విశాఖపట్నం: నూతన సంవత్సరం రోజున విశాఖ నగరంలో విషాదం నెలకొంది. ఒక ఆయిల్ ట్యాంకర్ నలుగురు విద్యార్థినులపై దూసుకెళ్లింది. ఒక విద్యార్థిని మృతి చెందింది. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కొమ్మాది జాతీయ రహదారిపై వాంబేకాలనీ వద్ద ఈ దుర్ఘటన జరిగింది.
నూతన సంవత్సరం రోజున స్నేహితురాలికి శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఆమె ఇంటికి నలుగురు విద్యార్థినులు వెళ్లారు. వారు తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మౌనిక ఆనే విద్యార్థిని మృతి చెందగా, త్రివేణి అనే విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి.
విద్యార్థినులపై దూసుకెళ్లిన ఆయిల్ ట్యాంకర్
Published Wed, Jan 1 2014 6:26 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement