తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తగ్గింది.
తిరుమల : తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తగ్గింది. సాయంత్రం 6 గంటల వరకు 49,651 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 4 గంటలు, కాలిబాట భక్తులకు 2 గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. గదులు సులభంగా లభించాయి. హుండీ కానుకలు రూ.2.91 కోట్లు లభించాయి.