breaking news
floods
-
నేపాల్కు మరో షాక్.. 5.3 తీవ్రతతో భూ ప్రకంపనలు!
ముస్తాంగ్: తీవ్ర వరదలతో ఇప్పటికే అతలాకుతలమైన నేపాల్ను తాజాగా భూకంపం కుదిపేసింది. దేశంలోని వాయువ్య ముస్తాంగ్ జిల్లాలో మంగళవారం రాత్రి 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు పొరుగు జిల్లాలైన మనాంగ్, డోల్పా, మ్యాగ్దీల్లోనూ నమోదయ్యాయి. జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం అధికారిక సమాచారం ప్రకారం (భారత కాలమానం ప్రకారం) రాత్రి 9.38 గంటలకు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. వాయువ్య నేపాల్లో 29.022 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 83.978 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమి ఉపరితలానికి 143 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయి.భూకంప కేంద్రం లోతుగా ఉండటంతో ఉపరితలంపై ప్రభావం పరిమితంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ నిర్మాణ నష్టం నమోదుకాలేదని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వేస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం ప్రకారం, రాత్రి 9.53 గంటలకు నమోదైన ఈ భూకంపానికి ముస్తాంగ్లోని లోమంథాంగ్ కేంద్రంగా ఉంది. ఇది ఖాట్మండుకు వాయువ్యంగా సుమారు 375 కిలోమీటర్ల దూరంలో ఉంది.గత నెలలో భోటే కోషి నది ఆకస్మిక వరదల కారణంగా నేపాల్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ విపత్తులో 1,357 మంది మృతి చెందారు. సహాయక, గాలింపు చర్యలు 14వ రోజుకు చేరాయి. రాయిటర్స్ అంచనా ప్రకారం వరదల వల్ల ప్రత్యక్షంగా 256 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లగా, ఆర్థిక ప్రభావం, దీర్ఘకాలిక పునరుద్ధరణ వ్యయం 400 కోట్ల నుంచి 700 కోట్ల డాలర్ల వరకు పెరగవచ్చు. నేపాల్ పోలీసులు 1,366 మంది మృతిచెందినట్లు, 4,077 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని తెలిపారు. ఇప్పటివరకు 533 మంది పురుషులు, 339 మంది మహిళల మృతదేహాలను వెలికితీశారు. వీటిలో 102 మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించారు.సహాయక చర్యల్లో భారత్.. నేపాల్కు తోడ్పాటునందిస్తోంది. చిలిమే సొరంగంలో శిథిలాలు, బురదను తొలగించేందుకు భారత, నేపాల్ బృందాలు చర్యలు కొనసాగిస్తున్నాయని నేపాల్లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ తెలిపారు. వాలుగా ఉన్న సొరంగంలో రాకపోకల కోసం హెచ్డీపీఈ పైపులను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. స్యాఫ్రుబేసి నుంచి సొరంగ ద్వారం వరకు తాత్కాలిక మార్గం ఏర్పాటుకు నియంత్రిత పేలుళ్ల ద్వారా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.ఇది కూడా చదవండి: మోక్షం కోసం చివరి మజిలీ.. ముక్తి భవన్ -
భారీ వర్షాలతో జపాన్ అతలాకుతలం
టోక్యో: సెంట్రల్ జపాన్ను కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని ప్రధాన నది పరిధిలో అత్యవసర వరద హెచ్చరిక జారీ చేశారు. రహదారులు, రైల్వే ట్రాక్లు సహా కీలక మౌలిక వసతులన్నీ నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక అధికారులు సూచించారు.జపాన్ వాతావరణ సంస్థ షోనై నదికి అత్యున్నత స్థాయి-5 వరద హెచ్చరిక జారీ చేసింది. ఈ నది గిఫు, ఐచి ప్రిఫెక్చర్ల మీదుగా ప్రవహిస్తుంది. నగోయాలో గంట వ్యవధిలోనే 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చికుసా, మోరియామా, మీటో వార్డుల్లోని ప్రజలు భద్రత కోసం అప్రమత్తంగా వ్యవహరించాలని నగర పాలక సంస్థ కోరింది. భారీ వర్షాల కారణంగా సంభవించిన వివిధ ఘటనల్లో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయని ఐచి ప్రిఫెక్చర్ ప్రభుత్వం తెలిపింది. సుమారు 2,700 మంది సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న ఆసియా క్రీడల వేదికల్లోనూ పలు చోట్ల వర్షపు నీరు చేరింది.నగర మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జేఆర్ చువో లైన్ రైల్వే ట్రాక్లు నీటమునిగాయి. రద్దీగా ఉండే సకాయే ప్రాంతంలోని రహదారులపై ఒక దశలో మోకాలి లోతు వరకు నీరు చేరింది. ఐచి ప్రిఫెక్చర్లోనే టయోటా మోటార్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఉంది. జేఆర్ సెంట్రల్ ప్రకారం, టోక్యో వైపు వెళ్లే టోకైడో షింకాన్సెన్ రైళ్లు ఒక దశలో ఒకాయామా-టోక్యో స్టేషన్ల మధ్య నిలిచిపోయాయి. టోక్యో-నగోయా మధ్య బయలుదేరే రైళ్లను కూడా నిలిపివేశారు. జేఆర్ వెస్ట్ ప్రకారం వర్షాల కారణంగా సాన్యో షింకాన్సెన్ సేవలు పాక్షికంగా నిలిచిపోయాయి. టోకైడో, సాన్యో షింకాన్సెన్ సేవలు సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో పునఃప్రారంభమయ్యాయి.ఐచి, గిఫు ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు ఒకే ప్రాంతంలో భారీ వర్షాలు కురిపించే ‘లీనియర్ రెయిన్బ్యాండ్స్’ ఏర్పడ్డాయని వాతావరణ సంస్థ తెలిపింది. పశ్చిమం నుంచి ఈశాన్య జపాన్ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొండచరియలు విరిగిపడటం, వరదల ముప్పుపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. టోక్యో, సైతామా, చిబా, కనగావాతో పాటు పశ్చిమ జపాన్లోని ఒసాకా, హ్యోగో ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఇది కూడా చదవండి: కాంగ్రెస్లో భారీ మార్పులు.. 120 మంది యువ నేతలకు పగ్గాలు! -
Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో
-
ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..
-
వచ్చేస్తోంది సూపర్ ఎల్నినో!
ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న భారతదేశానికి అంతర్జాతీయ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) పిడుగులాంటి వార్తను మోసుకొచ్చింది. ఈ ఏడాది మొదలైన ఎల్–నినో వచ్చే ఏడాది మొదటి వరకూ కచ్చితంగా కొనసాగుతుందని హెచ్చరించింది. ఫలితంగా మరిన్ని వాతావరణ విపత్తులు, వడగాడ్పులు, అకాల వర్షాలు, వరదలు తప్పవన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ అమెరికా వద్ద భూమధ్య రేఖ ప్రాంతంలోని పసఫిక్ మహా సముద్రపు ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు కొంచెం పెరిగితే దాన్ని ఎల్–నినో అంటారన్నది తెలిసిన విషయమే. నాలుగైదేళ్ల విరామంతో వచ్చే ఈ వాతావరణ దృగ్విషయం ప్రపంచ వాతావరణంపై మరీ ముఖ్యంగా భారతదేశానికి కీలకమైన నైరుతీ రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎల్నినో వచ్చిన సంవత్సరాల్లో రుతుపవనాలు బలహీనంగా ఉండటమే కాకుండా... వడగాడ్పులు పెరుగుతూంటాయి. అకాల వర్షాలు, వరదలు నమోదవుతూంటాయి. 2026లోనూ ఎల్–నినో ఏర్పడిందని, ఇది చరిత్రలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉండవచ్చునన్న అంచనాలను ప్రపంచ వాతావరణ సంస్థ ఈ ఏడాది మధ్యలోనూ ఇచ్చింది. అయితే తాజాగా గురువారం జారీ చేసిన ప్రకటనలో మాత్రం ఈసారి సూపర్ ఎల్–నినో పరిస్థితులు ఏర్పడటం వందకు వంద శాతం పక్కా అని తేల్చి చెప్పింది. చరిత్రలోనే అతిపెద్ద ఎల్–నినోగా అవతరించనుందని, 2027 ఫిబ్రవరి నెల వరకూ ఈ పరిస్థితులు కొనసాగవచ్చని స్పష్టం చేసింది. పసఫిక్ మహా సముద్ర ప్రాంతంలోని ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో ఉండటం దీనికి కారణమవుతోందని తెలిపింది. రెండున్నర డిగ్రీలు ఎక్కువ... పసఫిక్ మహా సముద్రంలో ఎల్–నినో పరిస్థితులను అంచనా కట్టేందుకు కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూంటారు. అలాంటి ప్రాంతాల్లో ఒకటైన ‘ద నినో 3.4’లో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు చాలా అసాధారణంగా ఉన్నట్లు తెలిసింది. మే–జూలై నెల మొదటి వరకూ ఇక్కడి ఉష్ణోగ్రతలు సగటు కంటే 1.5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉంటే జూలై నెలలో రెండు డిగ్రీలకు పెరిగింది. ఆ తరువాత వారం వారం ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదై ఆగస్టు మధ్యకు 2.6 డిగ్రీ సెల్సియస్కు చేరుకున్నట్లు డబ్ల్యూఎంఓ తెలిపింది. ఉపరితలంతోపాటు దిగువభాగంలోనూ కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎనిమిది డిగ్రీ సెల్సియస్ వరకూ ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులు ఎల్–నినో మరింత బలపడేందుకు కారణమవుతున్నాయని, 2026 ఆఖరుకు పతాక స్థాయికి చేరుతుందని వివరించింది. డబ్ల్యూఎంఓ అంచనాల ప్రకారం ఎల్–నినోల వివరాలు నమోదు చేయడం మొదలుపెట్టిన 1950 నుంచి తీసుకున్నా ఈ ఏడాది అతి బలమైన నాలుగు ఎల్నినోల్లో ఒకటిగా నిలుస్తుందని హెచ్చరించింది. ఒక్క తీరుగా ఉండని ప్రభావం... ఎల్నినో ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై ఒకే తీరైన ప్రభావం చూపకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తుంది. బలం ఆధారంగా ఏ దేశంపై ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో కూడా చెప్పలేము. భారత దేశం విషయానికి వస్తే... చాలా సందర్భాల్లో ఎల్నినో తీవ్రత నైరుతి రుతుపవనాలపై వ్యతిరేక ప్రభావం చూపింది. ఎల్నినో సంవత్సరాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అయితే కొన్ని సంవత్సరాల్లో దీనికి భిన్నమైన పరిస్థితులూ ఏర్పడటం గమనార్హం. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయని భారత వాతావరణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణల్లోనూ చాలా చోట్ల వర్షాలు తక్కువగానే కురిశాయి. ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా వర్షాలు సాధారణం కంటే 16 శాతం తక్కువగా నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూఎంఓ సూపర్ ఎల్నినో పక్కా అని, 2027 ఫిబ్రవరి వరకూ కొనసాగవచ్చునన్న ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. దీనర్థం... రానున్న మూడు నెలలు దేశంలో ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. హిందూ మహాసముద్రంలో పరిస్థితుల్లో ఏదైనా మార్పు వస్తే ఎల్నినో స్థితిగతుల్లోనూ తేడాలు వచ్చే అవకాశం ఉంది. సూపర్ ఎల్ నినో కారణంగా వచ్చే ఏడాది రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. ‘‘స్పానిష్ భాషలో ఎల్నినో అంటే చిన్న బాలుడని అర్థం. కానీ... వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేయగల సత్తా ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరవు కాటకాలు, కార్చిచ్చులు, వరదలు నమోదవుతున్నాయి. ఎన్నినో తీవ్రతతోపాటు ఇవి కూడా మరింత ప్రమాదకరంగా మారనున్నాయి. ఈ అసాధారణ ఎల్నినో పరిస్థితులను అంతేస్థాయిలో సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి. డబ్ల్యూఎంఓ యాభై ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో జాతీయ వాతావరణ సంస్థలు, జలవనరుల సేవలను అప్రమత్తం చేస్తున్నాం. మానవ ప్రాణ, జీవనోపాధి మార్గాలకు విఘాతం కలగకుండా ఎప్పటికప్పుడు సమాచారం అందించేది వీరే. ఐక్యరాజ్య సమితికి చెందిన అన్ని మానవీయ సేవల సంస్థలతో కలిసి పని చేసేందుకు డబ్ల్యూఎంఓ కట్టుబడి ఉంది. వాతావరణానికి సంబంధించిన సమాచారం, విపత్తుల నిర్వహణలో సాయం, వ్యవసాయం, ఆరోగ్యం, జలవనరుల నిర్వహణలో సాయం అందిస్తాం. వృథా చేసేంత సమయం లేనేలేదిప్పుడు’’ – డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ సెలెస్టీ సాలో – సాక్షి, నేషనల్ డెస్క్ -
డ్యామ్ల నిర్వహణకు ఏఐ వ్యవస్థ
త్రిశూర్: వరద ప్రమాదాలను తగ్గించేందుకు, డ్యామ్ల నిర్వహణ మరింత మెరుగ్గా ఉండేందుకు కేరళం రాష్ట్రానికి చెందిన పదిహేడేళ్ల యువకుడు నొవెయిన్ సరికొత్త కృత్రిమ మేధ వ్యవస్థను రూపొందించాడు. డ్యామ్ ఎగువ ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని, అలల తిరోగమన ప్రవాహాలను విశ్లేషించడం ద్వారా వరద ముప్పును తప్పించుకునేందుకు ఎంత తొందరగా డ్యామ్ నుంచి నీరు విడుదల చేయాలో అంచనా వేస్తుందీ వ్యవస్థ. దీనివల్ల వరద ముప్పు తగ్గడమే కాకుండా.. నీటిని సంరక్షించేందుకు కూడా వీలేర్పడుతుందని నొవెయిన్ చెబుతున్నాడు. 2018లో కేరళంలోని చాలక్కుడి ప్రాంతంలో వరదలు, ఆ సమయంలో ఆ ప్రాంతంలోని డ్యామ్ల పరిస్థితులపై వచ్చిన కథనాలతో స్ఫూర్తి పొంది తానీ వ్యవస్థను రూపొందించినట్లు చెప్పారు. పెద్ద పెద్ద డ్యామ్ల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలనని తాను నమ్మానని, పలు ప్రయత్నాలు విఫలమైనప్పటికీ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలన్న సంకల్పంతో ముందుకెళ్లానని, విజయం సాధించానని వివరించారు. ప్రస్తుతం తాను నమూనా వ్యవస్థను మాత్రమే తయారు చేశానని, మరింత సమర్థంగా పనిచేసే అసలు మోడళ్ల అభివృద్ధికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. నొవెయిన్ ఆవిష్కరణకు ప్రఖ్యాత ఎల్రక్టానిక్స్ కంపెనీ శాంసంగ్ తన సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ‘సాల్వ్ టుమారో’పోటీలో ప్రథమ స్థానం లభించింది. యువ ఇన్నొవేటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పోటీలో 40 మంది పాల్గొన్నారని, నొవెయిన్కు చెందిన అకూస్టీనోడ్ సిస్టమ్స్ మొదటి స్థానంలో నిలిచిందని శాంసంగ్ ఒక ప్రకటనలో తెలిపింది. -
వరదకు ఎదురీది.. ప్రాణం కాపాడిన యువకుడు
-
దారుణం చీకటిలోకి నేపాల్..నెక్స్ట్ స్టెప్ ఏంటి..?
-
నేపాల్ నెత్తిన మరో జలఖడ్గం
కఠ్మాండు: మెరుపు వరద బురదతో జలమయమైన నేపాల్ దిగువ ప్రాంతాలపై మళ్లీ వరద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు స్థానికుల కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. కనీవినీ ఎరుగని జల ప్రళయం దాటికి ఇప్పటికే దిగువ ప్రాంతాల్లో జనజీవనం కకావికలంకాగా మరోసారి అపార జలరాశి వరదరూపంలో వచ్చి పడే ఆస్కారముందని నేపాల్ వాతావరణ శాఖలోని వరద అంచనాల విభాగం బుధవారం హెచ్చరికలు జారీచేసింది. సింధూరి జిల్లాలో సున్ కోశి నది, గూర్ఖా జిల్లాలో బుధి గండకీ నది, దదేల్ధురా జిల్లాలో మహాకాళీ నది, లామ్జుంగ్ జిలాల్లో మార్షా్యంగ్డి నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నట్లు వరద అంచనాల విభాగం ప్రకటించింది. దిగువ ప్రాంతాల ప్రజలు జనావాసాల నుంచి ఎగువ ప్రాంతాలకు తరలిపోవాలని సూచనలుచేసింది. భుకుందేబేసీ వాటర్ లెవల్ మానిటరింగ్ కేంద్రంలో మంగళవారం రాత్రి 11.15 గంటలకే నది డేంజర్ మార్క్ను దాటేసింది. మార్షా్యంగ్డి నదిలో నీటి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు ఇప్పటికే వినాశనం సృష్టించిన వరద విలయంలో మృత్యువాత పడిన వారి సంఖ్య బుధవారానికి 1243కు పెరిగింది. మరో 4,216 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉంది. భారీ వర్షం, బురద మధ్యే భవన శిథిలాల్లో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనని ఆశతో అన్వేషణ బృందాలు కాలంతో పోటీపడుతూ సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. 1,113 మృతదేహాల గుర్తింపు, చట్టపర ప్రక్రియ పూర్తయిందని, 95 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. 21,314 మంది సైనికులు, పోలీసులు, వలంటీర్లు ఈ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే రాసువా, నువాకోట్లో కురుస్తున్న భారీ వర్షం సహాయక కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కల్గిస్తోంది. వర్షపు నీరు చేరుతుండటంతో జలవిద్యుత్కేంద్ర సొరంగంలో అన్వేషణ ఆగిపోయిందని జాతీయ విపత్తు ముప్పు తగ్గింపు, నిర్వహణ సంస్థ తెలిపింది. భూగర్భ జలవిద్యుత్ కేంద్రాల సొరంగాల్లో అన్వేషణకు భారత్, చైనా, ద.కొరియా నిపుణుల బృందాలు కృషిచేస్తున్నాయి. వాతావరణ మార్పులతోనే దారుణం: ప్రధాని సంపన్న దేశాలు వాతావరణంలోకి భారీగా విడుదలచేస్తున్న కర్భన ఉద్గారాలు, వాతావరణ మార్పుల కారణంగానే హిమానీనదాలు అమిత వేగంగా కరిగిపోతూ కొత్త ఉత్పాతాలను తీసుకొస్తున్నాయని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఆరోపించారు. బుధవారం నేపాల్ పార్లమెంట్ దిగువ సభలో ఆయన మాట్లాడారు. ‘‘భోటె కోశీలో వరద రావడానికి ప్రత్యక్షంగా వాతావరణమార్పులు(క్లైమేట్ చేంజ్) కారణమని నిపుణులు తేల్చేశారు. అంతర్జాతీయ సమాజానికి మేం చెప్పేదొక్కటే. మేం అనుభవిస్తున్న ఈ బాధలకు వాతావరణ మార్పులే కారణం.ప్రపంచ దేశాలతో పోలిస్తే నేపాల్ గ్రీన్హౌస్ వాయువులను అత్యల్పంగా విడుదలచేస్తుంది. కానీ ఇతర దేశాలు చేసిన పాపాలకు మేం బలవుతున్నాం’అని అన్నారు. ఆపన్న హస్తం అందిస్తున్న భారత్కు ప్రధాని బాలేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. కాఠ్మండులో సోనూ సూద్ సాయం కోవిడ్ సంక్షోభం వేళ భారీ సంఖ్యలో కరోనా బాధితులను ఆదుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారత చాటారు. కాఠ్మండుకు పెద్ద మొత్తంలో సహాయక సామగ్రిని తీసుకెళ్లి వరద బాధితులకు అందజేశారు. ‘‘ఇక్కడి వాళ్లకు సరిపడా సరకులు, ఆహారం, దుప్పట్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వరదతో సర్వం కోల్పోయిన వాళ్లకు మళ్లీ పాత జీవితాలను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’అని చెప్పారు. -
శాస్త్రీయతలేని విధానాలతోనే విపత్తులు
హిమాలయాలు ఒకదాని తర్వాత ఒకటిగా హెచ్చరికలు చేస్తూనే వస్తున్నాయి. ఆకస్మిక వరదలు, హిమ పాతాలు, హిమానీనద సరస్సులకు గండి పడటంతో ముంచెత్తుతున్న వరదలు, మేఘ విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం, తీవ్రంగా భూమి కుంగిపోవడం వంటివి వాటి కోవలోకి వస్తాయి. కేదార్నాథ్, ధౌళిగంగ, జోషీమఠ్, సిక్కిం, ఇపుడు నేపాల్లోకి సరిహద్దులు దాటి వచ్చిన వరదలు అలాంటివే. అటువంటి ప్రతి ఉత్పాతంలోనూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అపారమైన విధ్వంసం కనుల ఎదుట నిలుస్తోంది. హిమాలయాలలో సంభవిస్తున్న విపత్తులను ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరం. శాస్త్రీయ పరిశోధనలు సాగించడం, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే యంత్రాంగాలను తయారు చేసుకోవడం, ప్రజా చైతన్యం తీసుకు రావడం, సమాజాలను కూడా ఈ కృషిలో భాగస్వాములుగా చేయడం వంటివి చేపట్టక తప్పదు. నివేదికలు వెల్లడిస్తున్న వాస్తవాలువాతావరణ మార్పుపై ఏర్పడిన వివిధ ప్రభుత్వాల ప్యానెల్ అంతర్జాతీయ స్థాయిలో వివిధ నివేదికలను ప్రచురించింది. గ్లేసియర్లు, పర్వత ప్రాంతాలలోని జీవావరణ వ్యవస్థల గురించి వివిధ దేశాలు వాటి పరిశోధనల్లో కనుగొన్న అంశాలకు ఒక సమగ్ర రూపం ఇచ్చింది. మన దేశంలోనూ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రిమోట్ సెన్సింగ్ ఇమేజరీని ఉపయోగించి (మొత్తం 28,000లలో) 7,500లకు పైగా గ్లేసియల్ సరస్సుల మ్యాప్ను రూపొందించింది. హై–రిస్క్ గ్లేసియల్ సరస్సులకు సంబంధించి అది వరద ముప్పుల మ్యాప్ను కూడా తయారు చేసింది. ఐసు గడ్డలు, బండరాళ్ళు కట్టలుగా ఉన్న సరస్సులు ఒక్కసారి తెగిపడితే రాగల వరదలు, వాటివల్ల దిగువ పరీవాహక ప్రాంతాల్లోనున్న జనావాసాలకు వాటిల్లగల నష్టాల గురించి కూడా అది తెలియజేసింది. కాఠ్మాండూకు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటెగ్రే టెడ్ మౌంటైన్ డెవలప్మెంట్(ఐసీఐఎంఓడీ) మొన్నీమధ్య అంటే 2026 మార్చిలో కూడా రెండు గణనీయమైన నివేదికలను ప్రచురించింది. వాటిలో ఒకటి హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలో 1990 నుంచి 2020ల వరకు మారుతున్న గ్లేసియర్ల గతిశీలతలను వివరించింది. మరోటి 2026 నాటికి ఉన్న హిందూ కుష్ హిమాలయ గ్లేసి యర్ల స్థూల స్వరూప స్వభావాలను వెల్లడించింది. ఈ నివేదికలు వెల్లడిస్తున్న అంశాలు ఆందోళన రేపేవిగా ఉన్నాయి. మొదటి నివేదిక 55 వేలకు పైగా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హిందూ కుష్ ప్రాంతమంతటానున్న 63,761 గ్లేసియర్ల డేటాను ఆధారం చేసుకుని రూపొందింది. వాటిలో 5,700 క్యూబిక్ కిలోమీటర్ల మేర ఐసు నిల్వలున్నాయి. నలుచెరగులా ఉన్న ఈ గ్లేసి యర్లు 1990ల ఆరంభం నుంచి స్థిరంగా కరిగిపోతూ వస్తున్నా యని ఆ విశ్లేషణ తెలిపింది. మొత్తం గ్లేసియర్ ప్రాంతంలో 12 శాతం తరిగిపోయింది. అంచనా వేసిన హిమ నిల్వలలో 9 శాతం క్షీణత కనిపించింది. గ్లేసియర్లు అలా కుంచించుకుపోవడం 2010 నుంచి 2020 మధ్య కాలంలో మరీ కొట్టొచ్చినట్లు కనిపించింది. సింధు నదీ పరీవాహక ప్రాంతం 6 శాతం గ్లేసియర్ ప్రాంతాన్ని కోల్పోయింది. గంగా నది 21 శాతం, బ్రహ్మపుత్ర 16 శాతం తరుగుదలను నమోదు చేశాయి. హిమం గడ్డకట్టిన ప్రాంతాలు కుంచించుకు పోవడం వల్ల వర్షాకాలం మినహా ఇతర కాలాల్లో నీటి లభ్యత తగ్గి పోతోంది. రెండవ నివేదిక 38 గ్లేసియర్ల సన్నిహిత పరిశీలనతో తయారైంది. హిమాలయాల్లో హిమం గడ్డకట్టిన భూభాగాల్లో కొన్ని పాతరూపును పూర్తిగా కోల్పోయే స్థితికి చేరుకున్నట్లుగా కనిపిస్తున్నా యని ఈ నివేదిక వెల్లడించింది. ‘‘ఇది ఎక్కడో సుదూరంలో ఉన్న సమస్య కాదు. నేటి కాలంలో ఆవిష్కృతమవుతున్న సంక్షోభం. ప్రతి వేసవిలోను, వర్షాకాలంలోను కొత్త ఉపద్రవాలను చూస్తున్నాం. హిమాన్ని కోల్పోతున్న రేట్లు ఈ శతాబ్దంలో రెండింతలైన వాస్తవ మైనా కనీసం మన కళ్లు తెరిపించాలి’’ అని ఐసీఐఎంఓడీ డైరెక్టర్ జనరల్ పెమా గ్యాంషో అన్నారు. నేపాల్లో ఇటీవల చూసిన వరదలు గ్యాంషో హెచ్చరికలోని వాస్తవాన్ని ఎత్తి చూపాయి. ఇది గ్లేసియర్ గతిశీలతల సైన్స్, ఉపగ్రహాల విశ్లేషణ, 1974 నుంచి క్షేత్ర స్థాయిలో సేకరిస్తూ వస్తున్న డేటాను ఆధారం చేసుకుని చేసిన స్పష్టమైన హెచ్చరికగా భావించవచ్చు. రుణాలు ఎలా ఇస్తున్నారు?డేటాను విశ్లేషించడం ద్వారా, నిష్క్రియాపరత్వం వల్ల కలిగే ప్రమాదకర పర్యవసానాలను తెలుపడం ద్వారా సైంటిస్టులు తమ వంతు కృషి చేస్తున్నారు. కానీ, విధాన నిర్ణేతల స్పందనే మంద కొడిగా ఉంది. అంతర్జాతీయంగా కూడా, వివిధ దేశాల ప్యానెళ్ళ నివేదికలపై స్పందన లోపభూయిష్టంగా ఉంది. ముఖ్యంగా, పుడమి తాపాన్ని తగ్గించేందుకు ఉద్గారాలను తగ్గించు కోవాల్సిన అంశంపై వాటి కార్యాచరణ పేలవంగా ఉంది. దాని ప్రత్యక్ష ఫలితం హిమా లయాలపై పడుతోంది. ప్రాంతీయ స్థాయిలో హిమాలయ ప్రాంతంలోని దేశాల మధ్య సహకారం బొత్తిగా లేదనే చెప్పాలి. ప్రాంతాల మధ్య రాజకీయ సరిహద్దులను ప్రకృతి ఉత్పాతాలు, వాతావరణం గుర్తించవు కనుక ఈ ప్రాంతంలోని దేశాలు సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుని తీరాలి. సింధు, గంగ, బ్రహ్మపుత్ర, మెకాంగ్ వంటి పెద్ద నదులన్నీ హిమాల యాలలోనే పుడుతున్నాయి. వివిధ దేశాలను దాటి ప్రవహిస్తు న్నాయి. కనుక, ఒక దేశంలో ఆ నదిలోకి కొండ చరియలు విరిగి పడితే, అది మరో దేశంలో వినాశకర వరదలకు కారణంగా పరిణ మించవచ్చు. లిహెండే ఖోలా నదిలో గత ఏడాది జూలైలో సంభవించిన విపత్తు అదే రసూవా, నువాకోట్ ప్రాంతంలోని కనీసం అర డజను జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులకు నష్టం కలిగించింది. ఇపుడు వార్తలకెక్కిన ప్రాంతం అప్పుడూ ఇంచుమించుగా ఇవే కారణాలపై వార్తలకెక్కింది. త్రిశూలి పరీవాహక ప్రాంతంలో దాదాపు 36 జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. బహుళ జాతీయ రుణ సంస్థలు కూడా ఆయా అంశాలు వేటినీ లెక్కలోకి తీసుకోకుండా రుణాలు ఇస్తూనే ఉన్నాయి. ఆనకట్టలు, నదులు, ప్రజానీకంపై అధ్యయనం చేసిన సౌత్ ఏషియా నెట్వర్క్ విశ్లేషణలో ఆ అంశాలు వెలుగు చూశాయి. భారతదేశంలో కూడా ప్రకృతి ఉత్పాతాలు, హిమ పాతాలు సంభవించే, శిథిల ప్రవాహాలుసాగే ప్రాంతాల్లో జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులు చురుకుగా సాగుతున్నాయి. రెండూ సాగవు!హిమాలయాల్లో జీవావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలు రాజకీయంగా కూడా సున్నితమైనవి. అవి భారత్, చైనా, నేపాల్ సరిహద్దుల గుండా వ్యాపించి ఉన్నాయి. వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా మౌలిక వసతులను పెద్దయెత్తున అభివృద్ధి చేస్తున్నాయి. పైగా, సామూహిక యాత్రలను, వాణిజ్యపరమైన పర్వత ప్రాంత టూరిజాన్ని అవి ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నాయి. కానీ, పర్యావరణపరంగా పెళుసైన ప్రాంతాల్లో నిర్నిరోధ అభి వృద్ధి, కమర్షియల్ టూరిజం చెట్టపట్టాలేసుకుని సాగలేవని గ్రహించాలి. శాస్త్రీయ ఆధారాలు, విధాన నిర్ణయాల మధ్య అగాథాన్ని భర్తీ చేయడం ద్వారా పర్వత ప్రాంతాల్లో సంభవించగల విపత్తుల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
అమ్మా, నాన్న క్షేమమే కదా..! నీట్ పీజీ విద్యార్థి భావోద్వేగం
నేపాల్లో సంభవించిన జలప్రళయం వేలాది కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. అందులో గల్లంతైన వారి ఆచూకి కోసం కొండంత ఆశతో చూస్తూన్న ఘోష మాటలకందనిది. ఈ నేపథ్యంలో ఓ కంటెంట్ క్రియేటర్ నీట్ పీజీ వైద్య విద్యార్థి తన్వి షేర్ సోషల్ మీడియా వేదకగా షేర్ చేసిన వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆమె పేరెంట్స్ కూడా నేపాల్ వరదల్లో గల్లంతయ్యారు. ఇంతవరకు వారి ఆచూకీ కానరాలేదు. అయినా సరే తన అమ్మనాన్న ఎక్కడోఒక చోట క్షేమంగా ఉంటారని కొండంత ఆశతో చూస్తున్నా అటూ కన్నీటి పర్యంతమైందామె వీడియోలో. తన్వి తల్లిదండ్రలు 67 మంది సభ్యుల బృందంతో కలిసి కైలాస యాత్రకు వెళ్లినట్లు పేర్కొంది. ఆ బృందం చివగా ఇమ్మిగ్రేషన్ సెంటర్ ఫ్రెండ్షిప్బ్రిడ్జ్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ రెండు ప్రదేశాలు ఇప్పడు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ తన తల్లిదండ్రులు అక్కడున్న ఏదో ఒక పునరాసవ కేంద్రానికి చేరుకుని సురక్షితంగా ఉంటారేమోనని ఆశిస్తోందామె. ఆ బృందంలోని ఎవ్వర్నీ సంప్రదించలేకపోవడంతో ఆమె తల్లిదండ్రలు ఆచూకీ మరింత క్లిష్టంగా మారింది. ఆ విషయాన్నే ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియోలో వివరిస్తూ..కన్నీళ్లు పెట్టుకుంది. తాను భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల శాక, నేపాల్, చైనా అధికారులను సైతం సంప్రదించామని, అయినా ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొంది. తాను నీట్ పీజీ పరీక్ష రాస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నానని, కన్నీళ్లు వచ్చేయడంతో కొన్ని ప్రశ్నలు చదవలేకపోయానని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. తన తండ్రి ఈ పరీక్ష రాయాలని కోరుకున్నారు, అందువల్ల కచ్చితంగా ఈ పరీక్ష రాసి తీరాల్సి వచ్చింది. అంతకంటే బాధకరం ఏంటంటే..పరీక్షకు వెళ్లేమందు అమ్మ పెరుగు చక్కెర కలిపి తినిపించి ఆల్ది బెస్ట్ చెప్పి దీవించేవారు. అది మరింత గుర్తు వచ్చి కన్నీళ్లు ఆగలేదు అంటూ ఆవేదనగా చెప్పింది. ఎలాగైన వాళ్లు తిరిగి రావాలి, కచ్చితంగా తిరిగి రావాలంటే ఉబికివస్తున్న కన్నీళ్లతో చెబుతూ తన సంభాషణను ముగించింది. కాగా, నేపాల్ విపత్తులో మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి 939కి చేరగా, గల్లంతైన వారి సంఖ్య నాలుగువేలకు చేరుకుందని అధికారులు తెలిపారు. సుమారు 158 మంది భారతీయులను రక్షించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. View this post on Instagram A post shared by Tanvi (@tanvimakesvideos) (చదవండి: విపత్తు మిగిల్చిన విషాదం..! తల్లిదండ్రుల ఆచూకీ కోసం..ఆ పసివాడు..) -
భారత్కు కృతజ్ఞతలు తెలిపిన నేపాల్ ప్రధాని
ఖాట్మండు: దేశం అత్యంత కష్ట సమయంలో ఉండగా సహకరించినందుకు భారత్కు నేపాల్ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. వరద సహాయక, రెస్క్యూ ఆపరేషన్లలో సహాయం చేసినందుకు నేపాల్ భారత్, చైనాలకు ధన్యవాదాలన్నారు. ఈ రోజు బుధవారం పార్లమెంటులో ప్రసంగిస్తూ, రెండు పొరుగు దేశాలు సకాలంలో సహాయక సామగ్రి, సాంకేతిక బృందాలతో పాటు అత్యవసర సహాయాన్ని నేపాల్కు అందించాయని తెలిపారు. కాగా ఇటీవల నేపాల్లో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొరుగుదేశమైన భారత్ వెనువెంటనే నేపాల్కు ఆపన్న హస్తం అందించింది. భారతదేశం ఐదవ విడత సహాయ సామాగ్రిని పంపింది. భారత బృందాలు సొరంగాలలో గాలింపు చర్యలలో సహాయం చేస్తూ మృతదేహాలను గుర్తించడంలో సహకరిస్తున్నాయి. నేపాల్ వరదల కారణంగా ఇప్పటివరకు 1,127 మంది ప్రాణాలు కోల్పోగా, 4,800 మందికి పైగా గల్లంతయ్యారు. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులలోని కార్మికులు సైతం గల్లంతయ్యారు. మరికొంతమంది సొరంగాలలో చిక్కుకుని ఉండవచ్చని భయపడుతున్నారు. ఈ విపత్కర సమయంలో భారత్ నేపాల్కు అపన్నహస్తం అందించింది. సహాయక చర్యల నిమిత్తం పలు కీలక సామాగ్రిని నేపాల్ పంపింది.నేపాల్కు అండగా నిలిచిన భారత్మొదటి C-130J విమానం దుప్పట్లు, టార్పాలిన్లు, పరిశుభ్రతా కిట్లు మరియు నిత్యావసర వస్తువులతో సహా సుమారు 10 టన్నుల సహాయ సామాగ్రిని అందించింది.ఆగస్టు 27 – ఒక సి-17 గ్లోబ్మాస్టర్ విమానం సహాయక సామాగ్రి, మందులు మరియు ఆహార ప్యాకెట్లతో సహా 37.5 టన్నుల సహాయాన్ని అందించింది.ఆగస్టు 28 – మూడవ విడతలో సుమారు 10 టన్నుల సహాయక సామగ్రి, 11 మంది సభ్యుల వైద్య మరియు సొరంగ-రెస్క్యూ నిపుణుల బృందాన్ని నేపాల్కు పంపింది. ఆగస్టు 30 – నాల్గవ విమానం 11 టన్నుల సహాయ సామాగ్రితో పాటు, DNA ఫోరెన్సిక్ నిపుణులు మరియు సొరంగం రెస్క్యూ పరికరాలను అందించింది.సెప్టెంబర్ 2 – 11 మంది సభ్యుల ప్రత్యేక సహాయక బృందం, అదనపు సాంకేతిక సహాయంతో కూడిన ఐదవ విమానాన్ని నేపాల్కు పంపారు. మృతదేహాలను గుర్తించడంలో సహాయపడటానికి భారత్ డీఎన్ఏ పరీక్ష నిపుణుల బృందాన్ని సైతం నేపాల్కు పంపింది. -
Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!
-
నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో
-
కొట్టుకుపోతున్న పాకిస్థాన్ ఇస్లామాబాద్ ను ముంచెత్తిన వరదలు
-
నేపాల్: టన్నెళ్లలో భారత రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు
కఠ్మాండు: వరదలతో అతలాకుతలమైన నేపాల్లోని చిలిమె, లాంగ్టాంగ్ జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద భారత ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం సహాయక చర్యల్లో ముందడుగు వేసింది. ప్రతికూల వాతావరణం, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ నేపాలీ సైన్యంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను వేగవంతం చేసింది.చిలిమె ప్రాజెక్టు టన్నెల్లోకి బృందం విజయవంతంగా ప్రవేశించి లోపల భద్రతా తాళ్లను ఏర్పాటు చేసిందని, లాంగ్టాంగ్ వద్ద టన్నెల్లో దాదాపు 185 మీటర్ల మేర లోపలికి వెళ్లి గాలింపు చేపట్టిందని నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న సాంకేతిక బృందాలతో సోమవారం సమావేశమైన ఆయన, అక్కడ జరుగుతున్న పురోగతిని సమీక్షించారు. Indian and Nepali rescue teams work side by side inside the Chilime tunnel in Nepal's Rasuwa district, searching for people who may still be trapped after the devastating floods pic.twitter.com/4zNZYwi8xC— WION (@WIONews) September 1, 2026ఆగస్టు 26న నేపాల్లోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. ఈ విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతయ్యారు. వరదల అనంతరం వివిధ జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద ఆచూకీ లేకుండా పోయిన సిబ్బంది, కార్మికులను గుర్తించేందుకు భారత్, చైనా నిపుణుల బృందాలు నేపాల్కు సహకారం అందిస్తున్నాయి.రసువా ప్రాంతంలో సహాయక చర్యలకు కేంద్రంగా ఉన్న నువాకోట్లోని బిదూర్ వద్ద గల నేపాలీ సైనిక స్థావరాన్ని రాయబారి సందర్శించారు. అనంతరం నేపాల్ హోం మంత్రి సుదాన్ గురుంగ్, ఇంధన-జలవనరుల శాఖ మంత్రి బిరాజ్ భక్త శ్రేష్ఠలతో సమావేశమై భారత్ తరఫున అందిస్తున్న సహాయ సహకారాలపై చర్చించారు. మరోవైపు, నేపాల్ పోలీసుల ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీతో కలిసి భారత ప్రత్యేక ఫోరెన్సిక్ బృందం ఖాట్మండులో విధులు నిర్వహిస్తూ వివిధ పద్ధతులు, డాక్యుమెంటేషన్ ప్రక్రియల సమన్వయంలో తోడ్పడుతోందని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) వెల్లడించింది.ఇది కూడా చదవండి: ఎన్ఆర్సీ? లేదా జనగణన?.. మణిపూర్లో కొత్త రచ్చ! -
మృతదేహాల గుర్తింపు కోసం నేపాల్ కీలక నిర్ణయం
ఖాట్మండు: నేపాల్ ఆకస్మికంగా వచ్చిన వరదలు తీవ్రస్థాయిలో ప్రాణ, ధన నష్టం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ జలప్రళయం కారణంగా మృతిచెందిన వారి సంఖ్య ఇప్పటివరకూ 1,066కు చేరుకుంది. మరో వేల సంఖ్యలో ప్రజల జాడ తెలియలేదు. మృతదేహాలను గుర్తించడం సైతం ఇప్పుడు అధికారులకు పెద్ద సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులోనైనా మృతదేహాల గుర్తింపు సులభతరమయ్యేలా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.నేపాల్లో వరదల కారణంగా మృతిచెందిన వారి వందలాది మృతదేహాలు దహనం చేయడానికి బదులుగా ఖననం చేయాలని అక్కడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మృతదేహాల అవశేషాలు సురక్షితంగా ఉంటాయని తద్వారా భవిష్యత్తులో DNA ను కుటుంబ సభ్యులకు గుర్తించి అప్పగించవచ్చని భావిస్తున్నారు.ఇప్పటికే బురద, వరద నీరు తదితర కారణాలతో మృతదేహాల పరిస్థితి క్షీణించింది. అనేక మృతదేహాలు నీటిలో వాపు మరియు వేగంగా కుళ్ళిపోతున్నాయి. దీంతో వారిని గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. మరోవైపు, మార్చురీ, తాత్కాలిక కేంద్రాలు సైతం మృతదేహాలతో నిండి పోయాయి. ఈ పరిస్థితిలో, పరిపాలన చాలా కాలం పాటు శరీరాలను సురక్షితంగా ఉంచడం సాధ్యం కాదని అందుకే గుర్తు తెలియని మృతదేహాలు సామూహిక సమాధుల్లో ఖననం చేయబడుతున్నట్లు అధికారులు తెలిపారు. .కాగా ఆగస్టు 26న సంభవించిన వరదల కారణంగా ఇప్పటివరకూ 1066 మంది మృతిచెందారు, వారిలో 1050 మంది నేపాల్, టిబెట్లో 16 మంది మరణించారు. అదే విధంగా దాదాపు 4,400 మందికి పైగా ప్రజలు ఆచూకీ గల్లంతైంది. -
చావు అంచుల వరకు వెళ్లిన యువకుడు.. కాపాడిన ‘చున్నీ’
భోపాల్: ఒక్కసారిగా విరుచుకుపడిన భయంకరమైన వరద.. కళ్లముందే బైక్తో సహా కొట్టుకుపోతున్న ఒక వ్యక్తి.. ‘కాపాడండి.. కాపాడండి’ అని ప్రాణభయంతో కేకలు వేస్తూ అర్థిస్తున్నాడు. అప్పుడే దేవుడిలా ముందుకొచ్చింది ఓ నవవధువు! క్షణం ఆలస్యం చేయకుండా తన మెడలోని చున్నీనే తాడులా విసిరింది! ఆ అభాగ్యుడు దాన్ని పట్టుకోగానే.. తన బంధువు, మరో స్థానికుడి సాయంతో శక్తులన్నీ ఒడ్డి అతడిని ఒడ్డుకు లాగి, మృత్యువు నుంచి కాపాడింది.ఘటాష్నిలోని మామ్లా గ్రామానికి చెందిన ఆ వ్యక్తి సోమవారం సాయంత్రం ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఉప్పొంగిన వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోవడం ప్రారంభించాడు. అదే సమయంలో రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న నవవధువు, ఆమె బంధువైన మరో మహిళ ఈ భయానక దృశ్యాన్ని గమనించారు. క్షణం కూడా ఆలోచించకుండా ఆ నవవధువు తన మెడలోని చున్నీని తొలగించి, నీటి ప్రవాహంలో పోరాడుతున్న బైకర్ వైపు తాడులా విసిరింది.ఆ వ్యక్తి చాకచక్యంగా చున్నీని పట్టుకోగా, నవవధువు,ఆమెతో ఉన్న మహిళ దాన్ని గట్టిగా పట్టుకుని ఒడ్డుకు లాగడం ప్రారంభించారు. వారి ధైర్యసాహసాలను చూసిన మరో స్థానికుడు కూడా వెంటనే పరుగెత్తుకొచ్చి వారితో చేయి కలిపాడు. ముగ్గురూ కలిసి శక్తులన్నీ ఒడ్డి ఆ బైకర్ను ప్రాణాపాయం నుంచి సురక్షితంగా రక్షించారు.ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న రికార్డు స్థాయి వర్షాలకు చంబా జిల్లా అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడటంతో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితిలోనూ సొంత ప్రాణాలను పణంగా పెట్టి బైకర్ను కాపాడిన ఆ నవవధువు, ఆమె బంధువుల సాహసాన్ని స్థానికులతో పాటు ప్రభుత్వ అధికారులు విశేషంగా కొనియాడుతున్నారు. A biker caught in a sudden flash flood in Himachal Pradesh's Chamba was pulled to safety by a family who risked the strong current to help him. The incident took place on the Kakiara-Tunuhatti road in the Bharmala area of Bhatiyat after heavy rain late in the evening caused water… pic.twitter.com/pdvEimLaER— NDTV (@ndtv) September 1, 2026 -
వరదల్లో బ్యాంకు లాకర్లు.. కోట్ల నగదు, బంగారం?
ఖాట్మండు:నేపాల్ వరదలు సృష్టించిన బీభత్సం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అకస్మాత్తుగా వచ్చిన వరదలు తీవ్రమైన ప్రాణనష్టం కలిగించడంతో పాటు పెద్దఎత్తున ఆస్తినష్టం కలిగించాయి. మృతుల సంఖ్య ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నేపాల్ పోలీసులకు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. భారీస్థాయిలో వచ్చిన వరదలకు పెద్దఎత్తున లాకర్లు నీటి ప్రవాహాంలో కొట్టుకుపోవడంతో వాటి కోసం ఇప్పుడు తీవ్ర స్థాయిలో గాలింపులు చేపడుతున్నారు. వరద ప్రవాహంలో దాదాపు 20 బ్యాంకులకు చెందిన లాకర్లు కొట్టుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. వాటిని సురక్షితంగా స్వాధీనం చేసుకోవడం, అవి దుండగుల చేతుల్లోకి వెళ్లకుండా చూడటం పోలీసులకు మరో పెద్ద బాధ్యతగా మారిందని తెలిపారు. ఈ వాల్ట్లలో కొన్ని భారీ మొత్తంలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఈ వివరాలపై డీఐజీ అబి నారాయణ్ కాఫ్లే మాట్లాడుతూ, వరదల అనంతరం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రస్తుతం పోలీసుల ప్రధాన ప్రాధాన్యత గల్లంతైన వ్యక్తుల కోసం గాలించడం, వారిని రక్షించడమేనని తెలిపారు. అదే సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కూడా తమపై ఉందన్నారు.“రసువా, ధాదింగ్, చిత్వన్ తదితర ప్రాంతాల్లోని పలు బ్యాంకులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నగదు, బంగారం వంటి విలువైన వస్తువులు ఉన్న వాటిలో చాలా వాల్ట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. మరికొన్ని భారీగా పేరుకుపోయిన బురద కింద కూరుకుపోయాయి. మా సిబ్బంది ప్రస్తుతం ఆ వాల్ట్లను గుర్తించి, సురక్షితంగా స్వాధీనం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొట్టుకుపోయిన వాల్ట్లను కొందరు వ్యక్తులు పగులగొట్టి నగదును దొంగిలించిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి” అని కాఫ్లే తెలిపారు.ఈ పరిణామాల మధ్య ధాదింగ్ జిల్లాలో పోలీసులు 29 మందిని అరెస్టు చేశారు. ఎగువ రసువా ప్రాంతంలో వరదల్లో కొట్టుకుపోయిన ఓ బ్యాంకు వాల్ట్ నుంచి NPR 92 లక్షలు (నేపాలీ రూపాయలు) దొంగిలించినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన వివరాల ప్రకారం, ఆ వాల్ట్లో NPR 1.5 కోట్లు నగదుతో పాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి. అందులో NPR 50 కోట్ల విలువైన బంగారం సైతం ఉన్నట్లు తెలిపారు.ఇదే సమయంలో మరో ఘటనలో ‘కృషి వికాస్ బ్యాంక్’కు చెందిన నువాకోట్ వాల్ట్ను పోలీసులు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక, రక్షణ చర్యలను మరింత ముమ్మరం చేసిన నేపాల్ పోలీసులు భారీ స్థాయిలో సిబ్బందిని రంగంలోకి దించారు. సహాయక, రక్షణ చర్యల్లో ప్రస్తుతం 7,894 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు.గల్లంతైన వారి కోసం గాలింపు, బాధితులను రక్షించడం, వరద ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు, వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు వాల్ట్లను గుర్తించి వాటిలోని నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను సురక్షితంగా కాపాడటం ఇప్పుడు నేపాల్ పోలీసులకు మరో కీలక సవాల్గా మారింది. -
నేపాల్ లో హృదయ విదారకం.. తవ్వేకొద్దీ బయటపడుతున్న మృతదేహాలు
-
Nepal: ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఖాయం..
-
టన్నెల్లో 93 మంది మిస్సింగ్.. డ్రోన్ల గాలింపులోనూ ఫలితం లేదు!
నేపాల్లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వరదల తాకిడికి రసువా జిల్లాలోని 111 మెగావాట్ల రసువాగఢి జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న 93 మంది వ్యక్తులు కనిపించకుండా పోయారు. అయితే వారు టన్నెల్లో చిక్కుకుపోయారనే అనుమానంతో టన్నెల్లో డ్రోన్లతో ప్రత్యేక గాలింపులు చేపడుతున్నారు. వారి ఆచూకీ లభించలేదు. దీంతో వారి క్షేమ సమాచారంపై ఆందోళన నెలకొంది.అసలు ఏం జరిగింది?భోటే కోషి నదిలో ఒక్కసారిగా భారీగా వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రసువాగఢి ప్రాంతంలోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ వరదల సమయంలో జలవిద్యుత్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న పలువురు కార్మికులు బయటకు రాలేకపోయి ఉండవచ్చని అధికారులు అనుమానించారు. ప్రత్యేకంగా టన్నెల్లోని చివరి భాగంలో కార్మికులు చిక్కుకుపోయి ఉండవచ్చన్న సమాచారంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.అయితే జలవిద్యుత్ ప్రాజెక్టుల టన్నెల్లు సాధారణంగా కొండల లోపలికి చాలా దూరం వెళ్తాయి. వరద నీరు, బురద, రాళ్లు, మట్టి, దెబ్బతిన్న నిర్మాణాలు, ఆక్సిజన్ కొరత వంటి సమస్యలు ఉంటే మనుషులను నేరుగా లోపలికి పంపడం అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. దీంతో డ్రోన్లతో ప్రత్యేక గాలింపులు చేపట్టారు.కార్మికులంతా టన్నెల్లో చిక్కుకుపోయి ఉండవచ్చన్న అనుమానంతో నేపాల్ సైన్యం, ఇంజినీర్లు, డ్రోన్ నిపుణులతో కూడిన బృందం టన్నెల్లోకి వెళ్లి విస్తృతంగా గాలింపు చేపట్టింది.అయితే టన్నెల్లోని అత్యంత లోపలి ప్రాంతం, చివరి భాగం వరకు చేరుకున్న రెస్క్యూ బృందానికి అక్కడ ఎవరూ ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు కనిపించలేదు. థర్మల్ డ్రోన్లతో కూడా లోపల పరిశీలన జరిపారు. అయినప్పటికీ మనుషుల ఉనికిని సూచించే ఆధారాలు దొరకలేదు. దీంతో ఈ దశలో టన్నెల్లో గాలింపు చర్యలు నిలిపివేశారు. థర్మల్ కెమెరాలు సాధారణ కెమెరాల మాదిరిగా కేవలం మనుషుల ఆకారాన్ని మాత్రమే చూడవు. శరీరం నుంచి వెలువడే వేడిని గుర్తించగలవు. చీకటి లేదా తక్కువ వెలుతురు ఉన్న ప్రాంతాల్లో కూడా వేడి ఆధారంగా జీవి ఉన్న అవకాశాన్ని గుర్తించడంలో అవి సహాయపడతాయి.ఈ ఘటనలో రెస్క్యూ బృందం నేరుగా ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా డ్రోన్లను ముందుకు పంపింది.టన్నెల్ చివరి భాగం వరకు డ్రోన్లు వెళ్లి పరిశీలించాయి. అయితే అక్కడ మనిషి ఉనికిని సూచించే సంకేతాలు కనిపించలేదు.అయితే థర్మల్ డ్రోన్ మనిషి శరీర ఉష్ణాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. కానీ భారీ బురద, రాళ్లు, నీరు, కాంక్రీట్ లేదా ఇతర పదార్థాల వెనుక ఎవరైనా పూర్తిగా కప్పబడి ఉంటే గుర్తింపు కష్టమవుతుంది. అదేవిధంగా శరీర ఉష్ణోగ్రత చాలా తగ్గిపోయినా లేదా వ్యక్తి డ్రోన్ సెన్సర్కు కనిపించని ప్రదేశంలో ఉన్నా సంకేతం దొరకకపోవచ్చు. దీంతో కార్మికుల ఆచూకీ కనుక్కోవడం ఇప్పుడు ఎంతో కష్టతరంగా మారింది. -
Viral : నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన బ్యాంకు సొమ్ము! ఎం చేసారంటే
-
Viral Video: వరదల్లో మృత్యువుతో పోరాడుతున్న వ్యక్తికి ఏనుగు అండ
-
విపత్తు మిగిల్చిన విషాదం..! పాపం ఆ పసివాడు..
నేపాల్ జలప్రళయం అంతులేని విషాదాన్ని మిగల్చడమే కాదు ఎందరో చిన్నారులను అభాగ్యులగా మార్చేసింది. ఆ విషాదం గడిచి నాలుగురోజులైన దాని తాలుకు బాధకర దృశ్యాలు ఇంకా వెన్నాడుతూనే ఉండటం బాధకరం. అందుకు సంబంధించిన ఓ హృదయ విదారక వీడియో అందర్నీ కంటతడిపెట్టిస్తోంది. నేపాల్ భారీ వరదల తాలుకా ఓ వీడియో అందరీ హృదయాలను కదిలిస్తోంది. ప్రస్తుతం అక్కడంతా తమ వాళ్ల ఆచూకీ కోసం పడిగాపులు పడుతున్న ఘోషే కనిపిస్తుంది. ఎటు చూసినా శవాల దిబ్బ, బురదతో కలిసి శోక సంద్రాన్ని తలపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు పసివాళ్లు కనిపిస్తున్న తీరు చూస్తే గుండెతరక్కుపోతుంది. వరద ప్రభావిత ప్రాంతాల గుండా ఆ బాలుడు తన చెల్లిని వీపుపై మోస్తూ నీరసంగా నడుస్తూ కనిపిస్తాడు. అతడు ఆమెను ఓదార్చేలా దగ్గరకు పట్టుకున్నట్లుగా ఆ పరిసర ప్రాంతాల్లో కలయతిరగడం చూస్తే..ప్రకృతి విపత్తు మిగిల్చే విషాదం ఇంత భయానకంగా ఉంటుందా అనిపిస్తుంది. ఆ చిన్నారి తన తల్లిదండ్రుల ఆచూకీ కోసం తిరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ అధికారులు వరద బాధితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నేపాల్ వరదలతో అతలాకుతలమైన తరుణంలో బయటకు వచ్చిన ఈ వీడియో ప్రకృతి విపత్తు ఇద్దరు చిన్నారులకు ఎలాంటి కష్టాలను మిగిల్చిందనే దానిపై అందరి దృష్టికి తీసుకొచ్చింది. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్నారి నిజంగానే పేరెంట్స్ ఆచూకీ కోసమే తిరుగుతున్నాడా లేక ఇంకేదైనా కారణమా అన్నది నిర్థారణ కావాల్సి ఉంది. కాగా, నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోని చూసి నెటిజన్లు చిన్నారులు అంత నిస్సహాయంగా తిరుగుతుంటే సాయం చేయడం మానేసి వీడియో తీస్తున్న వ్యక్తి ఎవరు అంటూ తిట్టిపోస్తున్నారు. మరికొందరు..తోబుట్టువుల అనుబంధాన్ని చాటిచెప్పడమే కాదు ఆ చిన్న భుజాలు ఎంత పెద్ద బాధ్యతను మోస్తున్నాయి. వారి కళ్లను చూస్తుంటేనే బాధంతా అర్థమైపోతోంది అంటూ పోస్టులు పెట్టారు. Heartbreaking Visual from Nepal 💔Little boy caring his younger sister 🥹 and finding their parents 😭.Look at the pain and scratches on their faces. 💔💔💔 pic.twitter.com/oREDLzii6g— Jeet (@JeetN25) August 30, 2026(చదవండి: ఆ చీరే మా ప్రాణాలను రక్షించింది..! నేపాల్ జలప్రళయంలో ఓ అద్భుతం..) -
శవాల దిబ్బల్లో ఆప్తుల కోసం అన్వేషణ.. మిన్నంటుతున్న రోదనలు!
ఖాట్మండు: నేపాల్లోని భోటేకోశి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన వరద బీభత్సం వందలాది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కొట్టుకుపోయిన, శిథిలాల కింద చిక్కుకుపోయిన తమ వారి ఆచూకీ కోసం బంధువులు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఆస్పత్రులు, శవాగారాలు, సహాయక శిబిరాల చుట్టూ కన్నీటితో తిరుగుతున్నారు.చేతిలో ఆప్తుల ఫొటోలు పట్టుకుని మార్చురీల్లోని గుర్తుతెలియని మృతదేహాలను పరిశీలిస్తూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. రసువాలోని అప్పర్ త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న 20 ఏళ్ల ప్రవీణ్ వరద ఉధృతికి గల్లంతయ్యాడు. అతని సోదరుడు రామ్ బుధా ఖాట్మండు నుంచి హకుబేసికి చేరుకుని, ప్రాజెక్టు సొరంగంలోకి దిగేందుకు ప్రయత్నించాడు. అయితే ఛాతీ లోతు వరకు బురద పేరుకుపోవడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. జుమ్లాలోని తమ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో తోచక రామ్ కన్నీటిపర్యంతమయ్యాడు.నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం నాటికి 788 మృతదేహాలను వెలికితీయగా, ఇంకా 2,502 మంది ఆచూకీ లభించలేదు. గల్లంతైన వారిలో జలవిద్యుత్ ప్రాజెక్టుల కార్మికులు, ఇంజనీర్లు 933 మంది ఉండగా, 592 మంది విదేశీయులు, వారితో ఉన్న 127 మంది నేపాలీలు ఉన్నారు. రక్షణ దళాలకు చెందిన 45 మంది సైనికులు, 25 మంది నేపాల్ పోలీసులు, 12 మంది సాయుధ పోలీసు సిబ్బంది కూడా జాడలేకుండా పోయారు.రసువా సరిహద్దు ప్రాంతమైన తిమురేలో పనిచేస్తున్న భర్త సునీల్ ఆచూకీ కోసం దాంగ్ ప్రాంతానికి చెందిన సరితా చౌదరి పోఖ్రా చేరుకుంది. వరద వచ్చే ముందు రోజు ఫోన్ చేసి, దసరా పండుగకు ఇంటికి వస్తానని చెప్పాడని, అంతలోనే ఈ ఘోరం జరిగిందని ఆమె రోదిస్తూ తెలిపింది. పోఖ్రా అకాడమీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో భద్రపరిచిన 102 గుర్తుతెలియని మృతదేహాల ఫొటోలను పరిశీలించేందుకు రోజుకు వెయ్యి మందికి పైగా బంధువులు వస్తున్నట్లు కాస్కీ పోలీసులు తెలిపారు.రౌతహత్కు చెందిన 60 ఏళ్ల బిర్సిమాయ భరత్పూర్లోని శవాగారాల్లో తన కుమారుడు షేర్ బహదూర్ కోసం వెతుకుతోంది. నువాకోట్, గైండాకోట్, పోఖరా నగరాల్లోని ఆస్పత్రులను గాలించినా తన సోదరుడు రామేశ్వర్ జాడ దొరకలేదని నవరాజ్ లామా ఆవేదన వ్యక్తం చేశాడు. ‘కనీసం ఆచూకీ లేదా మృతదేహం దొరికే వరకు మా ఆశ చావదు’ అని కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అప్పులు చేసి మరీ ఇక్కడికి తరలివచ్చి, వెతుకులాట కొనసాగిస్తున్న బాధితులు.. ప్రభుత్వం స్పందించి మృతదేహాల గుర్తింపు ప్రక్రియను ఒకే చోట సులభతరం చేయాలని, గల్లంతైన వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇది కూడా చదవండి: అమెరికా: ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య -
నేపాల్: 1.6 లక్షల మహిళల పరిస్థితి దయనీయం
ఖాట్మండు: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రసువా, నువాకోట్ జిల్లాల్లో దాదాపు 1.6 లక్షల మంది (1,57,050 మంది) మహిళలు, బాలికలు ఈ విపత్తు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర ప్రభావానికి గురైనట్లు ‘యూఎన్ విమెన్’ విభాగం తన మొదటి జెండర్ అలర్ట్ నివేదికలో వెల్లడించింది. వరదల కారణంగా వీరు హింస, దోపిడీ తదితర ముప్పులను కూడా ఎదుర్కొంటున్నారని తెలిపింది.ఈ విపత్తు తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉందని పేర్కొంటూ, వరదల ధాటికి 500 మందికి పైగా మహిళలు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 1,000 మంది గల్లంతయ్యారని, సుమారు 10,000 ఇళ్లు కొట్టుకుపోయాయని సంస్థ తెలిపింది. బతికి బయటపడిన వారు ఆహారం, తాగునీరు, వైద్యం, రక్షణ సేవల కొరతతో అల్లాడుతున్నారని వివరించింది. రసువా, నువాకోట్, ధాదింగ్, గోర్ఖా, చిత్వాన్ జిల్లాల్లోని మహిళల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు నిరక్షరాస్యులుగా ఉన్నారని, దీనివల్ల సహాయ చర్యల వివరాలు తెలుసుకోవడం, నమోదు చేసుకోవడం, సహాయం పొందడంలో వారికి ఆటంకాలు ఎదురవుతున్నాయని నివేదిక వెల్లడించింది.అంతేకాకుండా బాగమతి ప్రావిన్స్లోని కుటుంబాల్లో మూడింట ఒక వంతు కుటుంబాలకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారని, అందులో మూడో వంతు కుటుంబాలు విదేశీ ఆదాయం (రెమిటెన్స్)పైనే ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొంది. విపత్తుల వేళ మహిళలు, బాలికలు ఎదుర్కొనే ముప్పులు ప్రమాదకర స్థాయికి చేరుతాయని యూఎన్ విమెన్ ప్రతినిధి ప్యాట్రిసియా ఫెర్నాండెజ్-పచెకో ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ ఆహార సాయం, జీవనోపాధి కల్పించేందుకు మహిళల ఆధ్వర్యంలో ‘కమ్యూనిటీ కిచెన్’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. విపత్తు బారిన పడిన మహిళలు, బాలికల రక్షణ, పునరావాసం కోసం అత్యవసరంగా 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16.7 కోట్లు) నిధులు సమకూర్చాలని యూఎన్ విమెన్ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది.ఇది కూడా చదవండి: నేపాల్: శవాల గుర్తింపు ఎలా? కుటుంబ సభ్యులకు చూపిస్తారిలా.. -
నేపాల్: శవాల గుర్తింపు ఎలా? కుటుంబ సభ్యులకు చూపిస్తారిలా..
నేపాల్లో సంభవించిన జలప్రళయం ఊహకందని విషాదాన్ని మిగిల్చింది. వరదలు, కొండచరియల ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఎటుచూసినా మృతదేహాల గుట్టలే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే 700కు పైగా మృతదేహాలు బయటపడటంతో మార్చురీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఇంకా వేలాది మంది ఆచూకీ గల్లంతవడంతో రానున్న రోజుల్లో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో గుర్తించని మృతదేహాలను భద్రపరచడం, ఖననం చేయడం నేపాల్ ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది.నిండిపోయిన మార్చురీలు.. పెరుగుతున్న మృతదేహాలునేపాల్లో బుధవారం విరుచుకుపడిన వరద బీభత్సానికి ఇప్పటివరకు 734 మందికి పైగా చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. మరో 2,498 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. సహాయక బృందాలు ఇప్పటివరకు 4,500 మందికి పైగా ప్రజలను రక్షించినప్పటికీ, శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. శవాగారాల్లో స్థలం లేకపోవడంతో గుర్తించని శవాల అంత్యక్రియలను నిర్వహించడం ప్రభుత్వానికి తప్పనిసరిగా మారింది.ప్రధాని కీలక నిర్ణయం: శాస్త్రీయంగా ఖననంపౌరుల భద్రతకే తమ మొదటి ప్రాధాన్యమని నేపాల్ ప్రధాని బలేంద్ర షా స్పష్టం చేశారు. గుర్తుతెలియని మృతదేహాలను ఎయిర్టైట్ (గాలి చొరబడని) బ్యాగుల్లో ఉంచి భూమిలో ఖననం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, భవిష్యత్తులో వారి కుటుంబ సభ్యులు తమవారిని గుర్తించేందుకు వీలుగా ప్రతి మృతదేహం నుంచి డీఎన్ఏ నమూనాలను వైద్యులు ముందుగానే సేకరిస్తున్నారు.శరీర గుర్తులు, లొకేషన్ వివరాల నమోదుడీఎన్ఏ ప్రొఫైలింగ్తో పాటు మృతదేహాలపై ఉన్న ప్రత్యేక గుర్తులు, పుట్టుమచ్చలు, టాటూలు లేదా గాయాలను అధికారులు క్షుణ్ణంగా రికార్డు చేస్తున్నారు. ఆ మృతదేహం ఏ అవయవంపై లభ్యమైందనే వివరాలను కూడా భద్రపరుస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి 100కు పైగా మృతదేహాల డీఎన్ఏ ప్రక్రియను పూర్తి చేసి, ఖననం చేశారు. ఇది భవిష్యత్తులో కుటుంబసభ్యులు వారిని గుర్తించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.భవిష్యత్తులో వెలికితీసేలా ప్రత్యేక ఏర్పాట్లుఎయిర్టైట్ బ్యాగుల్లో ఉంచిన మృతదేహాలను భూమిలో 1.5 మీటర్ల లోతులో ఖననం చేస్తున్నారు. అవసరమైనప్పుడు వీటిని సులభంగా వెలికితీసేందుకు వీలుగా రెండు మృతదేహాల మధ్య సరిగ్గా 40 సెంటీమీటర్ల దూరాన్ని పాటిస్తున్నారు. అంతేకాకుండా, మృతదేహాలను పాతిపెట్టిన ప్రదేశంలో ప్రత్యేక సంఖ్యలతో కూడిన సైన్బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఫోటోలు, వీడియోల రూపంలో డిజిటల్గా భద్రపరుస్తున్నారు.కుళ్లిపోతున్న శవాలు.. వైద్యులకు పెను సవాలువరద బురద, శిథిలాల కింద లభ్యమవుతున్న శవాలు త్వరగా కుళ్లిపోతుండటం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. వీటిని భద్రపరిచి డీఎన్ఏ సేకరించేందుకు వైద్యులకు సమయం చాలా తక్కువగా ఉంటోంది. ఇప్పటివరకు 135 మృతదేహాల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 233 శవాలు లభించగా, కేవలం ఆరింటిని మాత్రమే కుటుంబ సభ్యులు గుర్తించగలిగారు. శవాలు పాడవకుండా ఉండేందుకు కొన్ని నివాస గృహాలను తాత్కాలిక కోల్డ్ సెంటర్లుగా మార్చారు.మళ్లీ పెరుగుతున్న నదీ ప్రవాహం.. పెను ముప్పురెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతుండగానే భోటేకోశి నదిలో నీటిమట్టం మళ్లీ ప్రమాదకర స్థాయికి పెరిగినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు, చైనా భూభాగంలో ఏర్పడిన తాత్కాలిక సరస్సు మరింత పెద్దదవుతోందని, ఒకవేళ అది గనక తెగితే నేపాల్లో ఇంతకుముందు కంటే భారీ వరద ముప్పు తప్పదని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు, సహాయక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.ఇది కూడా చదవండి: హిమాలయాల్లో 188 సరస్సుల విస్పోటనం? -
10 నిమిషాలు ఆగారు.. అంతలోనే మహా విధ్వంసం
నేపాల్లో వరదలు సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు.. దాని తాలుకూ విషాద ఘటనలు ఒక్కక్కొటిగా వెలుగుచూస్తున్నాయి. కొన్ని ఘటనలేమో క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం అయితే మరికొన్ని ఘటనలు క్షణాల వ్యవధిలో ప్రాణాలు రక్షించుకోవడం... తాజాగా ఛత్తీస్గఢ్కు చెందిన ఓ బృందం కేవలం టీ తాగడం కోసం ఆగడంతోనే.. తమ ప్రాణాలు దక్కాయని ఆ నిర్ణయంతో ఈ రోజు బ్రతికే ఉన్నామని భావోద్వేగంతో ఈ రోజటి విషాద స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. రాయ్పూర్లోని మానా క్యాంప్ ప్రాంతానికి చెందిన నారాయణ్ సేన్, దినేశ్ ఓజా, ప్రేమ్ సింగ్ జగత్, యతేంద్ర ప్రకాశ్, దినేశ్ సింగ్ ఠాకూర్ అనే ఐదుగురు సభ్యుల బృందం ఆగస్టు 21న నేపాల్ పర్యటనకు బయలుదేరారు. ఆగస్టు 22న నేపాల్కు చేరుకున్న వీరు ఓ కారును అద్దెకు తీసుకుని పశుపతినాథ్ ఆలయం, మనకామనా ఆలయం సహా పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని భావించారు.ఆగస్టు 26న ఉదయం సుమారు 10 గంటల సమయంలో వారు నేపాల్లోని ధాదింగ్ జిల్లాలోని ఓ హోటల్ వద్ద టీ తాగేందుకు ఆగారు. అంతలోనే అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముందున్న వంతెన వరదలో కొట్టుకుపోయిందని హోటల్లో వారికి తెలిసింది. ఆ విషాద ఘటనపై వారి మాటల్లో. “ఆగస్టు 26న ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినప్పుడు మేము టీ కోసం ఆగడం మా అదృష్టం. మేము 10–15 నిమిషాల ముందే అక్కడి నుంచి బయలుదేరి ఉంటే, వరదలో చిక్కుకుపోయేవాళ్లం. మేం అక్కడ ఆగకపోయి ఉంటే ఏం జరిగేదో ఊహించలేం” అని తెలిపారు.“హోటల్లో టీ తాగుతున్న సమయంలో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురవడం గమనించాం. ఆ తర్వాత వరద సృష్టించిన విధ్వంసం గురించి తెలుసుకున్నాం. మొత్తం గ్రామాలు, భవనాలు, కార్యాలయాలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయని విన్నాం.మేం అక్కడ చూసిన దృశ్యాలను మాటల్లో వర్ణించడం చాలా కష్టం. మేము నిరంతరం భగవాన్ శివుడి నామస్మరణ చేస్తూనే ఉన్నాం. ఆయన ఆశీర్వాదాలే మమ్మల్ని కాపాడాయని భావిస్తున్నాం” అని తెలిపారు. తర్వాత త్రిశూలి నది ఒడ్డుకు వెళ్లి వరదల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. వరదల కారణంగా విద్యుత్, నీరు లేకపోయినా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండటంతో వారు భారత్లోని తమ కుటుంబ సభ్యులతో నిరంతరం మాట్లాడగలిగామని పేర్కొన్నారు. అయితే ఈ విషాదంలో వారికి ఓ హృదయాన్ని హత్తుకునే అనుభవం ఎదురైందని అక్కడే విధుల్లో ఉన్న మహిళా భద్రతా సిబ్బంది మా చేతులకు ఆ రాఖీలు కట్టారు. అది మాకు ఎంతో ఓదార్పునిచ్చిన క్షణం అని ఆ విషయాలు మీడియాతో పంచుకున్నారు. అయితే గత బుధవారం నేపాల్లో సంభవించిన భారీ వరదల కారణంగా మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ రోజు ఆదివారం ఉదయం నాటికి నేపాల్లో అధికారికంగా 734 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. -
మందాకిని ఉగ్రరూపం.. వరదల్లో ఉత్తర ప్రదేశ్
-
నేపాల్లో అద్భుతం: శిథిలాల కింద సజీవంగా ఆరేళ్ల బాలిక..
రసువా: వరదలతో అతలాకుతలమైన నేపాల్లోని రసువా జిల్లాలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. భారీ వరద శిథిలాలు, బురద కింద మూడు రోజుల పాటు చిక్కుకుపోయిన ఆరేళ్ల బాలికను సహాయక బృందాలు సజీవంగా వెలికితీశాయి. రసువా జిల్లాలోని తిమురే గ్రామంలో పొంగిపొర్లిన భోటే కోషి నది తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపడుతున్న ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (ఏపీఎఫ్) సిబ్బందికి నేల అడుగున నుంచి ఏడుపు శబ్దాలు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వేగంగా మట్టిని తవ్వి, బాలికను సురక్షితంగా బయటకు తీశారు.తొలుత తిమురేలోని ఏపీఎఫ్ అవుట్పోస్టులో ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం శుక్రవారం రాత్రే ఖాట్మండుకు తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ప్రయాణం ఆలస్యమైంది. శనివారం మధ్యాహ్నం వాతావరణం అనుకూలించడంతో ఆమెను ఖాట్మండులోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స పొందుతోంది. ఆ చిన్నారిని మనీషా మగర్గా గుర్తించారు. ఈ చిన్నారి కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు.ఈ వరద విధ్వంసంపై నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ.. పునర్నిర్మాణ పనులకు బిలియన్ల కొద్దీ డాలర్లు అవసరమవుతాయని, అంతర్జాతీయ సమాజం సహాయం అందించాలని కోరారు. తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 675 మృతదేహాలను వెలికితీయగా, 2,400 మందికి పైగా జనం గల్లంతయ్యారు.ఇది కూడా చదవండి: డ్రగ్స్ రహిత దేశమే లక్ష్యం: ‘మన్ కీ బాత్’లో మోదీ -
నేపాల్ వరదలు: 784కు చేరిన మృతుల సంఖ్య
ఖాట్మండు: నేపాల్ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం సంభవించిన ఈ జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య ఆదివారం సాయంత్రానికి 784కు చేరినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. ఇంకా 589 మంది విదేశీయులతో సహా మొత్తం 2,500 మందికి పైగా ఆచూకీ గల్లంతవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వరద మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో మృతదేహాలను భద్రపరిచేందుకు స్థలం సరిపోవడం లేదు. దీంతో గుర్తుతెలియని, ఎవరూ క్లెయిమ్ చేయని మృతదేహాలను ఎయిర్టైట్ బ్యాగుల్లో భద్రపరిచి ఖననం చేయాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, భవిష్యత్తులో వారి గుర్తింపు నిర్ధారణ కోసం ముందస్తుగా డీఎన్ఏ నమూనాలను, ఇతర ఆధారాలను సేకరించి భద్రపరుస్తున్నట్లు ప్రధానమంత్రి బాలేంద్ర షా తెలిపారు.రసువా ప్రాంతంలోని భోటేకోశి నదిలో వరద ఉధృతి మరింత పెరిగిందని నేపాల్ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ప్రకటించింది. రసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్ జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను, సహాయక సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సహాయక చర్యల్లో 5,000 మందికి పైగా సైనికులతో సహా 11,000 మందికి పైగా భద్రతా సిబ్బంది నిమగ్నమయ్యారు. విదేశీ రక్షణ బృందాలను అనుమతించేందుకు తొలుత నిరాకరించిన నేపాల్, బాధితుల దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు తన నిర్ణయాన్ని మార్చుకుంది. భారత్, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాల సహాయక బృందాలకు అనుమతినిచ్చింది. భారత్ ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని, వైద్య సామగ్రిని పంపించి అండగా నిలిచింది. సంక్షోభ సమయంలో ఆదుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీని నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే ప్రశంసించారు.ఇది కూడా చదవండి: Delhi: మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం -
నేపాల్: సొరంగాల్లో 570 మందికి పైగా కార్మికులు సమాధి?
ఖాట్మండు: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి రసువా, నువాకోట్ జిల్లాల్లోని 11 జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద 573 మందికిపైగా కార్మికులు సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. మంచు, రాళ్లు, వరద నీరు కలిసి ల్హెండే-భోటే కోశి-త్రిశూలి నదీ వ్యవస్థను ముంచెత్తడంతో భారీ విపత్తు సంభవించింది. 11 ప్రాజెక్టు ప్రాంతాల పరిధిలో తొలుత 934 మంది కార్మికులు గల్లంతైనట్లు నేపాల్ ప్రభుత్వ గణాంకాలు వెల్లడించగా, వారిలో 361 మందిని సురక్షితంగా రక్షించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో నమోదుకాని కార్మికులు కూడా ఉండటంతో గల్లంతైన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం.చిక్కుకుపోయిన వారిలో భారతీయులతో పాటు నేపాల్, దక్షిణ కొరియా, చైనా, జర్మనీ దేశాల పౌరులు ఉన్నారు. ప్రధానంగా నాలుగు ప్రాజెక్టుల్లోనే అత్యధిక మంది కార్మికులు చిక్కుకున్నారు. అప్పర్ త్రిశూలి-1 (322 మంది), అప్పర్ త్రిశూలి-3బి (122 మంది), అప్పర్ త్రిశూలి-3ఎ (43 మంది), రసువాగఢి జలవిద్యుత్ ప్రాజెక్టు (44 మంది) వద్ద ఇలాంటి పరిస్థితి నెలకొంది. సొరంగాల వద్ద 10 నుంచి 12 అడుగుల మేర బురద, శిథిలాలు పేరుకుపోయి మార్గాలు మూసుకుపోయాయి.సహాయక చర్యల నిమిత్తం నేపాల్ ఆర్మీ 15 హెలికాప్టర్లు, వందలాది మంది రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించింది. మరోవైపు భారత్ కూడా సాంకేతిక, వైద్య, టన్నెల్ నిపుణులతో కూడిన బృందాలను పంపించింది. సీ-130జే హెర్క్యులస్ విమానం ద్వారా సైనిక టన్నెల్ రెస్క్యూ నిపుణులు, ఫోరెన్సిక్ విభాగాలను తరలిస్తోంది. ఈ వరద విపత్తులో ఇప్పటివరకు 675 మంది మృతి చెందగా, నేపాల్, టిబెట్ వ్యాప్తంగా దాదాపు 3,000 మంది ఆచూకీ గల్లంతైంది.ఇది కూడా చదవండి: ఏమిటీ రూ.89 కోట్ల వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం? -
అన్నీ కొట్టుకుపోతుంటే.. కూలుతుంటే..
కఠ్మాండు: ప్రశాంత వాతావరణంపై ప్రకృతి పగబట్టి జలఖడ్గం విసిరిన వేళ దిగువ ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతపట్టుకుని పరుగెత్తిన దృశ్యాలు ఇంకా వాళ్ల మదిలో మెదులుతూనే ఉన్నాయి. తిమూర్లో కస్టమ్స్ ఏజెంట్గా పనిచేస్తున్న రాజు బుద్ధాథోకీ బుధవారం ఉదయం ఎప్పట్లాగే తన గదిలో ఉండగా ఒక్కసారిగా వరదనీరు దూసుకొచ్చింది. ‘‘భూకంపం వచ్చినట్లుగా చుట్టుపక్కల ప్రాంతమంది కదిలింది. వెంటనే భయంతో బయటికొచ్చి చూస్తే అప్పటికే పోలీసులు పారిపోతున్నారు. అర్థంకాక వెనక్కి తిరిగిచూస్తే వరద నీరు అంతెత్తున దూసుకొస్తోంది. వెంటనే పరుగెత్తబోతే ఎదురుగా ఉన్న ముళ్లకంచెకు తగిలి గాయపడ్డా. పరుగెడుతుంటే భీకర వరద నీరు తిమూర్ మార్కెట్లో ఒక్కో దుకాణాన్ని మింగేస్తూ ముందుకు దూసుకొచ్చింది. ప్రాణభయంతో ఎగువ ప్రాంతానికి పరుగెత్తా’’ అని ఆనాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. ‘‘వరద ఉధృతిని చూసి వెంటనే ఎగువ అడవిలోకి పరుగెత్తా. ఎడమ బొటనవేలుకు పెద్దగాయమై రక్తంకారుతున్నా పరుగు ఆపలేదు. క్షణాల్లో మార్కెట్ ప్రాంతం జలమయమైంది. పారిపోలేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ల మృతదేహాలు కొట్టుకుపోవడం చూశా. అడవిలో హెలికాప్టర్ నుంచి ఆర్మీ పడేసి నూడుల్స్ ప్యాకెట్లను తిన్నాం’’ అని మరో కస్టమ్స్ ఏజెంట్ గౌతమ్ తెలిపారు. ‘‘కొట్టుకొచ్చిన బుదర అదృష్టవశాత్తు నన్ను ఒడ్డు వైపు విసిరికొట్టింది. దీంతో బతికిపోయా. లేదంటే అప్పుడే చచ్చిపోయేవాడిని’’ అని తులసీ బహదూర్ బంఢారీ చెప్పారు. ‘‘రసువాలో బంగారం వ్యాపారం చేసే మామ రాజ్కమార్ దియాలీ ఇంటికి భార్య, నాలుగేళ్ల కుమారుడితో వచ్చా. పని మీద ఇంటి నుంచి బయటికెళ్లా. వరద వార్త తెలిసి తిరిగొచ్చేసరికి అందరూ వరదలో కొట్టుకుపోయారు’’ అని 38 ఏళ్ల సచిన్ ఖాతి వాపోయారు. ‘‘నిద్రలో ఉండగానే వరద నన్ను ముంచెత్తింది. కాలు, తలకు గాయాలతో నది ఒడ్డుకు కొట్టుకొచ్చి స్పృహతప్పి పడిపోయా. ఆర్మీ వాళ్లు నన్ను చూసి కాపాడారు’’ అని 21 ఏళ్ల కార్మికుడు సుజల్ థాపా తెలిపారు.చనిపోవడం ఖాయమనుకున్నా..సింధుపాల్చౌక్ జిల్లావాసి దీపక్ తమాంగ్ తనకు ఇవే చివరి క్షణాలను భావించానని భయంకర ఘటనను గుర్తుచేసుకున్నారు. ‘‘ఇంటి నుంచి బయటికొచ్చి చూస్తే అంతెత్తున వరదనీరు దూసుకొస్తోంది. తప్పించుకునే దారే లేదు. అన్ని వైపుల నుంచి వరద ఉధృతి ఎదురొచ్చింది. బతకాలంటే కొండ ఎక్కడం ఒకటే దారి. కొండ వాలుపై మొత్తం ముళ్ల చెట్లే ఉన్నాయి. చేతులకు గుచ్చుకుంటున్నాసరే ముళ్లచెట్లను పట్టుకొని పైకి ఎక్కేందుకు ప్రయత్నించినా పట్టు చిక్కలేదు. ఎట్టకేలకు పట్టు దొరకడంతో ఎక్కేశా. చావుకు, బతుక్కు మధ్య సన్నగీతను చూశా. అడవిలో రాత్రంగా ఎడతెరపి వర్షం కురుస్తుంటే అక్కడే దుంగల్ని నిల్వచేసే పాత గోడౌన్లో తలదాచుకున్నా. 24 గంటల తర్వాత నన్ను ఆర్మీ కాపాడింది’ అని చెప్పారు. -
నేపాల్ వరదలు.. భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: నేపాల్ వరదల్లో గల్లంతైన భారతీయులపై విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆకస్మిక వరదల్లో మెుత్తంగా 287 మంది భారతీయులు గల్లంతు కాగా వారిలో 88 మంది సురక్షితంగా బయిటపడినట్లు తెలిపింది. గల్లంతైన వారిలో 128 మంది ఎన్నారైలు ఉన్నట్లు పేర్కొంది. గల్లంతైన వారి కోసం భారత సహాయక బృందాలు గాలింపులు చేపడుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.120 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్ చేరుకున్నట్లు తెలిపింది. అదే విధంగా మృతుల డీఎన్ఏ పరీక్షల వివరాల కోసం ఆరు ఫోరెన్సిక్ టీములను కేంద్ర ప్రభుత్వం నేపాల్ పంపినట్లు పేర్కొంది. హైడ్రో పవర్ ప్రాజెక్టు నుంచి నలుగురు భారతీయులు సురక్షితంగా బయటపడినట్లు తెలిపింది. నేపాల్–టిబెట్ వరదలు: ప్రస్తుత వివరాలు1. మొత్తం పరిస్థితి • నేపాల్–టిబెట్ మానవతా సంక్షోభం విపత్కరం. • 633 మరణాలు, 2,980 మంది మిస్సింగ్ • నేపాల్: 626 మరణాలు, 2,426 తప్పిపోయినవారు (517 విదేశీయులు, 300+ భారతీయులు). • 3,700+ మంది రక్షణ, 2,400+ మందిని 14 సైనిక హెలికాప్టర్లు గాలివెంటన్. • 11,000+ భద్రతా సిబ్బంది సెర్చ్ అండ్ రెస్క్యూ. • రోడ్లు/వంతెనలు నాశనం, బురద, కొండచరియలు, వర్షం, కఠిన భూభాగం యాక్సెస్ను పరిమితం చేస్తున్నాయి. • నేపాల్ అంతర్జాతీయ సహాయం స్వీకరిస్తోంది. భారత్, ఇతర దేశాలు మద్దతు ఇస్తున్నాయి. 2. ఆంధ్రప్రదేశ్ – 13 మంది జాడ తెలియదు • 13 మంది AP సంబంధితులు జాడ తెలియదు (7 AP నివాసులు + 6 AP మూలం NRIలు/విదేశీయులు). • 6 మంది NRIలలో 4 మంది ఇషా ఫౌండేషన్ గ్రూప్కు సంబంధించినవారు. AP నివాసులు – 7: 1 అన్నండేవర వెంకట్రామ్ — 9663722477 | కాకినాడ/బెంగళూరు 2 అన్నండేవర అనఘ — 9663766711 | కాకినాడ/బెంగళూరు 3 చొప్పరాపు రమేష్ బాబు — 8861299006 | కృష్ణా/కనూరు | గైరాంగ్ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్, చైనా 4 సంతోష్ సాహు — 447860430921 | పార్వతీపురం | NRT–లండన్ 5 స్పందన్ సాహు — 447587741850 6 పాధ్య సురభి మన్మథ్ — కాంటాక్ట్ అందుబాటులో లేదు 7 సైనా కుమారి సాహు — కాంటాక్ట్ అందుబాటులో లేదు AP మూలం NRIలు/విదేశీయులు – 6: 8. వి.ఎల్. బాల సుబ్రమణ్యం — 7416410673 | గైరాంగ్ | ఇషా ఫౌండేషన్9. అట్లూరి శశి కుమార్ — +1-6095778200 | గైరాంగ్ | ఇషా ఫౌండేషన్10. నిమ్మగడ్డ రాజ్యలక్ష్మి — 7416083300 | గైరాంగ్ | ఇషా ఫౌండేషన్11. కె. గోవింద్ — 6367167312 | ఇషా ఫౌండేషన్12. సుహాసిని రెడ్డి కండిమల్ల — కాంటాక్ట్/లొకేషన్ అందుబాటులో లేదు13. రంగనాథ్ — 8790040944 | ధుంచే/స్యాబ్రుబేసి | న్యూజిలాండ్ పౌరుడు (AP సంబంధం) 3. భాస్కర్ శాస్త్రి & కుటుంబం – ఆదోని, కర్నూలు • భాస్కర్ శాస్త్రి, మణి శారద, రఘునాద శాస్త్రి, హంశిక సురక్షితంగా ఉన్నారు. • రఘునాద శాస్త్రికి తీవ్ర పల్మనరీ ఎడిమా వచ్చి ఆక్సిజన్ అవసరం. • 28 ఆగస్టు: సాగా చేరి హోటల్లో ఆక్సిజన్ ఏర్పాటు. • 29 ఆగస్టు: న్యాలామ్ కౌంటీ చేరారు (కొడారి సరిహద్దుకు సుమారు 50 కి.మీ.). • కొడారి → కాఠ్మండు వైపు కదలనున్నారు (సరిహద్దు, వాతావరణం, రోడ్ పరిస్థితులపై ఆధారపడి). • కీలక అవసరం: కొడారి–కాఠ్మండు ప్రయాణానికి పోర్టబుల్ ఆక్సిజన్/ఆక్సిజన్ ఉన్న వాహనం ఏర్పాటు చేయాలి. • 30/31 ఆగస్టు కాఠ్మండు చేరే అవకాశం. 1 సెప్టెంబర్ 2026 కాఠ్మండు–ముంబై–హైదరాబాద్ ఫ్లైట్ ధృవీకరించబడింది.కాంటాక్ట్స్:భాస్కర్ శాస్త్రి: 94401 96543 | హంశిక: 9036536111 | గ్రూప్ కోఆర్డినేటర్: +977 9843057721 | మూన్ హిమాలయ అడ్వెంచర్: +977 9860455963 / +977 1-5924890 -
నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే
-
రెండున్నర లక్షల శవాల సమాధి.. చైనా దాచిన జలప్రళయం
-
నేపాల్ వరదలు: 18 నెలల పసికందు ఎదురుచూపులు..
ఊనా: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్లోని ఊనా జిల్లాకు చెందిన మెకానికల్ ఇంజినీర్ సుఖ్విందర్ ఆచూకీ గల్లంతైంది. రసువా, నువాకోట్ జిల్లాల పరిధిలోని త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్టులో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. మూడు నెలల సెలవు అనంతరం ఆగస్టు 15నే ఆయన తిరిగి నేపాల్ వెళ్లారు. బుధవారం నేపాల్లో వరదలు ముంచెత్తినప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆయనతో సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.సుఖ్విందర్ను క్షేమంగా రక్షించాలని కోరుతూ కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ఎంపీ అనురాగ్ ఠాకూర్ను ఆశ్రయించారు. సుఖ్విందర్ గతంలో భూటాన్లో పనిచేశారని, అనంతరం సంస్థ ఆయన్ను నేపాల్కు బదిలీ చేసిందని తండ్రి హుసన్ లాల్ తెలిపారు. ఖాట్మండులో ఉంటున్న తమ బంధువు కూడా సుఖ్విందర్ కోసం ఆరా తీస్తున్నా ఎలాంటి సమాచారం దొరకలేదని, దుబాయ్లో ఉండే పెద్ద కుమారుడు కూడా సోదరుడిని వెతికేందుకు ఖాట్మండు చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుఖ్విందర్కు వివాహమై, 18 నెలల కుమారుడు ఉన్నాడు.సుఖ్విందర్ గల్లంతుపై ఉన్నతాధికారులకు, సంబంధిత మంత్రిత్వ శాఖకు సమాచారం అందించినట్లు ఊనా ఎస్డీఎం అభిషేక్ మిత్తల్ తెలిపారు. కాగా, చంబా జిల్లాకు చెందిన సల్మాన్ ఖాన్ అనే మరో యువకుడు తాను నేపాల్లో సురక్షితంగా ఉన్నట్లు కుటుంబానికి తెలిపాడు. ఆయన పనిచేస్తున్న ప్రాంతం వరద ప్రభావిత ప్రాంతానికి వేరొక వైపు ఉండటం, ఆ సమయంలో సొరంగంలో ఉండటంతో ప్రమాదం తప్పింది.విపత్తులో చిక్కుకున్న పౌరులకు సహాయం అందించి, వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం, విదేశాంగ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది. బాధిత కుటుంబాల సహాయార్థం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు.ఇది కూడా చదవండి: కష్టాల ఊబిలోంచి.. దర్జీ కూతురి ‘సీఎస్’ విజయం -
హిమాలయాల్లో మృత్యుఘోష
-
నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈఓ గల్లంతు!
-
హిమానీనదీ విలయంపై ఐరాస సంచలన హెచ్చరిక!
న్యూఢిల్లీ: హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో సంభవించే హిమానీనదీ సరస్సుల విస్ఫోటన వరదల వల్ల సంభవించిన మరణాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆరు దేశాల నిపుణులు రూపొందించిన ‘హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో హిమానీనద సరస్సుల విస్ఫోటన వరద ముప్పు, నిర్వహణ వ్యూహాలు, అనుసరణ లోపాలు’ అనే నివేదిక 1835 నుండి 2025 వరకు గల గణాంకాలను విశ్లేషించింది.ఈ అధ్యయనం ప్రకారం, హిందూకుష్ హిమాలయ పరిధిలోని 8 దేశాల్లో సంభవించిన వరదల ఘటనల సంఖ్య పరంగా భారత్ మూడో స్థానంలో ఉంది. చైనాలో అత్యధికంగా 199, పాకిస్థాన్లో 152, భారత్లో 62, నేపాల్లో 58 ఘటనలు నమోదయ్యాయి. అయితే, ప్రాణనష్టం విషయంలో భారత్ తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంది. భారత్లో అత్యధికంగా 6,119 మంది మరణించగా, పాకిస్థాన్లో 1,991, చైనాలో 625 మరణాలు సంభవించాయి. ప్రజల నిర్వాసితుల సంఖ్యలోనూ భారత్ మొదటి స్థానంలో నిలిచింది.1950 తర్వాత వాతావరణ మార్పుల కారణంగా ఆకస్మిక వరదల తీవ్రత గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది. 1950కి ముందుతో పోలిస్తే దశాబ్దానికి సగటున 34 ఘటనలు నమోదవుతున్నాయి. దాదాపు 50 శాతం విస్ఫోటనాలకు మంచు చరియలు విరిగిపడటం, 25 శాతం ఘటనలకు భారీ వర్షాలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. దాదాపు 70 శాతం ఘటనలు వేసవి, వర్షాకాలంలోనే సంభవించాయి. పర్వత లోయల్లోని రాళ్ల వ్యర్థాలు, మంచు ఆనకట్టల వెనుక ఏర్పడే సరస్సులలో నీటి మట్టం పెరిగి సహజ ఆనకట్టలు తెగిపోవడమే ఈ విపత్తుకు కారణం. భారత్లో ముందస్తు రక్షణ చర్యలు, సన్నద్ధత సరిపోకపోవడం వల్లే ఘటనలు తక్కువైనా మరణాల సంఖ్య భారీగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. 2023 తీస్తా వరదలు, 2025 చమోలీ ఘటనల నుండి సరైన గుణపాఠాలు నేర్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రాణనష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దారుణ హత్య -
నేపాల్ వరదలు.. ప్రకృతి ఉగ్రరూపానికి పరాకాష్ఠ
ఇటీవల నేపాల్లో కురిసిన అసాధారణ భారీ వర్షాలు, దాని ఫలితంగా సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం ఆ దేశంలో ఊహించని ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. హిమాలయ ప్రాంతాల సున్నితమైన పర్యావరణం, అసంఘటిత పట్టణీకరణ, వాతావరణ మార్పుల తీవ్రత కలిసి నేపాల్ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వంతెనలు, రహదారులు, జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమై ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ విపత్తు కేవలం నేపాల్కే కాకుండా నదీ పరివాహక ప్రాంతాలైన దక్షిణాసియా దేశాలన్నింటికీ ఒక తీవ్ర హెచ్చరిక.సాంకేతిక ఆధారిత ముందస్తు జాగ్రత్తలుఇలాంటి ప్రాణాంతక పరిణామాల తీవ్రతను తగ్గించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ఏకైక మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. సాటిలైట్ ఇమేజరీ, డోప్లర్ వాతావరణ రాడార్ల ద్వారా మేఘాల స్థితిని, వర్షపాత తీవ్రతను నిమిషాల వ్యవధిలో అంచనా వేయవచ్చు. నదుల ఎగువ ప్రాంతాల్లో ఐఓటీ సెన్సార్లను అమర్చడం ద్వారా నీటి మట్టం పెరిగిన వెంటనే దిగువ ప్రాంత ప్రజలకు ఏఐ ఆధారిత ఆటోమేటెడ్ అలర్ట్లు పంపవచ్చు. హిమాలయాల్లోని మంచు సరస్సులు బద్దలయ్యే ప్రమాదాన్ని ముందే పసిగట్టేందుకు రిమోట్ సెన్సింగ్ వ్యవస్థలు అత్యంత కీలకం.వర్తమాన దేశాల వినియోగం - ఆర్థిక సవాళ్లుఅభివృద్ధి చెందిన దేశాలైన జపాన్, అమెరికా వంటివి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ (ఈడబ్ల్యూఎస్), మల్టీ-లేయర్డ్ మైక్రో-క్యాచ్మెంట్ మేనేజ్మెంట్ తరహా సూక్ష్మ జలపాత నియంత్రణ సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాయి. భారత్ కూడా కల్పకం, కేంద్రీయ జల సంఘం (సీడబ్ల్యూసీ) ద్వారా నదీ పరివాహక ప్రాంతాల్లో అధునాతన అంచనా వ్యవస్థలను అమలు చేస్తోంది. అయితే నేపాల్, భూటాన్ వంటి పరిమిత ఆర్థిక వనరులున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ సాంకేతికతను అందుకోవడం సవాలుగా మారింది.అధిక వ్యయంఆధునిక డోప్లర్ రాడార్లు, రియల్-టైమ్ సమాచార నెట్వర్క్ల ఏర్పాటుకు బిలియన్ డాలర్ల మూలధనం అవసరం. భౌగోళికంగా క్లిష్టమైన హిమాలయ ప్రాంతాల్లో సాంకేతిక పరికరాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, నిర్వహించడం ఆర్థికంగా భారంగా మారుతోంది. సరిహద్దు దాటి ప్రవహించే నదుల విషయంలో పొరుగు దేశాల మధ్య తగినంత సమాచార మార్పిడి లేకపోవడం మరిన్ని నష్టాలకు దారితీస్తోంది.పరిష్కార మార్గంవాతావరణ వైపరీత్యాలు సరిహద్దులుండవు. కాబట్టి సార్క్ లేదా బిమ్స్టెక్ వంటి ప్రాంతీయ కూటమిల ద్వారా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు కలిపి నిధులు సమకూర్చుకోవాలి. గ్లోబల్ క్లైమేట్ ఫండ్ వంటి అంతర్జాతీయ సంస్థలు నేపాల్ వంటి సున్నితమైన ప్రాంతాలకు ఉచిత సాంకేతిక బదిలీ, ఆర్థిక సహాయం అందించాలి. ప్రాణనష్టాన్ని నివారించడానికి ఆధునిక సాంకేతికతపై పెట్టే పెట్టుబడి, విపత్తు తదుపరి పునరావాసానికి అయ్యే వ్యయం కంటే చాలా తక్కువ అని ప్రపంచ దేశాలు గ్రహించాలి.ఇదీ చదవండి: యూట్యూబ్తో అమెజాన్ చేతులు -
Video: భయానక దృశ్యం.. క్షణాల్లో కొట్టుకుపోయిన గ్రామం
నేపాల్ను వరదలు వణికిస్తున్నాయి.. వరద బీభత్సానికి సంబంధించిన భయానక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో విరుచుకుపడిన వరద.. ఓ నదీ తీర గ్రామాన్ని క్షణాల్లో ముంచెత్తింది. భారీగా వచ్చిన బురదతో కూడిన వరదనీళ్ల ధాటికి ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి.భోటేకోశి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా ఉధృతమైంది. నదులు పొంగిపొర్లడంతో నీరు, బురద జనావాసాల్లోకి దూసుకెళ్లాయి. చూస్తుండగానే ఓ నదీ తీర ప్రాంతం మొత్తం బురదగా మారిపోయింది. ఆ తర్వాత వరద ప్రవాహం దిగువ ప్రాంతాల వైపు కొనసాగింది. ఈ భారీ విపత్తులో 1,400 మందికి పైగా ఆచూకీ గల్లంతవ్వగా.. 392 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.ఈ వరదల తాకిడికి వందల సంఖ్యలో వంతెనలు ధ్వంసమయ్యాయి. దాదాపు 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో సహాయక, గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. హిమానీనదం నుంచి మంచు విరిగిపడటం వల్లే ఈ ఆకస్మిక వరద సంభవించి ఉండొచ్చని అంచనా. ఒక దశలో త్రిశూలి నదిలో నీటి మట్టం కేవలం అరగంటలోనే 9 మీటర్ల వరకు పెరిగినట్లు ఖాట్మండులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్మెంట్ నిపుణులు తెలిపారు.Bright daylight, clear skies, and then suddenly a tsunami like wave crashes into a village. These scenes from Nepal today are beyond horrific. Everything feels like a doomsday scene.95+ people reported killed and 500+ still missing. Prayers for everyone #Nepal 🙏 https://t.co/0aIccVPsd8 pic.twitter.com/zSOXpiA0nK— Nikhil saini (@iNikhilsaini) August 26, 2026రాసువా జిల్లాలో సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేపాల్లో 290 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం వెల్లడించింది. ఇప్పటివరకు 84 మంది భారతీయులను రక్షించినట్లు తెలిపింది. ఆచూకీ తెలియని వారిలో కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన పలువురు, త్రిశూలి-1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు.ఇదీ చదవండి: యుగాంతం రేంజ్లో ముప్పు?.. నేపాల్కు చైనా మరో డెడ్లీ వార్నింగ్! -
Viral Video: బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న నేపాల్ ప్రజలు.. భయానక దృశ్యాలు
-
Viral : వరద నీటిలో సైతం దూసుకెళ్లిన వందే భారత్ ఎక్సప్రెస్
-
నేపాల్ జల ప్రళయం.. గల్లంతైనవారి జాబితా విడుదల
నేపాల్ వరదల్లో గల్లంతైనవారి జాబితా విడుదలైంది. 33 దేశాల పర్యాటకులు గల్లంతయ్యారు. విదేశాలకు చెందిన 627 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. అత్యధికంగా 290 మంది భారతీయులు గల్లంతయినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అమెరికా-65, ఉక్రెయిన్-53, మలేషియా-51, ఆస్ట్రేలియా-35, బ్రిటన్-33, కెనడా-25, సింగపూర్కు చెందిన 9 మంది గల్లంతయ్యారు.నేపాల్ జల విలయంలో మృతుల సంఖ్య 550 దాటింది. 1000 మందికిపైగా గల్లంతవ్వగా.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 85 మంది భారతీయులు సహా 117 మంది పర్యాటకులను నేపాల్ ఆర్మీ రక్షించింది.ఉత్తరప్రదేశ్లోని గండక్ నదీప్రవాహంలో మూడు మృతదేహాలు కొట్టుకొచ్చినట్లు ఉత్తరప్రదేశ్ అధికారులు వెల్లడించారు. నేపాల్ను దాటాక వరద ప్రవాహం భారత్లోకే వస్తుంది. దీంతో అక్కడి నుంచే ఈ మృతదేహాలు వచ్చాయని అధికారులు భావిస్తున్నారు.రాష్ట్రంలోని కుషీనగర్ జిల్లాలోని నారాయణి నదిలోనూ వరద ఉధృతి పెరిగే ఆస్కారముందని అధికారులు తెలిపారు. మరోవైపు బిహార్లో ఆరు జిల్లాల్లోని నదీ పరీవాహక దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మ రోవైపు ఈశా ఫౌండేషన్కు చెందిన డజన్ల మంది సభ్యుల జాడ గల్లంతైందని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆవేదన వ్యక్తంచేశారుఇదీ చదవండి: నేపాల్లో రెడ్ అలర్ట్.. మరో భారీ జల ప్రళయం ముప్పుకాగా, మానస సరోవరం యాత్ర నుంచి విశాఖ వాసులు క్షేమంగా తిరిగొచ్చారు. విశాఖపట్నం నుంచి మానస సరోవరం యాత్రకు 10 మంది పర్యాటకులు వెళ్లారు. ఆగస్టు 11వ తేదీన విశాఖపట్నం నుంచి మానస సరోవరం యాత్రకు వెళ్లారు. 23వ తేదీన తిమోర్ చైనా ఇమ్మిగ్రేషన్ సెంటర్కు యాత్రికులు వెళ్లగా.. 26న వరద బీభత్సంలో చైనా ఇమ్మిగ్రేషన్ సెంటర్ కొట్టుకుపోయింది. వరద ప్రమాదానికి ఒకరోజు ముందే ఖాట్మండు ఎయిర్పోర్టు నుంచి విశాఖపట్నం పర్యాటకులు ఢిల్లీ చేరుకున్నారు. ఇతర బృందాల్లో పలువురు వరదల్లో గల్లంతయ్యారు. ఇషా ఫౌండేషన్కు చెందిన కొందరు బృందం సైతం గల్లంతయ్యారు. -
ప్రళయం తర్వాత నేపాల్ ఎలా ఉందంటే..
-
మా కారు ముందే కొండచరియలు విరిగిపడ్డాయి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సంచలన నిజాలు
-
నేపాల్ వరదల ప్రభావం భారత్పై.. త్వరలోనే!
-
సరస్సు బ్లాస్ట్ నేపాల్ కు మరో ముప్పు
-
సాక్షి కార్టూన్: 28-08-2026
సాక్షి కార్టూన్: 28-08-2026 -
LIVE: నేపాల్ లో హైఅలర్ట్ దూసుకొస్తున్న మరో మహా ప్రళయం
-
చైనా-నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం.. దూసుకొస్తున్న మహా ప్రళయం
-
Nepal: దూసుకొస్తున్న మరో భారీ జల ప్రళయం
-
చైనా చాలా డేంజర్..బయటపడ్డ సంచలన విషయాలు
-
కళ్లముందే సర్వనాశనం
కఠ్మాండు: కళ్ల ముందే కుటుంబం మొత్తాన్నీ వరదనీరు కబళించిన దృశ్యాలు ఇంకా తన కళ్లలో అలాగే నిలిచిపోయాయని కంటతడి పెడుతూ 38 ఏళ్ల గిరిలాల్ చెప్పారు. ఆప్తులు, కుటుంబసభ్యులు, ఇల్లు కోల్పోయి ఏకాకిలా మిగిలిన ఎంతో మంది ఇంకా ఆ భయానక ఘటనలను గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమవుతున్నారు. వ్యర్థాల నిర్వహణ కార్యాలయంలో ట్రక్కు డ్రైవర్గా పనిచేసే గిరి లాల్కు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. రాసువా జిల్లాలోని సరిహద్దు పట్టణం తిమూర్లో గిరిలాల్ కుటుంబం ఉంటోంది. మెరుపు వరదల్లో గిరిలాల్ భార్య, నలుగురు సంతానం కొట్టుకుపోయారు. ‘‘కళ్లముందే జీవితం చెదిరిపోయింది. కాళ్ల కింద భూకంపం వచ్చినట్లయింది. నా వాళ్లంతా పోయారు’’అని గిరి గద్గద స్వరంతో చెప్పారు. ‘‘ఉదయం 8.40 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. హఠాత్తుగా దిగువన ఉన్న దుకాణ సముదాయాన్ని అమాంతం ముంచేస్తూ వరదనీరు, బురద, మట్టి కొట్టుకొచ్చాయి. మా కళ్ల ముందే అంతా వరదనీటిలో కలిసిపోయాయి’’అని మరో ప్రత్యక్షసాక్షి చెప్పారు. ‘‘నదీ పరివాహక ప్రాంతం నుంచి ఒక్కసారిగా భారీ శబ్దాలు విని్పంచాయి. అవేంటో అర్థంచేసుకునేలోపే భీకరంగా వరదనీరు విరుచుకుపడింది. పారిపోయేలోపే దిగువన ఉన్న జనాన్ని మింగేస్తూ వరదనీరు పోటెత్తి అందర్నీ తనలో కలిపేసుకుంది. క్షణాల్లో రోడ్డు, ఇళ్లు మటుమాయమై అంతటా భారీస్థాయిలో బురద పరుచుకుంది’’అని మరో ప్రత్యక్షసాక్షి వివరించారు. ‘‘భోటె కోశి నది సమీప డ్యామ్ కూలిపోయి నీరంతా దిగువకు కొట్టుకొస్తోందని ఎగువకు పారిపొండి అని అధికారులు చెప్పారు. అర్థం చేసుకుని అంతా పారిపోయేలోపే నీరు ముంచెత్తింది. నా 18 ఏళ్ల కుమారుడు, భార్య సైతం కని్పంచకుండా పోయారు’’అని మరో ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. పారిపోయే సమయం కూడా ఇవ్వకుండా వరదనీరు సర్వనాశనం చేసిందని నువాకోట్లోని త్రిశూలి మార్కెట్లో వస్త్రదుకాణ వ్యాపారి వాపోయాడు. ‘‘తిమూర్ బజార్పై ఏకంగా 100 మీటర్ల ఎత్తులో వరద అలలుగా వచ్చినట్లుంది. అందుకే తిమూర్ బజార్ రెప్పపాటులో కన్పించకుండా పోయింది’’అని రాసువాలో చీఫ్ కస్టమ్స్ అధికారి, ప్రత్యక్ష సాక్షి రాజేంద్ర ధుంగానా చెప్పారు. కస్టమ్స్ చెక్పోస్ట్ వద్ద ఉన్న 300 వాహనాలు, ట్రక్కులు వరదలో కొట్టుకుపోయాయని మరో వ్యక్తి తెలిపారు. -
నేపాల్లో వరద బీభత్సం 25 మంది తెలుగువారు మిస్సింగ్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: నేపాల్లో భారీ వరదల కారణంగా 25 మంది తెలుగు రాష్ట్రాల యాత్రికుల ఆచూకీ తెలియక పోవడంపై ఆందోళన నెలకొంది. అక్కడ చిక్కుకుపోయిన మిగతా వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్రంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చర్యలు వేగవంతం చేశాయి. ఢిల్లీలోని సంబంధిత రాష్ట్రాల భవన్ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు గురువారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. నేపాల్లో చిక్కుకున్న వారి యోగక్షేమాలను వారి కుటుంబ సభ్యులకు తెలియజేసేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. నిరంతరం నేపాల్ రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్ర ప్రజల వివరాలను అధికారులు తెలుసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక నంబర్లు 011–23384016, 011–23387089తోపాటు వాట్సాప్–9059824101ను అందుబాటులో ఉంచారు. నేపాల్, చైనా సరిహద్దుల్లో బుధవారం సంభవించిన వరదల కారణంగా చిక్కుకుపోయిన ఏపీ యాత్రికులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎన్ఆర్టీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ సహా హైదరాబాద్లోని సచివాలయంలో హెల్ప్లైన్ ప్రారంభించిన నాటి నుంచి కుటుంబ సభ్యులు, ఇతరుల నుంచి సమాచారం, సహాయం కోరుతూ సుమారు 80 నుంచి 100 కాల్స్ అందాయి. 22 మంది ఆచూకీ కోసం అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగుతోందని తెలంగాణ భవన్ అధికారులు తెలిపారు. బాధితులకు తక్షణ సాయం అందించండి: వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి నేపాల్ విపత్తుకు ప్రభావితమైన ఏపీకి చెందిన వారికి తక్షణ సాయం అందించడంతో పాటు గల్లంతైన వారి కోసం గాలింపు, రక్షణ చర్యలను ముమ్మరం చేయాలని వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ను కోరారు. ఈ మేరకు గురువారం విదేశాంగ మంత్రితో పాటు నేపాల్లోని భారత రాయబార కార్యాలయానికి లేఖలు రాశారు. ఏపీకి చెందిన పలువురు గాయపడ్డారని, కొందరు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. తక్షణ వైద్యసాయం అందించడంతో పాటు ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.ఏపీకి చెందిన నలుగురు సురక్షితంఆంధ్రప్రదేశ్కు చెందిన ఏడుగురు యాత్రికుల సమాచారం హెల్ప్లైన్కు అందింది. వారిలో నలుగురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కర్శాస్త్రి సహా నలుగురు కైలాస మానస సరోవర్ యాత్రికులు క్షేమంగా ఉన్నప్పటికీ వరద తీవ్రత వల్ల అక్కడ చిక్కుకుపోయారు. కుప్పానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్ (ఎస్–త్రీ) సభ్యులైన శశికుమార్, రాజ్యలక్ష్మి నిమ్మగడ్డ జాడ ఇంకా దొరకలేదని, వారిని గుర్తించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ భవన్ అధికారులు పేర్కొన్నారు.కృష్ణా జిల్లాకు చెందిన చొప్పరపు రమేష్ బాబు, అట్లూరి శశి, నిమ్మగడ్డ రాజ్యక్ష్మితో పాటు కాకినాడ జిల్లాకు చెందిన అన్నందేవర వెంకట్రామ్, అన్నందేవర అనఘ, ప్రకాశం జిల్లాకు చెందిన కందిమళ్ల సుహాసినిరెడ్డి, వెన్నెలగంటి బాలసుబ్రహ్మణ్యం వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. కాగా, నేపాల్ వరదల్లో చిక్కుకున్న డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు క్షేమంగా ఉన్నట్లు మీడియాకు తెలిపారు. కర్నూలుకు చెందిన డాక్టర్ కె.నవంతిరెడ్డి తృటిలో తప్పించుకున్నారు. ఈమె ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్, యూరాలజిస్టు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి సతీమణి. మూడు రోజుల కిందట ఈషా ఫౌండేషన్ తరఫున మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. ఏపీకి చెందిన 41 మంది నేపాల్లో చిక్కుకున్నారు నేపాల్ వరదల్లో ఏపీకి చెందిన 41 మంది చిక్కుకున్నారని, వీరిలో 34 మంది సురక్షితంగా ఉండగా.. మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉందని (సాయంత్రానికి వీరిలో నలుగురి ఆచూకీ తెలిసింది) సీఎం చంద్రబాబు తెలిపారు. నేపాల్లో భారీ వరదల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసుల పరిస్థితిపై గురువారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మానస సరోవర్ యాత్ర వెళ్లిన ఏపీ యాత్రీకులు యోగక్షేమాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. ఆదోని ప్రాంతానికి చెందిన నలుగురు టిబెట్లో సురక్షితంగా ఉన్నారని చెప్పారు. తిరుపతి ప్రాంతానికి చెందిన 28 మంది యాత్రికులు ఖాట్మండులో సురక్షితంగా ఉన్నారని అధికారులు చెప్పారు. నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరి క్షేమం కోసం అన్ని మార్గాల్లో సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు. కానరాని 83 మంది తమిళుల జాడ సాక్షి, చెన్నై: నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారిలో తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన 103 మంది ఉన్నారు. వీరిలో 20మంది సమాచారం మాత్రమే తెలిసింది. మిగిలిన 83 మంది వివరాలు లభించకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో పడ్డాయి. వారి జాడ కోసం అన్వేషణ మొదలెట్టారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన భక్తుల విషయమై మంత్రులు, అధికారులతో తమిళనాడు సీఎం విజయ్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని తమిళనాడు భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆశిష్ కుమార్ నేతృత్వంలోని ఐఏఎస్ అధికారుల బృందాన్ని నేపాల్కు పంపించారు. తమిళనాడు మంత్రులు ఆదవ్ అర్జున, రాజ్మోహన్, తెన్నరసు, వినోద్, విదేశీ తమిళుల సంక్షేమ శాఖ డైరెక్టర్ సతీష్ లను ఢిల్లీకి పంపించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయించేందుకు, రక్షణ చర్యలు పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. నేపాల్ వెళ్లిన ఈషా గ్రూపునకు చెందిన 80 మంది సభ్యులు అదృశ్యమయ్యారని సద్గురు జగ్గీ వాసుదేవ్ కన్నీటి పర్యంతమయ్యారు. టిబెట్ నుండి విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ఈ విషాదకర ఘటన వివరాలను ఆయన పంచుకున్నారు. ప్రభావిత ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించడానికి తాను ఉదయాన్నే బయలుదేరడానికి ప్రయత్నించినప్పటికీ రోడ్డు మార్గాలు పూర్తిగా దెబ్బతినడంతో అక్కడికి చేరుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. -
హైదరాబాద్ మూలాలున్న ఇద్దరు మిస్సింగ్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్/నాగోలు/మునుగోడు: నేపాల్ వరదల్లో హైదరాబాద్ ఎల్బీనగర్ వాస్తు కాలనీకి చెందిన కందిమళ్ల మహేందర్రెడ్డి–ప్రేమలతా రెడ్డిల కూతురు సుహాసినిరెడ్డి (44) గల్లంతయ్యా రు. నల్లగొండ జిల్లా పెద్దకాపర్తికి చెందిన మహేందర్రెడ్డి పెద్ద కుమార్తె సుహాసినిరెడ్డిని మునుగోడు మండలం గుడాపూర్కు చెందిన నన్నూరి సంజీవరెడ్డికి ఇచ్చి 2004లో వివా హం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. ఉద్యోగరీత్యా న్యూజిలాండ్ వెళ్లి పౌరసత్వం పొందారు. సుహాసిని ప్రస్తుతం ఆ్రస్టేలియాలో పనిచేస్తున్నారు. ఇటీవల ఎల్బీనగర్ చంద్రపురి కాలనీలో గృహ ప్రవేశం చేశారు. ఈ నెల 23న మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. ఈమె వెంట వెళ్లాల్సిన హబ్సిగూడ డాక్టర్ శిరీష చివరి నిమిషంలో ఆగిపోయా రు. దీంతో ఆ్రస్టేలియాలో ఉండే స్నేహితురాలిని కలుపుకొని సుహాసిని టూర్కు వెళ్లారు. ఖాట్మండ్ నుంచి కళ్యాణ్ కైలాష్ జర్నీస్ టూర్స్–ట్రావెల్స్ ద్వారా మొత్తం 29 మంది యాత్రకు బయల్దేరారు. చివరగా నేపాల్లోని «ధుంచే–స్యాబ్రుబెసి ప్రాంతంలో టిబెట్ సరిహద్దు వైపు ప్రయాణిస్తున్న వాహనంలో ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి సుహాసిని ఫోన్ కలవలేదు. తర్వాత వరదలు వచ్చాయని తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆ భవనం వద్ద ఆఖరిసారిగా... నాచారం నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన లక్ష్మీనాథ్ గోపిశెట్టి 8 మందితో కలిసి కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లారు. బుధవారం ఉదయం 8.10 గంటలకు ఆఖరిసారిగా కుటుంబ సభ్యులను సంప్రదించారు. ఆ సమయంలో నేపాల్లోని ‘రసువా కస్టమ్స్ ఆఫీస్’వద్ద ఉన్నారు. తర్వాత ఆకస్మిక వరదలతో ఆ కార్యాలయం తుడిచిపెట్టుకుపోయింది. అప్పటినుంచి ఆయనతో సంబంధాలు తెగిపోయాయని ముషీరాబాద్కు చెందిన లక్ష్మీనాథ్ బంధువు డి.రామచంద్ర తెలిపారు. లక్ష్మీనాథ్ బృందం నేపాల్కు చెందిన క్లాసిక్ వెకేషన్స్ ఏజెన్సీ ద్వారా వెళ్లారని, ముంబైలోని ఆ సంస్థ బ్రాంచ్ను సంప్రదించగా నిర్వాహకులు తమ బాధ్యత లేదన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది. ఆయన తన కుటుంబ సభ్యులను కూడా సంప్రదించారు. సురక్షితంగా ఉన్నాం: సతీశ్రెడ్డి నేపాల్లో తాము క్షేమంగానే ఉన్నామని డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డితో కూడిన బృందం గురువారం ఒక వీడియో సందేశంలో తెలిపింది. విపత్తు సంభవించే సమయానికి తామంతా అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయాని స్పష్టం చేసింది. ఏపీకి చెందిన నలుగురు క్షేమంఆంధ్రప్రదేశ్కు చెందిన ఏడుగురు యాత్రి కుల సమాచారం హెల్ప్లైన్కు అందింది. అయితే.. వారిలో నలుగురు సురక్షితంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. -
ఈ విలయం ఎవరి పాపం?
హిమవత్పర్వత శ్రేణి రాళ్లూ రప్పల సమూహం కాదు... అది ప్రకృతి చెక్కిన ఒక అద్భుత దృశ్యకావ్యం. ఈ సౌందర్యం కాస్తా రెప్పపాటులో మృత్యుగీతం ఆలపిస్తుంది. జనావాసాలను క్షణంలో శ్మశాన వాటికలుగా మారుస్తుంది. బుధవారం నేపాల్–టిబెట్ సరిహద్దుల్లో అతి పెద్ద మంచుఖండం విరిగి భోటే కోశీ నదిలో పడటంతో మెరుపు వరదలు సంభవించి 350 మంది వరకూ మరణించారని అంటున్నారు. 30కిపైగా దేశాలకు చెందిన 1,300 మంది గల్లంతయ్యారు. వారిలో 290 మంది భారతీయులు. నది దిగువనవున్న అనేక జనావాసాలు, డజను జలవిద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదార్లు కొట్టుకు పోయాయి. హిమాలయాల్లో ఇలాంటి ఉదంతాలు రివాజుగా మారినా, ఈసారి ఉత్పాతం అతి పెద్దదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ దారుణానికి కారణమేమిటో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. రిక్టర్ స్కేల్పై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించటంవల్లే ఇలా జరిగిందని తొలుత వార్తలొచ్చాయి. అయితే దాన్ని నిర్ధారించే ఉపగ్రహ చిత్రాలేమీ లేకపోవటంతో తీవ్ర వాతావరణ స్థితిగతులవల్లే మంచుఖండం కరిగి విరిగిపడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరగటంవల్ల భూమి నానాటికీ వేడెక్కుతోంది. కాలుష్యకారక దేశాల్లో తొలి స్థానం అమెరికాది. అటు తర్వాత స్థానం చైనాది కాగా, మూడో స్థానం మనది. నాలుగో స్థానం యూరోప్ దేశాలది. కర్బన ఉద్గారాల విడుదలలో నేపాల్ స్థానం 95. అంటే ప్రపంచాన విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో ఒక శాతంలో పదో వంతు వాటా మాత్రమే నేపాల్ది. వాతావరణ మార్పుల తాకిడికి నష్టపోయే దేశాల్లో మాత్రం ఆ దేశానిది ఆరో స్థానం. అతి తక్కువ కాలుష్యానికి కారణమవుతూ అతి ఎక్కువ మూల్యం చెల్లిస్తున్న దేశంగా నేపాల్ను చెబుతారు. ఇప్పుడంటే సూపర్ ఎల్నినో వచ్చిపడిందిగానీ... గత దశాబ్దకాలంగా ప్రకృతి వైపరీత్యాలు వేధిస్తూనే ఉన్నాయి. వాటిని ముందుగా పసిగట్టే సాంకేతికతలు అనుకున్నంతగా అభివృద్ధి చెందకపోయినా, గతంతో పోలిస్తే ఎంతో మెరుగైన ఉపకరణాలు అమెరికా, చైనాలవద్ద ఉన్నాయి. తమ కారణంగా యేటా భారీ నష్టాన్ని చవిచూస్తున్న నేపాల్కు ఆ సాంకేతికతల్ని ఉచితంగా ఇచ్చి ఆదుకోవటం తమ నైతిక ధర్మమని అవి రెండూ అనుకోవు. ఫలితంగా చెప్పాపెట్టకుండా మెరుపు వరదలు విరుచుకుపడటం నేపాల్లో మామూలు విషయంగా మారింది. భోటే కోశి నది టిబెట్లో మొదలవుతుంది. కొడారి దగ్గర ఒక పాయ, రసువా దగ్గర మరో పాయ నేపాల్లోకి ప్రవేశిస్తాయి. నిరుడు సైతం ఆ నదికి ఇలాగే వరదలొచ్చాయి. గత నెల 8న రసువా దగ్గరొచ్చిన వరదల్లో 18 మంది చనిపోగా, అనేక జలవిద్యుత్ ప్రాజె క్టులు, వంతెనలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. వర్షపాతం, వరదనీటి ప్రవాహాల గురించిన డేటా చైనా ఎప్పటికప్పుడు అందిస్తే ప్రాణనష్టాన్ని నివారించే వీలుంటుంది. దేశంలోకి వరద నీరు ప్రవేశించటం మొదలయ్యాకే పౌరుల్ని హెచ్చరించే స్థితి ఉండటం నేపాల్కి విషాదం మిగులుస్తోంది. కొన్నిసార్లు మంచుపలకలు విరిగి భోటే కోశి ప్రవాహ మార్గాన్ని కప్పేస్తాయి. అప్పుడు దిగువన నేపాల్లో నది నిండుకుంటుంది. దాన్నొక ముందస్తు హెచ్చరికగా తీసుకుంటారు. ఇలాంటి వైపరీత్యాలు జరిగినప్పుడు మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం తప్పదు. నిరుడు బేత్రావతి–రసువాగడి కారిడార్ను వరదలు ముంచెత్తి భారీ నష్టం జరిగింది.అతి కష్టంపై వాటన్నిటినీ పునర్నిర్మించారు. అవన్నీ తాజా వరదల్లో మళ్లీ కొట్టుకు పోయాయి. పదిపదిహేనేళ్ల డేటా అందుబాటులో ఉండి అధ్యయనం చేయగలిగితే నది నడత అంచనాకు, దానికి అనుగుణంగా కనిష్ఠ స్థాయి నష్టం మాత్రమే ఉండేలా నిర్మాణాలు చేపట్టడానికి కొంతవరకూ వీలవుతుంది. భారీ జననష్టం, ఆస్తినష్టం కలగజేసే వైపరీత్య సమాచారం సైతం సరిహద్దుల ఆవలే నిలిచిపోతే మానవాళి సాధించిన అభివృద్ధికి అర్థం ఉండదు. దానికన్నా ముందు సంపన్న దేశాలు తమ అభివృద్ధి నమూనాలను మార్చుకోవాలి. వైపరీత్యం వచ్చిపడ్డాక సాయం చేయటానికి ముందుకు రావటం మెచ్చదగిందే అయినా, దాని నివారణకు తమ వంతు చేయాల్సిందేమిటో అవి గుర్తెరగాలి. బాధ్యతారహిత ప్రవర్తన ఏదో ఒకరోజు తమను కూడా ధ్వంసించగలదని తెలుసుకోవాలి. -
నేపాల్ జల ప్రళయం వెనుక అసలు కారణాలేంటి?
నేపాల్-చైనా సరిహద్దులో మెరుపు వరదలు సృష్టించిన బీభత్సం.. అంతా ఇంతా కాదు. నేపాల్ను జల ప్రళయం కకావికలం చేస్తున్న వేళ.. ఆధునిక నిర్మాణ రంగం ఇలాంటి ప్రకృతి విపత్తులను ఎంతవరకు తట్టుకోగలదనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ భీకర జల ప్రళయం నేర్పిన పాఠాలు ఏంటి? వీటన్నిటిని తట్టుకునేలా పర్వత ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో భవిష్యత్ నగరాల భవన డిజైన్లు అసలు ఎలా ఉండాలనే దానిపై చర్చ నడుస్తోంది.ప్రకృతి వైపరీత్యాలను ముందే ఊహించి అధునాతన మోడలింగ్ సాంకేతిక ద్వారా ప్రాణ ఆస్తి నష్టాలను ఎలా నివారించవచ్చో ప్రముఖ ఆర్కిటెక్చర్ నిపుణులు డాక్టర్ ప్రదీప్కుమార్ విశ్లేషించారు. నేపాల్లో జల విలయానికి అసలు కారణాలు ఏంటి?. ఏం జరిగింది? భవిష్యత్లో ఏం జరగబోతుంది? పలు షాకింగ్ విషయాలను సాక్షి ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పూర్తి వివరాలు కోసం కింది వీడియోను చూడండి. -
హైదరాబాద్ నుంచి వెళ్లిన 35 మంది సేఫ్.. నాకు వాళ్లు ఫోన్ చేసి చెప్పింది ఇదే
-
కళ్ల నీళ్లు తెప్పిస్తున్న నేపాల్ డ్రోన్ విజువల్స్
-
750 మంది భారతీయులు ఎక్కడ..? కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు
-
BIG ALERT: హిమాలయాల నుండి ముంచుకొస్తున్న మహా ప్రళయం
-
DRDO మాజీ ఛైర్మన్ అసలు అక్కడ ఏం జరుగుతుందో లైవ్ లో చెప్పిన సతీష్ రెడ్డి
-
నేపాల్ వరదలకు కారణం ఇదే ఉస్మానియా ప్రొఫెసర్ చెప్పిన సంచలన విషయాలు..
-
నేపాల్ వరదల్లో భారతీయుల గల్లంతుపై కేంద్రం ప్రకటన
నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 332కి పెరిగింది. వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతైనట్టు కేంద్రం ప్రకటించింది. తమిళనాడు-37, కేరళ 33, బెంగాల్కు చెందిన 32 మంది, మహారాష్ట్రకు చెందిన 7, ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మంది మిస్సింగ్ అయ్యారు. త్రిశూలీ-1 ప్రాజెక్ట్ సిబ్బంది 73 మంది గల్లంతయ్యారు. ఈషా ఫౌండేషన్కు చెందిన 80 సభ్యులు వరదల్లో గల్లంతయినట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది.గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 42 టన్నుల సహాయ సామాగ్రిని నేపాల్కు భారత్ ప్రభుత్వం పంపించింది. కేంద్ర విదేశాంగ శాఖ.. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. విదేశాంగ శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు: 011-23089718, వాట్సాప్ నెంబర్ : 9968291988. ఇప్పటివరకు 21 మంది భారతీయులను రక్షించామని కేంద్రం పేర్కొంది.కాగా, నేపాల్లో ఇషా ఫౌండేషన్ సేక్రెడ్ వాక్స్ పేరుతో కైలాస్ మానస సరోవర్ యాత్ర చేపట్టగా.. వరదలు ముంచెత్తడంతో పర్యాటకులు, వాలంటీర్లు కనిపించకుండా పోయారు. దీంతో ఇషా ఫౌండేషన్లో విషాదం నెలకొంది. ‘‘మా బృందం ఖాట్మండుకు తిరుగు ప్రయాణంలో చైనా ఇమ్మిగ్రేషన్ సెంటర్లో ఉన్నారు. ఉదయం 9:05కి గ్రూప్ లీడర్ ప్రవీణ్తో చివరిగా మాట్లాడాం. ఇమ్మిగ్రేషన్ ప్రారంభిస్తున్నామన్నారు. 10 నిమిషాల్లోనే సంప్రదింపులు తెగిపోయాయి. 10 నిమిషాల్లోనే ఈ విషాదం జరిగింది. మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ డౌన్ అయ్యింది. నేపాల్ వైపు కమ్యూనికేషన్ పూర్తిగా ఆగిపోయింది. నేపాల్ వైపు మా వాలంటీర్లు ఉన్న పట్టణం పూర్తిగా కొట్టుకుపోయింది.’’ అని ఇషా ఫౌండేషన్ తెలిపింది.‘‘చైనా అధికారుల నుంచి సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం… రేపు ఉదయం వరకు ఆశిస్తున్నాం. 77 మంది భక్తులు చిక్కుకున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్, యూకే, ఆసియా దేశాలవారు ఉన్నారు.19 ఎంబసీలతో సహాయం, సమాచారం కోసం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. రిమోట్ ప్రాంతం, భారీ విపత్తు కారణంగా సమాచారం నెమ్మదిగా వస్తోంది’’ ఇషా ఫౌండేషన్ పేర్కొంది.ఇదీ చదవండి: ప్రకృతి పరీక్ష.. మానస సరోవర్ యాత్ర ఎందుకంత ప్రత్యేకం? -
చిన్న మంచు ముక్కకే నేపాల్ మునిగితే... హిమాలయాలు కరిగితే...? నేపాల్ వరదల వెనుక రహస్యం?
-
నేపాల్లో భారీ వరద బీభత్సం.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు!
-
చైనాకు తెలిసిన నేపాల్ను హెచ్చరించలేదా? చైనా పాపమే .. నేపాల్ కి శాపమా?
-
నేపాల్ వరదలకు అసలు కారణమేంటి? మరో ముప్పు ఎందుకు?
-
నేపాల్ వరదల్లో.. ఏపీ, తెలంగాణ యాత్రికులు గల్లంతు
-
‘నేపాల్ విపత్తు ఒక డ్రామా’.. థరూర్ను ఏకిపారేస్తున్న జనం!
న్యూఢిల్లీ: నేపాల్లో సంభవించిన భీకర వరదలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ పోస్టులో ఆయన ఉపయోగించిన ఒక పదంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వరద బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించినప్పటికీ, ఈ పెను ప్రకృతి విపత్తును ‘డ్రామా’ అని సంబోధించడం చాలామందిని తీవ్రంగా కలచివేసింది. కేరళలోని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ గురువారం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ‘భారీ వినాశనాన్ని సృష్టించిన కొండ ప్రాంతాల్లోని ఆ డ్రామా గురించి ఏమాత్రం తెలియకుండానే నిన్న ఖాట్మండుకు విమానంలో ప్రయాణించాను’ అని రాసుకొచ్చారు. ఇంతటి తీవ్ర విషాదాన్ని వర్ణించేందుకు థరూర్ ‘డ్రామా’ అనే పదాన్ని వాడటంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గొప్ప పదసంపద కలిగిన వ్యక్తి ఇంతటి సున్నితత్వ లేని పదాన్ని ఎలా ఉపయోగిస్తారని సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.నిఘంటువులోని క్లిష్టమైన పదాలు తెలిసినంత మాత్రాన ప్రయోజనం ఏమిటని, సమయోచితంగా ఎలా మాట్లాడాలో తెలియకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రకటనలోని సానుభూతే ఒక నాటకంలా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. ఆంగ్ల భాషా నైపుణ్యానికి పెట్టింది పేరైన శశిథరూర్ నుంచి ఇలాంటి పదజాలాన్ని ఊహించలేమని వ్యాఖ్యానిస్తూ, వెంటనే ఆ పోస్టును సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లీషు భాషా సంస్కృతిలో డ్రామా అనే పదాన్ని తీవ్ర ఉత్కంఠ కలిగించే సంఘటనల విషయంలో కూడా వాడుతుంటారు. అయితే దీనిని ‘నాటకీయం’గా పలువురు భావించడంతో సమస్య తలెత్తింది. ఫలితంగా శశిధరూర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Took off for Katmandu yesterday, blissfully unaware of the drama that had taken place in the hills and caused such catastrophic damage. A severe, sudden flash flood struck northern Nepal’s Rasuwa district near the Tibet border, causing widespread destruction along the Bhote… pic.twitter.com/qxcDJgEK8C— Shashi Tharoor (@ShashiTharoor) August 27, 2026 -
వరదల్లో ఈశా సభ్యుల గల్లంతు.. రంగంలోకి సద్గురు
-
నేపాల్ భీకర వరదలు.. ఏరియల్ వ్యూలో..
ఖాట్మండు: నేపాల్లో మంచు, బురద, భారీ రాళ్లతో విరుచుకుపడిన ఆకస్మిక వరదలు సృష్టించిన భయానక విధ్వంసం ఏరియల్ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. బుధవారం సంభవించిన ఈ జల ప్రళయానికి ఇప్పటివరకు 165 మంది ప్రాణాలు కోల్పోగా, 1,300 మందికి పైగా గల్లంతయ్యారు. పైనుంచి చూసిన దృశ్యాల ప్రకారం చైనా-నేపాల్ సరిహద్దుల్లోని రసువా జిల్లాతో పాటు సమీప ప్రాంతాల్లో గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి, రహదారులు ధ్వంసమై మానవ నివాసాల ఆనవాళ్లే లేకుండా పోయాయి. టిబెట్లో పుట్టిన భోటే కోశి నది పెను ఉధృతితో ముంచుకొచ్చి ఈ భారీ నష్టాన్ని మిగిల్చింది. రసువాకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని నువాకోట్లో నది తన మార్గాన్ని మార్చుకోవడంతో నివాస ప్రాంతాలన్నీ బురద దిబ్బలుగా మారిన దృశ్యాలు ఏరియల్ వీక్షణలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. VIDEO | Nuwakot, Nepal: Aerial views reveal the extent of devastation after Nepal flash floods.#NepalFloodNews #NepalTragedy(Source: AFP/Only for use in India)(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/XlPVqQEdet— Press Trust of India (@PTI_News) August 27, 2026 -
నేపాల్ జల ప్రళయం: ‘ఈషా’ బృందం గల్లంతు.. రంగంలోకి సద్గురు
ఖాట్మండు/న్యూఢిల్లీ: నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో ఈషా ఫౌండేషన్కు చెందిన 80 మంది సభ్యుల బృందం చిక్కుకుంది. ఆగస్టు 26న వారు గైరోంగ్ వద్ద గల ఇమ్మిగ్రేషన్ భవనంలో ఉండగా ఈ విపత్తు సంభవించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సహాయక చర్యల్లో పాలుపంచుకునేందుకు, బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు స్వచ్ఛంద సేవకులతో కలిసి అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ అధికారులను, రాయబార కార్యాలయాలను కోరారు.ఈ బృందంలో పలు దేశాలకు చెందిన 34 మంది పురుషులు, 46 మంది మహిళలతో పాటు ముగ్గురు వాలంటీర్లు, ఒక వైద్యుడు ఉన్నారు. అమెరికా నుంచి 22 మంది, కెనడా నుంచి 12 మంది, ఆస్ట్రేలియా నుంచి 11 మంది, బ్రిటన్ నుంచి 9 మందితో పాటు జర్మనీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, రష్యా తదితర దేశాలకు చెందిన పౌరులు ఇందులో ఉన్నారు. బుధవారం ఉదయం 9:05 గంటలకు గ్రూప్ లీడర్ ప్రవీణ్ తాము ఇమ్మిగ్రేషన్ ప్రాంతానికి చేరుకున్నామని సందేశం పంపారని, సరిగ్గా 9:14 గంటల సమయంలో వరద విరుచుకుపడిందని సద్గురు పేర్కొన్నారు. ఆ తర్వాత వారి ఫోన్లు పనిచేయడం లేదని తెలిపారు.వరదల తీవ్రతకు ఇమ్మిగ్రేషన్ భవనం పూర్తిగా కొట్టుకుపోవడమే కాకుండా రహదారులు, సమాచార వ్యవస్థలు స్తంభించిపోయాయి. శిథిలాలు, ప్రమాదకర పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దాదాపు 484 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోందని, మొత్తం బాధితుల సంఖ్య 1,500 కంటే ఎక్కువగా ఉండవచ్చని సద్గురు అంచనా వేశారు. ప్రస్తుతం భారత, చైనా, అమెరికా రాయబార కార్యాలయాలు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితుల సమాచారం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.ఇది కూడా చదవండి: నేపాల్ వరదలు: సరిహద్దుల్లో స్తంభించిన వ్యాపారం -
నేపాల్కు 10 టన్నుల అత్యవసర సాయం పంపిన భారత్
న్యూఢిల్లీ: టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ బాసటగా నిలిచింది. 10 టన్నుల మానవతా సాయం, అత్యవసర ఔషధాలతో కూడిన మొదటి విడత సహాయక సామగ్రిని భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో నేపాల్కు తరలించింది. ఈ విపత్తులో 95 మంది మరణించగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పరిస్థితి తీవ్రతపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలకు భారత్ అండగా ఉంటుందని, సహాయక చర్యల్లో ఇరు దేశాల బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.భారత్ తరఫున 10 టన్నుల విపత్తు సహాయక సామగ్రి, మందులను పంపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. బాధితులకు, మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.Dispatched 10 tonnes of HADR assistance and essential medicines to support Nepal’s response to the devastating floods.Our thoughts are with the bereaved families and all those affected. In face of this challenge, India stands with Nepal and its people. pic.twitter.com/FUJdkJzi1o— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 26, 2026ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్బేస్ నుంచి రాత్రి సుమారు 8:35 గంటలకు బయల్దేరిన ఐఏఎఫ్ ‘సి-130జె’ (C-130J) విమానం ఖాట్మండుకు చేరుకుంది. ఇందులో తాత్కాలిక గుడారాలు, దుప్పట్లు, హైజీన్ కిట్లు, సోలార్ దీపాలు, అత్యవసర మందులు ఉన్నాయి. అవసరమైతే మరిన్ని సహాయక చర్యల కోసం సి-17, సి-130 రవాణా విమానాలతో పాటు రెస్క్యూ ఆపరేషన్లకు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు భారత వైమానిక దళం తెలియజేసింది.ఇది కూడా చదవండి: ఉపగ్రహ చిత్రాల్లో నేపాల్ జల ప్రళయం.. -
ఉపగ్రహ చిత్రాల్లో నేపాల్ జల ప్రళయం..
రసువా: నేపాల్లోని రసువా తదితర జిల్లాల్లో సంభవించిన ఆకస్మిక వరదల విధ్వంస తీవ్రతను ‘ప్లానెట్ ల్యాబ్స్’ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు కళ్లకు కట్టాయి. ఆగస్టు 23, 25 నాటి సాధారణ స్థితికి, వరదల అనంతరం ఆగస్టు 26న తీసిన చిత్రాలకు మధ్య ఉన్న వ్యత్యాసం అక్కడి విపత్తు తీవ్రతను తేటతెల్లం చేస్తోంది. మనకామన, ఖడ్గ భంజ్యాంగ్ వంటి గ్రామాలు, నేపాల్-చైనా సరిహద్దు లోయలు, భోటేకోశీ నది పరివాహక ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలు, జలవిద్యుత్ కేంద్రాలు, రహదారులు వరద ప్రవాహానికి తీవ్రంగా దెబ్బతిన్న దృశ్యాలు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నాయి.ఈ ఆకస్మిక వరదల ధాటికి ఇప్పటివరకు 98 మంది మృతి చెందగా, వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన సుమారు 400 మందిలో 105 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. హిమనీనదం పేలడం లేదా మంచు చరియలు విరిగిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్లే ఒక్కసారిగా ఈ భారీ వరద ఉప్పొంగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.వరద ప్రవాహం గండక్ నది ద్వారా దిగువకు వచ్చే అవకాశం ఉండటంతో భారత్లోని బిహార్, ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అప్రమత్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతూ అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.ఇది కూడా చదవండి: 1934 భూకంపం నుంచి 2026 వరదల వరకు.. -
1934 భూకంపం నుంచి 2026 వరదల వరకు..
హిమాలయ పర్వత శ్రేణుల్లో ఒదిగివున్న నేపాల్ మరోసారి ప్రకృతి ప్రకోపానికి నిలువునా వణికిపోయింది. తాజాగా సంభవించిన ఆకస్మిక వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తడంతో గ్రామాలు క్షణాల్లో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు దాదాపు 95 నుండి 100కు పైగా మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీయగా, వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. ప్రకృతి విలయాలకు నేపాల్ గురికావడం ఇదే మొదటిసారి కాదు.. 1934 నాటి భీకర భూకంపం నుండి నేటి వరదల వరకు ఈ హిమాలయ దేశం మృత్యు చరిత్రను మోస్తూనే ఉంది.1934 నాటి పెను విషాదం: నేపాల్-బీహార్ మహా భూకంపంనేపాల్ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన విపత్తుగా 1934 జనవరి 15న వచ్చిన భూకంపం నిలిచింది. రిక్టర్ స్కేలుపై 8.0 తీవ్రతతో మధ్యాహ్నం 2:13 గంటలకు సంభవించిన ఈ ప్రకంపనల కేంద్రం మౌంట్ ఎవరెస్ట్కు దక్షిణాన 9.5 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర బీహార్, నేపాల్ సరిహద్దులను కుదిపేసిన ఈ ఘోర విపత్తులో దాదాపు 10,700 నుండి 12,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది గ్రామాలు భూస్థాపితమై చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయాయి.1988 భూకంపం.. 1993 వరదల తాండవం1988 ఆగస్టు 20న ఉదయ్పూర్ జిల్లా కేంద్రంగా 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం నేపాల్, బీహార్ సరిహద్దుల్లో 1,003 మందిని బలితీసుకుంది. ఆ తర్వాత, 1993 జూలై 19-20 తేదీల్లో కురిసిన కుండపోత వర్షాలు వెయ్యేళ్లలో ఎన్నడూ చూడని జలప్రళయాన్ని సృష్టించాయి. ఈ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో బాగ్మతి బ్యారేజీతో సహా ప్రధాన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 700 మందికి పైగా జనం జలసమాధి అయ్యారు.2014-2015 ప్రకృతి ప్రకోపం: గూర్ఖా భూకంప విధ్వంసం2014 ఏప్రిల్లో ఖుంబు ఐస్ఫాల్ వద్ద సంభవించిన హిమపాతంలో 16 మంది షెర్పా గైడ్లు మరణించగా, అదే ఏడాది ఆగస్టులో సున్కోషి నదికి అడ్డంగా కొండచరియలు విరిగిపడి 150 మందికి పైగా చనిపోయారు. ఇక 2015 ఏప్రిల్ 25న వచ్చిన గూర్ఖా భూకంపం రాజధాని ఖాట్మండును చావుకేకలతో నింపింది. ఈ భయంకర విపత్తు నేపాల్, భారత్, చైనా, బంగ్లాదేశ్లలో కలిపి 8,962 మంది ప్రాణాలను హరించగా, దాదాపు 22 వేల మంది క్షతగాత్రులయ్యారు.2017 నుంచి 2024 వరకు ఎడతెగని విలయం2017 వర్షాకాలంలో నేపాల్ దక్షిణాన ఉన్న తెరాయ్ ప్రాంతాన్ని ముంచెత్తిన వరదల్లో 140 మందికి పైగా మరణించారు. 2023 నవంబర్ 3న జాజర్కోట్ జిల్లాలో 5.7 తీవ్రతతో సంభవించిన భూకంపం 153 మందిని బలితీసుకుంది. అలాగే, 2024 సెప్టెంబరులో ఖాట్మండు లోయ, బాగ్మతి ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షాలు కురవడంతో సంభవించిన వరదలు, కొండచరియల విలయానికి 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుత జల విలయంతాజాగా 2026 ఆగస్టులో విరుచుకుపడిన వరదల్లో పదుల సంఖ్యలో గ్రామాలు నేలమట్టమయ్యాయి. నదులు ఉప్పొంగి ఉగ్రరూపం దాల్చడంతో ఇప్పటివరకు 95 మందికి పైగా శవాలు లభ్యమయ్యాయి. ఇంకా 133 మంది భారతీయులతో సహా పలువురి ఆచూకీ లభించలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎందుకు పదేపదే విధ్వంసం?వాతావరణ మార్పుల ముప్పు ఎక్కువగా ఉన్న ప్రపంచ దేశాల జాబితాలో నేపాల్ 4వ స్థానంలో ఉంది. భౌగోళికంగా సున్నితమైన హిమాలయ ప్రాంతం కావడంతో కొండచరియలు విరిగిపడటం, మెరుపు వరదలు ఇక్కడ సర్వసాధారణంగా మారాయి. ఇంత తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నప్పటికీ, దేశంలో ఆధునిక వాతావరణ హెచ్చరిక వ్యవస్థలు సరిగా లేకపోవడమే ప్రాణ, ఆస్తి నష్టాలు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: మథురలో అరుదైన రాఖీ సంప్రదాయం! -
నేపాల్ వరదలు: బాధితుల కోసం తెలంగాణ హెల్ప్లైన్ నెంబర్లు
కఠ్మాండూ: దేవభూమి నేపాల్లో వరద బీభత్సం నింపిన పెను విషాదంలో 157మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో స్థానికులు, పర్యాటకులు గల్లంతయ్యారు.రాజధాని కఠ్మాండూకు ఉత్తరాన ఉన్న రసువా జిల్లాలో బుధవారం ఉదయం ఆకస్మికంగా విరుచుకుపడిన వరదతో పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. ఒక జలవిద్యుత్ కేంద్రం కొట్టుకుపోవడంతో పాటు పలు నిర్మాణాలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ వరద టిబెట్ నుంచి నేపాల్ వైపు ప్రవహించే బోటేకోషిలో పడిన మంచు కరగడం వల్ల వచ్చినట్టు అధికారులు చెప్పారు. అయితే భూకంపం కారణంగా సంభవించిన హిమపాతమే ఈ వరదలకు కారణమని నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు.నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని తాకిన ఆకస్మిక వరదల కారణంగా కనీసం 157 మంది మరణించారు.వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో కైలాష్ మానస సరోవరానికి వెళ్లిన కనీసం 133 మంది భారతీయ యాత్రికులు ఉన్నారు.నేపాల్ పోలీసులు 157 మృతదేహాలను వెలికితీశారు. వరద ముప్పు ప్రాంతాల కుటుంబాలను తరలించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం, విపత్తు సంభవించిన కొన్ని గంటల తర్వాత, 341 మంది విదేశీయులతో సహా సుమారు 403 మంది పర్యాటకుల ఆచూకీ తెలియలేదు. గల్లంతైన విదేశీయులలో 142 మంది భారతీయులతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేషియా, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, అమెరికా చెందిన వారు కూడా ఉన్నారని నేపాల్ పర్యాటక శాఖ వెల్లడించింది తెలిపింది.ప్రధానమంత్రి బాలేంద్ర షా సహాయక చర్యలకు ప్రభుత్వ వనరులన్నింటినీ కేటాయిస్తామని హామీ ఇవ్వగా, నేపాల్ సహాయక బృందాలు బురద కింద పూడిపోయిన మృతదేహాలను వెలికితీయడం, క్షతగాత్రులను రక్షించే చర్యలను ముమ్మరం చేస్తున్నాయి.తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్మరోవైపు నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. నేపాల్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ భవన్లో ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో తెలంగాణ భవన్ అధికారుల సమన్వయం చేసుకుంన్నారు. నేపాల్లో ఉన్న తెలంగాణ యాత్రికులు, పర్యాటకుల కుటుంబ సభ్యులు హెల్ప్లైన్ను సంప్రదించాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బాధితుల పేరు, పాస్పోర్ట్, మొబైల్, నేపాల్లోని ప్రాంత వివరాలు అందించాలని సూచించారు. ట్రావెల్/టూర్ ఆపరేటర్, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. అందిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయానికి చేరవేయనున్నారు.తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ 9871999044, 9949351270, 9618597969 హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. -
నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం హెల్ప్లైన్
సాక్షి, హైదరాబాద్: నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. నేపాల్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ భవన్లో ప్రత్యేక సమన్వయ కేంద్రం ఏర్పాటు చేశారు.MEA, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో తెలంగాణ భవన్ అధికారుల సమన్వయం చేసుకుంటున్నారు. నేపాల్లో ఉన్న తెలంగాణ యాత్రికులు, పర్యాటకుల కుటుంబ సభ్యులు హెల్ప్లైన్ను సంప్రదించవచ్చు. బాధితుల పేరు, పాస్పోర్ట్, మొబైల్, నేపాల్లోని ప్రాంత వివరాలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ట్రావెల్/టూర్ ఆపరేటర్, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. అందిన విజ్ఞప్తులను ప్రాధాన్యతా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయానికి చేరవేయనుంది. తెలంగాణ భవన్ హెల్ప్లైన్ నంబర్లు: 9871999044, 9949351270, 9618597969. -
భారీ వరదలతో నీట మునిగిన నేపాల్..
-
నేపాల్ లో మెరుపు వరదలు.. కొట్టుకుపోతున్న గ్రామాలు
-
ఒడిశాలో వరదల బీభత్సం.. 13 మంది మృతి
భువనేశ్వర్: ఒడిశాలో వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా తాజాగా మరో ఐదుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 13కు చేరింది. భారీ వర్షాలు, ఉప్పొంగుతున్న వరద నీటితో రాష్ట్రంలోని బాలాసోర్, భద్రక్, జాజ్పూర్, కియోంఝర్, మయూర్భంజ్, కేంద్రాపడా జిల్లాల్లో జనజీవనం పూర్తిగా దెబ్బతింది.రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్ఆర్సీ) కార్యాలయం తాజా నివేదిక ప్రకారం.. ఈ ఆరు జిల్లాల్లోని 1,300 గ్రామాలకు చెందిన 7.85 లక్షల మందికి పైగా వరదల ప్రభావం తాకింది. ఇప్పటివరకు 2.77 లక్షల మందిని ప్రమాదకర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజాగా నమోదైన ఐదు మరణాల్లో మూడు గోడలు కూలిపోవడంతో సంభవించగా, మరో రెండు నీటిలో మునిగిపోవడంతో చోటుచేసుకున్నాయి.మరోవైపు పరిస్థితులు విషమించడంతో భద్రక్, సుందర్గఢ్, జాజ్పూర్ జిల్లాల్లో మంగళవారం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేశారు. భద్రక్లో వరద ప్రభావిత ఆరు బ్లాకుల్లోని 268 పాఠశాలలు, 567 అంగన్వాడీ కేంద్రాలను ఒకరోజు మూసివేయాలని ఆదేశించారు. రోడ్లు నీటమునగడం, ప్రతికూల వాతావరణం కారణంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు.సుందర్గఢ్లో భారీ వర్షాల సూచన,వరద పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేశారు. జాజ్పూర్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఒడిశా ఆదర్శ విద్యాలయాల పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. తల్లిదండ్రులు పిల్లలను ఇళ్లలోనే ఉంచాలని, నీటితో నిండిన ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.కేంద్రాపడా కలెక్టర్ రఘురామ్ ఆర్. అయ్యర్ మాట్లాడుతూ.. విద్యార్థులను భద్రత దృష్ట్యా పాఠశాల భవనంలోని మొదటి, రెండో అంతస్తులకు తరలించినట్లు తెలిపారు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో వారిని వెంటనే బయటకు తరలించడం కష్టంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 2.77 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
టన్నెల్లో ప్రమాదం.. పలువురు కార్మికులు దుర్మరణం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో విషాదం చోటు చేసుకుంది. టెన్నెల్లో ప్రమాదం చోటు చేసుకొని పలువురు కార్మికులు మృత్యువాత పడ్డారు. చమోలీ జిల్లాలో పిపాల్కోటి సమీపంలోని మాయాపూర్లో నిర్మిస్తున్న టీహెచ్డీసీ టన్నెల్లోకి అకస్మాత్తుగా నీరు, బురద చేరడంతో 19 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన వారి కోసం సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. చమోలీలో సుమారు 2 కిలోమీటర్ల పొడవైన ‘టెయిల్ రేస్ టన్నెల్’లో సుమారు 1.4 కిలోమీటర్ల లోతులో భూమి కుంగి రంధ్రం ఏర్పడింది. దీంతో అకస్మాత్తుగా నీరు, బురద లోపలికి రావడంతో అప్పటికే విధులు నిర్వహిస్తున్న 22 మంది కార్మికులలో 19 మంది చిక్కుకుపోయారు.సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ , ఐటీబీపీ, ఆర్మీ బృందాలు రంగంలోకి దిగాయి. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలతో ఇప్పటికే 16 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మిగిలిన కార్మికులను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నీటిని బయటకు పంపింగ్ చేసేందుకు ప్రత్యేక పంపులను ఏర్పాటు చేశారు.ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతని పేర్కొంటూ, సహాయక చర్యలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. -
ఆకాశం నుండి కురిసే 30 రోజుల మహా ప్రళయం రాబోతోంది
-
వరద నీటిలో ‘ఆట’లొద్దు
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలంలో కురిసే వానలు, వరదలతో మరో అనారోగ్య ముప్పు పొంచి ఉంది. వరద నీటిలో ఆట లాడినా, తిరిగినా, కాళ్లు నానినా.... ‘లెప్టోస్పిరోసిస్’ అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ వ్యాధి నుంచి ముప్పు అధికంగా ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో లెప్టోస్పిరోసిస్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. 2023లో రాష్ట్రంలో కేవలం రెండు కేసులు నమోదవగా.. 2025లో ఆ సంఖ్య 249కి చేరింది. అంటే రెండేళ్లలో 125 రెట్లు పెరిగింది. ఈ ఏడాది జూన్ నాటికే 101 కేసులు నమోదయ్యాయి. వర్షాకాల వ్యాధులపై ఇటీవల రాజ్యసభలో సమర్పించిన గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దేశంలో కేసుల సంఖ్య పరంగా కేరళ 4,001 కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు (2,862), కర్ణాటక (2,302), మహారాష్ట్ర (2,184) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే కేసుల పెరుగుదల శాతంలో తెలంగాణ ముందుంది. ఎలుకల మూత్రంతో కలుషితమైన నీటితో.. లెప్టోస్పిరోసిస్ అనేది బ్యాక్టీరియా వ్యాధి. ముఖ్యంగా ఎలుకలు, కొన్ని ఇతర జంతువుల మూత్రం ద్వారా ఇది వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వాటి మూత్రంతో కలుషితమైన నీరు, మట్టి మనుషుల చర్మానికి తగిలినప్పుడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. చర్మంపై గాయాలు, చిన్న పగుళ్లు ఉంటే ముప్పు మరింత పెరుగుతుంది. కళ్లు, ముక్కు, నోటి ద్వారా కూడా బ్యాక్టీరియా శరీరంలోకి చేరవచ్చు. హైదరాబాద్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు నెలకు సగటున 10 నుంచి 15 లెప్టోస్పిరోసిస్ కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అకాల వర్షాలు, పట్టణ ప్రాంతాల్లో వరదలు, నీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోవడం, కలుషిత నీటికి ప్రజలు ఎక్కువగా గురికావడం, ఎలుకల సంఖ్య పెరగడం, పారిశుద్ధ్య లోపాలు వ్యాధి వ్యాప్తికి కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు. డెంగీ అనుకుని పొరబడొద్దు లెప్టోస్పిరోసిస్ ప్రారంభ లక్షణాలు సాధారణ వైరల్ జ్వరం, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులను పోలి ఉంటాయి. అకస్మాత్తుగా జ్వరం, చలి, తీవ్రమైన కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు, నీరసం, కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వరద నీటిలో నడిచిన తర్వాత జ్వరం వస్తే లెప్టోస్పిరోసిస్ అని అనుమానించాల్సిన అవసరం ఉంది. వ్యాధి తీవ్రత పెరిగితే మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం, కాలేయ వైఫల్యం, ఊపిరితిత్తుల సమస్యలు, మెదడు పొరల వాపు, కామెర్లు వంటి తీవ్ర సమస్యలు తలెత్తవచ్చు. చికిత్స అందకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో సకాలంలో యాంటీబయాటిక్స్ ప్రారంభిస్తే వ్యాధి తీవ్రత, సమస్యల ముప్పును తగ్గించవచ్చు. వరద నీటికి దూరంగా ఉండాలి ప్రజలు సాధ్యమైనంత వరకు నిలిచిపోయిన వరద నీటిలో నడవకూడదు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే బూట్లు, తొడుగులు వంటివి ధరించాలి. చేతులు, కాళ్లపై గాయాలు ఉంటే వాటిని నీరు చొరబడకుండా కప్పుకోవాలి. తర్వాత శరీరాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తాగునీరు కలుషితమైందనే అనుమానం ఉంటే కాచి లేదా శుద్ధి చేసి మాత్రమే వినియోగించాలి. ఇళ్లలో ఆహారాన్ని, చెత్తను మూతఉన్న పాత్రల్లో ఉంచి ఎలుకల నియంత్రణ చేపట్టాలి. -
శ్రీశైలానికి తగ్గిన వరద
సాక్షి, హైదరాబాద్ /గద్వాల/ అచ్చంపేట: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 1,01,384 క్యూసెక్కులు జలాశయంలోకి వచ్చి చేరుతుండగా, జలాశయంలో నిల్వలు 181.05 టీఎంసీలకు చేరాయి. గరిష్ట నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, మరో 34 టీఎంసీలు వచ్చి చేరితే జలాశయం నిండుతుంది. గత వారం రోజులుగా రోజుకు 20 టీఎంసీల వరకు వరద రాగా, ప్రస్తుతం రోజుకు 10 టీఎంసీలకు తగ్గిపోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 8,000 క్యూసెక్కులు, హంద్రినీవా ద్వారా 2,500 క్యూసెక్కులు, కుడి విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా 4,563 క్యూసెక్కుల నీటిని వాడుకుంటోంది. తెలంగాణ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2,400 క్యూసెక్కులు కలిపి మొత్తం 17,463 క్యూసెక్కు నీటిని వాడుకుంటున్నాయి. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయినీ, జూరాల నుంచి వస్తున్న వరద సైతం గణనీయంగా తగ్గిపోయింది. సోమవారం నాటికి జలాశయానికి ఇన్ఫ్లో 44వేల క్యూసెక్కులకు తగ్గిపోనున్నాయి. జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న నీటిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వాడుకుంటుండడంతో ప్రస్తుత పరిస్థితుల్లో జలాశయం నిండే సూచనలు కనిపించడం లేదు. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి 1,04,777 క్యూసెక్కుల వరద వస్తుండగా, దిగువన కృష్ణానదికి 42,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నారాయణపూర్ జలాశయానికి 42,000 క్యూసెక్కుల వరద వస్తుండగా, 35,000 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 57,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 44,279 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టులోకి విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా నీటిని విడుదల చేస్తుండడంతో నాగార్జునసాగర్లోకి 13,435 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి. -
శ్రీశైలానికి జోరుగా వరద
గద్వాల/అచ్చంపేట: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం రాత్రి 9 గంటల సమయంలో జూరాలకు 1,73,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 21 గేట్లను ఎత్తి స్పిల్వే ద్వారా 1,38,495 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా విడుదల వుతున్న నీటితో కలిపి మొత్తం 1,68,020 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. శనివారం సాయంత్రానికి 317.31 మీటర్లకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.567 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.297 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం నీటిమట్టం 877.70 అడుగులుగా నమో దైంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. రెండు కేంద్రాల నుంచి కలిపి 62,493 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్కు వెళ్తోంది. కాగా, ప్రస్తుతం ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద ప్రవాహం ఇదే స్థాయిలో మరో మూడు, నాలుగు రోజులు కొనసాగితే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో శ్రీశైలం గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆల్మట్టి జలాశయానికి 1.10 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. ఔట్ఫ్లోగా సుమారు 1.38 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు 1.42 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 1,26,231 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. -
అస్సాం వరదలు.. 98 మంది మృతి
గువాహటి: అస్సాం రాష్ట్రాన్ని భారీవరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వానల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 98కి చేరుకోగా.. 1.55 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 1,55,849 మంది వరదల ప్రభావానికి గురైనట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా 13 జిల్లాలు శివసాగర్, గోలాఘాట్, నాగావ్, హోజాయ్, సోనిత్పూర్, ధేమాజీ, దర్రాంగ్, బిశ్వనాథ్, కామ్రూప్ , లఖింపూర్, ఉదల్గురి, జోర్హాట్, చరైడియోలో అధికంగా ప్రభావితమయ్యాయి. గోలాఘాట్లో అత్యధిక ప్రభావంవరదల ప్రభావం గోలాఘాట్ జిల్లాలో అత్యధికంగా ఉంది. అక్కడ 58,750 మంది వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత శివసాగర్లో 48,286 మంది, జోర్హాట్లో 25,259 మంది ప్రభావితమయ్యారని అక్కడి ప్రభుత్వం వివరాలు ప్రకటించింది. వరదల ఉద్ధృతిని ఎదుర్కొవడానికి 55 సహాయ శిబిరాలు ఏర్పాటు చేయగా అందులో 10 వేల మందికి పైగా ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపింది.వరదల కారణంగా 10,748.64 హెక్టార్ల పంట భూమి నీట మునిగింది. అలాగే 47,000కు పైగా పశువులు వరదల ప్రభావానికి గురైనట్లు అధికారులు తెలిపారు. కాగా ఆగస్టు 9 నుంచి 30వ తేదీ వరకు వరదల వల్ల నష్టం అంచనా ప్రక్రియ కొనసాగుతుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం తెలిపారు. అనంతరం వారికి పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. మరోవైపు అస్సాం వరదలపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. కేంద్రం తరపున వీలైన సహాయ సహకారులు అందిస్తామని పేర్కొన్నారు. -
భాగ్యనగర భద్రతకు శాస్త్రీయ మార్గం
వరద అనేది కేవలం ప్రకృతి విపత్తు మాత్రమే కాదు, అది నగర ప్రణాళికలోని లోపాలు, ప్రవాహ మార్గాల ఆక్రమణ, దీర్ఘకాల శాస్త్రీయ ఆలోచన లోపం వంటివాటిని బహిర్గతం చేస్తుంది. హైదరా బాద్ నగరానికి 1908 సెప్టెంబర్లో సంభవించిన మహావరద నగర చరిత్రను మలుపు తిప్పింది.2020 అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలకు మూసీ ఉప్పొంగిన తీరు, మళ్లీ అదే హెచ్చరికను గుర్తుచేసింది. ఇప్పటి వరకు వరదలపై చర్చ ఎక్కువగా నేటి వర్షపాతం గణాంకాలకే పరిమితమైంది. కానీ, నది ప్రవర్తనను వర్తమాన డేటాతో అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. నదులు నెమ్మదిగా మారుతాయి. భూభాగ వినియోగం, అడవుల తగ్గుదల, నగరీకరణ, మురుగు ప్రవాహాలు, మట్టి నిక్షేపాలు– ఇవన్నీ నదీ వ్యవస్థను కాల క్రమంలో మార్చేస్తాయి. ఆ మార్పుల ఆనవాళ్లు నదీ అవక్షేపాల్లో నిలిచి ఉంటాయి. అందుకే మూసీ ఒడ్డున పేరుకుపోయిన మట్టి పొరలు (స్తరాలు) ఒక సహజ చరిత్ర పత్రంలా పనిచేస్తాయి.శాస్త్రీయ విశ్లేషణ ఎలా అంటే...నదీ అవక్షేపాలు అంటే కేవలం బురద కాదు. ప్రతి పొర ఒక కాలానికి చెందిన సమాచారం. వరద తీవ్రత, పరిసర వృక్షావరణం, మానవ జోక్యం, కాలుష్య ముద్ర– ఇవన్నీ వాటిలో దాగి ఉంటాయి. ఈ పొరలను అవక్షేప కోర్ నమూనాల రూపంలో సేకరించి విశ్లేషిస్తే, గత వరదల స్వభావాన్ని పునర్నిర్మించవచ్చు.అదే సమయంలో పుప్పొడి శాస్త్రం మరో కీలక దృక్కోణాన్ని అందిస్తుంది. మట్టిలో దాగి ఉన్న చెట్లు, గడ్డి, పంటల పుప్పొడి ద్వారా అప్పటి వృక్షావరణం, వ్యవసాయ విస్తరణ, భూభాగ విని యోగ మార్పులు తెలిసిపోతాయి. ఒక పొరలో సహజ వృక్ష పుప్పొడి అధికంగా ఉంటే ఆ ప్రాంతం అప్పట్లో మరింత సహజ స్థితిలో ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. పంటల పుప్పొడి పెరిగితే వ్యవ సాయం విస్తరించిన సూచన. పుప్పొడి తగ్గి, ధూళి లేదా నిర్మాణ సంబంధిత కణాలు పెరిగితే పట్టణీకరణ వేగాన్ని సూచించవచ్చు. అవక్షేప శాస్త్రం (సెడిమెంటాలజీ), పుప్పొడి శాస్త్రం (పాలినోలజీ) కలిసి మూసీ చరిత్రను డేటా ఆధారంగా చెప్పగలవు.మూసీపై ఇలాంటి అధ్యయనం ఎందుకు అవసరం అంటే కారణం సుస్పష్టం. ప్రస్తుత వరద నియంత్రణ చర్యలు ఎక్కువగా ఇటీవలి పరికరాలతో నమోదు చేసిన గణాంకాల మీద ఆధార పడుతున్నాయి. కానీ నదులు దీర్ఘకాల చక్రాల్లో పనిచేస్తాయి. కొన్నేళ్ల గణాంకాలు మాత్రమే చూసి వరద మైదానాన్ని నిర్ణయించడం ప్రమాదకరం. నీరు సహజంగా వెళ్లే మార్గాలు, నిలిచే ప్రాంతాలు, వరద మైదానాలు గుర్తించడంలో తప్పులు జరిగితే, తప్పుడు చోట్ల నిర్మాణాలు పెరుగుతాయి. అప్పుడు ప్రతి భారీ వర్షం విపత్తుగా మారే అవకాశం ఉంటుంది.ఇటీవల ఒక నివేదిక ప్రకారం మూసీ అవక్షేపాల్లో కాలుష్యం ప్రధానంగా సేంద్రియ స్వభావం కలిగి ఉంది. అంటే సమస్య కేవలం వర్షం కాదు, నీరు వెళ్లాల్సిన సహజ మార్గాలు దెబ్బతినడం. అందుకే మూసీ కారిడార్లో అవక్షేప కోర్ నమూనాలను అధ్య యనం చేయడం కీలకం. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, చార్మి నార్ పరిసరాలు, ప్రతాపసింగారం వంటి ప్రాంతాల నుంచి నమూ నాలు తీసుకుని కర్బన–14 పద్ధతిని అనుసరించి కాల నిర్ణయం చేసి, కొన్ని వందల సంవత్సరాల వరకూ చరిత్రను పునర్నిర్మించవచ్చు. ఏ దశలో కరువు, ఏ దశలో తీవ్రమైన వరద, ఏ దశలో నగర ఒత్తిడి పెరిగిందో స్పష్టంగా తెలుసుకోవచ్చు.ఈ పరిశోధన ఫలితాలు హైదరాబాద్కు దిక్సూచిగా మారు తాయి. శాస్త్రీయ వరద మ్యాపులు తయారవుతాయి. గతంలో వరద నీరు ఏయే మార్గాల్లో ప్రవహించిందో తెలిసినప్పుడు ఆ ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలకు పరిమితులు విధించడం సులభమవుతుంది. భవిష్యత్ బృహత్తర ప్రణాళికలో ‘నాన్ కన్స్ట్రక్షన్ ఫ్లడ్ జోన్’ వంటి నిర్ణయాలు ఊహలపై కాకుండా డేటాపై ఆధారపడి తీసుకోవచ్చు. అలాగే వరద హెచ్చరిక వ్యవస్థలు కూడా మరింత సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడతాయి. మట్టి పొరల్లో దాగిన చరిత్రను వినగలిగితేనే హైదరాబాద్ వరద భద్రతకు శాస్త్రీయ మార్గం సుగమ మవుతుంది.– డా. రామకృష్ణ మనిమద్దె, ఎర్త్ సైంటిస్ట్, నదీ వ్యవస్థల పరిశోధకుడు -
వాన బీభత్సం.. జలమయమైన ఢిల్లీ
న్యూఢిల్లీ,సాక్షి: దేశ రాజధాని ఢిల్లీలో వర్షం దంచికొడుతుంది. కురిసిన భారీ వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో వాతావరణ శాఖ రాత్రి 11 గంటల వరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.వర్షం నిరంతరం కురుస్తుండటంతో అనేక మంది ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. క్యాబ్లు గంటల తరబడి అందుబాటులో లేకపోవడంతో పలువురు కార్యాలయాల్లోనే చిక్కుకుపోయారు. ఇంటికి బయలుదేరిన వారు కూడా భారీ ట్రాఫిక్లో చిక్కుకున్నారు. మెహ్రౌలి-బడర్పూర్ రోడ్, వజీరాబాద్ రోడ్, పటేల్ రోడ్, రోహ్తక్ రోడ్, శంకర్ రోడ్, కిర్తి నగర్, ఢిల్లీ-జైపూర్ హైవే, పీరాగఢి, షాహీన్ బాగ్ వంటి కీలక మార్గాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.నిరంతర వర్షాల కారణంగా ఛత్తర్పూర్ ఫార్మ్ ప్రాంతం,టెర్మినల్-1 సమీపంలోని మెహ్రామ్ నగర్ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఢిల్లీ-జైపూర్ హైవేలోని శంకర్ విహార్ వద్ద వాహనాలు భారీ క్యూల్లో నిలిచిపోయాయి. అలాగే గురుగ్రామ్ నుంచి ధౌలా కువాన్ వెళ్లే మార్గంలో కూడా పలుకిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నమోదైంది.ఇక నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వేపై కూడా తీవ్ర ట్రాఫిక్ రద్దీ నెలకొంది. తూర్పు ఢిల్లీలోని శకర్పూర్, మండావలి ప్రాంతాల్లో కాలువలు పొంగిపొర్లడం, గుంతలు నీటిలో మునిగిపోవడంతో ప్రమాదాలు పెరిగాయని ఈ-రిక్షా డ్రైవర్లు తెలిపారు. నీటిలో కనిపించని గుంతలు, మ్యాన్హోల్ల కారణంగా ఈ-రిక్షాలు, స్కూటర్లు, మోటార్సైకిళ్లు సహా కనీసం మూడు నుంచి నాలుగు వాహనాలు బోల్తాపడ్డాయి. -
రాజేష్ మృతిపై సీఎం వీడీ సతీషన్ తీవ్ర దిగ్భ్రాంతి
తిరువనంతపురం : కేరళలోని కన్నూర్ జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదల్లో రైతును కాపాడుతూ తిరువనంతపురానికి చెందిన 36 ఏళ్ల రెస్క్యూ వాలంటీర్ ఆర్.రాజేష్ వీరమరణం పొందారు. తాను కాపాడిన రైతు మునిగిపోతుండటం గమనించి, తన ఒంటిపై ఉన్న లైఫ్ జాకెట్ను తీసి అతనికి తొడిగి, తాను మాత్రం వరద ఉధృతికి ప్రాణాలు కోల్పోవడంపై కేరళ సీఎం వీడీ సతీషన్ విచారం వ్యక్తం చేశారు. ఈమేరకు రాజేష్ సహాసాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో రాజేష్ నిస్వార్థ గుణం, ఆయన చూపిన అసాధారణ హీరోయిజం కేరళ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. సమాజం ఆయనను ఎప్పటికీ మరువదు’అని భావోద్వేగంతో పోస్టు చేశారు. ఆగస్టు 1 కురిసిన భారీ వర్షాలకు కన్నూర్ జిల్లా చెరుపుళా పరిధిలోని కరియాంగోడ్ నది ఉప్పొంగింది. కొండచరియలు విరిగిపడ్డాయనే సమాచారంతో తన కాఫీ తోటను పరిశీలించేందుకు వెళ్లిన రైతు బెన్నీ (61) ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయారు. మీన్తుల్లి జలపాతం వద్ద రాపెల్లింగ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్న రాజేష్, తన తోటి వాలంటీర్లు షిబిన్, జితిన్లతో కలిసి సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కరియాంగోడ్ నదిని ఈదుకుంటూ వెళ్లి రైతు బెన్నీని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.తిరుగు ప్రయాణంలో నది ఒడ్డుకు చేరుకునే క్రమంలో వృద్ధుడైన బెన్నీ నీటిలో మునిగిపోతూ కొట్టుమిట్టాడుతుండటాన్ని రాజేష్ గమనించారు. ఏమాత్రం ఆలోచించకుండా తన ప్రాణాలకు రక్షణగా ఉన్న లైఫ్ జాకెట్ను విప్పి బెన్నీకి తగిలించారు. ఆ తర్వాత సేఫ్టీ రోప్ పట్టుకుని ఒడ్డుకు రావడానికి ప్రయత్నిస్తుండగా, నది ఒడ్డున పట్టు తప్పి రాజేష్ వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. రెండు రోజుల తర్వాత రాజేష్ మృతదేహం లభ్యమైంది.విపత్తుల్లో ముందుండే హీరోరాజేష్ కేవలం ఈ ఒక్కసారే కాదు, కేరళను ముంచెత్తిన గత విపత్తుల్లోనూ వందలాది ప్రాణాలను కాపాడారు.2018 కేరళ మహా వరదలు, అలాగే 2024 వయనాడ్ కొండచరియలు విరిగిపడిన దారుణ ఉదంతాల్లో ఆయన రెస్క్యూ వాలంటీర్గా ముందుండి సేవలందించారు.ఆయన 'అడ్వెంచర్ డిజాస్టర్ సొసైటీ'లో సభ్యుడిగా ఉంటూ, ఇతరులకు వాటర్ సేఫ్టీ, రోప్ రెస్క్యూలపై శిక్షణ ఇచ్చే నిపుణుడు. రాజేష్ మృతిపై కేరళ ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వీడీ సతీషన్ మాట్లాడుతూ.. రాజేష్ అత్యున్నత త్యాగం చేశాడు. ఆయన కుటుంబానికి నా గాఢ సానుభూతి. రాజేష్ నిర్మించుకుంటున్న ఇంటిని ప్రభుత్వమే పూర్తి చేస్తుంది. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం" అని ముఖ్యమంత్రి ప్రకటించారు.Paying tributes to disaster response trainer R. Rajesh, who made the ultimate sacrifice by giving his life jacket to save another during flash floods in Cherupuzha. Met his grieving family to offer deepest condolences.The Govt will complete the construction of his unfinished… pic.twitter.com/6GsC9K9V1g— V D Satheesan (@vdsatheesan) August 5, 2026 ఆగస్టు 1 నుండి కేరళను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటివరకు వర్షాల కారణంగా కనీసం 20 మంది మరణించగా, నలుగురు గల్లంతయ్యారు. 12,000 మందికి పైగా ప్రజలను 300 సహాయక శిబిరాలకు తరలించారు. పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, కన్నూర్, వయనాడ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సుమారు 165 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. -
కేరళ వరదల్లో అమ్మ సాహసం!
బయట కుండపోత వర్షం. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో మృత్యువు ఆ ఇల్లాలి తలుపు తట్టింది. క్షణాల్లో ఇల్లు కూలిపోతోంది. ఆమె తల పగిలి రక్తం కారుతోంది. కానీ, ఆమెలో ఎక్కడ లేని బలం వచ్చింది. నొప్పినీ, భయాన్నీ పక్కన పెట్టి కాలంతో పరుగు తీసింది. కుప్పకూలుతున్న ఇంటి శిథిలాల నుంచి తన కుటుంబాన్ని ప్రాణాలతో బయటకు లాక్కొచ్చింది. కేరళలోని పయ్యన్నూరులో భయానక వరద విపత్తులో 54 ఏళ్ల ఇందూ దామోదరన్ చూపిన మాతృహృదయం ఇది.కేరళను గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉప్పొంగుతున్న నదులు. విరిగిపడుతున్న కొండచరియలు. అతలాకుతలమవుతున్న సామాన్య జీవితాలు. కానీ, ప్రకృతి సృష్టించిన ఈ మహా బీభత్సంలో ఒక సామాన్య మహిళ సృష్టించిన అద్భుతం ఇవాళ కేరళ వ్యాప్తంగా వైరల్గా నిలిచింది. కన్నూర్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పయ్యన్నూర్ మున్సిపాలిటీలోని కేలోత్ గ్రామంలో నివసిస్తున్న ఇందూ దామోదరన్ అనే మహిళ ఒక తల్లిగా, ఇల్లాలుగా విపత్కర పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం ఐదుగురు ప్రాణాలను కాపాడింది. అది కేవలం సమయస్ఫూర్తి కాదు, మరణాన్ని సైతం ఎదిరించిన మాతృమూర్తి ధైర్యం.అర్ధరాత్రి ప్రళయం.. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేలోత్ గ్రామంలోని లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయమయ్యాయి. ఆగస్టు 3 అర్ధరాత్రి దాటిన సమయం. ఇందూ దామోదరన్ తన పూర్వీకుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తోంది. ఆ సమయంలో భర్త దామోదరన్ ఏదో పని మీద వేరే ఊరిలో ఉన్నారు. బయట వర్షం బీభత్సంగా కురుస్తుండగా ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దంతో ఇంటి పైకప్పు భాగం కూలి ఇందూ తలపై పడింది.ఆ దెబ్బకు ఆమె తల పగిలి, రక్తం ధారగా కారడం ప్రారంభమైంది. తీవ్రమైన నొప్పితో కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి. సాధారణంగా ఏ మనిషైనా ఆ సమయంలో భయంతో కేకలు వేస్తూ పడిపోతారు. కానీ, ఇందూ చుట్టూ చూసింది. పక్కనే గాఢ నిద్రలో ఉన్న వృద్ధురాలైన తల్లి, సోదరి, 14 ఏళ్ల కుమారుడు, 13 ఏళ్ల మేనల్లుడు ఉన్నారు. ఇంకా ముఖ్యం ఐదేళ్ల వయసున్న చిన్న మేనల్లుడు నిద్రపోతున్నాడు. తాను పడిపోతే వీరంతా ఈ శిథిలాల కింద సమాధి అయిపోతారని ఆమెకు అర్థమైంది. అంతే, తల నుంచి కారుతున్న నెత్తుటిని తుడుచుకునే తీరిక కూడా లేకుండా ఆమె కదిలింది.మృత్యుగృహం నుంచి సురక్షిత తీరానికి...నెత్తురు ఓడుతున్న శరీరంతోనే ఇందు ఒక్కొక్కరినీ నిద్ర లేపింది. ఇల్లు కూలిపోతోంది, వెంటనే బయటకు రండంటూ కేకలు వేసింది. ఆ సమయంలో బయట ఊరంతా వరద నీరు చేరడం, అర్ధరాత్రి గాఢాంధకారం కావడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు కూడా తమ ఇళ్లను కాపాడుకునే కంగారులో ఉన్నారు.ఎవరి సహాయం కోసం ఎదురుచూడకుండా భయంతో వణికిపోతున్న చిన్నపిల్లాడు పార్థివ్ను, నడవలేని స్థితిలో ఉన్న తన తల్లిని చేతుల్లోకి తీసుకుని, కాంక్రీట్ ముక్కలు పడుతున్నా లెక్కచేయకుండా వాకిట్లోకి పరుగెత్తింది ఇందూ. ఆమె వెనుకే మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ప్రాణభయంతో బయటకు వచ్చారు. వారు వాకిట్లోకి వచ్చి, అడుగు దూరంలో ఉన్న సురక్షితమైన తోటలోకి చేరుకున్నారో లేదో... పెద్ద శబ్దంతో ఆ ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. కేవలం కొన్ని సెకన్ల వ్యవధి. ఇందూ గనుక ఆ నెత్తురు చూసి భయపడి ఉంటే, ఆ కొన్ని సెకన్లు ఆలస్యమై ఉంటే... ఇవాళ ఆ కుటుంబం ప్రాణాలతో ఉండేది కాదు.మాతృత్వపు అసాధారణ శక్తిప్రకృతి విపత్తుల ముందు మనుషులు ఎంత బలహీనులో మనం చూస్తూనే ఉంటాం. కానీ, అదే ప్రకృతి విపత్తును ఒక స్త్రీ తన సంకల్పబలంతో ఎలా ఎదిరించిందో ఈ ఘటన నిరూపించింది. పక్కన భర్త లేకపోయినా, ఊరంతా వరద ముంచెత్తినా, తీవ్రమైన గాయాలతో ఒంటరిగా పోరాడి గెలిచింది.ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇందూను చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆ సమయంలో ఆమెకు కలిగిన శారీరక నొప్పి కంటే, తన కుటుంబం ఏమైపోతుందనే మానసిక ఆందోళనే ఆమెను నడిపించిందన్నారు. కేరళ వరదల్లో ఇందూ దామోదరన్ ఒక సాధారణ బాధితురాలిగా మిగిలిపోలేదు; విపత్తుల కంటే మనుషుల ఆత్మవిశ్వాసం, బంధాల మీద ఉండే ప్రేమ చాలా శక్తిమంతమైనవని నిరూపించింది. సెల్యూట్ ఇందూ దామోదరన్! -
గట్టెక్కిన శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని దాటి 92.04 టీఎంసీలకు చేరిక
సాక్షి, అమరావతి: ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు నిల్వ కనీస నీటి మట్టాన్ని దాటింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 1,49,917 క్యూసెక్కులు చేరగా, నీటి నిల్వ 855.1 అడుగులలో 92.04 టీఎంసీలకు చేరుకుంది. ⇒ శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 854 అడుగులు. అయినప్పటికీ అటు హంద్రీ–నీవా, ఇటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయలేదు. ⇒ ప్రాజెక్టులో ఎడమ వైపు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా రోజుకు 1,600 క్యూసెక్కుల చొప్పున గత నెల 25 నుంచి (ఆ రోజున 41.46 టీఎంసీలు నిల్వ) తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా తరలిస్తూ– ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నీటిని సరఫరా చేస్తోంది. ⇒ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న జూరాల నుంచి కుడి, ఎడమ కాలువలు.. కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆయకట్టుకు నీళ్లందిస్తోంది. ⇒ రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తాగునీటికీ ఇబ్బందులున్నప్పటికీ... హంద్రీ–నీవా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు చంద్రబాబు సర్కార్ నీటిని విడుదల చేయకపోవడంపై రైతులు, రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.ఆల్మట్టిలోకి పెరిగిన వరద..⇒ మహారాష్ట్ర, కర్ణాటక పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన సోమవారం వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యాంలోకి 1,25,855 క్యూసెక్కులు చేరుతుండగా..స్పిల్ వే, విద్యుత్ కేంద్రాల ద్వారా 1,28,417 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ⇒ నారాయణపూర్ డ్యామ్లోకి 1,28,954 క్యూసెక్కులు చేరుతుండగా, స్పిల్ వే గేట్లు, విద్యుత్ కేంద్రాల ద్వారా 1,23,364 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ⇒ ఎగువ నుంచి వస్తున్న వరదను చూస్తే మరో మూడు రోజులు శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇదే రీతిలో నీటి ప్రవాహం కొనసాగనుంది. -
ఒడిశా వరదల్లో కొత్త భయం
భువనేశ్వర్ : ఒడిశాలోని జాజాపూర్ జిల్లాలో వరదల వల్ల ప్రజలు పడే అవస్థలు అంతా ఇంతా కాదు. అసలే వరదల వల్ల గూడు చెదిరి ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇప్పుడు పాములతో సరికొత్త సమస్య వచ్చి పడింది. వరదనీటితో పాటు పాములు సైతం ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళలనలకు గురవుతున్నారు. విషపు జీవులు కరిచివేయడం వల్ల ఇప్పటికే దాదాపు 76మందికి పైగా ఆసుపత్రులలో చేరారు.దశరథ్పూర్ బ్లాక్లోని గ్రామాల్లోని వీధులు, సంతల రోడ్లపైకి విపరీతంగా వరద చేరింది. దేవాలయాలు ఇళ్లు, ప్రభుత్వకార్యాలయాలన్నిటినీ వరద ముంచెత్తింది. దీంతో ఇళ్లలోని సామాగ్రి అంతా నీటిపాలు కావడంతో ప్రజలు తినడానికి, నిద్రపోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఈ సమస్యలతో సతమవుతున్న ప్రజలకు ఇప్పుడు ఊహించని విపత్తు కొత్త తలనొప్పిని తెచ్చింది. భారీవరదలకు విష సర్పాలు , ఇతర విష సరీసృపాల ఇండ్లలోకి చేరుతున్నాయి. ప్రజల ఇళ్లు, నివాసాలు, పంజరాలలో ఆశ్రయం పొందేందుకు యత్నిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అక్కడి ఆరోగ్యశాఖ అందించిన వివరాల ప్రకారం. గత ఐదు రోజుల్లో మంగళ్పురా మెడికల్ సెంటర్లో 76 మందికి పైగా చికిత్స పొందారని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధికారి అమృత ప్రీతమ్ మల్లా తెలిపారు. వీరిలో 37 మందిని గుర్తుతెలియని జంతువులు, 11 మందిని పాములు కాటు వేసినట్లు తెలిపారు.దీంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని విషసర్పాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జాగ్రత్తలుకరెంటు లేనప్పుడు టార్చ్ లైట్ను ఉపయోగించాలిచీకటి ప్రదేశంలో తిరిగేటప్పుడు లైటును ఉపయోగించాలి. బూట్లు, బట్టలు వేసుకునే ముందు వాటిని జాగ్రత్తగా సరిచూసుకోవాలి.నేలపై పడుకోవడానికి బదులుగా, మంచం వంటి ఎత్తైన ప్రదేశాన్ని ఉపయోగించాలి.ఒకవేళ పాములు లేక ఇతర విషసర్పాలు కాటు వేసినట్లు అనుమానం వస్తే స్వంత చికిత్స కాకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. అని ప్రకటన విడదల చేశారు. -
కరువులోనూ కడలిలోకి 185 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్ /గద్వాల/అచ్చంపేట/కొల్లాపూర్/భద్రాచలంటౌన్ /కన్నాయిగూడెం: అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలతో గత ఆదివారం ఉదయం 6గంటల వరకు ఏకంగా 185.71 టీఎంసీల గోదావరి జలాలు కడలిపాలయ్యాయి. ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి భీకరంగా పోటెత్తడంతో.. ఒడిసిపట్టుకునే అవకాశం లేక వచ్చి న వరద వచ్చి నట్టు సముద్రంలో కలిసిపోయింది. ఇప్పటి వరకు ఉపనది కడెం నుంచి కడెం ప్రాజెక్టుకు 10.48 టీఎంసీలు, గోదావరి ప్రధాన పాయపై ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 18.71టీఎంసీలు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 36.95 టీఎంసీల వరద వచ్చింది. నెమ్మదించిన గోదావరి..కడెం, ప్రాణహిత, ఇంద్రావతి పరీవాహకంలో కురిసిన ఎడతెరపి లేని వర్షాలతో నిన్న మొన్నటి వరకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. వర్షాలు విరామం తీసుకోవడంతో క్రమంగా శాంతిస్తోంది. గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థలంలో నిర్మించిన మేడిగడ్డ బరాజ్కు ప్రాణహిత నుంచి ప్రస్తుతం 5.52 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లన్ని ఎత్తి ఉండడంతో వచ్చి న వరద వచ్చి నట్టు కిందకు వెళ్లిపోతోంది. దిగువన ఉన్న సమ్మక్క బరాజ్కు 5.54 లక్షల క్యూసెక్కులు, దాని కింద ఉన్న సీతమ్మసాగర్ బరాజ్కు 9.05 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు.భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.09 అడుగులు, ప్రవాహం 9.27 లక్షల క్యూసెక్కులకు తగ్గిపోవడంతో తొలి ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించుకున్నారు. గోదావరి ప్రధానపాయపై ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ పాజెక్టుకు 19,457 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతుండడంతో గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు గాను 34.1 టీఎంసీలకు నిల్వలు చేరాయి.కడెం ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, 3.5 టీఎంసీల నిల్వను కొనసాగిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 16,048 క్యూసెక్కులు వస్తుండగా, 20.18 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికిగాను 19.87 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ నంది పంప్హౌస్ ద్వారా 15,750 క్యూసెక్కుల నీటిని మేడారం రిజర్వాయర్కు, అక్కడి నుంచి గాయత్రి పంప్హౌస్ ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని మిడ్మానేరు రిజర్వాయర్కు తరలిస్తున్నారు. దీంతో మిడ్మానేరులో 27.55 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికిగాను 13.12 టీఎంసీలకు నిల్వలు చేరాయి. దేవాదుల ప్రాజెక్టులో.... ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుట్టలగంగారంలో ఉన్న దేవాదుల ప్రాజెక్టులో అధికారులు 8 మోటార్లు ఆన్ చేసి నీటి పంపింగ్ కొనసాగిస్తున్నారు. దేవాదులలోని మూడు ఫేజ్ల్లో ఫస్ట్ ఫేజ్లో రెండు, రెండో ఫేజ్లో రెండు, ఫేజ్ త్రీలో 6 మోటార్లు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం 5 మోటార్లతో పంపింగ్ కొనసాగించిన అధికారులు, ఆదివారం మరో మూడు మోటార్లను ఆన్చేశారు. మొత్తం 8 మోటార్లతో 2,129 క్యూసెక్కుల నీటిని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గొల్లబుద్దారం వద్ద ఉన్న భీంఘన్పూర్ రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఉరకలేస్తున్న కృష్ణమ్మ .. కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో వర్షాలతో కర్ణాటకలో కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.03 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా, 123.08 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికి గాను 112.29 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 1.11లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 1.15 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తగా, వచ్చింది వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలో ఉపనది భీమాపై ఉన్న ఉజ్జయినీ ప్రాజెక్టుకు 59,971 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, జలాశయం ఇప్పటికే నిండడంతో 95 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.దీంతో దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 1.68 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, విద్యుదుత్పత్తి, గేట్ల ద్వారా 1.78 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండడంతో దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. శ్రీశైలంలో 1.69 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, 215.81 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికి గాను 76.86 టీఎంసీలకు నిల్వలు చేరాయి. ప్రస్తుత వానాకాలంలో ఇప్పటి వరకు శ్రీశైలంలో 51 టీఎంసీలు వచ్చి చేరాయి. మరో 138.98 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండుతుంది. కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు కృష్ణానది, తుంగభద్ర నుంచి వరద భారీగా వస్తుండటంతో శ్రీశైలం జలాశయంలో బ్యాక్ వాటర్ అంతకంతకూ పెరుగుతోంది. శనివారం రాత్రి సంగమేశ్వరాలయ గర్భగుడిలోని వరదనీరు చేరగా, ఆదివారం రాత్రికి ఆలయ గోపురం నీటిలో మునిగిపోయింది. -
జలదిగ్బంధంలో 100 గ్రామాలు
సాక్షి, అమరావతి/చింతూరు/వేలేరుపాడు/సాక్షి, అమలాపురం: గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 55.3 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరికను దాటి ఉప్పొంగుతోంది. ఇక ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరుతున్న వరద గంట గంటకూ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలో నీటి మట్టం రాత్రి 8.40 గంటలకు 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి వరద ఉద్ధృతితోపాటు పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంతో చింతూరు, కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి. ఈ మండలాల్లో సుమారు వంద గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వరద వల్ల సామగ్రిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న క్రమంలో వీఆర్పురం మండలం శ్రీరామగిరికి చెందిన నాళ్లారపు నవీన్ (32) అనే యువకుడు గుండెపోటుకు గురయ్యాడు. అతడిని మర పడవపై కూనవరం మండలం కోతులగుట్ట ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకొస్తోంది. పి.గన్నవరం చాకలిపాలెం వద్ద కనకయ్యలంక కాజ్వేపై ఐదారు అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తోంది. దీంతో పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల సరిహద్దులో రాకపోకలు నిలిచాయి. వరదలో గిరిజనుడు గల్లంతు వేలేరుపాడు మండలం టేకూరుకి చెందిన నూపా ప్రసాద్ శుక్రవారం రాత్రి గోదావరి వరద నీటిలో కొట్టుకుపోయాడు. వరదల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరిగినా సహించేదిలేదని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను హెచ్చరించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఘటన జరిగింది. ప్రసాద్ శుక్రవారం మధ్యాహ్నం వేలేరుపాడు సంతకు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో గోదావరిని దాటేందుకు యత్నించి గల్లంతయ్యాడు. శనివారం ఉదయం నుంచి గాలిస్తున్నా.. రాత్రి వరకూ ప్రసాద్ జాడ దొరకలేదు. -
ప్రమాదకరంగా గోదావరి వరద ఉధృతి
రాజమండ్రి(తూర్పుగోదావరి జిల్లా): ఎగువన కురిసిన వర్షాల కారణంగా ధవళేశ్వర వద్ద వరద ఉధృతి ప్రమాదకరంగా మారింది. గంట గంటకూ పెరుగుతున్న వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 12.60 అడుగులకు చేరగా, 11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరొకవైపు కోనసీమలో పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల కాజ్వేలపైకి వరద నీరు వచ్చి చేరింది. దాంతో చాకలిపాలెం-కనకాయలంక కాజ్వేపై వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి వరద ఉగ్రరూపంఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు విలీన మండలాల్లో గోదావరి వరద ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా . ఎద్దువాగు, గుండేటి వాగుల పొంగి ప్రవహిస్తున్నాయి. వేలేరు నుంచి సీతారామనగర్కు రాకపోకలు నిలిచపోయాయి. దాంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. -
అస్సాంలో వరద విలయం.. 82 మంది మృతి
దిస్పూర్: అస్సాంలో భారీ వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 82కి చేరుకుందని అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,92,799 మంది వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ జిల్లాల్లో వరద తీవ్రతఅధికారుల వివరాల ప్రకారం.. అసోంలోని శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, చరైడియో జిల్లాలలో వరద ప్రభావం ఇంకా కొనసాగుతోంది. వాటిలో అత్యధికంగా చరైడియో జిల్లాలో 77,456 మంది, తర్వాతి స్థానాల్లో శివసాగర్లో 63,492 మంది, జోర్హాట్లో 34,067 మంది ప్రజలు వరదల వల్ల ప్రభావితమయ్యారు. వరదల ప్రభావితమైన వారి కోసం 54 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని అందులో దాదాపు 13,000 మంది బాధితులు ఆశ్రయం పొందుతున్నారని పేర్కొన్నారు. మరో 26 రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు పనిచేస్తుండగా, వాటి ద్వారా 5,384 మందికి సాయం అందుతోందన్నారు. బాధితుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు.వరద బాధితులకు ప్రభుత్వ ఊరట వరద పీడిత ప్రాంతాల్లోని ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం సూర్య ఘర్ పెండింగ్ రాష్ట్ర సబ్సిడీ కింద 9,289 మంది లబ్ధిదారులకు రూ. 41.67 కోట్లను ప్రభుత్వం ఆమోదించింది. అస్సాం పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APDCL) ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా మంగళవారం (ఆగస్టు 4, 2026) నాటికి పూర్తి చేయాలని పవర్ డిపార్ట్మెంట్ను సీఎం ఆదేశించారు. అంతకు ముందు ప్రధాని మాట్లాడుతూ వరద బాధితులకు తక్షణ సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ నాలుగు జిల్లాల్లోని వరద బాధితులందరికీ రుణాలు చెల్లించడంలో ఆరు నెలల మారటోరియం వర్తింపజేయాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) ప్రత్యేక సమావేశంలో నిర్ణయించారు. -
కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి!
ఇడుక్కి: కేరళలోని ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టి కారణంగా పలుచోట్ల సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇడుక్కి జిల్లా వాగమండ్లో కొండచరియలు విరిగిపడి ఒక ఇంటిపై పడటంతో వైకోమ్కు చెందిన ప్రభాకరన్ నాయర్ మృతి చెందారు. అయితే ఆయన మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అదూర్మలలో మరో కొండచరియ విరిగిపడటంతో ఒక వ్యక్తి గల్లంతయ్యారు. కొచ్చి-ధనుష్కోడి జాతీయ రహదారిపై అడిమాలి సమీపంలోని మాచిప్లావు వద్ద కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. #WATCH | Keralam: Heavy rainfall triggers widespread damage in Idukki district. One person was killed after a landslide struck a house at Vagamon in the district. The deceased has been identified as Prabhakaran Nair, a native of Vaikom. His body has not yet been recovered.A… pic.twitter.com/0TVGJSQjE8— ANI (@ANI) August 1, 2026మరోవైపు కొట్టాయం జిల్లా పయ్యనితోటంలో జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మరణించగా, అతని తల్లి శిథిలాల కింద కూరుకుపోయారు. జోసెఫ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోగా, అతని తల్లి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉప్పుతుర ప్రాంతంలో పుల్లకాయరు నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కొక్కయార్ వంతెన మునిగిపోయింది. చుట్టుపక్కల ఆరు ఇళ్లు జలమయం కావడంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఎరట్టుపేట, కాంజిరపల్లి, కూట్టిక్కల్, ఎరుమేలి ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. వందలాది నివాసాలు నీట మునిగాయి. ఎరట్టుపేటలో అర్ధరాత్రి ఒక్కసారిగా వరద నీరు పెరగడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాలోని చిన్న ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేశారు.ఇది కూడా చదవండి: కుల్గామ్ ఉగ్రదాడి: ఆస్పత్రిలో మరో కార్మికుడు మృతి -
ఇన్స్టాలో 90% విరాళాల ఖాతాలు అనుమానాస్పదమే!
అస్సాంను ఇటీవల ముంచెత్తిన వరదలు ఒకవైపు వేలాది కుటుంబాలను దారుణంగా దెబ్బతీస్తే మరోవైపు సైబర్ నేరగాళ్లకు, అక్రమార్కులకు కాసులు కురిపించే అవకాశంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులను ఆదుకోవాలనే పౌరుల ఉదారతను ఆసరాగా చేసుకుని ఇన్స్టాగ్రామ్ వేదికగా భారీ విరాళాల దందా సాగుతోంది. నిధులు సేకరిస్తున్న ఖాతాల్లో ప్రతి పదింటిలో తొమ్మిది (దాదాపు 90%) వ్యాపార ఖాతాలు సందేహాస్పద రీతిలో ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.తనిఖీల్లో వెల్లడైన అంశాలుపరిశోధన బృందం విరాళాలు సేకరిస్తున్న 40 ఇన్స్టాగ్రామ్ ఖాతాలను సమగ్రంగా పరిశీలించగా అందులో 35 ఖాతాలు ప్రధాన భద్రతా ప్రమాణాల్లో విఫలమయ్యాయి. విరాళాలు కోరుతున్న 40 ఖాతాల్లో 38 ఖాతాలు కేవలం జులైలోనే కొత్తగా ప్రారంభించినవి. వీటి వెనుక ఎలాంటి గుర్తింపు లేదా పూర్వాపరాల రికార్డులు లేవు. 39 ఖాతాలు నమోదు చేసుకున్న స్వచ్ఛంద సంస్థలు లేదా ట్రస్టుల ఖాతాలకు కాకుండా వ్యక్తిగత యూపీఐ ఐడీలకు నిధులు మళ్లించేలా డిజైన్ చేశారు. 36 ఖాతాల్లో అందించిన ఫోన్ నంబర్లు అసలు పనిచేయడం లేదు లేదా సంప్రదించడానికి వీలు లేకుండా ఉన్నాయి.పాత వీడియోలు.. తప్పుడు ప్రచారాలుప్రజల సానుభూతిని సొమ్ము చేసుకునేందుకు ఈ ఖాతాదారులు తీవ్ర మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళన సమయంలో ఉచిత ఆహార పంపిణీకి సంబంధించిన వీడియోలను రీ-ఎడిట్ చేసి అస్సాం వరద బాధితులకు సాయం చేస్తున్నట్లుగా ప్రచారం చేయడం గమనార్హం. మరికొందరు స్థానిక యంత్రాంగం ఉచితంగా పంపిణీ చేస్తున్న సహాయక సామగ్రినే తాము ప్రజల విరాళాలతో కొనుగోలు చేసి ఇస్తున్నట్లు క్లైమ్ చేస్తున్నారని స్థానిక ఇన్ఫ్లుయెన్సర్లు ఆరోపిస్తున్నారు.ఇలాంటి ప్రకృతి విపత్తుల వేళ దాతలు సోషల్ మీడియాలోని ప్రైవేట్ ఖాతాలకు నేరుగా డబ్బులు పంపకూడదు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ముఖ్యమంత్రి సహాయ నిధి లేదా విదేశీ నిధుల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కింద నమోదైన ప్రామాణిక స్వచ్ఛంద సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలను సరిచూసుకున్న తర్వాతే విరాళాలు అందించడం శ్రేయస్కరం.ఇదీ చదవండి: బ్యాంక్ శాఖల్లో ప్రత్యేక యంత్రాల ఏర్పాటు -
చెట్టు మీద భర్త.. వరదలో కొట్టుకుపోయిన భార్యాపిల్లలు
క్షణాల్లో వచ్చిన వరద ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో కారు కొట్టుకుపోతుండగా.. తండ్రి చెట్టును పట్టుకుని బయటపడగలిగాడు. కానీ.. అందులో ఉన్న భార్య, ఇద్దరు కూతుళ్లు మాత్రం అతడి కళ్ల ముందే ప్రవాహంలో కలిసిపోయారు. ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది.మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. యవత్మాల్ జిల్లాలో వరద ఉధృతికి ఓ ఎస్యూవీ వాహనం కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోగా.. తండ్రి మాత్రం సమయస్ఫూర్తితో చెట్టును పట్టుకుని బయటపడ్డాడు. అయితే తన కళ్ల ముందే కుటుంబం వరదలో కొట్టుకుపోవడంతో గుండెలు పగిలేలా కన్నీటి పర్యంతం అయ్యాడు.అహిల్యానగర్ జిల్లాలోని లోని ప్రాంతానికి వెళ్తున్న అవినాశ్ ఖండారే కుటుంబం గురువారం ఈ ప్రమాదానికి గురైంది. అవినాశ్ తన భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎస్యూవీలో ప్రయాణిస్తున్న సమయంలో దర్వా ప్రాంతంలోని కుప్తి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ.. నీటి లోతు, ప్రవాహ తీవ్రతను అంచనా వేయడంలో పొరపాటు జరగడంతో వాహనం ముందుకు కదిలింది. వంతెన దాటే క్రమంలో ఒక్కసారిగా కారు అదుపుతప్పి ఉధృతమైన వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.కారు కొట్టుకుపోతున్న సమయంలో అవినాశ్ ఖండారే అప్రమత్తమై సమీపంలోని ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే కారులో ఉన్న భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలను మాత్రం రక్షించలేకపోయాడు. సహాయం కోసం ఆర్తనాదాలు చేసినా.. ఫలితం లేకపోయింది. కాసేపటి తర్వాత వరద ఉధృతి తగ్గగా.. స్థానికులు చెట్టు మీద ఉన్న అవినాశ్ను గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. శుక్రవారం వరదలో కొట్టుకుపోయిన వాహనాన్ని గుర్తించారు. కారుతో పాటు మాధవి, కుమార్తెల మృతదేహాలను వెలికితీశారు.మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 13 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. భారీ వర్షాలతో వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వందలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
ఉప్పొంగిన గోదావరి.. వరదలో చిక్కుకున్న 50 మంది
-
తెలంగాణలో వర్షాల బీభత్సం.. బయటకు రావొద్దని అధికారుల హెచ్చరిక
-
మెండుగా వానలు.. నిండుగా ప్రాజెక్టులు!
సాక్షి, హైదరాబాద్ /గద్వాల/మంచిర్యాలరూరల్: బిరబిరా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది..గలగలా గోదావరి పరుగులు పెడుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరపి లేని వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు వరదెత్తాయి. శ్రీశైలం ప్రాజెక్టు వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. దీంతో ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు జలాశయానికి 30,194 క్యూసెక్కుల వరద రాగా, సాయంత్రం 6 గంటల వరకు 89,240 క్యూసెక్కులకు పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 827.26 అడుగులకు చేరగా నిల్వలు 46.82 టీఎంసీలకు పెరిగాయి.ప్రాజెక్టు నిండాలంటే మరో 168 టీఎంసీల నీరు అవసరం. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కొనసాగుతుండటంతో కృష్ణా ప్రధాన పాయ నుంచి కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లలోకి వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి డ్యామ్లోకి 82,111 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 1.1లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలుతున్నారు. నారాయణపూర్ డ్యామ్లోకి 1.1 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 1.11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఉజ్జయినీ జలాశయానికి 33,803 క్యూసెక్కుల వరద వస్తుండగా, 31,600 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో పైమూడు జలాశయాలకు దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 94,733 క్యూసెక్కుల వరద పోటెత్తింది. ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, 7.66 టీఎంసీల నీటిని నిల్వ చేస్తూ 85,421 క్యూసెక్కుల నీటిని 12 గేట్లు, విద్యుత్ కేంద్రం ద్వారా దిగువ వదులుతున్నారు. ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో నిలకడక వరద కొనసాగుతోంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్లోకి 14,922 క్యూసెక్కుల నీరు చేరుతుండగా..గరిష్ట నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలకుగాను 36.04 టీఎంసీలకు నిల్వలు చేరాయి. జూరాల నుంచి విడుదల చేస్తున్న వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. దిగువన ఉన్న నాగార్జునసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 136.99 టీఎంసీల నిల్వలున్నాయి. ఎగువ గోదావరిలో.... మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఎగువ గోదావరిలో క్రమంగా వరద పెరుగుతోంది. దిగువ పరీవాహకంలోని ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారం వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకల్లో వరద ఉధృతమవుతోంది. గోదావరిపై మహారాష్ట్రలో ఉన్న జైక్వాడి ప్రాజెక్టులోకి 33,328 క్యూసెక్కుల వరద చేరుతుండడంతో గరిష్ట సామర్థ్యం 102.73 టీఎంసీలకు గాను 79.79 టీఎంసీలకు నిల్వలు పెరిగాయి. ఉపనది సింగూరులో వరద ప్రారంభం కాకపోవడంతో రాష్ట్రంలోని సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులకు ఇంకా వరద ప్రారంభం కాలేదు.ఎగువ గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 75,432 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో 80.5 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికి గానూ 21.51 టీఎంసీలకు నిల్వలు చేరాయి. మరో ఉపనది కడెంపై ఉన్న కడెం ప్రాజెక్టుకు 1.44 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో 4.7 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికి గాను 1.91 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 16 గేట్లు ఎత్తడం ద్వారా 1.48 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కడెం నుంచి 1.56 లక్షల క్యూసెక్కులు, గోదావరి నుంచి 2.07 లక్షల క్యూసెక్కులు కలిపి మొత్తం 3.63 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో 20.18 టీఎంసీల గరిష్ట నిల్వ సామరాŠథ్య్నికి గాను 19.09 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ నంది పంప్హౌస్ ద్వారా 15,750 క్యూసెక్కుల నీటిని మిడ్మానేరుకు తరలిస్తున్నారు. ప్రాజెక్ట్లోని 62 గేట్లలో 15 గేట్లు ఎత్తి 1.57 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.గోదావరి–ప్రాణహిత నదుల సంగమ స్థలం వద్ద నిర్మించిన మేడిగడ్డ బరాజ్లోకి ప్రాణహిత నుంచి 2.12 లక్షల క్యూసెక్కుల వరద రాగా, వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. ప్రాణహితకు ఇంద్రావతి ప్రవాహం తోడు కావడంతో దిగువన ఉన్న సమ్మక్క బరాజ్కు 8.05 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. సీతమ్మసాగర్ బరాజ్కు 3.8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండంతో వచ్చింది వచ్చినట్టు విడుదల చేస్తున్నారు. ప్రాణహిత, ఇంద్రావతి వరదెత్తిన నేపథ్యంలో శుక్రవారం నాటికి భద్రాచలం వద్ద వరద 10 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశముంది. -
బస్సులోకి వరద నీరు.. ఇరుక్కుపోయిన జనం.. వైరల్ అవుతున్న వీడియో
-
అస్సాం వరదల వెనుక భయంకర నిజాలు
అస్సాం మరోసారి జల విలయాన్ని చవిచూస్తోంది. సాధారణంగా ప్రతి ఏడాది వరదలను ఎదుర్కొనే ఈశాన్య రాష్ట్రం.. ఈసారి మాత్రం ఇటీవలి కాలంలోనే అత్యంత తీవ్ర వరద పరిస్థితుల్లో ఒకదాన్ని ఎదుర్కొంది. గ్రామాలకు గ్రామాలు నీట మునగడం, వేలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడం, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడం.. అస్సాం వరదల భీకర రూపాన్ని చూపిస్తున్నాయి.ఈసారి వరదల బారిన పడి ఇప్పటివరకు 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరు లక్షల మందికిపైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వందలాది గ్రామాలు నీట మునగగా.. వేలాది కుటుంబాలు సహాయక శిబిరాలకు తరలిపోయాయి. 37 వేల హెక్టార్లకుపైగా వ్యవసాయ భూమి నీట మునిగింది. పశుసంపద, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు గంటల తరబడి వరద నీటిలో చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే అస్సాం వరదలు కేవలం భారీ వర్షాల ఫలితమేనా? లేదంటే దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు కూడా ఈ విపత్తు తీవ్రతను పెంచుతున్నాయా?.. బ్రహ్మపుత్ర ఉగ్రరూపం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టినా వరదలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నాయి?.. Amid Assam's devastating floods, a father was seen swimming through floodwaters while carrying his children in a large tub to safety. The viral visuals have become a powerful symbol of a parent's courage, sacrifice, and unconditional love.#AssamFloods #FloodRescue #Father pic.twitter.com/uz5ZousOSM— Apka Aashish (@ApkaAashish) July 28, 2026అస్సాం భౌగోళిక పరిస్థితులే ఆ రాష్ట్రాన్ని వరదలకు అత్యంత సున్నితంగా మార్చాయి. టిబెట్ నుంచి భారత్లోకి ప్రవేశించే బ్రహ్మపుత్ర.. అరుణాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాల నుంచి భారీగా నీటిని తీసుకొస్తుంది. దీనికి అస్సాంలో 50కిపైగా ఉప నదులు కలుస్తాయి. వర్షాకాలంలో ఈ నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోతుంది.బ్రహ్మపుత్ర నది మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది భారీగా ఇసుక, మట్టిని (సిల్ట్) మోసుకొస్తుంది. దీంతో నది లోతు తగ్గి.. తక్కువ నీటిని మాత్రమే మోయగల పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా భారీ వర్షాలు కురిసినప్పుడు నది తన గట్లను దాటి ప్రవహిస్తుంది.40 శాతానికి పైగా భూభాగం..అస్సాంలో వరద సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఒక గణాంకం చాలు. రాష్ట్ర మొత్తం భూభాగంలో దాదాపు 39.58 శాతం ప్రాంతం వరద ముప్పు ప్రాంతంగా గుర్తించారు. ఇది దేశ సగటు వరద ముప్పు ప్రాంతంతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. ప్రతి ఏడాది సగటున లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి వరదల ప్రభావానికి గురవుతోంది. అంటే అస్సాంలో వరదలు కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు.. అక్కడి భౌగోళిక వాస్తవం కూడా.ఈసారి ఎందుకు ఇంత భయంకరంగా?ఈ ఏడాది అస్సాం, పొరుగు నాగాలాండ్ ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైంది. తక్కువ సమయంలో భారీగా వర్షం కురవడంతో కొండ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వరద నీరు మైదాన ప్రాంతాలకు చేరింది. దీనికి తోడు వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతం తీరు మారుతోంది. గతంలో కొన్ని రోజుల్లో కురిసే వర్షం ఇప్పుడు కొద్ది గంటల్లోనే భారీగా పడుతోంది. ఇలాంటి ఆకస్మిక వర్షాలు నదులపై ఒత్తిడిని పెంచుతున్నాయి.ప్రభుత్వం వల్ల కావట్లేదా?వరదలను పూర్తిగా ఆపడం అస్సాం లాంటి ప్రాంతంలో దాదాపు అసాధ్యం. కానీ నష్టాన్ని తగ్గించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇక్కడే ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్నాయి.👉పాతబడుతున్న కట్టలువరదలను నియంత్రించేందుకు అస్సాంలో వేల కిలోమీటర్ల మేర కట్టలు (ఎంబాంక్మెంట్లు) నిర్మించారు. రాష్ట్రంలో దాదాపు 4,473 కిలోమీటర్ల మేర కట్టలు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రతి ఏడాది భారీ ప్రవాహాలతో కొన్ని చోట్ల ఇవి బలహీనపడుతున్నాయి. కట్టలు తెగిపోవడమో, బలహీన ప్రాంతాల్లో నీరు చొచ్చుకురావడం వల్లనో ఒక్కసారిగా గ్రామాలు మునిగిపోతున్నాయి.👉తాత్కాలిక చర్యలకే పరిమితంఅస్సాం వరద నిర్వహణలో ఎక్కువగా సహాయక చర్యలు, కట్టల మరమ్మతులు, తాత్కాలిక రక్షణ పనులపైనే దృష్టి ఉందనే విమర్శలు ఉన్నాయి. దీర్ఘకాలిక పరిష్కారాలైన నది నిర్వహణ, సహజ నీటి ప్రవాహ మార్గాల పరిరక్షణ, వరద ప్రాంతాల ప్రణాళిక వంటి అంశాలు ఇంకా సవాలుగానే ఉన్నాయి.👉నదీ కోత మరో పెద్ద సమస్యఅస్సాంలో వరదలతో పాటు నదీ కోత కూడా పెద్ద ప్రమాదమే. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ఏటా భూమిని కోతకు గురిచేస్తాయి. దీంతో ప్రజలు ఇళ్లు, వ్యవసాయ భూములను కోల్పోతున్నారు.ఆ మార్పులు పెంచుతున్న ముప్పుప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా తీవ్ర వర్షాలు, ఆకస్మిక వరదలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అస్సాం వంటి నది పరివాహక ప్రాంతాల్లో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. అంటే భవిష్యత్తులో సమస్య కేవలం “వరద వస్తుందా?” అన్నది కాదు.. “ఎంత తీవ్రంగా వస్తుంది?” అన్నదే కీలక ప్రశ్నగా మారుతోంది.కావాల్సింది కొత్త విధానంఅస్సాం వరద సమస్యకు కేవలం మరిన్ని కట్టలు నిర్మించడం ఒక్కటే పరిష్కారం కాదని నిపుణులు భావిస్తున్నారు. నదుల సహజ ప్రవాహాన్ని అర్థం చేసుకుని ప్రణాళికలు రూపొందించడం, ప్రమాద ప్రాంతాల్లో నిర్మాణాలను నియంత్రించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం అవసరం. ప్రస్తుతం సహాయక చర్యలతో ప్రాణాలను కాపాడటం ముఖ్యం. కానీ ప్రతి ఏడాది ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే.. వరదలను ఎదుర్కొనే విధానంలో మూలమైన మార్పులు అవసరం.అస్సాం వరదలు మరోసారి చెప్పే నిజం ఒక్కటే.. ప్రకృతిని పూర్తిగా నియంత్రించలేం.. కానీ నష్టాన్ని తగ్గించే సిద్ధతను మాత్రం పెంచుకోవచ్చు. -
1.20 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి..
ధవళేశ్వరం: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఎప్పటికప్పుడు మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సోమవారం రాత్రి కాటన్ బ్యారేజ్ నుంచి 1,20,608 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి నీరు దిగువకు విడుదల చేయడంతో పాటు ప్రాణహిత, ఇంద్రావతి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కాటన్ బ్యారేజ్ వద్ద వరద నీటి ఉధృతి పెరుగుతోంది.ఎగువ ప్రాంతాలకు సంబంధించి భద్రాచలంలో కూడా నీటి ఉధృతి క్రమేపీ పెరుగుతూ సోమవారం రాత్రికి 17.60 అడుగులకు నీటి మట్టం చేరింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మంగళవారం నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాటన్ బ్యారేజ్ వద్ద సోమవారం రాత్రి 10.90 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. డెల్టాలకు సంబంధించి తూర్పు డెల్టాకు 5,000, మధ్య డెల్టాకు 2,800, పశ్చిమ డెల్టాకు 7,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. -
అసోంలో వరద భీభత్సం: 61కి చేరిన మృతుల సంఖ్య
డిస్పూర్: అసోంలో వరద పరిస్థితి అత్యంత భీకరంగా మారింది. గడచిన 24 గంటల్లో మరో 14 మంది ప్రాణాలు కోల్పోవడంతో, ఈ ఏడాది వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 61కి చేరింది. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఏఎస్డీఎంఏ) వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో 7,05,100 మందికి పైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. చరైదేవ్ జిల్లాలో ఏడుగురు, శివసాగర్లో ఆరుగురు, జోర్హాట్లో ఒకరు వరద నీటిలో మునిగి మరణించారు. శివసాగర్ జిల్లాలో దాదాపు 3,50,000 మంది వరద బారిన పడగా, ఇది అత్యధికంగా ప్రభావితమైన జిల్లాగా నిలిచింది. చరైదేవ్లో 1,90,000 మంది, జోర్హాట్లో 1,30,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలో సుమారు 856 గ్రామాలు నీటమునిగాయి. 56,606 హెక్టార్లకు పైగా వ్యవసాయ భూమి దెబ్బతిన్నది.రవాణా వ్యవస్థ, రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దిఖౌ, ధన్సిరి, కుషియారా నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో 7 జిల్లాల్లో 363 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి, 1,15,200 మందికి పైగా బాధితులకు ఆశ్రయం కల్పించారు. ఆర్డీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైనిక బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే శివసాగర్, నాజిరా నియోజకవర్గాల్లో ఇంకా వేలాది మందికి సహాయక సామగ్రి అందలేదని, సుమారు 80,000 మందికి ఇంకా సహాయం చేరాల్సి ఉందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. -
మహోగ్రంగా బ్రహ్మపుత్ర!
దేశంలో అనేక ప్రాంతాలు వాన జాడలేక ఇబ్బంది పడుతుంటే అస్సాం ఎప్పట్లానే వరద నీటిలో తేలియాడుతోంది. బ్రహ్మపుత్ర నది మహోగ్రరూపం దాల్చి విరుచుకుపడటంతో జనావాసాల్లోకి వరద నీరు ప్రవేశించి 9 లక్షలమందికిపైగా జనం ఇళ్లూ వాకిళ్లూ వదిలి పోవాల్సివచ్చింది. ఇంతవరకూ 47 మంది మరణించగా, దాదాపు 25,000 హెక్టార్ల పంట నీట మునిగింది. మొత్తంగా 11 జిల్లాలు వరదలతో దెబ్బతినగా, శివసాగర్, జోర్హాట్, దిబ్రూగఢ్, చారైదేవ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. హిమాలయా ల్లోని కైలాసశిఖరిలో పుట్టి, ప్రపంచంలోని అతి ఎత్తయిన ప్రాంతంలో పెను వేగంతో ప్రవహిస్తూ అటు తర్వాత అస్సాం మైదాన ప్రాంతాలకు ఆ నది చేరుతుంది. అక్కడ వేగం తగ్గినా అప్పటికే అది ఒండ్రుమట్టినీ, బురదనూ పోగేసుకొస్తుంది. ప్రపంచంలోని ఏ నదితో పోల్చినా అది తీసుకొచ్చే ఒండ్రుమట్టి, బురద పరిమాణం చాలా ఎక్కువ. ఇదంతా నదీ ప్రవాహ క్రమంలో ఎక్కడికక్కడ మేటలేస్తూ వస్తుంది. కాలం గడిచేకొద్దీ ప్రవాహమార్గం ఇరుకై ఆ నది దారి మార్చుకోవటం మొదలుపెడుతుంది. అందుకే బ్రహ్మపుత్రను స్థానికులు వలస నది అంటారు. ఎగువ ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు ఒక్కసారిగా విరుచుకుపడటం పర్యవసానంగా కుంభవృష్టి, మంచు పర్వతాలు కరిగి పోవటం, భారీ వర్షాలు పడటం అస్సాంకు రివాజు. ఈసారి మేఘాలయ తదితరప్రాంతాల్లో పడిన భారీవర్షాలు వరదలకు కారణమయ్యాయి. బ్రహ్మపుత్ర పరివాహ ప్రాంతం దేశాలూ, రాష్ట్రాలూ దాటి విస్తరించివుంది. ఇది ప్రకృతి శాపమని, ఇందులో మనిషి నిమిత్తమాత్రుడని చెప్పే మాటల్లో నిజం లేదు. వేరే దేశాల సంగతి వదిలి, కనీసం నదీపరివాహ రాష్ట్రాలన్నీ కలసికట్టుగా దృష్టి పెడితే బ్రహ్మపుత్ర కలగజేసే నష్టాన్ని పరిమిత స్థాయికి కుదించవచ్చు. ఇందుకు భిన్నంగా దాన్ని కేవలం ఒక రాష్ట్రానికి చెందిన సమస్యగా పరిగణించటమే చివరికి కష్టనష్టాలన్నీ అస్సాం భరించాల్సివస్తోంది. వరదల్ని కట్టడిచేసేందుకు కరకట్టల నిర్మాణమే సరైందని ఆరాష్ట్రం అనుకుంటోంది. దశాబ్దాలుగా వాటిపైనే కేంద్రీకరిస్తోంది. కానీ నదీ గమనం మారినప్పుడల్లా ఈ కరకట్టలు నిరుపయోగమవుతున్నాయి. పూడికతీత ప్రధాన సమస్యగా మారుతున్నప్పుడు బురద నియంత్రణ విషయంలో ఏం చేయాలన్నప్రశ్న రావాలి. అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ చెప్పినట్టు ఇది కనీవినీ ఎరుగని ఉత్పాతం. ఆ రాష్ట్రానికి ఏటా వరదలు రివాజే అయినా, ఈసారి ముంచెత్తినంత వరద యాభైయ్యేళ్లలో ఎప్పుడూ లేదు. కానీ సహాయ చర్యలు ఏమంత సజావుగా లేవు. వరద ప్రభావం అధికంగా గల శివసాగర్ జిల్లా మొత్తానికి కేవలం 5 బోట్లు మాత్రమే కేటాయించారు. అధికార యంత్రాంగంనుంచి ముందస్తు హెచ్చరికలు లేకపోవటంవల్ల పశువుల్ని రక్షించుకోవటమైనా, తాము సురక్షిత ప్రాంతాలకు తరలడమైనా జనానికి కష్టమై పోయింది. చుట్టూ సముద్రాన్ని తలపించేలా నీరుంటే, అనేకులు పైకప్పులెక్కి నిస్సహా యంగా చూస్తూ ఉండాల్సివచ్చింది. ఆహారం, నీరు అందించటంలోనూ అధికారులు అలసత్వం ప్రదర్శించారన్నది స్థానికుల ఆరోపణ. మొత్తం 872 గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగి దీవుల్ని తలపిస్తున్నాయంటే ఈ తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తుంది. అడవుల పరిరక్షణ, అడవుల పెంపకం వంటివి అత్యంత కీలకమైన ప్రాథమిక రక్షణ కవచాలుగా తోడ్పడతాయి. కేవలం అవి మాత్రమే సంపూర్ణంగా నియంత్రిస్తాయను కోవటం సరైంది కాకపోయినా, నదీ పరివాహ ప్రాంతంలో ఉండే పర్వత శిఖరాల్లో దట్టమైన అడవులుంటే చెట్ల వేళ్లు మట్టిని గట్టిగా పట్టి ఉంచటంవల్ల కొండచరియలు విరగటం, వర్షపు నీటితోపాటు మట్టి కొట్టుకుపోవటం తగ్గుతుంది. హిమాలయాలు భూకంప ప్రభావిత జోన్లో ఉండటంవల్ల ఆ ప్రాంతంలోని కొండలు అత్యంత బలహీనమైన నాణ్యత కలిగిన మట్టి, రాళ్లతో నిండి ఉంటాయి. నదీ తీరం పొడవునా వెదురు, గడ్డి జాతుల మొక్కల పెంపకంవల్ల కోతను అరికట్టడం సాధ్యమవుతుంది. ఎన్ని చేసినా తాత్కాలిక ఉపశమనానికీ, నష్టాన్ని నియంత్రించటానికీ మాత్రమే అవి తోడ్పడ తాయి. మనం చేయాల్సిందల్లా పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడం. దాన్ని విస్మరించి చేసే ఏ చర్య అయినా మెరుగైన ఫలితాన్నివ్వలేదు. -
గుజరాత్ లో వర్ష బీభత్సం నీట మునిగిన ఇళ్లు, కార్లు
-
గుజరాత్లో నీట మునిగిన కార్లు.. వైరల్ వీడియో
వల్సాడ్: గుజరాత్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్ర దక్షిణ భాగంలో ఉన్న వల్సాడ్ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. వల్సాడ్లోని ఉంబర్గావ్ ప్రాంతంలో గురువారం ఉదయానికి కేవలం 16 గంటల్లోనే రికార్డు స్థాయిలో 1,100 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో బాధితులను ప్రభావిత ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల పలు లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో జన జీవనం స్తంభించిపోయింది. వాపి ప్రాంతంలో భారీ వరదల కారణంగా పార్క్ చేసిన 50 కార్లకు పైగా నీట మునిగాయి. ఆ వీడియోలో ఓ భవనం పార్కింగ్ ఏరియా పూర్తిగా నీటితో నిండిపోయి.. నీటి మట్టం కార్ల కిటికీల వరకు చేరినట్లు కనిపిస్తోంది. పార్కింగ్ వెలుపల ఉన్న పరిసర ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC) డేటా ప్రకారం.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వల్సాడ్ జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది.ఔరంగా, పార్, దమన్ గంగ వంటి నదులు పొంగి పొర్లడంతో వల్సాడ్లో భారీగా వరదలు వచ్చాయి. సురత్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 2,200 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ గుజరాత్లోని వల్సాడ్, నవసారి, డాంగ్స్, సూరత్, తాపి జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేయడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు.Extreme torrential downpours struck Vapi in southern Gujarat, dumping nearly nine inches of rain that engulfed cars and washed livestock away in surging currents. The sudden deluge has caused widespread flooding throughout several areas of Valsad district. pic.twitter.com/6GZYIMHRcj— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) July 23, 2026 -
అస్సాంలో భీకర వరదలు: 21 మంది మృతి
దిస్పూర్: అస్సాంలో వరద పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారాయి. ఎగువ ప్రాంతాల్లో క్లౌడ్బరస్ట్ కారణంగా సంభవించిన వరదలతో రాష్ట్రం అతలాకుతలమైంది. బుధవారం నాటి వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 21కి చేరింది. ఏడాది వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మొత్తం 31కి పెరిగింది. రాష్ట్రంలోని మొత్తం 16 జిల్లాల్లో దాదాపు 5,64,600 మందికి పైగా ప్రజలు ఈ వరదల బారిన పడ్డారు. శివసాగర్ జిల్లాలో గత 24 గంటల్లో 13 మంది ప్రాణాలు కోల్పోగా, చరైడియోలో ఐదుగురు, గోలాఘాట్లో ఇద్దరు, జోర్హాట్లో ఒకరు మరణించారు.44 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 872 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. అత్యధికంగా శివసాగర్లో 3,59,535 మంది, జోర్హాట్లో 87,662 మంది, చరైడియోలో 72,646 మంది వరద ప్రభావానికి గురయ్యారు. బాధితుల సహాయార్థం 71 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయగా, వాటిలో 12,284 మంది ఆశ్రయం పొందుతున్నారు. వీరితో పాటు 202 రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు కూడా పనిచేస్తున్నాయి.పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ నేరుగా రంగంలోకి దిగారు. చరైడియో, నజిరా, శివసాగర్, సోనారి, జోర్హాట్ మరియు ట్యోక్ తదితర అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలు, సహాయ శిబిరాలను సందర్శించి సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. వాయుసేన, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా సహాయక, రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.వరద నీరు రైలు పట్టాలను ముంచెత్తడంతో వరుసగా రెండో రోజు కూడా రైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. శివసాగర్ జిల్లాలోని సిమలుగురి ప్రాంతంలో తీవ్రమైన వరద కారణంగా సిమలుగురి-నమ్టియాలి, సిమలుగురి-సెలెంఘాట్ మార్గాల్లో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి కపింజల్ కిషోర్ శర్మ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, ఈ ప్రత్యేక రైళ్లు శుక్రవారం వరకు అందుబాటులో ఉంటాయన్నారు తెలిపారు.ఇది కూడా చదవండి: బాండీ బీచ్ హైదరాబాదీ ‘హీరో’కు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం! -
ప్రకృతి విపత్తు.. ఒకే కుటుంబాన్ని బలిగొన్న వరద విలయం
ఈశాన్య రాష్ట్రం అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ధాటికి సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. చరైదేవో జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా వరదల కారణంగా మృతుల సంఖ్య 31కు చేరగా, 16 జిల్లాల్లో 5.64 లక్షల మందికిపైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ విషాద ఘటన జూలై 21 సాయంత్రం 7 గంటల సమయంలో చరైదేవో జిల్లా టెంగాపుఖురి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్వా అభయపురి గ్రామంలో జరిగింది. భారీ వర్షాల కారణంగా వరద నీరు ఒక్కసారిగా రోహిణి దువారా ఇంట్లోకి చేరింది. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో కుటుంబ సభ్యులు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రోహిణి దువారా భార్య తుతుమోని దువారా, కుమార్తె బిదిషా దువారా ఉద్ధృత వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు కుమారులు విద్యుత్ దువారా, బిప్లబ్ దువారా వరద నీటిలోకి దూకినా, వారు కూడా నీటి ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యారు. దీంతో క్షణాల్లోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కనిపించకుండా పోయారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.Flood situation in Upper Assam has become extremely critical. Main SBI branch in Sonari town is now completely submerged. A large number of valuable documents and electronic systems have been damaged. The Army and the Indian Air Force are alert for rescue and relief operations. pic.twitter.com/aY5hC4nf4h— Nandan Pratim Sharma Bordoloi (@NANDANPRATIM) July 21, 2026ఘటన జరిగిన వెంటనే జిల్లా వరద నియంత్రణ హెల్ప్లైన్కు పలుమార్లు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం చరైదేవో జిల్లా డిప్యూటీ కమిషనర్ డాక్టర్ నేహా యాదవ్ను సంప్రదించగా, వెంటనే రెస్క్యూ బృందాన్ని పంపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు. ఈ జాప్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. చివరకు గ్రామస్థులే స్వచ్ఛందంగా గల్లంతైన నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఇదిలా ఉండగా, అస్సాంలో వరద పరిస్థితి రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతోంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం, గత 24 గంటల్లో మరో 21 మంది మృతి చెందారు. దీంతో ఈ ఏడాది వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 31కు చేరింది. దిఖౌ, దిసాంగ్, బ్రహ్మపుత్ర, బుర్హిదిహింగ్, ధన్సిరి నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరద ముప్పు మరింత పెరిగింది. సహాయక చర్యల్లో భారత వైమానిక దళం, జాతీయ విపత్తు స్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF), అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొంటున్నారు. వరదల కారణంగా రైల్వే ట్రాక్లు నీటమునిగిపోవడంతో ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలో పలు రైళ్ల రాకపోకలు వరుసగా రెండో రోజూ నిలిచిపోయాయి. ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.𝐔𝐏𝐏𝐄𝐑 𝐑𝐀𝐈𝐋𝐖𝐀𝐘 𝐓𝐑𝐀𝐂𝐊 𝐖𝐀𝐒𝐇𝐄𝐃 𝐀𝐖𝐀𝐘 𝐁𝐘 𝐅𝐋𝐎𝐎𝐃𝐒; 𝐃𝐀𝐍𝐆𝐄𝐑𝐎𝐔𝐒 𝐒𝐈𝐓𝐔𝐀𝐓𝐈𝐎𝐍 𝐀𝐓 𝐍𝐀𝐙𝐈𝐑𝐀–𝐒𝐇𝐈𝐌𝐋𝐔𝐆𝐔𝐑𝐈𝐑𝐄𝐏𝐎𝐑𝐓 | 𝐊𝐊 𝐏𝐋𝐔𝐒+ 𝐃𝐈𝐒𝐀𝐒𝐓𝐄𝐑 𝐃𝐄𝐒𝐊𝐒𝐞𝐯𝐞𝐫𝐞 𝐟𝐥𝐨𝐨𝐝𝐢𝐧𝐠 𝐡𝐚𝐬 𝐜𝐚𝐮𝐬𝐞𝐝 𝐞𝐱𝐭𝐞𝐧𝐬𝐢𝐯𝐞… pic.twitter.com/UOyy2z3UX5— 𝐊𝐚𝐢𝐥𝐚𝐬𝐡 𝐁𝐚𝐠𝐚𝐫𝐢𝐚 (@bagaria_kailash) July 20, 2026 ఇదే సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం నుంచి చరైదేవో, నజిరా, శివసాగర్, సోనారి, జోర్హాట్, టియోక్ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ప్రకటించారు. ప్రజలకు అవసరమైన అన్ని సహాయ చర్యలు వేగంగా అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అయితే చరైదేవోలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతైన ఘటన, సహాయక బృందాల స్పందనలో ఆలస్యమైందన్న ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి. -
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు
కాబూల్: అఫ్గానిస్తాన్ని భారీ వరదలు అతలాకుతలం చేశాయి. నిన్న (సోమవారం) నూరిస్తాన్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. , మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ వివరాలను అక్కడి అధికారులు ప్రకటించారు.భారీ వరదలకు నూరిస్తాన్ 'పరూన్' లో నది ఒడ్డున మార్కెట్లు, హోటళ్లు, వందలాది దుకాణాలు వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయాయి. ఆ ప్రాంతంపూర్తిగా బురదతో నిండిపోయింది. దీంతో వరదలు తగ్గుముఖం పట్టాక క స్థానిక నివాసితులు బురద కుప్పలపై గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలింపులు చేపడుతున్నారు. అయితే ఈ వరదలలో పరూన్ నగర మేయర్తో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.కాగా సహాయక చర్యలకు సరైన సామాగ్రి లేకపోవడంతో స్థానికులు తమ చేతులతోనే బురదను తొలగిస్తూ గాలింపు చర్యలు చేపట్టడం హృదయవిదారకంగా కనిపిస్తోంది. కాగా ఈ ఘటనపై తాలిబన్ ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ స్పందిస్తూ, నూరిస్తాన్ ప్రాంతంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని బాధితులను రక్షించడానికి మరియు వారి ఆస్తులను కాపాడటానికి సంబంధిత ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగి తీవ్రంగా శ్రమిస్తున్నాయని తెలిపారు.భారీ వర్షాలు పడే అవకాశంఆ దేశ వాతావరణ పరిస్థితులపై విపత్తు నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రావిన్సుల్లో భారీ వర్షాలు, తుఫానులు వచ్చే అవకాశం ఉన్నందున, ప్రజలు నదీ తీరాలకు వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. -
కాఠ్మాండు రణరంగం: అటు వరద ముంపు.. ఇటు అణచివేత!
