away in the Ganga, thousands of families became homeless.#bhagalpur #BiharNews #Flood #flooding #Ganga pic.twitter.com/tNkBNbv1WL— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 24, 2024 -
ఇంకా అందని సాయం..
-
వరద బాధితులపై సర్కార్ దమనకాండ
భవానీపురం (విజయవాడ పశ్చిమ): బుడమేరు వరదలో సర్వం కోల్పోయి సాయం అందించాలని కోరిన భవానీపురం కరకట్టవాసులపై చంద్రబాబు ప్రభుత్వం దమనకాండకు దిగింది. పోలీసులతో లాఠీచార్జి చేయించి, అణచివేసేందుకు ప్రయత్నించింది. అయినా బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో దిగివచ్చిన అధికారులు ఎన్యూమరేషన్ చేస్తామని చెప్పారు. ఇందుకు రేషన్ కార్డులు కావాలని చెప్పడంతో వరదలో పోయిన కార్డులను ఎక్కడ తెమ్మంటారంటూ బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి బుడమేరు వరదకు భవానీపురం కరకట్ట ప్రాంతం మునిగిపోయింది. అయినా ఇప్పటివరకు ఈ ప్రాంతంలోని బాధితులకు ప్రభుత్వం ఎటువంటి సాయం అందించలేదు. వరద బాధితులకు పరిహారమిచ్చేందుకు ఎన్యూమరేషన్ కూడా చేయడంలేదు. అదేమంటే ఈ ప్రాంతం రెడ్ జోన్లో లేదని అధికారులు చెబుతున్నారు. 15 రోజుల క్రితం ఈ బాధితులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేయగా తహసిల్దార్ వారికి రేషన్ మాత్రం అందించారు. ఎన్యూమరేషన్ చేయించలేదు. దీంతో బాధితులంతా రోడ్డెక్కారు. బుడమేరు వరద కారణంగా మా ఇళ్లు మునగ లేదా.. మేం బాధితులం కాదా అంటూ సోమవారం సాయంత్రం దాదాపు 500 మంది బాధితులు విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్లో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోజువారీ పనులు చేసుకుంటూ జీవించే తాము ఎన్యూమరేషన్ అధికారులు వస్తారేమోననని పనులకి కూడా వెళ్లకుండా ఇళ్ల దగ్గరే ఉంటున్నామని, అయినా ఇంతవరకు ఎవరూ తమ గోడు వినలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అదేమంటే తమ ప్రాంతం రెడ్ జోన్ కాదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు రోడ్డు మీద బైఠాయించారు. రెండు గంటలపాటు సాగిన ఈ ఆందోళనతో కుమ్మరిపాలెం సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. వెస్ట్ ఏసీపీ దుర్గారావు, భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు ఇతర పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయినా బాధితులు వెనక్కి తగ్గలేదు. ఇంతలో ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ వచ్చారు. ఆయన ఆదేశాలో ఏమిటో తెలియదుగానీ వెంటనే పోలీసులు రెచ్చిపోయి బాధితులపై లాఠీచార్జ్ చేశారు. అయినా బాధితులు వెరవకుండా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోప్ పార్టీ వచ్చి వారిని వెనక్కి నెట్టేసేందుకు ప్రయత్నించినా బాధితులు లెక్క చేయకుండా ఆందోళన కొనసాగించారు. పశ్చిమ తహసిల్దార్ను పిలిపించి మాట్లాడిస్తానని ఏడీసీపీ రామకృష్ణ బాధితులకు చెప్పి రోడ్డు మీదున్న వారందరినీ ఒక పక్కకు మళ్లించారు. చివరకు వెస్ట్ తహసిల్దార్ ఇంతియాజ్ పాషా వచ్చి బాధితులతో మాట్లాడారు. కలెక్టర్కు విషయం తెలిసి తనను పంపించారని, మంగళవారం ప్రత్యేక బృందాలతో ఎన్యూమరేషన్ చేయిస్తానని చెప్పారు. రేషన్ కార్డ్ తదితర ధృవపత్రాలను తీసుకురావల్సి ఉంటుందని చెప్పారు. ఇళ్లన్నీ మునిగిపోతే అవన్నీ ఎక్కడ నుంచి వస్తాయని బాధితులు ప్రశ్నించారు. చివరకు అధికారుల హామీతో ఆందోళన విరమించారు. -
AP:వరదబాధితులపై పోలీసుల దౌర్జన్యం
సాక్షి,విజయవాడ:వరద బాధితులపై పోలీసుల దౌర్జన్యం కొనసాగుతోంది. పరిహారం కోసం వరద బాధితులు రోడ్డెక్కారు.పరిహారం లెక్కల్లో అధికారులు గోల్మాల్ చేయడంతో సోమవారం(సెప్టెంబర్23) సాయంత్రం విజయవాడ కుమ్మరిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది.పెద్ద ఎత్తున వరద బాధితులు ఆందోళనకు దిగారు.ఉదయం ఆర్ఆర్పేటలోనూ వరద బాధితులు సాయం కోసం ఆందోళన చేశారు.సాయంత్రం కుమ్మరిపాలెంలో వరద బాధితులు ఆందోళనకు దిగారు.ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులు దౌర్జన్యం చేశారు.ఆందోళన చేస్తున్న మహిళలను తోసేశారు.ఆందోళన చేస్తే కేసులు పెడతామని వరద బాధితులను బెదిరించారు.దీంతో వరద బాధితులు,పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు డౌన్ డౌన్ అంటూ వరద బాధితులు నినాదాలు చేశారు.పోలీసులు,వరద బాధితులకు మధ్య పెనుగులాట చోటు చేసుకుంది.అర్హులైన వరద బాధితుల పేర్లను ప్రభుత్వం జాబితాలో చేర్చకపోవడం వల్లే ఘర్షణలు ఏర్పడ్డాయి. -
రేవంత్ రెడ్డిని కలిసిన మహేశ్ బాబు, నమ్రత.
-
మూసీలో చిక్కుకున్న పశువుల కాపరులు
కేతేపల్లి: ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా అధికారులు మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఇద్దరు పశువుల కాపరులు వరద నీటిలో చిక్కుకుపోయారు. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాధితులను కాపాడి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని భీమారం గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భీమారం గ్రామానికి చెందిన పశువుల కాపరులు సురుగు బాలస్వామి, బయ్య గంగయ్య రోజుమాదిరిగానే ఆదివారం పశువులను మేపేందుకు గ్రామ శివారులో ఉన్న మూసీ వాగు ప్రాంతంలోకి తీసుకెళ్లారు. కాగా, హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువన ఉన్న ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరటంతో అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా ప్రాజెక్టు మూడు క్రస్టు గేట్లను పైకెత్తి నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ ప్రాజెక్టు దిగువనున్న భీమారం వద్ద మూసీ వాగులో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో బాలయ్య, గంగయ్య వెంటనే తేరుకుని పశువులతో సహా వాగు మధ్యలో ఉన్న పెద్ద రాతిబండపైకి చేరుకున్నారు. అదే సమయంలో వాగు వద్ద ట్రాక్టర్లోకి ఇసుక ఎత్తుతున్న కూలీలు వరద ఉధృతి పెరగటం గమనించి వెంటనే దూరంగా వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ట్రాక్టర్ మాత్రం వాగులోని నీటిలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి, కేతేపల్లి ఎస్ఐ శివతేజ, తహసీల్దార్ ఎన్. మధుసూదన్రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మూసీ ప్రాజెక్టు అధికారులతో ఫోన్లో మాట్లాడి గేట్లు మూసివేయించారు. ఒక వైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే ప«శువులు నీటిలో ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరాయి. పోలీసులు జేసీబీని వాగులోకి దింపి పశువుల కాపరులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వీలు కాలేదు. సూర్యాపేట ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని తాళ్లు, సేఫ్టీ జాకెట్ల సహాయంతో వాగులోకి వెళ్లి పశువుల కాపరులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. -
ప్రధానికి మమత మరో లేఖ.. కేంద్రంపై ఆరోపణలు
కోల్కతా:పశ్చిమబెంగాల్ వరదలపై సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు. వరదల కారణంగా రాష్ర్టంలో 50లక్షల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారని లేఖలో తెలిపారు.వారిని ఆదుకునేందుకుగాను కేంద్రం వెంటనే నిధులివ్వాలని లేఖలో కోరారు.తమ అనుమతి లేకుండా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్(డీవీసీ) రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడంతో అనేక జిల్లాలు నీట మునిగాయన్నారు. ఈ విషయమై ప్రధానికి మమత రాసిన తొలి లేఖపై కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ స్పందించారు. డీవీసీ రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలపై ప్రతి దశలోనూ రాష్ట్ర అధికారులకు సమాచారం ఇచ్చామని వివరణ ఇచ్చారు.దీనిపై బెనర్జీ స్పందిస్తూ డ్యామ్ల నుంచి నీటి విడుదల దామోదర్ వ్యాలీ రిజర్వాయర్ రెగ్యులేషన్ కమిటీ అనుమతి, సహకారంతో జరుగుతుంది. నీటి విడుదలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా సంప్రదించాలి కానీ వారు అలా చేయలేదు. అన్ని కీలక నిర్ణయాలను కేంద్రం ఆధ్వర్యంలోని శాఖలు ఏకపక్షంగా తీసుకున్నాయి. రాష్ట్రప్రభుత్వానికి ఎటువంటి నోటీసులు లేకుండా నీరు విడుదల చేశారని తప్పుపట్టారు.నీటి విడుదలకు కొద్ది గంటల ముందు సమాచారం ఇవ్వడంతో రక్షణ చర్యలు చేపట్టడం కుదరలేదని విమర్శించారు. -
సీఎం మమత కీలక నిర్ణయం.. జార్ఖండ్ సరిహద్దు మూసివేత
కోల్కతా: సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కారణమని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో బెంగాల్-జార్ఖండ్ భూ సరిహద్దును మూడు రోజులపాటు మూసివేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.అయితే జార్ఖండ్ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీవీసీ ద్వారా నీటిని విడుదల చేశారని మమత ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలను వరద నీరు ముంచెత్తినట్లు తెలిపారు. ఇది కేవలం మనవ తప్పదమని ఆమె పేర్కొన్నారు. డీవీసీ.. డ్యామ్ల వద్ద పూడిక తీయడంలో దారుణంగా విఫలమయిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో వరద నీరు చుట్టు ముట్టిన హౌరా, మిడ్నాపూర్ జిల్లాల్లోని పలు వరద నీటి ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమత పర్యటించారు.ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) కారణమని ఆరోపించారు. ఇష్టమున్నట్టు నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. కేంద్రం ఆడుతున్న నాటకంలో ఇదొక కుట్రగా ఆమె పేర్కొన్నారు. దీనిపై తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. మానవ ప్రమేయంతో వచ్చిన ఈ వరదలకు డీవీసీనే బాధ్యత వహించాలని దీదీ డిమాండ్ చేశారు. -
ఇది సాయమా? మరో గాయమా!?
సాక్షి, అమరావతి: అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు.. అన్నట్లుగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే. విజయవాడను వరదలు ముంచెత్తి 15 రోజులు పూర్తయినా బాధితులకు చిల్లిగవ్వ సాయం కూడా చేయని రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వారి జేబులకు చిల్లులుపడే బాధ్యతను మాత్రం భుజానికెత్తుకుంది. బాధితులకు మేలు చేస్తున్నట్లు ఓ వైపు బిల్డప్ ఇస్తూనే మరోవైపు ఓ కార్పొరేట్ సంస్థకు మేలు చేకూర్చేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా.. బాధితుల ఇళ్లలో పనికిరాకుండా పోయిన గృహోపకరణాలతోపాటు ఇళ్లలో నీటి పైపులైన్లు, నీటి కుళాయిలు వంటి ప్లంబింగ్ పనులకు నిర్ణీత రేట్లతో మరమ్మతులు చేయించేందుకు ప్రభుత్వం ఓ కార్పొరేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ మరమ్మతుల రేట్లు అవాక్కయ్యేలా ఉండడం ముంపు ప్రాంతాల్లో పెద్ద చర్చనీయాంశమవుతోంది. ఉదా.. స్విచ్బాక్స్ బిగించడానికి రూ.279, ఫ్యాన్ రెగ్యులేటర్ మార్చడానికి రూ.99, ఫ్యాన్ రిపేరుకు రూ.199, ఫ్యాన్ మార్చడానికి రూ.239, గీజర్ చెక్ చేయడానికి రూ.299, వాష్ బేసిన్ లీకేజీ రిపేరుకు రూ.169, సింక్ డ్రెయిన్ పైపు రిపేరుకు రూ.209, డ్రెయిన్ పైపులో అడ్డుతొలగించేందుకు రూ.169, వాటర్ ట్యాప్ రిపేరుకు రూ.139, ఫ్లష్ ట్యాంకు రిపేరుకు రూ.299, వెస్ట్రన్ టాయిలెట్ రిపేరుకు రూ.799, వెస్ట్రన్ టాయిలెట్ మార్చడానికి రూ.1,499, ఇండియన్ టాయిలెట్ బిగించడానికి రూ.1,699.. అంటూ సదరు సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ధరలను నిర్ణయించింది. అంటే.. ఈ ధరలను బాధితులు స్వయంగా డబ్బులు చెల్లించి రిపేర్లు చేయించుకోవాల్సి ఉంటుంది. నిజానికి.. బయట మార్కెట్లో ఈ ధరలు ఇంకా తక్కువగానే ఉన్నాయని బాధితులే స్వయంగా చెబుతున్నారు. మరోవైపు.. ఈ కార్పొరేట్ సంస్థకు అదనంగా అవసరమయ్యే టెక్నీíÙయన్లను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ పొందిన వారిని ప్రభుత్వమే కేటాయించడం గమనార్హం. బాధితులకు యాప్ బాధ్యత ప్రభుత్వ సిబ్బందికి.. ఇదిలా ఉంటే.. వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9–12 వరకు ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహించింది. ఏ ఇంట్లో ఏ వస్తువులు పాడయ్యాయో వివరాలను సేకరించింది. ఇప్పుడు వీరి సమాచారం పరోక్షంగా ఆ సంస్థ చేతిలో ప్రభుత్వం పెట్టేసింది. అలాగే, పొదుపు సంఘాల కార్యక్రమాలను పర్యవేక్షించే ఉన్నతాధికారులు ఇటీవలే విజయవాడ పరిధిలోని మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించి ముంపు ప్రాంతాల్లోని పొదుపు మహిళల ఫోన్లలో సదరు కార్పొరేట్ సంస్థ యాప్ను డౌన్లోడ్ చేయించే బాధ్యతను వారికి అప్పగించారు. కొన్నిచోట్ల సచివాలయాల ఉద్యోగులు ఈ బాధ్యతను చేపట్టినట్లు సమాచారం. అంతేకాక.. ‘మీ ఇంట్లో పాడైన వాటిని సంబంధిత కంపెనీతో తక్కువ ఖర్చుతో బాగుచేయించుకోండి’ అంటూ ఆ సంస్థ క్యూఆర్ కోడ్తో ప్రభుత్వమే కరపత్రాలను బాధితులకు అందిస్తూ ఆ సంస్థను ప్రోత్సహిస్తోంది.కళ్లుచెదిరేలా రిపేరింగ్ రేట్లు.. నిజానికి.. పాడైన వస్తువులను ఇంటి చుట్టుపక్కల ఉండే టెక్నీషియన్తో బాగుచేయించుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. కానీ, ప్రభుత్వ ఒప్పందం ప్రకారం నిర్ణయించిన రేట్లు చూస్తే బయట మార్కెట్ రేట్లు లేదా ఆ కార్పొరేట్ సంస్థ తన యాప్లో ప్రదర్శించే ధరల కన్నా ఎక్కువగా ఉన్నాయి. వీరిని ఆశ్రయిస్తే బాధితుల ఖర్చులు తడిసిమోపెడవడం ఖాయం. ఎందుకంటే.. ఒకే ఇంట మూడు ట్యూబ్లైట్లను ఆ కంపెనీ ద్వారా మార్చుకుంటే మొత్తం రూ.360 చెల్లించాల్సి ఉంటుంది. కానీ, బయట మెకానిక్లో చేయిస్తే 150–200 మించి కావు. అలాగే.. ఎలక్ట్రికల్ స్విచ్ బాక్స్ బిగించడానికి రూ.239లు అని యాప్లో పేర్కొనగా, వరద ప్రాంతాల్లో ఇదే సేవకు రూ.279లుగా ధరను ప్రభుత్వం నిర్ణయించింది. లోకల్గా ఉండే మెకానిక్లు ఇదే పనికి రూ.100 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు.. ఫ్యాన్ మార్చడానికి యాప్ ధర రూ.199లు ఉంటే వరద ప్రాంతాల్లో రూ.239లుగా నిర్ణయించారు. అదే స్థానిక మెకానిక్లు ఈ పనికి కేవలం రూ.100–150ల చొప్పున తీసుకుంటామని చెబుతున్నారు. నీటి కుళాయి మార్చడానికి రూ.50 అని యాప్లో ఉంటే ఇదే పనికి వరద ప్రాంతాల్లో ప్రభుత్వం రూ.139లు నిర్ణయించింది. స్థానిక మెకానిక్లు ఈ పనికి రూ.100 తీసుకుంటున్నారు. వాస్తవానికి.. అనేక ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బాధితులకు ఉచితంగా సేవలందిస్తుంటే ప్రభుత్వం వీటిని ప్రోత్సహించకుండా కార్పొరేట్ సంస్థకు కొమ్ముకాయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక.. విపత్తు సమయంలో నిండా మునిగిన బా«ధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకుండా బాధితుల నుంచి కార్పొరేట్ కంపెనీలు అధిక ధరలు వసూలుచేసుకునేలా వీలు కల్పించడం విడ్డూరంగా ఉందని బాధితులు వాపోతున్నారు. ఆదుకుంటామని చెప్పి ఇలా చేస్తారా!? ఇక వరద తగ్గిన ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్లతో నీట మునిగిన ఇళ్ల పరిసరాలు శుభ్రం చేయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇంట్లోని సామాన్లు, దుస్తులు, గృహోపకరణాలు పాడైపోయిన వారిని ఏ విధంగా ఆదుకోవాలో కూడా ప్రకటిస్తామన్నారు. తీరా ఇప్పుడు బాధితులే డబ్బులు కట్టి బాగుచేయించుకోవాలని సూచించడంతో పాటు ఆయా పనులకు ప్రభుత్వం ధరలు నిర్ణయించి కార్పొరేట్ సంస్థతో ఒప్పందం చేసుకోవడంపై బాధితులు మండిపడుతున్నారు. సాయం మాట దేవుడెరుగు ఇది తమను మరింత గాయపర్చేలా ఉందని వారు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. -
'బుడమేరు వరద' సాయం స్వాహా
విజయవాడస్పోర్ట్స్: బుడమేరు ముంపు వల్ల సర్వం కోల్పోయిన బాధితులకు దాతలు అందిస్తున్న సాయాన్ని టీడీపీ నాయకులు స్వాహా చేస్తున్నారు. వరద వల్ల ఈ నెల ఒకటో తేదీ నుంచి పది రోజులపాటు విజయవాడ నగర శివారులోని కొత్త రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, సుందరయ్యనగర్, శాంతినగర్, ప్రశాంతినగర్, కండ్రిక, రాజీవ్నగర్, ఉడా కాలనీ తదితర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. బాధితుల ఆకలి తీర్చేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంతోమంది ముందుకొచ్చారు. ఆటోలు, ట్రాక్టర్లు, లారీల్లో ఆహారం, నీళ్లు, దుప్పట్లు, సరుకులు తీసుకొచ్చారు. వాటిపై టీడీపీ నేతల కళ్లు పడ్డాయి. చాలావరకు సింగ్నగర్ ఫ్లై ఓవర్ ప్రాంతంలోనే వాటిని ఎగరేసుకుపోయారు. అంతటితో ఆగకుండా తమ పలుకుబడి ఉపయోగించి స్వచ్ఛంద సంస్థలు, దాతలు తెచ్చిన సరుకులు, దుప్పట్లు, దుస్తులు వంటివి సింగ్నగర్ కృష్ణా హోటల్ సమీపంలోని ఎమ్మెల్యే బొండా ఉమా కార్యాలయానికి తరలించారు. వాటిని పసుపు సంచుల్లో వేసి టీడీపీ పంపిణీ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఈ సరుకుల పంపిణీకి కూడా పలు ప్రాంతాల్లో ముందుగా టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్ల కోసం వాంబేకాలనీలోని ఫంక్షన్ హాలు వద్దకు గురువారం అధిక సంఖ్యంలో పేదలు చేరడంతో గందరగోళం నెలకొంది. అక్కడి నుంచి టోకెన్లు తీసుకుని టీడీపీ కార్యాలయానికి వెళితే షట్టర్ మూసి ఉందని పలువురు వరద బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. సాయం చేస్తామని చెప్పి వారం నుంచి టోకెన్లు, సరుకులు అంటూ తిప్పుకుంటున్నారని వాంబేకాలనీకి చెందిన మహిళలు కె.జయలక్ష్మి, ఎస్.కనకదుర్గ, ఎ.నాగమణి, కె.దుర్గాభవాని, వి.లక్ష్మి, బి.నాగరాణి, శాంతి, ఎస్.సన్యాసమ్మ తదితరులు ఆగ్రహం వ్యక్తంచేశారు.మహిళ పేరు బాణావతు మల్లేశ్వరి. టీడీపీ నాయకురాలు. 20 ఏళ్లుగా కొత్త రాజరాజేశ్వరిపేటలో నివసిస్తూ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బుడమేరు వరద కారణంగా ఆమె నివాసం ఉంటున్న కొత్త రాజరాజేశ్వరిపేట అంతా మునిగిపోయింది. తమ పేటలోని బాధితులకు దాతలు అందిస్తున్న సాయాన్ని టీడీపీ నేతలు స్వాహా చేస్తున్న విషయాన్ని తేల్చుకునేందుకు పలువురు మహిళలతో కలిసి మల్లేశ్వరి గురువారం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కార్యాలయం వద్దకు వెళ్లారు. అయితే కార్యాలయం షట్టర్ మూసి ఉంది. ‘మా ప్రాంతానికి ఇప్పటి వరకు టీడీపీ తరఫున ఎటువంటి సాయం చేయలేదు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఇచ్చే సాయాన్ని కూడా మా పార్టీకే చెందిన మాజీ కార్పొరేటర్ యరబోతు రమణ పక్కదారి పట్టిస్తున్నాడు. సాయం చేసేందుకు వచ్చేవారిని మా పార్టీ నాయకులు వారి ఇళ్ల వద్దకు పిలిపించుకుని సరుకులు, దుస్తులు కాజేస్తున్నారు’ అని మల్లేశ్వరి ఆవేదన వ్యక్తంచేశారు. వరద నష్టం అంచనాలు కూడా కొందరి ఇళ్లకే పరిమితం చేశారని, సామాజిక పింఛన్లు ఇంకా ఇవ్వలేదని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు.నీచమైన బతుకులు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు మాకు ఎలాంటి సాయం చేయలేదు. సాయం చేసేందుకు వచ్చిన వారి నుంచి సరుకులన్నీ టీడీపీ నాయకులే తీసుకుంటున్నారు. వాటిని బయటపెట్టడం లేదు. ఎవరికీ పంచడం లేదు. మాకు అందాలి్సన వాటిని కాజేస్తూ నీచాతినీచమైన బతుకు బతుకుతున్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా ఆఫీసుకు వెళ్లి అడిగితే రోడ్డు పక్కన పడేసే చిరిగిన దుస్తులు పంపించారు. వాటనీ్నంటినీ బుధవారం రాత్రి మా వీధిలో పడేసి తీసుకువచ్చిన టీడీపీ నాయకుల ముందే తగలబెట్టేశాం. – రాజులపాటి తిరుపతమ్మ, న్యూఆర్ఆర్పేటసాయం అడిగితే పార్టీలు అంటగడుతున్నారుఇంట్లో సామాన్లు అన్నీ పోయి ఇబ్బందులు పడుతున్నాం. సాయం చేయాలని అడుగుతుంటే టీడీపీ నాయకులు పార్టీలను అంటగడుతున్నారు. మా పార్టీకి ఓటు వేయలేదు... మీకు ఇవ్వం అని ముఖం మీదే చెప్పేస్తున్నారు. రెండు రోజుల క్రితం జగన్ పార్టీ వాళ్లు వచ్చి అందరికీ సాయం అందించారు. టీడీపీ వాళ్లు మాత్రం పార్టీల పేరుతో వేరు చేసి మాట్లాడుతున్నారు. వాళ్లు సాయం చేయకపోగా, సాయం చేసే వాళ్లని మా వరకు రానివ్వడం లేదు. – గుడిసే నాగమణి, న్యూఆర్ఆర్పేట -
రాళ్లలో రతనాలు పండేనా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భారీ వర్షాలు, వరదలతో ఖమ్మం జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం 68 వేల ఎకరాలకుపైగా దెబ్బతినగా.. అందులో ఇందులో 5 వేల ఎకరాలకుపైగా ఇసుక, రాళ్ల మేటలు వేశాయి. ఈ భూములను సాగుయోగ్యంగా మార్చడం ఎలాగని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు పరిహారం ఇస్తామని ప్రకటించిందని.. కానీ ఇసుక, రాళ్ల మేటలు వేసిన తమ భూముల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ భూములను సాగుయోగ్యం చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతాయని.. ప్రభుత్వం అదనంగా పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఆనవాళ్లు కూడా లేనంతా.. భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో మున్నేరు, ఆకేరు విలయ తాండవం చేశాయి. వీటి పరీవాహకంలో వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. నష్టంపై సర్వే చేపట్టిన అధికారులు.. 33శాతంపైన దెబ్బతిన్న పంటలనే పరిగణనలోకి తీసుకుని, 68,345 ఎకరాల్లో నష్టం జరిగినట్టు గుర్తించారు. వీటికి ఎకరాకు రూ.10 వేల చొ ప్పున పరిహారం అందనుంది. అయితే కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, నేలకొండపల్లి, మధిర, ఎర్రుపాలెం, బోనకల్, తల్లాడ తదితర మండ లాల్లో వేల ఎకరాల్లో భూములు సాగుయోగ్యం కాకుండా పోయాయి. ముఖ్యంగా తిరుమలాయపాలెం మండ లం రాకాసితండాలో సారవంతమైన మట్టి అంతా కొ ట్టుకుపోయి రాళ్లు తేలి, ఇసుక మేట వేసింది. పంటలు సాగు చేయాలంటే.. భూములను బాగు చేసుకోవాలి. ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చవుతాయని రైతులు వాపోతున్నారు.సర్వం కోల్పోయి.. భూమీ దెబ్బతిని.. తిరుమలాయపాలెం మండలం అజ్మీరా తండా పరిధిలోని రాకాసి తండాకు చెందిన భూక్యా దేశ్యా తన మూడెకరాలకు తోడు మరో ఎకరం కౌలుకు తీసు కుని మిర్చి సాగు చేశారు. రూ.4 లక్ష లు వెచ్చించి మలి్చంగ్ పద్ధతిలో నా టాడు. కానీ ఆకేరు వరదతో పంట ఆనవాళ్లు లేకుండా పోయింది. పైగా పొలం అంతా ఇసుక మేటలు వేసింది. వరదలతో ఇంట్లో ఉన్న సర్వం కో ల్పోయామని.. జీవనాధారమైన భూమి కూడా బా గా దెబ్బతిన్నదని దేశ్యా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. -
ఇంతకూ మనం ఏమి నేర్చుకున్నట్లు?
ప్రకృతి సమయోచితంగా అందించే సూచనలను, దాని ముందు తలొంచి వినమ్రంగా స్వీకరించడం ఒక్కటే మనిషికి మిగిలిన ‘ఆప్షన్’. రాజైనా మంత్రి అయినా ఎవరైనా దాని ముందు ఒక్కటే. సరిగ్గా పదిహేనేళ్ళ క్రితం ఇదే సెప్టెంబర్ రెండున ‘కృష్ణా రివర్ క్యాచ్మెంట్ ఏరియా’ అయిన కర్నూలు జిల్లా నల్లమల అడవి ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సాక్షాత్తూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా‘‘ వై.ఎస్. రాజశేఖర రెడ్డి దుర్మరణం చెందారు. మళ్ళీ తిరిగి అదే రోజు అదే కృష్ణాతీరం చూపించిన ఉగ్ర రూపం ముందు, యావత్తు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ స్తంభించి, నిస్తేజంగా ప్రేక్షక పాత్ర వహించవలసి వచ్చింది. ‘నేచర్ కోర్స్’ ఆరంభం,అంతం రెండూ ఎప్పటిలా అవి తమ సహజ మార్గంలో వచ్చి వెళ్ళిపోయాయి. అవాక్కయి జరిగింది ఏమిటి? అని వెనక్కి తిరిగి చూస్తే, బోధపడిన జ్ఞానం ఏమంటే, ప్రభుత్వ శాఖలు ఏడాది పొడ వునా ‘సీజన్’ స్పృహతో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, అవ సరమైన బడ్జెట్ ఇస్తూ, ఒక శాఖ పనుల్లో మరొకరు వేలు పెట్టకుండా అందరూ ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. కొంత కాలంగా అటువంటి క్రమశిక్షణకు తరచూ తూట్లు పడు తున్నది. నెల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ ప్రభు త్వంలో– ‘పొలిటికల్ గవర్నెన్స్’ ఉంటుంది, అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఒక ‘పొలిటికల్ ఎగ్జిక్యూ టివ్’ పరిమితులు ఎంతవరకు? అమలులో వున్న ‘ఫ్లడ్ మాన్యువల్స్’కు పునః సమీక్ష అవసరమా? అనే మీమాంసకు ‘2024 ఏపీ ఫ్లడ్స్’ ఒక నమూనా కానుంది. ఎందుకంటే, ఇదే జిల్లాల్లో 1977 దివిసీమ ఉప్పెనలో 14,204 మంది దుర్మ రణం పాలైన చరిత్ర ఉంది. తదనంతరం ఏవీఎస్ రెడ్డి కృష్ణా జిల్లా కలెక్టర్గా తక్షణ సహాయం, పునర్నిర్మాణ పనులు చేసిన చరిత్ర కూడా ఉంది. అయినా ఇదేమీ నిన్న కాక మొన్న పుట్టిన ‘జాగ్రఫీ’ కాదు కదా! తూర్పు కనుమల్లో కురిసే వర్షం నీటి ప్రవాహానికి ఒక సహజ మార్గం ఉంది. ఈ ప్రాంతాన్ని ఒకప్పడు సర్కారు జిల్లాలు అనేవారు. బ్రిటిష్ ప్రెసిడెన్సీ పాలనలో 200 ఏళ్ళ పాటు ఉన్న ప్రాంతం. అప్పట్లోనే ప్రతిదానికీ ఇక్కడ ‘సిస్టమ్స్’ ఏర్పడ్డాయి. అందుకే, ఇరవై ఏళ్ళ క్రితం వరకూ కృష్ణాజిల్లా కలెక్టర్ టేబుల్ పైన గార్డన్ మెఖంజే ‘ది మాన్యువల్ ఆఫ్ క్రిష్ణా డిస్ట్రిక్ట్’ విధిగా ఉండేది. అయినా ఇటువంటి విషయాల్లో మనం వెనక్కి చూడడం, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం మర్చిపోయి చాన్నాళ్లు అయింది.మనకు తెలుసు, కదలిక (మొబిలిటీ), స్థిరత్వం (స్టాటిక్) రెండు భిన్నమైన వేర్వేరు అంశాలు. వరద అన్న వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు (సీబీఎన్) కదలిక మొదలయింది, ఇప్పటికీ అది ఇంకా ఆగలేదు. అయితే ‘శాటిలైట్ కమ్యూని కేషన్ సిస్టం’ వచ్చాక, ‘ఇ–గవర్నెన్స్’ వంటి ఆధునిక సాంకే తికత అందుబాటులో ఉండడం వల్ల పరిపాలనా యంత్రాంగం కదలకుండా ఉన్నచోట నుంచే ముందుగా వాతావరణ హెచ్చరికలు తెలుసుకుని, విపత్తు తీవ్రతను అంచనా వేస్తూ, దిగువకు క్షేత్ర సిబ్బందికి సూచనలు ఇస్తూ నష్టనివారణ చర్యలు తీసుకుంటుంది. రెండవ దశలో విపత్తు తర్వాత క్షేత్ర స్థాయి సిబ్బంది (మొబిలిటీ) సహాయ, పునరావాస, పునర్ని ర్మాణ పనులలోకి దిగుతారు. ఇలా ఇది రెండు దశల ప్రక్రియ. అంటే, పాలనా యంత్రాంగం కదలకుండా ఉన్నచోట నుంచే తమ విధుల్లో ఉంటే, ‘పొలిటికల్ ఎగ్జిక్యూటివ్’గా సి.ఎం. సీబీఎన్ నిత్యం కదులుతున్నారు. దాంతో ఇక్కడే మన కొచ్చే అనుమానం, ‘అధికారం’ అనేది కదిలేదా (మొబిలిటీ) లేక స్థిరంగా (స్టాటిక్)గా ఉండేదా? అది కదిలేదే కనుక అయితే, మళ్ళీ దానికి ఏదో ఒక పేరుపెట్టి అది ‘రాజధాని’ అంటూ దానికుండే ‘ఫ్లోటింగ్’ లక్షణాన్ని ‘స్టాటిక్’గా మారుస్తూ, దాన్ని ఒక గాటన కట్టే ప్రయత్నం ఏమిటి? దాని చుట్టూ ఇంత పరిపాలనా యంత్రాంగం, ప్రభుత్వ నిధులు కేంద్రీకృతం ఏమిటి? ఈ దృష్టితో చూసినప్పుడు, అధికారం అనేది ఒక ‘సాఫ్ట్ వేర్’ మాదిరిగా దృశ్యమానం కాని అమూర్త అంశం అని స్పష్టం అవుతున్నది. దాంతో ‘అధికారం’ లేదా దాన్ని మనం చలాయించే ప్రాంతమైన ‘రాజధాని’ ఇవి రెండు కూడా స్థిరంగా ఉండని ‘మొబిలిటీ’ అంశాలు అయినప్పుడు, ‘అధికారం’ అనే ఈ మొత్తం కసరత్తు ఒక ‘వర్చువల్’ భావన అనే అభిప్రాయం వద్దకు మనల్ని తీసుకువెళుతున్నది. దీనర్థం ప్రభుత్వ యంత్రాంగం అన్నప్పుడు మౌలిక వసతులు అనబడే ఆఫీసులు, అధికారులకు సిబ్బందికి నివాసాలు ఉంటే అవి సరిపోతాయి. రాజ్యంలో – ఒక వ్యవస్థకు ఉండే ఇటువంటి అమూర్త స్వభావాన్ని రాజకీయాలలోకి వచ్చిన తొలి రోజు ల్లోనే ఎన్.టి. రామారావు– ‘కేంద్రం ఒక మిథ్య’ అనడంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడే పైన పేర్కొన్న తేదీల్లో అమరావతిలో కురిసిన వర్షపాతం ఎంతో వరద పరిస్థితి ఏమిటో మనకు తెలియాలి. ‘ఆ ప్రాంతంలోని 29 గ్రామాల్లో 25 పూర్తిగా మునిగాయనీ, ఆగస్టు 31న ఒక్క రోజులో అమరావతి వాతావరణ కేంద్రంలో 28 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యిందనీ, ‘క్యుములోనింబస్’ మేఘాలు, బంగాళా ఖాతంలో అల్ప పీడనం కారణాలుగా కేవలం మూడు గంటల్లో 15 సెం.మీ. వర్షపాతం నమోదు అయిందనీ’ పేరు చెప్పడానికి ఇష్టపడని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారి ఒకరు చెప్పినట్టుగా సెప్టెంబర్ పదిన ‘హిందూస్థాన్ టైమ్స్’ పత్రిక రాసింది. కొల్లేరు సరస్సులో నీటిమట్టం సాధారణంగా రెండు మీటర్లు ఉంటుంది. వరద కారణంగా అది సెప్టెంబర్ ఒకటిన 3.2 మీటర్లు ఉండగా 8వ తేదీకి 3.35 మీటర్లకు పెరిగింది, 9వ తేదీకి కొల్లేరు ప్రాంత గ్రామాలకు వరద ముంపు ప్రకటించారు. 10వ తేదీకి అది 3.42 మీటర్లుకు పెరిగింది. చివరిగా ప్రకృతి నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాము అనేది ఒక్కటే ఏ తరంలో అయినా మిగులుతున్న ప్రశ్న.జాన్సన్ చోరగుడివ్యాసకర్త అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
వరద ముంపులో ఏపీకి ఆరో స్థానం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలో వరదలు, తుపాన్ల వల్ల ముంపునకు గురవుతున్న రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏకంగా మొదటి స్థానంలో నిలిచిందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వెల్లడించింది. 1998 నుంచి 2022 వరకు వివిధ రాష్ట్రాల్లో సంభవించిన వరదలు, తుపాన్ల వల్ల జరిగిన నష్టాలను తెలియజేసింది. దేశంలో అత్యధికంగా బిహార్ రాష్ట్రంలో 39 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్లో 26 లక్షల హెక్టార్లు, అస్సాంలో 24 లక్షల హెక్టార్లు, పశ్చిమబెంగాల్లో 19 లక్షల హెక్టార్లు, ఒడిశాలో 14 లక్షల హెక్టార్లు, ఏపీలో 8 లక్షల హెక్టార్లలోని ప్రాంతాలు తుపాన్లు, వరదల వల్ల నీటమునిగాయని వెల్లడించింది. ఏపీలో అయితే బాపట్ల, నెల్లూరు జిల్లాలే అత్యధికంగా నీట మునిగాయని తెలిపింది. నెల్లూరు జిల్లాలో 1.4 లక్షల హెక్టార్లు, బాపట్ల జిల్లాలో 1.11 లక్షల హెక్టార్ల భూమి ముంపునకు గురైందని పేర్కొంది. ఈ నదులపై తీవ్ర ప్రభావంఎడతెగని వర్షాలతో పాటు ఆక్రమణలు, డ్రైనేజీ వ్యవస్థల నిర్వీర్యం, ప్రతికూల వాతావరణం, మారుతున్న భూ వినియోగ విధానాలు, పెరుగుతున్న జనాభా తదితరాల వల్లే వరదలు సంభవిస్తున్నాయని తెలిపింది. గడిచిన 25 ఏళ్లలో భారీ వర్షాల వల్ల గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి నదుల్లో ప్రవాహం పెరిగి.. తరుచూ వరదలు సంభవిస్తున్నాయని పేర్కొంది. రుతుపవనాలు, అల్పపీడనాలు కూడా ఏపీలో వరదలకు దోహదం చేస్తున్నాయని తెలిí³ంది.తీవ్ర విషాదం మిగిల్చిన దివిసీమ ఉప్పెన1977లో సంభవించిన దివిసీమ(కృష్ణాజిల్లా) ఉప్పెన తీవ్ర విషాదాన్ని మిగిల్చి0ది. వేలాది మంది ప్రాణా లు కోల్పోయారు. ఈ ఉప్పెన.. అంతర్జాతీయ దాత ల దృష్టిని సైతం ఆకర్షించిందని నివేదిక వెల్లడించింది. 1979, 1990, 1996 తుపానులు కూడా ఇలాంటివేనని.. అవన్నీ మరిచిపోయే తుపానులు కాదని జాతీయ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పేర్కొంది. -
మీరిద్దరూ దోస్తులే కదా?
