న్యూఢిల్లీ: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ గ్రామపంచాయతీలకు శుక్రవారమిక్కడ అవార్డుల్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పరిషత్, కోటబొమ్మాళి మండల పరిషత్ (శ్రీకాకుళం జిల్లా), తవనంపల్లి మండల పరిషత్ (చిత్తూరు), ఎర్రగొండపాలెం మండల పరిషత్ (ప్రకాశం జిల్లా), దువ్వూరు మండల పరిషత్ (వైఎస్సార్ కడప జిల్లా), పోట్లదుర్తి గ్రామపంచాయతీ (వైఎస్సార్ కడప జిల్లా), నందిగామ గ్రామపంచాయతీ (గుంటూరు జిల్లా), దర్శి గ్రామపంచాయతీ (ప్రకాశం), మాకవారిపాలెం గ్రామపంచాయతీ (విశాఖపట్నం), కరవేటినగర్ గ్రామపంచాయతీ (చిత్తూరు), అటపాక గ్రామపంచాయతీ (కృష్ణా జిల్లా)లకు, తెలంగాణలోని హాజిపల్లి, కిసన్నగర్ (మహబూబ్నగర్ జిల్లా), ధరూర్, చందుర్తి, ధర్మారం (కరీంనగర్ జిల్లా) గ్రామపంచాయతీలకు ‘ఉత్తమ గ్రామపంచాయతీ సశక్తీకరణ్’ పురస్కారాల్ని కేంద్ర మంత్రి అందజేశారు.
సర్పంచ్లకు జాతీయ పురస్కారాలు
Published Sat, Apr 25 2015 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM
Advertisement
Advertisement