కాఠ్మాండు: నిలువ నీడ లేని నిరుపేదలను పునరావాసం కల్పించకుండానే బలవంతంగా వారిన ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారని, సామాజిక కార్యకర్తలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నేపాల్లో వందలాది మంది యువతీ యువకులు మళ్లీ రోడ్లపైకి వచ్చారు. కాఠ్మాండులో నివాసాల ఖాళీ ప్రక్రియను నిరసిస్తూ, బాధిత నిరుపేదలకు న్యాయం చేయాలని, గృహ హక్కులను రక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ కార్యాలయం వెలుపల భారీ ఎత్తున బైఠాయించారు.‘జాయింట్ నేషనల్ స్క్వాటర్స్ ఫ్రంట్’ ఆధ్వర్యంలో కాఠ్మాండులోని సింహదర్బార్ సెక్రటేరియట్ సమీపంలో ఉన్న మైతీఘర్ మండలా వద్ద ఈ నిరసన ప్రదర్శన జరిగింది. పేద కుటుంబాలను వేధించడం ఆపాలని, మానవ హక్కులను గౌరవించాలని, అక్రమ అరెస్టులను నిలిపివేయాలని, నిరాశ్రయులైన నిరుపేదలకు శాశ్వత గృహ వసతి కల్పించాలని నిరసనకారులు ప్లకార్డులతో డిమాండ్ చేశారు.పోలీసుల చర్యలతో పెరిగిన ఉద్రిక్తతలుశుక్రవారం రాత్రి కాఠ్మాండులోని కీర్తీపూర్ లో ఉన్న ఒక ప్రభుత్వ తాత్కాలిక పునరావాస కేంద్రం వరద ముంపునకు గురైంది. అక్కడ సుమారు 150 మంది నిరుపేదలు ఆశ్రయం పొందుతున్నారు. భద్రతా సిబ్బంది అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ, మరుసటి రోజు పరిస్థితిని సమీక్షించడానికి వెళ్లిన ‘జెన్ జీ’యువ సామాజిక కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి, పలువురిని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ లాఠీఛార్జ్లో ఒక నిరసనకారుడి ముఖానికి తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించారు.పోలీసుల చర్యలపై నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు గగన్ కుమార్ థాపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులను ఖండిస్తూ, అదుపులోకి తీసుకున్న వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఆదివారం నాడు కోశి ప్రాంతంలోని మోరంగ్ జిల్లా పోలీసు కార్యాలయం వెలుపల శాంతియుతంగా నిరసన తెలుపుతున్న 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.వివాదానికి ప్రధాన కారణం ఇదే..ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన నివాసాల ఖాళీ ప్రక్రియే ప్రస్తుత వివాదానికి కారణం. ఏప్రిల్ నెలలో కాఠ్మాండు లోయతో పాటు నేపాల్లోని ఇతర ప్రాంతాలలో ఉన్న పేదల బస్తీలను అధికారులు ఖాళీ చేయించారు. దీనివల్ల సుమారు 2,600 కుటుంబాలకు చెందిన 15,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిలో వందలాది మందిని తాత్కాలిక కేంద్రాలకు తరలించిన ప్రభుత్వం, జూలై 6 లోగా వాటిని కూడా ఖాళీ చేయాలని ఆదేశించింది. అయితే, శాశ్వత పునరావాస ప్రణాళిక ఏదీ లేకపోవడంతో డజన్ల కొద్దీ కుటుంబాలు ఇప్పటికీ ఆ తాత్కాలిక కేంద్రాల్లోనే మగ్గుతున్నాయి. -
చైనాపై ప్రకృతి విలయం.. టైఫూన్ దెబ్బకు అతలాకుతలం
చైనాలో ప్రకృతి విలయం కొనసాగుతోంది. శక్తివంతమైన టైఫూన్ బవి (Typhoon Bavi) తూర్పు తీరాన్ని తాకడంతో భారీ వర్షాలు, పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో వరదలు, చెట్లు విరిగిపడటం, రవాణా అంతరాయాలు చోటుచేసుకున్నాయి.TyphoonBavi.. టైఫూన్ బవి చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ తీర ప్రాంతాన్ని తాకింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు సుమారు 144 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. అనంతరం తుపాను బలహీనపడి తీవ్ర ఉష్ణమండల తుపానుగా మారినప్పటికీ, భారీ వర్షాల ముప్పు కొనసాగుతోంది. తుపాను ప్రభావంతో జెజియాంగ్ ప్రావిన్స్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా యూకింగ్ ప్రాంతంలో వందల సంఖ్యలో చెట్లు నేలకూలగా, కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. అత్యవసర సిబ్బంది భారీ యంత్రాలతో రంగంలోకి దిగి రోడ్లను శుభ్రం చేసే పనులు చేపట్టారు.#China evacuated more than 1 million people & issued high alerts as eastern China braced for #TyphoonBavi, which brought strong winds and rain to #Japan's southern islands and #Taiwan. #floods #Phillipines #typhoon #Bavi #Beijing #heavyrain pic.twitter.com/hjSWM5y1kQ— Salar News (@EnglishSalar) July 11, 2026టైఫూన్ దెబ్బకు రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. విమాన సర్వీసులు రద్దయ్యాయి, హైస్పీడ్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. షాంఘైలోని విమానాశ్రయాల్లో వందలాది విమానాలు రద్దు చేసినట్లు సమాచారం. చైనాతో పాటు తైవాన్, జపాన్ దక్షిణ దీవులపై కూడా టైఫూన్ ప్రభావం చూపింది. తైవాన్లో బలమైన గాలులు, వర్షాల కారణంగా పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. వాతావరణ నిపుణులు మరో హెచ్చరిక జారీ చేశారు. తుపాను బలహీనపడినప్పటికీ తూర్పు చైనా ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం చైనా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తీర ప్రాంతాల్లో అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచి, ప్రజలకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు. ప్రకృతి ప్రకోపం నుంచి కోట్లాది మంది ప్రజలను రక్షించేందుకు భారీ స్థాయిలో చర్యలు కొనసాగుతున్నాయి.🇹🇼 Typhoon Bavi is battering Taiwan, forcing more than 14,000 people to evacuate. Keelung is being lashed by fierce winds and heavy rain, while over 27,000 households are already without power. 🌪️⚠️ #TyphoonBavi #Taiwan #Breaking pic.twitter.com/VU1Nrd0AkB— 呀婷 (Ya-Ting) (@YaTing542311) July 11, 2026Nature returning the trash with gigantic waves during the arrival of Typhoon Bavi in Taizhou, Zhejiang Province, China 🇨🇳 , on July 11, 2026.#TyphoonBavi pic.twitter.com/aX9ulp23gN— 🄲🄾🄻🄾🄽🄴🄻 🄱🄾🄶🄴🅈 (@alfadelta0108) July 11, 2026 -
పహల్గామ్పై ప్రకృతి దాడి.. పర్యాటకుల తరలింపు!
పహల్గామ్: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఆకస్మిక వరదలు పోటెత్తాయి. దీనివల్ల స్థానికంగా ఉన్న పలు హోటళ్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి. అయితే, పర్యాటకులందరూ సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం సాయంత్రం 6:00 గంటల నుంచి రాత్రి 9:30 గంటల మధ్య ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలోనే రాత్రి 8:00 నుంచి 9:00 గంటల మధ్య ఒక్కసారిగా వరద ముంచెత్తింది. పహల్గామ్లోని రావూరా, దేహ్వాథూ అటవీ ప్రాంతాల్లో మేఘ విస్ఫోటనం సంభవించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు నిపుణులు భావిస్తున్నారు.ఈ భారీ వర్షం కారణంగా స్థానిక వాగు ఉధృతంగా ప్రవహించి, బట్కుట్ వద్ద లిద్దర్ వాగులో కలిసింది. వరద నీరు కనీసం 3 నుంచి 4 హోటళ్లు, కొన్ని ఇళ్లలోకి చొరబడింది. హోటళ్లలోకి నీరు చేరిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, అధికారులు పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత కొన్ని గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల శేషనాగ్, లిద్దర్ వాగుల్లో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇవి ప్రమాద హెచ్చరిక స్థాయి కంటే దిగువనే ప్రవహిస్తున్నప్పటికీ, అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. Some videos from Pahalgam where flash floods struck this evening. https://t.co/uzn8Ygo5A4 pic.twitter.com/cUZEzr7qIS— Kashmir Weather (@Kashmir_Weather) July 11, 2026దోడా జిల్లాలోనూ ఆకస్మిక వరదలుఇటీవలే జమ్ముకశ్మీర్లోని దోడా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు థాత్రి పట్టణ ఎగువ ప్రాంతం ఆకస్మిక వరదల బారిన పడింది. ఈ వరద ధాటికి పలు ఇళ్లు, దుకాణాలు, వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున రాళ్లు, బురద, వ్యర్థాలు కొట్టుకువచ్చి థాత్రి పట్టణంపై పడ్డాయని అధికారులు తెలిపారు. బురద, బండరాళ్లు ఇళ్లు, దుకాణాలను ఢీకొట్టడంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. రోడ్డు పక్కన నిలిపిన పలు వాహనాలు బురద కింద చిక్కుకోగా, కొన్ని వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయి చీనాబ్ నదిలో కలిసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ హఠాత్ పరిణామంతో థాత్రి సమీపంలో డోడా-కిష్త్వార్ రహదారి మూతపడి రవాణా నిలిచిపోయింది. జిల్లా యంత్రాంగం, పోలీసులు, ఇతర సహాయక సంస్థలతో కలిసి రహదారిని పునరుద్ధరించేపనులు చేపట్టారు. -
చైనాకు చుక్కలు..! ఒక వైపు వరదలు.. మరోవైపు విషసర్పాలు
-
పాముల రాజ్యం.. కోట్ల వ్యాపారం.. ఒక్క దెబ్బతో తారుమారు!
పాములు అంటే భయంతో మనం ఆమడ దూరం పరుగులు పెడతాం. కానీ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో పాములే ఒక పెద్ద వ్యాపారం. ముఖ్యంగా చైనాలోని కొన్ని ప్రాంతాల్లో పాములను ప్రత్యేకంగా పెంచే స్నేక్ ఫారాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఔషధ పరిశ్రమ, శాస్త్రీయ పరిశోధనలు, పాము విషం సేకరణ, చర్మ ఉత్పత్తులు వంటి అవసరాల కోసం వేల సంఖ్యలో పాములను పెంచుతున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చిందంటే..చైనా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల ధాటికి ఓ పాముల పెంపక కేంద్రం దెబ్బతింది. రక్షణ వ్యవస్థలు విఫలమవడంతో 900కు పైగా పాములు బయటకు వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బయటకు వచ్చిన వాటిలో కొన్ని విషపూరిత జాతులకు చెందిన పాములు ఉండటంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి, పాములు కనిపిస్తే వాటిని పట్టుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇక, వరద నీటిలో పాములు కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.“స్నేక్ విలేజ్”..అయితే, చైనాలో పాముల పెంపకం కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైన వృత్తిగా మారింది. ముఖ్యంగా జెజియాంగ్ ప్రావిన్స్లోని జిసికియావో (Zisiqiao) ప్రాంతం పాముల పెంపకానికి ప్రసిద్ధి చెందింది. దీనిని చాలా మంది “స్నేక్ విలేజ్”గా పిలుస్తారు. ఇక్కడి ప్రజలు తరతరాలుగా పాములను పెంచుతూ జీవనం సాగిస్తున్నారు. కోబ్రాలు, వైపర్లు, పైథాన్లు వంటి పలు రకాల సర్పాలను ప్రత్యేక ఫారాల్లో ఉంచుతారు. జిసికియావో గ్రామంలో పాములను పెంచి ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రతి వ్యక్తి సుమారు 30వేలకంటే ఎక్కువ పాములను పెంచుతారని చెబుతారు. ఒక లీటరు విషం ఏకంగా రూ. 3.5 కోట్లు వరకు ఉంటుంది.దక్షిణ చైనాలోని గ్వాంగ్సీ ప్రాంతం కూడా పాముల పెంపకానికి మరో ముఖ్య కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న పాముల ఫారాల్లో విషసర్పాలను పెంచి వాటి నుంచి వివిధ ఉత్పత్తులను సేకరిస్తారు. ఇటీవల వరదల కారణంగా పాములు బయటకు వచ్చిన ఘటన కూడా ఈ ప్రాంతంలోని ఓ ఫారం నుంచే జరిగినట్లు సమాచారం. కాగా, పాముల పెంపకం వెనుక ప్రధానంగా ఔషధ పరిశ్రమ, పరిశోధన రంగాల అవసరాలు ఉన్నాయి. పాము విషాన్ని శాస్త్రీయ పరిశోధనలు, యాంటీ వెనం మందుల తయారీ కోసం ఉపయోగిస్తారు. విషం సేకరించే ప్రక్రియ అత్యంత ప్రమాదకరమైనది కావడంతో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది అవసరం ఉంటుంది.Amd Chinese have startto catch these snakes.Food is important https://t.co/7DmN6tKr7c pic.twitter.com/RX24yp0ipi— GeoPanda (@Geotactix) July 8, 2026భద్రతపై టెన్షన్..అలాగే కొన్ని ప్రాంతాల్లో పాము చర్మానికి కూడా డిమాండ్ ఉంటుంది. పాము చర్మంతో కొన్ని రకాల లెదర్ ఉత్పత్తులు తయారు చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో పాములను ఆహారంగా కూడా వినియోగించే సంప్రదాయం ఉంది. దీంతో పాముల పెంపకం ఒక ప్రత్యేక మార్కెట్గా అభివృద్ధి చెందింది. అయితే విషసర్పాలను పెద్ద సంఖ్యలో ఒకే చోట పెంచడం ఎప్పుడూ ప్రమాదకరమే. భారీ వర్షాలు, వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఫారాల భద్రతా వ్యవస్థలు దెబ్బతింటే పరిస్థితి అదుపు తప్పుతుంది. తాజాగా జరిగిన ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది.పాముల పెంపక కేంద్రాల్లో బలమైన రక్షణ గోడలు, అత్యవసర భద్రతా ఏర్పాట్లు, యాంటీ వెనం నిల్వలు, శిక్షణ పొందిన సిబ్బంది ఉండటం తప్పనిసరి. లేకపోతే వ్యాపారం కోసం పెంచిన విషసర్పాలే ప్రజలకు ప్రాణాంతక ముప్పుగా మారే అవకాశం ఉంది. వరదలతో బయటపడిన వందలాది పాముల ఘటన కేవలం ఓ ప్రమాదం మాత్రమే కాదు.. పాముల పెంపకం వెనుక ఉన్న భారీ వ్యాపారం, దాని వల్ల వచ్చే భద్రతా సవాళ్లను మరోసారి ప్రపంచం ముందుకు తెచ్చింది.When floods become a haven for predators! 🛑 The terrifying side of the recent heavy rains in China... Snakes leaving their burrows and swimming through the floodwaters! 🐍🌊 pic.twitter.com/AbjbZYwjSg— Nature (@NNaturalanimals) July 10, 2026పాముల పెంపకాలు ఇక్కడే.. 1. జిసికియావో (Zisiqiao) – జెజియాంగ్ ప్రావిన్స్చైనాలో అత్యంత ప్రసిద్ధ ‘స్నేక్ విలేజ్’గా పేరు పొందిన ప్రాంతం ఇది.ఇది జెజియాంగ్ ప్రావిన్స్లోని డెక్వింగ్ కౌంటీ, జిన్షి టౌన్ (Xinshi Town) పరిధిలో ఉంది.ఇక్కడ దశాబ్దాలుగా గ్రామస్తులు పాముల పెంపకాన్ని వృత్తిగా కొనసాగిస్తున్నారు.కోబ్రాలు, వైపర్లు, పైథాన్లు వంటి పలు జాతులను పెంచుతారు.పాము విషం, పాము చర్మం, ఎండబెట్టిన పాము ఉత్పత్తులు, సంప్రదాయ ఔషధాల కోసం ఈ వ్యాపారం కొనసాగుతోంది.2. హెన్జౌ (Hengzhou).. గ్వాంగ్సీ జువాంగ్ అటానమస్ రీజియన్ఇటీవల వందల సంఖ్యలో పాములు బయటకు వచ్చిన ఘటనతో వార్తల్లో నిలిచిన ప్రాంతం ఇదే.గ్వాంగ్సీలోని హెన్జౌ ప్రాంతంలో పాముల పెంపక కేంద్రాలు ఉన్నాయి.భారీ వరదల కారణంగా పాముల ఫారం దెబ్బతిని సుమారు 900 వరకు పాములు బయటకు వచ్చినట్లు సమాచారం.బయటకు వచ్చిన వాటిలో కోబ్రాలు, క్రైట్లు వంటి విషసర్పాలు ఉన్నాయని అధికారులు హెచ్చరించారు.3. గ్వాంగ్డాంగ్ (Guangdong) ప్రాంతంచైనాలో సంప్రదాయ ఔషధ పరిశ్రమకు ముఖ్యమైన మార్కెట్లలో ఒకటి.పాము ఉత్పత్తులు, ఔషధ వినియోగాలకు సంబంధించిన వ్యాపారానికి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఇది ఒకటి.4. గ్వాంగ్సీ (Guangxi) ప్రాంతంవేడి, తేమతో కూడిన వాతావరణం కారణంగా కొన్ని రకాల సర్పాల పెంపకానికి అనుకూలంగా భావిస్తారు.పాముల పెంపకం, సంప్రదాయ వైద్య మార్కెట్లతో ఈ ప్రాంతానికి సంబంధం ఉంది.పాముల పెంపకంలో సాధారణంగా పెంచే జాతులుకోబ్రా (Cobra)క్రైట్ (Krait)వైపర్ (Viper)పైథాన్ (Python)రాట్ స్నేక్ (Rat snake) -
చైనాలో ఊహించని విపత్తు.. తప్పించుకున్న 900 పాములు
బీజింగ్: చైనాపై ప్రకృతి పగబట్టింది. తీవ్రమైన వరదలు, భారీ వర్షాలతో డ్రాగన్ దేశం అతలాకుతలమవుతోంది. దేశంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, గ్వాంగ్జీ (Guangxi) ప్రాంతంలో ఒక వింతైన, భయంకరమైన పరిస్థితి తలెత్తింది. వరద నీటి ఉధృతికి స్థానిక పెంపకం కేంద్రాల నుంచి వందలాది పాములు తప్పించుకుని ఊళ్లపై పడటంతో అధికారులు, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాల ప్రకారం.. గ్వాంగ్జీ ప్రాంతంలో వరదలు ముంచెత్తడంతో దాదాపు 900కు పైగా పాములు పెంచే కేంద్రాల నుంచి బయటకు వచ్చాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైన నాగుపాములు వంటి విషసర్పాలు కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. లోతైన వరద నీటిలో పాములు ఈదుకుంటూ వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.గ్వాంగ్జీ పరిధిలోని హెంగ్జౌ నగరంలో వరద నీరు,రోడ్లు బ్లాక్ అవ్వడం వల్ల ఒక విషాదం చోటుచేసుకుంది. వరదల్లో కొట్టుకువచ్చిన పాము కాటుకు గురైన ఒక మహిళ, సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేక ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో, పాము కాటు బాధితులకు తక్షణ చికిత్స అందించేందుకు ప్రభుత్వం తాత్కాలిక వైద్య క్లినిక్లను ఏర్పాటు చేసింది.అలాగే తప్పించుకున్న పాములను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. చైనాలోనే సాంప్రదాయ వైద్యం, తోలు ఉత్పత్తులు మాంసం కోసం వాడే వాణిజ్య పాముల పెంపకానికి గ్వాంగ్జీ అతిపెద్ద కేంద్రం. ఇక్కడ సుమారు 3 కోట్లకు పైగా సర్పాలను పెంచుతుంటారు. హెంగ్జౌ పరిసరాల్లోని పలు గ్రామాలు నీట మునగడంతో ఈ పాములన్నీ వరద నీటిలోకి చేరాయని ప్రాంతీయ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. విపత్తులు, విషసర్పాల ప్రమాదం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అత్యవసర సహాయక చర్యలను పూర్తిస్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. 📌 Hengzhou, #China 🇨🇳 July 6 /2026After days of heavy rain 🌧️ and flooding across China, around 900 snakes 🐍 escaped from a breeding farm in Hengzhou. Reports say the reptiles included venomous cobras, with villagers attempting to catch them in the floodwaters. pic.twitter.com/cTcgAZ4nZd— CAUGHTIN4KHQ (@CaughtIn4KHQ) July 9, 2026 -
పలు రాష్ట్రాల్లో వరద బీభత్సం
-
వరుణుడు ఉగ్రరూపం మునిగిన ముంబై
-
ఎట్టకేలకు ఆల్మట్టికి వరద
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి ఎట్టకేలకు వరద ప్రారంభమైంది. పశ్చిమ కనుమల్లో వర్షాలు కురవడంతో సోమవారం ఉదయం 6 గంటలకు జలాశయానికి 1,239 క్యూసెక్కుల వరద ప్రారంభమైంది. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొని ఉండడంతో జలాశయానికి ఆలస్యంగా వరద ప్రారంభమైంది. ఆల్మట్టి జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, గతేడాది సరిగ్గా ఇదే సమయానికే నిల్వలు 92.17 టీఎంసీలకు చేరడంతో, గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువన విడుదల చేశారు.ప్రస్తుతం జలాశయంలో 21.18 టీఎంసీలే నిల్వలే ఉన్నాయి. కృష్ణమ్మ జన్మస్థానమైన మహాబలేశ్వర్(మహారాష్ట్ర)లోని పశ్చిమ కనుమల నుంచి ఆల్మట్టి ప్రాజెక్టు వరకు మధ్యలో ఉన్న 518 కి.మీ.ల పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిస్తేనే ఆల్మట్టి జలాశయం నిండుతుంది. వర్షాలు లేక ఇప్పటికే జూన్ తీవ్ర నిరాశ కల్పించగా, జూలై, ఆగస్టు నెలల్లో భారీ వర్షాలు కురిస్తే ఎగువన కర్ణాటకలోకి ఆల్మట్టితోపాటు నారాయణపూర్, తుంగభద్ర జలాశయాలు నిండి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వరద వస్తుంది. ఆయా జలాశయాల్లో ఇలా... ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు గతేడాది 99 వేల క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం కేవలం 19 క్యూసెక్కుల నీరే వచ్చింది. జలాశయ గరిష్ట సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 23.78 టీఎంసీలకు నిల్వలు పడిపోయాయి. కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండాలంటే 120 టీఎంసీలకు పైగా వరద రావాలి. ⇒ కృష్ణా ఉపనది భీమాపై మహారాష్ట్రలో ఉన్న ఉజ్జయినీ జలాశయానికి గతేడాది ఇదే సమయానికి 72వేల క్యూసెక్కుల వరద రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు చుక్కనీరు రాలేదు. జలాశయ నిల్వ సామర్థ్యం 123.29 టీఎంసీలు కాగా 49.07 టీఎంసీల నిల్వలున్నాయి. ⇒ కృష్ణా మరో ఉపనది తుంగభద్రపై కర్ణాటకలో ఉన్న తుంగభద్ర జలాశయానికి గతేడాది ఈ సమయానికి 72వేల క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం 1,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయ గరిష్ట సామర్థ్యం 105.78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.38 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. ⇒ తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు గతేడాది 1.17లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా, ప్రస్తుతం ఎలాంటి వరద రావడం లేదు. జూరాల గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, 5.85 టీఎంసీల నిల్వలున్నాయి. ప్రస్తుత సీజన్లో ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు 4.13 టీఎంసీల వరద వచ్చి చేరింది. ⇒ శ్రీశైలం జలాశయ గరిష్ట నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 802 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే ఉంది. నిల్వలు 42.21 టీఎంసీలకు తగ్గిపోగా, ప్రస్తుత సీజన్లో జలాశయంలోకి 5.6 టీఎంసీల వరద వచ్చి చేరింది. ⇒ నాగార్జునసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, 5,224 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 138.39 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ విద్యుదుత్పత్తి ద్వారా 4,168 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
జమ్ముకశ్మీర్లో కుండపోత వర్షాలు.. అంతటా హై అలర్ట్!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కిష్త్వార్, దోడా జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా హఠాత్తుగా వరదలు రావడానికి తోడు కొండచరియలు విరిగిపడ్డాయి. కిష్త్వార్లోని 540 మెగావాట్ల క్వార్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ సమీపంలో సోమవారం ఉదయం ఒక భారీ కొండచరియ విరిగిపడటంతో అక్కడి రహదారిపై వెళ్తున్న, నిలిపి ఉంచిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీ యంత్రాలతో రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది శిథిలాలను తొలగించి, వాహనాలను వెలికితీసేందుకు చర్యలు చేపడుతున్నారు.మరోవైపు దోడా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పౌరజీవనం అస్తవ్యస్తమైంది. దోడా జిల్లా ప్రేమ్ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో దోడా-కిష్త్వార్ రహదారిని సోమవారం ఉదయం అధికారులు పూర్తిగా మూసివేశారు. రహదారిపై భారీ బండరాళ్లు, బురద పేరుకుపోవడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికుల రాకపోకలతో పాటు అత్యవసర వస్తువుల రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. సంబంధిత శాఖల యంత్రాంగం యుద్ధప్రాతిపదికన రహదారిని పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమైంది.కొండ ప్రాంతాల్లో వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడం, నీరు నిలిచిపోవడం లాంటి సమస్యలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించినట్లు తెలియరాలేదు. పరిపాలనా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి, రోడ్ల మరమ్మతులు పూర్తయ్యే వరకూ అనవసర ప్రయాణాలు చేయవద్దని, తాజా వాతావరణ హెచ్చరికలను గమనించాలని అధికారులు స్థానికులకు, ప్రయాణికులకు సూచించారు.ఇది కూడా చదవండి: ముంబైలో వర్ష బీభత్సం: ఆరుగురు మృతి -
అమెరికా వరదల్లో గల్లంతైన దేవరపల్లి యువకుడు
పర్చూరు (చినగంజాం): విద్య, ఉద్యోగ రీత్యా బాపట్ల జిల్లా నుంచి అమెరికా వెళ్లిన ఓ యువకుడు శనివారం ఉదయం అమెరికాలో సంభవించిన భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకొని గల్లంతయ్యాడు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి రాంబాబు పెద్దకుమారుడు దొప్పలపూడి వెంకటేష్ (33) విదేశాల్లో విద్యనభ్యసించేందుకు గతంలో అమెరికా వెళ్లాడు. చదువు పూర్తి చేసుకొని అక్కడే ఉద్యోగం పొంది ఓక్లహామా సిటీలో ఉంటున్నాడు. అమెరికాలోని కాన్సాస్ వెల్లింగ్టన్కు వెళ్లిన వెంకటేష్ అక్కడ కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకుని ప్రవాహానికి కొట్టుకొనిపోయాడు. అతడు గల్లంతయిన విషయం శనివారం రాత్రి తల్లిదండ్రులకు తెలిసింది. -
అరుణాచల్లో జలప్రళయం.. ముగ్గురు గల్లంతు
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బుధవారం నాటికి తీవ్ర రూపం దాల్చాయి. వీటి ఫలితంగా సంభవించిన వరదలు, విరిగిపడుతున్న కొండచరియల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. కేయీ పన్యోర్ జిల్లాలో వరద ఉధృతికి ఇళ్లు దెబ్బతినడమే కాకుండా, ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.. విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.ముగ్గురు గల్లంతు.. నీట మునిగిన ఇళ్లుకేయీ పన్యోర్ జిల్లా యాజాలి పరిధిలోని పూసా సమీపంలో గల నీప్కో ప్రాజెక్ట్ కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న ఒక రిటైనింగ్ వాల్ కుప్పకూలింది. దీంతో వరద నీరు ఒక్కసారిగా నివాస ప్రాంతాల్లోకి దూసుకెళ్లడంతో కాలనీ పరిసరాల్లోని కనీసం 18 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వరదల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో అదనపు డిప్యూటీ కమిషనర్, డీఎస్పీ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తోంది.రంగంలోకి రక్షణ బృందాలుపరిస్థితి తీవ్రతను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ఇప్పటికే బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో నిమగ్నమవగా, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బలగాలను కూడా అలర్ట్ చేశారు. యాజాలి పరిధిలోని అందుబాటులో ఉన్న రిజర్వ్ సిబ్బందిని, వాహనాలను అత్యవసర సేవల కోసం మొబిలైజ్ చేశారు. స్థానిక మాజీ సైనికులు కూడా ఈ సహాయక చర్యల్లో భాగస్వామ్యమయ్యారు. 🚨HAPPENING NOW: Heavy rainfall and flash floods have caused widespread damage in Posa and Yazali, under Keyi Panyor District, Arunachal Pradesh, India. pic.twitter.com/LDeS2VU1Kq— Weather Monitor (@WeatherMonitors) June 24, 2026మూసుకుపోయిన రహదారులు.. డ్యామ్ గేట్లు ఎత్తివేతకొండచరియలు విరిగిపడటంతో పొటిన్, హోజ్ సమీపంలోని జాతీయ రహదారి మూడు చోట్ల పూర్తిగా స్తంభించిపోయింది. భారీగా మట్టి, శిథిలాలు రోడ్డుపై పేరుకుపోవడంతో వందలాది మంది ప్రయాణికులు నడిరోడ్డుపై చిక్కుకుపోయారు. రోడ్లను క్లియర్ చేయడానికి భారీ యంత్రాలను రంగంలోకి దించారు. మరోవైపు, నదుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో నీప్కో సంస్థ ముందస్తు జాగ్రత్తగా రంగనాడి డ్యామ్ నుండి నీటిని దిగువకు విడుదల చేస్తోంది. రక్షణ దృష్ట్యా విద్యుత్ ఉత్పాదనను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. BREAKING: Heavy rainfall and flash flooding have caused significant destruction at the NEEPCO Colony in Posa, Yazali, Keyi Panyor District, Arunachal Pradesh, India. According to the information so far, 15 quarters were destroyed and the main highway bridge was washed away. pic.twitter.com/PUnhvPkbl0— Weather Monitor (@WeatherMonitors) June 24, 2026 -
మునిగిపోయిందన్న మునిగిపోయింది, పేర్ని నానితో రైతు సరదా సన్నివేశం
-
వర్షం పడితే చాలు దోపిడీ
దేశ ఐటీ రాజధానిగా, ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా పేరుగాంచిన బెంగళూరులో వర్షం కురిస్తే చాలు జనజీవనం స్తంభించడంతోపాటు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. తాజాగా కేవలం 15 కిలోమీటర్ల ప్రయాణానికి ఛార్జీ కింద ఏకంగా రూ.1,200 వసూలు చేశారనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న ఈ సర్జ్ ప్రైసింగ్ (అధిక ఛార్జీలు) వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగింది?ప్రముఖ కంటెంట్ క్రియేటర్ సాన్యా సింగ్ తన స్నేహితురాలికి ఎదురైన చేదు అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలో కేవలం 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆటో డ్రైవర్ రూ.1,200 డిమాండ్ చేశాడని ఆమె పేర్కొన్నారు. ఇంటికి సురక్షితంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఆమె అంత మొత్తం చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా ట్రాఫిక్ కారణంగా ఇంటికి చేరుకోవడానికి ఆమెకు ఏకంగా 3 గంటల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.గందరగోళంబెంగళూరు వర్షాల గురించి సాన్యా సింగ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘బెంగళూరులో వర్షం కురిసినప్పుడు వయోలిన్ సంగీతం వినిపించదు. కేవలం హారన్ల మోత మాత్రమే వినిపిస్తుంది. కాలేజీలో అడ్మిషన్ పొందడం కంటే వర్షం సమయంలో ఆటో బుక్ చేయడం చాలా కష్టమైన పని. మా కెరీర్లు ఎలా ఉన్నా ఆటో డ్రైవర్లు మాత్రం ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ భారీగా సంపాదిస్తున్నారు’ అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Sanya Singh (@sanya.unfiltered)సోషల్ మీడియాలో..ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ‘వర్షం పడితే చాలు ఆటోలు, క్యాబ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’ అని ఒక వినియోగదారుడు పేర్కొన్నారు. ‘డిమాండ్, సరఫరా పేరుతో డ్రైవర్లు ఇష్టానుసారంగా ధరలను పెంచేస్తున్నారు. దీనిని నియంత్రించే వ్యవస్థ లేదా నియమ నిబంధనలు ఎక్కడ ఉన్నాయి?’ అని మరొకరు ప్రశ్నించారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
సౌదీని ముంచెత్తిన వరదలు.. పరుగో పరుగు
ఎడారి దేశం సౌదీ అరేబియాను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, తుపానుల బీభత్సానికి రాజధాని రియాద్తో పాటు పలు కీలక ప్రావిన్సుల్లో జనజీవనం అతలాకుతలమైంది. పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో అక్కడి ప్రభుత్వం విద్యార్థుల భద్రతను దృష్టా పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. అత్యవసర సేవల విభాగాలను హై అలర్ట్లో ఉంచింది.రాజధాని రియాద్లో గత రెండురోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వర్షంతో పాటు బలమైన ధూళి తుపానులు రావడంతో వాహనదారులకు రోడ్లు సరిగ్గా కనిపించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అల్-అహసా ప్రావిన్సులో రహదారులు జలమయం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.వరదలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సౌదీ రెడ్ క్రిసెంట్ అథారిటీ సర్వసన్నద్ధమైంది. రియాద్లో దాదాపు 143 అంబులెన్స్ యూనిట్లను, 25 రాఫ్ (RAF) బృందాలను సిద్ధంగా ఉంచారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. వారికోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.కాగా ఇన్ని రోజుల పాటు యుద్దం నేపథ్యంలో అట్టుడికిపోయిన సౌదీ అరేబియా సీజ్ఫైర్ నేపథ్యంలో కాస్త పరిస్థితులు సద్దుమణిగాయి అనే లోగా అకస్మిక వరదలు ఆ దేశంలో కల్లోలం సృష్టిస్తున్నాయి.Massive flooding caused by intense rainfall in Riyadh, Saudi Arabia 🇸🇦 pic.twitter.com/OfjWoaSOUl— Disaster News (@Top_Disaster) April 12, 2026 -
కేరళ వరదలు.. సంచలన ఆడియో విడుదల
తిరువనంతపురం: కేరళ రాష్ట్రాన్ని 2018లో వణికించిన మహా వరదలు ప్రకృతి విపత్తు కాదు, కేవలం కొందరి ధనదాహంతో జరిగిన ‘మానవ తప్పిదమే’ అని వెల్లడించే ఒక సంచలన ఆడియో వెలుగులోకి వచ్చింది. అవినీతి, ఇసుక మాఫియాల వల్లే ఆ ఘోరం జరిగిందని ఆరోపిస్తూ మువట్టుపుజ ఎమ్మెల్యే, యూడీఎఫ్ అభ్యర్థి మ్యాథ్యూ కుజల్నాదన్ ఒక ఆడియో క్లిప్ను తాజాగా విడుదల చేశారు.వివరాల్లోకి వెళితే.. కుజల్నాదన్ విడుదల చేసిన ఈ ఆడియో, ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి కె. కృష్ణన్కుట్టి మాట్లాడినట్లుగా భావిస్తున్నారు. అప్పటి జలవనరుల శాఖ మంత్రి మాథ్యూ టి. థామస్ హయాంలో జరిగిన అవకతవకలు, లంచగొండితనమే ఈ భయంకరమైన వరదలకు కారణమని ఆ ఆడియోలో వెల్లడవుతోంది. ప్రైవేట్ కాంట్రాక్టర్కు చెందిన కోట్ల రూపాయల ఇసుక నిల్వలను కాపాడేందుకు తోట్టప్పల్లి స్పిల్వేను ఒక నెల ముందే తెరవాల్సి ఉన్నా.. ఉద్దేశపూర్వకంగానే మూసి ఉంచారని ఆ ఆడియోలో ఆరోపించారు.చీఫ్ ఇంజనీర్ జోషితో పాటు అప్పటి సీపీఎం ఎమ్మెల్యే జార్జ్ థామస్ సోదరి, మంత్రి మాథ్యూ టి. థామస్ కుమ్మక్కై.. కాంట్రాక్టర్కు రూ. 300 కోట్ల లాభం చేకూర్చేందుకు స్పిల్వే గేట్లు ఎత్తకుండా జాప్యం చేశారని అందులో పేర్కొన్నారు. ఒకవేళ గేట్లు సకాలంలో తెరిచి ఉంటే ఆ ఖనిజ ఇసుక కొట్టుకుపోయేది. ఒక ప్రైవేట్ విద్యుత్ కంపెనీకి రూ.8 కోట్ల లాభం చేకూర్చడానికి మణియార్ ప్రాజెక్టులో చట్టవిరుద్ధంగా నీటిని నిల్వ చేశారని ఆ ఆడియో ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆ అదనపు నీటిని వదలడం వల్లే చెంగన్నూర్ లాంటి ప్రాంతాలు సర్వనాశనం అయ్యాయని అందులో పేర్కొన్నారు.దీనికి తోడు తమిళనాడుకు మళ్లించాల్సిన దాదాపు 1,400 క్యూసెక్కుల నీటిని, పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న రూ.200 కోట్ల నిర్మాణ ప్రాజెక్టును కాపాడేందుకు ఉద్దేశపూర్వకంగా చాలకుడి నదీ పరీవాహక ప్రాంతంలోకి మళ్లించారని మరో తీవ్ర ఆరోపణ వెలుగుచూసింది. నీటి ప్రవాహం తమ పనులకు ఆటంకం కలిగించకుండా కాంట్రాక్టర్లు అధికారులకు భారీగా ముడుపులు చెల్లించారని ఆడియోలో ఉంది. కేరళ ప్రజల ప్రాణాలు, ఆస్తులను పణంగా పెట్టి ఈ నేత ఎన్ని కోట్లు వెనకేసుకున్నారో సమాధానం చెప్పాలని కుజల్నాదన్ మీడియా సమావేశంలో సూటిగా ప్రశ్నించారు. ఈ ఆడియో వ్యవహారం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.ఇది కూడా చదవండి: శబరిమల వివాదం: సుప్రీంకోర్టులో కేంద్రం కీలక వాదన -
అత్యంత భారీ వరదలు.. హవాయి అతలాకుతలం
అమెరికా రాష్ట్రం హవాయి గత రెండు దశాబ్దాల్లో అత్యంత భారీ వరదలను ఎదుర్కొంటోంది. వరదల కారణంగా ఈ ప్రాంతం అతలాకుతలమైంది. వేలాది మంది ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఓహావు దీవిలోని ఓ ఆనకట్ట కూలిపోవచ్చని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాలులు గంటకు 100 మైళ్ల వేగంతో వీచాయి. ఈ వరదలను గడిచిన 20 ఏళ్లలో అత్యంత భారీ వరదలుగా అధికారులు పేర్కొన్నారు. అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. విమానాశ్రయాలు, పాఠశాలలు, రహదారులు, ఆసుపత్రులు, ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. కోనాలో అనే తక్కువ ఒత్తిడి వాతావరణ వ్యవస్థ కారణంగా ఈ వరదలు సంభవించాయని గుర్తించారు. ఇది హవాయి దీవులపై తేమతో నిండిన గాలులను లాగి, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలను తెచ్చింది. హోనలూలు అత్యవసర నిర్వహణ విభాగం మరిన్ని ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. మావి, మోలోకై, బిగ్ ఐలాండ్లకు కూడా వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. రహదారులు మూసివేయబడ్డాయి. ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. ఈ వరదల కారణంగా ఇప్పటికే బిలియన్ డాలర్ల మేర నష్టం సంభవించిదని అంచనా. 2023లో లహైనా అగ్నిప్రమాదాల తర్వాత, ఇప్పుడు వరదలతో హవాయి మరోసారి ప్రకృతి విపత్తు భారాన్ని మోస్తోంది. -
ఉత్తరాఖండ్ వరదలు.. ఇస్రో కీలక రిపోర్ట్
గతేడాది ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీలో సంభవించిన వరదలపై ఇస్రో కీలక నివేదిక ఇచ్చింది. ఈ ఆకస్మిక వరదలకు కారణం క్లౌడ్ బరస్ట్ కాదని తెలిపింది. ఆపై ప్రాంతంలో ఉన్న మంచుపర్వతం కరగడం వల్లే ఈ వరదలు సంభవించాయని పేర్కొంది.2025 ఆగస్టులో ఉత్తరకాశీలోని ధారాలి ప్రాంతంలో ఆకస్మికంగా వరదలు సంభవించాయి. ఉన్నట్టుండి పెద్దఎత్తున వరదలు రావడంతో ఆ ప్రాంతమంతా మునిగిపోయింది. చాలా భవనాలు, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. అయితే దీనికి కారణం క్లౌడ్ బరస్ట్ లేదా నదులు ఉప్పొంగడం అని అంతా భావించారు. అయితే దీనిపై పరిశోధన జరిపిన ఇస్రో దీని కారణం క్లౌడ్ బరస్ట్ కాదని తేల్చింది.దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆసమయంలో ఆ ప్రాంతంలో ఎటువంటి వర్షాలు పడలేదని గుర్తించారు. అదే విధంగా ఆ పై భాగంలోని పర్వతాలలో ఎటువంటి నదులు లేవని ఇస్రో తేల్చింది. ఆ ప్రాంతానికి 5200 అడుగుల ఎత్తుల పర్వతాలలో మంచు పర్వతం కరగడం మూలంగానే ఆకస్మిక వరదలు సంభవించినట్లు తెలిపారు.సాధారణంగా ఈ మంచు పర్వతాలకు రక్షణగా ఉండే పొరలు గ్లోబల్ వార్మింగ్ మూలంగా కరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న కాలుష్య పరిస్థితుల దృష్యా తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కనుక ఆ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. -
బ్రెజిల్ అతలాకుతలం.. భీకర వరదలతో 46 మరణాలు..
జూయిజ్ డీ ఫోరా: బ్రెజిల్లోని ఈశాన్య రాష్ట్రం మినాస్ గెరాయిస్ను భీకర వరదలు ముంచెత్తాయి. దీంతో రాష్ట్రంలోని జూయిజ్ డీ ఫోరా, ఉబా నగరాల్లో లక్షలాది మంది ప్రజల జనజీవన అస్తవ్యస్థమైంది. వరద సంబంధ ఘటనల్లో ఇప్పటిదాకా 46 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. ఇంకా చాలా మంది జాడ తెలీకుండా పోయిందని సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని అధికారులు ప్రకటించారు. 21 మంది గల్లంతు అయినట్టు అధికారులు చెబుతున్నారు.ఇక, రాత్రిళ్లు సైతం రిస్క్యూ బృందాలు తమ విధుల్లో నిమగ్నమయ్యాయి. ముంపు ప్రాంతాల్లోని 3,000 మందిని బుధవారం ఉదయం అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరి కొద్దిరోజులపాటు భారీ వర్షాలుకురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 5,60,000 జనాభా ఉండే జూయిజ్ డీ ఫోరా నగర వీధులన్నీ బురదలో నిండిపోయాయి. సమీపంలోని కొండచరియలు మరోసారి విరిగిపడే ప్రమాదముందని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.🇧🇷🔴 ارتفاع حصيلة القتلى في البرازيلأعلنت فرق الإنقاذ والسلطات المحلية وفاة ما لا يقل عن 20 شخصًا، مع فقدان العشرات، واضطرار أكثر من 400 شخص إلى إخلاء منازلهم، جراء الأمطار الغزيرة التي ضربت جنوب شرق البرازيل.#Brazil #HeavyRain #Floods #Landslides #ExtremeWeather #BreakingNews pic.twitter.com/CHZr6VoFw7— طقس_العالم ⚡️ (@Arab_Storms) February 24, 20261,07,000 జనాభా ఉన్న ఉబా నగరంలో జనజీవనం స్తంభించింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సోమవారం ఉదయం నుంచి మొదలైన వానలకు ఇప్పటిదాకా 20 కొండచరియలు విరిగిన ఘటనలు నమోదయ్యాయని మేయర్ మార్గరీడా సాలమావో చెప్పారు. వరదబాధిత ప్రాంతాల్లో సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంటోందని, బాధిత కుటుంబాలకు తగుసాయం అందిస్తామని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లాలూ డ సిల్వా భరోసా ఇచ్చారు. కొండలు, లోయలు, లోతట్టు ప్రాంతాలకు వైద్య బృందాలను పంపించారు. 🇧🇷 Dozens are still missing in southeastern #Brazil after floods killed at least 36 people in the state of Minas Gerais, officials said 👇 pic.twitter.com/B5xvJ4M8iT— FRANCE 24 English (@France24_en) February 25, 2026🚨⚡️At least 23 people were killed due to floods and landslides that struck Juiz de Fora in the state of Minas Gerais, Brazil, after heavy rainfall totaling 584 mm over two days, prompting authorities to declare a state of public calamity. pic.twitter.com/3ZLptDPXTu— RussiaNews 🇷🇺 (@mog_russEN) February 25, 2026🚨 At least 30 people are dead and hundreds displaced in Brazil’s Minas Gerais after record-breaking rainfall triggered landslides and flash floods⚠️ Juiz de Fora was hardest hit, with rivers bursting their banks and entire neighborhoods submerged pic.twitter.com/ZrvhyWwm0u— Anadolu English (@anadoluagency) February 25, 2026 -
కుండపోత వర్షాలు.. 100 మంది మృతి!
ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఆశ్రయం కోల్పోయారు. మరోవైపు.. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఆఫ్రికాలోని మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాలలో ఎడతెరిపిలేని కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మొజాంబిక్లో వర్షాలు, వరదల కారణంగా రెండు లక్షల మందికి పైగా ప్రభావితులు అయ్యారు. భారీ వర్షాల కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వర్షాల కారణంగా ఇప్పటికే వంద మందికిపైగా మృతి చెందారు. ఇక, జింబాబ్వేలో వర్షాల వల్ల 70 మంది మరణించగా.. 1000కి పైగా ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. పాఠశాలలు, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి.BREAKINGMore than 100 dead in torrential rains and floods across southern Africa.Severe flooding hit Gigmoto on the Island of Catanduanes in the Philippines today, after heavy rain from Tropical Storm Ada triggered a landslide that blocked a river pic.twitter.com/dKicNBaCxq— Lee Golden (@LeeGolden6) January 17, 2026ఇదిలా ఉండగా.. దక్షిణ ఆఫ్రికాలో మృతుల సంఖ్య 30 చేరింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హెలికాప్టర్లను రంగంలోకి దించి, బాధితుల్ని రక్షిస్తున్నారు. ప్రఖ్యాత క్రుగార్ నేషనల్ పార్క్ను కూడా ఈ వరదలు ప్రభావితం చేశాయి. అందులో చిక్కుకున్న 600 మంది పర్యాటకులు, పార్కు సిబ్బందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. లా నినా వల్ల వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఆఫ్రికాలోని ఏడు దేశాలను వర్షాలు ముంచెత్తుతున్నాయని అమెరికా వాతావరణ హెచ్చరికల వ్యవస్థ తెలిపింది. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. Heavy rain, floods wreak havoc in South Africa:Torrential rains and severe flooding in northern South Africa have killed at least 19 people since last month, with Limpopo and Mpumalanga provinces hardest hit. pic.twitter.com/9JH0lJpDx5— CGTN Africa (@cgtnafrica) January 17, 2026 -
2026లో యుగాంతం, భయాలు ఇవిగో..
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘2026లో ప్రపంచం అంతం’ అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాబా వంగా 2026లో ప్రపంచం అంతం గురించి చేసిన జోస్యాలు ప్రజల్లో ఆసక్తిని, భయాన్ని పెంచాయి. అలాగే, చర్చలకు కారణమవుతున్నాయి. అయితే, బాబా వంగా జోస్యాలు శాస్త్రీయ ఆధారాలు లేని ఊహాగానాలు మాత్రమేనని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఇవి ప్రజల్లో సాంస్కృతిక, మానసిక ప్రభావం చూపుతున్నాయి కానీ.. వాస్తవంగా 2026లో ప్రపంచం అంతమవుతుందనే ఆధారం లేదని చెబుతున్నారు. ఇంతకీ 2026 గురించి బాబా వంగా ఏం చెప్పారు...?బల్గేరియాకు చెందిన బాబా వంగా గురించి చాలా మంది అనేక సమయాల్లో వినే ఉంటారు. ఆమె చెప్పిన ఎన్నో జోస్యాలు నిజం అయ్యాయి. చిన్న వయస్సులోనే చూపు కోల్పోయిన బాబా వంగా ప్రకృతి విలయాలు, ప్రపంచ యుద్ధాలు, విపత్తుల గురించి జోస్యం చెప్పారు. అందులో చాలా వరకు నిజం అయ్యాయి కూడా. కరోనా మహమ్మారిని కూడా బాబా వంగా ముందే ఊహించారు. ఈ క్రమంలో 2026 ఏడాది గురించి బాబా వంగా పలు సంచలన విషయాలను వెల్లడించారు. 2026లో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆమె 2026 సంవత్సరాన్ని యుద్ధం వినాశన సంవత్సరంగా పేర్కొన్నారు. 2026తో ప్రపంచం అంతం అవుతుందని చెప్పడం టెన్షన్కు గురిచేస్తోంది. న్యూయార్క్ పోస్ట్, ది మిర్రర్, ఎక్స్ప్రెస్ వంటి పత్రికలలో విస్తృతంగా వచ్చిన నివేదికల ప్రకారం.. ఆమె అనుచరులు మరియు వ్యాఖ్యాతలు 2026 సంవత్సరానికి అనేక నాటకీయ సంఘటనలను ఆపాదిస్తున్నారు. దీంతో, ఈ విషయంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.మూడో ప్రపంచ యుద్దం..వీటిలో రష్యా, అమెరికా, చైనా, యూరప్ వంటి దేశాలు మధ్య ప్రపంచ సంఘర్షణలు తీవ్రతరం కావడం.. మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే విధ్వంసకర భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తీవ్రమైన వాతావరణం, వరదలు, తుఫానులతో సహా భారీ ప్రకృతి వైపరీత్యాలు భూమిపై 7–8% భూభాగాన్ని ప్రభావితం చేయడం వంటివి ఉన్నాయి. గ్రహాంతరవాసులతో మొదటి పరిచయం, బహుశా నవంబర్లో భూమి వాతావరణంలోకి ప్రవేశించే భారీ గ్రహాంతర నౌకతో సహా, AI ఆధిపత్యం, ఆర్థిక అస్థిరత.. ఆసియా లేదా చైనా వైపు ప్రపంచ శక్తిలో మార్పు పెరుగుతుందని కూడా అంచనా వేయబడింది.అయితే, ఇది బాబా వంగా మాత్రమే కాదు. పలువురు ప్రముఖులు సైతం ఆసక్తిగా దీనికి ఆజ్యం పోశారు. నోస్ట్రాడమస్ యొక్క క్వాట్రైన్ల వివరణల ప్రకారం "రక్త నదులు", ప్లేగులు, నిరంకుశుల గురించి హెచ్చరిస్తున్నాయి. 2003లో రహస్యంగా అదృశ్యమైన పాకిస్తాన్ ఆధ్యాత్మిక నాయకుడు రియాజ్ అహ్మద్ గోహర్ షాహి.. ఈ సంవత్సరం భూమిని తాకే మండుతున్న తోకచుక్క గురించి మాట్లాడారు. బ్రెజిల్కు చెందిన "లివింగ్ నోస్ట్రాడమస్" అథోస్ సలోమ్ 2024లో ప్రపంచ యుద్ధం, సైబర్ సంఘర్షణ మరియు AI ఆధిపత్యం దగ్గర పడుతున్నాయని అంచనా వేశాడు. మరోవైపు, ఘనా ప్రవక్త ఎబో నోహ్ విపరీతమైన వరదలు వస్తాయన్నారు. దీని కోసం అతను ఘనాలో అనేక చాపలను నిర్మించినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, వీరి వ్యాఖ్యలు నిజమవుతాయా? అనే ప్రశ్నలు ఎదరవుతున్నాయి. ఈ భయం ఎక్కడిది?‘2026 డూమ్స్ డే’ టాక్ మొదటి నుంచీ ఒక్క కారణం మీదే నడుస్తోంది. 1980ల్లో బెంజమిన్ క్రెమ్ అనే వ్యక్తి మైత్రేయ అలియాస్ కొత్త యుగం రాబోతోందని 2025-2026లో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని జోస్యం చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ వ్యవహారం ఆస్టరాయిడ్ వైపు మళ్లింది. మరికొద్ది రోజులకు నోస్ట్రడామస్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంతో జోతిష్యం కూడా తెరపైకి వచ్చింది. పలువురు జోతిష్యులు తమకు నచ్చిన విధంగా ప్రళయం అని ఒకరు అంటే.. ‘2026 మహా ప్రళయం’ అని మరికొందరు చెబుతున్నారు. అయితే, బాబా వంగా యొక్క అసలు "డూమ్స్డే" తేదీ చాలా దూరంలో ఉంది. ఆమె 5079లో ప్రపంచ ముగింపు (లేదా విశ్వ సంఘటన ద్వారా "సంపూర్ణ డూమ్స్డే") గురించి అంచనా వేసింది.ఆస్టరాయిడ్ ఢీకొడుతుందా?ఇంటర్నెట్లో ఎక్కువగా వైరల్ అయ్యే వీడియోల్లో రెండు ఆస్టరాయిడ్స్ గురించి ఎక్కువగా ప్రస్తావన ఉంటుంది. ఒకటి Apophis (99942), రెండు 2024 YR4. Apophis 2029 ఏప్రిల్ 13న భూమికి 31,000 కిలోమీటర్ల దూరంలోకి వస్తుంది. కానీ 2021లోనే నాసా 100% సేఫ్ అని ధృవీకరించింది. 2026లో దాని దూరం లక్షల కిలోమీటర్లు. 2024 YR4 లేదంటే ఇంకా ఏదైనా ఆస్టరాయిడ్ 2026లో ఢీకొనే ఛాన్స్ ఉందా? అంటే లేదనే చెప్పొచ్చు. నాసా, ESA, NEOWISE టెలిస్కోప్లు 99% పెద్ద ఆస్టరాయిడ్స్ ను ట్రాక్ చేస్తున్నాయి. ఏదైనా రిస్క్ ఉంటే ఇప్పటికే పెద్ద హెచ్చరికలు వచ్చేవి.అంతం తప్పదా? గత సంవత్సరాలతో పోల్చితే ఈ ఏడాది కాస్త కష్ట సంవత్సరం కావచ్చు. వాతావరణ మార్పుల విషయం మరింత తీవ్రమవుతుంది. రాజకీయ ఉద్రిక్తతలు ముఖ్యంగా ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ లాంటి ఘటనలు పెరగవచ్చు. AI వల్ల కొత్త రకం ఆర్థిక మాంద్యం రావచ్చు. కానీ, ఇవన్నీ మనం ఇప్పటికే ఎదుర్కొంటున్న సమస్యలే. కొత్తగా ప్రపంచాన్ని నాశనం చేసేవి కావు. చివరిగా.. గతంలో Y2K (2000), మయన్ క్యాలెండర్ (2012), కరోనా ‘ప్రపంచం అంతం’ టాక్ (2020) గురించి విన్నాం. ప్రతిసారీ భయపడ్డాం. కానీ, ఏమీ కాలేదు. 2026 కూడా అలాగే గడిచిపోతుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. -
ఇండోనేషియాలో వరద భీభత్సం.. 16 మంది మృతి..!
ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల్లో ఇప్పటికే దాదాపు 16 మంది మృతి చెందారు. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్లో కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ప్రకృతి విపత్తు వేలాదిమందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇండోనేషియాలో తీవ్రమైన వరదలు విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రకృతి వైపరీత్యానికి సంబంధించిన వివరాలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారీ వెల్లడించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం తెల్లవారుజామున నదుల్లో జలపాతం అకస్మాత్తుగా పెరిగింది. ఈ బలమైన నది ప్రవాహాలకు సియావు టాగులాండాంగ్ బియారో జిల్లాలోని గ్రామాల కొట్టుకుపోయాయి. ఈ వరదలు అనేక గ్రామాలను ముంచెత్తాయి.సులవేసి ద్వీపం నుంచి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియావు ద్వీపంలోని నాలుగు ప్రభావిత గ్రామాలకు పోలీసులు, సైన్యం మద్దతుతో రెస్క్యూ బృందాలను మోహరించారు. అయితే దెబ్బతిన్న రోడ్లు, కమ్యూనికేషన్ అంతరాయం వల్ల రెస్క్యూ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగింది. అధికారుల లెక్కల ప్రకారం ఈ వరదల్లో దాదాపు ఏడు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరో 140 కి పైగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి మరింత దిగజారడంతో ప్రజలను చర్చిలు, ప్రభుత్వ భవనాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సహాయ శిబిరాలకు తరలించారు. -
మునిగిన దుబాయ్.. బయటకు రావొద్దంటూ హెచ్చరిక
-
మొరాకోలో ఆకస్మిక వరదలు.. 37 మంది మృతి
కాసాబ్లాంకా: మొరాకోలోని తీరప్రాంత నగరం సాఫిలో ఆదివారం రాత్రి సంభవించిన భారీ వర్షం, ఆకస్మిక వరదలతో కనీసం 37 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని 70 నివాసాలు, వ్యాపార సంస్థలు నీట మునిగాయి. పది వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. దీంతో, నగర యంత్రాంగం స్కూళ్లకు మూడు రోజులు సెలవు ప్రకటించింది. దేశంలోని టౌటొవాన్, టింఘిర్ తదితర నగరాలు సహా ఇతర ప్రాంతాల్లో సైతం వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా నష్టం సంభవించింది. -
వరదల కారణంగా 1,300 మందికి పైగా మృతి
టాంగ్ టోరు: ఇండోనేషియా, శ్రీలంక, థాయ్లాండ్లలో భారీ వర్షాలతో గత వారం సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 1,300 దాటింది. 800 మందికి పైగా గల్లంతయ్యారు. ఇండోనేషియాలో 712 మంది, శ్రీలంకలో 410 మంది, థాయ్లాండ్లో 181 మంది మరణించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఇండోనేషియాలో.. ఇండోనేషియాలోని సుమత్రా దీవులు తీవ్రంగా నష్టపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. వంతెనలు కూలిపోయాయి. 507 మంది గల్లంతైనట్లు ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తప్పిపోయారు. ఉత్తర సుమత్రాలో వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల లక్షలాది క్యూబిక్ మీటర్ల కలప కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. చెట్లను అక్రమంగా నరికివేయడం విపత్తుకు కారణమై ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదని, మానవ నిర్మిత సంక్షోభమని ఇండోనేషియా పర్యావరణ ఫోరం ఆరోపించింది. తక్షణ పునరుద్ధరణ, కట్టుదిట్టమైన రక్షణ లేకపోతే వరదలు సాధారణమవుతాయని హెచ్చరించింది. ప్రాణ నష్టాన్ని ఇప్పుడే నిర్ణయించలేం: శ్రీలంక అధ్యక్షుడు ఇది దేశాన్ని ముంచెత్తిన అత్యంత దారుణమైన విపత్తని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే అన్నారు. ప్రాణనష్టాన్ని ఇప్పుడే నిర్ణయించలేమన్నారు. మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. వరదల్లో, కొండ చరియలు విరిగి పడటంతో చిక్కుకుపోయినవారిని చేరుకోవడానికి ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు. కొందరు మొత్తం కుటుంబాన్నే కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. థాయ్లాండ్లో పబ్లిక్ కిచెన్లు.. థాయ్లాండ్లో భారీ వరదలు 15 లక్షలకు పైగా ఇళ్లను మంచెత్తాయి. 39 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. వారికి మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. బాధితులకు ఆహారాన్ని అందించడానికి పబ్లిక్ కిచెన్లను ఏర్పాటు చేస్తామని థాయ్లాండ్ ప్రభుత్వం తెలిపింది. మొదటి దశలో రూ.74 లక్షల నష్టపరిహారం 26,000 మందికి పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి సిరిపోంగ్ అంగ్కసకులి్కయాట్ తెలిపారు. -
కొనసాగుతున్న వరద సహాయక చర్యలు..
జకార్తా/న్యూఢిల్లీ: ఇండోనేసియా, థాయ్లాండ్, శ్రీలంకల్లో ఇటీవల సంభవించిన వర్షాలు, వరదలకు సంభవించిన ఘటనల్లో మరణాలు వెయ్యి దాటేశాయి. గల్లంతైన వారి సంఖ్య వందల్లో ఉంది. ఆయా దేశాల్లో వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో కనీసం 708 మంది చనిపోయారని అధ్యక్షుడు ప్రబోవోసుబియాంతో తెలిపారు. వేలాది మంది నిరాశ్రయులుగా మారారని, ఇంకా 504 మంది జాడ తెలియాల్సి ఉందని వెల్లడించారు. గత వారం వరదలు సంభవించిన కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ సహాయక బృందాలు చేరుకునేందుకు వీలు కావడం లేదన్నారు. రోడ్లు, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. తీవ్రంగా దెబ్బతిన్న నార్త్ సుమత్ర, వెస్ట్ సుమత్ర, ఆసెహ్ ప్రావిన్స్లను ఆయన సోమవారం పర్యటించి, బాధితులను పరామర్శించారు. అదేవిధంగా, థాయ్లాండ్లో సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో 181మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1.5 లక్షల కుటుంబాలపై వర్షాల ప్రభావం పడింది. దీంతో, ప్రభుత్వం మొదటి విడతలో తీవ్రంగా నష్టపోయిన 26 వేల మందికి 74 లక్షల డాలర్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు, శ్రీలంకలో దిత్వా తుపాను సంబంధిత ఘటనల్లో 410 మంది చనిపోగా 336 మంది గల్లంతయ్యారని అధికారులు సోమవారం ప్రకటించారు. సుమారు 2.18 లక్షల మందికి ప్రభుత్వం తుఫాను షెల్టర్లలో ఆశ్రయం కలి్పంచింది. తేయాకు తోటలు ఎక్కువగా ఉండే కొండప్రాంతాల్లో నష్టం ఎక్కువగా ఉంది. భారత ప్రధాని మోదీ సోమవారం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకెతో ఫోన్లో మాట్లాడారు. దిత్వా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలకు అవసరమైన సాయం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. భారత ప్రభుత్వం శ్రీలంకకు ఇప్పటికే రెండు విడతలుగా ఆహారం, అత్యవసర వస్తు సామగ్రితోపాటు సిబ్బందిని కూడా పంపించడం తెల్సిందే. -
శ్రీలంకలో తీవ్ర తుఫాను
కొలంబో: శ్రీలంకను శుక్రవారం దిత్వాహ్ తుఫాను అతలాకుతలం చేసింది. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మతాలె, పొలన్నరువా, యువ ప్రావిన్స్లను కలిపే వంతెనలు కొట్టుకుపోవడంతో ఆయా ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కేబుళ్లు తెగిపోవడంతో రెండు పవర్ ప్లాంట్లను మూసివేశారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతింది. రాజధాని కొలంబోతోపాటు అత్యధిక జనాభా కలిగిన గంపాహా జిల్లా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కెలనీ, అట్టనగలు నదులు పొంగిపొర్లాయి. మొత్తం 80 మంది చనిపోగా 34 మంది జాడ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సుమారు 14 వేల మందిని 195 అత్యవసర కేంద్రాలకు తరలించామన్నారు. ‘ఆపరేషన్ సాగర్ బంధు’భారత ప్రభుత్వం శ్రీలంకకు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి ద్వారా మొదటి విడత తుఫాను సాయంగా ఆహార పదార్థాలను పంపించింది. ఇలా ఉండగా, తుఫాను ప్రభావం గత పది రోజుల వ్యవధిలోనే 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గత 24 గంటల వ్యవధిలో కొండప్రాంతాల్లో 50 సెంటీమీటర్ల వాన కురిసిందని వివరించింది. -
థాయ్లాండ్: భారీ వర్షాలకు 145 మంది మృతి
భారీ వర్షాలతో థాయిలాండ్ అతలాకుతలం అవుతోంది. కుంభవృష్టి ధాటికి పెద్ద ఎత్తున వరదలు రావడంతో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.దక్షిణ థాయిలాండ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. 12 దక్షిణ ప్రావిన్సులలో ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో 145 మంది మృతి చెందారు. కేవలం సాంగ్లా ప్రావిన్సులోనే 110 మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. అధిక సంఖ్యలో భవనాలు నీటమునిగాయని.. వరదల దాటికి రోడ్లు కొట్టకుపోయాయని, తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం సంభవించిందని తెలుస్తోంది. అయితే.. ఈ వరదల ప్రభావంతో 32 లక్షల మంది ప్రభావితం అయ్యారని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికీ చాలా ప్రాంతాలు జలమయంలోనే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. భారీ స్థాయిలో కురిసిన వర్షాలకు ప్రజల దైనందిన జీవితం దెబ్బతింది. ప్రస్తుతం నీటిమట్టం తగ్గడంతో విపత్తు నిర్వహాణ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. -
కలత్తూరు బాధితులకు పెద్దిరెడ్డి భరోసా..
-
బద్దలయ్యేందుకు సిద్ధంగా 42 హిమానీ సరస్సులు
కాఠ్మండు: నేపాల్లో అత్యంత ఎత్తయిన పర్వతాల మధ్య ఏర్పడిన హిమానీ సరస్సులు(గ్లేసియర్ లేక్స్) ఇప్పుడు దిగువ ప్రాంతాల ప్రజలపై యమపాశాలుగా మారేందుకు సిద్ధంగా ఉన్నాయన్న వార్త స్థానికులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. నేపాల్లోని శంఖువసభ జిల్లా కేంద్రమైన ఖంద్బారీ పట్టణంలో శనివారం జరిగిన అంతర్జాతీయ సమీకృత పర్వతాభివృద్ధి కేంద్రం(ఐసీఐఎంఓడీ) చర్చా కార్యక్రమంలో విషయ నిపుణుడు శరద్ ప్రసాద్ జోషి ఈ వివరాలను వెల్లడించారు. హిమానీనదం(గ్లేసియర్) నుంచి ప్రవహించే నీటి కారణంగా పర్వత సానువుల వద్ద ఏర్పడే సరస్సును గ్లేసియర్ లేక్ అంటారు. ‘‘ఇలాంటి 42 సరస్సులు భారీ స్థాయిలో నీటితో నిండుకుండలా మారాయి. ఇవి ఏ క్షణంలోనైనా బద్దలై దిగువకు పెద్దమొత్తంలో నీరు దూసుకురానుంది. దిగువ ప్రాంతాల ప్రజల ఇల్లు, వ్యాపారాలు, పంటలు నాశనమవడం ఖాయం. నేపాల్లో 2,069 హిమానీ సరస్సులుండగా ఇప్పుడు కోషి ప్రావిన్స్లోని 42 సరస్సులు అత్యంత ప్రమాదకరంగా పరిణమించాయి’’ అని జోషి హెచ్చరించారు. శంఖువసభ జిల్లా పరిధిలో భోత్ఖోలా, మకాలూ ప్రాంతంలోని సరస్సులు సహా నాలుగు గ్లేసియర్ సరస్సుల్లో నీరు భారీగా చేరిందని ఆయన వెల్లడించారు. మూడు కిలోమీటర్ల పొడవు, 206 మీటర్ల లోతైన తల్లోపోఖారీ సరస్సు అత్యంత ప్రమాదకారిగా మారిందని చెప్పారు. ఐసీఐఎంఓడీ, హైడ్రోలజీ, మీటియోరాలజీ, ఐరాస అభివృద్ధికార్యక్రమం నేపాల్ సంస్థలు కలిసి ఈ ప్రమాదం నుంచి స్థానికులను, వారి ఆస్తులను పరిరక్షించేందుకు సహాయక చర్యలపై దృష్టిసారించాయి. అరుణ్ లోయలో పలు నివాసాలు, మౌలికవసతుల వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదముందని మరో నిపుణురాలు నీరా శ్రేష్ఠ ప్రధాన్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభావిత ప్రాంత ప్రజల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషిచేయనుందని ఆమె తెలిపారు. -
చంద్రబాబు మరో టెండర్.. అమరావతికి వరద తప్పించేలా మరో భారీ ప్రాజెక్ట్
-
వరదనీటి రెస్టారెంట్
సాధారణంగా రెస్టారెంట్లలోకి నీరు చేరితే యజమానులు కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ, థాయ్లాండ్లోని ఈ రెస్టారెంట్ యజమానికి మాత్రం వరద నీరే అదృష్ట దేవతలా మారింది! డైనింగ్ టేబుళ్ల మధ్య చేపలు ఈదుతుంటాయి. కస్టమర్లకు అద్భుతమైన అనుభూతిని అందిస్తున్నాయి. ఈ వింత రెస్టారెంట్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఆహారం ఆస్వాదిస్తూ.. కాళ్ల దగ్గర ఈదే చేపలను చూసేందుకు ఇక్కడ జనం బారులు తీరుతున్నారు. చేపలతో కలిసి విందు! మధ్య థాయ్లాండ్లోని ఒక రెస్టారెంట్లో భోజనం చేయడం అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఆ భోజనానుభవం కోసమే కస్టమర్లు పోటెత్తుతున్నారు. వరద నీటిలో కూర్చున్నాక.. కాళ్ల కింద చేపలు చేసే సందడి చూస్తూ.. సరదా సరదాగా భోజనం చేస్తూ ఆస్వాదిస్తున్నారు. పక్కనే ఉన్న నది ఉప్పొంగి 11 రోజులైనప్పటి నుంచి, వరద ముంపునకు గురైన నదీతీర రెస్టారెంట్ ఇంటర్నెట్లో ఒక సంచలనంగా మారింది. నీటిలో కూర్చుని ఫొటోలు దిగడానికి లేదా చేపలకు మేత వేస్తూ.. ఆ హడావిడిని ఫొటోలు తీయడానికి కస్టమర్లు ఉత్సాహంగా వస్తున్నారు. బ్యాంకాక్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నఖోన్ పాఠోమ్ ప్రావిన్స్లోని పా జిత్ రెస్టారెంట్లో కుటుంబాలు లంచ్ ఆస్వాదిస్తున్నాయి. చుట్టూ చేపలు ఈదుతుంటే చిన్నపిల్లలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వెయిటర్లు చేపల సూప్ లేదా చికెన్ నూడుల్స్ గిన్నెలను నేర్పుతో టేబుల్స్ వద్దకు తీసుకొస్తున్నారు. ఎవరూ రారనుకున్నా.. పా జిత్ రెస్టారెంట్ 30 ఏళ్లకు పైగా నదీతీరంలో స్థిరంగా ఉందని యజమాని పోర్న్కామోల్ ప్రాంగ్ప్రెంప్రీ తెలిపారు. దాదాపు నాలుగేళ్ల క్రితం తొలిసారి రెస్టారెంట్ మునిగినప్పుడు ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘కస్టమర్లు ఎవరూ రారని అనుకున్నాను.. కానీ అప్పుడు ఒక కస్టమర్ వచ్చి, ఇక్కడ చేపలు ఉన్నాయని ఆన్లైన్లో పోస్ట్ చేశారు. అప్పటి నుండి చాలా మంది ఇక్కడ తినడానికి గుమిగూడారు’.. అని ఆమె గుర్తు చేసుకున్నారు. లాభాలే లాభాలు వరదల కారణంగా తన వ్యాపారం పెరిగిందని, రోజుకు దాదాపు 10,000 బాట్ల (భారత కరెన్సీలో సుమారు రూ.23,000) నుండి 20,000 బాట్ల (సుమారు రూ.46,000) వరకు తన లాభం రెట్టింపయ్యిందని ఆమె వివరించారు. పిల్లలు ఇష్టపడే రెస్టారెంట్ అదే ప్రావిన్స్లో నివసించే 29 ఏళ్ల చోంఫునట్ ఖంతనితి.. తన భర్త, కొడుకుతో కలిసి ఇక్కడికి వచ్చారు. ‘ఇక్కడ చాలా బాగుంది. పిల్లలను ఇక్కడికి తీసుకురావచ్చు. చేపలను చూసినప్పుడు వారు అల్లరి చేయడం తగ్గిస్తారు. థాయ్లాండ్లో ఇలా చేపలు పైకి వచ్చేది ఈ ఒక్కచోట మాత్రమేనని అనుకుంటున్నాను’.. అని ఆమె చెప్పారు. 63 ఏళ్ల బెల్లా విండీ.. తన కాళ్లను చేపలు కొరుకుతున్న అనుభూతిని ఆస్వాదించాలని ఈ రెస్టారెంట్కు వచ్చారు. ‘సాధారణంగా, నీరు చాలా ఎక్కువగా ఉంటే చేపలు ఇక్కడికి వస్తాయి. ఇక్కడి ప్రకృతి అనుభవం ఈ రెస్టారెంట్ ముఖ్య ఆకర్షణ, ఇది ప్రజలను ఆకర్షిస్తుంది’.. అన్నారు. ఇతర ప్రాంతాలకు నష్టమే ఈ వరదలు పా జిత్ రెస్టారెంట్కు అసాధారణ అదృష్టాన్ని తెచి్చనప్పటికీ, థాయ్లాండ్లోని అనేక ఇతర ప్రాంతాలను మాత్రం తీవ్రంగా దెబ్బతీశాయి. జూలై చివరి నుండి, వరదల కారణంగా 12 మంది మరణించారని, ఇద్దరు తప్పిపోయారని ప్రకృతి విపత్తుల విపత్తుల నివారణ మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. శుక్రవారం నాటికి, 13 ప్రావిన్స్లలో, ముఖ్యంగా ఉత్తర, మధ్య ప్రాంతాలలో 4,80,000 మందికి పైగా ప్రజలు వరదలతో ప్రభావితమయ్యారని వివరించింది.కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని.. కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోవచ్చని ’పా జిత్’ రెస్టారెంట్ నిరూపించింది. నదీతీరం మునిగిపోయినా, దాన్ని వినూత్న ’డైనింగ్ డెస్టినేషన్’గా మార్చుకుంది. కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అరుదైన అనుభవాన్ని ఆస్వాదించేందుకు థాయ్లాండ్ పౌరులే కాదు, ప్రపంచ పర్యాటకులు కూడా ఇక్కడికి క్యూ కట్టడం ఖాయం! మీకు కూడా ఈ వింత రెస్టారెంట్ గురించి తెలుసుకోవాలనుందా?.. చూడాలనిపిస్తోందా?.. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Tirupati District: భారీ వర్షంతో పొంగిన వాగు విద్యార్థుల అష్టకష్టాలు
-
పాత రికార్డులను తోడేసిన వరద
సాక్షి, హైదరాబాద్: పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో రాష్ట్రంలో ఉన్న జలాశయాలకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వచ్చింది. కృష్ణా పరీవాహక పరిధిలోని శ్రీశైలం, పులిచింతల జలాశయాలతోపాటు గోదావరి పరీవాహక పరిధిలోని సింగూరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల చరిత్రలోనే అత్యధిక వరద ఈ ఏడాదే వచ్చింది. నాగార్జునసాగర్, నిజాంసాగర్, మిడ్మానేరు, లోయర్ మానేరు, కడెం వంటి ఇతర ప్రాజెక్టులకు సైతం రికార్డు స్థాయి వరదలొచ్చాయి. సాగునీటి రంగ పరిభాషలో జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 మధ్య కాలాన్ని నీటి సంవత్సరంగా పరిగణిస్తారు. 2015–16లో కృష్ణా, గోదావరి పరీవాహకంలోని జలాశయాలకు చరిత్రలోనే అత్యల్ప వరదలు రాగా, సరిగ్గా దశాబ్దం తర్వాత ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరదలు రావడం గమనార్హం. శ్రీశైలం జలాశయానికి 2,278.47 టీఎంసీలు ప్రస్తుత నీటి సంవత్సరం (2024–25)లో ఇప్పటి వర కు శ్రీశైలం జలాశయానికి 2,278.47 టీఎంసీల భారీ వరద వచ్చింది. ఈ ప్రాజెక్టుకు అత్యధికంగా 1994– 95లో 2,039.23 టీఎంసీల వరద ప్రవాహం రాగా, ఆ తర్వాత 2022–23లో దానికంటే స్వల్ప అత్యధికతో 2,039.87 టీఎంసీల ప్రవాహం వచ్చింది. శ్రీశై లం జలాశయం నిర్మాణం 1960లో ప్రారంభించగా 1980 జూలై 26న నిర్మాణం పూర్తయ్యింది. 1984–85 నుంచి జలాశయంలో పూర్తిస్థాయి నిల్వలను కొనసాగిస్తున్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. సాగర్కూ నాలుగో అత్యధిక వరద ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటివరకు సాగర్కు 1,766.24 టీఎంసీల వరద వచ్చింది. సాగర్ చరిత్రలోనే ఇది నాలుగో అత్యధిక వరద. 1955లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై 1967లో పూర్తయిన సాగర్కు 1975–76లో అత్యధికంగా 2,639.9 టీఎంసీల వరద వచ్చింది. ఆ తర్వాతి కాలంలో కృష్ణానదిపై ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం వంటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. దీంతో సాగర్కు వరద ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. 1978–79లో 1,966.75 టీఎంసీలు, 1994–95లో 1,885.64 టీఎంసీల అత్యధిక వరదలు వచ్చాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత గడిచిన 40 ఏళ్లలో సాగర్కు అత్యధిక వరద ఈ ఏడాదే వచ్చింది. పులిచింతల జలాశయానికి... సాగర్ దిగువన ఉన్న పులిచింతల జలాశయ చరిత్రలో అత్యధిక వరద ఈ ఏడాదే వచ్చింది. ఈ ఏడాది 1,477.1 టీఎంసీల వరద రాగా, అంతకు ముందు 2022–23లో అత్యధికంగా 1,285.86 టీఎంసీల వరద వచ్చింది. » ఈ ఏడాది కృష్ణానదికి నిరంతరంగా భారీ వరదలు కొనసాగడంతో ప్రకాశం బరాజ్ నుంచి రికార్డు స్థాయిలో 1,628 టీఎంసీల కృష్ణా జలాలను సముద్రంలో విడుదల చేశారు. 1990–91 తర్వాత ప్రకాశం బరాజ్ నుంచి సముద్రంలోకి విడుదల చేసిన అత్యధిక వరద ఇదే కావడం గమనార్హం. ఇంతకు ముందు 2022–23లో అత్యధికంగా 1,331. 55 టీఎంసీలను సముద్రంలోకి వదిలారు. గోదావరిలోనూ .... గోదావరి పరీవాహకంలోని సింగూరు జలాశయానికి 1998–99లో అత్యధికంగా 176.56 టీఎంసీల వరద ప్రవాహం రాగా, ఈ ఏడాది చరిత్రలోనే అత్యధికంగా 230.49 టీఎంసీల వరద వచ్చింది. » నిజాంసాగర్ ప్రాజెక్టుకు 1983–84లో అత్యధికంగా 328.93 టీఎంసీల వరద వచ్చింది. ఈ ఏడాది నిజాంసాగర్కు 306.83 టీఎంసీల రెండో అత్యధిక వరద వచ్చింది. » శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అత్యధికంగా 1983–84లో 1,168.57 టీఎంసీల వరద రాగా, 1988–89లో 928.18 టీఎంసీల రెండో అత్యధిక వరద వచ్చింది. ఈ ఏడాది జలాశయానికి 927.40 టీఎంసీల మూడో అత్యధిక వరద రావడం గమనార్హం. » శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 1,444.22 టీఎంసీల వరద ఈ ఏడాదే వచ్చింది. 2022–2023లో జలాశయానికి అత్యధికంగా 1,235.76 టీఎంసీల వరద రాగా, 2021–22లో 1077.23 టీఎంసీల ప్రవాహం వచ్చింది. 2015–16లో పూర్తయిన ఈ ప్రాజెక్టు చరిత్రలో ఏడాదికి 1,000 టీఎంసీలకు పైగా వరద మూడు పర్యాయాలు మాత్రమే వచ్చింది. » ధవళేశ్వరం బరాజ్ నుంచి ఈ ఏడాది 4,428 టీఎంసీల గోదావరి జలాలను సముద్రంలోకి వదిలారు.


