తిరుపతి మహిళా వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య | student suicide in tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతి మహిళా వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య

Published Thu, Jan 22 2015 1:22 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

student suicide in tirupati

తిరుపతి : తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీకి సమీపంలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు జిల్లా రాపూరుకు చెందిన వైష్ణవి తిరుపతి పద్మావతీ మహిళా యూనివర్శిటీలో ఎం.కాం ఫైనల్ ఇయర్ చదువుతోంది. 

 

కాగా ఆమె కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండేదని హాస్టల్ లోని ఆమె స్నేహితులు,సిబ్బంది తెలిపారు. రెండు రోజుల క్రితమే ఆమె తన సొంత ఊరికి వెళ్ళి  తిరిగి వచ్చింది. అప్పటి నుంచి వైష్ణవి కాలేజీకి కూడా సరిగ్గా వెళ్ళేది కాదని  తోటి విద్యార్థినులు తెలిపారు.  ఎస్వీ యూనివర్శిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement