తిరుమలః తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. కాలినడకన వచ్చే భక్తులకు,. ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. ఆదివారం శ్రీనివాసుని 87,891 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,001 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.20 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.