-
జనాలకు వాస్తవాలు తెలుస్తున్నాయని బాబుకు ప్రస్టేషన్: కాకాణి
సాక్షి, తాడేపల్లి: సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయనందున చంద్రబాబును గాడిదల మీద ఊరేగించాలని అన్నారు. అమరావతి మీద మాట్లాడితే నోటికి తాళాలు వేస్తారా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రస్టేషన్ ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. అమరావతి మునగదని చంద్రబాబు ఎందుకు చెప్పటం లేదని నిలదీశారు.జనం నోళ్లకు తాళం వేయటం కాదని, వరదలు రాకుండా కృష్ణానదికి తాళం వేయాలని చురకలంటించారు. వర్షాలు కురవకుండా ఆకాశానికి తాళం వేయాలని సెటైర్లు వేశారు. జనాలకు వాస్తవాలు తెలుస్తున్నాయని బాబు ప్రస్టేషన్లోకి వెళ్లిపోయారని విమర్శించారు. అమరావతిలోకి నీళ్లు వస్తున్నాయంటే కోపం ఎందుకని ప్రశ్నించారు.‘మెడికల్ కాలేజీలను ప్రయివేటుపరం చేయటంతో విద్యార్థులకు తీరని అన్యాయం. రైతులు అల్లాడిపోతున్నా పట్టింపులేదు. విద్యారంగం పూర్తిగా తిరోగమనం పట్టింది. ఇంగ్లీషు మీడియం రద్దు చేశారు. టోఫెల్, ఐబీ, సీబిఎస్ఈలను రద్దు చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేశారు. ప్రజారోగ్యానికి ఉరి వేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కు మంగళం పాడారు. విలేజ్ క్లినిక్ లకు గ్రహణం పట్టించారు’అని కాకాని మండిపడ్డారు. -
ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన దేవినేని అవినాష్
-
వరద బాధితులకు అండగా పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
-
మయన్మార్ వరదల్లో... 236 మంది మృతి
నైపిడావ్: మయన్మార్లోని యాగీ తుఫాను విలయం కొనసాగుతూనే ఉంది. దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వాటి ధాటికి ఇప్పటిదాకా ఏకంగా 236 మంది మృతి చెందారని ప్రభుత్వ సంస్థ గ్లోబల్ న్యూ లైట్ ఆఫ్ మయన్మార్ మంగళవారం వెల్లడించింది. ఈ సంఖ్య పెరగవచ్చని ఐరాస మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (ఓసీహెచ్ ఏ) పేర్కొంది. ‘‘77 మంది గల్లంతయ్యారు. కనీసం 6 లక్షల మందికి పైగా వరదల బారిన పడ్డారు’’ అని ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ చైనా, వియత్నాం, లావోస్, మయన్మార్లో గత వారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర వియత్నాంలో ఇప్పటికే వందలాది మంది మరణించినట్లు నిర్ధారించారు. మయన్మార్లో రాజధాని నైపిడావ్, సెంట్రల్ మాండలే, కయా, కయిన్, షాన్ స్టేట్స్ సహా కనీసం తొమ్మిది ప్రాంతాలు, రాష్ట్రాలను వరదలు ప్రభావితం చేశాయి. 2023లో మోచా తుఫాను వేళ అంతర్జాతీయ సాయాన్ని తిరస్కరించిన సైనిక పాలకులు ఇప్పుడు మాత్రం సాయానికి విజ్ఞప్తి చేస్తున్నారు.సైనిక ప్రభుత్వంతో సమస్య ఆహారం, తాగునీరు, మందులు, బట్టలు, ఆశ్రయం మయన్మార్కు అత్యవసరమని ఓసీహెచ్ఏ పేర్కొంది. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, అస్థిరమైన టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సహాయక చర్యలకు ఆటంకంగా మారాయని తెలిపింది. పొరుగు దేశాల సాయం బాధితులకు అందాలంటే సైన్యం పౌర సమాజంతో కలిసి పని చేయడం ముఖ్యమని అంతర్జాతీయ మానవ హక్కుల నిపుణుల స్వతంత్ర సమూహం ఏఎస్ఏసీ–ఎం తెలిపింది. కానీ మెజారిటీ ప్రజలకు సాయమందేలా చూడాలనే ఉద్దేశం సైనిక ప్రభుత్వానికి లేదని ఒక ప్రకటనలో ఆక్షేపించింది. సైన్యం దేశంలో మానవతా సంక్షోభాన్ని సృష్టించిందని, ప్రజలను గాలికొదిలి సొంత సైనిక, రాజకీయ ఎజెండాతో ముందుకు వెళ్తోందని ఆరోపించింది. నిధుల సమస్యతో కూడా సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయని ఓసీహెచ్ఏ పేర్కొంది. -
శ్రీశైలానికి తగ్గుతున్న వరద
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. అయినా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. మంగళవారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 40,947 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. సోమవారం నుంచి మంగళవారం వరకు శ్రీశైలానికి ఎగువ ప్రాజెక్ట్ల నుంచి 35,945 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 1,05,142 క్యూసెక్కులు విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 14.962 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.838 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం జలాశయంలో 197.4616 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటి మట్టం 881.70 అడుగులకు చేరింది. సాగర్ నీటి మట్టం 589.90 అడుగులు నాగార్జునసాగర్లో మంగళవారం 2 రేడియల్ క్రస్ట్గేట్ల ద్వారా 24,884 క్యూసెక్కులు దిగువ కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి 70,762 క్యూసెక్కులు వస్తుండగా అంతే నీటిని విడుదల చేస్తున్నారు. కుడి కాలువ ద్వారా 10,080, ఎడమ కాలువ ద్వారా 4,613, ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 28,785 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 1800 క్యూసెక్కులు, వరదకాల్వకు 600 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయ నీటిమట్టం 589.90 అడుగుల వద్ద ఉంది. ఇది 311.7462 టీఎంసీలకు సమానం. -
వరద బాధితులకు ప్యాకేజీ
సాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన వారికి ఆర్థిక ప్యాకేజీ అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదల వల్ల ఇళ్లు కూలిన వారికి కొత్త ఇళ్లు కట్టిస్తామన్నారు. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయిన అన్ని కుటుంబాలకు రూ.25 వేలు, మిగతా ఫ్లోర్లు మునిగిన వారికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇళ్లుమునిగిన వారికి రూ.10 వేల చొప్పున అందిస్తామన్నారు. ఆయా ఇళ్లలో అద్దెకు ఎవరైనా ఉంటుంటే పరిహౠరం వారికే చెల్లిస్తామన్నారు. కిరాణా షాపులు, చిన్న వ్యాపారులకు రూ.25 వేల చొప్పున ఇస్తామన్నారు. ఇప్పటికే ఆర్బన్ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మతులు చేయిస్తున్నామన్నారు.వ్యవసాయ రంగానికి పరిహారం ఇలావరి పంట దెబ్బతింటే హెక్టారుకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని చంద్రబాబు చెప్పారు, పత్తి, వేరుశనగ, చెరకు పంటలకు హెక్టారుకు రూ.25 వేల చొప్పున, మొక్కజొన్న, సజ్జలు, మినుము, పెసలు, కందులు, రాగులు, కొర్రలు, సామలు, రాగులు, నువ్వులు, సోయాబీన్, సన్ఫ్లవర్, ఆముదం, జూట్ పంటలకు హెక్టారుకు రూ.15 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. తమలపాకు పంటకు హెక్టారుకు రూ.75 వేలు, అరటి, మిరప, పసుపు కంద, జామ, నిమ్మ, మామిడి, జీడిమామిడి, దానిమ్మ, సపోటా, డ్రాగన్ ఫ్రూట్తో పాటు కాఫీ, యాపిల్ బేర్ తోటలకు హెక్టారుకు రూ.35 వేలు, కూరగాయలు, బొప్పాయి, టమాటా, పూలు, ఉల్లి, మెలన్స్, నర్సరీ, కొత్తిమీర పంటలకు హెక్టారుకు రూ.25 వేలు, ఆయిల్పామ్, కొబ్బరి ఒక్కో చెట్టుకు రూ.1,500, మల్బరీ తోటలకు హెక్టారుకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని వివరించారు. చనిపోయిన ఆవులు, గేదెలకు రూ.50 వేలు, ఎద్దులకు రూ.40 వేలు, దూడలకు రూ.25 వేలు, మేకలు, గొర్రెలకు రూ.7,500, కోడిపిల్లకు రూ.100, పశువుల షెడ్లకు రూ.5 వేల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. పంట నష్టాలను ఆయా క్షేత్రాల్లో రైతులు సాగు చేస్తున్నారా లేదా కౌలు రైతులకు సాగు చేస్తున్నారా గుర్తించి వారికే అందజేస్తామన్నారు. వలలతో సహా పూర్తిగా దెబ్బతిన్న నాన్ మోటరైజ్డ్ బోట్లకు రూ.20 వేలు, మోటరైజ్డ్ బోట్లకు రూ.25 వేలు, ఫిష్ ఫామ్స్ (డిసిల్టింగ్, రిస్టోరేషన్, మరమ్మతులు)కు హెక్టారుకు రూ.18 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామన్నారు.మరమ్మతులకు రుణాలువిజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల పరిధిలో దెబ్బతిన్న గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లకు రూ.50 వేలు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇళ్లకు రూ.25 వేల చొప్పున బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, ఎంఎస్ఎంఈల రుణాలను 24 నెలలపాటు రీషెడ్యూల్ చేయాలని కోరామని, బ్యాంకులు 12 నెలలపాటు రీషెడ్యూల్ చేయడానికి ముందుకొచ్చాయన్నారు. వ్యవసాయ రుణాలను ఐదేళ్లపాటు రీషెడ్యూల్ చేయిస్తామని, 12 నెలలపాటు మారటోరియం విధించాలని ఆదేశించామన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా కొత్తగా పంట రుణాలు మంజూరు చేయిస్తామని చెప్పారు.ఆ భూతాన్ని పూడ్చిపెట్టాలిగత ప్రభుత్వం విపత్తుల నిధులను ఖర్చుచేసి అకౌంట్స్లో చూపలేదని, దీంతో ఈ పార్థిక ఏడాది విపత్తుల నిధి నుంచి తొలి విడత రావాల్సిన నిధులు రూ.515 కోట్లు కేంద్రం నుంచి రాలేదని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం దుర్మార్గమైన పాలన చేసిందని, గత ప్రభుత్వ భూతాన్ని మళ్లీ లేవకుండా శాశ్వతంగా పూడ్చిపెట్టాలని అన్నారు.పంచాయతీరాజ్ నిధులతో పాటు పోలవరం నిధులను కూడా దారి మళ్లించిందని ఆరోపించారు. రూ.10.50 లక్షల కోట్లు అప్పులున్నాయని, రూ.లక్ష కోట్ల బిల్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు. జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, ఈ నేపథ్యంలో కేంద్రం త్వరగా ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నట్టు చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే వరద సాయంపై ఇప్పుడే చెప్పలేనన్నారు.అమరావతి మునిగిపోతుందని దుష్ప్రచారంఅమరావతి మునిగిపోతుందని వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వారెవరూ ఇలా మాట్లాడరన్నారు. అలాంటి నాలుకలకు తాళం వేయాలన్నారు. కింద నీళ్లు వస్తాయని, రాజధానిని ఆకాశంలో కట్టుకుంటామా అని ప్రశ్నిచారు. ఏ సిటీ మునగకుండా ఉంటుందో చెప్పాలన్నారు. కర్నూలు, రాజమండ్రి మునిగిపోలేదా.. బెంగళూరు, ముంబై, హైదరాబాద్ మునిగిపోలేదా అని ప్రశ్నించారు. ఆ సిటీలు మునిగిపోయాయని రాజధానులను మార్చేశారా అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కొంతమంది రెచ్చగొడుతున్నారన్నారు. గతంలో స్టీల్ ప్లాంట్ను తానే కాపాడితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు లాభాలు వస్తుంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఎందుకు నష్టం వస్తోందో యాజమాన్యంతో పాటు పనిచేసే సిబ్బంది ఆలోచించుకోవాల్సి ఉందన్నారు.త్వరలోనే ‘ఆపరేషన్ బుడమేరు’గత ప్రభుత్వ తప్పుడు పనులు, ఆక్రమణల వల్లే ఇంత వరద వచ్చిందని చంద్రబాబు విమర్శించారు. త్వరలోనే ఆపరేషన్ బుడమేరు ప్రారంభిస్తామన్నారు. మెడికల్ కాలేజీలపై వైఎస్సార్సీపీ ఆరోపణలు చేస్తోందని, వాటిపై జీవో ఏమిచ్చారో ఆ జీవో మెడకు కట్టి ఊరంతా తిప్పుతానన్నారు.ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇలా కేటగిరీ ఇచ్చే పరిహారం» విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగితే రూ.25 వేలు» ఫస్ట్ ఫ్లోర్, ఆపై అంతస్తులు మునిగితే రూ.10 వేలు»రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్ మునిగితే రూ.10 వేలు» విజయవాడలో చిన్న దుకాణాలకు రూ.25 వేలు»రిజిస్టర్డ్ వ్యాపార సంస్థలు, ఎంఎస్ఎంఈలు (రూ.40 లక్షల లోపు టర్నోవర్) రూ.50 వేలు»రిజిస్టర్డ్ వ్యాపార సంస్థలు, ఎంఎస్ఎంఈలు (రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్నోవర్) రూ.1 లక్ష»రూ.1.50 కోట్లకు పైగా టర్నోవర్ రూ.1.50 లక్షలు»ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు రూ.3 వేలు» దెబ్బతిన్న ఆటోలు వంటి 3 చక్రాల వాహనాలు రూ.10 వేలు» విజయవాడలో తోపుడు బళ్లు మునిగితే.. కొత్త తోపుడు బళ్లు అందజేత» ముంపునకు గురైన చేనేత, చేతివృత్తుల వారికి రూ.25 వేలు -
వరద బాధితుల కోసం రంగంలోకి దిగిన YSRCP నేతలు
-
బోరిస్ తుఫాన్.. వరదలతో యూరప్ అతలాకుతలం (ఫొటోలు)
-
వరద బాధితులకు ప్రభుత్వ సాయమేది?: బొత్స
విజయవాడ, సాక్షి: బుడమేరు వరదల విషయంలో సీఎం చంద్రబాబు చెప్పిందే చెప్పి అబద్దాన్ని నిజం చేయాలనుకుంటారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే వరదల వల్ల విజయవాడలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి. పత్రికల్లో ప్రకటనల కోసం కాకుండా బాధితులకు సాయం అందించటంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని అన్నారు. మూడో దశ వరద సహాయక కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ఇవాళ (మంగళవారం) శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా నిత్యావసర సరుకుల వాహనాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ విజయవాడ ప్రాంతంలో వరద బాధితులకు సరుకుల పంపిణీ శ్రీకారం చుట్టాం. నిత్యావసర సరుకులను ప్రతిఇంటికి చేర్చాలని పార్టీ నిర్ణయించింది. బుడమేరు వరదల విషయంలో సీఎం చంద్రబాబు చెప్పిందే చెప్పి అబద్దాన్ని నిజం చేయాలకుంటారు. 2009లో ఈ ప్రాంతంలో వరదలు వచ్చిన సమయంలో ఆనాడు నేను మంత్రిగా ఉన్నా.. అప్పడు బుడమేరకు వదర వస్తే.. తగు జాగ్రత్తలు తీసుకున్నాం. పైనఉన్న బ్యారేజీలు(శ్రీశైలం,నాగార్జున సాగర్,పులిచింతల)నుంచి కిందకి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాం. .. రేపల్లె సమీపంలో వరదలలో గండిపడితే నెల్లూరు కృష్ణపట్నం పోర్టు నుంచి 250 లారీలతో మట్టిని తెప్పించి పూడ్చాము. మా బాధ్యతగా అప్పడు మేము చేశాం. బుడమేరకు వరద వస్తుందని అధికారులకు ముందే తెలిసినా నిర్లక్ష్యంగా పట్టించుకోలేదని వారే మాట్లాడిన విషయాన్ని మనం వార్తల్లో చూశాం. వర్షాల విషయంలో వాతావరణ శాఖ ముందుగానే సూచించింది. ఈ ప్రభుత్వం వరదలపై ఎటువంటి మానిటరింగ్ చేయలేదు. ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వానికి అసలు ఆలోచననే లేదు. గత ప్రభుత్వం బురదజల్లె ప్రయత్నాలు చేస్తోంది. గతంలో వరదలు వచ్చిన సమయంలో అధికారులతో కలిసి ఇక్కడ తిరిగి సహాయక చర్యలు చేపట్టాం. ..అదృష్టవశాత్తు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృష్ణా నదికి రిటైనింగ్ వాల్ కట్టడంతో నగరానికి చాలా పెద్ద ముప్పు తప్పింది. విపత్తు విషయంలో ప్రభుత్వానికి ఆలోచన ఉండాలి. ప్రభుత్వం వెంటనే ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి. పత్రికల్లో ప్రకటనల కోసం కూడా బాధితులకు సాయం అందించటంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. మూడు రోజులపాటు చాలా మందికి బాధితులకు నీరు, పాలు, ఆహారం లేదు. మేము ఆహారం, నీరు అందించేతవరకు ప్రభుత్వం స్పందించలేదు. రాజకీయాలతో సంబంధం లేకుండా బాధితుల నష్టాన్ని ప్రభుత్వం పూడ్చాలని వైఎస్సార్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు. -
ప్యాక్ చూస్తే సన్న బియ్యం.. విప్పి చూస్తే రేషన్ బియ్యం!
పిఠాపురం : వరద కారణంగా సర్వం కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న వరద బాధితులను కూటమి ప్రభుత్వం హీనంగా చూస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఇలాకాలో వరద బాధితులకు అందించిన రేషన్ సరకులు నాసిరకంగా ఉండటంతో బాధితులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలైన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో ప్రభుత్వం వరద బాధితులకు రెండు రోజులుగా బియ్యం, నిత్యావసర వస్తువుల ప్యాకెట్లను పంపిణీ చేస్తోంది. వాటిని అందుకున్న బాధితులు విప్పి చూసి అవాక్కవుతున్నారు. పాడైపోయిన ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, నల్ల రంగులో పులిసిన వాసనతో చక్కెర, సైరస్ కంపెనీ 25 కేజీల బియ్యం బ్యాగ్లో రేషన్ బియ్యం కనిపిస్తుండటంతో వరద బాధితులు విస్తుబోతున్నారు. బ్యాగ్ చూసి ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చిందని సంతోషించిన వరద బాధితులు అందులో రేషన్ బియ్యాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వండిన వంట జావగా మారడంతో ఇవి తిని ఆస్పత్రి పాలవమంటారా.. అని ప్రశ్నిస్తున్నారు. పాడైన ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చక్కెరను చెత్తలో పారేస్తున్నారు. చంద్రబాబు.. పవన్కళ్యాణ్ ఇవి తింటారా అని ప్రశ్నిస్తున్నారు. మరి కొందరికి వరద సాయం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. -
వరద బాధితులకు వైఎస్సార్సీపీ ఆపన్న హస్తం
సాక్షి,తాడేపల్లి : రాష్ట్రంలో విజయవాడ వరద ముంపు బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తోంది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాలలోని రేపటి నుంచి రెండు రోజుల పాటు నిత్యవసర వస్తువులను పంపిణీ చేయనున్నారు. సుమారు 50వేల కుటుంబాలకు బెల్లం, కందిపప్పు, వంటనూనె, టెట్రాప్యాక్ మిల్క్, ఉప్మారవ్వ, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, బిస్కెట్ ప్యాకెట్లు కలిసిన ప్యాకెట్ను అందించనున్నారు. రేపు 30 వేల నిత్యవసర వస్తువుల ప్యాకెట్లను, ఎల్లుండి మరో 20 వేల నిత్యవసర వస్తువుల ప్యాకెట్లను వరద బాధితులకు అందించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం విజయవాడ హనుమాన్ పేటలో.. వైఎస్సార్సీపీ నేతలు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జీ దేవినేని అవినాష్, పశ్చిమ ఇన్ఛార్జి ఆసిఫ్ ఇతర నేతలు పరిశీలించారు. వరద బాధితుల కోసం వైఎస్సార్సీపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోటి రూపాయలు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. గత మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. కృష్ణా నదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిపై ఆయన నాయకులతో సమీక్షించారు. మరోవైపు వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఒక నెల జీతాన్ని వితరణగా అందించారు.ఇదీ చదవండి : ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ రద్దుపై వైఎస్ జగన్ ఆగ్రహం -
ముంచేసిన బుడమేరు.. చెరువుల్లా పొలాలు
(సాక్షి అమరావతి, నెట్వర్క్): చేతికొచ్చిన పంట నోటికందకుండా పోయింది! మరో 15–20 రోజుల్లో చేతికొస్తాయనుకున్న పంటలు ముంపు నీటిలో కుళ్లిపోతుంటే అన్నదాత కుమిలిపోతున్నాడు. వేలకు వేలు అప్పులు చేసి రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసిన పంటలు కాస్తా వర్షాలు, వరదలకు తుడిచిపెట్టుకుపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో కూరుకుపోయాడు. కృష్ణా లంక గ్రామాల్లోని పొలాల్లో ఎటు చూసినా ఇసుక మేటలే కనిపిస్తుండగా బుడమేరు వరద పంట చేలల్లో ఇంకా ప్రవహిస్తూనే ఉంది. ఏలేరు వరద రైతులను కకావికలం చేసింది. ముంపు తగ్గుతున్న కొద్దీ బయటపడుతున్న పంట పొలాలు అన్నదాత గుండెను పిండేస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాను ఈ ఏడాది మూడుసార్లు వరదలు ముంచెత్తగా పలు లంక గ్రామాలకు వెళ్లే రహదారులు, కాజ్వేలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ఉత్తరాంధ్రలో బహుదా, నాగావళి, వంశధార పోటెత్తడం, విరుచుకుపడ్డ వరదలతో 25 వేల ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. రంపచోడవరం నియోజకవర్గంలో 100 గ్రామాలకు వారం పాటు రాకపోకలు నిలిచిపోవడంతోపాటు విద్యుత్తు సరఫరా లేక నరకం చవిచూశారు. దెబ్బతిన్న రోడ్లు.. ఉత్తరాంధ్రలో వరదలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నర్సీపట్నం నుంచి చోడవరం వెళ్లే రోడ్డు చెరువును తలపిస్తోంది. రాజాంలో ప్రధాన రహదారి అంబేడ్కర్ జంక్షన్ నుంచి జీఎంఆర్ఐటీ వరకూ లోతైన గోతులు పడ్డాయి. తెర్లాం మండలంలో కుసుమూరు–అంపావల్లి గ్రామాల మధ్య కల్వర్టు కొట్టుకుపోవడంతో ఇప్పటికీ రాకపోకలు లేవు.నష్టం అపారం...రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికంగా 5.42 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 51 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతినగా 3.08 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు అంచనా వేశారు. అత్యధికంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రైతులకు అపార నష్టం జరిగింది. వ్యవసాయ పంటలకు రూ.358.91 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.42.34 కోట్లు, పట్టు పరిశ్రమకు రూ.2.68 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేశారు. పచ్చనేతల కనుసన్నల్లోనే అంచనాలురాజకీయాలకతీతంగా జరగాల్సిన పంట నష్టం అంచనాలు పచ్చనేతల కనుసన్నల్లో సాగుతున్నాయి. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారి పేర్లను జాబితాల నుంచి తొలగించాల్సిందేనని అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నట్టు రైతులు పేర్కొంటున్నారు. ఇచ్చేదే అరకొర సాయం.. దానికి కూడా రాజకీయ రంగు పులమడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూపూడికి చెందిన ఓ రైతు 80 ఎకరాల్లో పంట వరదలకు నష్టపోగా గత ప్రభుత్వ హయాంలో నామినేట్ పదవి పొందారనే అక్కసుతో ఆయన పేరు జాబితాలో తొలగించాలని స్థానిక టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.⇒ కృష్ణా, బుడమేరు వరదలు ఉమ్మడి కృష్ణా జిల్లాపై తీవ్ర ప్రభావం చూపాయి. 44,521 హెక్టార్లలో పంటలు ముంపు బారిన పడగా మరో 4,070 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 50 హెక్టార్లలో మెట్ట పంటలు దెబ్బతిన్నాయి. ⇒ పల్నాడు జిల్లాలో పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గ పరి«ధిలో పంటలు ఎక్కువ దెబ్బతిన్నాయి. జిల్లాలో వ్యవసాయ పంటలు 8,818.48 హెక్టార్లలో దెబ్బ తినగా 33 శాతం కన్నా ఎక్కువగా 2,852.747 హెక్టార్లలో పంటకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. 3,368 మంది రైతులకు రూ.4.8 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ అందించాల్సి ఉంటుందని లెక్కగట్టారు. జిల్లాలో వరద తాకిడికి 259.13 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. వర్షాలకు జిల్లాలో 41 ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు, వరదలకు జిల్లాలో విద్యుత్శాఖ(ఏపీఎస్పీడీసీఎల్)కు రూ.64.55 లక్షల మేర నష్టం వాటిల్లింది.‘ఏలేరు’ గుండెకోత..ఏలేరు వరదలతో పిఠాపురం, కిర్లంపూడి, గొల్లప్రోలుల్లోని పంటపొలాల్లో టన్నుల కొద్దీ మేట వేసిన ఇసుకను చూసి రైతులు విలవిలలాడుతున్నారు. ఏలేరు కాలువకు గండ్లు పడి 40 వేల ఎకరాలకుపైగా పంట పొలాల్లో రెండు అడుగుల ఎత్తున ఇసుక పేరుకుపోయింది. ఏలేరు రిజర్వాయరుపై ఆధారపడి 62 వేల ఎకరాల్లో సాగు జరుగుతోంది. 40 వేల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో గత నెలలో ఏజెన్సీ పరిధిలోని పెదవాగు పొంగడం.. ఆ తరువాత తమ్మిలేరు, ఉప్పుటేరు నుంచి భారీగా వరద నీరు చేరడం.. మళ్లీ వారం పాటు విస్తారంగా వర్షాలు కురవడం రైతులకు తీవ్ర వేదన మిగిల్చింది. ప్రధానంగా 5,683.20 హెక్టార్లలో వరి పూర్తిగా పాడైపోయింది.రాళ్లు రప్పలతో పొలాలు..కృష్ణా పరీవాహక ప్రాంతంలోని దిబ్బల్లంక, బెజవాడలంక, వాసనలంక తదితర లంక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ అత్య«ధిక భూములను ఎస్సీ రైతులే సొసైటీలుగా ఏర్పడి సాగు చేసుకుంటున్నారు. వారికి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పట్టాలు మంజూరయ్యాయి. ఏడాదిలో ఏ సమయంలో వచ్చినా ఇక్కడ పచ్చని పొలాలు దర్శనమిస్తాయి. అలాంటి లంకల్లో నేడు చూద్దామంటే పచ్చని పైరు కానరాని దుస్థితి. రెండు నుంచి ఐదు అడుగుల మేర ఇసుక మేట వేసింది. పిందె కట్టిన పత్తి, కాపుకొస్తున్న కూరగాయలు, కోతకు సిద్ధమైన వరి పొలాలు, గెలలేసిన అరటి, ఏపుగా ఎదిగిన జొన్న, మొక్కజొన్న.. ఇలా ఏ పంట చూసినా విగత జీవిలా నేలకొరిగి ఇసుక మేటల్లో కలిసిపోయాయి. ఉచిత విద్యుత్ కోసం గతంలో ఏర్పాటు చేసిన వందలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు, ఇంజన్లు దాదాపు 12 రోజులుగా వరద నీటిలో చిక్కుకుని బురదకు పాడైపోయాయి. వరద ఉధృతికి కొట్టుకొచ్చిన పెద్దపెద్ద రాళ్లు రప్పలతో పంటపొలాలు నిండిపోయాయి. ముంచేసిన బుడమేరు..బుడమేరు వరద ముంపునకు గురైన ఉంగు టూరు, నందివాడ, బాపులపాడు, పెదపారు పూడి మండలాల్లోని వంద లాది గ్రామాల్లో ఏ రైతును కదిపినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వరద ప్రభావానికి గురైన దిబ్బనపాడు, గారపాడు, ఆముదలపల్లి, ముక్కుపాలెం, లంకపల్లి, సిరివాడ, చినలింగాల, పెదలింగాల, చెదుర్తిపాడు, మోపాడు, ఇంజరుపూడి తదితర గ్రామాల్లో అన్నీ మాగాణి భూములే. నీటి వనరులకు లోటు ఉండదు. ఇప్పుడు ఎటు చూసినా పైర్లన్నీ సెలయేర్లను తలపిస్తున్నాయి. బుడమేరు వరద ఇంకా పంట చేలల్లో ప్రవహిస్తూనే ఉంది. ఆయా గ్రామాల్లో సుమారు 25 వేల ఎకరాలకు పైగా పంట భూములున్నాయి. ఈ ప్రాంత రైతులంతా ఎంటీయూ 1318 వరి రకాన్నే సాగు చేస్తున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితుల్లో సైతం ఈ ప్రాంతంలో మంచి పంటలు పండాయి. ఈసారి కూడా మంచి రేటు వస్తుందన్న ఆశతో రైతులంతా అదే సాగు చేశారు.కోనసీమను మూడుసార్లు ముంచెత్తిన వరద..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మామిడికుదురు, సఖినేటిపల్లి, ముమ్మిడివరం, అయినవిల్లి మండలాల్లో పలు లంక గ్రామాలకు వెళ్లే రహదారులు, కాజ్వేలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. వరద నీటిలో నానుతుండడంతో పంట నష్టం తీవ్రంగా ఉంది. అరటి 1,876 ఎకరాల్లో దెబ్బతింది. 2,625 ఎకరాల్లో రైతులు కూరగాయ పంటలు నష్టపోయారు. తమలపాకు, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. అయినవిల్లి మండలంలో వరద నీట నానుతున్న కొబ్బరి తోటలో సాగవుతున్న అరటి, పోక (వక్క) పంట వరదల వల్ల డిమాండ్ ఉన్నా బత్తాయి కోయలేక నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ముమ్మిడివరం మండలం అయినాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి. మొదటి ప్రమాదకర హెచ్చరిక జారీ చేయగానే గోదావరి పాయల్లో చేపల వేట నిలిపివేయడంతో 14 మండలాల్లో సుమారు 2 వేల మంది మత్స్యకారులు జీవనోపాధి లేక అల్లాడుతున్నారు. పి.గన్నవరం మండలం గంటి పెదడిపూడి లంక, అరిగెలవారిపేట, ఊడిమూడిలంక, బూరుగులంక వాసులు ఏటా వరద మొదలైన నాటి నుంచి నవంబరు వరకు పడవలపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది.13 వేలకుపైగా ఎకరాల్లో రెండోసారి మునక..ఖరీఫ్ ప్రారంభం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగానికి కష్టాలు తప్పడం లేదు. ఆగస్టు చివరిలో వచ్చిన వర్షాలకు యనమదుర్రు, వయ్యేరు, ఎర్ర కాలువ, ఉప్పుటేరు ఉప్పొంగడంతో తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి నియోజకవర్గాల్లో 14 వేల ఎకరాల్లో నాట్లకు, 30 వేల ఎకరాల్లో నారుమడులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రెండోసారి నాట్లు వేశారు. అప్పటికే ఎకరాకు రూ.12 వేల వరకు పెట్టుబడి పెట్టగా మరోసారి దమ్ము చేసి నాట్లు వేసేందుకు అంతే ఖర్చు చేయాల్సి వచ్చింది. నాటి వర్షాలకు రూ.9.54 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. తాజాగా కొల్లేరు, గోదావరి వరదలకు ఆకివీడు, కాళ్ల, అత్తిలి, పెంటపాడు తదితర మండలాల్లో 13,300 ఎకరాల్లో పంట రెండోసారి నీట మునగడం రైతులకు తీరని వేదన మిగిల్చింది.ఉత్తరాంధ్ర విలవిల.. వంద గ్రామాలు చీకట్లోనేఉత్తరాంధ్రలో వరదలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతంలో వరదలో కొట్టుకుపోయి ముగ్గురు, కొండ చరియలు విరిగిపడి మరొకరు మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. పోలవరం ముంపు ప్రాంతాలైన విలీన గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రంపచోడవరం నియోజకవర్గంలో 100 గ్రామాలకు వారం రోజుల పాటు రాకపోకలు నిలిచిపోవడంతోపాటు విద్యుత్తు సరఫరా లేక నరకంలో గడిపారు. ఒక్క చింతూరు డివిజన్లోనే దాదాపు 20 వేల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఉత్తరాంధ్రలో 25 వేల ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. అధికారికంగా ప్రాథమిక లెక్కల ప్రకారం 4,987ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. మరో 500 ఎకరాల్లో పంట పొలాలు కోతకు గురయ్యాయి. అయితే క్షేత్రస్థాయిలో వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసిన పరిస్థితి కనిపిస్తోంది. మళ్లీ ముఖం చూపించలేదువర్షాలకు సాయన్న గెడ్డ పొంగి దిశ మార్చుకొని మా పొలాలపై పడింది. మూడు గ్రామాల పరిధిలో దాదాపు వెయ్యి ఎకరాల్లో సాగు చేసిన వరి పంట ఎందుకూ పనికిరాకుండా పోయింది. అందులో నా మూడెకరాల వరి పొలం కూడా ఉంది. తొలిరోజు కలెక్టరు, రాజాం ఎమ్మెల్యే వచ్చి చూసి వెళ్లిపోయారు. అధికారులు మళ్లీ ముఖం చూపించలేదు. నష్టపరిహారం ఇస్తారో లేదో తెలియదు– బొడ్డేపల్లి జగన్నాథం, మల్లయ్యపేట, విజయనగరం జిల్లాబస్తా కూడా రావు..నాకు జూపూడిలో నాలుగు ఎకరాలుంది. మరో 50 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. 24 ఎకరాల్లో మినుము, మిగతాది వరి వేశా. మినుముకు రూ.15 వేలు, వరికి రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టా. మినుము సాగు చేసే పొలానికి కౌలు కూడా చెల్లించా. ఇప్పటికే రూ.15.90 లక్షల వరకు ఖర్చు అయింది. రెండు పంటలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. బస్తా గింజలు కూడా వచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా నష్టపోయాం. –పల్లా శ్రీరామయ్య, ఇబ్రహీంపట్నంతీవ్ర నష్టం అయినా కౌలుకట్టాలి..40 ఏళ్లుగా వరి, చెరకు సాగు చేస్తున్నా. కౌలుకు తీసుకుని పండిస్తున్నా. ఈ ఏడాది వరి నాట్లు వేశాక ముంపు బారిన పడింది. ఇక కోలుకునే పరిస్థితి లేదు. తీవ్ర నష్టం వాటిల్లినా కౌలు కట్టాల్సిందే. పెట్టుబడి మొత్తం నీళ్ల పాలైంది. ప్రభుత్వం వెంటనే స్పందించి అన్నదాతలను ఉదారంగా ఆదుకోవాలి. లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు కోలుకోవడం కష్టం. – గంజి చిలుకునాయుడు, కౌలు రైతు, నూతలగుంటపాలెం, కశింకోట మండలం ఎకరాకు రూ.30 వేలు నష్టం గ్రామంలో ఎస్సీ రైతులంతా సొసైటీలుగా ఏర్పడి దిబ్బలంక, బెజవాడలంకల్లో 400 ఎకరాల్లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నాం. మూడు పంటలు పండుతాయి. 15 ఎకరాలు మాగాణి, 3 ఎకరాల్లో పత్తి, 3 ఎకరాల్లో మినుము వేశా. వరదలతో పూర్తిగా నష్టపోయాం. ఇసుక మేట వేయడంతో ప్రతి రైతు ఎకరాకు రూ.30 వేలకుపైగా నష్టపోయారు. – రెంటపల్లి నాగరాజు, కొటికలపూడి, ఎన్టీఆర్ జిల్లా -
అటు ఎండబెట్టి.. ఇటు ముంచేసి..
కృష్ణా వరద నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యమే విజయవాడతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో జలప్రళయం సంభవించడానికి.. అపార ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీసిందని జలవనరుల శాఖ అధికార వర్గాలు, సాగునీటిరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను శ్రీశైలం ప్రాజెక్టులో నియంత్రించేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు మళ్లించి.. గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా దిగువకు విడుదలచేసి ఫ్లడ్ కుషన్ ఉంచుకుని ఉంటే జలప్రళయం సంభవించే అవకాశమే ఉండేది కాదని వారు తేల్చిచెబుతున్నారు. ఈ సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులోకి జూన్ 1 నుంచి శుక్రవారం ఉ.6 గంటల వరకూ 1,016.19 టీఎంసీల ప్రవాహం వస్తే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 93.21 టీఎంసీలే మళ్లించారు. ఆ రెగ్యులేటర్పై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలంటే ఇంకా 125.29 టీఎంసీలు అవసరం. నిజానికి.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా జలాలు సముద్రంలో కలుస్తున్నప్పుడు ఎగువన ఇరు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎంత మళ్లించినా ఆ నీటిని కోటాలో కలపకూడదని 2019లో కృష్ణా బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో.. వరదల సమయంలో గరిష్ఠస్థాయిలో పోతిరెడ్డిపాడు ద్వారా ఒడిసి పట్టి ఉంటే.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులు నిండి ఆ ప్రాంతాలు సస్యశ్యామలమయ్యేవని.. ప్రకాశం బ్యారేజీ దిగువన ముంపు ముప్పు తప్పేదని, తద్వారా ప్రాణ, ఆస్తి నష్టానికి జరిగేది కాదని వారు స్పష్టంచేస్తున్నారు. 2019, 2020, 2021, 2022లలో కృష్ణా వరదను ప్రభుత్వం ఇదే రీతిలో నియంత్రించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిందని వారు గుర్తుచేస్తున్నారు. – ఆలమూరు రాంగోపాల్రెడ్డి, సాక్షి ప్రతినిధి వరద నియంత్రణ చేసేది ఇలాగేనా..ూ కృష్ణా నది చరిత్రలో శ్రీశైలం ప్రాజెక్టులోకి 2009, సెపె్టంబరు 2న గరిష్ఠంగా 25.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. అప్పట్లో ఈ వరదను సమర్థవంతంగా నియంత్రించడంవల్ల ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే ప్రవాహాన్ని గరిష్ఠంగా 11.10 లక్షలకు పరిమితం చేశారు. » కృష్ణా బేసిన్లో ఈ ఆగస్టు 30, 31.. సెప్టెంబరు 1 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆగస్టు 28నే హెచ్చరించింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆగస్టు 28న 1,69,303 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు 885 అడుగుల్లో 215.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. దిగువన నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయి. కానీ, ఆ రోజున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 30 వేల క్యూసెక్కులను మాత్రమే వదిలారు. ఆ తర్వాత శ్రీశైలంలోకి ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగినా ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో 30 వేల క్యూసెక్కుల చొప్పున.. సెప్టెంబరు 1న 26,042 క్యూసెక్కులను మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మళ్లిస్తూ వచి్చన వరదను వచి్చనట్లు సాగర్, పులిచింతల ద్వారా దిగువకు వదిలేశారు. » దీంతో ప్రకాశం బ్యారేజీని కృష్ణా వరద ముంచెత్తింది. బ్యారేజీ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో సెపె్టంబరు 2న గరిష్ఠంగా 11,43,201 క్యూసెక్కుల వరద రావడానికి దారితీసింది. ఆ రోజున కూడా పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం 16,417 క్యూసెక్కులు.. సెపె్టంబరు 3న 12 వేల క్యూసెక్కులు మాత్రమే మళ్లించారు. రాష్ట్ర ప్రయోజనాలు ‘కృష్ణా’ర్పణం.. » వరద నియంత్రణలో ప్రభుత్వ ఘోర వైఫల్యంవల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే 647.16 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ప్రభుత్వం ముందుచూపుతో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని మళ్లించి ఉంటే.. కడలిలో కలిసిన జలాల్లో కనీసం 100 టీఎంసీలు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు దక్కి ఉండేవని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఈ సీజన్లో ఏ ఒక్కరోజూ ‘పోతిరెడ్డిపాడు’ సామర్థ్యం మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించకపోవడాన్ని ఆయన గుర్తుచేశారు.» ఇక హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున తరలిస్తేనే 120 రోజుల్లో ప్రస్తుత డిజైన్ మేరకు 40 టీఎంసీలు రాయలసీమకు అందించవచ్చు. కానీ, ఇప్పటికి కేవలం 4.24 టీఎంసీలే తరలించారు. ఈ సీజన్లో గరిష్ఠంగా 1,688 క్యూసెక్కులను మాత్రమే ఎత్తిపోశారు. » వరద రోజుల్లో మళ్లించిన జలాలను కృష్ణా బోర్డు కోటాలో కలిపేది కాదు.. దీనివల్ల రాష్ట్ర కోటా 512 టీఎంసీల కంటే అధికంగా వాడుకునే అవకాశం ఉండేది. ఇది రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి దారితీసేది. » ఇక శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి చెరి సగం నీటిని వాడుకోవాలి. కానీ, తెలంగాణ జెన్కో కంటే ఏపీ జెన్కో తక్కువ విద్యుదుత్పత్తి చేసింది. శ్రీశైలంలోకి ప్రవాహాలు ఇలా..» ఈ సీజన్లో జూన్ 1 నుంచి ఈ నెల 13 వరకు » శ్రీశైలానికి వచ్చిన ప్రవాహం : 1,016.19 టీఎంసీలు » ఇందులో జూరాల నుంచి వచ్చింది : 797.68 టీఎంసీలు » సుంకేశుల నుంచి వచ్చింది : 217.51 టీఎంసీలు » హంద్రీ నుంచి వచ్చింది : 1.00 టీఎంసీశ్రీశైలం నుంచి విడుదల చేసింది ఇలా..ఆంధ్రప్రదేశ్..» పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ : 93.21 టీఎంసీలు » హంద్రీ–నీవా : 4.24 టీఎంసీలు »కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం : 101.45 టీఎంసీలుతెలంగాణ..» కల్వకుర్తి ఎత్తిపోతల : 9.91 టీఎంసీలు » ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రం : 152.74 టీఎంసీలు » గేట్ల ద్వారా నదిలోకి విడుదల : 604.53 టీఎంసీలు -
సూక్ష్మజీవుల దండయాత్ర
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాల ప్రజలపై సూక్ష్మజీవులు దండయాత్ర చేస్తున్నాయి. బ్యాక్టీరియా, వైరస్, ఈస్ట్, శిలీంధ్రాల దాడితో ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. మురుగు నీటిలో ఎక్కువ రోజులు ఉండటం, క్రిమికీటకాలు కుట్టడం వల్ల సూక్ష్మజీవులు శరీరంపై చేరి వివిధ రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. ముంపు తగ్గిన నేపథ్యంలో ఇన్ఫెక్షన్ల బారినపడిన వందలాది మంది ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఒకవైపు వరదలతో సర్వం కోల్పోయి బాధితులు మానసిక ఒత్తిడిలో ఉంటే.. ఇప్పుడు వారిని ఇన్ఫెక్షన్లు వెంటాడుతున్నాయి. వరద వచ్చి 15 రోజులైనా ఇంకా కొన్ని ప్రాంతాలు పూర్తిగా కోలుకోలేదు. ఇళ్లలోని దుస్తులు, సామాన్లను శుభ్రం చేసుకునే క్రమంలో మురుగు నీటిలోనే ఉండటం, క్రిమికీటకాలు ఉండటంతో ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. – లబ్బీపేట (విజయవాడ తూర్పు)వరద తగ్గిందని ఊరట చెందేలోపే... వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎక్కువ రోజులు నీటిలోనే నానటం, సూక్ష్మజీవులు కుట్టడం వల్ల ఇన్ఫెక్షన్ల బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.పాచిపోయిన పాదాలతో ఇన్ఫెక్షన్లు సోకిన వారు ఆస్పత్రులకు ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారు చికిత్సకోసం వస్తున్నారు. అలాంటి వారిలో కొందరికి ఇన్ఫెక్షన్లు తీవ్రంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. వారిలో కొందరికి ఇన్ఫెక్షన్లతో కాళ్లపై పుండ్లు వచ్చినట్టు పేర్కొంటున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన శానిటరీ వర్కర్కు నీటిలో క్రిమి కుట్టడంతో చేతికి ఇన్ఫెక్షన్ సోకి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి చేతికి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండటంతో చేయి తీసి వేయాల్సిన పరిస్థితి ఉందని ఇప్పటికే వైద్యులు తెలిపారు. మానసిక ఒత్తిళ్లతో..వరద ప్రాంతవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. తమకు ఇష్టమైన సామాన్లు ఎంతోకాలం కష్టపడి సమకూర్చుకుంటే ఇప్పుడు అవన్నీ వరద పాలయ్యాయి. చాలా వరకూ పనికిరాకుండా పోయాయి. మరికొందరు ఆ ప్రాంతంలో సొంత ఇళ్లను సైతం సమకూర్చుకున్నారు. రుణాలు తీసుకుని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్నారు. తాము ఇళ్లు కొన్నది ముంపు ప్రాంతంలోనా! అంటూ కొందరు వేదన పడుతున్నారు. ఇలా వరద బాధితులందరూ ప్రస్తుతం మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. అలాంటి వారిలో దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉండని పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల దుష్ఫలితాలు ఉంటాయని, వ్యాధులున్న వారు పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అదుపులో ఉండని వ్యాధులతో..ముంపు ప్రాంతాల్లో వేలాది మంది దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు వంటి వాటితో బాధపడుతున్న వారు సైతం ఉన్నారు. వారంతా ఇళ్లలోకి నీరు రావడంతో కట్టుబట్టలతో బయటకు వచ్చారు. దీంతో వాళ్లు రెగ్యులర్గా వాడే మందులు నీట మునిగాయి. దీంతో 15 రోజులుగా మందులు వాడకుండా ఉండటంతో మధుమేహం, రక్తపోటు వంటివి అదుపు తప్పాయి. అలాంటి వారికి ఇన్ఫెక్షన్లు సోకితే పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం, రక్తపోటు అదుపులో లేనివారికి ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గే అవకాశం ఉండదంటున్నారు. ఇన్ఫెక్షన్ల బాధితులే అధికంవరద ముంపు ప్రాంతాల నుంచి కాళ్లకు ఇన్ఫెక్షన్లు సోకిన వారు చికిత్స కోసం ఆస్పత్రులకు వస్తున్నారు. ఎక్కువ రోజులు మురుగు నీటిలో నడవడం వల్ల కాళ్లు పాచిపోయి ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. మందులు వరద పాలవడం వల్ల మధుమేహులు మందులు సక్రమంగా వాడక, శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగిపోయి ఉంటాయి. మానసిక ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వారికి ఇన్ఫెక్షన్లు సోకితే ప్రమాదమే. సక్రమంగా మందులు వాడుతూ.. ఇన్ఫెక్షన్ల బారినపడకుండా చూసుకోవాలి. -
వరద ప్రాంతాల్లో ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. వరదల కారణంగా నీరు నిల్వ ఉండడంతో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జ్వరం, నీళ్ల విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణ చికిత్స కోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.తగు సూచనలు, సలహాల కోసం ఆయా ప్రాంతాల్లోని స్థానిక ఏఎన్ఎంను ఫోన్లో సంప్రదించాలని, భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలన్నారు. వరద ప్రాంత ప్రజలు కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తీసివేయాలన్నారు. డెంగీ దోమల లార్వా వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
ఆశలు సమాధి చేసి..
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): ఎక్కడో ఒకచోట బతికే ఉంటాడు.. క్షేమంగా తిరిగొస్తాడు.. అని ఎదురు చూసిన వారి ఆశలు ఆవిరయ్యాయి. 15 రోజుల కిందట వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి విగత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆర్ఆర్పేటకు చెందిన పోలినాయుడు ముఠా కూలీ. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నెల ఒకటో తేదీన ఉదయం పది గంటల సమయంలో తన పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా సింగ్నగర్, న్యూఆర్ఆర్పేట పరిసర ప్రాంతాలన్నీ బుడమేరు వరద ముంపునకు గురవుతున్నాయని తెలుసుకున్నాడు.ఇంట్లో వారికి ఫోను చేసి మరో పది నిమిషాల్లో సింగ్నగర్ దాటి ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పాడు. ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి న్యూ ఆర్ఆర్పేటలోని బుడమేరుపై ఉన్న వంతెన దాటుతుండగా ఒక్కసారిగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతని స్నేహితుడు అతి కష్టం మీద బయటపడి విషయాన్ని పోలినాయుడు కుటుంబ సభ్యులకు, పోలీసులకు, అధికారులకు తెలియజేశాడు. అధికారులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. వరద ప్రవాహానికి ఎక్కడైనా వెళ్లి బయటపడి ఉంటాడని, క్షేమంగా తిరిగొస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నారు.అయితే ఆదివారం ఉదయం పోలినాయుడు గల్లంతైన ప్రదేశంలోని దేవినేని వెంకటరమణ మున్సిపల్ హైస్కూల్ వద్ద ఓ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలినాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా ముళ్ల చెట్ల మధ్యలో ఆయన ఒక చెట్టుకొమ్మను గట్టిగా పట్టుకుని నీటిలో పడి ఉన్నాడు. చేతికి ఉన్న ఉంగరం, దుస్తులను బట్టి కుటుంబ సభ్యులు పోలినాయుడేనని నిర్ధారించుకున్నారు. విషయాన్ని సింగ్నగర్ పోలీసులకు తెలియజేయగా వారు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ నేత కాళ్ల ఆదినారాయణ వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచి అంత్యక్రియలు జరిపించారు. వరద వదిలినా.. ఆ తల్లీ కొడుకుల్ని మృత్యువు వదల్లేదురామవరప్పాడు (విజయవాడ రూరల్): విజయవాడ పాత రాజీవ్నగర్కు చెందిన ఓ కుటుంబాన్ని బుడమేరు వరద ముంచేసింది. ఆ ముంపునుంచి తప్పించుకున్నా.. చివరకు లారీ రూపంలో దూసుకొచి్చన మృత్యువు తల్లీ కొడుకుల్ని మింగేసింది. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో ఆదివారం రాత్రి లారీ ఢీకొన్న ఘటనలో స్కూటర్పై వెళ్తున్న పాతరాజీవ్నగర్ వాసులు లింగమనేని కృష్ణకుమారి (63), ఆమె కుమారుడు ప్రభుకుమార్ మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బుడమేరు వరద కారణంగా పాత రాజీవ్నగర్లోని కృష్ణకుమారి ఇల్లు నీట మునిగింది.దీంతో ఆ కుటుంబం గుణదలలో ఉంటున్న కృష్ణకుమారి సోదరుడి ఇంటి వద్ద ఆశ్రయం పొందుతోంది. ప్రభుకుమార్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వరద ముంపు తగ్గడంతో తమ ఇంటిని రెండు రోజుల నుంచి శుభ్రం చేసుకుంటున్నారు. ఆదివారం కూడా ఇంటిని శుభ్రం చేసుకున్న అనంతరం తల్లీకుమారులు స్కూటర్పై గుణదల బయలుదేరారు. రామవరప్పాడు రింగ్ సమీపంలో లారీని గమనించక వారు కుడి వైపునకు మళ్లారు. లారీ ఆ స్కూటర్ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన తల్లీకుమారులు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. -
ఫర్నిచర్ పరిశ్రమ వరదార్పణం
సాక్షి, అమరావతి: విజయవాడ వరదల్లో తడిసి ముద్దయిన ఫర్నిచర్ పరిశ్రమకు కోలుకోలేని నష్టం ఏర్పడింది. దాదాపు 15రోజులపాటు ప్లైవుడ్, ఇతర ఫర్నిచర్ సామగ్రి నీటిలో నానిపోయి రూ.కోట్ల నష్టం మిగిలి్చంది. ఉత్పత్తి అయిన ఫర్నిచర్ అమ్మకానికి పనికిరాకుండా తయారైంది. సామగ్రి సైతం ఫర్నిచర్ తయారీకి పనికిరాకుండా పోయింది. దీంతో ఫర్నిచర్ పరిశ్రమలు, వర్క్షాప్ల రోజువారీ పనులు ఇప్పటికీ మొదలయ్యేలా లేవు. ముంపుబారిన 310కి పైగా వర్క్షాపులు విజయవాడ నగరంలో వరద ముంపునకు గురైన అజిత్సింగ్నగర్, రాజరాజేశ్వరీపేట, అంబాపురం, రాజీవ్ నగర్, వాంబే కాలనీ, జక్కంపూడి కాలనీ, పైపుల రోడ్డు, కండ్రిక తదితర ప్రాంతాల్లో 310పైగా ఫర్నిచర్ తయారు చేసే వర్క్షాప్లు ఉన్నాయి. వాటితోపాటు భవానీపురం, అజిత్సింగ్ నగర్ ప్రాంతాల్లో 45కు పైగా ప్లైవుడ్ పరిశ్రమలు ఉన్నాయి. వాటికి అనుబంధంగా ప్రత్యేక గోదాములు కూడా ఉన్నాయి. వాటన్నింటిలోను వరద నీరు చేరి రోజుల తరబడి ఉండిపోవడంతో ప్లెవుడ్ చెక్కలతోపాటు వాటితో తయారు చేసిన వస్తువులు సైతం నానిపోయి ఉబ్బిపోయాయి. ముడిసరుకు, తయారీ సామగ్రి వరద నీటిలో దెబ్బతిని వాటి యజమానులు నష్టపోయారు. ఫర్నిచర్ షాపులు, వర్క్షాపుల్లోని బీరువాలు, సోఫా సెట్లు, ఇనుప సామగ్రి, యంత్రాలు, పనిముట్లు దెబ్బతినడంతో ఒక్కో యజమానికి కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. ఒక్క ప్లైవుడ్ ఫర్నిచర్, వర్క్షాపులు, పరిశ్రమలకు వచ్చిన నష్టమే మొత్తంగా కనీసం రూ.30 కోట్లు ఉంటుందని అంచనా. ఫర్నిచర్ షాపులు, పరిశ్రమలపై ఆధారపడిన జీవిస్తున్న సుమారు 12 వేల మంది ఉపా«ధికి సైతం పెద్ద దెబ్బ తగిలింది.ఇనుముకు తుప్పు విజయవాడ భవానీపురం ఐరన్ యార్డ్కు వరద తీవ్ర నష్టం తెచ్చింది. 60 ఎకరాల్లో విస్తరించిన ఐరన్ యార్డ్లో 430కి పైగా హోల్సెల్ ఐరన్ వ్యాపార దుకాణాలు ఉన్నాయి. ఈ యార్డ్లో రోజుకు రూ.5 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. ఐరన్ హోల్సేల్ షాపులతోపాటు రిటైల్ షాపులు, శానిటరీ, పైపులు, ప్లైవుడ్, ఎలక్ట్రికల్స్, హార్ట్వేర్, ఆగ్రో, కెమికల్, నిత్యావసర వస్తువుల షాపులు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వరద నీరు ముంచెత్తడంతో అవన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. రోజుల తరబడి నీటిలో నానిపోయిన ఐరన్ నిల్వలు తుప్పుపట్టి రంగు మారడంతో వ్యాపారులు తీవ్ర నష్టాల్లో మునిగిపోయారు. రంగు మారిన ఐరన్ సామగ్రిని తుక్కుకు అమ్ముకోవాల్సిందేనని ఆవేదన చెందుతున్నారు. వరద సమయంలో 15 రోజులపాటు వ్యాపారం చేసే అవకాశం లేకపోగా, ఇప్పుడు పాడైన ఐరన్, ఇతర సామగ్రిని అయినకాడికి అమ్ముకోవాల్సి రావడంతో నష్టాల్లో మునిగిపోతామని చెబుతున్నారు. -
తెలుగు రాష్ట్రాల పాలసీదార్లకు ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్ప్డెస్క్
తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సంతో నష్టపోయిన పాలసీదారులకు సత్వరం సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వారి కోసం ప్రత్యేక హెల్ప్డెస్్కను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇది ప్రతి రోజూ, ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటుందని వివరించింది. పాలసీదారులు టోల్ ఫ్రీ నంబరు 1800–2666 ద్వారా లేదా customersupport@icicilombard. com ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. -
వరద సాయంలోనూ టీడీపీ నేతల పక్షపాతం
-
బుడమేరుకు మళ్లీ వరదనే పుకార్లు నమ్మొద్దు
-
వరద బాధితులను ఆదుకుంటాం
కూసుమంచి/తిరుమలాయపాలెం/నేలకొండపల్లి: గతనెల 31 నుంచి ఈనెల 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో రూ. 10,300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా లోని కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో శనివారం మంత్రి పర్యటించారు. పాలేరు ఎడమ కాల్వ గండి మరమ్మతులను త్వరగా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాల ని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గంటల వ్యవధిలో 37 నుంచి 38 సెం.మీ. మేర వర్షం కురవడంతో అన్ని విభాగాల్లో నష్టం ఎదురైందని చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా, సీఎం వినతితో కేంద్ర బృందాలు పర్యటించాయని తెలిపారు.కేంద్ర ప్రభుత్వానికి వరద సాయం కోసం విన్నవించడమే కాక ప్రజలను ఆదుకునే దిశగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కేంద్రం నుంచి సాయం అందినా, అందకున్నా వరద బాధితులను ఆదుకుంటామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం త్వరలో అందిస్తామని, పూర్తిగా ఇళ్లు నష్టపోయిన ప్రజలకు నెలాఖరులోగా ఇందిరమ్మ పథకం ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఎనిమిది పోలీసు బెటాలియన్ల నుంచి 100 మంది సిబ్బందిని ఎంపిక చేసి వరద సహాయక చర్యలపై శిక్షణ ఇప్పించి కావాల్సిన పరికరాలు సమకూరుస్తామని తెలిపారు. వచ్చేవారం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను సీఎం రేవంత్రెడ్డి నేతృత్వాన కలిసి విపత్తు సాయం కోసం ప్రతిపాదనలు అందిస్తామని వెల్లడించారు. -
మానని గాయం.. తీరని నష్టం
సాక్షి, అమరావతి : బుడమేరు వరద బాధితుల్లో ఎవరిని కదిపినా ఒకటే వేదన. 15 రోజులైనా వరద కష్టాలు వీడలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం లక్షకు పైగా కుటుంబాలకు మానని గాయాన్ని మిగిల్చింది. బతుకులను దుర్భరంగా మార్చింది. గత నెల 31న అర్ధరాత్రి విరుచుకుపడ్డ వరదకు సర్వస్వం కోల్పోయి విలపిస్తున్న విజయవాడ శాంతినగర్, పాయకాపురం, పైపుల రోడ్డు, వాంబేకాలనీ, డాబాకోట్లు సెంటర్, ఇందిరానాయక్ నగర్, సింగ్నగర్ నుంచి ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ఈమె పేరు లావణ్య. ఆమె భర్త నర్సింహారావు. ముగ్గురమ్మాయిల్లో పెద్దమ్మాయికి పెళ్లి చేశారు. ఆమె ప్రస్తుతం రెండు నెలల బిడ్డకు తల్లి.వీరంతా సింగ్ నగర్ శాంతినగర్లో రూ.5 వేలకు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. గత నెల 31 అర్ధరాత్రి హఠాత్తుగా వచ్చిన వరద ఇంటిని ముంచేసింది. సామాన్లు తీసుకునే సమయం కూడా లేదు.చంటిబిడ్డను తీసుకొనిఅందరూ డాబా పైకి పరిగెత్తారు. కేవలం ఓ బరఖాని పైకప్పుగా మార్చుకుని దాని కిందే మూడు రోజులు బతికారు. వీరి అవస్థ చూసి బాలింతరాలికి పక్కింటి వారు ఆశ్రయమిచ్చారు. సహాయక చర్యలకు వచ్చిన హెలికాప్టర్ గాలికి బరఖా చిరిగిపోవడంతో వారం రోజులు వానలోనే గడిపారు. సరైన తిండి, నిద్ర లేవు. వరద తగ్గాక కిందకొచ్చి చూస్తే ఇల్లంతా బురద. ఏ వస్తువూ మిగల్లేదు. మిషన్ కుడితే గానీ ఇల్లు గడవదు. ఇప్పుడదీ పాడైంది. సెప్టిక్ ట్యాంకు నిండా బురద చేరడంతో కనీసం కాలకృత్యాలకూ నరకం చూడాల్సి వస్తోందని ఆ కుటుంబం విలపిస్తోంది.జీవిత కాలం కష్టం.. చెత్త కుప్పల పాలుఏళ్ల తరబడి పేద ప్రజల రెక్కల కష్టం.. ఇదిగో.. ఇలా వరద పాలై రోడ్డు పక్కకు చేరింది. బుడమేరు వరదకు ఇళ్లలో వస్తువులన్నీ పాడైపోయాయి. కాస్త పనికొచ్చే వస్తువులను పాత సామాన్ల వాళ్లు తృణమో పణమో ఇచ్చి పట్టుకెళ్తున్నారు. అందుకూ పనికిరాని వస్తువులను బాధితులు రోడ్లపై పడేస్తున్నారు. దీంతో విజయవాడలోని వరద ప్రాంతాల్లో రోడ్ల పక్కన పాడైన ఇంటి సామాగ్రి గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. వాటిని ప్రభుత్వ సిబ్బంది దాదాపు 400 ట్రాక్టర్లలో పైపులరోడ్డు వద్దకు తరలిస్తున్నారు. గుంటూరు, గన్నవరం, ఏలూరు, రాజమండ్రి నుంచి కూడా వరదల్లో మునిగి పనికిరాని సామగ్రిని విజయవాడ పైపులరోడ్డుకు తరలిస్తున్నవారు. అక్కడి నుంచి మేజర్ డంపింగ్ యార్డ్ అయిన ఎక్సెల్ ప్లాంట్కు తరలిస్తున్నారు. – సాక్షి, అమరావతిడాబాలపైనే జీవనంఅర్ధరాత్రి వేళ విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద దాదాపు 60 మంది ప్రాణాలను మింగేసింది. మరునాడే సీఎం చంద్రబాబు వరద ప్రాంతాల్లో తిరుగుతూ ప్రచారార్భాటం మొదలెట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో సాయమంటూ ఊదరగొట్టారు. చేసింది శూన్యం. లక్షలాది మంది నిరాశ్రయుల్లో ఒక్కరికీ ఒక్క రూపాయి తక్షణ సాయం ఇవ్వకుండా తప్పించుకు తిరిగారు. 10 రోజులయ్యాక వరదను జయించేశామని ప్రకటించేసుకుని వెళ్లిపోయారు. ప్రభుత్వ యంత్రాంగమూ మాయమైంది. ఇప్పుడక్కడ మిగిలింది బురద, బాధితులే. బాధితుల పరిస్థితిలో మార్పు లేదు. అక్కడక్కడా పారిశుద్ధ్య సిబ్బంది మాత్రం కనిపిస్తున్నారు. ప్రతి ఇంటిలోనూ విలువైన సామాగ్రి మొత్తం నీటిపాలైంది. అనేక ఇళ్లు నివాసానికి పనికిరాకుండా పోయాయి. బురద కడుగుతామన్న ఫైరింజన్లు కూడా అదృశ్యమైపోయాయి. ఇంట్లో పేరుకున్న బురదను ప్రజలే తొలగించుకుంటున్నారు. ఇందుకు ఇంటికి రూ.5 వేలు నుంచి రూ.10 వేలు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బురద తొలగకపోవడంతో ఇప్పటికీ డాబాలపైనే ప్లాస్టిక్ సంచుల గుడారాల కిందే జీవిస్తున్నారు.ఈ సమయంలో ఓటీపీలా?వరద నష్టం అంచనాల్లోనూ ఓటీపీ అడగడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదల్లో సెల్ ఫోన్లే పోతే ఓటీపీలు ఎలా వస్తాయని అంటున్నారు. భవిష్యత్తుపై బెంగతో దాతలు, స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు లాటరీ పద్ధతిలో కొన్ని ఇళ్లను దత్తత తీసుకుంటామని చెబుతున్నాయి.ఇక అన్నీ పాత సామాన్లేవరదకు ఇంట్లో గిన్నెల నుంచి విలువైన టీవీలు, ఫ్రిజ్లు, ఏసీలు, మంచాలు, కుర్చీలు.. ఇలా అన్ని వస్తువులూపనికిరాకుండా పోయింది. పుస్తకాలు, దుస్తులను వీధుల్లో ఆరబెట్టుకొంటున్నారు. పనికి రావనుకున్న టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఇతర సామాగ్రిని రోడ్ల పక్కన పడేశారు. వాటిని కేజీల లెక్కన అమ్ముకుంటున్నారు. దీంతో పాత సామాన్లు కొనే వారు గతంలో కేజీకి రూ.20 ఇస్తే ఇప్పుడు రూ.10 కే అడుగుతున్నారు. పుస్తకాలన్నీ పాడవడంతో పిల్లలు స్కూళ్లకు వెళ్లడంలేదు. వీధుల్లో పేరుకున్న చెత్త, మురుగు, దుర్గంధంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. అనేక మంది జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ఇంత కష్టంలో తాముంటే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఏమైపోయారని బాధితులు మండిపడుతున్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బందే తమను బతికించారని చెబుతున్నారు.ఓట్లేయించుకున్న వారేరి?ఇంట్లో సామాన్లన్నీ పాడైపోయాయి. కట్టు బట్టలు మినహా ఏమీ మిగల్లేదు. ఏ ఒక్కరూ సాయం చేయలేదు. కనీసం తిండి కూడా పెట్టలేదు. రోడ్డు వరకూ వరదలోనే వెళ్లి తెచ్చుకున్నాం. ప్రభుత్వం ముందుగానే హెచ్చరించి ఉంటే ఎక్కడికైనా వెళ్లిపోయేవాళ్లం. మా ఏరియా వలంటీర్, సచివాలయ సిబ్బంది తప్ప మా బాగోగులు చూసేందుకు ఎవరూ రాలేదు. ఓట్లేయించుకున్న ఎమ్మెల్యే, కార్పొరేటర్ కన్నెత్తి చూడలేదు. – పావని, శాంతినగర్స్కూలుకి వెళ్లడంలేదుప్రైవేటు స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. వరదకు మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. పక్కింటి వాళ్లు ఆశ్రయం ఇచ్చారు. పుస్తకాలన్నీ తడిసిపోయాయి. ఇప్పుడు వాటిని ఆరబెట్టుకుంటున్నా. స్కూలుకు వెళ్లడంలేదు. – ప్రణవి, వాంబేకాలనీఆరోగ్యం పాడైందిఇల్లు మొత్తం మునిగిపోవడంతో డాబాపైకి వచ్చేశాం. బరఖా కిందే ఉంటున్నా. నా ఆరోగ్యం పాడైంది. జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాను. నా కుమారుడికి ఇటీవలే పోలియో వచ్చింది. ఇప్పుడు మా పరిస్థితి ఇలా అయ్యింది. ఎలా బతకాలో ఏమీ అర్ధం కావడం లేదు. – నాగమణి, శాంతి నగర్ఏదీ మిగల్లేదుఇంట్లో వాషింగ్ మెషిన్లు, కూలర్లు, మోటర్, టీవీ.. ఇలా ఏదీ మిగల్లేదు. రూ.2 లక్షల వరకూ నష్టం వచ్చింది. మూడు రోజులు వరద నీటిలోనే ఉన్నాం. ప్రభుత్వం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేదు. అతికష్టం మీద వరద నుంచి బయటపడి బంధువుల ఇంటికి వెళ్లిపోయాం. తిరిగొచ్చి చూస్తే ఇల్లంతా బురద. సామానంతా పాడైపోయింది.– దివ్యభారతి, పాయకాపురం -
ఏపీలో రైతులను నిండా ముంచిన ప్రభుత్వ నిర్లక్ష్యం
-
విజయవాడ వరద బాధితులకు అండగా సీపీఎం
-
Big Question: ఏపీలో ఏం జరిగినా జగనే.. బాబు బుద్ధిలేని ఆరోపణలు
-
విజయవాడ తరహాలోనే ఏలేరు వరద కూడా మ్యాన్ మేడ్ ఫ్లడ్సే అన్న జగన్
-
పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి..
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరు వరద ముంపు బాధితులకోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు ఖాళీ అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వరద నీరు తగ్గడంతో ముంపు బాధితులంతా పునరావాస కేంద్రాలను వీడి ఇళ్లకు చేరుకున్నారు. ఈనెల 1న మున్నేరుకు వచి్చన భారీ వరదలతో ఖమ్మం నగరంలోని 13 డివిజన్లతో పాటు ఖమ్మం రూరల్ మండలంలోని 20 కాలనీలు నీట మునిగాయి. వందలాది ఇళ్లను వరద ముంచెత్తగా.. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని రామన్నపేట ప్రభుత్వ పాఠశాల, జూబ్లీ క్లబ్, స్వర్ణభారతి కల్యాణ మండపం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ధంసలాపురం పాఠశాలల్లో 8,200 మందికి, ఖమ్మం రూరల్ మండలంలో టీసీవీ రెడ్డి ఫంక్షన్హాల్, రామ్లీలా ఫంక్షన్హాల్, పోలేపల్లి స్ఫ్రింగ్ లీఫ్ పాఠశాల, సాయిబాబా ఆశ్రమంలో 2,300 మందికి ఆశ్రయం కలి్పంచి ఇన్నాళ్లూ భోజనం సమకూర్చారు. బాధితులు వెళ్లిపోవడంతో కేంద్రాల మూసివేత వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు పూర్తికావడం, ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకోవడంతో పునరావాస కేంద్రాలను వీడి ఇళ్లకు చేరుకున్నారు. ఈనెల 10 వరకు ప్రభుత్వ యంత్రాంగం పునరావాస కేంద్రాలను నిర్వహించగా.. బాధితులు ఇళ్లకు వెళ్లిపోతుండడంతో శుక్రవారం పూర్తిగా మూసివేసింది. అయితే, ఇళ్లు పూర్తిగా నేలమట్టమైన వారు మాత్రం ఎక్కడకు వెళ్లాలో దిక్కుతోచక.. మిగిలిన ఒకటి, అరా సామగ్రితో చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. కొనసాగుతున్న దాతల చేయూతవరద బాధితులకు పలువురు నిత్యావసరాలతో పాటు భోజనం అందిస్తున్నారు. అనేక మంది ఇళ్లను కోల్పోయి వండుకునేందుకు సామగ్రి లేక భోజనం కోసం ఇబ్బంది పడుతుండగా.. వారికి స్వచ్ఛంద సేవా సంస్థలు భోజనం సమకూరుస్తున్నాయి. శుక్రవారం కూడా ఖమ్మం రూరల్ మండలంలోని రాజీవ్ గృహకల్ప, ఖమ్మంలోని వెంకటేశ్వరనగర్లో బాధితులకు పలు సంస్థల ద్వారా భోజనం సమకూర్చారు. -
సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తి
సాక్షి, అమరావతి: వరద నష్టం ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని, నష్టపోయిన ప్రతి బాధితునికి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద నష్టం ఎన్యూమరేషన్, బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా 2,13,456 ఇళ్లు నీట మునిగాయని, ఇప్పటి వరకు 84,505 ఇళ్లలో నష్టం అంచనా లెక్కలు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. వేలాది ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు పాడైపోయాయని, 2,14,698 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఎన్యూమరేషన్లో రీ వెరిఫికేషన్ చేసి ప్రతి బాధితుడికి జరిగిన నష్టాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, పరిహారం విషయంలో కూడా శాస్త్రీయంగా ఆలోచన చేసి జాబితా రూపొందించాలని సూచించారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే ఈ నెల 17వ తేదీన బాధితులకు సాయం అందజేద్దామని పేర్కొన్నారు. రుణాలు రీషెడ్యూల్ చేయండి: సీఎం వరద బాధితులకు వివిధ ఏజెన్సీలు అందించే సర్వీసులపై శుక్రవారం సాయంత్రం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు నడుపుతున్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని, వారి బ్యాంక్ రుణాలు రీ షెడ్యూల్ చేయాలని, ఈఎంఐల చెల్లింపునకు గడువు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష అనంతరం ఆయన బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. -
బాధలు వింటూ.. భరోసానిస్తూ..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏలేరు వరద ముంపుతో కుళ్లిపోయిన వరి కంకులతో కన్నీరు పెట్టుకుంటూ ఎదురొచ్చిన రైతుల కష్టాలు చూసిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. రైతుల్లో మనో ధైర్యాన్ని కల్పించారు. పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో రైతులు, బాధితులను పరామర్శించి తాను ఉన్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. బాధితులు, రైతులను జగన్ అక్కున చేర్చుకున్నారు. ఉదయం 10.30 గంటలకు పిఠాపురం వచ్చిన ఆయనకు బాధితులు, రైతులు దారి పొడవునా నిలబడి గోడు వెళ్లబోసుకొన్నారు. ‘మా పంటలు మునిగిపోయాయి. మీరే దిక్కు’ అంటూ రైతులు అడుగడుగునా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో 12.45 గంటలకు ముగియాల్సిన పర్యటన సాయంత్రం 5 గంటల వరకు సాగింది. మాధవాపురం, పాత ఇసుకపల్లి, నాగులాపల్లి, రమణక్కపేటలో వరదలతో మునిగి ఉన్న కాలనీలను, పంటలను పరిశీలించారు. ప్రతి గ్రామంలో రెండు గంటలు పర్యటన సాగింది. భోజన విరామం కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కరి బాధలను జగన్ సావధానంగా ఆలకించారు. ముంపు ప్రాంతాల్లో నీళ్లలో నడుచుకుంటూనే గ్రామాల్లో కలియదిరిగి బాధితులతో మాట్లాడారు. కళ్లెదుటే రెక్కల కష్టం గంగపాలైందని, ఇప్పట్లో తేరుకోలేమని, ప్రభుత్వం తమను ఆదుకొనే తీరులో లేదని, తమ తరఫున పోరాడాలని రైతులు మొరబెట్టుకున్నారు. నాగులపల్లి–రమణక్కపేట రహదారి మునిగిపోవడంతో వైఎస్ జగన్ ట్రాక్టర్పై పెదయేరు దాటి రమణక్కపేట వెళ్లారు. అక్కడి ఎస్సీ కాలనీని పరిశీలించి, బాధితులతో మాట్లాడారు. వరద నీటిలోనే ఈదుకుంటూ వచ్చి మరీ జగన్కు సమస్యలు విన్నవించుకున్నారు. గతంలో అధికారులే వచ్చి పంటలు చూసి, నష్ట పరిహారం అడగకుండానే ఖాతాల్లో వేసేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని, ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి రూ. 30 వేలు పెట్టుబడి అయిందని, పంటంతా కుళ్లిపోయిన చేతికి పైసా రాదని మాధవపురం సర్పంచి వెంకట సుబ్బారావు వైఎస్ జగన్కు వివరించారు. ‘మీరు సీఎంగా ఉన్నప్పుడు రూపాయి ప్రీమియం కూడా చెల్లించకుండానే బీమా వచ్చేది. వరద వచ్చిన రోజునే రూ.6,000 ఖాతాల్లో పడేవి. రైతు భరోసా కింద ఎకరానికి రూ.13,500 పడేది. ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. మీరే కాపాడాలి’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడతానని వైఎస్ జగన్ ఆయనకు ధైర్యం చెప్పారు. తిన్నావా అని అడిగే వారే లేరు మూడు రోజులు వరదలో మునిగిపోయి పట్టెడన్నం కూడా లేదని, తిన్నావా అని అడిగే వారే లేరంటూ మాధవపురం సెంటర్లో గృహిణి విత్తనాల లక్ష్మి విలపించింది. వైఎస్ జగన్ను చూడగానే ఆమెలో దుఃఖంపెల్లుబికింది. ‘మా కాలనీని ఏలేరు వరద ముంచెత్తి ఇళ్లన్నీ నీట మునిగాయి. బయటకు రావడానిక్కూడా లేదు, మూడు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయాం. ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం ఉన్నారా తిన్నారా అని అడిగిన వారు లేరు. చంటి పిల్లలకూ తిండి లేదు. మీరు వస్తున్నారని తెలిశాక కొండంత ధైర్యం వచ్చి0ది, మీరే దిక్కు’ అని విలపించడంతో జగన్ చలించిపోయారు. ఆమెకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పి, వారి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానని చెప్పారు. -
నిర్లక్ష్యమే ముంచేసింది
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వరదల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని.. వరద హెచ్చరికలను పెడచెవిన పెట్టి విజయవాడను ముంచేసిన మాదిరిగానే ఏలేరు వరద విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతుల నోట్లో మట్టి కొట్టిందని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఒక బాధ్యత లేని ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్కు వరద వస్తుందని, అది ప్రమాదకర స్థాయిలో ఉంటుందని ప్రభుత్వానికి ముందే సమాచారం అందినా కాలువ ద్వారా నీటిని వదలకుండా తాత్సారం చేసి చివరకు సామర్థ్యానికి మించి వదిలి ముంచేశారని ధ్వజమెత్తారు. ఇరిగేషన్, రెవెన్యూ, హోంశాఖలతో కనీసం సమీక్షించకుండా సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. విజయవాడ ఎలా అతలాకుతలమైందో అలాంటి నిర్లక్ష్యమే ఏలేరు విషయంలోనూ కనిపిస్తోందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ శుక్రవారం పర్యటించారు. మాధవాపురం, పాత ఇసుకపల్లి, నాగులాపల్లి, రమణక్కపేట తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను ఓదార్చారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అనంతరం రమణక్కపేటలో మీడియాతో మాట్లాడారు. ప్రీమియం చెల్లించకుండా ఉచిత పంటల బీమాను గాలికొదిలేసి రైతులను ప్రభుత్వం నట్టేట ముంచేసిందని దుయ్యబట్టారు. ఈ క్రాప్ నమోదు చేయడం లేదని, ఆర్బీకేలను అడ్రస్ లేకుండా చేశారని, సచివాలయాలను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రన్న వస్తాడు.. రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తాడన్న హామీ ఏమైందని నిలదీశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. మనుషుల విలువ తెలిసి ఉంటే.. ఏలేరు రిజర్వాయర్ దగ్గర పరిస్థితిని చూస్తే విజయవాడ గుర్తుకొస్తోంది. అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆగస్టు 31నే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐఎండీ (భారత వాతావరణ విభాగం) అప్రమత్తం చేసింది. అలాంటి హెచ్చరిక అందగానే ప్రభుత్వం సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రెవెన్యూ, హోం, ఇరిగేషన్ కార్యదర్శులతో సమీక్ష చేయాలి. కానీ ముందే సమాచారం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కలెక్టర్లతో మాట్లాడలేదు. సీఎస్ కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. సీఎం చంద్రబాబుకు మానవత్వం ఉంటే, మనుషుల విలువ తెలిసి ఉంటే స్పెషల్ ఆఫీసర్ను నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుని ముందు జాగ్రత్తలు చేపట్టే వారు. కానీ అవేమీ చేయలేదు. అన్నీ గాలి కొదిలేశారు. ఏలేరు ఆధునీకరణపై అబద్ధాలు.. అబద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు గోబెల్స్కు తమ్ముడే. పచ్చి అబద్ధాలాడతారు. అబద్ధాలను సృష్టించడం, వాటిని అమ్మగలగడంలో చంద్రబాబును మించిన వారు ప్రపంచంలోనే లేరు. ఆయనకు వంత పాడే మీడియా నిత్యం అవే అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ఏలేరు ఆ«ధునికీకరణపైనా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. తొలుత ఏలేరు కాలువ ఆధునికీకరణను 2008లో దివంగత వైఎస్సార్ రూ.138 కోట్లతో చేపట్టారు. ఆ తర్వాత ఎవరూ ఆ పనులను పట్టించుకోలేదు. వర్షాలు, నీళ్లు లేనప్పుడు మాత్రమే కెనాల్ ఆధునికీకరణ చేయగలం. లేదంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తే కానీ సాధ్యం కాదు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక అంచనాలు రూ.295 కోట్లకు పెంచడం మినహా పనులు చేయలేదు. నిజానికి అప్పుడు రిజర్వాయర్లో నీళ్లు కూడా పెద్దగా లేవు. నాడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏటా కరువే. చంద్రబాబు – కరువు ఇద్దరూ కవలలే. అప్పుడు వర్షాలు కూడా లేవు. అయినా పనులు ఎందుకు చేయలేదు? 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వరుసగా వర్షాలు కురవడంతో క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కాలువ ఆధునికీకరణ పనులు వేగంగా చేయలేకపోయాం. ఏం జరిగినా జగనే కారణం అంటాడుఏలేరు వరదలపై ప్రభుత్వానికి ముందే ఇంత సమాచారం ఉన్నా తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో చంద్రబాబు విఫలమై రైతులందర్నీ ఇబ్బంది పెట్టారు. వరదలు వస్తే రిజర్వాయర్లను ఎలా నిర్వహించాలో ఈ ప్రభుత్వానికి తెలియడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు నెలలు అయింది. ఎక్కడ ఏం జరిగినా దానికి కారణం జగనే కారణం అంటాడు. విజయవాడలో వరదలు వచ్చినా జగనే కారణం.. ! ఏలేరు రిజర్వాయర్ కింద వరదలు వచ్చినా జగ¯నే కారణం..! కోవిడ్ వచ్చినా జగనే కారణం.. అంటాడు! చంద్రబాబు చేయాల్సింది జగన్నామస్మరణ కాదు. ప్రతి దానికి జగన్పై అరవకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇప్పటికైనా మమ్మల్ని నిందించడం మానుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి నిజాయితీగా పాలన అందించాలి. సామర్థ్యానికి మించి ఒకేసారి నీటి విడుదలతో.. ఏలేరు రిజర్వాయర్ సామర్థ్యం దాదాపు 24 టీఎంసీలు కాగా 31వతేదీ నాటికే సుమారు 18 టీఎంసీలు ఉన్నాయి. సెపె్టంబర్ 1న ఏలేరు రిజర్వాయర్కు 9,950 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ప్రభుత్వం జాగ్రత్త పడి ఉంటే, ఫ్లడ్ కుషన్ నిబంధన పాటించి ఉంటే ఆ మొత్తం వెంటనే కిందకు వదలాలి. ఎందుకంటే దిగువన కాలువ సామర్థ్యం 14 వేల క్యూసెక్కులు మాత్రమే. అలా అప్పుడే నీళ్లు దిగువకు వదిలి ఉంటే ఆ కాలువ పొంగకుండా ఉండేది. కానీ ప్రభుత్వం కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే వదిలిపెట్టింది. సెప్టెంబరు 4న 5,400 క్యూసెక్కులు వస్తే బయటకు పంపింది కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే. ఏమాత్రం ఫ్లడ్ మేనేజ్మెంట్ చేపట్టలేదు. ఫ్లడ్ ఫ్లో కుషన్ ఏర్పాటు చేయలేదు. పైనుంచి నీళ్లొస్తున్నా తీవ్ర నిర్లక్ష్యం వహించారు. కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే వదులుతూ వచ్చారు. దీంతో 9వతేదీ నాటికి ఏలేరు రిజర్వాయర్ పూర్తిగా నిండింది. దీంతో గత్యంతరం లేక కిందకు 21,500 క్యూసెక్స్ వదిలారు. 10వ తేదీన 26,134 క్యుసెక్కుల ఇన్ఫ్లో ఉంటే ఏకంగా 27,275 క్యూసెక్స్ విడిచిపెట్టారు. అంటే కాలువ సామర్థ్యాన్ని మించి నీళ్లు వదలడంతో లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. మరి ఇది కచ్చితంగా ‘‘మేన్ మేడ్ ఫ్లడ్’’ కాకపోతే మరేమిటయ్యా! అని అడుగుతున్నా. ప్రజలు పట్ల మానవత్వం చూపని, ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం ఇది. వరదలు వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో కనీసం ఇంగితం లేని ప్రభుత్వం ఇది! -
నష్టం రూ.10,320 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తద్వారా వెల్లువెత్తిన వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసిన దానికంటే రెట్టింపు నష్టం జరిగి నట్లు తేలింది. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో రెండురోజుల పాటు పర్యటించి వచి్చన కేంద్ర ఉన్నతాధికారుల బృందం.. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ అయ్యింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎస్ శాంతికుమారి ఈ సమావేశంలో పాల్గొన్నారు.రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేయగా.. శుక్రవారం కేంద్ర బృందానికి ఇచి్చన నివేదికలో రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. విపత్తు నిధుల వినియోగం విషయంలో అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులు వాడలేని పరిస్థితి.. తెలంగాణ రాష్ట్రం మొత్తం మునిగిపోయిన పరిస్థితుల్లో సైతం ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎస్డీఆర్ఎఫ్ కింద అందుబాటులో ఉన్న రూ.1,350 కోట్లలో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని సీఎం రేవంత్.. కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఒక కిలోమీటర్ రోడ్డు దెబ్బతింటే కేవలం లక్ష రూపాయలు ఖర్చు చేయాలనే నిబంధన పెట్టారని, దీనితో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ రేట్) వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని, వాటిని పరిశీలించి విపత్తు సాయం అందించాలని కోరారు.వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందని, ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందని తెలిపారు. తనతో పాటు మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రాణనష్టం భారీగా తగ్గిందని చెప్పారు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయని, లక్షలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. పంట పొలాల్లో బండరాళ్లు, కంకర, మట్టి మేటలు వేయటంతో రైతులు కోలుకోలేనంతగా నష్టపోయారని చెప్పారు. చాలాచోట్ల రహదారులు, రోడ్లు, కల్వర్టులు, చెరువులు కొట్టుకు పోవటంతో నష్టం ప్రాథమిక అంచనాలను మించిపోయిందని వివరించారు. మున్నేరు సమస్యకు రిటైనింగ్ వాలే పరిష్కారం ⇒ ఖమ్మం నగరానికి మున్నేరు వాగుతో ఉన్న వరద ముప్పును నివారించాలంటే రిటైనింగ్ వాల్ నిర్మాణం ఒక్కటే శాశ్వత పరిష్కారమని సీఎం స్పష్టం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కేంద్రం తగినన్ని నిధులు కేటాయించేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. రాకాసి తండా, సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజలకు సమీపంలోని సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. ఈ మేరకు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సాయం అందించాలని కోరారు. నివారణపై ఎక్కువగా దృష్టి పెట్టాలి ⇒వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవటం కంటే, నివారించే చర్యలపై ఎక్కువగా దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి అన్నారు. వర్షపాతం, వడగాడ్పుల వంటి వాతావరణ, పర్యావరణానికి సంబంధించిన విపత్తులపై వీలైనంత ముందుగా హెచ్చరికలు జారీ చేసేలా ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. విపత్తు పరిస్థితుల్లో తక్షణం స్పందించేలా వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసే పోలీసు బెటాలియన్లను ఉపయోగించుకుంటామంటూ ముఖ్యమంత్రి తన ఆలోచనలను కేంద్ర బృందంతో పంచుకున్నారు. ప్రతి బెటాలియన్లో ఎంపిక చేసిన వంద మందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామని చెప్పారు. వారికి అవసరమైన పరికరాలు, శిక్షణ, నైపుణ్యం విషయంలో ఎన్డీఆర్ఎఫ్ సాయం కోరుతున్నామని తెలిపారు. 50 వేల చెట్లు నేలమట్టం మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు 50 వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన ఉదంతం సమావేశంలో చర్చకు వచి్చంది. ఇది అటవీ ప్రాంతంలో సంభవించడంతో ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, మైదాన ప్రాంతంలో జరిగితే భారీ నష్టం జరిగేదని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన జరిగినట్లు తమ దృష్టికి రాలేదని కేంద్ర బృందం వ్యాఖ్యానించింది. అందుకే కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని సీఎం కోరారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పరిశీలించాలని సూచించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) సలహాదారు కల్నల్ కేపీ సింగ్ సారథ్యంలోని కేంద్ర బృందంలో అధికారులు శాంతినాథ్శివప్ప, మహేష్ కుమార్, నాయల్కాన్సన్, రాకేష్ మీనా, శశివర్ధన్రెడ్డి ఉన్నారు. నష్టం అంచనాలు ఇలా.. విభాగం అంచనా నష్టం (రూ.కోట్లలో) రహదారులు (ఆర్అండ్బీ, పంచాయతీరాజ్) 7693.53 సాగునీటి పారుదల 483.00 పురపాలక శాఖ 1216.57 తాగునీటి సరఫరా 331.37 విద్యుత్ శాఖ 179.88 వ్యవసాయం 231.13 ఆసుపత్రులు, అంగన్వాడీలు (కమ్యూనిటీ అసెట్స్) 70.47 మత్స్య శాఖ 56.41 గృహ నిర్మాణం 25.30 పశుసంవర్ధక శాఖ 4.35 పాఠశాల భవనాలు 27.31 వరదల్లో మరణించిన వారికి నష్టపరిహారం 1.40 మొత్తం 10,320.72 -
బుడమేరు-ఏలేరు.. చంద్రబాబు పాపాలే: వైఎస్ జగన్
కాకినాడ, సాక్షి: చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయవాడ ఏమాదిరిగా అతలాకుతలం అయ్యిందో.. అదే తరహాలో ఏలేరు రిజర్వాయర్ రైతులను ముంచేసిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏలేరు ముంపు గ్రామాల్లో ఇవాళ ఆయన పర్యటించారు. అనంతరం రమణక్కపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ఏలేరు రిజర్వాయర్ వాటర్ మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. వరదనీటి నియంత్రణలో పూర్తిగా విఫలయం అయ్యారు. భారీగా వర్షాలు పడతాయని రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణ శాఖ నుంచి ఆగష్టు 31వ తేదీనే సమాచారం అందింది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు.. ప్రజలను అప్రమత్తం చేయలేదు. ఇలాంటి అలర్ట్ రాగానే ప్రభుత్వం సమీక్ష చేయాలి. ముందస్తు చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ, హోం, ఇరిగేషన్ సెక్రటరీలతో సమీక్ష జరపాలి. కానీ, చంద్రబాబు కనీసం కలెక్టర్లతో కూడా రివ్యూ చేయలేదు. ఆయనకు ఏమాత్రం మానవతా విలువలు ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించేవారు..ఫ్లడ్ మేనేజ్మెంట్ ఆ మాత్రం తెలియదా?.. వచ్చే వరదకు అనుగుణంగా ఏలేరు రిజర్వాయర్లో ఫ్లడ్ కుషన్ ఉంచుకోవాలి. ప్రభుత్వానికి ఇంత సమాచారం ఉన్నా తగిన చర్యలు తీసుకోలేదు. ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ను చేయలేదు. ఏలేరు పూర్తిస్థాయి సామర్థ్యం 24 టీఎంసీలు అయితే, ఆగస్టు 31 నాటికే దాదాపుగా 18 టీఎంసీలు ఉంది. సెప్టెంబరు 1 నాటికి 9,950 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ఏలేరు ఔట్ఫ్లో కాల్వ కెపాసిటీ 14వేల క్యూసెక్కులు కాబట్టి, వచ్చిన నీరు వచ్చినట్టు వదిలేయాలి. కానీ, 300 క్యూసెక్కులు మాత్రమే ఉంది. తర్వాత మూడు నాలుగు రోజుల్లో వదర వచ్చినా అవుట్ఫ్లో కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే ఉంది. పై నుంచి నీళ్లు వస్తున్నా, లెక్క చేయకుండా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించారు. క్రమంగా రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది. సెప్టెంబరు 9న 45వేలు క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తే 21,500 క్యూసెక్కులు వదిలారు. సెప్టెంబరు 10న 27,275 క్యూసెక్కులు వదిలారు. ఇది మానవ తప్పిదంతో జరిగింది. వరదలు వస్తే రిజర్వాయర్లను ఎలా నిర్వహించాలో ఈ ప్రభుత్వానికి తెలియడంలేదు.ఏలేరూ రిజర్వాయర్కు వచ్చే ఇన్ఫ్లోను ఎందుకు మేనేజ్ చేయలేకపోయారు. రిజర్వాయర్ నిండేవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆ తర్వాత కిందకు వదిలారు. ఇది ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం. ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్స్ కాక ఇంకేంటి?.అందుకే ఏలేరు ఆధునీకరణ పనులు చేయలేకపోయాం.. ఒకవైపు ఈ వాస్తవాలు ఇలా ఉంటే.. ఏలేరు ఆధునికీకరణపైనా చంద్రబాబు అబద్దాలు చెప్పారు. ఏ కెనాల్ ఆధునికీకరణ అయినా, అందులో నీళ్లు లేనప్పుడు, క్రాప్ హాలీడే ప్రకటిస్తే తప్ప, అది సాధ్యం కాదు. ఏలేరుకు ఆధునీకరణ పనులను 2008లో నిధులు కేటాయించి మరీ దివంగత మహానేత వైఎస్సార్ ప్రారంభించారు. ఆయన తర్వాత ఆ కార్యక్రమాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 2014లో ఇదే చంద్రబాబు సీఎం అయ్యాక, అంచనాలు పెంచారు తప్ప, పనులు మాత్రం చేయలేదు. .. నిజానికి అప్పుడు రిజర్వాయర్లో నీళ్లు కూడా పెద్దగా లేవు. 2015లో అంచనాలు రూ.295 కోట్లకు పెంచినా, పనులు పూర్తి చేయలేదు. మా హయాంలో ప్రతీ సంవత్సరం వర్షాలు పడి రిజర్వాయర్లు నిండుగా ఉన్నాయి. ఆ టైంలో క్రాప్ హాలీడే ప్రకటించడం ఇబ్బంది అవుతుందనే.. కాలువ ఆధునికీకరణ పనులు వేగంగా చేయలేకపోయాం. మరి చంద్రబాబు హయాంలో నిత్యం కరువే కదా. ఆ టైంలో ఎందుకు చేయలేకపోయారు?. చేయాల్సింది చేయకపోగా.. గత ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో కాలయాపన చేస్తున్నారు’’ అని జగన్ మండిపడ్డారు. -
రైతులకు జగన్ భరోసా..
-
పిఠాపురంలో వైఎస్ జగన్కు జననీరాజనం
-
వరదబాధితులకు జగన్ పరామర్శ.. పిఠాపురంలో జననేతకు జన నీరాజనం (ఫొటోలు)
-
జగన్ పాలనలో ఇంత ఘోరం చూడలేదు
-
కాకినాడ జిల్లాను ముంచెత్తిన ఏలేరు
-
వరద బాధితులకు అండగా తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సాయం అందిస్తున్నారు. విరాళాలు సేకరించి వరద బాధతుల సహాయార్థం అందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి ప్రముఖ సినీతారలు విరాళాలు ప్రకటించారు. తాజాగా ఏపీ, తెలంగాణ వరద బాధతుల కోసం తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. తమవంతు సాయంగా అసోసియేషన్ తరఫున విరాళాలు సేకరించి రెండు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలింఛాంబర్లో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నాయకులంతా పాల్గొన్నారు.తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు మాట్లాడుతూ' వరదల కారణంగా తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారిని చూస్తే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ స్పందిస్తారు. మా అసోసియేషన్ తరపున వీలైనంత ఆర్థిక సాయం చేయాలని భావించాం. రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు మీకు తోచినంత విరాళం ఇవ్వాలని మా సభ్యులను కోరాం. వాళ్లంతా స్పందించారు. ఈ డబ్బుకు మరికొంత మా అసోసియేషన్ ఫండ్ నుంచి కలిపి రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేస్తాం' అని తెలిపారు. -
ఏలేరు బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, కాకినాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదలతో అతలాకుతలం అయిన మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాల్లో జరిగిన నష్టాన్ని స్వయంగా రైతులను అడిగి తెలుసున్నారు.వరద బాధితుల్ని కలిసి వాళ్లకు కలిగిన కష్టం.. జరిగిన నష్టం గురించి తెలుసుకుని జగన్ ఓదార్చారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని, కనీసం పునరావాస కేంద్రాలకు కూడా తరలించలేదని బాధితులు జగన్ వద్ద వాపోయారు. ఈ విషయంలో పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.ఇదీ చదవండి: పవన్కు పెద్దగా ఏమీ తెలియదు: వైఎస్ జగన్ ఇక.. జగన్ రాకతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ప్రస్తుతం రమణక్కపేటకు జగన్ చేరుకున్నారు. కాసేపట్లో ముంపునకు గురైన పంటపొలాలను ఆయన పరిశీలిస్తారు. అక్కడి రైతులతో మాట్లాడతారు. ఈ పరామర్శలో జగన్ వెంట నియోజకవర్గ ఇంఛార్జి వంగా గీత, స్థానిక నేతలు ఉన్నారు.ఇదీ చదవండి: బడుగు జీవితాలు పదేళ్లు వెనక్కు!పోటెత్తిన ఏలేరు వరదతో కాకినాడ జిల్లా అతలాకుతలమైంది. ప్రధానంగా మూడు నియోజకవర్గాలపై ఏలేరు విరుచుకుపడి వివిధ వర్గాల ప్రజలు, రైతులను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఏలేరు వరదతో ఒక సీజన్ మొత్తాన్ని కళ్లెదుటే చేజేతులా వదిలేసుకున్నామని ఈ ప్రాంత రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఏలేరు ప్రాజెక్టుకు పోటెత్తుతుందని ప్రభుత్వం ముందస్తు అంచనాకు రాలేకపోవడంతోనే ఇంతటి విపత్తు సంభవించిందనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. -
సుందర కొల్లేరు.. ఉప్పొంగితే ‘ముప్పు’టేరు
‘‘విశాలమైన సరస్సులో ఈదులాడే చేపలు.. విదేశాల నుంచి విడిదికి వచ్చి విహరించే పక్షి సమూహాలు.. నీటి మధ్య వెలసిన ఊర్లలో రెక్కల కష్టంతో బతికే మనసులు’’.. ఇది సహజ సిద్ధమైన కొల్లేరులో మామూలు రోజుల్లో కన్పించే సుందర దృశ్యం..‘‘ఎటు చూసినా సముద్రంలా ఉప్పొంగిన నీరు.. వరద నీటిలో మునిగిన గ్రామాలు.. రెక్కల కష్టం మొత్తం నీటిపాలై బతుకు జీవుడా అనుకుని భోరున విలపించే ప్రజలు.. నిలువ నీడలేక విలవిల్లాడే పక్షులు.. వరద పోటుకు గల్లంతయ్యే చేపలు’’.. ఇదీ ఏటా వరద ధాటికి కొల్లేరు ఉగ్రరూపం.కొల్లేరుకు మళ్లీ వరద పోటెత్తింది. వర్షాకాలం వచ్చిందంటే కొల్లేరు చిగురుటాకుల్లా వణికిపోతోంది. కృష్ణా–గోదావరి నదుల మధ్య డెల్టా ప్రాంతంలో సహజ సిద్ధమైన లోతట్టు ప్రాంతంలో విస్తరించిన ఈ సరస్సుకు ఏటా భారీగా వరదనీరు పోటెత్తడంతో అతలాకుతలమవుతోంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు భారీ డ్రెయిన్లతో పాటు మరో 31 మీడియం, మైనర్ డ్రెయిన్లు, కాలువలు, ఛానల్స్ ద్వారా వరద నీరు ఎగువ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున కొల్లేరుకు చేరుతుంది. ప్రస్తుతం వరద పోటు పెరగడంతో 1,10,920 క్యూసెక్కుల నీరు కొల్లేరుకు వస్తోందని అంచనా. కొల్లేరు నుంచి కేవలం 12 వేల క్యూసెక్కులు మాత్రమే ఉప్పుటేరు డ్రెయిన్ ద్వారా 62 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలోకి చేరుతుంది. దీంతో కొల్లేరులోని గ్రామాలు, లంకలతోపాటు దానికి ఆనుకుని ఉన్న గ్రామాలు సైతం ముంపు ముప్పుతో సతమతమవుతున్నాయి. – సాక్షి, అమరావతి దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు.. ఏలూరు–పశి్చమ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కొల్లేరు దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ చిత్తడి నేలల జాబితాలో దీన్ని గుర్తిస్తూ 1971లో ఇరాన్ సదస్సు తీర్మానించింది. కొల్లేరు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని జాతీయ, అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు, ఉద్యమకారులు గళమెత్తారు. కొల్లేరులో చేపల చెరువుల సాగుతోపాటు గ్రామాలు కూడా పెద్దఎత్తున వెలిశాయి. ఏలూరు జిల్లాలోని కైకలూరు, మండవల్లి, పెదపాడు, ఏలూరు, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు మండలాలతోపాటు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో విస్తరించిన కొల్లేరులో 71 గ్రామాలు, కొల్లేరుకు ఆనుకుని 150 గ్రామాలు కలిపి మొత్తం 221 గ్రామాలున్నాయి. కొల్లేరు రక్షణకు అధ్యయనాలెన్నో.. కొల్లేరు సరస్సు గొప్ప జీవవైవిధ్యం కలిగి ఉంది. వలస పక్షులు, అరుదైన చేప జాతులతోపాటు ప్రజలకు జీవనాధారంగా మారింది. కానీ, చేపల చెరువుల సాగు, ఆక్రమణలతో సహజత్వాన్ని కోల్పోయింది. దీనికితోడు.. వస్తే వరదలు ముంచెత్తడం.. లేదంటే ఉప్పుటేరు ముఖద్వారం ద్వారా సముద్రపు నీరు చొచ్చుకురావడంతో కొల్లేరు దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో.. అక్కడి ప్రజలకు ఇబ్బందిలేకుండా కొల్లేరు సహజత్వాన్ని కాపాడి పర్యావరణానికి ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు పర్యాటక రంగాన్ని కూడా పెంపొందిస్తే మేలని పలు సంస్థలు, పర్యావరణవేత్తలు అధ్యయనం చేసి పలు సిఫార్సులు చేశారు. 1964లో మిత్ర కమిటీ నివేదిక తర్వాత అనేక కమిటీలు అధ్యయనం చేశాయి. తాజాగా.. న్యూఢిల్లీలోని ఎర్త్ సిస్టమ్ సైన్స్ విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమీకృత అధ్యయనం నిర్వహించింది. కొల్లేరును కాపాడుకునేలా సిఫార్సులు.. రెగ్యులేటర్ల నిర్మాణంతోపాటు కొల్లేరుకు సమాంతరంగా ప్రత్యామ్నాయ ఛానల్స్ ఏర్పాటుచేసి వరద నీటిని సముద్రానికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. కొల్లేరును కనీసం మూడో కాంటూర్గా నిర్ణయించి ఆ పరిధిలో ఆక్వా సాగును అనుమతించకూడదు. వీటితోపాటు..» సరస్సులోను, దానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోను పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. » కొల్లేరు నుంచి ఎటువంటి అడ్డంకులు లేకుండా సముద్రానికి వెళ్లేలా ఉప్పుటేరును పూర్తిగా తవి్వన తర్వాతే ప్రత్యామ్నాయ ఛానలైజేషన్ పథకాన్ని పునఃప్రారంభించాలి. » సరస్సు లోపల నీటి ప్రవాహ మార్గాలను అడ్డుకునే నిర్మాణాలు, చెరువులను, రోడ్లను తొలగించాలి.కొల్లేరు పూడిపోకుండా ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ కార్యకలాపాలు తప్పనిసరిగా నిర్వహించాలి.» కాలువలకు అడ్డంగా ఉన్న అవుట్ఫాల్ స్లూయిజ్లను ఏర్పాటుచేయాలి. » కొల్లేరుకు ఉప్పునీటి చొరబాటును నియంత్రించేలా ఉప్పుటేరుపై పడతడిక, మొల్లపర్రు ఓల్డ్ కోర్సు, ఆకివీడు సమీపంలోని పేరంటాల కనుమ వద్ద మూడు రెగ్యులేటర్లను నిరి్మంచాలి.» ఆలపాడు నుండి గుండుగొలను రహదారికి తూర్పున ఉన్న ఈ అలైన్మెంట్ను ఒక భాగం.. కైకలూరు–ఏలూరు రహదారితోపాటు ఆళ్లపాడు–ప్రత్తికోళ్లలంక–గుడివాకలంక–ఏలూరు మధ్య రెండో భాగం.. కైకలూరు–ఏలూరు రహదారికి పశి్చమం వైపు 3వ భాగం.. ఏలూరు–గుడివాకలంక–కొక్కిరాయిలంక–చెట్టున్నపాడు–కమ్మగుండపాడు–ఆగడాలలంక–గుండుగొలను రోడ్డు (’యు’ ఆకారంలో రహదారి) అలైన్మెంట్ను 4వ భాగంగా అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. » సరస్సు నీటిమట్టం తగినంతే ఉండేలా బుడమేరు, తమ్మిలేరు వంటి ప్రధానమైన వాటి నీటి ప్రవాహాలను నియంత్రించేలా చర్యలు చేపట్టాలి. » రోడ్డు నిర్మాణాల కారణంగా ఛిన్నాభిన్నమైన కొల్లేరు సరస్సును రహదారి అమరికల ఆధారంగా నాలుగు భాగాలుగా (10,000 నుండి 12,000 ఎకరాల వరకు) విభజించి అభివృద్ధి చెయ్యొచ్చు. » కొల్లేరుకు తూర్పున పందికోడు, తోకలపల్లి, కాపవరం కాలువలను ఉప్పుటేరులో ఒకటి,పశి్చమ వైపున బుడమేరు, రామిలేరు, పోల్రాజు, చంద్రయ్య, పెద కొమ్మిలేరు, చైనా కొమ్మిలేరు కాలువలను ఉప్పుటేరులో కలుపుతూ మరొకటి.. వరదను నివారించేలా ఇరువైపులా డ్రెయిన్లు నిరి్మంచాలి.» సరస్సు చుట్టూ ఉన్న పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాల నుండి వ్యర్థ జలాలను నివారించడంతోపాటు వాటి నుంచి వచ్చే నీటి నాణ్యతను, సరస్సు జలాల నాణ్యతను క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా మానిటరింగ్ స్టేషన్ను ఏర్పాటుచేయాలి. » సరస్సు నీటి పర్యావరణ నాణ్యతను పర్యవేక్షించడానికి ప్రయోగశాల సౌకర్యాలతో కూడిన హైడ్రో బయోలాజికల్ స్టేషన్ను ఏర్పాటుచేయాలి. -
తగ్గిన వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/పోలవరం రూరల్/విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల)//: పరీవాహక ప్రాంతాల్లో వర్షాల విరామంతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం తగ్గుతోంది. గురువారం ధవళేశ్వరం బ్యారేజీలో నీటి మట్టం 14.40 అడుగులకు తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 41.50 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరే వరద మరింతగా తగ్గనుంది. ప్రకాశం బ్యారేజీలోకి చేరుతున్న కృష్ణా ప్రవాహం కూడా తగ్గింది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల డ్యామ్లలోకి వరద తగ్గింది. శ్రీశైలం నుంచి 2 గేట్ల ద్వారా, నాగార్జునసాగర్ నుంచి 10 క్రస్ట్గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 12,391 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 391 క్యూసెక్కులు వదులుతూ.. మిగులుగా ఉన్న 12 వేల క్యూసెక్కులను కడలిలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 3,500 క్యూసెక్కులు వస్తుండగా అదే పరిమాణంలో సముద్రంలోకి వదులుతున్నారు. ఏలేరు ప్రవాహం సాధారణ స్థాయికి చేరుకుంది. -
ప్రకృతి ప్రకోపం.. ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతకు అపర నష్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులు పోటెత్తాయి. ప్రభుత్వ నిర్వాకంతో బుడమేరు, ఏలేరు, కొల్లేరు సైతం విరుచుకు పడ్డాయి. పంట పొలాలను ముంచెత్తాయి. ప్రకృతి ప్రకోపానికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడవడంతో మరో 15 రోజుల్లో చేతికందాల్సిన పంట వరదపాలైంది. దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం 19 జిల్లాల్లో 5.93లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో 18 రకాల ఆహార, వాణిజ్య పంటలు 5.42లక్షల ఎకరాల్లో, మరో 51వేల ఎకరాల్లో 21 రకాల ఉద్యాన పంటలు పాడైపోయాయి. మొత్తం 3.08 లక్షల మంది రైతులు నష్టపోయారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రైతులకు అపార నష్టం జరిగింది.వరి రైతుల పరిస్థితి దారుణం» వరి పంట 4.29లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నది. మరో 15 నుంచి 20 రోజుల్లో కోతకు వచ్చే దశలో ఉన్న పంట పది రోజులకు పైగా వరద నీటిలో నానడంతో పూర్తిగా కుళ్లిపోయింది. » ప్రాథమికంగా 6 లక్షల టన్నుల ఆహార, వాణిజ్య, ఉద్యాన ఉత్పత్తులకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. అత్యధికంగా 5,07,807 టన్నుల ధాన్యం ఉత్పత్తులకు నష్టం వాటిల్లినట్లు తేల్చారు. ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.» వరి రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30 వేలు వరకు పెట్టుబడి పెట్టారు. ఈ లెక్కన ఒక్క వరి రైతులే రూ.1,200 కోట్లకుపైగా పెట్టుబడులు కోల్పోగా, ఉత్పత్తి రూపంలో మరో రూ.1,168 కోట్ల నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేశారు.» ఆ తర్వాత 58వేల ఎకరాల్లో పత్తి, 25వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది.» ఉద్యాన పంటల్లో అత్యధికంగా 15వేల ఎకరాల్లో మిరప, 10వేల ఎకరాల్లో అరటి, మరో 10వేల ఎకరాల్లో పసుపు, 6వేల ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మరో 150 ఎకరాల్లో మల్బరీ తోటలు, మరికొన్ని ఇతర పంటలు పాడైపోయాయి.» ఇప్పటికే ఎకరా మిరపకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు, కందకు రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు, పసుపునకు రూ.లక్ష, అరటికి రూ.75వేలు, తమలపాకులకు రూ.2లక్షలు, మొక్కజొన్నకు రూ.30వేలు, అరటికి 50వేలు, ఉల్లికి రూ.40వేలు, పత్తికి రూ.25వేలు, అపరాలకు రూ.15వేలు చొప్పున పెట్టుబడులు పెట్టారు. » ఆహార, వాణిజ్య పంటలకు రూ.358.91 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.42.34 కోట్లు, పట్టు పరిశ్రమకు రూ.2.68 కోట్లు కలిపి మొత్తం 3.08లక్షల మంది రైతులకు రూ.403.93 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని ప్రాథమికంగా అధికారులు లెక్కతేల్చారు. క్షేత్రస్థాయి పరిశీలనలో ఇది మరింత కోత పెట్టే అవకాశాలు ఉన్నాయి.కౌలురైతులకు తీవ్ర నష్టంపంట నష్టం అంచనాలకు నిర్దేశించిన గడువు దగ్గర పడుతుండటం... సాగుదారుల పేర్ల నమోదుకు భూ యజమానులు అభ్యంతరం వ్యక్తంచేస్తుండటంతో ఎన్యుమరేషన్ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. చాలా జిల్లాల్లో వెబ్ల్యాండ్ డేటా ఆధారంగా భూ యజమానుల పేరిట పంట నష్టం వివరాలు నమోదు చేస్తున్నారు. ఫలితంగా కౌలుదారులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూ.20వేలు ఇస్తానని..వరి రైతులకు తక్షణ సాయంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల పరిహారంపై అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని భారీగా పెంచి ఇచ్చినప్పటికీ ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు లేనిపోని విమర్శలు చేశారని, తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.20వేలు పరిహారం ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ.10వేలకు సరిపెట్టడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బృందానికి మస్కా..ఆగస్టు 30, 31 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని 28న ఐఎండీ హెచ్చరికకానీ ఆగస్టు 30న ఐఎండీ, సీడబ్ల్యూసీ హెచ్చరించినట్లు అబద్ధం చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టం అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందానికి ప్రభుత్వం మస్కా కొట్టింది. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఏపీలో ఆగస్టు 30, 31 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆగస్టు 28వ తేదీన ఐఎండీ హెచ్చరించింది. కానీ, ఆ హెచ్చరికలు ఆగస్టు 30న వచ్చినట్లు కేంద్ర బృందానికి గురువారం రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.అదే రోజున అన్ని జిల్లాల కలెక్టర్లను రెవెన్యూ శాఖ అప్రమత్తం చేసి, వరదల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని దిశానిర్దేశం చేసిందని పేర్కొంది. ఈ మేరకు వరద సహాయక చర్యలను సమర్థంగా చేపట్టడానికి ఆగస్టు 31న అధికారులతో ఓ కమిటీ వేశామని వివరించింది. కాగా, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆగస్టు 28నే హెచ్చరిస్తే... ఇందుకు విరుద్ధంగా 30న హెచ్చరించిందంటూ కేంద్ర బృందాన్ని ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందనే చర్చ అధికారవర్గాల్లో సాగుతోంది.ఇంకా 34వేల ఎకరాల్లోనే పంట నష్టం నమోదుతొలుత ఈ నెల 10వ తేదీలోపు పంట నష్టం అంచనాలు పూర్తిచేసి 11 నుంచి 16 వరకు సామాజిక తనిఖీల్లో భాగంగా రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని, అభ్యంతరాల పరిష్కారం అనంతరం 20న తుది జాబితాలను ప్రదర్శించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. కానీ, ఎక్కడా సరిగా పంట నష్టం నమోదు జరగలేదు. దీంతో నష్టం అంచనాల నమోదుకు 18వ తేదీ వరకు గడువు పొడిగించారు. ప్రాథమికంగా 5.93 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే.. ఇప్పటి వరకు 34వేల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగలిగారు. తొలుత ఈ–క్రాప్ నమోదును ప్రామాణికంగా పేర్కొన్నారు. వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల్లో 50 శాతం కూడా ఈ–పంట నమోదు పూర్తి కాలేదు. దీంతో ఈ నిబంధనను మినహాయించారు. ఎన్యుమరేషన్లో వాస్తవ సాగుదారుల వివరాలను నమోదు చేసినప్పటికీ సమాంతరంగా ఈ–క్రాప్లో కూడా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ–క్రాప్ నమోదు, ఎన్యుమరేషన్ ఒకేసారి చేపట్టాల్సి రావడంతో అంతా గందరగోళంగా మారింది. నష్టం వివరాల్లో సాగుదారుల పేర్లను నమోదు చేస్తుంటే భూ యజమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.గాడిలో పడని ఈ–క్రాప్.. ఆందోళనలో రైతులువైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్ నమోదు ఏటా ఖరీఫ్లో జూలై మొదటి వారంలో శ్రీకారం చుట్టి సెప్టెంబర్ 15 కల్లా పూర్తిచేసేవారు. సోషల్ ఆడిట్ అనంతరం అక్టోబర్ రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. రబీ సీజన్కు సంబంధించి నవంబర్ మొదటి వారంలో మొదలు పెట్టి జనవరి నెలాఖరులోగా పూర్తి చేసేవారు. ఫిబ్రవరి రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. కానీ ఈసారి సీజన్ ప్రారంభమై 45 రోజులైనా పూర్తి స్థాయిలో ఈ–క్రాప్ గాడిలో పడలేదు. ఫలితంగా ప్రభుత్వ పథకాలకు అందకుండా పోతాయన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. గత∙ఐదేళ్లలో గత సీజన్లో నమోదైన ఈ–క్రాప్ డేటా ప్రామాణికంగానే రాయితీపై విత్తనాలు, ఎరువుల పంపిణీ చేసేవారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం, గడువులోగా పంట నష్ట పరిహారం, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ రాయితీ అందించేవారు. ధాన్యంతో సహా పంట ఉత్పత్తులను ఈ–క్రాప్ ప్రామాణికంగానే కొనుగోలు చేసేవారు. ఇలా సగటున ఏటా 1.65 కోట్ల ఎకరాలు చొప్పున ఐదేళ్లలో 8.24 కోట్ల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 53.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్లు, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 84.67 లక్షల మందికి రూ.2,051 కోట్లు అందించారు. ఐదేళ్లలో 75.82 లక్షల మందికి రూ.1,373 కోట్ల సబ్సిడీతో కూడిన 45.16 లక్షల టన్నుల విత్తనాలు, ఐదేళ్లలో 176.36 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ చేశారు. ఐదేళ్లలో 5.13 కోట్ల మందికి రూ.8.37 లక్షల కోట్ల పంట రుణాలు అందించారు. -
బడుగు జీవితాలు పదేళ్లు వెనక్కు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పటమట/కృష్ణలంక: విజయవాడ ముంపు ప్రాంతాల్లోని పేదల జీవితాలు పదేళ్లు వెనక్కి వెళ్లిపోయాయి. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముంపు తగ్గినా.. అక్కడి పేదలను కష్టాలు చుట్టుముట్టడంతో ఎలా బయటపడాలో తెలియక తమలో తామే కుమిలిపోతున్నారు. కష్టపడి సమకూర్చుకున్న ఇంటి సామగ్రి అంతా వరదపాలైంది. రెక్కలు ముక్కలు చేసుకుని బతికే ఒక్కో పేద కుటుంబం సైతం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల విలువైన సామాన్లను కోల్పోయింది. ఇంటి సామగ్రిని సమకూర్చుకోవాలంటే మరో పదేళ్లు శ్రమించినా కష్టమే అవుతుందని తల్లడిల్లిపోతున్నారు. పనులకు వెళ్లే అవకాశం లేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. ముంపు కాలనీల్లో లక్ష మందికి పైగా ఆటో, మోటార్, హమాలీ, భవన నిర్మాణ కార్మికులు, షాపు వర్కర్లు, రోజువారీ కూలీలే కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ చాలామంది ఇంట్లో పొయ్యి వెలిగించలేని దుస్థితిలో ఉన్నారు. కనీసం వంట పాత్రలైనా సమకూర్చుకునే వరకు భోజనాల ప్యాకెట్లు సరఫరా చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం వరద బాధితులకు సరఫరా చేసే భోజనం ప్యాకెట్లను సోమవారం నుంచే నిలిపివేసింది. దీంతో వారు దాతలు ఇచ్చే భోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కాలనీలను వీడని ముంపుజక్కంపూడి వైఎస్సార్ కాలనీ, రాజీవ్నగర్ కండ్రిక, కుందావారి కండ్రిక, ఉడా కాలనీ, అంబాపురం కాలనీల్లో ఇంకా వరద నీరు నిలిచే ఉంది. దీంతో కొందరు చర్చిలు, కమ్యూనిటీ హాళ్లలో తలదాచుకుంటున్నారు. జవసత్వాలు కూడదీసుకుని నెమ్మదిగా రోడ్డెక్కే ప్రయత్నం చేస్తున్నారు. సుందరయ్య నగర్లో ఇళ్లు దెబ్బ తినడంతో ఇంట్లో ఉండలేక వృద్ధ దంపతులైన బండి రమణమ్మ, ఆమె భర్త వెంకటేశ్వరరావు బయటే చిన్న గుడారం వేసుకుని ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ పది రోజులపాటు బయటే ఉన్నారు. రమణమ్మ దివ్యాంగురాలు కావడంతో మంచంపైనే ఉండిపోయింది. దాతలు ఇచ్చే ఆహారంతో కాలం వెళ్లదీస్తున్నారు. బుధవారం ఆమె భర్త ఆహారం తెచ్చేందుకు వెళ్లిన సమయంలో ఆ వృద్ధురాలు మృతిచెందగా.. ఈ ఘటన కాలనీవాసుల్లో విషాదం నింపింది. చాలా కాలనీల్లో మురుగు పేరుకుపోయింది. చెత్త ఎక్కడికక్కడ గుట్టలుగా పేరుకుపోవడంతో పలు కాలనీల్లోని రోడ్లు డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. తాగునీటి పైపులు మురుగులో ఉండటంతో నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న నీటిని తాగటం లేదు. ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. విష పురుగుల సంచారంతో బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు నిన్నటి వరకు వరద తమను వణికిస్తే... ఇప్పుడు దొంగలు భయపెడుతున్నారని.. మిగిలిన కొద్దిపాటి సామాన్లు కాపాడుకునేందుకు ఇంటిలో ఒకరు కాపలా ఉండాల్సి వస్తోందని ముంపు ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. మరోవైపు వరద నష్టంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్వే బృందాలు తమ ఇళ్లకు రాకుండా వీధి మొదట్లో ఉండి తమను ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని చెబుతున్నారని కండ్రిక ప్రాంత ప్రజలు వాపోతున్నారు.10 రోజులుగా పనుల్లేవు కండ్రిక ప్రాంతానికి చెందిన ఈమె పేరు ఎన్.నాగమణి. వరద ముంపు నుంచి ఇంట్లోని సామగ్రి కాపాడుకునే ప్రయత్నంలో ఆమె భర్త కాలు విరిగింది. ఆయన్ను ఆస్పత్రిలో చేర్చి, నాగమణి ఇంటికి వచ్చింది. ‘వరద తగ్గినా ఇంట్లోకి వెళ్లలేకపోతున్నాం. సర్వం కోల్పోయి పది రోజులుగా పనిలేకుండా ఉన్నాం. ఓ వైపు భర్త ఆస్పత్రి పాలయ్యాడు. వరదలో మునిగిన ఇంటిని చూస్తూ ఏడవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నా. వరద వస్తుందని ముందుగా చెప్పి ఉంటే సామాన్లు సర్దుకుని వెళ్లిపోయేవాళ్లం. ఇలా మునిగిన ఇళ్లను కాపలాకాసే పరిస్థితి వచ్చేది కాదు. ఇంట్లో సామగ్రి సమకూర్చుకోవడం పదేళ్లకైనా మాలాంటోళ్లకు కష్టమే’ అని నాగమణి ఆవేదన చెందుతోంది.వంట పాత్రలైనా ఇవ్వండయ్యావరద వచ్చినప్పుడు ప్రభుత్వం మాకు సమాచారం ఇవ్వాలి కదా.. ఒక్కసారిగా వచ్చిన వరదతో సామాన్లన్నీ వదిలేసి ప్రాణాలు కాపాడుకునేందుకు వెళ్లాం. ఇంట్లో ఇంకా వరద తగ్గలేదు. ఒక్క సామాను కూడా పనికివచ్చేలా లేదు. ప్రభుత్వం స్పందించి వంట పాత్రలు, బకెట్లు వంటివి ఇవ్వాలి. – శైలజ, కండ్రిక ఇంట్లో ఉండలేం.. బయటకు వెళ్లలేం ఇల్లంతా వరద నీరు. నీరు తోడటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. చర్చిలో తలదాచుకుంటున్నాం. మాకు ఆహారం ఇవ్వడం ప్రభుత్వం మానేసింది. దాతలు పంపిన ఆహారంతోనే కడుపు నింపుకుంటున్నాం. మా అమ్మకు బ్రెయిన్స్ట్రోక్ వచ్చింది. ఎక్కడికి వెళ్లలేని స్థితి. ఇంట్లో ఉండలేం. బయటకు వెళ్లలేం. – దేవర నాగమల్లేశ్వరి, కండ్రిక -
వరదతో లంకవాసుల జీవితం ఛిద్రం
సాక్షి, అమలాపురం/సాక్షి, భీమవరం: గోదావరి, వశిష్ట గోదావరి మరోసారి పోటెత్తడంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు లంక గ్రామాల్లోని ప్రజల జీవితం ఛిద్రమైంది. ఈ ఏడాది గోదావరి వరద లంక గ్రామాలను ముంచడం ఇది మూడోసారి. జూలైలో వచ్చిన వరదకంటే ఇప్పుడు వరద భారీగా ఉంది. జూలై చివర్లో వచ్చిన వరదలకే పలు పంటలకు నష్టం వాటిల్లగా ప్రస్తుత వరదలకు అక్కడక్కడా మిగిలిఉన్న కాస్త పంటలు కూడా దెబ్బతిన్నాయి. వరదల ప్రభావం అంబేడ్కర్ జిల్లాలోని పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాలపై అధికంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లోని లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 12 మండలాల్లోని 44 శివారు గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. కాజ్వేలతోపాటు ప్రధాన రోడ్లపై 5 అడుగుల ఎత్తున నీరు చేరడంతో లంకవాసులు, విద్యార్థులు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు. అప్పనపల్లి గ్రామం, బి.దొడ్డవరం ఇందిరమ్మ కాలనీ, అయినవిల్లి మండలంలో వీరవల్లిపాలెం, పొట్టిలంక, ముమ్మడివరం మండలంలోని లంకాఫ్ ఠాన్నేల్లంక, కూనాలంక, గురజాపులంక, అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లిపాలెంలో వరద మరింత పెరిగింది. జిల్లాలోని మత్స్యకార గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఉద్యాన పంటలు మరోసారి పెద్ద ఎత్తున నీట మునిగాయి. అరటి, కంద, కోకో, కొబ్బరి, కూరగాయ పంటలు నీట నానుతున్నాయి. పాడి రైతులు పాలు అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మత్స్యకారులు పది రోజులుగా వేట లేక ఇబ్బంది పడుతున్నారు.లంక భూములను ముంచెత్తిన వశిష్ట గోదావరిఎగువ నుంచి ఉరకలెత్తుతూ వస్తున్న జలాలతో వశిష్ట గోదావరి సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, పెనుగొండ, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని పలు లంక గ్రామాలను వరద ముంచెత్తింది. ఆచంట, పెనుగొండ, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని 600 ఎకరాల్లో కూరగాయలు, 80 ఎకరాల్లో తమలపాకుల పంటలకు నష్టం వాటిల్లింది. 200 ఎకరాల్లోని అరటి తోటలను వరద ముంచెత్తింది. యలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక, దొడ్డిపట్ల, లక్ష్మీపాలెం గ్రామాల్లో వరదనీరు చేరింది. వడ్డిలంక వద్ద స్లూయిజ్ గేటు సక్రమంగా మూసుకోకపోవడంతో గోదావరి నీరు నక్కల డ్రెయిన్లోకి ఎగదన్నుతోంది. -
ఉదారంగా సాయం చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల ఊహించని విపత్తు తలెత్తిందని.. అపార నష్టాన్ని, కష్టాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలను ఆదుకునేందుకు ఉదారంగా సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తును సాధారణంగా.. గతంలో వచ్చిన వరదల్లా చూడొద్దు. రికార్డు స్థాయి వర్షాలు, ఆకస్మిక వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. రెండు రోజుల వ్యవధిలో 50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కృష్ణా బ్యారేజీ చరిత్రలో ఇంత పెద్ద వరద ఎప్పుడూ రాలేదు. 11.90 లక్షల క్యూసెక్కుల వరదకు అనుగుణంగా ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరగ్గా.. మొన్న కురిసిన వర్షాలకు 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. 14 లక్షల క్యూసెక్కుల వరద వస్తే పరిస్థితి ఏంటనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పంటలు నీట మునిగి రైతులు కుదేలయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు.. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక ప్రజలు ప్రాణభయంతో తీవ్ర క్షోభను అనుభవించారు. ప్రజలను తిరిగి నిలబెట్టేలా కేంద్రం సాయం చేసేలా చూడండి’ అని కేంద్ర బృందాన్ని కోరారు. ‘బుడమేరు’కు శాశ్వత పరిష్కారం కావాలన్నారు..అనంతరం కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం వరద ప్రాంతాల్లో తమ అనుభవాలను సీఎంకు వివరించారు. ‘భారీగా పంట నష్టం జరిగిందని, మౌలిక సదుపాయాలపరంగా తీవ్ర నష్టం జరిగిందని గుర్తించాం. బుడమేరు వరదలపై ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారు. ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం చూపించాలని వారు కోరారు. తమకు ప్రభుత్వం సాయం చేస్తుందనే నమ్మకంలో ప్రజలున్నారు. మా పరిశీలనకు వచ్చిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం అందేలా కృషి చేస్తాం’ అని కేంద్ర బృందం తెలిపింది. ఎంఎస్ఎంఈలతో డ్వాక్రా సంఘాల అనుసంధానంరాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను ఎంఎస్ఎంఈలతో అనుసంధానం చేసి, ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు విలువ జోడించడం, ప్యాకింగ్ వంటి ఉమ్మడి సౌకర్యాల వినియోగంతో పాటు మార్కెటింగ్, టెక్నాలజీని అందుబాటులోకి తేవాలన్నారు. సీఎం చంద్రబాబు గురువారం సచివాలయంలో ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రోసెసింగ్ రంగాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష వివరాలను ఎంఎస్ఎంఈ మంత్రి కె.శ్రీనివాస్ విలేకరులకు వివరించారు. రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులను ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ద్వారా విక్రయించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. విశాఖలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరహాలోనే అమరావతిలో మరొకటి ఏర్పాటు చేసి, దానికి అనుబంధంగా 10కి పైగా వివిధ రంగాల హబ్ అండ్ స్పోక్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ స్కీం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ అందిస్తోందని, కేంద్రం రూ.5,000 కోట్లు గ్యారంటీ ఇవ్వడంతో చిన్న పరిశ్రమలకు ఎటువంటి తనఖా అవసరం లేకుండా రుణాలు లభిస్తాయని అన్నారు.ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన రూ.1,500 కోట్ల ప్రోత్సాహక బకాయీలను కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై కసరత్తు చేయాలని సీఎం సూచించినట్లు తెలిపారు. రాజధానిలో రైతులకు లబ్ధి చేకూర్చిన విధానాన్నే ఈ ఎంఎస్ఎంఈ పార్కులకూ అవలంభించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. రైతులు పండించే పంటలకు వారే విలువను పెంచుకునేలా పాలసీ తేవాలని సీఎం సూచించారు. విజయవాడ వరదల్లో దెబ్బతిన్న పరిశ్రమలను ఏ విధంగా ఆదుకోవాలన్నదానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ భేటీతెలంగాణ రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతీరెడ్డి సీఎం నారా చంద్రబాబునాయుడును మర్యాద పూర్వంగా కలిశారు. వారు గురువారం మధ్యాహ్నం సచివాలయానికి వచ్చి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. -
‘దేవుడా.. ఇంకెన్ని రోజులు’!.. విజయవాడ వరద బాధితుల ఆవేదన (చిత్రాలు)
-
Updates: ‘అధికారులెవరూ రాలేదండీ’
AP And Telangana Floods News Latest Updates In Teluguశ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద జలాశయం 2 రేడియల్ క్రెస్టు గేటు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల ఇన్ ఫ్లో : 1,38,833 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 96,081 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుతం : 884.60 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు .. ప్రస్తుతం : 213.4011 టీఎంసీలు కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తివిజయవాడ 12 రోజులైనా ముంపు ప్రాంత ప్రజలకు తప్పని తిప్పలు ఇంకా మోకాళ్ల లోతు నీటిలోనే నానుతున్న అంబాపురంలోని కాలనీలు వరదలో ఉండలేక ఇళ్లను వదిలి వెళ్లిపోయిన ప్రజలు దొంగల భయంతో మళ్లీ ఇళ్లకు చేరుకుంటున్న కొందరు ప్రభుత్వం నుంచి ఈరోజు వరకూ తమకు ఎలాంటి సహాయం అందలేదని ఆగ్రహం మంచినీరు కూడా సప్లై చేయడం లేదంటున్న అంబాపురం ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఇళ్ల నుంచి బయటికి వస్తున్న వరద బాధితులు ఎన్యుమరేషన్ దాదాపు పూర్తైందంటున్న అధికారులు.. తమ వద్దకు ఏ ఒక్కరూ రాలేదంటున్న వరద బాధితులువాలంటీర్ వ్యవస్థ ఉంటే తమకు ఇలాంటి సమస్య ఎదురయ్యేది కాదంటున్న అంబాపురం వాసులునల్లగొండనాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదలభద్రాచలంతగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహంఈరోజు ఉదయం 11 గంటలకు 42.7అడుగుల గోదావరి నీటిమట్టంమొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించిన అధికారులుసూర్యాపేటఅనంతగిరి, కోదాడ మండలాల్లో పర్యటించిన కేంద్ర బృందంఅనంతగిరి మండలం గోండ్రియాల, కోదాడ మండలం తొగర్రాయి, కూచిపూడిలో ధ్వంసం అయిన ఇళ్లలు, నష్టపోయిన పంట, కోతకు గురైన రహదారులను పరిశీలించిన కేంద్ర బృందం క్లిక్ చేయండి: దేవుడా ఈ నరకం ఇంకెన్నాళ్లూ! ప్రకాశం బ్యారేజీ వద్ద కేంద్ర బృందంప్రకాశం బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందంబోటు ప్రమాదంలో దెబ్బ తిన్న బ్యారేజీని పరిశీలించిన సభ్యులుఖమ్మం ఖమ్మం నగరంలోని వరదల్లో నీట మునిగిన నయా బజార్ కాలేజీ ని పరిశీలించిన ఎమ్మెల్సీ కోదండరాం అనంతరం వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ కొనసాగుతున్న ఆపరేషన్ బోట్ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న బోట్ల తొలగింపు కార్యక్రమంనిన్నంతా కష్టపడ్డ అండర్ వాటర్ టీంఇవాళ కూడా కొనసాగనున్న పనులుబోట్లను ముక్కలు చేసి ఆపై బెలూన్లతో తొలగించే యత్నంమెదక్ఏడుపాయాల ఆలయం మళ్లీ మూసివేతసింగూరు గేట్లు ఎత్తేయడంతో భారీగా నీరుఆలయాన్ని తాకుతూ నీటి ప్రవాహంరెండ్రజుల కిందటే తెరుచుకున్న ఆలయంఈలోపే మళ్లీ మూసేసిన నిర్వాహకులుబ్యారేజీకి కేంద్ర కమిటీనేడు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పర్యటించనున్న కేంద్ర కమిటీ ప్రకాశం బ్యారేజీ చెంతకు కమిటీప్రస్తుత బ్యారేజీ పరిస్థితిపై ఆరా తీయనున్న సభ్యులు ఎన్టీఆర్ జిల్లా:వరద ప్రభావిత ప్రాంతాల్లో అనిల్ సుబ్రహ్మణ్యం నేతృతంలో కేంద్ర బృందం పర్యటనకలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన కేంద్ర బృందంవరద ముంపు ప్రాంతాల డ్రోన్ విజువల్స్ పరిశీలననష్టంపై కేంద్ర బృందానికి వివరించిన కలెక్టర్ జి.సృజనకేంద్ర బృందాన్ని కలిసి తమకు జరిగిన నష్టంపై వినతిపత్రం అందజేసిన కృష్ణామిల్క్ యూనియన్ (విజయ డైరీ ) చలసాని ఆంజనేయులుఫోటో ఎగ్జిబిషన్ అనంతరం ప్రకాశం బ్యారేజ్, బుడమేరు గండ్లు పడిన ప్రాంతం, ఈలప్రోలు, రాయనపాడు, జక్కంపూడి, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలను పరిశీలించనున్న కేంద్ర బృందం నంద్యాల:శ్రీశైలం జలాశయానికి కోనసాగుతున్న వరద నీరుజలాశయం 1 గేటు 10 అడుగులు మేరకు మరొక్కసారి ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో: 1,38,833 క్యూసెక్కులుఔట్ ఫ్లో: 96,081 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 884.50 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలుప్రస్తుతం: 212.9198 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి విజయవాడ:విజయవాడలో ఇంకా ముంపులోనే పలు కాలనీలు12 రోజులైనా బురదలోనే ముంపు ప్రాంతాలుశుభ్రం చేసుకునేందుకు అవస్థలుపడుతున్న కాలనీల వాసులునీళ్లలో నానుతున్న ఎల్బీఎస్ నగర్, కండ్రిక, తోటివారి వీధిముంపులోనే ప్రకాశ్ నగర్, అంబపురంలోపల కాలనీల ప్రజలకు అందని సాయం రోడ్ల మీద బురద పేరుకుపోవటంతో ప్రజలకు అవస్థలుప్రచార ఆర్భాటంగా ఎన్యుమరేషన్మ్యాపింగ్ ఉంటేనే ఎన్యుమరేషన్ అంటున్న అధికారులుఇంట్లోని సామాన్లకు మాత్రమే జరుగుతున్న ఎన్యుమరేషన్ ఖమ్మం జిల్లాఖమ్మం నగరంలో బొక్కలగడ్డ, ధంసలాపురం ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటి మట్టంఈరోజు ఉదయం 9 గంటలకు 43.3 అడుగులుకు చేరిన గోదావరి నీటిమట్టంఅమలులో ఉన్న మొదటి ప్రమాద హెచ్చరికఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద స్వల్పంగా తగ్గిన గోదావరి వరద.స్పిల్ వే ఎగువన 33.750 మీటర్లుస్పిల్ వే దిగువన 25.580 మీటర్లు నీటిమట్టం నమోదు.48 రేడియల్ గేట్ల ద్వారా 12,46.342,క్యూసెక్కుల గోదావరి వరద నీటిని దిగువకు విడుదల.ఏలూరు జిల్లాజంగారెడ్డిగూడెం మండలం కొంగ వారిగూడెం ఎర్రకాలవ జలాశయానికి తగ్గిన వరద నీరు.పూర్తిస్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం 81.87ఇన్ ఫ్లో 1565 క్యూసెక్కులు అవుట్ ఫ్లో గేట్లు ఎత్తి 1806 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేసిన అధికారులునల్లగొండ జిల్లానాగార్జునసాగర్ ప్రాజెక్టు కు తగ్గిన వరదక్రస్ట్ గేట్లు మూసివేతఇన్ ఫ్లో: 68235 క్యూసెక్కులుఅవుట్ ఫ్లో : 43298 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులుప్రస్తుత నీటి మట్టం: 589.60 అడుగులుపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 310.8498 టీఎంసీలుకొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తిఎడమ కాలువకు నీటిని నిలిపివేసి నేటికి 12 రోజులుసూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద ఇంకా పూడ్చివేయని కాలువ గండిసూర్యాపేట జిల్లా:పులిచింతల అప్డేట్ఇన్ ఫ్లో 31,182క్యూసెక్కులుఅవుట్ ఫ్లో:16,000క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి మట్టం:175 అడుగులుప్రస్తుత నీటి మట్టం:172.767 అడుగులుపూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45.77 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 38.765 టీఎంసీలుపవర్ జనరేషన్ :16000 క్యూసెక్కులు.నిజామాబాద్ జిల్లాశ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో 35 వేల క్యూసెక్కులుఔట్ ఫ్లో 35 వేల క్యూసెక్కులుప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు, 80 టీఎంసీలుప్రస్తుతం 1090 అడుగులు, 80 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు కేంద్ర ప్రభుత్వ కమిటీ పర్యటన.ఖమ్మం, సూర్యాపేటలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న బృందం.వరద బాధితులను ఆదుకోవాలని నిన్న సెంట్రల్ కమిటీకి నివేదిక ఇచ్చిన సిఎస్.ఇవ్వాల్టితో ముగియనున్న రాష్ట్ర పర్యటన.జూరాల అప్డేట్మహబూబ్ నగర్ జిల్లా: జూరాల ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద13 గేట్స్ ఎత్తివేతఇన్ ఫ్లో : 1 లక్ష 26 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 1 లక్ష 26 వేల 243 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 318.270 మీటర్లు, ప్రస్తుత నీటి సామర్థ్యం: 318.350మీటర్లుపూర్తిస్థాయి నీటి నిల్వ: 9.657 టీఎంసీలు , ప్రస్తుత నీటి నిల్వ : 9.316 టీఎంసీలుఎగువ, జూరాల జల విద్యుత్ కేంద్రం లో మొత్తం 5 యూనిట్లలో ఉత్పత్తి కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాగోదావరిలోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరుబ్యారేజ్ వద్ద 15.3 అడుగులుగా నమోదైన గోదావరి వరద నీటిమట్టం15 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలబ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికకోనసీమలో పలుచోట్ల నీట మునిగిన కాజ్వేలుసఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంక టేకి శెట్టిపాలెం మధ్య వరద నీరు రావడంతో పడవలపై రాకపోకలుఅప్పనపల్లి-పెదపట్నం లంక మధ్య వరద నీరు రావడంతో అవస్థలు పడుతున్న స్థానికులుఇప్పటికే నీట మునిగిన గంటి పెదపూడి, ఎదురుబిడియం, కనకాయలంక కాజ్వేలువరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో రెండు రోజులపాటు వినాయక నిమజ్జనాన్ని చేయకూడదని ఆదేశాలు జారీ చేసిన అధికారులుకోనసీమలో ఉదృతంగా ప్రవహిస్తున్న వశిష్ట , గౌతమి, వైనతేయ నదులు -
నాలుగు లక్షల మందిని బురదలో ముంచేసిన నేరం బాబుదే
-
ఆ స్కూలు మళ్లీ సైకిలెక్కింది!
వాయనాడ్ వరదలకు రెండు నెలల ముందు షాలినీ టీచర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్లి΄ోయింది. స్కూల్ పిల్లల యూనిఫామ్లోనే సైకిల్ మీద తిరుగుతూ పిల్లలతో ఆడినఆమె వీడియో ఇంటర్నెట్లో ఎందరికో ఇష్టం. తర్వాత వరదలు వచ్చాయి. వీడియోలో ఉన్న పిల్లలు ముగ్గురు చని΄ోయారు. ‘నేను ఎప్పటికీ ఆ స్కూల్కి వెళ్లలేను’ అని బాధపడింది షాలినీ టీచర్. కాని వారం క్రితం స్కూల్ తెరిచాక పిల్లలు కోరింది షాలినీ టీచర్ కావాలనే. వారి టీచర్ వారికి దొరికింది. ఇక గాయం తప్పక మానుతుంది.టీచర్ల జీవితంలో అత్యంత కఠినమైన సందర్భం ఏమిటో తెలుసా? విగత జీవులుగా ఉన్న పిల్లల ముఖాలను గుర్తు పట్టమని వారిని పిలవడం. జూలై 30 వాయనాడ్లోని కొండ్ర΄ాంత పల్లెలు ముండక్కై, చూరలమల వరదల్లో పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఊహించని వరద నిద్రలో ఉన్నవారిని నిద్రలోనే తీసుకెళ్లింది. ముండక్కైలో చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్ మొత్తం బురదతో నిండి΄ోయింది. దాని చుట్టూ ఉండే ఇళ్లు ధ్వంసమై΄ోయాయి. స్కూల్లోని 9 మంది విద్యార్థులు మరణించారు. వారిలో ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మరణించారు. మృతదేహాల ఆచూకీ దొరికాక వారిని గుర్తించడానికి టీచర్లనే పిలిచారు. అక్కడ పని చేసిన షాలినీ టీచర్కు ఆ ఘటన ఎంత మనోవేదన కలిగించిందో! మిగిలిన టీచర్లు మళ్లీ ఈ స్కూల్ ముఖం చూడకూడదని ఎంతగా ఏడ్చారో!!షాలినీ టీచర్ది కొట్టాయం. కాని పట్నంలో ΄ాఠాలు చెప్పడం కన్నా వాయనాడ్ ్ర΄ాంతం ఆహ్లాదంగా ఉంటుంది... ప్రజలు అమాయకంగా ఉంటారని ముండక్కైలో ఎలిమెంటరీ స్కూల్లో అడిగి మరీ టీచర్గా చేరింది. అక్కడ పిల్లలకు ఆమె ఇష్టమైన టీచర్. వారి యూనిఫారమ్లాంటి చుడిదార్ వేసుకుని స్కూల్కు వచ్చి పిల్లల్లో కలిసి΄ోయేది. చిన్న స్కూలు... పిల్లల సంఖ్య తక్కువ కావడంతో అందరి ఇళ్లు, తల్లిదండ్రులు తెలుసు. ఒకరోజు గేమ్స్ పిరియడ్లో ఒక ΄ాప సైకిల్ను ఆసక్తిగా చూడటం గమనించింది షాలినీ టీచర్. ఆ ΄ాప స్లోచైల్డ్. తానుగా సైకిల్ తొక్కలేదు. షాలినీ టీచర్ అది గమనించి ‘సైకిల్ ఎక్కుతావా’ అని వెనుక నిలబెట్టి తాను తొక్కుతూ గ్రౌండ్లో ఒక రౌండ్ వేసింది. పిల్లలందరూ చుట్టూ చేరి ఎంజాయ్ చేశారు. ఎవరో ఇది షూట్ చేయగా ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. రెండేళ్లు పని చేశాక షాలినీ టీచర్కి జూన్ నెలలో దగ్గరలోనే ఉన్న మీనన్గడి అనే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. పిల్లలు ఆమె వెళ్లడానికి ఒప్పుకోలేదు. కాని వెళ్లక తప్పలేదు. ఆ రోజు షాలినీ టీచర్ అనుకోలేదు.. వారిలో కొందరిని మళ్లెప్పుడూ చూడలేనని. వాయనాడ్ వరదలు పిల్లలకూ ఆమెకూ మధ్య శాశ్వత దూరం తెచ్చాయి. చని΄ోయిన పిల్లలను గుర్తు పట్టమని ΄ోలీసులు ఆమెను పిలిచినప్పుడు ఆమె హృదయం బద్దలైంది. వాయనాడ్ కోలుకుంది. సెప్టెంబర్ 2న ముండక్కైలోని స్కూల్ను రీ ఓపెన్ చేస్తూ సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి వి.శివకుట్టి హాజరయ్యారు. దారుణమైన విషాదాన్ని చవిచూసిన ఆ పిల్లల ముఖాలను చూసిన మంత్రి ‘మీకు ఏం కావాలో అడగండి చేస్తాను’ అన్నారు. వెంటనే పిల్లలు ‘మా షాలినీ టీచర్ను మా దగ్గరకు పంపండి’ అన్నారు. ఇలాంటి సమయంలో వారికి ఇష్టమైన టీచర్ తోడుంటే బాగుంటుందనుకున్న మంత్రి వెంటనే ఆదేశాలు ఇచ్చారు. షాలినీ తన స్కూల్కు తాను తిరిగి వచ్చింది.ఆమెను చూసిన పిల్లలు కేరింతలు కొట్టారు. ఆమె కన్నీరు కార్చింది చని΄ోయిన పిల్లలను తలుచుకుని. కాని ఆనందించింది తన స్కూలుకు తాను వచ్చానని.ఆ స్కూల్ను తిరిగి ఆట΄ాటలతో నింపడమే ఆమె లక్ష్యం.పిల్లల మోముల్లో చిర్నవ్వును పూయించడమే కర్తవ్యం.షాలిటీ టీచర్ తప్పక సాధిస్తుంది. -
ఎకరానికి రూ.10 వేలు: సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, కాకినాడ /కిర్లంపూడి, సాక్షి ప్రతినిధి, ఏలూరు: వరదలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున నష్ట పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వరద ప్రాంతాల సందర్శన సందర్భంగా బుధవారం ఏలూరు, కాకినాడ జిల్లాల్లో ఆయన పర్యటించారు. ఏలూరులో తమ్మిలేరు కాల్వను బ్రిడ్జి నుంచి పరిశీలించిన అనంతరం సీఆర్ రెడ్డి ఆడిటోరియంలో ఎంపిక చేసిన వరద బాధితులను కలిశారు. ఏలేరు వరదతో ముంపునకు గురైన వరి పొలాలు, నీట మునిగిన ఇళ్లను కిర్లంపూడి మండలం రాజుపాలెంలో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్తవి నిర్మిస్తామని చెప్పారు. వరదల్లో దెబ్బతిన్న ఒక్కో వాహనానికి రూ.10 వేలు, దుస్తులు, ఇంటి సామాన్ల కోసం ప్రతి కుటుంబానికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. పైసా ఖర్చు కూడా లేకుండా తోపుడు బళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. జగ్గంపేట, పెద్దాపురం, సామర్లకోట, గొల్లప్రోలు, పిఠాపురం ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయన్నారు. ఏలేరు వరదతో జిల్లాలో 65 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. 17వ తేదీలోపు అన్ని నష్టాలను అంచనా వేసి నష్టపరిహారాన్ని అందించే బాధ్యత తీసుకుంటామన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏలేరు ఆధునికీకరణ కోసం మంజూరు చేసిన నిధులను ఖర్చు చేయకుండా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు విమర్శించారు. బుడమేరుపై ఆర్మీ వాళ్లే చేతులెత్తేస్తే తాము విజయవంతంగా గండ్లు పూడ్చామని చెప్పారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లన్నీ వైఎస్సార్ సీపీకి చెందినవారివేనని, దొంగ ఇసుక వ్యాపారం చేయడానికి వాటిని వినియోగించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక పనికి మాలిన ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ ఫోన్ నుంచి నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని సంప్రదించేలా ఒక యాప్ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.ఏలూరు అష్ట దిగ్బంధంముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు పర్యటన సందర్భంగా నగరమంతా అష్ట దిగ్బంధంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు. అడుగడుగునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి పర్యటన ఎక్కడో సీఆర్ రెడ్డి కళాశాల దగ్గర కాగా ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి ఆంక్షలు విధించారు. కాలేజీకి వెళ్లే విద్యార్థులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు, వృద్ధులు నానా అగచాట్లు పడ్డారు. ప్రతి రోడ్డుపై బ్యారికేడ్లు పెట్టారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. ప్రయాణికులు బస్సులు లేక ప్లాట్ఫామ్లపై పడిగాపులు కాశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏలూరులో ట్రాఫిక్ ఆంక్షలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. -
ఆటో రిపేర్కు 3 నెలలు
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): విజయవాడను ముంచెత్తిన వరదల కారణంగా ఇక్కడి ఆటోవాలాలకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. వరదలో మునిగిన ఆటోలు మరమ్మతులు చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు వేచి ఉండాలని, లేదంటే బయట మెకానిక్ల వద్ద రిపేర్లు చేయించుకోవాలని షోరూం యజమానులు తెగేసి చెబుతున్నారు. దీంతో కంగుతింటున్న ఆటోవాలాలు అన్ని రోజుల పాటు ఉపాధి కోల్పోతే కుటుంబ పోషణ, ఆటోల ఈఎంఐల చెల్లింపు ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఆటో యజమానులను మరింత ఆందోళనకు గురిచేసేలా షోరూం యజమానులు ఓ ప్రతిపాదన కూడా పెడుతున్నారు. వన్టైం సెటిల్మెంట్ చేసుకుని ఆటోను వెనక్కి ఇచ్చేస్తే.. కట్టిన వాయిదాలను, ఆటో కండిషన్ను బట్టి రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు నగదు ఇస్తామని చెబుతున్నారు. బయట రిపేర్లంటే కష్టమే.. బయట మరమ్మతులు చేయించుకోవాలంటే కష్టమేనని, తాము ఇబ్బంది పడతామని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. కొత్త మోడళ్ల ఆటోల రిపేర్లు బయట మెకానిక్లకు తెలియదని, సరిగా చేయకపోతే మళ్లీ మొరాయిస్తాయని వాపోతున్నారు. షోరూం వాళ్లు మూడు నెలల సమయం పెడితే ఈఎంఐ ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల కారణంగా ఇప్పటికే ఉపాధిలేక నానా ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడంలేదని చెబుతున్నారు. వన్టైం సెటిల్మెంట్ చేసుకోవాలంటే సంబంధిత ఫైనాన్స్ కంపెనీల నుంచి కచి్చతంగా క్లయిం నంబర్ తీసుకోవాలని, ఆ నంబర్ ఇవ్వడానికి కూడా ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు రూ. 4 వేల నుంచి రూ. 5 వేలు డిమాండ్ చేస్తున్నారని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు, ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు చేసి ఆటోలు కొనుక్కున్నామని, ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు షోరూం వాళ్ల తీరుతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని పలువురు ఆటో డ్రైవర్లు వాపోయారు. సమస్యను వారంలో పరిష్కరిస్తానని సీఎం చెప్పారు ఆటోల మరమ్మతులు వారం రోజుల్లో చేయిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది ఆచరణలో సాధ్యం కాలేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఆటో మరమ్మతుకు మూడు నెలల సమయం పడుతుందని షోరూం వారు చెబుతున్నారు.అప్పటి వరకు ఏమి చేసి కుటుంబాన్ని నడపాలి. ఏమి చేయాలో అర్థం కావడంలేదు. వన్టైం సెటిల్మెంట్ చేసుకోవడం కుదరదు. గతంలో చెల్లించిన కిస్తీల పరిస్థితి ఏంటో చెప్పడంలేదు. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలి. – ఇ.సింహాచలం, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ -
నిబంధనలు గాలికి..
సాక్షి, అమరావతి: విపత్తుల సమయంలో అనుసరించాల్సిన ప్రాథమిక నిబంధనలను సీఎం చంద్రబాబు గాలికి వదిలేయడంతో విజయవాడ ప్రజలు అష్టకష్టాలు అనుభవించారు. దేశవ్యాప్తంగా పాటించే విపత్తు నిర్వహణ విధానాలను ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో ప్రజల నష్టం, కష్టం మరింత పెరిగిపోయిందని నిపుణులు సైతం పేర్కొంటున్నారు.ముందస్తుగా ప్రజలను హెచ్చరించి అప్రమత్తం చేయడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, కష్ట సమయంలో ఆదుకుని తక్షణ ఆర్థిక సాయం అందించడం లాంటివి కీలకం. ఎన్డీఎంఎ (జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ) మాన్యువల్లో ఈ మూడు అంశాలు అత్యంత కీలకం. రాష్ట్రంలో ఏ విపత్తు తలెత్తినా ఇవే ప్రామాణికం. అందులోని అంశాల ప్రకారమే నివారణ చర్యలు, సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ముందే హెచ్చరించినా..విజయవాడను ముంచెత్తిన తాజా వరదల్లో విపత్తు మాన్యువల్ను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. బుడమేరు వరద గురించి కనీస సమాచారం ప్రజలకు ఇవ్వలేదు. ఆగస్టు 31వ తేదీన విజయవాడ పరిసరాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని మూడు రోజులు ముందే వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖలతో సీఎం కనీసం సమీక్ష నిర్వహించలేదు. జలాశయాలు నిండుకుండల్లా కనిపిస్తున్నా ‘ఫ్లడ్ కుషన్’ నిబంధన పాటించలేదు. తీరా బుడమేరుకు వరద పోటెత్తాక అర్థరాత్రి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తేశారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలను కనీసం అప్రమత్తం చేయకపోవడంతో సగం విజయవాడ మునిగిపోయింది. 2.50 లక్షలకు పైగా కుటుంబాలు వరద నుంచి బయటపడే అవకాశం లేక తీవ్రంగా నష్టపోయాయి. వరదల్లో 60 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్ని నిండు ప్రాణాలు బలవ్వగా లక్షలాది కుటుంబాలకు రూ.వేల కోట్ల నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ఆస్తులకు అపార నష్టం జరిగింది. విపత్తుల సమయంలో అనుసరించాల్సిన ప్రాథమిక సూత్రాన్ని ప్రభుత్వం పాటించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. ఏ దశలోనూ కళ్లు తెరవని బాబు ఆ తర్వాత దశలోనూ రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవకపోగా విపత్తు నిర్వహణ విధానాలను గమనించకుండా ప్రజలను వరదకు వదిలేసింది. వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు అంటే వరద లేని ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలి.రెండున్నర లక్షల కుటుంబాలు మునిగిపోయినా కనీసం 50 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని బట్టి ప్రభుత్వ అలసత్వం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. దీంతో లక్షల మంది రోజుల తరబడి నీటిలో చిక్కుకుని విలవిల్లాడిపోయారు. వరద నుంచి బయటపడిన వారు చెట్టుకొకరు పుట్టకొకరుగా రైల్వే స్టేషన్, బస్టాండ్లు, కమ్యూనిటీ హాళ్లు, తెలిసిన వాళ్ల ఇళ్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మునిగిన లోతట్టు ప్రాంతాలకు నాలుగు రోజుల వరకు కనీసం ఆహారం, నీళ్లు కూడా ఇవ్వలేదు. విపత్తు నిర్వహణ మాన్యువల్లోని షెల్టర్ మేనేజ్మెంట్ను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించి లక్షలాది మందిని తీవ్ర అవస్థలకు గురి చేసింది. 60 మంది చనిపోతే ఎక్స్గ్రేషియా ఏదీ? విజయవాడ వరదల్లో లక్షలాది మంది చిక్కుకుంటే పునరావాసం కల్పించకపోగా తక్షణ సాయం అందించలేదు. తన దగ్గర డబ్బులు లేవని సీఎం చంద్రబాబు ముందే చేతులెత్తేశారు. 60 మంది చనిపోతే ఎక్స్గ్రేషియా గురించి పట్టించుకోలేదు. విపత్తుల సమయంలో ప్రాథమిక సూత్రాలను పాటించకుండా ప్రజలను వారి ఖర్మకు వదిలేసిన సీఎం చంద్రబాబు ప్రచారాన్ని మాత్రం ఆకాశమంత స్థాయిలో చేసుకున్నారు. అన్ని దశల్లోనూ విఫలమైనా తాను బాగా పని చేస్తున్నట్లు హడావుడి, హంగామా చేసి మభ్యపుచ్చేందుకు రకరకాల ఫీట్లు నిర్వహించారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారాలకు తెర తీశారు. వరదల్లోనూ చంద్రబాబు తన మార్కు రాజకీయాన్ని వదలకపోవడంతో లక్షలాది మంది ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. తక్షణ సాయం ఊసే లేదు.. జగన్ హయాంలో పక్కాగావిపత్తు బారిన పడిన వారిని పునరావాస కేంద్రాలకు తరలించి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు తక్షణ సాయం అందించాలి. అసలు కేంద్రాలే ఏర్పాటు చేయని కూటమి సర్కారు తక్షణ సాయం ఊసే లేకుండా చేసింది. వరదలు, తుపానులు వచ్చినప్పుడు వైఎస్ జగన్ హయాంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు బాధితులు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు ఆర్థిక సాయంగా రూ.2 వేలు చొప్పున పంపిణీ చేశారు. 2020లో కృష్ణా, గోదావరి వరదలు, 2023లో మిచాంగ్ తుపానుతోపాటు ప్రతి విపత్తులోనే ఇదే విధానాన్ని అనుసరించి బాధితులకు తక్షణ సాయం అందించారు. 2014కి ముందు తక్షణ సాయంగా రూ.వెయ్యి అరకొరగా ఇచ్చేవారు. వైఎస్ జగన్ హయాంలో దాన్ని రూ.2 వేలకు పెంచి బాధితులందరికీ అందేలా చర్యలు తీసుకున్నారు. -
రికార్డు స్థాయిలో కృష్ణమ్మ వరద
సాక్షి, నాగర్కర్నూల్: ఈసారి వానాకాలం సీజన్లో కృష్ణానదిలో రికార్డుస్థాయిలో వరద పోటెత్తింది. గడిచిన 50 రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన తుంగభద్ర, కృష్ణానదిలో పెరిగిన నీటి ప్రవాహంతో కేవ లం పదిరోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండింది. ఈ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో ఇప్పటివరకు 1,139 టీఎంసీల నీ రు శ్రీశైలం జలాశయానికి చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేయడంతో గత 50 రోజుల్లో 558 టీఎంసీల నీరు దిగువనున్న నాగార్జునసాగర్కు విడుదల చేశారు. గత రెండేళ్లలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి కూడా చేరుకోలేదు. ఈ సారి కృష్ణానదిలో భారీ స్థాయిలో వచ్చి న వరదలకు జూలై చివరకల్లా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరుకుంది. పది రోజుల్లోనే నిండిన ప్రాజెక్టు కృష్ణమ్మ పరవళ్లతో ఈసారి కేవలం పదిరోజుల వ్యవధిలోనే శ్రీశైలం ప్రాజెక్టు డెడ్స్టోరేజీ నుంచి ప్రాజెక్టు స్పిల్వే ద్వారా నీటిని విడుదల చేసే వరకు చేరింది. జూలై నెల ప్రారంభంలో నీరు లేక వెలవెలబోయిన ప్రాజెక్టు చివరికల్లా నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలకు జూలై 20 నాటికి కేవలం 35.629 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు జలాశయంలో నీటినిల్వ 812.30 అడుగులకు మాత్రమే పరిమితమైంది. అయితే తుంగభద్ర నదితో పాటు కృష్ణానదికి ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం పెరగడంతో అనూహ్యంగా పదిరోజుల వ్యవధిలోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. తొమ్మిది రోజుల్లోనే 179 టీఎంసీల నీరు ప్రాజెక్టులో వచ్చి చేరింది. దీంతో జూలై 30న అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. ఆగస్టు, సెపె్టంబర్లోనూ నిత్యం 1.50 లక్షల క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం కొనసాగడంతో ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు గేట్లను ఎత్తి స్పిల్వే ద్వారా నీటిని కిందకు వదిలారు. ఆగస్టు నెలలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో సుమారు 20 రోజుల పాటు ప్రాజెక్టు పదిగేట్లను ఎత్తి నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. పవర్హౌస్లో 17 మి.యూనిట్ల విద్యుదుత్పత్తిశ్రీశైలం ఎడమ గట్టున ఉన్న తెలంగాణ భూగర్భ జలవిద్యుత్ కేంద్రానికి నిత్యం 37 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా రోజుకు 17 నుంచి 18 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నుంచి భూగర్భ జలవిద్యుత్ కేంద్రానికి మొత్తం 152.74 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు కాగా, ప్రస్తుతం ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. గత జూలై 16 నుంచి భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించగా, నిత్యం 35 వేల క్యూసెక్కులకు పైగా నీటితో గరిష్ట స్థాయిలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు. -
ప్రస్తుతానికి రూ. 5,438 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో సంభవించిన నష్టం విలువ రూ.5,438 కోట్లుగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశామని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పూర్తిస్థాయి అంచనా ప్రక్రియ కొనసాగుతోందని, ఇంకా నష్టం లెక్కలు తీస్తున్నామని వివరించింది. ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు వేగంగా సాగేందుకు, బాధితులందరికీ సాయం అందేందుకు వీలుగా మార్గదర్శకాలను సులభతరం చేయాలని కోరింది.రాష్ట్రంలో వరదల ప్రభావాన్ని అంచనా వేసేందుకు కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం బుధవారం హైదరాబాద్కు వచ్చింది. తొలుత వరద నష్టంపై సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించింది. అనంతరం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయింది. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్రంలో వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు.వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు అందిన తర్వాత, తక్కువ సమయంలోనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని... వేగంగా తీసుకున్న చర్యలతో ప్రాణనష్టాన్ని తగ్గించగలిగామని సీఎస్ ఈ సందర్భంగా చెప్పారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు నిరంతరం పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. పునరావాస కార్యక్రమాల కోసం నిధులను వెంటనే విడుదల చేశామన్నారు. ప్రత్యేక బృందాల ఏర్పాటుకు సహకరించండి అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్తో సమానంగా రాష్ట్రంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని కేంద్ర బృందానికి సీఎస్ వివరించారు. ఈ బృందాలకు శిక్షణ, ఇతర సౌకర్యాల కల్పనలో కేంద్రం సహకరించాలని కోరారు. భారీ వర్షాల సమయంలో ఎయిర్ రెస్క్యూ ఆపరేషన్ల నిర్వహణకు సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో 332 హెక్టార్ల విస్తీర్ణంలో పెద్ద సంఖ్యలో చెట్లు కూలిపోయిన అంశాన్ని కేంద్ర బృందానికి వివరించారు. దీంతో చెట్లు కూలిన ఘటనకు మూలకారణాన్ని తెలుసుకునేందుకు సమగ్ర అధ్యయనం చేయాలని సీఎస్కు కేంద్ర బృందం సూచించింది. ఇక వరదల కారణంగా సంభవించిన నష్టాలు, ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని కేంద్ర బృందానికి రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరి్వంద్కుమార్ వివరించారు. సమావేశం అనంతరం క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకునేందుకు కేంద్ర బృందం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు వెళ్లింది. వరద నష్టంపై అమిత్ షాకు శివరాజ్సింగ్ ప్రాథమిక నివేదికసాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరద నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ అందించారు. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వరద ప్రభావిత జిల్లాల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో అమిత్ షాతో భేటీ అయి.. తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టానికి సంబంధించిన అంశాలను వివరించారు. అనంతరం ఈ వివరాలను ‘ఎక్స్’వేదికగా వెల్లడించారు. కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయి నివేదికను సమర్పిస్తాయని తెలిపారు. -
‘సాక్షి’లో చూసి సాయమందించాం
ఖమ్మం మయూరిసెంటర్: స్పందించే మనసుంటే ఎక్కడి వారికైనా సాయం చేయొచ్చని నిరూపించారు నిజామాబాద్ జిల్లా యువకులు. ఇటీవలి వరదలతో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వీరి కష్టా లపై ఈనెల 6న సాక్షిలో ‘భూమి రాళ్లపాలు.. బతుకు రోడ్డుపాలు’శీర్షికన ప్రచురితమైన కథనం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వన్నెల్ (కె) గ్రామ యువకులను కది లించింది. దీంతో వారు బాధితులను ఆదు కునేందుకు నడుం బిగించి రూ. లక్ష విరాళాలు సేకరించారు. ఖమ్మం్లలో పరిచ యం ఉన్న వారిని తోడ్కొని బుధవారం రాకాసితండాకు వచ్చారు. దీంతో యువకులు 77 కుటుంబాలకు 77 సీలింగ్ ఫ్యాన్లు కొనుగోలు చేసి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వన్నెల్ (కె) గ్రామ యువకులు అర్గుల శ్రీకాంత్, మచ్చేందర్, అనంతుల శ్రీను, డాక్టర్ సాయి, గజానంద్, జి.హనుమాను పాల్గొన్నారు. వైద్య విద్యార్థిని తేజశ్రీకి కూడా... ఈనెల 4న ‘సరి్టఫికెట్లు మున్నేరు పాలు’.. ‘చదువుల తల్లులకు ఎంత కష్టం’శీర్షికతో సాక్షి ప్రధాన సంచికలో వచి్చన కథనానికి దాతలు స్పందిస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్కు చెందిన మహిళలు స్థానిక కార్పొరేటర్ మోతారపు శ్రావణి ఆధ్వర్యంలో తేజశ్రీని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. హైమావతి ట్యాబ్ అందించగా, కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మహిళలు రూ.10 వేలు, కొల్లు జ్యోతి రూ.5 వేలు, పారిజాతం కమలం ప్రసాద్ రూ.5 వేలు అందజేశారు. తేజశ్రీ మాట్లాడుతూ అండగా నిలిచిన సాక్షికి, దాతలకు ధన్యవాదాలు చెప్పారు. సాక్షిలో చూసి చలించిపోయానురాకాసితండా పజలు పడిన ఇబ్బందులను సాక్షి పత్రిక లో చూశాను. వారికి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో మా కొంతమంది యువకులను సంప్రదించి, విరాళాలు సేకరించాం. ఖమ్మంలో ఉన్న మిత్రుల ద్వారా ప్రజలకు అందించాం. – అర్గుల శ్రీకాంత్ -
తెలుగు రాష్ట్రాలలోని వరద భాదిత కుటుంబాలకు 50 లక్షల రూపాయల రోటరీ సహాయం
తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు సాయం అందించేందుకు రోటరీ క్లబ్లు ముందుకు వచ్చాయి. తెలంగాణాలో ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాలు , ఆంధ్రప్రదేశ్ విజయవాడకు దిగువ తీరాన తెనాలి -రేపల్లె ఏరియాలో ఉన్న కొన్ని గ్రామాలలో పూర్తిగా నిరాశ్రయులైన కుటుంబాల సహాయార్ధం రోటరీ క్లబ్లు ముందుకు వచ్చాయని రోటరీ గవర్నర్ రోటేరియన్ శరత్ చౌదరి తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఈ వరద ప్రమాదం సంభవించిన వెంటనే గత ఐదు రోజులుగా ఖమ్మం, భద్రాచలం, గుంటూరు, ప్రకాశం, జిల్లాలోని రోటరీ క్లబ్లు అన్ని కలిసి 'ఆత్మబంధువు' అనే ప్రాజెక్ట్ పేరున దాదాపు 50 లక్షల రూపాయలు విలువ చేసే వంట సామాను కిట్స్ని ఖమ్మం జిల్లాల్లలోని గ్రామాల్లో 2500 మందికి, అలాగే తెనాలి-రేపల్లె ఏరియాలోని గ్రామాల్లో 1500 వరద బాధితులుకు అందజేశామని తెలిపారు. గత మూడు రోజులుగా ఖమ్మం రోటరీ క్లబ వారు మల్లాది వాసుదేవ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ప్యాకెట్లో 5 కేజీల రైస్ ప్యాకెట్, బొంబాయి రవ్వ, 1 లీటరు వంట నూనె, 1/2 కేజీ చింతపండు, కందిపప్పు, ఉల్లిపాయలు, ఇతర దినుసులను ఒక కుటుంబానికి సరిపోయేలా అందజేశామని తెలిపారు. అదేవిధంగా పిగురాళ్ల రోటరీ క్లబ్ వారు డాక్టర్ విష్ణు బాబు ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రాంతంలో పంచటానికి సుమారు 2500 కుటుంబాలకు వంట సామాను పాకెట్స్ని రెడీ చేస్తున్నట్లు తెలిపారు. ]అలాగే అన్ని చోట్ల రోటరియన్స్ ఎంతో శ్రమపడి వరద బాధిత కుటుంబాలని గుర్తించి నేరుగా వారికి సహాయం అందే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గత ఆదివారం సెప్టంబర్ 8న రేపల్లె ఏరియా గ్రామాలలో వంట సామను కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ విపత్తుపై స్పందించి ధన సహాయం, వస్తు సహాయం చేస్తున్న రోటరియన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు రోటరీ గవర్నర్ రోటేరియన్ శరత్ చౌదరి.(చదవండి: రండి వరద బాధితులను ఆదుకుందాం!) -
వరద బాధితుల కోసం వంగా గీత సాహసం
కాకినాడ, సాక్షి: వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేందుకు అధికారంలో ఉన్న నేతలంతా తటపటాయిస్తుంటే.. పిఠాపురం వైఎస్సార్సీపీ ఇంఛార్జి వంగా గీత (60) మాత్రం సాహసం ప్రదర్శించారు. వరద ఉధృతిని లెక్కచేయకుండా.. ట్రాక్టర్ ప్రయాణం చేసి బాధితుల దగ్గరకు చేరుకున్నారామె. బుధవారం వంగా గీత గోకువాడ, జమ్ములపల్లిలో రైతులు, ముంపు బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో.. ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలేరు వరద నీటిని ట్రాక్టర్పై దాటి వెళ్లారు. దాదాపు 10 కిలోమీటర్లపాటు ట్రాక్టర్పైనే ఆమె ప్రయాణం చేశారు. ఆమెతో పాటు కొందరు నేతలు వెంట వెళ్లారు. చివరకు.. ముంపు ప్రాంతాలకు చేరుకొని అక్కడి బాధితులను పరామర్శించారు. ‘‘గతంలో లేనంతా ఈసారి ఏలేరు వరద పిఠాపురాన్ని ముంచేసింది. వేలాది ఎకరాల వ్యవసాయ, ఉద్యానవన, సెరీ కల్చర్ పంటలు నీట మునిగాయి. అధికారులకు ప్రభుత్వానికి ముందస్తు అంచనా లేకపోవడం వల్లే ఏలేరు వరద ఉగ్రరూపం దాల్చింది. ఏలేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు 15 టీఎంసీలు ఉన్నప్పుడే మిగులు జలాలను క్రమక్రమంగా విడుదల చేసి ఉంటే ఇంత వరద ముప్పు ఉండేది కాదు. .. ఏలేరులో 6 టీఎంసీల నీరు ఉన్నప్పుడే సాగు నీటికి, విశాఖ అవసరాలకు నీటిని వినియోగించుకున్నాం. వరద బాధితుల వద్దకు వెళ్ళి భరోసా కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉంది. అధికారులను పంపించి ఆదుకోవాలి’ అని కోరారామె. ఎన్నికల ఫలితంలో సంబంధం లేకుండా.. తాను ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని వంగా గీత చెబుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఇంత సాహసం చేసి తమ దగ్గరకు పరామర్శకు వచ్చిన గీతకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారుపవన్, ఉదయ్లపై పిఠాపురం రైతుల ఫైర్ఏలేరు వరదలో తమ పంటలు గత నాలుగు రోజులుగా నీట మునిగాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్పై పిఠాపురం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ కనీసం మమ్మల్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే, ఎంపీ రాలేదు. పవన్ను గెలిపిస్తే పిఠాపురాన్ని ప్రపంచమంతా చూస్తుందని జబర్దస్త్ నటులు చెబితే ఆనందపడ్డాం. తీరా ఇప్పుడు ఏలేరు వరదలో పిఠాపురం నియోజకవర్గం మునిగిపోతే టీవీలలో ప్రపంచం చూస్తోంది. ఎకరాకు ఇప్పటి వరకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాం. వరద ముంపుతో పూర్తిగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోకపోతే కౌలు రైతులకు ఆహ్మహత్యే శరణ్యం’ అని పిఠాపురం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.చదవండి: తప్పు చేస్తున్నావ్ చంద్రబాబూ.. వైఎస్ జగన్ వార్నింగ్చదవండి: 'టీడీపీ ప్రభుత్వ అసమర్థతతోనే విజయవాడ వరద కష్టాలు' -
వరద బాధితులకు ప్రముఖ ఎన్నారై డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి భారీ విరాళం
-
కోనసీమలో వరద టెన్షన్
-
అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద బీభత్సం
-
పాడైన అన్నం పెడుతున్నారు.. బెజవాడను వెంటాడుతున్న వరద కష్టాలు..
-
విజయవాడ : పేద, మధ్య తరగతులకు వరద మిగిల్చిన నష్టం (ఫొటోలు)
-
మిగిలింది బురదే!
‘వరద నీళ్లు పోయాక వచ్చి చూస్తే మోకాటి లోతు బురద పేరుకుపోయి ఉంది.. ఇంట్లో, బయట కంపు కొడుతోంది.. కట్టుబట్టలతో మిగిలిపోయాం.. దాతలిచ్చింది తిని బతుకుతున్నాం.. మీరు (ఎన్యూమరేషన్ బృందం) ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం.. ఇదిగో చూడండి మా కష్టం, నష్టం.. అక్కడ బురదలో కూరుకుపోయి ఉన్నది పరుపు.. దాని కింద మంచం ఉంది.. ఇంకా దాని కింద పిల్లల పుస్తకాలున్నాయి.. ఆ పక్కనున్న బీరువాలో మా అందరి దుస్తులున్నాయి.. సర్టిఫికెట్లు కూడా అందులోనే పెట్టాం.. పది రోజులుగా నీళ్లలో నాని నాని అవన్నీ పేలికలుగా మారాయి.. అదిగో అది ఫ్రిజ్.. తీద్దామంటే డోర్ తెరుచుకోవడం లేదు.. ఇక్కడ కిచెన్లో ఏది ఏ వస్తువో తెలియడం లేదు. ఇదంతా కల అయితే బావుండనిపిస్తోంది’ అని నష్టం వివరాల నమోదు కోసం వచ్చిన బృందంఎదుట ఓ ఇల్లాలు కన్నీటి పర్యంతమైంది.సాక్షి, అమరావతి/పటమట/సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఒక్కో కుటుంబానిది ఒక్కో దీన గాథ. ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ. విజయవాడలో బుడమేరు వరద మిగిల్చిన విషాదం మాటలకందడం లేదని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కళ్లెదుటే పలు వస్తువులు నీట కొట్టుకుపోతుంటే అచేతనంగా చూస్తూ ఉండి పోయామని వాపోతున్నారు. కట్టు బట్టలతో బయట పడ్డామని, కంటి మీద కునుకు కరువైందని చెబుతున్నారు. వరద తమకు ఎంత నష్టాన్ని, కష్టాన్ని మిగిలి్చందో ఎన్యుమరేషన్ బృందాల ఎదుట కన్నీటి పర్యంతమై వివరిస్తున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపులో చిక్కుకున్న ప్రతి పేద కుటుంబం చితికిపోయింది. వారికి కన్నీరు తప్ప మిగిలిందంటూ ఏమీ లేదు. రోజువారీ పనులు చేసుకునే వారి ఇళ్లలో జరిగిన నష్టాన్ని చూస్తుంటే పగ వాడికైనా ఇంతటి కష్టం రాకూడదనిపిస్తుంది. ఇళ్లు మునిగి పోవడంతో వరద తగ్గే వరకు బంధువుల ఇళ్లలో, అక్కడక్కడా తల దాచుకున్న కుటుంబాల వారు.. ఇప్పుడు ఉంటున్న ఇంటికి వచ్చి చూసుకుని భోరున విలపిస్తున్నారు. ఇంట్లోని బట్టలు, మంచం, టీవీ, ఫ్రిజ్, వంట సామాన్లు, పుస్తకాలు, ఇతరత్రా పరికరాలన్నీ పనికి రాకుండా పోవడం ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోంది. ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే కుటుంబాలు కనీసం రూ.50 వేలకుపైగా నష్టపోయాయి. పది రోజులుగా పని లేక, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక, పిల్లలను ఎలా చదివించాలో.. మళ్లీ ఇంటిని ఎలా గట్టెక్కించాలో తెలియక ఆ ఇంటి యజమానులు పడే బాధ వర్ణణాతీతం. ఇంటింటికీ ప్రత్యేక బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి (ఎన్యుమరేషన్) ప్రభుత్వం నియమించిన ఉద్యోగుల బృందాలు వలంటీర్ల సహాయంతో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నాయి. ప్రభుత్వం రూపొందించి ఇచ్చిన ప్రత్యేక యాప్లో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లల్లో దెబ్బతిన్న ఎల్రక్టానిక్, మోటార్, ఇతర సాధారణ వస్తువుల గురించి నమోదు చేస్తున్నాయి. ఈ సందర్భంగా బాధితులు పది రోజులు పడిన కష్టం, వారికి జరిగిన నష్టం గురించి వివరిస్తున్నారు. ఏ ఇంటికి వెళ్లినా పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని చోట్ల ఇళ్ల వద్ద కనీసం నిలబడి మాట్లాడే అవకాశం కూడా లేదు. ఒక అంతస్తు ఉండే ఇళ్లలో ఉంటున్న ఒక్కో కుటుంబానికి కనీసంగా రూ.50 వేలు, గరిష్టంగా లక్షన్నరపైనే నష్టం కనిపిస్తోంది. మధ్యతరగతి కుటుంబాలకైతే రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకైతే రూ.10 లక్షల నుంచి అంతకు మించి నష్టం కనిపిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాలు 37 » నగరంలోని 20 కిలోమీటర్ల మేర 37 ప్రాంతాలను మూడు సర్కిళ్లుగా విభజించి అధికారులు వరద ప్రభావిత ప్రాంతాలుగా మ్యాపింగ్ చేశారు. » 32 డివిజన్లలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, విద్యుత్, వైద్య శాఖల నుంచి ఒక్కొక్కరుగా బృందం ఏర్పాటు చేశారు. అయితే రెవెన్యూ–మున్సిపల్–విద్యుత్ శాఖల మధ్య సమన్వయ లోపంతో అన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సర్వే జరగటం లేదు.» 1,487 మంది వార్డు వలంటీర్లు, వార్డు సచివాలయాల సిబ్బంది, ఏఎస్పీ క్యాడర్ పోలీస్ అధికారి, గ్రూప్–1 కేడర్ అధికారి, ఓ సీనియర్ ఐఏఏస్ అధికారి ఆధ్వర్యంలో సర్వే ప్రక్రియ సాగుతోంది. వాణిజ్య నష్టాన్ని అంచనా వేయటానికి ఏర్పాటైన 200 బృందాలు ఇప్పటి వరకు ఆ పనే ప్రారంభించలేదు.నేడు కేంద్ర బృందం పర్యటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన వరద తీవ్రత, నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం బుధ, గురువారాల్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని బృందం ఇప్పటికే విజయవాడకు చేరుకుంది. బుధవారం రెండు బృందాలుగా ఏర్పడి ఒక బృందం ఎనీ్టఆర్, కృష్ణా జిల్లాల్లో.. మరో బృందం గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించనుంది. కాగా, వరద ప్రభావిత జిల్లాల్లో ఇళ్లకు జరిగిన నష్టం లెక్కింపు బుధవారం సాయంత్రానికి పూర్తి కావాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి ఆయన వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయం, దాని అధారిత రంగాల నష్టం లెక్కింపు కూడా ఈ నెల 14వ తేదీకి పూర్తి కావాలని సూచించారు.రూ.వేల కోట్లలో నష్టం..ప్రభుత్వ శాఖలకు జరిగిన నష్టం రూ.6,800 కోట్లని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే దీనికి నాలుగైదు రెట్ల నష్టం సాధారణ ప్రజలకు జరిగినట్లు ఎన్యుమరేషన్ బృందాల ద్వారా స్పష్టమవుతోంది. విజయవాడ నగరం, రూరల్ ప్రాంతాల్లో 2.32 లక్షల ఇళ్లు మునిగి పోవడంతో నష్టం అపారంగా ఉంది. ఆ ఇళ్లల్లోని ఫరీ్నచర్, ఎల్రక్టానిక్, మోటార్ వాహనాలు, ఇతర వస్తువుల నష్టం భారీగా కనిపిస్తోంది. బయట పార్క్ చేసిన వాహనాలే సుమారు రెండు లక్షల వరకు ఉంటాయని అంచనా. అందులో లక్షన్నర ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. 30 వేలకుపైగా కార్లు, పది వేల వరకు ఆటోలున్నాయి. మిగిలినవి లారీలు, బస్సులు, ఇతర వాహనాలు ఉన్నాయి. వాటిలో సగానికిపైనే మరమ్మతులకు సైతం పనికిరాని విధంగా పాడైపోయాయి. ఇలా ఇళ్లకు జరిగిన నష్టమే ఊహకు అందని విధంగా ఉంది. ఇవిగాక 5 లక్షల ఎకరాలకుపైగా పంటలు దెబ్బ తిన్నాయి. ఆ నష్టం వ్యవసాయ రంగాన్ని కుదిపేసేలా ఉంది.భోజనం కోసం ఎదురు చూపు మా వీధిలోకి ఏడు అడుగులకుపైగా వరద నీళ్లు వచ్చాయి. కట్టుబట్టలతో నా ముగ్గురు పిల్లలు, భార్యతో కలిసి స్నేహితుడి మేడపైకి ఎక్కేశాం. నీళ్లు తగ్గుముఖం పట్టాయని ఇంటికి వచ్చి చూస్తే సర్వం నీళ్లలో నానిపోయాయి. మంచం, ఫ్రిజ్ పనికొచ్చే పరిస్థితి లేదు. పిల్లలు కట్టుకోవడానికి గుడ్డ పేలిక కూడా మిగల్లేదు. రాడ్ బెండింగ్ చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే నాకు మళ్లీ జీవితాన్ని ఎలా మొదలెట్టాలో తెలియట్లేదు. మావీధి అంతా మురుగు వాసన వస్తోంది. గతిలేక అలానే ఉంటున్నాం. – ఏలియా, వరద బాధితుడు, ఏవీఎస్ రోడ్డు, ప్రకాశ్నగర్ రూ.1.50 లక్షలు నష్టపోయాం మా జీవితం చిన్నది. జీవనోపాధి కోసం నూజివీడు నుంచి ఆరు నెలల కిందట ఇక్కడికి వచ్చి అద్దె ఇంటిలో కాలం వెళ్లదీస్తున్నాం. వరద దెబ్బకు జీవితం చిన్నాభిన్నం అయ్యింది. నా భర్త కాలేశ్వరరావు మార్కెట్లో చెప్పులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. స్టాక్ అంతా ఇంటిలోనే పెట్టారు. అంతా నీటి పాలైంది. మంచం, పురుపు దుర్వాసన రావడంతో బయట పడేశాం. ఫ్రిజ్, టీవీ, బియ్యం, దుస్తులు, పిల్లల పుస్తకాలతో సహా ఏమీ మిగల్లేదు. మరో వైపు స్టాకు అంతా దెబ్బతింది. రూ.1.50 లక్షల వరకు నష్టపోయాం. – సుమలత, వరద బాధితురాలు, పాయకాపురం» 32 డివిజన్ల పరిధిలోని మూడు సర్కిళ్లలో లక్షన్నరకు పైగా ఇళ్లకు నష్టం » ఒక్కో డివిజన్కు ఒక ఐఏఎస్ అధికారి ఇన్చార్జ్ » 32 డివిజన్ల పరిధిలో 1,700 సర్వే బృందాల ఏర్పాటు » ఒక్కో బృందం ద్వారా 50–100 ఇళ్లు సర్వే » ప్రతి బృందంలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, విద్యుత్, వైద్య సిబ్బంది » వీరికి తోడుగా సచివాలయ కార్యదర్శి, ఆ ప్రాంత వలంటీర్ » ప్రత్యేక యాప్లో మాత్రమే వివరాలు నమోదు » వాణిజ్య నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలు -
బెజవాడలో శాంతించి పల్లెలపై ప్రతాపం
(బుడమేరు పరీవాహక ప్రాంతం నుంచి సాక్షి ప్రతినిధి) : ‘బుడమేరు వరద ఉధృతి దిగువ ప్రాంతాల్లో ఉగ్రరూపం దాల్చింది. గ్రామాలకు ఆనుకుని ఉన్న పొలాలన్నీ మునిగిపోయి సముద్రాన్ని తలపిస్తున్నాయి. మన పక్క ఊరిలో మెయిన్ రోడ్డుపైకి నీరు వచ్చేసింది. మన ఊరికి అటూ ఇటూ కూడా రోడ్డు మునిగిపోయింది. చుట్టూ నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏ క్షణమైనా మన గ్రామాన్ని వరద నీరు ముంచెత్తవచ్చు. అందరూ అప్రమత్తంగా ఉండాలి..! ’’ బుడమేరు పరీవాహక గ్రామాల్లో పదకొండు రోజులుగా ఇలా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఎప్పుడు వరద విరుచుకుపడుతుందోననే భయంతో నిరంతరం కాపలా కాస్తున్నారు. బుడమేరు వరద ఉధృతితో గ్రామాల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇది. వరదలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో బెజవాడను ముంచెత్తిన బుడమేరు క్రమంగా శాంతిస్తున్నప్పటికీ పరీవాహక గ్రామాలను మాత్రం బేజారెత్తిస్తోంది. ఖమ్మం–కృష్ణా జిల్లాల నడుమ కొండల్లో మొదలయ్యే బుడమేరు వరద నీరంతా విజయవాడ నుంచి దిగువకు ప్రవహించి కొల్లేరులో కలిసే వరకు అనేక గ్రామాలను చుట్టేస్తోంది. దీంతో పలు గ్రామాలు పదకొండు రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాల్లో ప్రధాన రహదారులపైకి బుడమేరు వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. పదుల సంఖ్యలో గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి.ఉంగుటూరు మండలం తేలప్రోలు నుంచి గుడివాడ మండలం నందమూరు వెళ్లే ప్రధాన రహదారిపై బుడమేరు వరద నీటి ఉధృతి పదకొండు రోజులుగా తగ్గకపోవడంతో అటువైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా కంచె వేసి పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం రాత్రి పగలు గస్తీ కాస్తున్నారు. దీనివల్ల 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. అటువైపు వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో చుట్టూ తిరిగి వచ్చేందుకు అవస్థ పడుతున్నారు. గన్నవరం–పుట్టగుంట ప్రధాన రహదారిపై కొయ్యగూరపాడు రోడ్డు ఇరువైపులా మునిగిపోయింది. దీంతో గన్నవరం, నందివాడ మండలాల్లోని పది గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ శివారు ఎనికేపాడు నుంచి దోనేటుకూరు, నిడమానూరు సరిహద్దుల మీదుగా గూడవల్లి, ఉప్పులూరు, మంతెన, తరిగొప్పుల, ఉంగుటూరు, ఆముదాలపల్లి, కొయ్యగూరపాడు, పుట్టగుంట, అరిపిరాల, రామాపురం, కుదరవల్లి, ఇల్లపర్రు చివరకు ప్రవహించే బుడమేరు వెంకటలక్ష్మీ నరసింహపురం సమీపంలో కొల్లేరులో కలిసే వరకు పలు గ్రామాలను కలవరపెడుతోంది. ఊరి చుట్టూ నీళ్లు.. పదకొండు రోజులుగా బుడమేరు మా గ్రామాన్ని జల దిగ్బంధం చేసింది. ఊరి చుట్టూ వరద నీటి ఉధృతితో రోడ్లు మునిగిపోయాయి. దాదాపు 1,500 మందికిపైగా ఊరిలోనే ఉండిపోయాం. రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రిళ్లు కంటి మీద కునుకులేకుండా గడిపాం. ఇప్పుడిప్పుడే వరద దిగువకు వెళ్తుండటంతో గ్రామంలో నీళ్లు తగ్గుతున్నాయి. –జంజన వెంకటేశ్వరరావు, కొయ్యగూరపాడు గ్రామస్తుడుఎప్పుడూ చూడలేదు.. నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇంత వరద ఎప్పుడూ చూడలేదు. వరద చుట్టుముట్టడంతో పిల్లలు, పెద్దలు అంతా గ్రామంలోనే ఉండిపోయాం. పదకొండు రోజులుగా యువకులు వరద ప్రాంతాల్లో గస్తీ కాశారు. దాతల సహకారంతో రోజూ భోజనం సమకూర్చారు. –జుజ్జువరపు వెంకట్రావు, కొయ్యగూరపాడు -
కష్టాల ఊబిలో..
బెజవాడలో బుడమేరు వరద తగ్గింది. కానీ, ముంపు ప్రాంతాల్లోని ప్రజల కష్టాలు మాత్రం ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఏ వీధిలో చూసినా గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలు... ఇళ్లలో చేరిన బురద... పాడైపోయిన వస్తువులు... వాటిని శుభ్రం చేసుకుంటున్న జనం... ఇళ్ల ముందు కంపు కొడుతున్న మురుగు... మొరాయిస్తున్న వాహనాలు... సర్వం కోల్పోయి షాపులను చూసి విలపిస్తున్న చిరు వ్యాపారులు... చేతి వృత్తులవారు... ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర కష్టాల్లో మునిగిపోయారు. ముంపు ప్రాంతాల్లో ఎవరిని కదిలించినా లక్షల రూపాయలు నష్టపోయామని చెబుతున్నారు. కుటుంబమంతా 10 నుంచి 15 ఏళ్లుగా కష్టపడి పని చేస్తూ పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న వాహనాలు, టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్, మంచాలు వంటి వస్తువులన్నీ పాడైపోయాయని కన్నీరుపెడుతున్నారు. ఇప్పుడు కోల్పోయినవన్నీ మళ్లీ సమకూర్చుకోవాలంటే మరో 10 నుంచి 15 ఏళ్లు పడుతుందని కుమిలిపోతున్నారు.మరోవైపు ప్రభుత్వం ఆహారం, తాగునీరుపంపిణీ చేస్తున్నా... అవన్నీ దాదాపు మెయిన్ రోడ్లకే పరిమితమయ్యాయని, చిన్న చిన్న వీధుల్లో ఉన్న తమకు అందడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇళ్లను శుభ్రం చేసేందుకు సాయం అందిస్తున్న ఫైర్ సిబ్బంది సేవలు కూడా ప్రధాన వీధులకే పరిమితమయ్యాయని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అంటువ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.పాడి గేదెలను బలి తీసుకున్న వరద బుడమేరు వరద పశుపోషకులను నట్టేట ముంచింది. రూ. లక్షల విలువైన పశువులు వరదలో కొట్టుకుపోయి మృతిచెందాయి. దీంతో వాటిపై ఆధారపడినవారు అల్లాడిపోతున్నారు. సింగ్నగర్ లెనిన్ సెంటర్లో నివాసం ఉంటున్న వెల్లబోయిన నాగేశ్వరమ్మ, మల్లేశ్వరరావు దంపతులతోపాటు వారి కుమారుడు దుర్గాప్రసాద్, కుమార్తె రాజేశ్వరి కుటుంబాలు ఉమ్మడిగా ఉంటూ 9 గేదెలను పెంచుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. వారి 4 గేదెలు వరదలో కొట్టుకుపోయాయి. తాము చూస్తుండగానే గేదెలు కొట్టుకుపోయాయని, వాటి విలువ రూ.1.50లక్షలు ఉంటుందని నాగేశ్వరమ్మ కన్నీటిపర్యంతమయ్యారు.రైల్వేస్టేషన్.. బస్టాండ్లో బతికాంఈ వ్యక్తి పేరు ఉప్పు శ్రీను. విజయవాడ సింగ్నగర్లోని కృష్ణా హోటల్ సెంటర్లో నివాసం ఉంటున్నారు. తండ్రి ఇచ్చిన కొద్దిపాటి స్థలంలోనే పక్కపక్కన శ్రీను, అతని ఇద్దరు తమ్ముళ్లు ఇళ్లు నిర్మించుకుని తమ కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారు. శ్రీను ఆటో నడిపితే.. భార్య, ఇద్దరు పిల్లలు మట్టి పనులు చేసుకుని పైసాపైసా కూడబెట్టుకున్నారు. శ్రీను తమ్ముళ్లు కూడా మట్టి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. యథావిధిగా ఈ నెల ఒకటో తేదీ అందరూ పనికి వెళ్లగా, అకస్మాత్తుగా వారి ఇంటి చుట్టూ వరద వచ్చింది. ఇంట్లో ఉన్న మగ పిల్లలు శ్రీను తల్లిని, ఇతర కుటుంబ సభ్యులను పక్కింటి గోడ దూకించి సురక్షితంగా బయటకు చేర్చారు. కట్టుబట్టలతో కొంత మంది రైల్వేస్టేషన్, మరికొంత మంది బస్టాండ్లో వారానికిపైగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. దొరికింది తింటూ ఆకలి తీర్చుకున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో రెండు రోజుల కిందట తిరిగి ఇంటికి వచ్చి శుభ్రం చేసుకున్నారు. ఇప్పుడు ముగ్గురి ఇళ్లలోని మంచాలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు మొత్తం పాడైపోయాయి. కొత్త బైక్ కాస్తా నీటిలోని ఇంజిన్ సీజ్ అయిపోయింది. ఆటోకు, బైక్కు ఇన్సూరెన్స్ కోసం ఫోన్లు చేస్తుంటే కంపెనీల ప్రతినిధులు మళ్లీ ఫోన్ చేస్తామంటూ పెట్టేస్తున్నారని శ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఒక్క కుటుంబంలోనే రూ.4లక్షలకు పైగా నష్టం జరిగింది. ‘మేం మనుషులం మాత్రమే బతికున్నాం. సర్వస్వం కోల్పోయాం. వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండా బురదలో కొట్టుకుపోయాయి..’ అని శ్రీను కుటుంబ సభ్యులు విలపించారు.నీటి కొరతతో ఇబ్బందులు కండ్రిక, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, సింగ్నగర్, డాబాకొట్లు.. ఇలా అనేక ముంపు ప్రాంతాల్లో బాధితులను నీటి కొరత వెంటాడుతోంది. పది రోజులపాటు జలదిగ్భందంలో ఆయా ప్రాంతాలు ఉండటంతో మున్సిపల్ వాటర్ పైప్లైన్లోకి మురుగు నీరు చేరింది. దీంతో చాలాచోట్ల నీటి సరఫరా పునరుద్ధరించినప్పటికీ కుళాయిల ద్వారా వస్తున్న నీటిని వాడుకోలేకపోతున్నామని ప్రజలు తెలిపారు. మరికొన్ని చోట్ల నీటి సరఫరా ఇంకా పునరుద్ధరించలేదు. విద్యుత్ సరఫరా మొదలైనప్పటికీ ఇళ్లలోకి నీరు చేరడంతో మోటార్లు సైతం దెబ్బతిని భూగర్భ జలాలను వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. నీళ్ల కోసం ముంపు ప్రాంతాల ప్రజలు నేటికీ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు.ప్రధాన వీధులకే ఫైర్ ఇంజన్ పరిమితంనీట మునిగిన ఇళ్లను ఫైర్ ఇంజన్ల సాయంతో శుభ్రం చేస్తున్నామని పదేపదే ప్రభుత్వం చెబుతోంది. వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. సింగ్నగర్, ఉడా కాలనీ, వాంబేకాలనీ, కండ్రిక, జక్కంపూడి వైఎస్సార్ కాలనీతోపాటు చాలా ప్రాంతాల్లోని అనేక వీధుల్లో ఇప్పటి వరకు ఫైర్ ఇంజన్లు వచ్చి ఇళ్లు శుభ్రం చేసిన దాఖలాలు లేవు. కేవలం ప్రధాన వీధులకు మాత్రమే ఫైర్ ఇంజన్లు పరిమితమయ్యాయి. ఎక్కువ మంది ఇప్పటికీ రోడ్లపై ఉన్న మురుగు నీటితోనే ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు.దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరివరదల్లో కొట్టుకుని వచ్చిన చెత్తాచెదారంతో డ్రెయిన్లలో నీరు బయటకు వెళ్లడం లేదు. రాజీవ్నగర్, పాయకాపురం, ప్రకాష్నగర్, రాధానగర్, కండ్రిక, కృష్ణా హోటల్, డాబాకొట్లు సెంటర్, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, పాత, కొత్త రాజరాజేశ్వరీపేటలు... ఇలా అనేక ప్రాంతాల్లో రోడ్లపై చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇళ్ల మధ్యలో మురుగు నిలిచిపోయింది. ఆయా ప్రాంతాల ప్రజలు దుర్వాసనతో అల్లాడుతున్నారు.కట్టుకోవడానికి బట్టల్లేవు... పొయ్యి వెలగడం లేదులోతట్టు ప్రాంతాల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఇళ్లు వారం రోజులకు పైగానే నీట మునిగే ఉన్నాయి. ముంపు వీడాక ప్రజలకు అసలైన కష్టాలు మొదలయ్యాయి. చిరువ్యాపారులు, రోజువారీ కూలీలకు 10 రోజుల నుంచి ఉపాధి లేదు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేదు. బయట అప్పు కూడా పుట్టని దుస్థితి. కనీసం పాడైపోయిన గ్యాస్ స్టౌ రిపేరు చేయించుకోవడానికి డబ్బులు లేని దీనస్థితి అనేక కుటుంబాల్లో నెలకొంది. గ్యాస్ ఏజెన్సీలు ఉచితంగా సర్వీస్ క్యాంప్లు నిర్వహిస్తున్నాయి. కానీ, స్పేర్ పార్ట్లు కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటోంది. వరద నీరు ఇంట్లో చేరడంతో బీరువాలు, ర్యాక్లలోకి దుస్తులు వేసుకోవడానికి వీల్లేకుండా పాడైపోయాయి. ఈ నెల ఒకటో తేదీన కట్టుబట్టలతో ఇళ్లు వదిలిన అనేక మంది బాధితులు నేటికీ వాటితోనే కాలం వెళ్లదీస్తున్నారు.ట్యాంకర్ల చుట్టూ పరుగెత్తుతున్నాం..నీళ్ల కోసం చీటీలు రాయించుకోవాలా? ఆడవాళ్లంబిందెలు పట్టుకుని రోడ్డు చివరకు ఎలా వెళ్తాం. ఇన్నీ రోజులు వరద నీటిలో మగ్గిపోయాం. బాగాలేని నీళ్ల కోసం కూడా ట్యాంకర్ల చుట్టూ పరుగెత్తాల్సి వస్తోంది. ఇంట్లో టైలరింగ్ చేసుకుంటూ జీవిస్తున్నా. నా కుట్టుమిషన్ కూడా వరదలో పొయింది. సరుకు మొత్తం మునిగిపోయింది. నా భర్త వాచ్మెన్గా పని చేస్తారు. పది రోజులుగా ఇద్దరి ఉపాధి పోయింది. తిండికి గతిలేని పరిస్థితి. మా ఇంటిలో చిన్న పాప (మనవరాలు) ఉంది. కనీసం దానికి స్నానం చేయించడానికైనా నీళ్లు కావాలి. లేకుంటే పాపకు ఎక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందోనని భయమేస్తోంది. ఇప్పటి వరకు మాకు ప్రభుత్వం నుంచి ఎటుంటి సాయం అందలేదు. – కుమారి, జక్కంపూడి వైఎస్సార్ కాలనీమెకానిక్ షెడ్కు వెళ్లాలంటే గుబులువరద వస్తుందని ముందే తెలిసినప్పటికీ లోతట్టు ప్రాంత ప్రజలను ప్రభుత్వం కనీసం అప్రమత్తం చేసిన పాపాన పోలేదు. అలా చేసి ఉంటే ఇంట్లో వస్తువులు, బైక్లను అయినా సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకునే వాళ్లం అని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. లక్షల సంఖ్యలో బైక్లు, స్కూటీలు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుత రోజుల్లో ఇంటి నుంచి బయట అడుగు పెడితే బైక్ అనేది సర్వసాధారణం. అలాంటి బైక్ ముంపునకు గురై పనిచేయలేని దుస్థితిలో ఇంటి ముందే పడి ఉంది. దాన్ని మెకానిక్ షెడ్ వరకూ నెట్టుకుని వెళ్లి రిపేర్ చేయించడానికి ఎంత బిల్లు అవుతుందోనని భయపడుతున్నారు. ప్రస్తుత కష్టాల్లో అంత ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవని చాలా మంది అలాగే బైక్లను వదిలేశారు. 70 శాతం బైక్లకు ఇన్సూరెన్స్ ఉండదుఒకపక్క సీఎం చంద్రబాబు ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి పాడైపోయిన వాహనాలను రిపేర్ చేయించి పెడతామని పదే పదే ప్రకటిస్తున్నారు. అయితే పాడైపోయిన బైక్లలో ఎన్నింటికి ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంటుంది? అనే చర్చ బాధితుల్లో నడుస్తోంది. సాధారణంగా బైక్ను కొత్తగా కొనుగోలు చేసినప్పుడు మాత్రమే యజమానులు ఇన్సూరెన్స్ చేయిస్తారు. అనంతరం 70 శాతం మంది సమగ్ర ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయించరని వాహన, ఇన్సూరెన్స్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం ప్రకటనలతో తమకు మేలు జరగదని చాలామంది బైక్ యజమానులు వాపోతున్నారు.రక్తం పీలుస్తున్న దోమలుముంపు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన శానిటేషన్ పనులు చేపట్టాల్సి ఉంటుంది. లేదంటే దోమల వ్యాప్తి అధికమై డెంగీ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. కానీ ఆశించినంత వేగంగా ముంపు ప్రాంతాల్లో శానిటేషన్ పనులు సాగడం లేదు. మురుగు, చెత్త మేటలతో దోమల బెడద ఎక్కువగా ఉంటోంది. దోమల నియంత్రణకు ఫాగింగ్ కూడా సక్రమంగా చేయడంలేదని వరద బాధితులు చెబుతున్నారు. చీకటిపడితే చాలు దోమలు రక్తం పీల్చేస్తున్నాయని, ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్నామని, దోమ కాటుతో తమ ఆరోగ్యాలు కూడా గుల్ల అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దాతల కోసం ఎదురు చూపులు ముంపు ప్రాంతాల్లో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసినట్టు ప్రచారం చేస్తోంది. పది రోజులుగా జలదిగ్భందంలో ఉండి చేతిలో చిల్లిగవ్వలేని రోజువారీ కూలీలు, చేతివృత్తిదారులు కూరగాయలు కొనుగోలు చేయలేకపోతున్నారు. కొందరు అప్పు చేసి కూరగాయలు, సరుకులు కొనుగోలు చేస్తున్నారు. అప్పు పుట్టని వారు దాతలు పంపిణీ చేసే ఆహారం కోసం ప్రధాన రహదారుల వెంబడి గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.రాకపోకలకు అవస్థలే...అజిత్సింగ్నగర్ నుంచి కొత్త రాజరాజేశ్వరీపేట వైపు వచ్చేందుకు ఉన్న వంతెనపై గుర్రపు డెక్క, బురద పెద్ద పేరుకుపోయింది. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలు ఎక్కువగా నివాసం ఉంటున్న కొత్త రాజరాజేశ్వరీపేట ప్రాంత ప్రజలు ఎక్కువగా పని కోసం సింగ్నగర్ వెళుతుంటారు. అటువైపు నుంచి నగరంలోకి వస్తారు.దుర్వాసన భరించలేకపోతున్నాం..వరద తగ్గినా మురుగు సమస్య తీరలేదు. సైడు కాలువల్లో వరద ముందుకు పారకపోవడంతో దుర్వాసనవస్తోంది. ఆ వాసన భరించలేకపోతున్నాం. ఒకవైపు వరద నీటిలో ఇల్లు మునిగి వంట సామాన్లు, మంచాలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్, పిల్లల పుస్తకాలు అన్నీ తడిసి పాడైపోయి బాధపడుతుంటే.. మరోవైపు ఈ మురుగు సమస్య వేధిస్తోంది. వరద గురించి ముందుగా హెచ్చరించి ఉంటే అప్రమత్తమయ్యేవాళ్లం. పగలు వరద వచ్చింది కాబట్టి బతికాం. అదే రాత్రివేళ అయితే ఊహించడమే కష్టం. – ఎం.దేవకుమారి, మసీదు రోడ్డు, శాంతినగర్పుస్తకాలన్నీ నీటిలో నానిపోయాయి తెల్లవారుజామున అకస్మాత్తుగా ఇంట్లోకి వరద నీరు రావడంతో ఏం చేయాలో పాలుపోలేదు. నా పుస్తకాలతోపాటు ఇద్దరు చెల్లెళ్ల పుస్తకాలు, రికార్డులను ఇంట్లో నుంచి తీసుకువెళ్లడం సాధ్యం కాలేదు. పుస్తకాలన్నీ వరద నీటిలోనే నానిపోయాయి. వరద తగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చి చూస్తే అవి ఎందుకూ పనికి రాకుండాపోయాయి. స్కూలులో ఉన్నప్పుడు జగనన్న ఇచి్చన డిక్షనరీలు మా చదువులకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. అవి నీళ్లలో నాని చిరిగిపోవడంతో ఇప్పుడు డబ్బులు పెట్టి కొనే పరిస్థితి లేదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలనేది మా అక్కచెల్లెళ్ల లక్ష్యం. పుస్తకాలు మళ్లీ కొనాలంటే మా తల్లిదండ్రులకు ఇబ్బందే. – వర్ష, ఇంటర్ విద్యార్థిని, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, విజయవాడ -
ఉత్తరాంధ్ర ఉక్కిరి బిక్కిరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/ఎచ్చెర్ల క్యాంపస్/అనకాపల్లి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నదులు, వాగులు, చెరువులు, గెడ్డలు పొంగిపొర్లాయి. ఈ వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టినా.. ఇంకా నదులు, కాలువలు పొంగిపొర్లుతునే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో పరివాహక ప్రాంతాల్లోని వాగులు, ఏర్లు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల చెరువులు దెబ్బతిన్నాయి. అనేకచోట్ల గండ్లు పడ్డాయి. ఫలితంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏడువేల ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. ఈ జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తివేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో కాకినాడ జిల్లా ఏలేరు పరీవాహక ప్రాంతం రైతుల కొంప ముంచింది. విజయనగరం జిల్లాలో మాత్రం ఈ వర్షాలు మేలు చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఆయా జిల్లాల్లో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నష్టం..భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నీట మునిగినట్లు సమాచారం. కానీ, వాస్తవ పరిస్థితులు చూస్తుంటే మూడువేల హెక్టార్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కె.కొత్తూరు, గార, రాగోలు వంటి ప్రాంతాల్లో కూరగాయల పంటలు సుమారు 78 ఎకరాల్లో నీటమునిగింది. జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరోవైపు.. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు.. రహదారులు దెబ్బతిన్నాయి. నాలుగు కల్వర్టులు కొట్టుకుపోయాయి. పొలాల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలు కొన్నిచోట్ల పాక్షికంగా నీటమునిగి ఉండగా మరికొన్నిచోట్ల పూర్తిగా మునిగిపోయాయి. విజయనగరం జిల్లాలో..విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కొన్నిచోట్ల నష్టం కలిగించినా వ్యవసాయానికి ఎంతో మేలు చేశాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలకు విజయనగరం జిల్లాలో సుమారు 513 హెక్టార్లలో వరి పొలాలు నీటమునిగాయి. స్వల్పంగా 6.2 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతింది. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 66 హెక్టార్లలో ఉద్యాన తోటలు నేలకొరిగాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 ఇళ్లు శిథిలమవగా.. 8 పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెల్లిగడ్డపై కల్వర్టు దెబ్బతినగా.. బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిలోని కాజ్వే కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. నాగావళి, చంపావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో 70 స్తంభాలు నేలకొరిగాయి. 26 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ మంగళవారం పునరుద్ధరించారు. తాటిపూడి, వట్టిగెడ్డ, మడ్డువలస, తోటపల్లి రిజర్వాయర్లు నిండిపోవడంతో దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. \అనకాపల్లి జిల్లాలో ఏడువేల ఎకరాలు..అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 7 వేల ఎకరాలు నీట మునిగినట్లు తెలుస్తోంది. వీటిలో 6 వేల ఎకరాల్లో వరి పంట, మరో ఒక వెయ్యి ఎకరాల్లో చెరకు, మొక్కజొన్న, పత్తి, ఉద్యానవన, ఇతర పంటలు నీట మునిగాయి. వ్యవసాయ అధికారుల ఇచ్చిన నివేదిక ప్రకారం.. అనకాపల్లి జిల్లాలో 1,528 హెక్టార్ల వరి పంట నీట మునిగింది. జిల్లాలో 40 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 4 పూర్తిగా, 36 పాక్షికంగా దెబ్బతిన్నాయి. 48 విద్యుత్ పోల్స్కు నష్టం వాటిల్లింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని తాండవ, కోనాం, కళ్యాణపులోవ రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో సోమవారం గేట్లు ఎత్తివేశారు. తాండవ రిజర్వాయర్ మినహా మిగతా రిజర్వాయర్లలో ఇన్ఫ్లో అదుపులోనే ఉంది. ‘కోనసీమ’ను ముంచేస్తున్న వర్షాలు.. వరదలుఅధిక వర్షాలు, వరుసగా మూడుసార్లు వరదలతో జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలు, పరిశ్రమలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు తొలి నుంచి అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మొత్తం వరి ఆయకట్టు 1.90 లక్షల ఎకరాలు కాగా అధికారులు 1.63 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేశారు. జూలై వర్షాలు, వరదలకు సుమారు 3 వేల ఎకరాల్లో వరిచేలు దెబ్బతిన్నాయి. తాజాగా వరదలకు ముమ్మిడివరం మండలం అయినాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి.ఇవి కాకుండా లంక గ్రామాల్లో 5,996.30 ఎకరాల్లో అరటి, కురపాదులు, బొప్పాయి, తమలపాకు, పువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, జిల్లాలో 1,800 వరకు ఇటుక బట్టీలున్నాయి. ఇటీవల వర్షాలు, వరదల కారణంగా.. రోజుకు 30 లక్షల ఇటుక తయారుచేయాల్సి ఉండగా, సగటున 12 లక్షల కూడా జరగడంలేదు. మరోవైపు.. కొబ్బరి పీచు పరిశ్రమల్లో కూడా సగం ఉత్పత్తి మించి జరగడంలేదు. కోనసీమ జిల్లాలో 400 వరకు చిన్నా, పెద్ద పరిశ్రమలున్నాయి. వర్షాలవల్ల డొక్క తడిచిపోవడంతో పీచు చేసే పరిస్థితి లేదు. అలాగే పీచు తడిసిపోవడంవల్ల తాడు తయారీ... క్వాయరు పిత్ బ్రిక్ తయారీ ఆగిపోతుంది.ముందుచూపులేకే ఏలేరు ముంచింది..ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో ఏలేరు పరీవాహక ప్రాంత రైతుల కొంప ముంచింది. ఊళ్లకు ఊళ్లు, వేలాది ఎకరాల్లో వరి, ఇతర వాణిజ్య పంటలు నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలున్నా ప్రభుత్వం ఏలేరు రిజర్వాయర్లో నీటి నిల్వలను నియంత్రించడంలో ఘోర వైఫల్యం ఏలేరు ముంపునకు కారణమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా కాకినాడ జిల్లాలో జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని నియోజకవర్గాలలో సుమారు 67 వేల ఎకరాలు సాగవుతుంటాయి. ఈ ప్రాజెక్టు నుంచి మిగులు జలాలు విడుదల చేసిన ప్రతి సందర్భంలో దిగువన పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి.పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో గట్లకు గండిపడి గ్రామాలపైకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. ఉగ్రరూపం దాల్చిన ఏలేరు, సుద్దగడ్డలతో పిఠాపురం నియోజకవర్గంలోని కాలనీలు, రోడ్లు పూర్తిగా నీటి మునిగాయి. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా పెరిగిన వరద నీటితో పంట భూములు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు కాలనీలు ముంపులోనే ఉన్నాయి. 216 జాతీయ రహదారిలో గొల్లప్రోలు టోల్ప్లాజా వద్ద వరద నీరు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.చచ్చినా ఇళ్లు ఖాళీ చేయం చింతూరులో వరదనీటిలోనే బాధితుల ఆందోళనచింతూరు: ఏటా వరదలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తేనే ఇళ్లను ఖాళీచేస్తామని లేదంటే వరద నీటిలోనే చచ్చిపోతామంటూ అల్లూరి జిల్లా చింతూరుకు చెందిన వరద బాధితులు తమ ఇళ్లను ఖాళీచేయకుండా వరదనీటిలో ఆందోళన చేపట్టారు. శబరి నది ఉధృతికి మంగళవారం చింతూరులో వరద పెరగడంతో శబరి ఒడ్డు ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి వెంటనే ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని గ్రామస్తులకు సూచించారు.దీనిపై ఆగ్రహించిన బాధితులు ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు ఇళ్లను వరద ముంచెత్తిందన్నారు. వరద అంతకంతకూ పెరుగుతుండడం, బాధితులు ఇళ్లను ఖాళీచేసేందుకు ససేమిరా అనడంతో చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వభరత్, రంపచోడవరం సబ్కలెక్టర్ కల్పశ్రీ వెళ్లి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాము కష్టపడి సంపాదించిన సొమ్ము వరద పాలవుతోందని, ఇక తాము ఈ కష్టాలు పడలేమని స్పష్టంచేశారు. దీంతో.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారు హమీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించి ఇళ్లను ఖాళీచేసి పునరావాస కేంద్రాలకు వెళ్లారు.బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలివరద ముంపులో ఉన్న బాధితులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. ఏటా వస్తున్న వరద నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణకు పటిష్టమైన ఏర్పాట్లుచేయాలి. ప్రజలు ఇబ్బందులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలి.– వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎంపీ, కాకినారైతాంగాన్ని నట్టేట ముంచిన వరద..పభుత్వం, అధికారుల నిర్లక్ష్యంవల్లే ఏలేరు వరద ఉధృతి రైతులను నట్టేట ముంచింది. ఏలేరు ప్రాజెక్టులో 24 టీఎంసీల నీరుచేరే వరకు నీటిని నిల్వ ఉంచడం దారుణం. 19 టీఎంసీలు ఉన్నప్పుడే అధికారులు మెల్లమెల్లగా నీటిని విడుదల చేసి ఉంటే ఇంత ఉధృతి ఉత్పన్నమయ్యేది కాదు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి – గంథం శ్రీను, రైతు, మర్లావ, పెద్దాపురం మండలంబీర పంట పోయింది..రెండు ఎకరాల్లో బీర పంట సాగుచేశాను. గత జూలై వరదలకు పంట మొత్తం దెబ్బతింది. అప్పటికే ఎకరాకు రూ.40 వేల చొప్పున రూ.80 వేలు పెట్టుబడిగా పెట్టాను. పదకొండు రోజులు వరద నీరు ఉండడంతో పంట అంతా కుళ్లిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – ధూళిపూడి రామకృష్ణ, సలాదివారిపాలెం, ముమ్మిడివరం మండలం, కోనసీమ జిల్లా -
నిండా మునిగిన పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం
-
స్వామి ఉన్నచోటనే నిమజ్జనం అవుతామన్నాయి!
-
సీఎం వచ్చినా నో చేంజ్.. వరద బాధితుల ఆగ్రహం..
-
కార్మికులను పట్టించుకునేవారే లేరా?
పటమట (విజయవాడ తూర్పు): ఊరు కాని ఊరు.. రోజూ 18 గంటలు పారిశుద్ధ్య పని.. ఉండటానికి సరైన వసతి లేదు.. రోడ్ల పక్కనే జీవనం.. అన్నం పెట్టే వారు లేరు.. స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే భోజనంతోనే కడుపు నింపుకోవడం.. ఇదీ విజయవాడలో వరద అనంతర పారిశుద్ధ్య పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇతర జిల్లాల నుంచి తెప్పించిన కార్మికుల దుస్థితి. మహిళా కార్మికులకు కూడ సరైన వసతి, సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో గంటల తరబడి మురుగు, చెత్తా చెదారంలో పనిచేస్తున్నా కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇప్పటికే 40 మందికి పైగా కార్మికులు అనారోగ్యం బారిన పడ్డారు. అయినా అధికారులు వారి సంరక్షణ గురించి ఆలోచించడమే లేదు. బుడమేరు వరదకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 7 డివిజన్లు, సెంట్రల్ డివిజన్లోని 13, పశ్చిమ నియోజకవర్గంలోని 12 డివిజన్లు మునిగిపోయాయి. ఆ ప్రాంతాల్లోని ఇళ్లు, రోడ్లు, వీధుల్లో పేరుకుపోయిన వందల టన్నుల వ్యర్థాలను తొలగించటానికి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల నుంచి 6,800 మంది పారిశుద్ధ్య కార్మికులను పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ తీసుకొచ్చింది. వీరంతా తొమ్మిది రోజులుగా రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. వారితో రోజూ 18 గంటలు పని చేయిస్తున్నారు. వీరికి సరైన వసతి కల్పించలేదు. దీంతో వారంతా రోడ్ల వెంబడి, షాపుల వద్ద గూడు ఏర్పాటు చేసుకుంటున్నారు.ఓవైపు వర్షం, మరోవైపు చలిలో కనీస నిద్ర కూడా లేక కార్మికులు తల్లడిల్లుతున్నారు. మురుగులో పని చేసే వీరికి చెప్పులు, చెత్త ఎత్తే కనీస పరికరాలు కూడా ఇవ్వడంలేదు. సరైన ఆహారాన్ని అందించడం లేదు. ఇదేమని అడిగితే సూపర్వైజర్లు కసురుకుంటున్నారు. దీంతో స్వచ్చంద సంస్థలు ఏర్పాటు చేస్తున్న ఆహార శిబిరాల వద్ద ఆకలి తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి, కర్నూలు, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన 40 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారికి వైద్యం చేయించకుండానే అధికారులు వారిని స్వస్థలాలకు పంపించారు.మమ్మల్ని పట్టించుకోవటం లేదురేయింబవళ్లు పనిచేస్తున్నాం. ఇళ్ల నుంచి వచ్చే చెత్తనంతా ట్రాక్టర్లు, లారీల్లో ఎత్తుతున్నాం. బురద నీరు శరీరమంతా పడుతుంది. దురదలు వస్తున్నాయి. కాళ్లు పాశాయి. మా సమస్యలను చెప్పుకుందామంటే అధికారులు వినే పరిస్థితి లేదు. ఎంతసేపైనా పని చేయాలని ఆదేశిస్తున్నారే కానీ మా సమస్యలను పట్టించుకోవటంలేదు. మా ఆరోగ్యం, కుటుంబాల గురించి కూడా పట్టించుకోవాలి.– శేఖర్, ఆదోని మున్సిపాలిటీ కార్మికుడు -
మరమ్మతుల ఖర్చూ ముంచుతోంది
బుడమేరు వరద ధాటికి విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు వారం రోజులకు పైగా నీటిలోనే ఉన్నాయి. భారీ వర్షాలు, కృష్ణా నదిలో భారీ ప్రవాహం, బుడమేరు వరద.. ఇలా అన్ని వైపులా నీరు చుట్టుముట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లల్లో విలువైన వస్తువులతోపాటు ద్విచక్రవాహనాలు, కార్లు సైతం నీట మునిగాయి. దీంతో అవి పూర్తిగా పాడయ్యాయి. –లబ్బీపేట (విజయవాడ తూర్పు)/మధురానగర్ (విజయవాడ సెంట్రల్)ఒక్కో వాహనానికి రూ.వేలల్లో ఖర్చుఇప్పటికే వరదలతో తమ సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులు ఇప్పుడు తమ వాహనాల మరమ్మతులకు కూడా భారీగా వెచ్చించాల్సి రావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక్కో ద్విచక్ర వాహనం మరమ్మతులకు మెకానిక్లు రూ.5 వేలు నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. చేతిలో వాహనం లేకపోతే అనేక పనులు ఆగిపోతాయి కాబట్టి అప్పోసొప్పో చేసి బాగు చేయించక తప్పడంలేదని వాహనదారులు వాపోతున్నారు. విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్లు సెంటర్, పైపుల రోడ్డు, ఆంధ్రప్రభ కాలనీ రోడ్డుల్లోని మెకానిక్ల వద్ద రిపేర్లు కోసం పెద్ద సంఖ్యలో బైక్లు స్కూటర్లు బారులు తీరాయి.కొన్ని వాహనాల ఇంజన్లు పాడైపోవడంతో పూర్తిగా స్తంభించిపోయి కనీసం నడపడానికి కూడా వీలు కావడం లేదు. ఒక్క సింగ్నగర్లోనే 25 నుంచి 30 వేలకు పైగా ద్విచక్రవాహనాలు పాడయ్యాయని అంచనా. మరోవైపు కార్లను కూడా రిపేర్లు కోసం రికవరీ వెహికల్స్తో షెడ్లకు తరలిస్తున్నారు. సింగ్నగర్ ప్రాంతంలో సోమవారం ఎక్కడ చూసినా కార్లు తరలించే దృశ్యాలే కనిపించాయి. మా వాహనాలన్నీ మునిగిపోయాయి..నాకు, మా పిల్లలకు మూడు ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు ఉన్నాయి. అన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. రిపేరు కోసం తీసుకెళ్తే రూ.7 వేలు నుంచి రూ.10 వేలు అవుతుందని మెకానిక్లు చెబుతున్నారు. ఆటోలకు ఎంత అవుతుందో తెలియడం లేదు. అంత ఖర్చు ఎలా భరించాలో అర్థం కావడం లేదు. – ఎస్కే కరీముల్లా, సింగ్నగర్జీవనోపాధి పోయింది.. బుడమేరు వరద ఉధృతికి నా టాటా ఏస్ నీట మునిగింది. దీంతో జీవనోపాధి కోల్పోయాను. వాహనం ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉంది. మరమ్మతులు చేయించాలంటే కనీసం రూ. 70 వేలు అవుతుందని అంటున్నారు. వరద వల్ల అన్నీ కోల్పోయిన నేను ఇప్పుడు అంత డబ్బులు ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదు. – గౌస్, బాధితుడు -
సాయం పెంచండి.. ఖమ్మం ముంపు బాధితుల విజ్ఞప్తి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మున్నేరు ముంపు నష్టం లెక్క కట్టలేని స్థాయిలో ఉందని.. కానీ ప్రభుత్వం ఇస్తామంటున్న సాయం సరిపోయేలా లేదని వరద బాధితులు వాపోతున్నారు. నిత్యావసరాలు, దుస్తుల నుంచి ఎలక్ట్రానిక్ సామగ్రిదాకా ఏదీ మిగల్లేదని.. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ పనికి వెళ్తే తప్ప పూటగడవని పరిస్థితుల్లో ఉన్న తమ బతుకులు గాడిన పడాలంటే సర్కారు ఆర్థిక సాయాన్ని మరింత పెంచాలని కోరుతున్నారు. వరద ముంపునకు గురై ఎనిమిది రోజులు దాటినా ఇంకా ఎలాంటి సాయం అందలేదని వాపోతున్నారు.సాయం కోసం ఎదురుచూస్తూనే..మున్నేరు ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా కొలిక్కిరాలేదు. ఇళ్లను, మిగిలిన సామగ్రిని శుభ్రం చేసుకునేందుకే బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎవరైనా వచ్చి ఏదైనా సాయం అందిస్తారా అంటూ ఎదురుచూస్తున్నారు. మున్నేరు, ఆకేరు ఇతర వాగులకు వచ్చిన వరదతో ఖమ్మం జిల్లాలో 15,201 ఇళ్లు నీట మునగగా.. 70 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. ఎవరిని కదిలించినా.. సర్వం కోల్పోయి, మళ్లీ మొదటి నుంచి జీవితం ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఇళ్లలోని ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్, టీవీ, మిక్సర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, మంచాలు, టేబుల్స్, నిత్యావసరాలు అన్నీ పాడైపోయాయని అంటున్నారు. ఏళ్లకేళ్లుగా కూడబెట్టుకుని సమకూర్చుకున్న సామగ్రి అంతా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూ.16,500 సాయం అందిస్తే, తాత్కాలిక ఉపశమనమే ఉంటుందని.. ఇక తమ బతుకులు గాడినపడేది ఎలాగని వాపోతున్నారు.పొలాల పరిహారమూ పెంచాలి..వరదల వల్ల సాగుకోసం చేసిన పెట్టుబడులు పూర్తిగా నష్టపోయామని.. ఇప్పుడు మళ్లీ పెట్టుబడులు అవసరమని రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు ఇస్తామన్న పరిహారాన్ని పెంచాలని కోరుతున్నారు. ముఖ్యంగా కొన్నిచోట్ల పొలాల్లో ఇసుక మేటలు, రాళ్లు చేరాయని.. వాటిని తొలగించాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుందని అంటున్నారు. అలాంటప్పుడు పరిహారం ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు.పాలేరు వరదతో ఆరు ఎకరాల్లో వరి కొట్టుకుపోయింది. పొలం కోతకు గురై ఇసుక మేట వేసింది. కరెంటు మోటార్లు, స్తంభాలు కూడా కొట్టుకుపోయాయి. రూ.4 లక్షలకుపైనే నష్టం జరిగింది. ప్రభుత్వం ఇస్తామన్న పరిహారంతో ఇవన్నీ సరిచేసుకునేదెట్లాగో తెలియడం లేదు.– బీరెల్లి సుధాకర్రెడ్డి, మల్లాయిగూడెం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లాఈ సాయం సరిపోదు..ఖమ్మం ధంసలాపురానికి చెందిన నిడిగుండ నరేశ్–ఈశ్వరమ్మలకు ఇద్దరు పిల్లలు. రోజూ పనికి వెళ్తేనే కుటుంబం గడిచేది. మున్నేరు వరదతో ఇంటి పునాది కోతకు గురై గోడలు పడిపోయాయి. ఇంట్లోని టీవీ, ఫ్రిడ్జ్, కూలర్, గ్యాస్ సిలిండర్ అన్నీ కొట్టుకుపోయాయి. ప్రభుత్వం ఇస్తామంటున్న ఆర్థిక సాయంతో కోలుకునేది ఎలాగని నరేశ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం దయ చూపితేనే..ఖమ్మం మోతీనగర్కు చెందిన కస్తూరి సంతోష–రమేశ్ కూలి పనులు వెళ్లి జీవిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. మున్నేటి వరదతో ఇంటి ప్రహరీ కూలిపోగా, తలుపులు ఊడిపోయి సామగ్రి కొట్టుకుపోయింది. ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదని.. తమపై ప్రభుత్వం దయచూపితేనే కోలుకుంటామని వారు వాపోతున్నారు.ఆదుకుంటేనే మనుగడఖమ్మం వెంకటేశ్వర నగర్కు చెందిన వెంకటేశ్వర్లు తోపుడు బండిపై కూరగాయలు అమ్మడంతోపాటు చిన్న కిరాణాషాపు నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు. మున్నేటి వరదతో ఇంట్లో సామాన్లతోపాటు కిరాణా షాపులోని సామగ్రి అంతా కొట్టుకుపోయాయి. «అధికారులు వచ్చి పేర్లు రాసుకెళ్లినా ఇంకా ప్రభుత్వ సాయం అందలేదని.. సర్వం కోల్పోయిన తాము సాధారణ స్థితికి వచ్చేలా ప్రభుత్వమే ఆదుకోవాలని వెంకటేశ్వర్లు కోరుతున్నాడు. -
వరద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవలి వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. వరదలతో ప్రభావితమైన ప్రతి కుటుంబానికి రూ. 16,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాలు ఇటీవలి వర్షాలకు ప్రభావితం అయ్యాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు సాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల ప్రభావంపై సోమవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్ శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్లతోపాటు మున్సిపల్, వ్యవసాయం, పంచాయతీరాజ్, విద్యుత్, విద్య, రహదారులు, భవనాలు, హౌసింగ్, ఇరిగేషన్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. సమీక్షలో వరద నష్టాన్ని అంచనా వేయడంతోపాటు దాన్ని పూడ్చుకునేందుకు ఎన్ని నిధులు కావాలన్న దానిపై చర్చించారు. వరదలు, నష్టంపై కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలపై మంత్రి పొంగులేటి అధికారులకు పలు సూచనలు చేశారు. వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సాయం అందించాలని ఆదేశించారు. బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మానవతా దృక్పథంతో సాయం పెంపు సమీక్షలో అధికారులు మాట్లాడుతూ.. వరదల కారణంగా ఖమ్మం జిల్లాలో ఆరుగురు, కొత్తగూడెంలో ఐదుగురు, ములుగులో నలుగురు, కామారెడ్డి, వనపర్తిలలో ముగ్గురి చొప్పున చనిపోయారని మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయంతోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా, పాక్షికంగా కూలిపోయిన ఇళ్లను గుర్తించి.. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. వరదలతో ప్రభావితమైన ప్రతి కుటుంబానికి రూ.16,500 చొప్పున సాయం అందించాలని.. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నేరుగా బాధితుల ఖాతాల్లోనే జమ చేయాలని ఆదేశించారు. తొలుత రూ.10 వేల ఆర్థిక సాయం అనుకున్నప్పటికీ.. మానవతా దృక్పథంతో దాన్ని రూ.16,500కు పెంచామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వరద ముంపునకు గురైన పంట భూములకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఇక మైనింగ్ వ్యర్థాలను ప్రభుత్వ భూముల్లో వేయడం వల్ల వరద వెళ్లక సూర్యాపేట, పాలేరులకు భారీగా నష్టం జరిగిందని అధికారులు సమీక్షలో మంత్రికి వివరించారు. దీంతో ఆ నష్టాన్ని మైనింగ్ ఏజెన్సీల నుంచే వసూలు చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సూచించారు. శాశ్వత మరమ్మతులు చేపట్టండి సమీక్షలో భాగంగా అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయని, దాదాపు 2 లక్షల మంది ప్రభావితమయ్యారని వివరించారు. 158 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, 13,494 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. వర్షాలు, వరదలతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు వేల కిలోమీటర్ల పొడవునా దెబ్బతిన్నాయని అధికారులు వివరించగా.. వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రోడ్లను పునరుద్ధరించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. శాశ్వత మరమ్మతులకు అవసరమైన కార్యాచరణను రెండు రోజుల్లో తయారు చేయాలని సూచించారు. పెద్ద, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులను కూడా వేగంగా చేపట్టాలన్నారు. అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, పీహెచ్సీలు ఏ మేరకు దెబ్బతిన్నాయనే వివరాలను సేకరించాలని సూచించారు. ఇక వర్షాలు, వరదల కారణంగా ఇండ్లలోకి నీరు చేరి.. ఇంటి పత్రాలు, ఆస్తి పత్రాలు, కుటుంబ సభ్యుల ఆధార్, రేషన్కార్డులు, విద్యార్థుల సర్టిఫికెట్లు తడిచిపోయాయని, కొన్నిచోట్ల కొట్టుకుపోయాయని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి... డాక్యుమెంట్లు పోయిన బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, వీలైనంత త్వరగా వారికి డూప్లికేట్ పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ఉసురు తీసిన ముసురు
చేతిలో కొడవలి.. నెత్తిన కండువా.. ముఖంలో ఆందోళనతో 9 మంది కూలీలు ఏ చేలోనైనా చిన్న పని దొరుకుతుందేమోనన్న ఆశతో సోమవారం కృష్ణా జిల్లా చోడవరం–పెనమలూరు రోడ్డు పక్కనున్న పొలాల వైపు ఆశగా చూస్తూ వెళ్తున్నారు. ఎటు చూసినా వర్షాలు, వరదలకు దెబ్బ తిన్న పొలాలే కనిపిస్తున్నాయి. రైతే దెబ్బ తిన్నాక కూలీలకు పనిచ్చేదెవరు? ఆ కూలీల కుటుంబాల కడుపు నింపేదెవరు? ఆ ఆవేదనే వారి మాటల్లో ప్రతిధ్వనించింది. పది రోజులుగా పని లేదని, ఇంటిల్లిపాదీ ఆకలితో ఆలమటిస్తున్నామని వారు ‘సాక్షి’ ప్రతినిధి వద్ద బోరుమన్నారు. ఎడతెరిపిలేని వర్షాలు ఉపాధిని దెబ్బతీశాయని, ప్రభుత్వమూ ఆదుకోవడంలేదని, ఎన్నెన్నో అవస్థలు పడుతున్నామని వివరించారు. దాదాపు ఐదు వేల జనాభా కలిగిన చోడవరం గ్రామంలో 750 మంది వ్యవసాయ కూలీలు, 60 మంది భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక, చేతిలో డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. వీరే కాదు.. రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు, వరదలకు లక్షలాది బడుగు జీవులు బతుకుదెరువు కోల్పోయారు. పనుల్లేక ఇంటికే పరిమితమైన వ్యవసాయ కూలీలు.. ఇసుక లేక, వర్షాలతో భవన నిర్మాణ కార్మికుల అవస్థలు.. మగ్గం గుంటల్లోకి నీరు చేరి నేతన్నల అగచాట్లు.. తాటి చెట్లు తడిసిపోయి దెబ్బతిన్న గీత కార్మికులు.. పల్లె కన్నీరు పెడుతున్న తీరుపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇది..పది లక్షల మందికి పనుల్లేవువిజయవాడలో వరదలతోపాటు గుంటూరు, బాపట్ల, ఎనీ్టఆర్, కృష్ణా, ఏలూరు, పశి్చమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు వ్యవసాయ కార్మికుల ఉపాధిని తీవ్రంగా దెబ్బతీశాయి. వరి, అరటి, మొక్కజొన్న, చెరకు, ప్రత్తి, మిర్చి, పసుపు, కంద పంటలు, ఆక్వా కల్చర్ç పనులపై ఆధారపడిన లక్షలాది వ్యవసాయ కార్మికులు రోజువారీ పనులను కోల్పోయారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1.10 కోట్ల మంది వ్యవసాయ కార్మికులున్నారు. వారిలో 10 లక్షల మందికిపైగా కార్మికులు వర్షాల వల్ల పనుల్లేక పస్తులుంటున్నారు. రోజూ ఇంటిల్లిపాదీ పనిచేస్తే కానీ గడవని ఈ కుటుంబాల్లో ఇప్పుడు ఒక్కరికి కూడ పని దొరకడంలేదు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ కూలీల ఉపాధి దెబ్బతింది. పది రోజులుగా పనుల్లేక అవస్థలు పడుతున్న ప్రతి కుటుంబానికి తక్షణమే రూ. 10 వేలు సాయం అందించాలని, అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గీత వృత్తికి చేటురాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 2 లక్షలకుపైగా కుటుంబాలు కల్లు గీత వృత్తిపై ఆధారపడ్డాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు తడిసిపోయిన తాటి చెట్లు ఎక్కేందుకు వీలు కాకపోవడంతో గీత వృత్తి నిలిచిపోయింది. వేలాది గీత కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరందరినీ ప్రభుత్వమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహామూర్తి డిమాండ్ చేశారు.భవన నిర్మాణ రంగం కుదేలుకూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం అస్తవ్యస్థంగా మారడంతో భవన నిర్మాణ రంగం దెబ్బ తింది. దీనికితోడు ఇప్పుడొచి్చన వర్షాలు, వరదలకు ఇసుక రీచ్లలో తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో భవన నిర్మాణ రంగం మరింతగా కుదేలైంది. రాష్ట్రంలో ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న 31 లక్షల మందికిపైగా కార్మికుల జీవనాన్ని దెబ్బతీసింది. విజయవాడలో వరద తాకిడికి అతలాకుతలమైన ప్రాంతాల్లోనే 20 వేల మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు కట్టుబట్టలతో మిగిలి, ఆహారం కోసం అలమటిస్తున్నారు.నేతన్న అగచాట్లు.. వర్షాలు, వరదలకు చేనేత కుటుంబాలూ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రాష్ట్రంలో సుమారు 1.60 లక్షల మగ్గాలు ఉన్నట్టు అంచనా. పది రోజులుగా పడుతున్న వర్షాలకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని నేత మగ్గాల కుంటల్లోకి నీరు చేరింది. దీంతో చేనేత కార్మికుల జీవనం స్తంభించింది. వేలాది నేతన్నల కుటుంబాలు అవస్థల పాలయ్యాయి.శ్రీకాకుళం నుంచి వలసొచ్చాం కొన్నేళ్ల క్రితమే 450 కుటుంబాల వాళ్లం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వలసొచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటున్నాయి. ఎక్కడ కూలి పని ఉంటే అక్కడకు వెళ్తుంటాం. నేను కూడా శ్రీకాకుళం జిల్లా నుంచే వచ్చాను. మేస్త్రీగా పది మందిని పనులకు తీసుకెళ్తున్నాను. వర్షాల వల్ల పది రోజులుగా పనుల్లేవు. మా కుటుంబాలన్నీ తిండి లేక అవస్థలు పడుతున్నాయి. – వడ్డేపల్లి భాస్కరరావు, మేస్త్రీకూలికెళితేనే రోజు గడిచేది వ్యవసాయ పనులకు వెళితేనే మాకు రోజు గడిచేది. ఉదయం 6 గంటలకు పనులకు వెళ్లి మధ్యాహా్నం 1గంటకు వస్తాం. రోజు కూలీ రూ.450 ఇస్తారు. ఇంటి అద్దె నెలకు రూ.4 వేలు చెల్లించాలి. ఇద్దరు ఆడ పిల్లలు. నేను, నా భార్య ఇద్దరం కష్టపడితేనే మాకు నెల భారంగా గడుస్తుంది. అలాంటిది పది రోజులుగా పనుల్లేకఅవస్థలు పడుతున్నాం. – మడల సీతారామయ్య, చోడవరంవర్షాలతో మగ్గం నేతకు ఇబ్బందులే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చేనేత మగ్గాల కుంటల్లో వర్షం నీరు చేరి చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మగ్గాల కుంటల్లో నీరు చేరితో దాన్ని బయటకు తోడి ఆరిన తర్వాతే మళ్లీ పని మొదలు పెట్టాలి. ఇందుకు 15 నుంచి 20 రోజులు పడుతుంది. ఇన్ని రోజులూ చేనేత కార్మికులు పస్తులుండాల్సిందే. మగ్గం కుంటల్లో నీరు చేరి కొందరు, పడుగు తడిసి పాడైపోయి మరికొందరు, నేత నూలు మొత్తబడిపోయి ఇంకొందరు నేత నేసేందుకు అవకాశం లేక ఉపాధి కోల్పోయారు. – పిల్లలమర్రి బాలకృష్ణ, చేనేత నాయకుడు -
కృష్ణా, గోదావరిలో వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా, గోదావరిలలో వరద కూడా తగ్గుతోంది. ఒడిశా, ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలకు వంశధార, నాగావళి.. వాటి ఉప నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి సోమవారం రాత్రి 7 గంటలకు 3.48 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టా కాలువలకు రెండు వేల క్యూసెక్కులను వదులుతున్న అధికారులు మిగులుగా ఉన్న 3.46 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. అలాగే, శ్రీశైలంలోకి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గింది. జూరాల, సుంకేశుల బ్యారేజీ నుంచి శ్రీశైలంలోకి 2.37 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 2.14 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 206.5365 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 883.40 అడుగులకు చేరుకుంది. అలాగే, నాగార్జునసాగర్, పులిచింతలలోకి.. వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 588.30 అడుగుల వద్ద ఉండగా ఇది 306.9878 టీఎంసీలకు సమానం. కృష్ణాకు వరద తగ్గుముఖం పడుతున్నప్పటికీ కృష్ణాజిల్లాలోని తీరప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఇక గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 3.79 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అదే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఒడిశా, ఉత్తరాంధ్రలో కురిసిన వర్షాల ప్రభావంతో వంశధార, నాగావళి పోటాపోటీగా ప్రవహిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఏలేరు వరద ఉధృతి పెరిగింది. ఏలేరు రిజర్వాయర్లోకి 46,405 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 23.23 టీఎంసీలకు చేరుకుంది. దీంతో రిజర్వాయర్ గేట్లు ఎత్తి 25,275 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ఫలితంగా కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో పంటలు నీటమునిగాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంపా, తాండవ, సుబ్బారెడ్డిసాగర్తో పాటు ఏలేరు దానికి అనుబంధంగా సుద్దగడ్డ, దబ్బకాలువ, గొర్రికండి వంటి వాగులు, ఏరులు పోటెత్తాయి. గట్లకు గండ్లు పడి పలు గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తదితరులు సోమవారం గొల్లప్రోలు ముంపు ప్రాంతంలో పర్యటించారు. పెద్దాపురం మండలం కాండ్రకోటలో దబ్బ కాలువపై ఏలేరు ఉ«ధృతికి వంతెన కొట్టుకుపోయింది. మరోవైపు.. ఏలేరు వరద ముంచెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ కృష్ణతేజ సోమవారం నాగులాపల్లి పర్యటనలో సూచించారు.అల్లూరి జిల్లాలో వర్ష భీభత్సం..అల్లూరి జిల్లాలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా గిరిశిఖర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన గెడ్డలు, వాగులలో వరద ఉధృతి ప్రమాదకరంగా ఉండడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జోలాపుట్టు, డుడుమ, సీలేరులోని గుంటవాడ, డొంకరాయి జలాశయాలకు వరద నీరు పోటెత్తడంతో దిగువకు భారీగా నీటిని విడిచి పెడుతున్నారు. చింతపల్లి నుంచి సిలేరు వరకు విస్తరించి ఉన్న అంతర్రాష్ట్ర రహదారిలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.వరద ముంపులో ‘మాచ్ఖండ్’ జల విద్యుత్కేంద్రంఇక ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలోకి వరద నీరు చేరింది. డుడుమ, జోలాపుట్టు జలాశయాల నుంచి 85 క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా విడుదల చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో 2వ నంబర్ నుంచి సోమవారం విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. నీటికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రాజెక్టు మనుగడకే ముప్పు అని భావించిన అధికారులు విద్యుత్ ఉత్పాదనను నిలిపివేశారు. ప్రస్తుతం బ్యాక్ ఫీడింగ్ ద్వారా మూడు క్యాంపులకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. -
Vijayawada Floods: ముంచింది ప్రభుత్వమే
సర్వం కోల్పోయాంఏడాది కిందటే సింగ్నగర్ తోట వారి వీధిలో ఇల్లు అద్దెకు తీసుకుని మారాం. గత ఆదివారం ఉదయం ఒక్కసారిగా వచ్చిన వరదకు ఇంట్లో సామాన్లు అన్ని పాడయ్యాయి. పదేళ్లుగా సంపాదించిన వస్తువులన్నీ పనికి రాకుండా పోయాయి. మా అమ్మాయి, అబ్బాయి సర్టిఫికెట్లు తడిసి ముద్దయ్యాయి. కొన్ని నీటిలో కొట్టుకుపోయాయి. వరద వస్తుందని ముందుగా చెబితే వీలైనంతవరకు జాగ్రత్త పడేవాళ్లం. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సర్వం కోల్పోయాం.– రాధాకృష్ణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగి, తోటవారి వీధి, సింగ్నగర్అజిత్సింగ్ నగర్ ఫ్లైఓవర్పై రిక్షాలో సామాన్లు తరలిస్తున్న గుండు కృష్ణ ఓ ఆటో డ్రైవర్. మరి ఇంటి సామాన్లు రిక్షాలో ఎందుకు తీసుకువెళుతున్నారనే కదా మీ సందేహం? విజయవాడలోని కండ్రికలో నివసించే కృష్ణ, ఆయన సోదరుడు ఫైనాన్స్లో తీసుకున్న రెండు ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. బుడమేరు వరద ముంచెత్తడంతో రెండు ఆటోలు వరదలో పూర్తిగా మునిగి దెబ్బతిన్నాయి. ఆటోకు నెలకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.20 వేలు ఫైనాన్స్ కంపెనీకి కిస్తీ చెల్లించాలి. ఆటోలను బాగు చేయించాలంటే ఆటోకు రూ.లక్ష చొప్పున మొత్తం రెండు లక్షలు అవుతుందంటున్నారు. ఇన్సూరెన్స్ రాదని చెప్పారు. ఇంట్లో వంట సామాన్లు, ఫ్రిజ్, గ్యాస్ స్టౌ, పిల్లల పుస్తకాలు, ఫర్నిచర్ అన్నీ దెబ్బతిన్నాయి. మళ్లీ అవి కొనాలంటే రూ.50 వేల దాకా ఖర్చవుతుంది. వంట దినుసులైతే తడిసి ముద్దయి ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఇంట్లో కరెంటు వైరింగ్ దెబ్బతింది. ఇల్లు కూడా మరమ్మతులకు గురైంది. ఇవన్నీ బాగు చేయించుకోవాలంటే కనీసం మరో రూ.లక్ష అవుతుంది. ఆటో నడిపి రోజూ రూ.వెయ్యి దాకా సంపాదించేవారు. ఇప్పుడు సంపాదన లేదు. వరద తగ్గాక ఆటోలు బాగు చేయించుకుని రోడ్డెక్కితేనే మళ్లీ ఉపాధి లభించేది! అదెన్ని రోజులు పడుతుందో తెలియదు. కనీసం నెల రోజుల పాటు ఉపాధికి దూరం కానున్నాడు. మరోవైపు ఫైనాన్స్ కంపెనీకి కిస్తీలు కట్టాలి. ఇలా కృష్ణ కుటుంబానికి దాదాపు రూ.నాలుగు లక్షల దాకా నష్టం వాటిల్లింది. కేవలం వరద వస్తుందని ప్రభుత్వం ముందుగా చెప్పకపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా అంత నష్టపోయింది. అదే ప్రభుత్వం అప్రమత్తం చేసి ఉంటే కనీసం ఇంట్లో ముఖ్యమైన సామాన్లు, పిల్లల పుస్తకాలు, మరికొన్ని వస్తువులను రెండు ఆటోల్లో తరలించి ఈ గండం నుంచి గట్టెక్కేవాళ్లమని కృష్ణ ఆక్రోశిస్తున్నాడు. – లబ్బీపేట (విజయవాడ తూర్పు)సింగ్నగర్ డాబా కొట్ల జంక్షన్లో రెండంతస్తుల ఇల్లు నిర్మించుకున్న వ్యాపారి కె.నాగేశ్వరరావును పలకరించగానే ఆయన ఆవేదన కట్టలు తెంచుకుంది. ‘ఆదివారం ఉదయం హఠాత్తుగా వరద నీరు ముంచెత్తడంతో మొదటి అంతస్తుకు చేరి ప్రాణాలు దక్కించుకున్నాం. ఇంటి ముందున్న మూడు కార్లు వరద నీటిలో మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంట్లోకి నీళ్లొచ్చి సామాన్లు అన్నీ తడిసిపోయాయి. మా అల్లుడు రూ.5 వేలు డబ్బులిచ్చి సోమవారం ఉదయం పడవ తేవడంతో ప్రాణాలతో బయటపడ్డాం. ఆరు రోజులుగా ఓ హోటల్లో ఉంటున్నాం. మా కుటుంబానికి రూ.25 లక్షలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం మాకు ఏం సాయం చేస్తుంది..? వరద వస్తుందని మాకు ముందుగానే చెప్పి ఉంటే ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకునేవాళ్లం. ప్రభుత్వం ప్రజల పట్ల కనీస బాధ్యతతో వ్యవహరించలేదు’ అని నిర్వేదం వ్యక్తం చేశాడు. సోమవారం వరద ముంపులోనే విజయవాడలోని కండ్రిక నిర్లక్ష్యం ఖరీదు.. 60 నిండుప్రాణాలువిజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో దాదాపు 1.45 లక్షల కుటుంబాల దుస్థితికి ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏకంగా 7 లక్షల మంది వరద కష్టాలివి! బుడమేరుకు భారీ వరద వస్తోందని తెలిసి కూడా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా.. సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా ప్రభుత్వం అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన ఫలితం ఇదీ. ఇందుకు సామాన్యులు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికి దాదాపు 60 నిండు ప్రాణాలు బలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారమే 1.45 లక్షల కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరదలు ముంచెత్తిన వారం రోజుల తరువాత కూడా ఏకంగా 7 లక్షల మంది వరద ముంపులోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఇక 1.45 లక్షల కుటుంబాలకు కలిగిన నష్టం ఎంతన్నది అంచనాలకే అందడం లేదన్నది కఠోర వాస్తవం. లక్షల ఇళ్లు వరదకు దెబ్బతిన్నాయి. వాటిని బాగు చేయించుకునేందుకు భారీగా ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది. వరదకు ఇళ్లల్లో వంట సామాగ్రి వరదలో కొట్టుకుపోయింది. గ్యాస్ స్టౌ, వంట సామాన్లు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులు దెబ్బతిన్నాయి. లక్షలాది ఇళ్లల్లో పిల్లల పుస్తకా>లు, సర్టిఫికెట్లు తడిసిపోయాయి. ఎంతోమంది సర్టిఫికెట్లు, బ్యాంకు పుస్తకాలు, దస్తావేజులు వరదల్లో కొట్టుకుపోయాయి. లక్షల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, సరుకు రవాణా వాహనాలు, ఇతర వాహనాలు వారం రోజులుగా వరద ముంపులోనే ఉండటంతో బురద పేరుకుపోయి ఎందుకు పనికిరాకుండా పోయాయి. ప్రకృతి వైపరీత్యంతో దెబ్బతిన్న ఆ వాహనాలకు బీమా వర్తిందని బీమా కంపెనీలు ఇప్పటికే తేల్చి చెప్పేశాయి. ‘మా పెంకుటిల్లు వరదకు మునిగిపోయింది. వరద తగ్గిన తరువాత కరెంట్ వైరింగ్ పూర్తిగా మార్పించుకోవాలి. లేదంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. వైరింగ్కు కనీసం రూ.50 వేలు అవుతుంది’అని రాజీవ్నగర్కు చెందిన లక్ష్మీ నారాయణ తన కష్టాలను చెప్పుకొచ్చారు. ఇక రోజు కూలీలు, కార్మికులకు ఇప్పటికే వారం రోజులుగా ఉపాధి లేదు. మరో 15 రోజుల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాంతో సంపాదన లేక ...చేతిలో డబ్బులు లేక పేదలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సగటున ఒక్కో కుటుంబానికి కనీసం రూ.3 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులే వ్యాఖ్యానిస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. సగటు అంచనాల ప్రకారం 1.45 లక్షల కుటుంబాలకు రూ.10 వేల కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందన్నది ప్రాథమిక అంచనా.చంద్రబాబుకే పునరావాసంఏకంగా 7 లక్షల మందిని వరదకు వదిలేసిన ప్రభుత్వం సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబానికి మాత్రం పునరావాసం కల్పించింది. నది గర్భంలో నిర్మించిన చంద్రబాబు కరకట్ట బంగ్లాను వరద ముంచెత్తనుందనే హెచ్చరికలతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆ ఇంటిని కాపాడేందుకు కనీసం అప్రమత్తం చేయకుండా వెలగలేరు రెగ్యులేటర్ వద్ద గేట్లు అర్థరాత్రి దాటాక హఠాత్తుగా ఎత్తేశారు. అంతకుముందే చంద్రబాబు కుటుంబం హుటాహుటిన బంగ్లాను ఖాళీ చేసేసింది. చంద్రబాబు స్వయంగా విజయవాడ కలెక్టరేట్కు మకాం మార్చారు. అన్ని సౌకర్యాలతో కూడిన తన వాహనాన్ని అక్కడే పార్క్ చేయించుకున్నారు. వారం రోజులుగా అన్ని సౌకర్యాలతో అక్కడే ఉంటున్నారు. ఇక లోకేశ్ కూడా విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు షిఫ్ట్ అయ్యారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నివాసానికి తరలి వెళ్లిపోయారు. వరదలతో ఏమాత్రం ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు కుటుంబాన్ని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించిందన్నది స్పష్టమవుతోంది.బొండా ఉమా బిస్కట్ ప్యాకెట్లిచ్చి వెళ్లిపోయారు..‘కండిగ్రలో ఓ అపార్ట్మెంటులో వాచ్మేన్గా పని చేస్తున్నా. గ్రౌండ్ ఫ్లోర్ చిన్న గదిలో మా కుటుంబం ఉంటోంది. కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నా. ఆదివారం ఉదయం హఠాత్తుగా వరద ముంచెత్తింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మా గది వరదలో మునిగిపోయింది. ఇంట్లో సామాన్లు అన్నీ కొట్టుకుపోయాయి. కనీసం వంటపాత్రలు కూడా లేవు. మా కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. ఎక్కడ తలదాచుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఆ వీధిలో తెలిసిన వారి డాబా మీద ఉండమని ఆశ్రయం ఇవ్వడంతో ప్రస్తుతం అక్కడ తలదాచుకుంటున్నాం. ఎమ్మెల్యే బొండా ఉమా రూ.5 బిస్కట్ ప్యాకెట్లు పంచి వెళ్లిపోయారు. వాటితో కడుపు నింపుకోవాలా? ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. దిక్కుతోచని స్థితిలో ఉన్నాం’ – వెంకటరావు, వాచ్మేన్, కండ్రిక -
కాల‘నీళ్లు’!
సాయం చేసే దిక్కు లేదు..నా జీవనోపాధి పోయింది. స్కూల్ దగ్గర ట్రామ్పోలిన్ జంపింగ్ ద్వారా రోజంతా కష్టపడితే రూ.300 వస్తాయి. వాటితోనే నేను, నా భర్త పొట్ట పోసుకుంటున్నాం. ఇప్పుడు వరదలో ట్రామ్పోలిన్ కొట్టుకుపోయింది. పది రోజుల నుంచి తినడానికి తిండి లేదు. సాయం చేసే దిక్కులేదు. – కళావతి, వైఎస్సార్ జక్కంపూడి కాలనీప్రాంతం: వైఎస్సార్ జక్కంపూడి కాలనీ అపార్ట్మెంట్ బ్లాకులు: 250కిపైగా (ఒక్కో బ్లాక్లో 32 ప్లాట్లు) జనాభా: సుమారు 50 వేలు వరద పరిస్థితి: బురద నీళ్లు, చెత్త ఇళ్ల పరిస్థితి: డ్రైనేజీ నీళ్లతోనే ఇంటిలోని బురదను శుభ్రం చేసుకుంటున్న బాధితులు డ్రోన్లతో ఆహారం: ఒక్క డ్రోన్తో కూడా ఆహారం అందించిన దాఖలా లేదు హెలికాఫ్టర్లతో ఆహారం: బాధితులు చేరుకోలేని ప్రదేశాలు, వాటర్ ట్యాంకులపైనే అరకొరగా ఆహార పొట్లాలు పడేశారు. ఫైరింజన్లతో ఇళ్లు శుభ్రం: కాలనీలో ఫైరింజన్ గంట సౌండ్ కూడా వినిపించట్లేదు. పారిశుధ్యం: రోడ్లపై వరదలో కొట్టుకొచి్చన చెత్త మేటలు వేసింది. ఒక్కరైనా పారిశుధ్య సిబ్బంది కనిపించలేదు. తాగునీరు: ప్రతి ఇంటిలోనూ తాగునీటికి కటకటేవరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధివిజయవాడలోని వరద ప్రభావిత కాలనీల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఆహారం, తాగునీరు సరఫరా చేశామని, ఫైరింజన్ల ద్వారా ఇళ్లను శుభ్రం చేసేశామని ఆర్భాటంగా ప్రకటిస్తున్నా వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పది రోజుల తర్వాత కూడా బాధితులు ఆకలి, దప్పికలు తీర్చుకోవడానికి రోడ్లపైకి సంచులతో పరుగులు తీస్తున్నారు. ఇళ్లలో చేరిన బురద, చెత్తను శుభ్రం చేసుకోవడానికి బకెట్టు నీళ్లు దొరక్క.. రోడ్డుపై డ్రెయిన్ల నుంచి పొంగిన మురుగు నీటినే వినియోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కారి్మకులను రప్పించి రోడ్లను అద్దాల్లా తీర్చిదిద్దినట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా కాలనీల్లో చెత్త మేటలు పేరుకుపోయాయి. డ్రెయిన్ల నుంచి పొంగిన మురుగు నీటితో దుర్గంధం ముక్కుపుటాలను అదరగొడుతోంది. ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. విజయవాడ శివారులోని వైఎస్సార్ జక్కంపూడి కాలనీ దుస్థితి ప్రజలు పడుతున్న అవస్థలకు అద్దం పడుతోంది. సోమవారం ‘సాక్షి’ బృందం వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో పర్యటించినప్పుడు కాలనీ వాసులు కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో సుమారు 250కిపైగా బ్లాకుల్లో దాదాపు 50 వేల మంది జీవిస్తున్నారు. రోజూ కూలికి పోతే కానీ ఐదు వేళ్లు నోటికి పోని పరిస్థితుల్లో ఉన్నవారిని బుడమేరు వరద మరింత దుర్భర స్థితిలోకి నెట్టేసింది. ప్రభుత్వం ముందస్తు వరద హెచ్చరికలు చేసినా తమదారి తాము చూసుకునే వాళ్లమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులు దాటాక వరద తగ్గిందని తెలుసుకున్నాకే సీఎం చంద్రబాబు ఆదివారం ఈ ప్రాంతంలో చుట్టపుచూపుగా వచి్చపోయారని బాధితులు మండిపడ్డారు. సీఎం వచ్చి వెళ్లాక కూడా ఇక్కడి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో పరిస్థితి మాత్రమే కాదు.. కండ్రిక, పాయకాపురం, ఉడా కాలనీ, వాంబే కాలనీ, కొత్త, పాత ఆర్ఆర్పేట, పైపుల రోడ్డుతో సహా ముంపు ప్రాంతాలన్నింటిలో దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ప్రచార కండూతి తప్ప ఫైరింజన్లు ఎక్కడ? ఓవైపు ముంపునకు గురైన ఇళ్లను ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేయిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట ఉండే కొన్ని ఇళ్లకు మాత్రమే ఫైర్ ఇంజన్ల ద్వారా నీళ్లు కొట్టి ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయించుకుంటున్నారు. చంద్రబాబుది కేవలం ప్రచార కండూతి.. చేసే చేతల్లో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని జక్కంపూడి కాలనీలోని పరిస్థితులు అద్దం పట్టాయి. గత పది రోజులుగా వరద నీరు, బురద, చెత్తాచెదారం చేరి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇళ్లలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో కాలనీలో రోడ్లపై ఉన్న మురుగు నీటిని బకెట్లలోకి తోడుకుని మహిళలు ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు. అదేంటి మురికి నీళ్లతోనే ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు? ప్రభుత్వం ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేయిస్తామని చెబుతోందిగా అని స్థానికులను ప్రశి్నంచగా.. ‘ఇంట్లో వారం నుంచి వాడుకోవడానికి చుక్క నీళ్లు లేవు. ఫైర్ ఇంజన్లు వచ్చి ఇళ్లు కడగటం ఒక్కటే తక్కువైంది మా బతుకులకు’ అని ప్రభుత్వంపై బాధితులు మండిపడ్డారు. డ్రోన్ ఎగిరిందీ లేదు.. ఆహారం అందిందీ లేదు.. ముంపు ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగు నీరు సరఫరా చేసేశాం.. అందరి ఆకలి తీర్చేశామని రోజు మీడియా సమావేశాల్లో సీఎం చంద్రబాబు ఊదరగొడుతున్నారు. అయితే సుమారు 50 వేల మంది నివాసం ఉంటున్న వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో ఒక్క డ్రోన్ ద్వారా.. ఒక్క ఇంటికి కూడా ఆహారం పంపిణీ చేయలేదని స్థానికులు అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. హెలికాప్టర్లలో వాటర్ బాటిళ్లు, ఆహార పొట్లాలు తెచ్చి కాలనీకి దూరంగా ఉండే వాటర్ ట్యాంక్పై విసిరి వెళ్లారని, పీకల్లోతు నీటిలో వెళ్లి వాటర్ ట్యాంక్లు ఎక్కి ఆహారం, నీళ్లు ఎలా తెచ్చుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వ పెద్దలకు లేదా? అని నిలదీశారు. జలయుద్ధాలు తప్పడం లేదు.. పది రోజులుగా ముంపులో చిక్కుకుపోయిన వారికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేవు. స్నానాలు చేసి రోజులు గడుస్తుండటంతో చర్మ వ్యాధులు, దద్దుర్లతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నీళ్ల ట్యాంకర్ కాలనీలోకి రాకముందే దాని వెంట పరుగులు తీస్తూ జలయుద్ధాలు చేస్తున్నారు.కూడబెట్టుకున్నదంతా పోయింది.. కూలినాలి చేసుకుని సంపాదించుకున్నదంతా వరదలో కొట్టుకుపోయింది. ఎలా ఉన్నారని పలకరించిన నాథుడు లేడు. పది రోజులుగా నరకయాతన పడ్డాం. వయసుకు వచి్చన ఆడ బిడ్డలతో ఎక్కడికి వెళ్లి ఉంటాం? ఇంటిలో ఏ వస్తువూ మిగల్లేదు. పునరావాస కేంద్రానికి తరలిస్తామని ఒక్కరూ చెప్పలేదు. ఉచిత బియ్యం ఇస్తామనీ ఇవ్వలేదు. కరెంట్ లేదు. వేసుకోవడానికి సరైన బట్టలు లేవు. పనుల్లేక చేతిలో డబ్బులు లేవు. ఎలా బతికేది? జీవితం రోడ్డున పడింది. – భార్గవి, వైఎస్సార్ జక్కంపూడి కాలనీఒక్క వస్తువు కూడా మిగల్లేదు.. మా తమ్ముడి ఇంటిలో ఫంక్షన్కని ఆగస్టు 25న కాకినాడ నుంచి వచ్చాను. ఆదివారం ఒక్కసారిగా వరద నీరు ఇంటిలోకి రావడవంతో ఒక్క వస్తువు కూడా మిగల్లేదు. ఇద్దరు ఆడ పిల్లలతో మా తమ్ముడు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి వండుకోవడానికి పప్పులు, ఉప్పులు ఇస్తే కానీ గడవని దుస్థితి ఉంది. – నాగమణి, వైఎస్సార్ జక్కంపూడి కాలనీఈ చిత్రంలోని మహిళ.. సయ్యద్ సమీరా. ఆమె ఇంటి ముందు మురుగు నీరు తటాకాన్ని తలపిస్తోంది. దీంతో విధిలేక తన ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఆ మురుగు నీటినే తీసుకెళుతోంది. ఇదేంటమ్మా.. ప్రభుత్వం ఫైర్ ఇంజన్లతో ఇళ్లు శుభ్రం చేయిస్తామని చెబుతుంది కదా అని ప్రశి్నస్తే.. ‘మా బతుకులకు అదొకటే తక్కువైంది. పది రోజుల నుంచి మురుగు నీటిలోనే పడి ఉన్నాం. ఎవరూ పలకరించిన పాపానపోలేదు. వరద పోయి బురద మిగిలితే.. దాన్ని కడుక్కోవడానికి చెంబు నీళ్లు కూడా ఇవ్వట్లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వరద వస్తుందని ఎవరూ చెప్పలేదు.. అర్ధరాత్రి ఇంటిలోకి నీళ్లు చేరితే.. కట్టుబట్టలతో పై అంతస్తులోకి పరుగులు పెట్టాం.ఇద్దరు చిన్న పిల్లలను పక్కింటిలో ఉంచి మేము నీళ్ల మధ్యే దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు కాలం వెళ్లదీశాం. ఇప్పుడు కట్టుకోవడానికి బట్టలు కూడా లేని దుస్థితిలో ఉన్నాం. ఫ్రిజ్ నీటిలో తేలుతూ రోడ్డుపైకి కొట్టుకొచి్చంది. నా భర్త సయ్యద్ ఖాజా పైపుల రోడ్డులో నిర్వహించే వెల్డింగ్ షాపు కూడా నీటమునిగింది. మొత్తం మెషినరీ కూడా తడిచిపోయింది. ఇళ్లు, షాపు కోల్పోయి రోడ్డుపై పడ్డాం’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా సమీరా ఒక్కరే కాదు.. వేలాది మంది సోమవారం వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో వరద బాధితులుగా.. కట్టుబట్టలతో రోడ్లపై కష్టాలను అనుభవిస్తూ కనిపించారు.నిత్యావసరాలు కరవై.. 50వేల మంది ఉండే జక్కంపూడి కాలనీని ప్రభుత్వం గాలికొదిలేసింది. అపార్ట్మెంట్లలో గ్రౌండ్ ఫ్లోర్లు నీటమునిగాయి. కాలు బయటకు అడుగు పెట్టలేని దుస్థితిలో పై అంతస్తుల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత నిత్యావసరాలు కూడా ఇక్కడికి చేరలేదు. ఇంటిలో బియ్యం తడిచిపోయి, వంట వస్తువులు నీటిలో మునిగిపోయాయి. దీంతో దాతలు ఇచ్చే ఆహారం కోసం సంచులు తీసుకుని రోడ్లపై పిల్లజల్లాలతో పడిగాపులు కాస్తున్నారు.జీవనాధారం కకావికలంబుడమేరు వరదతో జక్కంపూడి కాలనీకి చెందిన బార్బర్ రాంబాబుకు తీవ్ర నష్టం వారం రోజులు నీటిలోనే బార్బర్ షాపు, ఇల్లుపూర్తిగా పాడైపోయిన షాపులోని కుర్చీలు, వస్తువులు షాపు పునరుద్ధరణకు రూ.లక్ష వరకూ అవసరం కన్నీరుమున్నీరవుతున్న రాంబాబు కుటుంబం వరద ప్రభావిత ప్రాంతం నుంచి సాక్షి ప్రతినిధి బుడమేరు వరద ధాటికి బడుగుల జీవితాలు కకావికలమయ్యాయి. తాము నివాసం ఉంటున్న వీధిలో, కాలనీలోనే చిన్న బడ్డీ కొట్లు, తోపుడు బండ్లు పెట్టుకుని చిరువ్యాపారాలు చేసుకుంటున్నవారు, చేతి వృత్తులను నమ్ముకున్నవారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. జక్కంపూడి కాలనీకి చెందిన ఇక్కుర్తి రాంబాబుది కూడా అలాంటి కన్నీటి గాథే. జక్కంపూడి కాలనీలోని డ్రెయిన్ పక్కనే చిన్న బార్బర్ షాప్ నడుపుకుంటూ రాంబాబు తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అతని భార్య ఉమామహేశ్వరి ఇళ్లలో పనులకు వెళ్తారు. ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు నగరంలోని ఓ సెలూన్ షాపులో రోజువారీ కూలీకి వెళుతుంటాడు. డిగ్రీ చదువుతున్న రెండో కుమారుడు మణికంఠ కాలేజీ నుంచి వచ్చాక తండ్రికి షాపులో సహాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో గత నెల 31వ తేదీ అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా బుడమేరు వరద ప్రారంభమైంది. తెల్లవారేసరికే జక్కంపూడి కాలనీని ముంచేసింది. రాంబాబు బార్బర్ షాపు కూడా వరద నీటిలో మునిగిపోయింది. వారం రోజులకు పైగానే షాపు నీటిలో ఉంది. షాపు లోపల ఉన్న రెండు కుర్చీలు, సెలూన్ సామాగ్రి అంతా నానిపోయి పనికిరాకుండా మారాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే రాంబాబు ఇంట్లోకి కూడా వరద చేరడంతో సరుకులు, టీవీ, మంచం... ఇలా ఏ ఒక్కటి మిగలకుండా అన్నీ పాడైపోయాయి. వారం రోజులపాటు ఇంటి పై ఫ్లోర్లోని బాల్కనీలో అతని కుటుంబం తలదాచుకుంది. వరద తగ్గుముఖం పట్టడంతో సోమవారం షాప్లోని తడిచిపోయిన వస్తువులన్నింటినీ రాంబాబు, అతని కుమారుడు మణికంఠ బయటపెట్టి బురదను శుభ్రం చేసుకున్నారు. వారి వేదనను గుర్తించిన ‘సాక్షి’ ప్రతినిధి... ‘మళ్లీ ఆ వస్తువులు పనిచేస్తాయా...’ అని అడగ్గా... ఒక్క వస్తువు కూడా పనిచేయదని రాంబాబు బదులిచ్చాడు. ‘రెండు చైర్లు పూర్తిగా పనికి రాకుండాపోయాయి. కొత్తగా కొనుగోలు చేయాలంటే ఒక్కోటి రూ.15 వేలుపైనే చేస్తాయి. అద్దాలు కొత్తగా కొనాలి. వారం పాటు ముంపులోనే ఉండిపోవడంతో షాప్ కూడా దెబ్బతింది. రిపేర్ చేయించాలి. ట్రిమ్మర్లు, కత్తెరలు, దువ్వెనలు, టవల్స్.. ఇలా ప్రతి ఒక్కటి కొత్తగా కొనాలి. కనీసం రూ.లక్ష ఖర్చు అవుతుంది. మరోవైపు చిన్నబ్బాయి కాలేజీ ఫీజులు చెల్లించాలి. ఇంట్లోని వస్తువులు కూడా పాడైపోయాయి. పది రోజుల నుంచి పని లేక ఇళ్లు గడవడం కూడా కష్టంగా ఉంది. ప్రభుత్వం నిత్యావసరాలు కూడా పంపిణీ చేయలేదు.’ అని రాంబాబు ఆవేదన వ్యక్తంచేశారు. -
లావేరు మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న అదపాక గెడ్డ
-
విజయవాడ వాసుల్ని వీడని వరద, బురద కష్టాలు
-
ఊపిరి పీల్చుకుంటున్న బెజవాడ
-
అల్లకల్లోలంగా కొల్లేరు
-
ప్రాజెక్టులకు పోటెత్తిన వరద
-
‘విజయవాడ వరద మరణాలు.. సర్కారీ హత్యలే’
సాక్షి, విశాఖపట్నం: వరద సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుది పబ్లిసిటీ స్టంట్. ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన విపత్తే అంటూ ధ్వజమ్తెతారు. విజయవాడ వరదల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమన్నారు.వరదలు వచ్చినప్పుడు ప్రజలను ప్రభుత్వం కాపాడాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన విజయవాడ విపత్తు సంభవించింది. చంద్రబాబుకు పబ్లిసిటి మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను రక్షించడంపై లేదు. బుడమేరు కాల్వ నుంచి వరద వస్తుందని తెలిసి కూడా డీఈ హెచ్చరికలను లెక్క చేయలేదు. 20 గంటల ముందు వరద వస్తుందని తెలిసి కూడా తాము స్పందించలేదని మరి కొంతమంది అధికారులు చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక వరదలపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం మరొకటి లేదు. చంద్రబాబు అమరావతిలో ఉన్నారు కాబట్టి వరదలు రావనుకున్నారా?’’ అంటూ గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు.‘‘మునిగిపోతారని తెల్సి కూడా ప్రజలను వదిలేస్తారా..? విజయవాడ వరద మరణాలు అన్ని ప్రభుత్వ హత్యలే. అల్లూరి జిల్లాలో గతంలో వర్షాలు వస్తే 250 గ్రామాల ప్రజలను సురక్షితంగా రక్షించాము. దీనికి సీఎం చంద్రబాబు, అధికారులు బాధ్యత వహించాలి. పడవలను వైఎస్సార్సీపీ నాయకుల వదిలేశారని బురద జల్లుతున్నారు. ప్రభుత్వం మీదే కదా అధికారంలో ఉంది. విచారణ చేయండి. ప్రచారం కోసం జేసీబీలపై చంద్రబాబు తిరిగారు.’’ అని అమర్నాథ్ ధ్వజమెత్తారు.సంబంధింత వార్త: ఎటు చూసినా ఆక్రందనలే‘‘అనకాపల్లి జిల్లాలో వర్షాలకు పంటలు మునిగిపోయాయి. ఒక్క అధికారి జిల్లాలో కనిపించలేదు. కొవిడ్ సమయంలో ఐదు కోట్ల మంది ప్రాణాలను వైఎస్ జగన్ కాపాడారు. వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన డోర్ డెలివరీ వాహనాలు సహాయక చర్యల్లో ఉపయోగపడ్డాయి. వైఎస్ జగన్ రిటైన్ వాల్ నిర్మించకపోతే మరింత ప్రమాదం జరిగి ఉండేది. 45 మంది మరణాలకు చంద్రబాబు బాధ్యత వహించాలి’’ అని అమర్నాథ్ డిమాండ్ చేశారు. -
8 రోజులు గడుస్తున్నా తేరుకోని విజయవాడ ప్రజలు
-
ముంచుకొస్తున్న మరో ముప్పు! రెండు రోజులుగా ఉత్తరాంధ్రను ముంచెత్తుతున్న వర్షాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నష్టపోయిన అందరినీ ఆదుకుంటాం: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘వరదతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం..ఎంత ఖర్చయినా పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మాది ప్రజా ప్రభుత్వం... ప్రజల కోసం పనిచేస్తుంది’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో ఆయన ఖమ్మం నగరం, మధిర నియోజకవర్గాల్లో పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ముంపు బాధితులతో మాట్లాడుతూ ప్రభుత్వపరంగా సౌకర్యాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. పలు ప్రాంతాల్లో వరదలతో నష్టపోయిన బాధితులను పరామర్శించడంతోపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భారీ వర్షాలు ఇంకా ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అర్ధరాత్రి ఖమ్మం చేరుకొని.. ఆకేరు, మున్నేరు వరద మళ్లీ పెరుగుతోందన్న సమాచారంతో డిప్యూటీ సీఎం భట్టి శనివారం అర్ధరాత్రి ఖమ్మం చేరుకున్నారు. కాల్వొడ్డు వద్ద ప్రజలతో మాట్లాడి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. ఆ తర్వాత కాల్వొడ్డులో మున్నేరు బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. అక్కడి నుంచి స్వర్ణభారతి కల్యాణ మండపం, మహిళా డిగ్రీ కళాశాల, ఖమ్మం అర్బన్ మండలం ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించిన భట్టి.. బాధితులతో మాట్లాడి తాగునీరు, ఆహా రం, వైద్యం, మందులు అందుతున్నాయా, లేదా అని ఆరా తీశారు. ఎక్కడా సౌకర్యాల కల్పనకు వెనక్కి తగ్గొద్దని, బా«ధితులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన వెంట వచ్చిన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, సీపీ సునీల్దత్ను ఆదేశించారు. మధిర నియోజకవర్గంలో పర్యటన మధిర నియోజకవర్గంలోని ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర మండలాల్లో డిప్యూటీ సీఎం భట్టి పర్యటించారు. వరదతో దెబ్బతిన్న పంటపొలాలు, రోడ్లు, కట్టలు తెగిన చెరువులు, కూలిన ఇళ్లను పరిశీలించి, బాధితులను పరామర్శించి ఓదార్చారు. గండ్లు పడిన చెరువులు, దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల పునర్నిర్మాణానికి అంచనాలు వెంటనే రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆరుగురు మృతి చెందగా, వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెక్కులు అందజేశారు. దెబ్బతిన్న పాఠశాలల్లో బురద తొలగించి త్వరగా పున:ప్రారంభం అయ్యేలా చూడాలని చెప్పారు. -
కేంద్ర ప్రభుత్వాన్ని రూ.6,880 కోట్లు అడిగాం
సాక్షి, అమరావతి: వరద నష్టాలను ప్రాథమికంగా అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. వరద వల్ల రాష్ట్రానికి రూ.6,880 కోట్ల నష్టం కలిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని, ఈ మేరకు తక్షణ సాయం అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. ఆదివారం విజయవాడ కలెక్టరేట్లో మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వినాయక చవితి రోజు బుడమేరు మూడో గండిని ఆర్మీ సాయంతో విజయవంతంగా పూడ్చినట్టు చెప్పారు. వరద వచ్చి వారం రోజులైనా తగ్గకపోవడంతో ప్రజలు ఆవేశంగా ఉన్నారని, శనివారం కూడా రాజరాజేశ్వరిపేటలో 4 అడుగుల నీరు ఉందని వ్యాఖ్యానించారు. రెండు రోజుల వర్షాలపై అప్రమత్తం చేశాంరానున్న రెండు రోజుల్లో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించినట్టు సీఎం చెప్పారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనుండటంతో ఏలేరు రిజర్వాయర్ నిండి దిగువ ప్రాంతమైన పిఠాపురం పరిసర ప్రాంతాలకు వరద ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఏలేరు నదికి సోమ, మంగళ వారాల్లో 10 వేల నుంచి 20 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఏలేరు రిజర్వ్యర్లో 21 టీఎంసీల నీరు ఉండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బుడమేరు నుంచి వరద కొల్లేరుకు చేరుతుండటంతో నందివాడ మండలం ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో వరద నీరు క్రమేపీ తగ్గుతోందని, వర్షాలు లేకపోతే సోమవారం సాయంత్రానికి మొత్తం నీరు లాగేస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రానున్న 36 గంటల్లో ఎంత వర్షం నీరు వస్తుందన్న అంచనాలు వేసుకుని దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు.ఆపరేషన్ బుడమేరుభవిష్యత్లో విజయవాడకు వరద భయం లేకుండా ఆపరేషన్ బుడమేరు చేపడుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. బుడమేరు చుట్టుపక్కల ఆక్రమణలు తొలగించి నీరు వేగంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బుడమేరు సామర్థ్యాన్ని 10–15 వేల క్యూసెక్కులకు పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. -
రాకాసి తండాకు అండగా ఉంటాం: కిషన్రెడ్డి
తిరుమలాయపాలెం: ఆకేరు వరద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి హామీ ఇచ్చారు. సర్వం కోల్పోవడంతో ఇక్కడ ఉండలేమంటున్న ప్రజల ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మరో ప్రాంతంలో ఆవాసాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాడైన భూములు మళ్లీ సాగులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆకేరు వరదతో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండాలో జరిగిన నష్టం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి వచ్చిందని తెలిపారు. స్వయంగా తండాను చూసి రావాల్సిందిగా ప్రధాని తనకు చెప్పారని వెల్లడించారు. ఆదివారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వ ర్రెడ్డితో కలిసి కిషన్రెడ్డి రాకాసి తండాను సందర్శించారు. ముంపునకు గురైన పంటపొలాలు, కొట్టుకుపోయిన ఇళ్లను పరిశీలించారు. తండా వాసులతో మాట్లాడి వారి బాధలు తెలుసుకున్నారు. అక్వెడక్ట్తోనే గ్రామం నాశనం! ఆకేరుపై నిర్మించిన సీతారామ ప్రాజెక్టు అక్వెడక్ట్తోనే తమ గ్రామం సర్వనాశనమైందని, పచ్చని పంటపొలాల్లో రాళ్లు, ఇసుక మేటలు వేశాయని స్థానికులు తెలిపారు. ఇక్కడ తాము ఉండే పరిస్థితి లేనందున మరోచోట స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టించి ఆదుకోవాలని వేడుకున్నారు. ఇళ్లు, ఆస్తులు కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన తమకు దిక్కెవరంటూ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సమకూర్చిన గ్యాస్ స్టౌలు, రగ్గులను కిషన్రెడ్డి వారికి అందజేశారు. జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలి: మంత్రి పొంగులేటి రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక జిల్లాలు జలమయమైనందున జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. రాకాసి తండాలో జరిగిన నష్టాన్ని ఆయన కేంద్రమంత్రికి వివరించారు. కేంద్రమంత్రులు ముంపు ప్రాంతాల్లో పర్యటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందించాల్సిందిగా ఇప్పటికే కిషన్రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ట తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం నివేదిక పంపలేదు: కిషన్రెడ్డి ఖమ్మం వన్టౌన్: వరదలతో వాటిల్లిన నష్టంపై కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నివేదిక పంపలేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని వరద ముంపు ప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. 16వ డివిజన్ ధంసలాపురంలో వరద బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ సమయంలో ఓ జర్నలిస్టు ఏపీ ప్రభుత్వం నివేదిక పంపిందా అని అడగ్గా.. పంపలేదని జవాబిచ్చారు. గతంలో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ నిధులనే ప్రస్తుతం వాడుకుంటోందని చెప్పారు. -
పదో తేదీ వస్తోంది.. కిస్తీ కట్టండమ్మా!
పటమట(విజయవాడ తూర్పు): మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా ఉంది బుడమేరు వరద ముంపు ప్రాంతంలోని స్వయం సహాయ సంఘాల సభ్యుల పరిస్థితి. బుడమేరు వరద వల్ల ఇళ్లు మునిగి సర్వం కోల్పోయి వారం రోజుల నుంచి కట్టుబట్టలతో అల్లాడుతున్నవారిని ఆదుకోవాల్సిన విజయవాడ నగరపాలక సంస్థ పట్టణ సాధికారిక విభాగం అధికారులు... మానవత్వాన్ని మరిచి ఇప్పుడిప్పుడే ఇంటికి చేరి బురదను శుభ్రం చేసుకుంటున్న వారి వద్దకు సిబ్బందిని పంపి ‘పదో తేదీ వస్తోంది పొదుపు రుణం కిస్తీ కట్టండి... లేకపోతే వడ్డీ పెరుగుతుంది.తర్వాత ఇబ్బందిపడతారు...’ అని హెచ్చరించడంపై పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘అనేక సంవత్సరాలుగా పని చేసి పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న సామాన్లన్నీ నాశనమైపోయాయి. ఇప్పుడు తినడానికి తిండికి కూడా లేకుండా అల్లాడుతున్నాం. చేతిలో చిల్లిగవ్వలేదు. దాతలు ఇచ్చే పులిహోర పొట్లాలు తిని బతుకుతున్నాం. బురదనీటిలోనే బతుకీడుస్తున్నాం. ఈ పరిస్థితుల్లో బుక్ కీపర్లు వచ్చి కిస్తీ కట్టాలని చెప్పడం దారుణం. వారికి మనసెలా వచి్చందో అర్థం కావడం లేదు..’ అంటూ అజిత్సింగ్నగర్ ప్రాంత పొదుపు సంఘాల మహిళలు మండిపడుతున్నారు. వెంటనే పొదుపు రుణాల చెల్లింపులను మూడు నెలలు వాయిదా వేయాలని కోరుతున్నారు. 1.50లక్షల మందిపై ప్రభావం⇒ విజయవాడలోని మూడు సర్కిళ్ల పరిధిలో సుమారు 12వేల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 10 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు. ⇒ వరద ప్రభావం ఎక్కువగా ఉన్న సర్కిల్–1, సర్కిల్–2 పరిధిలోని విద్యాధరపురం, భవానీపురం, చిట్టినగర్, పాత ఆర్ఆర్పేట, కొత్త ఆర్ఆర్పేట, కొత్తపేట, అజిత్సింగ్నగర్, లూనా సెంటర్, ఆంధ్రప్రభ కాలనీ, నందమూరినగర్, ఇందిరానాయక్నగర్, పాయకాపురం, పైపులరోడ్డు, వాంబేకాలనీ, ఎల్బీఎస్ నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు 8వేల గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో సుమారు 1.50లక్షల మంది సభ్యులు పొదుపు రుణాలు పొందారు. ⇒ఒక్కో సంఘం రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకు రుణాలు పొందాయి. ఆయా సంఘాల సభ్యులు రెండు నెలల నుంచి 15 నెలల వరకు వాయిదాలు చెల్లించారు. ⇒ఇప్పటి వరకు తాము తీసుకున్న రుణాలతో చిరువ్యాపారాలు, చేతివృత్తులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతూ ప్రతి నెల పదో తేదీలోపు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు కిస్తీలను పక్కాగా చెల్లిస్తున్నారు. ⇒ప్రస్తుతం ఆకస్మిక వరద వల్ల పనిలేక, ఉన్న వస్తువులన్నీ పాడైపోయి అల్లాడుతున్నారు. వీరు తేరుకోవడానికి కనీసం మూడు నుంచి ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. మేం ఇప్పుడు కట్టలేం మా పరిస్థితి చూశారుగా... ఇళ్లన్నీ మునిగిపోయాయి. సామాన్లు కొట్టుకుపోయాయి. ఆకలితో అలమటిస్తుంటే ఇప్పుడు వచ్చి పొదుపు రుణం కిస్తీ చెల్లించాలని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మేం కట్టలేం... కట్టం. ఏం చేసుకుంటారో చేసుకోండి. మాలాంటి వారిని ఆదుకోవాల్సింది పోయి అప్పు కట్టమనడం ఎంతవరకు న్యాయం? మేం మళ్లీ మా పాత రోజువారీ జీవితానికి రావాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది. అప్పటి వరకు మేం రుణాలు కట్టలేం. ప్రభుత్వం మాకు కొత్త రుణాలు ఇవ్వాలి. ఇంట్లో సామాన్లు కొనుక్కునేందుకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాలి. – మీనాక్షి, ఆంధ్రప్రభ కాలనీ, విజయవాడ బాధితులనే విరాళాలు అడుగుతారా? ఇప్పటి వరకు వాహనాలు, ఎల్రక్టానిక్ వస్తువుల బీమాపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. పొదుపు సంఘాల పరిస్థితిని అసలు పట్టించుకోవడం లేదు. పైగా కిస్తీలు కట్టండి... పొదుపు సంఘాలు కూడా విరాళాలు ఇవ్వండి... అని చెబుతున్నారు. మేమే బాధితులమైతే మేం ప్రభుత్వానికి విరాళాలు ఇవ్వాలా..? ఇదెక్కడి విడ్డూరం? మాపై ప్రభుత్వానికి కనికరం కూడా లేదు. మా రుణాలు మాఫీ చేయాలి. సున్నా వడ్డీకి కొత్త రుణం అందించాలి. – సునీత, ఆంధ్రప్రభ కాలనీ, విజయవాడ -
AP Floods: ఎటు చూసినా ఆక్రందనలే
జీవనోపాధిని దెబ్బతీసిందిశనివారం అందిన పింఛను డబ్బుల్లో రూ.3,500 పెట్టి సిగరెట్లు, ఇతర సరుకులు తెచ్చి షాపులో పెట్టా. ఆదివారం తెల్లవారేసరికి నాలుగు అడుగుల నీరు రావడంతో షాపులో ఉన్న సరుకులన్నీ కొట్టుకుపోయాయి. షాపు నడిస్తేనే మా జీవనం సాగుతుంది. షాపులో సరుకుల్ని తీసుకునేందుకు మూడో అంతస్తు నుంచి కిందకు దిగలేక.. ఒకవేళ దిగినా నీటి వడిలో కొట్టుకుపోతాననే భయంతో రాలేకపోయా. కనీసం ముందురోజే మాకు సమాచారం ఇస్తే.. కనీసం కొంతమేరైనా నష్టాన్ని నివారించుకోగలిగే వాడిని. మాలాంటి చిరు వ్యాపారులను ఎవరు ఆదుకుంటారు? – ఆర్.కొండలరావు, దివ్యాంగుడు, వైఎస్సార్ కాలనీపదేళ్ల కష్టం వరద పాలైందిపదేళ్ల కష్టాన్ని వరద ఎత్తుకుపోయింది. వైఎస్సార్ కాలనీలోని క్రీడా మైదానం వద్ద చిన్న దుకాణంలో చెప్పులు, దుస్తుల వ్యాపారం చేసుకుంటున్నాను. గత శనివారం మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో షాపులో ఉన్న చెప్పులు, దుస్తులను రెండు అడుగుల ఎత్తులో పెట్టుకున్నాను. తెల్లవారేసరికి షాపు మొత్తం నీటిలో మునిగిపోవడంతో మొత్తం వరద పాలైంది. మళ్లీ తేరుకోవడానికి కనీసం మూడు నెలలైనా సమయం పడుతుంది. ఈలోగా బతుకు సాగించేదెలా? – కరీముల్లా, వైఎస్సార్ కాలనీ⇒ ‘కట్టుకోవటానికి బట్టల్లేవు. మందులు కొందామన్నా డబ్బుల్లేవు. ఇళ్లల్లోని సామగ్రి లేదు. పిల్లల పుస్తకాలు కొట్టుకుపోయాయి. ఏ అవసరాలు తీరాలన్న కనీస నగదు అందుబాటులో ఉండాలి. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అందుకే.. తక్షణ సాయం అందించాలి. ప్రభుత్వం ఇచ్చే ఆహారం మా కాలనీలోకి రావటం లేదు. మేమెలా బతకాలి’ అంటూ ఆంధ్రప్రభ కాలనీకి చెందిన కనకదుర్గ విలపిస్తున్నారు.వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధులు: వారు రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు. ఏరోజుకారోజు కూలికి పోతే కానీ ఐదు వేళ్లూ నోట్లోకి పోవు. ఇలాంటి వారిని వరద ముంచింది.. దీనికంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఇంకా ముంచుతోంది. విజయవాడను వరద ముంచెత్తి వారం దాటిపోయినా లోతట్టు కాలనీల ప్రజల వైపు ప్రభుత్వం తొంగిచూస్తే ఒట్టు. ప్రధాన రోడ్లలో ఉన్నవారికి సాయం చేస్తున్నట్టు షో చేస్తున్న సర్కారు పెద్దలు లోతట్టు కాలనీల పేదలను పూర్తిగా వరదకు వదిలేశారు. దీంతో దారుణ పరిస్థితుల్లో ఈ కాలనీల్లో పేదలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. వారానికి పైగా పనులు లేక.. చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతున్నారు. పసిపిల్లలకు పాలు పట్టడానికి పాల ప్యాకెట్ కూడా కొనలేని దుస్థితిలో ఉన్నారు. ప్రభుత్వ సాయం అందకపోవడంతో దాతల సహాయంపైనే ఆధారపడి బతుకీడుస్తున్నారు. యజమానులు అద్దె ఇంటిని ఖాళీ చేయమంటారేమోనని కలత చెందుతూ సాయం చేయాలంటూ బంధువులు, స్నేహితులను అర్థిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందని బాధి™è ులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో వరదలకు పేదల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. వారం రోజులకు పైగానే జలదిగ్భందంలో ఉండిపోవడంతో పూట గడవడానికి కూడా చేతిలో చిల్లిగవ్వ లేక అవస్థలు పడుతున్నారు. బయట కూడా అప్పు పుట్టడం లేదు. దాతలు పంచే ఆహారాన్ని పిల్లలకు పెట్టి పెద్దలు పస్తులుంటున్నారు. దాతల ఆహార పంపిణీ కూడా నిలిచిపోతే తమను ఆదుకునేవారెవరని పేద కుటుంబాలు చింతిస్తున్నాయి. ముంపు బాధితులను తక్షణ సాయంతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తోంది. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు.. విజయవాడ లక్షలాది మంది ముంపు బారిన పడ్డారు. వీరు గత 8 రోజులుగా చుట్టూ నీళ్లను తప్ప వేరే ప్రపంచాన్ని చూడలేదు. ముంపునకు గురైన భవానీపురం, సింగ్నగర్, కండ్రిక, పాయకాపురం, మిల్క్ ఫ్యాక్టరీ, చిట్టినగర్, వైఎస్సార్ కాలనీ ఇలా వివిధ ప్రాంతాల్లో తక్కువ అద్దెకు ఇళ్లు దొరుకుతాయి. నిర్మాణ రంగం, ఆటోనగర్ కారి్మకులు, ఆటో, రిక్షావాలాలు, ఇతర రోజువారీ కూలీ పనులపై ఆధారపడ్డ పేదలు ఇక్కడే నివసిస్తున్నారు. పగబట్టినట్టు వరద ప్రభావం ఈ ప్రాంతాల్లోనే అధికంగా ఉంది. వరద నీరు ఇంట్లో చేరి కట్టుబట్టలు మినహా ఏ ఒక్క వస్తువు పనికొచ్చే పరిస్థితిలో లేవు. దీంతో ఇంట్లో వంట సామాగ్రి, నిత్యావసరాలు, దుస్తులు ఇలా ప్రతి ఒక్కటి కొనుగోలు చేయాల్సి ఉంది. వారం రోజులుగా పని లేకపోవడం.. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో పాడైన వస్తువులన్నింటినీ కొనాలంటే వేలల్లో ఖర్చు అవుతుంది. అంత మొత్తం ఇప్పడు ఎక్కడ నుంచి తేవాలని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికీ చివరి కాలనీల్లో ఆకలి కేకలు.. నందమూరి నగర్, భరతమాత కాలనీ, ఉడా కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, ఇందిరానాయక్ నగర్, రాజీవ్ కాలనీ, శాంతి నగర్, ప్రశాంతి నగర్, ఆంధ్రప్రభ కాలనీ, ఊర్మిళా నగర్, పాయకాపురం, కండ్రిక, పాత రాజీవ్ నగర్, తదితర ప్రాంతాల్లో ఆదివారం కూడా నడుములోతు నీరు ఉంది. ఇప్పటికీ ఈ కాలనీలకు తాగునీరు, ఆహారం అందడం లేదు. స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం తొంగి చూడటం లేదు. నీట మునిగిన ఇంటి నుంచి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని చూపించకపోవడంతో మేడలు, మిద్దెలపైనే టార్ఫాలిన్లు కప్పుకుని జీవిస్తున్నారు. ప్రచార యావే తప్ప పైసా సాయం చేయని ప్రభుత్వ పెద్దలు లోతట్టు ప్రాంతాలను గాలికొదిలేశారు. దీంతో కనీసం ఆహారం, తాగునీళ్లు కూడా దక్కక పస్తులుండాల్సిన దుస్థితి. చిన్నారులు, వృద్ధులు ఉన్న కుటుంబాల్లోనివారు వరద నీటిలోనే కి.మీ కాలినడకన వచ్చి రోడ్లపై దాతలు ఇచ్చే ఆహార పొట్లాల కోసం యుద్ధమే చేయాల్సి వస్తోంది. అమ్మో.. అద్దె.. విజయవాడ లోతట్టు కాలనీలో వరదబారిన పడ్డవారిలో పేదలే అత్యధికం. వీరంతా కూలి పనులు చేసుకుంటూ అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. ఇప్పుడు వరదలతో పనులు లేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో ఈ నెల అద్దె కట్టడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెలా 1న అద్దె కోసం యజమాని ఇంటికి వస్తే.. ఈసారి మాత్రం తెల్లారేసరికే వరద ముంచెత్తింది. దీంతో అద్దె చెల్లించకపోతే యజమానులు ఇళ్లు ఖాళీ చేయిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ప్రతి నెలా వచ్చే ఆదాయంలో 40 శాతం అద్దెకే చెల్లించాల్సి వస్తోంది. ‘ఇంటి యజమానికి వరద వచ్చిందని చెబితే ఆలస్యంగానైనా అద్దె ఇమ్మనే చెబుతారు. ఊరికే ఎందుకు వదులుకుంటారు? మాకేమో పనులు లేవు. తిండి మాట దేవుడెరుగు.. అద్దె కట్టకపోతే ఉన్న ఇంటిని కూడా ఖాళీ చేసి రోడ్డున పడాలి. దీనికి తోడు మమ్మల్ని నిండా ముంచిన ప్రభుత్వం ఆలస్యంగానై కరెంటు బిల్లు కట్టమంటుందే కానీ మాఫీ చేస్తామనట్లేదు’ అంటూ వరద బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంధువులకు భారంగా మారి.. వరద ముంపు పూర్తిగా తగ్గనప్పటికీ చాలా మంది నీటిలో నానుతున్న తమ ఇళ్లను చూసుకునేందుకు తిరిగి వస్తున్నారు. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆశ్రయం పొందుతున్నవారు.. ఎక్కువ రోజులు ఉండి భారంగా మారుతున్నామని బాధపడుతున్నారు. తమ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొనకపోయినప్పటికీ తమ ఇంటికి వచ్చేస్తున్నారు. ఇలాంటి వాళ్లలో చిరుజీవులు, ఉద్యోగులే అధికంగా ఉంటున్నారు.వర్షాలతో పెరిగిన కష్టాలుబుడమేరు వరద కొంతమేర తగ్గిందని భావిస్తున్న తరుణంలో వర్షాలు కురుస్తుండటంతో ముంపు బాధితుల కష్టాలు మరింత పెరిగాయి, అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. వరద ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో అర్థంకాక గందరగోళంలో ఉన్నారు. ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వడంలో విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ పలు కాలనీలకు తాగునీటి సరఫరా జరగటం లేదు. విద్యుత్ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేదు. వరదతో వాహనాలు దెబ్బతిన్నాయి.. పరిహారం చెల్లించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు నిరాకరిస్తున్నాయి. అలస్యమైతే వాహనాలు మరింత దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. వ్యర్థాలు పేరుకుపోయి వ్యాధులు ప్రబలుతున్నాయని కన్నీరుపెడుతున్నారు.పేదలను దోచుకుంటున్న ప్రభుత్వంముంపు ప్రాంతాల్లో మొబైల్ కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ వారం రోజులుగా ఉపాధి లేని పేదల దగ్గర వాటిని కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందన్న వాస్తవాన్ని విస్మరించింది. ఉచితంగా అందించాల్సిన కూరగాయలకు రేట్లు పెట్టి మరీ విక్రయిస్తోందని బాధితులు మండిపడుతున్నారు. వర్షాలకు పాడైపోయిన కూరగాయలను అంటగడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిత్యావసర వస్తువులను అందిస్తున్నామని చెబుతున్నా అధికార పార్టీకి చెందిన చోటా నాయకులకే అందుతున్నాయని విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఏ సాయం చేయలేదు.. వరద వస్తోందని ప్రభుత్వం కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు. ముందే చెప్పి ఉంటే మా చావేదో మేం చచ్చే వాళ్లం. మూడు రోజుల పాటు డాబాపైనే ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ వచ్చి ఆహారం, నీళ్లు ఇవ్వలేదు. ఆకలితో అలమటించి చనిపోతామని నడుము లోతు నీటిలోనే భార్య, కూతురితో సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లాను. ప్రస్తుతం అక్కడే ఉన్నాం. ఇప్పటివరకూ ప్రభుత్వం ఏ సాయం ప్రకటించలేదు. – వి. విజయ్కుమార్, పాత రాజీవ్నగర్తక్షణ సాయం కింద రూ.10 వేలు ఇవ్వాలి.. కూలిపనులకు వెళితే రోజుకు రూ.500–700 వచ్చేది. వరద మొదలైనప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యాను. దాతలు ఇచ్చే ఆహారంతోనే పూట గడుస్తోంది. ఇంట్లోకి వరదనీరు చేరి వస్తువులన్నీ పాడైపోయాయి. ప్రతి దానికీ డబ్బు కావాలి. ప్రభుత్వం వెంటనే రూ.10 వేలు తక్షణ సాయం ఇవ్వాలి. వరద నష్టం అంచనా వేశాక పరిహారం అందించి ఆదుకోవాలి. లేదంటే మాలాంటి పేదలు జీవనం సాగించలేరు. –సుబ్బారావు, ఎన్ఎస్సీ బోస్ కాలనీఒక్క అధికారి కూడా మా దగ్గరకు రాలేదు.. వరద వచ్చి వారం దాటింది. ఇప్పటి వరకూ ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మా ఇళ్ల వైపు రా లేదు. కాలనీలో లోపలికి వచ్చి అన్నం మెతుకూ పచలేదు. మెయిన్ రోడ్లలో పంచుతుంటే అక్కడకు పోయి ఆహారం కోసం యుద్ధం చేశాం. ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి సాయం ఊసే లేదు. – కొరివి లక్ష్మి, కండ్రిక -
ప్రభుత్వానికి ముందే తెలుసు
⇒ బుడమేరుకు 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందని ముందు రోజే మాకు తెలుసు. 2 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం అసాధ్యమైన ప్రక్రియ. గోదావరి జిల్లాల్లో వరద వస్తుందని చెబితే.. మాకు తెలుసు, తగ్గిపోతుందిలే అని లంక గ్రామాల ప్రజలు చెబుతారు. ప్రజలు వెళ్లరనే మేము వారికి చెప్పలేదు. – శనివారం మీడియాతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ⇒ బుడమేరుకు వరద వస్తోందని.. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తామని శనివారం (ఆగస్టు 31) నా కంటే ముందే ఎస్ఈ, ఈఈలు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం నేను తహసీల్దార్లకు ఫోన్ చేసి చెప్పా. – వెలగలేరు రెగ్యులేటర్ డీఈ మాధవ్ నాయక్ ⇒ బుడమేరు ప్రవాహ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులు. అలాంటిది 40 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో గండ్లు పడ్డాయి. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తారు. రెండు వైపుల నుంచి వచి్చన వరద విజయవాడను చుట్టుముట్టింది. వరద వస్తుందనే సమాచారం మాకు లేదు. – మీడియాతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనసాక్షి, అమరావతి: బుడమేరుకు 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోందని ఒక రోజు ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. అయితే 2 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం అసాధ్యమైన ప్రక్రియ అన్నారు. ‘వరద వస్తోందని చెబితే గోదావరి జిల్లాల్లోని లంకల్లో ప్రజలెవరూ వెళ్లరు.. మాకు తెలుసులే.. ఇలాంటి వరదలెన్నిటినో చూశాం అంటారు.. అందుకే మేం ప్రజలకు చెప్పలేదు’ అని ఆర్పీ సిసోడియా శనివారం మీడియాకు అసలు విషయం చెప్పేశారు.అలాగే.. బుడమేరుకు వరద వస్తోందని.. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తామని శనివారం (ఆగస్టు 31) మధ్యాహ్నం తన కంటే ముందే ఎస్ఈ, ఈఈలు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారని వెలగలేరు రెగ్యులేటర్ డీఈ మాధవ్ నాయక్ వెల్లడించారు. ఆ తర్వాత మధ్యాహ్నం తాను తహసీల్దార్లకు ఫోన్ చేసి విషయం చెప్పానన్నారు. దీన్నిబట్టి తమకు సమాచారం లేదని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ సృజన చెబుతున్న మాటలు అబద్ధమని ఆర్పీ సిసోడియా, మాధవ్ నాయక్ మాటలతో తేటతెల్లమైంది.బుడమేరుకు భారీ వరద ప్రవాహం వస్తుందని చంద్రబాబు ప్రభుత్వానికి ముందే తెలిసినా.. దానివల్ల ఉధృతికి భారీగా ఆస్తి, ప్రాణనష్టాలు తప్పవని తెలిసినా వారిని నిర్లక్ష్యంగా వరదకొదిలేసింది. తద్వారా 57 నిండు ప్రాణాలు పోవడానికి కారణమైంది. మరోవైపు కృష్ణా కరకట్టలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వరదకు నీట మునగడంతో ఆయన తన మకాంను విజయవాడ కలెక్టరేట్కు మార్చారు. అక్కడ నుంచే బాధితులకు సాయం పేరిట తన ‘షో’ మొదలుపెట్టారు. ఆగస్టు 31 మధ్యాహ్నమే సమాచారం ఇచి్చనా.. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు వరద ప్రవాహాన్ని వదిలేస్తామని జలవనరుల శాఖ అధికారులు శనివారం (ఆగస్టు 31) మధ్యాహ్నం లోపే సమాచారం ఇచి్చనా.. విజయవాడ, ఎనీ్టఆర్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించాలనే ఆలోచన కూడా చేయలేదు. ఫలితంగా విజయవాడలో బుడమేరు జలప్రళయం సృష్టించింది.ఇప్పటివరకూ వెల్లడైన సమాచారం మేరకు వరదల వల్ల 57 మంది మరణించారు. రూ.6,882 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. చంద్రబాబు సర్కార్ ముందే తమను అప్రమత్తం చేసి ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేవారమని బాధితులు వాపోతున్నారు. తమకు జరిగిన తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాలకు ఎవరిది బాధ్యతని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం వ్యవహరించి ఉంటే ఇలాంటి విపత్తు సంభవించేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యం వల్లే జలప్రళయం చోటుచేసుకుందని నీటిపారుదలరంగ నిపుణులు, ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విపత్తు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఆగస్టు 30, 31 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆగస్టు 28నే భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో కురిసిన వర్షాలకు ఎగువ నుంచి కృష్ణా నది భారీ వరదతో పోటెత్తింది. దీనికి తెలంగాణ, మన రాష్ట్రంలో కురిసిన వర్షాల ప్రభావంతో మూసీ, మున్నేరు, కట్టలేరు, పాలేరు తదితర వాగుల వరద కూడా తోడవడంతో ఆగస్టు 31 కృష్ణా మహోగ్రరూపం దాలి్చంది. అదే సమయంలో మరోవైపు బుడమేరు ఉప్పొంగింది. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు వరదను విడుదల చేస్తామని ప్రభుత్వానికి జలవనరుల శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు.దీన్ని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ధ్రువీకరించారు కూడా. వరద వస్తుందని ముందే తెలిసినా.. ప్రోటోకాల్ ప్రకారం లోతట్టు ప్రాంతాలను ఎందుకు అప్రమత్తం చేయలేదు? సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస శిబిరాలకు ఎందుకు తరలించలేదు? అన్నది అంతుచిక్కడం లేదు. ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లే విపత్తు సంభవించిందని, అపార ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీసిందంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ సాయం అందడం లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా? లేదా? అని ధ్వజమెత్తారు. వరదలకన్నా చంద్రబాబు నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, ఆయన అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉందన్నారు. 5 కోట్లమంది జనాభా, రూ.లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఐదారు లక్షలమందిని ఉదారంగా ఆదుకోలేని దీన స్థితిలో ఉందా? అని నిలదీశారు. వరద సహాయక చర్యల్లో సీఎం చంద్రబాబు వైఫల్యాన్ని ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ శనివారం ఎండగట్టారు. ఆయన పోస్టు పూర్తి పాఠం ఇది... 1. ఇంత చేతగానితనమా.. విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ దారీతెన్నూ లేకుండాపోయింది. ఇంకా ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం అనేది ఉందా? లేదా? అని అనిపిస్తోంది. వరదలకన్నా మీ నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. 5 కోట్లమంది జనాభా, లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న మీ ప్రభుత్వం ఐదారు లక్షలమందిని ఉదారంగా ఆదుకోలేని దీన స్థితిలో ఉందా? ఇంత చేతగానితనమా? ఇంతటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబూ. 2. 50 మందికిపైగా ప్రజలు చనిపోవడం ఎప్పుడూ జరగలేదు.. మూడు రోజుల్లో 30 సెం.మీ. పైగా వర్షం పడటం అసాధారణం ఏమీ కాదు. గతంలో చాలాసార్లు పడింది. కానీ ఈ మాదిరిగా 50 మందికిపైగా ప్రజలు చనిపోవడం ఎప్పుడూ జరగలేదు. బాధితుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేశామని మీరు చెబుతున్నా.. అవి ఎక్కడున్నాయో తెలియకపోవడం, బాధితులను లోతట్టు ప్రాంతాల నుంచి సహాయక శిబిరాలకు తరలించకపోవడం అన్నది మీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఈ వరదలు వచ్చి 8 రోజులు అవుతున్నా, 4–5 రోజులుగా వర్షాలు లేకున్నా ఇంకా ప్రజలు నీటిలోనే సహాయం అందని పరిస్థితుల్లోనే ఉండడం చాలా దారుణం. 3. ఇదంతా మీ నిర్లక్ష్యం వల్లేగా చంద్రబాబూ.. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? దీనికి కారణం మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాదా చంద్రబాబూ? శుక్రవారం (ఆగస్టు 30) నుంచి భారీ వర్షాలు వస్తాయని, భారీగా వరద వస్తుందని మీకు బుధవారమే (ఆగస్టు 28) అలర్ట్ వచ్చింది. అప్పటికే కృష్ణా నదిపై ఉన్న జలాశయాలన్నీ పూర్తి సామర్థ్యంతో నిండుగా ఉన్నాయని కూడా మీకు తెలుసు. అలాగే పై నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వరద వస్తుందని సమాచారం కూడా ఉంది. బుధవారం నుంచి శుక్రవారం వరకూ రెండున్నర రోజుల సమయం ఉన్నా మీరు పట్టించుకోలేదు. నీటిపారుదల, రెవెన్యూ, హోం శాఖ కార్యదర్శిలతో సమీక్షించి.. వారికి బాధ్యతలు అప్పగించి.. దిశానిర్దేశం చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా? 4. ‘బుడమేరు’లో మీ నిర్వాకం వల్లే విపత్తు.. ఆ సమీక్ష జరిగి ఉంటే నీటిపారుదల శాఖ కార్యదర్శి ఫ్లడ్ కుషన్ మీద ధ్యాస పెట్టేవారు కదా? కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి కొద్దికొద్దిగా నీటిని ముందుగానే విడుదల చేసి, తగ్గించుకుంటూ వస్తూ 60–70 టీఎంసీల ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసి ఉండేవారు కదా? అప్పుడు పై నుంచి వచ్చే వరద నీటిని ఆయా జలాశయాల్లోనే సర్దుబాటు చేసి ఉంటే.. పులిచింతల కింద కృష్ణా నదిలోకి వచ్చే వరద నీటిని సక్రమంగా నియంత్రించి భారీ వరద ముప్పును తప్పించేవారు. దీనివల్ల ఇంత దారుణం జరిగి ఉండేది కాదు కదా? పై నుంచి వచ్చిన వరదను తగ్గించకపోవడం వల్ల కృష్ణానదిలో భారీ ప్రవాహానికి పులిచింతల దిగువ వరద కూడా తోడయ్యింది. దీంతోపాటు బుడమేరు విషయంలో మీరు చేసిన నిర్వాకం ఇంత విపత్తుకు దారితీసింది. 5. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు ఉండి ఉంటే.. అదే విధంగా రెవెన్యూ శాఖ కార్యదర్శి షెల్టర్ల ఏర్పాటు, నిరాశ్రయులకు వసతుల కల్పనపై దృష్టిపెట్టేవారు. హోం శాఖ కార్యదర్శి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఈ షెల్టర్లలోకి తరలించి ఉండేవారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు ఉండి ఉంటే వారితో కలిసి వీరంతా ఈ ముప్పును చాలా సమర్థవంతంగా, ప్రాణనష్టం లేకుండా ఎదుర్కొనేవారు. కానీ ఇవేమీ జరగలేదు. 6. మీ ప్రచార ఆర్భాటాల వల్లే సమన్వయలోపం మీ ప్రచార ఆర్భాటాల వల్లే సహాయక చర్యల్లో పూర్తిగా సమన్వయ లోపం నెలకొంది. మీకూ, మీ కూటమి మంత్రి నాదెండ్లకూ మధ్య జరిగిన సంభాషణపై వైరల్ అయిన వీడియోనే దీనికి సాక్ష్యం. ట్రాక్టర్లు రాకపోవడం ఏంటి? 150 వాహనాలు మాత్రమే ఉండడం ఏంటి? 80 వేల కుటుంబాలకు సరుకులు ఇవ్వాలనుకుంటే తొలిరోజు 15 వేల మందికీ ఇవ్వలేకపోయారని స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరే బేలతనం చూపడం ఏంటి? వర్షాలు ఆగి ఐదు రోజుల అయిన తర్వాత కూడా మీరు ఎలాంటి పాలన చేస్తున్నారు? లక్షల ఉద్యోగులున్న యంత్రాంగం ఏమైపోయింది? ఇప్పటికీ ఇంటింటికీ జల్లెడపట్టి ఎన్యుమరేషన్ చేసిన దాఖలాలేవీ కనిపించడంలేదు. మరి మీరిచ్చిన సహాయం కచ్చితంగా వారికి ఎలా చేరుతుంది? ఎమర్జెన్సీ సేవలను ఎలా అందించగలుగుతారు? విపత్తుల సమయంలో అసమాన సేవలందించిన, గ్రామ–వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థపై కక్ష పెంచుకుని వాటిని నిరీ్వర్యం చేయడం వల్ల ఈ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నది వాస్తవం కాదా? 7. మా ప్రభుత్వ హయాంలో ఒక్క రోజులోనే డోర్ డెలివరీ బాధితులకు బియ్యం, పప్పు, నూనె తదితర సరుకులు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్లో ఇదే తొలిసారి అన్నట్టుగా, దాన్నే ఓ పెద్ద ప్యాకేజీగా చూపించి మీరు ప్రచారం చేసుకుంటున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వరదల వల్ల బాధితులైన వారికే కాదు, వరద ప్రభావం ఉన్న కుటుంబాలకు కూడా రేషన్ సరుకులను ఒక్క రోజులోనే ఎండీయూ వాహనాల్లో డోర్ డెలివరీ చేశాం. అంతేకాకుండా వారికి కొంత డబ్బు ఇచ్చి వాళ్లు ఆనందంతో ఇంటికి వెళ్లేలా చేశాం. కానీ విజయవాడలో పరిస్థితి ఇంత విషమంగా ఉన్నా మీరిస్తున్న సరుకులు అరకొరే. తీరా అవికూడా డోర్ డెలివరీ పద్ధతిలో చేరడం లేదు. తీసుకున్న ఆ కొద్దిమంది, ఇళ్ల నుంచి నీళ్లలో నడుచుకుంటూ వచ్చి మోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఇది ఇంకా వారిని బాధపెట్టడం కాదా? 8. సాయం చేయడంలో బీద అరుపులెందుకు? కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఒకరు, వ్యాపారాలు తుడిచిపెట్టుకుపోయి మరొకరు, ఉపాధిని కోల్పోయి ఇంకొకరు, ఇల్లు ధ్వంసమై మరొకరుం..ఇలా విజయవాడ వరదబాధిత ప్రాంతాల్లో ఏ ఒక్కరిని కదిపినా ఇలాంటి దీనగాథలే వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో వారికి ఉదారంగా సహాయం చేయాల్సిన బాధ్యత మీది కాదా చంద్రబాబూ? ఒక్క పథకం కూడా అమలు చేయని మీ ప్రభుత్వం వరద బాధితులకు సహాయం చేయడంలో బీద అరుపులు ఎందుకు? చివరకు విరాళాలు ఇవ్వాలని డ్వాక్రా అక్కచెల్లెమ్మల దగ్గర నుంచి కూడా వసూళ్లకు దిగడం ఏంటి? బాధితులు కోలుకునేలా ఉదారంగా తగిన సహాయం చేయండి. మీరు ఆదుకోకపోతే మా పార్టీ తరఫున కచ్చితంగా పోరాటాలు చేస్తాం. -
అమ్మా.. నాన్న ఎప్పుడు వస్తాడమ్మా?
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘నాన్న ఎక్కడికి వెళ్లాడమ్మా? ఎప్పుడు వస్తాడమ్మా? చెప్పమ్మా?’ అంటూ చిన్నారులు తల్లడిల్లిపోతుండగా.. భర్త ఏమయ్యాడో.. ఎక్కడ ఉన్నాడో.. పిల్లలకు ఏం జవాబు చెప్పాలో తెలియని స్థితిలో విజయవాడ ఊరి్మళానగర్కు చెందిన పాయల నందిని ఆందోళన చెందుతోంది. వరద వచ్చినప్పటి నుంచి భర్త ఆచూకీ తెలియక కన్నీరుమున్నీరవుతోంది. ఊర్మిళానగర్లోని రెడ్డి కాలనీకి చెందిన పాయల శేఖర్, నందిని దంపతులకు పిల్లలు మధుప్రియ(4), చైత్రిక (2) ఉన్నారు. శేఖర్ తాపీమేస్త్రీగా పనిచేస్తుంటాడు. ఆదివారం ఉదయం బుడమేరు వరద పెరుగుతుందని తెలియడంతో శేఖర్ తన భార్య, ఇద్దరు పిల్లలను సమీపంలోని తన చెల్లెలి ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టాడు.తన వద్ద పనిచేసే వారి సాయంతో ఇంట్లోని వస్తువులను బయటకు చేర్చాడు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో వెంటనే భవానీపురం పోలీస్ కాలనీలో తాను పనిచేసే ప్రాంతానికి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజాము వరకు అక్కడే ఉన్నాడు. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో చెల్లెలికి ఫోన్ చేసి.. ‘వరద ఎక్కువగా ఉంది. నాకు కొంచెం భయంగా ఉంది. వరద తగ్గాక వస్తా’ అని చెప్పాడు. చెల్లెలి భర్తకు ఫోన్ చేసి.. తన కాలికి గాజు పెంకులు గుచ్చుకున్నాయని వాపోయాడు.ఆ తర్వాత శేఖర్ ఫోన్ స్విచాఫ్ అయ్యింది. అప్పటి నుంచి శేఖర్ ఆచూకీ తెలియకపోవడంతో అతని భార్య నందిని, పిల్లలు రోదిస్తున్నారు. ‘వారం రోజులు గడిచిపోయింది. నగరంలోని అన్ని ప్రాంతాలూ తిరిగాం. ప్రభుత్వాసుపత్రి మార్చురీకి రోజూ వెళ్తున్నాం. ఎక్కడ గుర్తు తెలియని శవం ఉందని చెబితే అక్కడి వెళ్లి చూసి వస్తున్నాం. మా అన్న అసలు ఉన్నాడో.. లేడో అని ఆందోళనగా ఉంది’ అంటూ శేఖర్ చెల్లెలు భారతి కన్నీరుమున్నీరయ్యింది. -
అపస్మారక స్థితిలో రాత్రంతా రోడ్డుపైనే..
భవానీపురం(విజయవాడ పశ్చిమ): మందుల కోసం వెళ్లి వరద నీటిలో మునిగిన ఓ యువకుడు.. రాత్రంతా రోడ్డుపైనే ఆపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. విజయవాడలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నక్కా ప్రభుదాస్ తన కుటుంబసభ్యులతో కలిసి వైఎస్సార్ కాలనీ బ్లాక్ 129లో నివసిస్తున్నాడు. బుడమేరుకు వరద రావడంతో సమీపంలో నివసిస్తున్న ఆయన అత్త సామ్రాజ్యం కూడా వారి వద్దకే వచ్చింది. ప్రభుదాస్ కుమారుడు ప్రశాంత్(24) గత ఆదివారం సాయంత్రం అమ్మమ్మ మందుల కోసం వరద నీటిలో ఆమె ఇంటికి వెళ్లాడు. మందులు తీసుకుని తిరిగి వస్తూ నీళ్లలో పడిపోయిన ప్రశాంత్ను స్థానికులు కాపాడి.. ఓ పడవలో ఎక్కించారు. ఆ పడవ నడిపే వ్యక్తి ప్రశాంత్ను నైనవరం ఫ్లై ఓవర్ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో అప్పటికే స్పృహ తప్పిన ప్రశాంత్ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. సోమవారం ఉదయం పది గంటలకు తెలిసిన వ్యక్తి.. ప్రశాంత్ను గుర్తించి ఇంటికి చేర్చాడు. ప్రశాంత్ పరిస్థితి సీరియస్గా ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్కు తరలించారు. తన కుమారుడికి వైద్యం కోసం దాతలు సాయం చేయాలని ప్రభుదాస్ కోరుతున్నాడు.పడవలోనే ప్రసవంతల్లీబిడ్డ క్షేమంనిండు గర్భిణికి నొప్పులు వస్తున్నాయని..ఆమెకు సహాయం అందించాలని వీఎంసీ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంకు సమాచారం వచి్చంది. ఆమెను బోటులో ఆస్పత్రికి తరలిస్తుండగానే అందులోనే డెలివరీ అయ్యింది. వాంబే కాలనీకి చెందిన షకీనాబీకి శనివారం అర్ధరాత్రి రెండు గంటలకు నొప్పులు వచ్చాయి. ఆమెను సింగ్నగర్ ఫ్లై ఓవర్ వరకు తరలించే దారిలో, నొప్పులు అధికంగా రావటంతో విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన బోటులోనే షకీనాబీకి ప్రసవమైంది. విజయవాడ నగర పాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ వారి బృందం అజిత్ సింగనగర్ ఫ్లై ఓవర్ వద్దకు బోటును తీసుకువచ్చాక అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. –పటమట (విజయవాడ తూర్పు) -
వదలని వరద.. తొలగని బురద
(ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షిప్రతినిధి): ఊహకందని విలయం..మాటలకందని విషాదం నుంచి ఎనిమిది రోజులైనా విజయవాడ నగరం తేరుకోలేకపోతోంది. బుడమేరు చేసిన వరద గాయం నుంచి మానకపోగా, బురద చేస్తున్న కొత్త గాయాలతో అల్లాడుతోంది. గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకూ కంటిమీద కునుకు లేకుండా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్న సింగ్నగర్, రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీలతో పాటు వైఎస్సార్ కాలనీ, జక్కంపూడి కాలనీ, పాలఫ్యాక్టరీ ఫ్లై ఓవర్ కింద రామరాజ్యనగర్, పంజాసెంటర్, చిట్టినగర్ సొరంగం, కబేళారోడ్డు, సితార సెంటర్, నిజాంగేట్ సెంటర్, వించిపేట, కంసాలిపేటలో వరద తాజా పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇది. బుడమేరు ఉగ్రరూపంగత నెల 31వ తేదీ మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షానికి పరీవాహకప్రాంతం నుంచి బుడమేరుకు భారీగా నీరు వచ్చి చేరింది. మూడు చోట్ల గండి పడింది. వెలగలేరు నుంచి ఆ వరదంతా వచ్చి విజయవాడ నగరాన్ని ఈనెల 1వ తేదీ ఉదయం ముంచెత్తింది. ఆ వరద నీరు ముందుగా ప్రవేశించిన వైఎస్సార్కాలనీ, జక్కంపూడి కాలనీ పరిసర ప్రాంతానికి చేరుకున్న తొలిమీడియా ‘సాక్షి’కి అడుగడుగునా బాధితుల కష్టాలు కనిపించాయి. అక్కడ బుడమేరు నేటికీ ఉగ్రరూపంలోనే ఉంది. పూర్తిగా మునిగిపోయిన ఆ పరిసర ప్రాంతాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. రాకపోకలు లేక అక్కడి ప్రజలు అల్లాడుతూనే ఉన్నారు. ఎనిమిది రోజులుగా నీటిలోనే ఇళ్లు నానిపోతుండటంతో గోడలు ఏ క్షణాన కూలిపోతాయోనని తప్పనిసరై పై అంతస్తుల్లోనే ఆశ్రయం పొందుతున్న బాధితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.కన్నీరేగాని... మంచి నీరేదిబుడమేరు వరదలకు సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన లక్షలాది మందికి తమ భవిష్యత్తు ఏమిటో అర్ధం కావడం లేదు. ముంపు ప్రాంతాల్లో చిధ్రమైన వారి జీవితాలు ఇప్పట్లో కోలుకునేలా లేవు. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రజల కన్నీరు ఇంకిపోతుందేమోగానీ ఆ అభాగ్యుల కష్టాలు తీరేలా కనిపించడం లేదు. కనీసం బురదైనా తొలగడం లేదు. వన్టౌన్ ప్రాంతంలో వరద నీటిలో రోజుల తరబడి మునిగిపోయిన కాలనీలు, వీధులు, రోడ్లు, ఇళ్లు బురద, చెత్తతో నిండిపోయాయి. ఆదివారం ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో వాటిని తొలగించుకునేందుకు బాధితులు నానా కష్టాలు పడుతున్నారు. సింగ్నగర్, రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, కంసాలిపేటలో బురదతో పాటు డ్రెయినేజీ నీటితో పాటు, కాలకృత్యాలు కూడా అదే నీటిలో కలిసిపోవడంతో అదంతా భారీగా దుర్ఘందాన్ని వెదజల్లుతోంది.వరద నీటిలోనే రోజుల తరబడి నరకయాతన అనుభవించిన వారిలో కొందరు ఇళ్లు వదిలి వెళ్లిపోతుంటే, మరికొందరు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. కానీ వీరికి కనీసం తాగేందుకు మంచి నీరు దొరకడం లేదు. వంట సరుకులు, కూరగాయలు తెచ్చుకున్నాగానీ వాడుకునేందుకు నీళ్లు లేక పొయ్యి వెలిగించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఇస్తున్న నీరూ మురుగుతో నిండి ఉంటోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధుల భయంతో చాలా మంది ఇళ్లకు తిరిగిరావడం లేదు. దీంతో వారంగా వేలాది ఇళ్లకు తాళాలు వేసే ఉన్నాయి. పూర్తిగా ఇళ్లు కూలిపోయి గూడు కోల్పోయిన వారిలో కొందరు చిట్టినగర్ వద్ద సొరంగంలో తలదాచుకుంటున్నారు. స్ఫూర్తినింపుతున్న ప్రజలువరద వల్ల లక్షలాది మంది ఉపాధి, వ్యాపారాలు లేక రోడ్డున పడ్డారు. వారిలో కొందరు చిరు వ్యాపారులు విషాదం నుంచి తేరుకుంటున్నారు. దుకాణాల్లో పేరుకుపోయిన బురదను తొలగించుకుని, పాడైపోయిన వస్తువులు, సరుకులు బయటపడేసి మళ్లీ కొత్తగా వ్యాపారం మొదలుపెడుతున్నారు. కోలుకోలేని కష్టం నుంచి తేరుకుని దుకాణాలను తెరిచి స్ఫూర్తినింపుతున్నారు. వృద్ధులు, చిన్నారులను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సితార సెంటర్, కబేళ రోడ్డు, రామరాజ్య నగర్, వైఎస్సార్ కాలనీ, జక్కంపూడి కాలనీలు నేటికీ వరద నీరు పూర్తిగా తొలగలేదు.ఇక్కడ పలు వీధులకు ఇప్పటికీ ప్రజల రాకపోకలకు అవకాశం లేదు. అలాంటి చోటికి ప్రభుత్వం నుంచి ఆహారం, తాగునీరు, నిత్యావసరాలు చేరడం లేదు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ వేలాది వాహనాలు నీళ్లలోనే ఉండిపోయాయి. అవన్నీ పాడైపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వదిలేస్తున్నారు. తరలించేందుకు అవకాశం ఉన్నవాటిని అతి కష్టం మీద మరమ్మతులకు తీసుకువెళుతున్నారు. ముంపు తగ్గిన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నప్పటికీ అవి నీటిలో మొరాయిస్తున్నాయి.సర్వం కోల్పోయాం ఆదుకోవాలిమేము కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. ఆదివారం ఉదయం బుడమేరు వరద ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కట్టుబట్టలతో బిల్డింగ్పైకి పరుగులు పెట్టాం. రెండు రోజుల పాటు ఆహారం, మంచినీరు లేకుండా బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయాం. కరెంట్ లేదు. ప్రభుత్వ సహాయక చర్యలు మాదాకా రాలేదు. తెలిసిన వాళ్ల ద్వారా పడవను తెప్పించుకుని ఒడ్డుకు చేరాం. బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకున్నాం. వారం రోజుల తర్వాత ఇంటిలోకి వెళ్లి చూస్తే గృహోపకరణాలన్నీ వరదలో తడిసి పాడైపోయాయి. ఇళ్లంతా బురద పేరుకుపోయింది. సర్వం కోల్పోయి తీవ్రంగా నష్ట పోయాం. ప్రభుత్వమే మమ్ములను ఆదుకోవాలి. – రేగాని సామ్రాజ్యం, వాంబేకాలనీ, సింగ్నగర్ లంటీర్లు ఉంటే ఈ కష్టాలు ఉండేవి కాదుఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నా. వరదలో ఇల్లు మునిగిపోయింది. ఆటో వరదలో మునిగి పాడైపోయింది. మా దగ్గర చిల్లిగవ్వలేదు. వారం రోజులుగా ఆహారం లేక, మంచినీరు అందక నరకం చూస్తున్నాం. వలంటీర్లు ఉంటే కుటుంబంలో అందరికీ ప్రభుత్వంఅందిస్తున్న సహాయ చర్యలు సక్రమంగా అందేవి. ఇప్పుడు ప్రధాన రోడ్డు వరకే ట్రాక్టర్ వస్తోంది. అక్కడకు వెళితే భోజనం ప్యాకెట్లు, వాటర్ ఇస్తున్నారే తప్ప చిన్న వీధుల్లోకి రావడం లేదు. భోజనం ప్యాకెట్లు తెరిచి చూస్తే వాసన వస్తోంది. తినలేకపోతున్నాం. – పలిశెట్టి సురేష్, సింగ్నగర్